ICMR
-
ఫలితాలకు షార్ట్కట్స్ ఉండవు!
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...‘మా వర్క్లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.మందుల పనితీరుపై పరిశోధనలుకార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్డి స్టూడెంట్స్తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం. పాతికేళ్ల ప్రయాణంఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను. ప్రతి నిమిషమూ విలువైనదేఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కు బ్లడ్ లెవల్స్లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి. క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి. – డాక్టర్ పింగళి ఉషారాణి – నిర్మలారెడ్డి -
శాకాహారానికే జై!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 2021లో చేసిన అధ్యయనం ప్రకారం భారత్లో లక్షలాది మంది శాకాహారులు ఉన్నారని అంచనా. అయితే ఏటా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వీగన్ డైట్ గురించి గూగుల్ ట్రెండ్లు, ఆన్లైన్ శోధన డేటాను బట్టి చూస్తే గత దశాబ్ద కాలంలో దేశంలో శాకాహారంపై ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. సాక్షి, హైదరాబాద్: భారత్లో ఇటీవలి కాలంలో ఆహార అలవాట్లు, ప్రాధాన్యాల్లో స్పష్టమైన మార్పులు కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాకాహారంవైపు మొగ్గు విషయంలో వస్తున్న మార్పులు, ట్రెండ్లను ‘వీగనిజమ్’ను దేశ ప్రజలు వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు వెజిటేరియన్ ఫుడ్ను ప్రముఖుల జీవనశైలి అలవాటుగా పరిగణించేవారు. కానీ ఈ ఆహారపు అలవాటు విషయంలో క్రమంగా సాంస్కృతికంగా మార్పులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా అంశాల ప్రాతిపదికన చూస్తే వెజిటేరియనిజమ్ వైపు మొగ్గు పెరుగుతున్నట్టుగా పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇండియాలో వీగనిజమ్ అనే కొత్త ఉద్యమం ప్రారంభమైనట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనే భారత్ను ‘ప్రపంచ శాకాహార రాజధాని’గా ఇతర దేశాలకు చెందిన వారు కీర్తించినా.. పలు ప్రభుత్వ సర్వేలు, అధ్యయనాల ప్రకారం చూస్తే 23 నుంచి 37 శాతం మంది దాకా వెజిటేరియన్లు ఉన్నారనే ప్రచారం జరిగింది. కొంత కాలం కిందట అమెరికాకు చెందిన బాలమురళి నటరాజ్, ఇండియాకు చెందిన సూరజ్ జాకబ్ నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 20 శాతం దాకా ఉండొచ్చునని అంచనా వేశారు. హైదరాబాద్ మొదలుకుని ముంబై, బెంగళూరు, పుణే, గోవా వంటి చోట్ల పూర్తిస్థాయి శాకాహార రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో కూడా శాకాహార ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో ప్రజలు వెజిటేరియన్ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం అవుతోందంటున్నారు. తాజా సర్వేలు, పరిశీలనలను బట్టి చూస్తే.. » రాజస్తాన్లో అత్యధికంగా శాకాహారం తీసుకునే ప్రజలున్నారు. ముఖ్యంగా జైపూర్, ఉదయ్పూర్ వంటి పట్టణ ప్రాంతాల్లో వీరు అధికం. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమంటున్నారు. » గుజరాత్లో అత్యధిక శాతం వెజిటేరియన్లు ఉన్నారు. ముఖ్యంగా జైనుల్లో మతపరమైన విశ్వాసాలు, శాకాహార జీవనశైలి కారణమని అంచనా. » మహారాష్ట్రలో గణనీయమైన సంఖ్యలో శాకాహారుల జనాభా ఉంది. ముంబై, పుణే వంటి నగరాల్లో వీరి సంఖ్య అధికం. ఇక్కడి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఒకేవిధమైన ఆహార పద్ధతులు పాటిస్తున్నారు. » హరియాణాలో కూడా తగినంత సంఖ్యలో వెజిటేరియన్లు ఉన్నారు. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది శాకాహారులే. ఈ రాష్ట్రంలోని గ్రామీణ వ్యవసాయ జీవనశైలి దీనికి కారణం. » పంజాబ్ ప్రత్యేకమైన శాకాహార వంటలకు ప్రసిద్ధి. దా ల్, రోటీ, సబ్జీ వంటివి విరివిగా లభిస్తాయి. ఇక్కడ సిక్కుల జనాభా అధికంగా ఉండటం కూడా ఓ కారణం. » బిహార్లోనూ హిందూయిజం, జైనిజంల విధానాలు, పద్ధతుల పాటింపు. పట్టణాలు, గ్రామాల్లో రోజువారీ ఆహారంలో అధికశాతం శాకాహారమే. » యూపీలో పెద్దసంఖ్యలో శాకాహారులున్నారు. రాష్ట్ర సంస్కృతి, ఆచారాల్లో శాకాహారం అనేది అంతర్భాగంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు వెజిటేరియన్లుగా ఉన్నారు.భారత్లో శాకాహారం వైపు మొగ్గు ఎందుకంటే? » ఎక్కువ మంది ప్రజల్లో మొక్కల ఆధారిత, ఆకుపచ్చ కూరలతో కూడిన ఆహార అలవాట్ల వల్ల ఆరోగ్యపర ప్రయోజనాల పట్ల అవగాహన పెరుగుదల. » జంతువుల సంక్షేమంపై దృష్టి పెరగడంతో పాటు వాటికి హాని చేకూర్చకూడదనే విలువల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగడం. » క్రికెటర్ విరాట్ కోహ్లి, భారత అత్యుత్తమ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి, సినీతారలు అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్, షాహిద్కపూర్, అనుష్క శర్మ, ఆలియా భట్, మలైకా అరోరా, భూమి ఫడ్నేకర్ వంటి సెలబ్రిటీలు వెజిటేరియన్లుగా మారిన ప్రభావం వారి అభిమానులపై బాగానే పడినట్టు వెల్లడైంది. » ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ద గేమ్ చేంజర్స్’వంటి డాక్యుమెంటరీలు శాకాహారంపై అవగాహన, చైతన్యం పెరిగేందుకు దోహదపడ్డాయి. » సూపర్మార్కెట్లు, రెస్టారెంట్లతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పైనా వెజిటేరియన్ ఉత్పత్తులు విరివిగా అందుబాటులోకి రావడం కూడా కారణం. » భారత్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అనేక రెట్లు పెరిగి 2022లో 1.3 బిలియన్ల మార్కెట్ వాల్యూను చేరుకుంది. » 2010 నుంచి చూసినట్లయితే ఇండియాలో ‘వీగన్ డైట్’పై ఆన్లైన్ సెర్చ్ డేటా రెండింతలు పెరుగుదల. » యూ గవ్ సర్వే ప్రకారం శాకాహార డైట్వైపు మొగ్గు చూపేందుకు 59 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వెల్లడి. » వివిధ ఆహార ఉత్పత్తుల్లో జంతువుల నుంచి సేకరించిన దినుసులు లేవని తాము సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తున్నామని పలు సంస్థలు తమ ఫుడ్ లేబుళ్లపై స్పష్టం చేస్తున్నాయి. -
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
అతి వినియోగం అనర్థమే
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 20 శాతం తక్కువ ప్రభావంవిశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. ఏటా 10 లక్షల మంది మృతి యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.- సాక్షి, అమరావతి -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
టెకీలూ.. కాస్త విశ్రమించండి
సాక్షి, అమరావతి: జీవితంలో త్వరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అని చాలామంది అనుకుంటారు. మంచి వేతనం.. వారాంతపు సెలవులు వంటి వెసులుబాట్లు సౌకర్యాలెన్నో వారికి ఉంటాయని చెబుతారు. టెకీల జీవితంలో ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పరిశీలిస్తే వారిని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి వల్ల తరచూ వెన్నునొప్పి వంటి సమస్యలతో టెకీలు ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రిక జీవన శైలితో 25 నుంచి 40 ఏళ్లలోపే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేమి వంటి కారణాలతో 40 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సూచీలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. 43% మందిలో ఆరోగ్య సమస్యలే దేశంలో 43 శాతం మంది టెకీలు పని నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (కేసీసీఐ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. టెకీల్లో సగానికిపైగా వారానికి సగటున 52.50 గంటలు పని చేస్తున్నారు. అస్థిరమైన పని షెడ్యూళ్లతో 26 శాతం మంది నిద్ర లేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 51 శాతం మంది రోజుకు సగటున ఐదున్నర గంటల నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఎక్కువ మందిలో వెన్నునొప్పి ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మందిలో మెడ, వెన్నునొప్పి సాధారణంగా ఉంటోంది. ఈ సమస్యలతో తమ దగ్గరకు వచ్చే యువతలో అత్యధికులు టెకీలే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. టెకీలు గంటల తరబడి కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తుంటారు. మెడ ఎముక, భుజం ఎముక వెన్నెముకతో అనుసంధానమై ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల మెడ, వెన్నెముకలో ఒకచోట అమరిక అస్తవ్యస్తమై ఇతర భాగా లపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కూర్చోవడంతో పాటు, నిలబడినప్పుడు భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు. నిల్చున్నప్పుడు తల, భుజాల వెనుక భాగం, పిక్కలు గోడకు తాకి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫోన్, ల్యాప్ట్యాప్ చూసేప్పుడు సహజంగానే మెడ ముందుకు వాల్చకుండా ఉండాలి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్ చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడపడం, ఇష్టమైన సంగీతం వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటున్నారు. యాంత్రిక జీవన శైలితో ఇబ్బందులు పడుతున్న టెకీల వయసు 25 - 40సగానికి పైగా టెకీలు వారానికి (5 రోజులు) సగటున పనిచేస్తున్న గంటలు 52.50అస్థిరమైన పని షెడ్యూళ్లతో నిద్రలేమిని ఎదుర్కొంటున్నవారు (శాతంలో) 26రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్న టెకీలు (శాతంలో) 51ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే.. పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. ఆ సూచనలు ఇవీ..» ఎంత బిజీగా ఉన్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. » ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి. » ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్కు బదులు మెట్లను వినియోగించాలి. » టీవీ చూస్తున్నప్పుడు కుర్చికే పరిమితం కాకూడదు. కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి. » రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి. » రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్లో డబ్ల్యూహెచ్వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచిస్తోంది. -
కొవాగ్జిన్ పేటెంట్కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్లో ఐసీఎంఆర్ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్ను అభివృద్ధి చేశాయి. -
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తునన్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!ఓపెన్ మూత వర్సెస్ క్లోజ్డ్ వంట:మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్ కుక్కర్లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్ పేర్కొంది. మైక్రోవేవ్లో వంట మంచిదేనా..ఇక్కడ మైక్రోవేవ్ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో పేర్కొంది.(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..! ఇంటర్ ఫెయిల్ అవ్వడమే..!) -
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్రైస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!) -
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల చాలామంది నాన్స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్ ఫ్రైలు చేస్తే ఆయిల్ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.ఎందుకు మంచిది కాదంటే..నాన్స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత (కోటింగ్)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్స్టిక్ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది. వచ్చే అనారోగ్య సమస్యలు..హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?) -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్ను చదవాలి. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కేవలం వెబ్సైట్కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
గుండెపోటు ముప్పు పెంచిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 31.6% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కోవిడ్తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు. సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి. 48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. డ్రగ్స్తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు తగ్గాయి... కోవిడ్ వ్యాక్సిన్ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆకస్మిక మరణాలపై అధ్యయనం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్బీబీ.1.16 వేరియంట్పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్డ్రిల్తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
రెండు సెకన్లకో దాడి.. అరగంటకో మరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. 100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య. 70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ 2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు. ఏటా సుమారు 20 వేల మంది మృతి ♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కోటిన్నర వీధికుక్కలు... ♦ భారత్లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట... దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. 3 రకాల శునకాలు.. ♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి. కుక్కల నియంత్రణ ఇలా... ♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు. ♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ, ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి. -
హెచ్3ఎన్2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్3ఎన్2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 అనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సీజన్ మారడం వల్లే.. హెచ్3ఎన్2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్లోని వీఆర్డీఎల్ ల్యాబ్లో హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏటా సీజన్ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. ► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్ ధరించాలి. ► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ► షేక్హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. కంగారు పడవద్దు.. వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్ఐవీ బాధితులు మాస్క్ ధరించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్ బిళ్లలు వేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒసెల్టామివిర్ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. – డాక్టర్ ఎస్.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు -
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం మారడంతో.. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది. పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి.. 2009లో హైదరాబాద్లో తొలిసారిగా స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది. జనసమూహాలతో వ్యాపిస్తూ.. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది. ఆందోళన అక్కర్లేదు వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ వాడొద్దు!
కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ► ఈ వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం. ► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. ► ఐసీఎంఆర్తో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఆర్) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. ► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది. ► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. ► కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ విషయంలో.. Influenza A subtype H3N2 is the major cause of current respiratory illness. ICMR-DHR established pan respiratory virus surveillance across 30 VRDLs. Surveillance dashboard is accessible at https://t.co/Rx3eKefgFf@mansukhmandviya @DrBharatippawar @MoHFW_INDIA @DeptHealthRes pic.twitter.com/3ciCgsxFh0 — ICMR (@ICMRDELHI) March 3, 2023 Fever cases on rise - Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho — Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023 -
మెడ్టెక్ జోన్లో కృత్రిమ అవయవాల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెడ్టెక్ జోన్లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్ గ్లూకోజ్ మోనిటరింగ్ సిస్టమ్(బీజీఎంఎస్) పరికరాల్ని మెడ్టెక్జోన్లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.రాజీవ్భాల్, ఏఎంటీజెడ్ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్ స్ట్రిప్స్ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్ ఎండీ అభినవ్ ఠాకూర్ తెలిపారు. -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్లో ఈ వివరాలు పొందుపరిచింది. 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రాలవారీగా ఐసీఎంఆర్ వెల్లడించిన క్యాన్సర్ కేసులు, మరణాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయా లోక్సభలో వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. అత్యల్పంగా లక్షద్వీప్లో 28 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. క్యాన్సర్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికత్సకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చింది. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దీనివల్ల క్యాన్సర్ బాధితులు వ్యయప్రయాసలకోర్చి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇందులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం ఉన్న ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స సదుపాయాల మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.119.58 కోట్లు కేటాయించింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి క్యాన్సర్ను చేర్చింది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడుతోంది. -
2025 నాటికి టీబీ సమూల నిర్మూలన: మైల్యాబ్ కీలక ఆవిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలోఉన్న మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్.. క్షయ వ్యాధిని గుర్తించేందుకు పాథోడిటెక్ట్ పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్ను రూపొందించింది. క్షయ చికిత్సలో వాడే రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్ ఔషధాలు రోగిపై ఏ మేరకు పనిచేస్తాయో కూడా ఒకే పరీక్షలో తెలుసుకోవచ్చు. ఈ కిట్కు సీడీఎస్సీవో, టీబీ ఎక్స్పర్ట్ కమిటీ, ఐసీఎంఆర్ ఆమోదం ఉందని కంపెనీ తెలిపింది. క్షయవ్యాధికి సంబంధించి ఒకే పరీక్షలో రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్లకు బహుళ ఔషధ నిరోధకతనుగుర్తించే మేడ్ ఇన్ ఇండియా టీబీ డిటెక్షన్ కిట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ కిట్కు అనుమతినిచ్చినట్టు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో TB నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాలంలో రెండు సమస్యల్ని పరిష్కరిస్తున్నామని మైల్యాబ్ ఎండీ హస్ముఖ్ రావల్ తెలిపారు.దేశంలో 2025 నాటికి టీబీనీ సమూలంగా నిర్మూలించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్సైట్పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్లిస్ట్లో ఉన్న హాంకాంగ్కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
తల్లిపాలలోనూ ప్లాస్టిక్!
సాక్షి, హైదరాబాద్: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు. రకరకాలుగా కలుషితం ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిందే.. భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఐసీఎంఆర్ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి తల్లిపాలలో ప్లాస్టిక్తోపాటు లెడ్ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో ఉండే ఆహారం తీసుకోవద్దు. – డాక్టర్ బబిత మాటూరి, సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమాదం ఎంత వరకు? తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. -
ఐసీఎంఆర్ చీఫ్గా డా. రాజీవ్ బహల్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్గా డా. రాజీవ్ బహల్ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీఎంఆర్ చీఫ్తో పాటు ఆరోగ్యశాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్లో జెనీవాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!) -
మధుమేహ (షుగర్) బాధితులకు తీపి కబురు!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ (షుగర్) బాధితులకు తీపి కబురు! ఒకసారి టైప్–2 డయాబెటిస్ బారినపడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న భావన నిజం కాదని.. మధుమేహం నుంచి పూర్తిగా బయటపడొచ్చని భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్)– ఇండియా డయాబెటిస్ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మధుమేహం బారిన పడబోయే దశ (ప్రీ డయాబెటిక్)లో ఉన్న వారు సైతం షుగర్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చని వివరించింది. ఈ మేరకు ‘డయాబెటిస్ కేర్’ జర్నల్లో పత్రం ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా 18,090 మంది పెద్దల ఆహారపు అలవాట్లకు సంబంధించిన డైట్ చార్ట్ను ఐసీఎంఆర్ రూపొందించింది. దాని ద్వారా డయాబెటిస్ను రివర్స్ చేయవచ్చని నిర్ధారణ అయింది. 2045 నాటికి 13.5 కోట్ల మందికి.. దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం 7.40 కోట్ల మంది షుగర్ బాధితులు ఉండగా మరో 8 కోట్ల మంది ప్రీడయాబెటిక్ దశలో ఉన్నట్లు పేర్కొంది. 2045 నాటికి దేశంలో 13.50 కోట్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని ఐసీఎంఆర్ అంచనా వేసింది. కార్బోహైడ్రేట్ల వినియోగం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమంది. ఈ 7 అలవాట్లతో షుగర్కు చెక్... ►ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలు, ఫైబర్, ప్రొటీన్, మంచి ఫ్యాట్లను ఒక నిర్ణీత కాలం వరకు తీసుకోవాలి. అలాగే ఆహార పరిమాణాన్ని తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు, స్వీట్స్ మానేయాలి. గుడ్ ఫ్యాట్స్, గోధుమతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాలి. చికెన్, ఫిష్, ఎగ్ వంటివి తీసుకోవాలి. ►నిత్యం 45 నిమిషాలపాటు వాకింగ్ తప్పనిసరి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. ►రాత్రిపూట కనీసం 6–7 గంటలపాటు నిద్ర పోవాలి. ►రోజూ శరీర బరువును బట్టి 3–3.5 లీటర్ల నీరు తాగాలి. (కిడ్నీ సమస్యలున్నవారు మినహాయింపు). ►స్మోకింగ్ను తప్పనిసరిగా ఆపేయాలి. సిగరెట్లోని నికోటిన్ అనేది షుగర్ను పెంచుతుంది. ►విటమిన్ డీ తక్కువైనా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. విటమిన్ డీ వాడటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు. కార్బ్స్ తగ్గిస్తే.. సాధారణంగా భారతీయులు తీసుకొనే ఆహారంలోని క్యాలరీలలో 60 నుంచి 75 శాతం వరకు కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటోందని... 10 శాతం మాత్రమే ప్రొటీన్లను కలిగి ఉంటోందని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్ల మధుమేహం నుంచి పూర్తిగా బయటపడాలంటే కార్బోహైడ్రేట్లను 55 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది. అలాగే ప్రొటీన్లను 20 శాతానికి పెంచుకోవాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. అదే ఫలితాలను సాధించడానికి మహిళలు తమ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని పురుషుల కంటే 2 శాతం ఎక్కువగా తగ్గించుకోవాలని సూచించింది. వృద్ధులు ఒక శాతం ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. ప్రోటీన్ల వినియోగాన్ని యువకులు ఒక శాతం ఎక్కువగా పెంచుకోవాలని స్పష్టం చేసింది. ప్రీ–డయాబెటిస్ దశ నుంచి ఉపశమనం కోసం ఆహారంలో 50 నుంచి 56 శాతం కార్బోహైడ్రేట్లు, 18 నుంచి 20 శాతం ప్రొటీన్లు, 21 నుంచి 27 శాతం మంచి కొవ్వు, 3 నుంచి 5 శాతం డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. – డాక్టర్ సాయి ప్రత్యూష, ఎంబీబీఎస్, ఎంఎస్ లైఫ్స్టైల్ మెడిసిన్ (యూఎస్), ఆస్పిన్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ -
మంకీపాక్స్తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ఫోర్స్ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ భేటీలోనే మంకీపాక్స్పై టాస్క్ఫోర్స్ను నియమించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనికి నేతృత్వం వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధి.. 16వేల మందికి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్ఐఆర్టీ డైరెక్టర్ పద్మా ప్రియదర్శిని చెప్పారు. అయితే, చికిత్స పూర్తి చేసుకున్న బాధితుల ఆయుర్దాయం రేటు ఆందోళనకరంగానే ఉంటోందని అన్నారు. మిగతా వారితో పోలిస్తే టీబీ వ్యాధి బాధితుల్లో అకాల మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాతి సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. బాధితుల్లో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణయిందన్నారు. -
Warning: తెలంగాణలో జికా వైరస్ కలకలం
దేశంలో కరోనా వైరస్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్ టెన్షన్కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఐసీఎంఆర్, నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్ శమ్మన్నా స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. #ZikaVirus has spread to various Indian cities including #Hyderabad. It was disclosed by a study conducted by #ICMR and NIV, #Pune. #News #NewsAlert #NewsUpdate #India #Update #Healthcare pic.twitter.com/rDp9D2i6K1 — First India (@thefirstindia) July 6, 2022 ఇది కూడా చదవండి: అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు -
కరోనా ఫోర్త్ వేవ్పై వార్తలు.. స్పందించిన ఐసీఎంఆర్ ఏడీజీ సమీరన్
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ముప్పు రానుందన్న వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా శుక్రవారం అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడాన్ని దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. దేశంలో కనిపించే రూపాంతరం చెందిన ప్రతీ వైరస్ ఆందోళన కలిగించేది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. మాక్స్ హెల్త్కేర్లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ.. కోవిడ్ ఫోర్త్ వేవ్ని భారత్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాదాపు లేదని తెలిపారు. భారత్లో కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్ మునుపటిలా ప్రమాదకరంగా మారి వ్యాప్తి జరిగే అవకాశం లేదని అన్నారు. మరో వైపు దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. ప్రజలు కోవిడ్-19 ప్రోటోకాల్కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని ఐదు రాష్ట్రాలు.. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులను భూషణ్ తన లేఖలో కోరారు. చదవండి: చెత్తగా తీసిన సినిమా అది.. బాలేదంతే! -
కరోనా వైరస్: ఐసీఎంఆర్ కీలక ప్రకటన
Corona Virus Update: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రభావం మాత్రం కొనసాగుతోంది. గత 25 రోజులుగా వరుసగా లక్షకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,396 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 77, 152 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 142 మంది చనిపోగా.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కరోనాతో 5, 14, 388 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. 2022లో సంభవించిన కరోనా మరణాల్లో బాధితులు చాలామట్టుకు వ్యాక్సిన్కు దూరంగా ఉన్నవాళ్లే(vaccination)నని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. తద్వారా కరోనా మరణాల కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరిస్తోందని, కాబట్టి, అంతా వ్యాక్సిన్ డోసులు వేయించుకోవాలని, నిర్క్క్ష్యం పనికిరాదని చెప్తున్నారు. ఇక గురువారం నాటికి దేశవ్యాప్తంగా 178.26 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. -
ఒమిక్రాన్ రోగనిరోధక శక్తి డెల్టానూ ఎదుర్కొంటోంది
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియెంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్య యనం పేర్కొన్నది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్య యనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు మా ముందుంచండి
సాక్షి, అమరావతి: వేగంగా వ్యాప్తిచెందుతున్న కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్పై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శ కాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. కోవిడ్ వల్ల మరణించినవారి కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున, తా ము జోక్యం చేసుకోబోమని చెప్పింది. మాస్క్లు ధరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్క్ విషయంలో ఉల్లంఘనలు ఎన్ని? ఎంతమేర జరిమానాలు వసూలు చేశారు? తదితర వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. ఐసీఎంఆర్ వివరాలను పరిశీలించిన తర్వాత కోవిడ్ విషయంలో తగిన ఆదేశాలు జారీచేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ), సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఒమిక్రాన్ ఉధృతి ఎక్కువగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించడంలేదన్నారు. 39 వేల పరీక్షలు నిర్వహిస్తే, అందులో 14 వేలు పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మూడో దశలో ప్రజలే పరీక్షలు చేయించుకోవడం లేదని చెప్పింది. ఐసీఎంఆర్ సైతం పరీక్షలు వద్దని, లక్షణాలు ఉంటేనే చేయించుకోవాలని చెప్పిందని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపిందని, వాటి ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు తగ్గాయన్నారు. ప్రజలు ఇంటి వద్దే పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. «ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. -
కోవిడ్ టీకా వేసుకోలేదా? జర జాగ్రత్త! 95 శాతం మరణాలు వారివే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వచ్చిన వారిలో టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారు కరోనా బారిన పడుతున్నప్పటికీ ప్రమాదకర పరిస్థితులు లేవు. ఇక టీకా తీసుకోని వారు మాత్రం కరోనా బారిన పడితే వారి ఆరోగ్యస్థితి సంకటంలో పడినట్లేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) స్పష్టం చేస్తోంది. దేశంలో గత ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు చోటుచేసుకున్న కరోనా మరణాలపై ఐసీఎంఆర్ విశ్లేషణ జరిపింది. ఇందులో సగటున 95 శాతానికిపైగా వ్యాక్సిన్ తీసుకోని వారుగా తేలింది. గత ఏప్రిల్ నుంచి దేశంలో నమోదవుతున్న కోవిడ్–19 మరణాలను నమోదుచేస్తున్న ఐసీఎంఆర్.. వారానికోసారి ఈ గణాంకాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తోంది. గత ఏడాది చివరి వారమైన డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు దేశవ్యాప్తంగా 2,088 మంది మరణించగా, వీరిలో 2,082 మంది (99.70%) టీకా తీసుకోని వారే ఉన్నారు. కేవలం ఆరుగురే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 60 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కావడం గమనార్హం. ఐదు లక్షలకు చేరువలో... దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3.7 లక్షల మంది రికవరీ కాగా, మరో 23 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,89,848 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అంటే వైరస్ సోకిన వారిలో సగటున 1.24 శాతం మంది మరణించారు. మొదటివేవ్తోపాటు రెండోవేవ్లో అర్ధభాగం వరకు జరిగిన మరణాల్లో అన్ని వయసుల వారుండగా... వ్యాక్సినేషన్ మొదలయ్యాక మాత్రం మరణాల సంఖ్య తగ్గింది. టీకాతో 88 రెట్లు సురక్షితం ♦2021లో చివరి నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా 9,226 మంది కరోనాతో మరణించారు. వీరిలో టీకా వేసుకున్న వారు 24 మంది మాత్రమే. ♦దేశంలో కోవిడ్తో అత్యధిక మరణాలు గత మే నెల రెండో వారంలో జరిగాయి. వారం రోజుల వ్యవధిలో 26,820 మంది మరణించారు. ఇందులో టీకా తీసుకోని వారు 26,438 మంది కాగా, సింగిల్ డోస్ తీసుకున్న వారు 243 మంది, డబుల్ డోసు తీసుకున్నవారు 39 మంది ఉన్నారు. ♦వ్యాక్సిన్ తీసుకుని మరణించిన వారిలో 83 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు ఐసీఎంఆర్ పరిశీలన చెబుతోంది. ♦60 ఏళ్లు పైబడిన వారిలో టీకా తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారు 88 రెట్లు సురక్షితంగా ఉన్నారు. ♦గత నవంబర్ నుంచి 60ఏళ్లు పైబడిన వారి మరణాలు 1.3 రెట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారిలో రెండు డోసుల టీకా వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుండటమే. అందువల్లనే బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐసోలేషన్లో ఉంటే మేలు డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఐసోలేషన్ పాటించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయం ఇంట్లో జాగ్రత్తలు పాటిస్తే వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అదేవిధంగా రెండు డోసులు వేసుకున్న వాళ్లు అర్హతల ఆధారంగా తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలి. -
ఏ నూనె వాడుతున్నారు.. ఏ నీళ్లు తాగుతున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేరియంట్లతో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) శాస్త్రవేతలు మారుమూల గ్రామాల్లో అధ్యయనం మొదలుపెట్టారు. గ్రామీణులపై అది ఏవిధంగా ప్రభావం చూపుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి అలవాట్లు, జీవనశైలి గురించి పరిశీలనలు జరుపుతున్నారు. ‘ఏ వంట నూనె వాడుతున్నారు. బోరు నీరు తాగుతున్నారా. భోజనంలో చిరుధాన్యాలు, పండ్లు ఏమైనా తీసుకుంటున్నారా. రోజులో ఎన్నిగంటలు వ్యవసాయ పని చేస్తున్నారు. వారంపాటు చేను పనికి వెళ్లకపోతే ఆరోగ్యం ఎలా ఉంటోంది.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలకు సంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్) ప్రతినిధులతో కలసి సంగారెడ్డి జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నావళిలో 40కిపైగా ప్రశ్నలు, ఉపప్రశ్నలున్నాయి. ఒక్క కేసూ నమోదుకాని గ్రామాల్లో.. ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాని గ్రామాలు, అత్యధికంగా కోవిడ్ వచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఐసీఎంఆర్ ఈ సర్వే చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీరాబాద్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కరస్గుత్తి పీహెచ్సీ పరిధిలో ఉండే ఈ మారుమూల గ్రామంలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేసిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణపతిరావు తెలిపారు. మరోవైపు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాక్స్నగర్ పీహెచ్సీ పరిధిలో కూడా ఈ సర్వే చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచీ వివరాల సేకరణ.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి జీవనశైలి ఎలా ఉందనే కోణంలోనూ శాస్త్రవేత్తలు వివరాలు రాబట్టారు. వ్యాక్సిన్ వేసుకోనివారు, కేవలం ఒక్క డోసు మాత్రమే వేసుకున్న వారు, రెండోడోసు వేసుకున్నవారు, బూస్టర్ డోసు కూడా వేసుకున్నవారు.. ఇలా వివిధ పారామీటర్లలో ప్రజలను ఎంపిక చేసుకుని వివరాలు సేకరించారు. రక్త నమూనాలూ సేకరణ సర్వే సందర్భంగా ఐసీఎంఆర్ బృందం సంబంధిత వ్యక్తుల నుంచి 3 ఎం.ఎల్. చొప్పున రక్తనమూనాలను తీసుకుంటోంది. ఒక్కో గ్రామంలో సుమారు 20 నుంచి 40 మందిని సర్వే చేసి వివరాలను రాబడుతోంది. సర్వేలో భాగంగా స్త్రీలు, పురుషుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇదీ ఉద్దేశం.. కోవిడ్–19 సంక్రమణ, వ్యాప్తిని నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఈ వైరస్ నియంత్రణ, రానున్న రోజుల్లో మార్గదర్శకాల జారీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సర్వే చేస్తున్నవారికి ఉద్దేశాన్ని వివరిస్తూ కరపత్రాలను కూడా అందజేస్తున్నారు. -
మార్చిలో కరోనా చివరి దశ
-
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
-
మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు. ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కోవిడ్–19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి’’ అని పాండా వివరించారు. కరోనా పరీక్షలు తప్పనిసరి వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్ కోవిడ్–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు. కరోనా అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ దావోస్: కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్డౌన్లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఒ ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అసమానతలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ ఇలాంటి వైరస్లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది. ఒకే రోజు 2.82 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2,82,970 కేసులు నమోదయ్యాయి. 18,31,000కి క్రియాశీల కేసుల సంఖ్య చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రతీ కరోనా కేసుని జన్యుక్రమ విశ్లేషణకు పంపించడం సాధ్యం కాదని అందుకే ఒమిక్రాన్ కేసులు ఎంత శాతం నమోదవుతున్నాయో కచ్చితమై న లెక్కలు చెప్పలేమని స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53శాతంగా ఉంది. (కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్లలో రూ.499 వసూలుచేస్తున్నారు. 6,996 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384 చేరింది. ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది. -
ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్.. ఈ లక్షణాలు ఉంటేనే కోవిడ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. (చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!) -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరోనా దేశంలో శరవేగంగా దూసుకొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశంలోకి వచ్చేసినట్టేనని వైద్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే లక్ష 17 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఆమోదించినన యాంటీ-కోవిడ్-19 డ్రగ్ మోల్నుపిరావిర్లో "ప్రధానమైన సేఫ్టీ సమస్యలు" ఉన్నాయని భారతదేశపు ఉన్నత ఆరోగ్య పరిశోధన సంస్థ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ లైట్ తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారనంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్తలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్పై కీలక ప్రకటన చేశారు. మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు , ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ పురుషులు, మూడు నెలల పాటు గర్భ నిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చన్నారు.అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. అలాగే డబ్ల్యుహెచ్వో గానీ, యూకేలో గానీ దీన్ని చికిత్సలో భాగంగా చేయలేదన్నారు. దీనిమై మరింత చర్చిస్తున్నామని భార్గవ వెల్లడించారు. #bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe — BharatBiotech (@BharatBiotech) January 5, 2022 ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15-18 సంవత్సరాల వయస్సు వారికి "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడవద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. కోవాక్సిన్తో టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. తేలికపాటి ఇబ్బందులు వచ్చినా, రెండు మూడు రోజులకు అవే తగ్గిపోతాయని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్లో 30,000 మందిలో దాదాపు 10-20 శాతం మందికి మాత్రమే సమస్యలొచ్చాయని, చాలా వరకు తేలికపాటివి,1-2రోజులలో తగ్గిపోతాయని మందులు అవసరం లేదని తెలిపింది. వైద్యుడి సలహా మేరకే మందులువాడాలని కూడా పేర్కొంది.అలాగే వ్యాక్సిన్ తరువాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్. ఇది త్వరలోనే అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానుందని డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చిందంటూ వార్త లొచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. కరోనా సెకండ్వేవ్ కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. వైరస్ వ్యాప్తిని అడ్డు కునేందుకు భౌతిక దూరం, ఫేస్ మాస్క్, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అనే మూడు మంత్రాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలను, క్లోజ్డ్. వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచింది. అలాగే దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకోవడం, ఇంట్లో అందరం ఉన్నపుడు, కిటికీలు తెరిచి ఉంచుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
-
కోవిడ్పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
పోషకాహార లోపంతోనే వ్యాధులు
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు. మరోసారి నమూనాల సేకరణ గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్–వాల్యూ 1.22.. కరోనా ఉధృతానికి ఇదే సంకేతం
న్యూఢిల్లీ : కేసులు పెరుగుతుండటం తో దేశంలో సగటు ఆర్– వాల్యూ 1.22గా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కరోనా వైరస్ ఒకరి నుంచి సరాసరిన ఎందరికి వ్యాపిస్తుందో సూచించేదే ఆర్– వాల్యూ. ఆర్–వాల్యూ అనేది ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. ఒకటిని దాటి ఏమాత్రం పెరిగినా కరోనా ఉధృతం కాబోతుందనే దానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశసగటు 1.22గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో నమోదైన 3,30,379 ఒమిక్రాన్ కేసుల్లో 59 మరణాలు మాత్రమే సంభవించాయని భార్గవ తెలిపారు. ఢిల్లీ, ముంబైల్లో డేంజర్ బెల్స్ కేసులు పెరుగుతున్న ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఆర్–వాల్యూ 2పైగానే నమోదైనట్లు పరిశోధకులు గురువారం తెలిపారు. చెన్నై, పుణే, బెంగళూరు, కోల్కతాల్లో కూడా ఆర్ వాల్యూ ఒకటికి పైగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు అన్నారు. డిసెంబర్ 23–29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్–వాల్యూ 2.54 వద్ద ఉండగా, ముంబైలో ఈనెల 23–28 తేదీల మధ్య ఆర్–వాల్యూ 2.01గా ఉందన్నారు. -
వ్యాక్సిన్ రోగ నిరోధకత 9 నెలలే.. సెకండ్ డోస్ కూడా వేయించుకోండి: ఆరోగ్య శాఖ
Covid 19 vaccination immunity period: కోవిడ్ వాక్సిన్ డోస్, వైరస్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, మరణాల రేటు తగ్గించేందుకేనని కేంద్రం అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో స్పష్టం చేసింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత రోగ నిరోధకత 9 నెలల వరకు ఉంటుందని, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లన్నీ మనదేశంతో సహా, ఇజ్రాయెల్, యూఎస్, యూరప్, యూకే, చైనా నుంచి వచ్చినప్పటికీ ప్రాథమికంగా వ్యాధిని ఎదుర్కొనేవే కానీ వ్యాధిని పూర్తిగా నిరోధించవు. ముందు జాగ్రత్తగా తీసుకునే కోవిడ్ డోసులు.. వ్యాధి తీవ్రతను తగ్గించడం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటులను తగ్గించడానికేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ తెలిపారు. మన దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 90% మందికి మొదటి డోస్ టీకాలు పూర్తయ్యాయి. ఐతే టీకాలు వేయించుకున్న వారిలో కొంతమందికి ముందుగా రోగ లక్షణ అంటువ్యాధులు ఉన్నందు వల్ల చాలా మందిలో సార్స్-కోవ్ 2 యాంటిజెన్కు సంబంధించి కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మరికొందరికి గుర్తించబడని లక్షణ రహిత అంటువ్యాధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 10 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా అర్హులైన వారికి ఫోన్ ఎస్సెమ్మెస్ సందేశాలు పంపడం ద్వారా విస్తృత టీకా కవరేజీని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ -
నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్లో కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్ వేరియంట్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ తెలిపారు. ఏరకమైన వేరియంట్ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్ డోసు తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. యూపీలో రాత్రి కర్ఫ్యూ ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు. రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్డోర్ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్ డోర్ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జార్ఖండ్లోని రాంచీలో జనం రద్దీ -
ఒమిక్రాన్ను గుర్తించే కిట్ తయారీ.. ఐసీఎంఆర్ రూపకల్పన
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించేందుకు ఉపయోగపడే సరికొత్త కిట్ను ఐసీఎంఆర్ తయారు చేసింది. దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి వ్యక్తికరణ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్– ఈఓఐ) బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి వ్యక్తం చేసిన ఐవీడీ కిట్ తయారీదారులకు ఈ ఇన్విట్రో కిట్లకు(ఐవీడీ) కావాల్సిన సాంకేతికతను సంస్థ బదిలీ చేస్తుంది. నూతన సాంకేతికతతో ఈ రియల్టైమ్ ఆర్టీపీసీఆర్ పరీక్షా కిట్ను ఐసీఎంఆర్ అధీనంలోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రిసెర్చ్సెంటర్ రూపొందించింది. ఈ కిట్ల సాంకేతికత, ఐపీ హక్కులు, వాణిజ్యహక్కులు సంస్థ వద్దనే ఉంటాయని, ఎంపిక చేసిన ఉత్పత్తిదారులతో లైసెన్సు అగ్రిమెంట్లను సంస్థ కుదుర్చుకొని అవసరమైన సాంకేతికతను బదిలీ చేస్తుందని ఐసీఎంఆర్ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్ విధానాన్ని వాడుతున్నారు. ఇది ఖరీదైనదే కాకుండా, ఫలితాలకు సమయం పడుతోంది. -
రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్!
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న 9 నెలల అనంతరం కరోనా టీకా బూస్టర్ డోసును ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) సూచించింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు పూర్తి చేసుకున్న 9నెలల తర్వాత అదనపు డోసును ఇవ్వవచ్చని ఐసీఎంఆర్ బలరామ్ భార్గవ అభిప్రాయపడ్డారు. కోవీషీల్డ్ టీకాను డెల్టా ఉత్పరివర్తనాలను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసుగా ఇవ్వడం వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించినట్లు ఐసీఎంఆర్ సైంటిస్టుల బృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే! మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్పై భయాందోళనలు రేకెత్తకుండా జాగ్రత్త వహించాలని మీడియాను భార్గవ కోరారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచలేదన్నారు. ఈ వేరియంట్కు కూడా పాత చికిత్సా విధానాలే పనిచేస్తాయన్నారు. బూస్టర్ డోసులపై దేశంలో రెండు నిపుణుల బృందాలనుంచి సూచనలు తీసుకుంటామని, అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని ఆరోగ్యమంత్రి ప్రకటించారు. దేశంలో 86 శాతం మందికి కనీసం ఒక్కడోసు పూర్తైందన్నారు. ఒమిక్రాన్ 50కిపైగా దేశాల్లో కనిపించిందని, దీని ప్రభావాన్ని సైంటిస్టులు పరిశోధిస్తున్నారని చెప్పారు. దేశంలో కోవిడ్ టీకాల సంఖ్య, ఒమిక్రాన్ కలకలం తదితర అంశాలపై శనివారం కేబినెట్ కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు దేశంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. 32కు చేరుకున్నట్లు కేంద్రం శుక్రవారం తెలిపింది. పుణెకు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి సహా మహారాష్ట్రలో కొత్తగా ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ కేసుల్లో ఎక్కువగా స్వల్ప లక్షణాలే ఉన్నాయని పేర్కొంది. వైద్యపరంగా చూస్తే ఈ కేసులు దేశ ఆరోగ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. అయినప్పటికీ, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచనల మేరకు అప్రమత్తత కొనసాగిస్తున్నట్లు వివరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు బయటపడిన కేసుల్లో అతి పిన్న వయస్కురాలు పుణె బాలికేనని వారు తెలిపారు. సెకండ్ వేవ్కు ముందున్న మాదిరిగానే ప్రస్తుతం కూడా ప్రజలు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం ఉంటున్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ కూడా గుర్తించిందని చెప్పారు. ఇదే ధోరణి కొనసాగినట్లయితే మరోసారి ప్రమాదకర జోన్లోకి వెళ్లినట్లేనని హెచ్చరించారు. దేశంలోని అర్హులైన వయోజనుల్లో 53.5%మందికి రెండు డోసులు అందాయన్నారు. -
ఒమిక్రాన్ జాడ ఇలా తెలుస్తుంది!
న్యూఢిల్లీ: తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్.. ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల నుంచి తప్పించుకోలేదని, టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రసర్కార్ సూచించింది. రాష్ట్రాలు/యూటీల ఉన్నతాధికారులతో మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వర్చువల్ పద్ధతిలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు. ‘ వైరస్ నిర్ధారణ పరీక్షల నుంచి ఒమిక్రాన్ తప్పించుకోలేదు. టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుంది. పరీక్షల సంఖ్యను పెంచడం ద్వారా ఈ రకం వేరియంట్ వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు ఆస్కారముంది’ అని బలరాం అన్నారు. ఫలితాలొచ్చేదాకా ఎయిర్పోర్ట్లోనే.. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బొట్సావానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల నుంచి భారత్కు ప్రయాణికులు వస్తే వారికి ఎయిర్పోర్టులోనే ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆయా ప్రయాణికులంతా ఎయిర్పోర్టులోనే వేచిఉండాలి. ఈ నిబంధన డిసెంబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్కు, టెస్ట్ రిజల్ట్ వచ్చే దాకా ఎయిర్పోర్ట్లో ఉన్నపుడు ఆహారం కోసం మొత్తంగా రూ.1,700 ఖర్చుకానుంది’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్తో ‘హై రిస్కే’: డబ్ల్యూహెచ్వో ఒమిక్రాన్పై ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వేరియంట్ను ‘హై రిస్క్’ కేటగిరీలోనే కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)పునరుద్ఘాటించింది. రానున్న కొద్ది రోజుల్లో ఇది తీవ్ర పరిణామా లకు దారి తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్వో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రతను లెక్కిస్తే అది భారీస్థాయిలోనే ఉండొచ్చని సంస్థ రఅభిప్రాయపడింది. జపాన్లో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. -
బూస్టర్ డోసు అవసరం లేదు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డాక్టర్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇమ్యూనైజేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ప్రపంచంలో పరిస్థితేంటి? ‘బూస్టర్’ అంటే! కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకుంటే కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి? అదనంగా మరో డోసు... మూడో డోసు (దీన్నే బూస్టర్ డోసు) తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్ డోసులను సిఫారసు చేశాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లు తెరుచుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా... కోవిడ్ నుంచి రక్షణతో జనం స్వేచ్ఛగా విహరించే పరిస్థితినే పలుదేశాలు కోరుకుంటున్నాయి. ఏయే దేశాలు ఇస్తున్నాయంటే... నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి. 12 % బూస్టర్లే అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్లలో 12 శాతం బూస్టర్ డోస్లేనట! ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి. పేద దేశాలకు అన్యాయం చేయొద్దు: డబ్ల్యూహెచ్వో బూస్టర్ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్వో డెరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ ఘెబ్రెయాసస్ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. – నేషనల్ డెస్క్, సాక్షి భారత్లో.. మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా... 37. 45 కోట్ల మంది ఒక్కడోసు (ఈనెల 17 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవియా చెప్పిన ప్రకారం) తీసుకున్నారు. -
కేన్సర్ కోరలు చాస్తోంది!
కోవిడ్ మహమ్మారి ఏడాదిన్నర కాలంలో.. దేశంలో బలితీసుకున్న ప్రాణాలు దాదాపు 4,50,000. కానీ.. భారత్లో ఏటా కేన్సర్ పొట్టనబెట్టుకుంటున్నది.. అక్షరాలా.. 7,84,000 మందిని! ఈ లెక్క మూడేళ్ల క్రితం నాటిది. 2021లో ఇది మరింత పెరిగిందే కానీ తక్కువైతే కాదు! ఎందుకిలా? మనం చేయాల్సిందేమిటి? బంధుమిత్రుల్లో ఏ ఒక్కరితో కాసేపు మాట్లాడినా.. ఎవరో ఒకరి కేన్సర్ గురించి ప్రస్తావన రాక మానదు. దేశంలో దశాబ్దకాలంగా కేన్సర్ కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ (కేన్సర్ కేసులన్నింటినీ నమోదు చేసే వ్యవస్థ) తాజా నివేదిక చెబుతోంది. ఒకవైపు కరోనాతో పోరాడుతున్న సమయంలోనే గత ఏడాది దేశం మొత్తమ్మీద 13.92 లక్షల మంది కేన్సర్ బారినపడ్డారని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. రానున్న నాలుగేళ్లు అంటే 2025 వరకూ ఈ సంఖ్య ఏటా 12% చొప్పున పెరగనుందని భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్), బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సీడీఐఆర్) విభాగాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 2025లో కనీసం 15.6 లక్షల మంది కొత్తగా కేన్సర్ బారినపడతారన్నమాట. వ్యాధిని గుర్తించడం మొదలుకొని చికిత్స, నివారణ విషయాల్లో వైద్యం ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు? ఆయుఃప్రమాణాలు పెరగడమూ కారణమే! దేశంలో సగటు ఆయుఃప్రమాణం 1960లో 41.42 ఏళ్లు ఉంటే.. 2018 నాటికి ఇది 69.2 ఏళ్లకు పెరిగింది. దేశంలో కేన్సర్ కేసు లు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణం. ఆయుఃప్రమాణాలు పెరిగాయంటే.. మనిషి ఎక్కువ కాలం జీవించగలడు.. ఆ క్రమంలో కేన్సర్ల బారిన పడే అవకాశమూ ఉంటుంది. కణ విభజన ప్రక్రియలో నిత్యం కొన్ని తప్పులు జరగడం పుట్టినప్పటి నుంచే ఉన్నా.. యుక్తవయసులో వాటిని సరిదిద్దుకునే వ్యవస్థ చురుకుగా ఉండటం వల్ల సమస్యలు తక్కువగా వస్తాయి. వయసు పెరిగిన కొద్దీ ఈ తప్పులు ఎక్కువవుతాయి. ఫలి తంగా కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. మరి యువకుల్లో వచ్చే కేన్సర్ల సంగతేమిటి అంటారా? జీవనశైలి మార్పులతోపాటు కొన్ని కుటుంబాల్లో కేన్సర్ కారక జన్యుమార్పులు వారసత్వంగా రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యాధి గుర్తింపు సౌకర్యాల పెరుగుదల... ఇప్పుడు దేశంలో కేన్సర్ గుర్తింపునకు ఉన్న సౌకర్యాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఇప్పుడు టైర్–2, టైర్–3 నగరాలకూ విస్తరించాయి. ఈ పరీక్షల కారణంగా చాలామంది కేన్సర్లను తొందరగానే గుర్తించగలుగుతున్నారు. ఫలితంగా వీరు ఆ వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలూ మెరుగవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 38 జనాభా ఆధారిత కేన్సర్ రిజిస్ట్రీలు ఉండగా ఇవన్నీ నిర్దిష్ట ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్హోమ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణకేంద్రాలు, జనన, మరణ ధ్రువీకరణ కేంద్రాల వంటి వాటి ద్వారా కేన్సర్ కేసులను నమో దు చేస్తాయి. ఇవన్నీ కూడా దేశజనాభాలో కనీసం 10% నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. ఇక ఆసుపత్రి ఆధారిత కేన్సర్ రిజిస్ట్రీలు దేశంలో 250 వరకూ ఉన్నాయి. నివారణ ఎలా? కేన్సర్ను నివారించేందుకు ఉన్న తారకమంత్రం.. ఏ రూపం లోనూ పొగాకును తీసుకోకపోవడం. బాగా శుద్ధి చేసిన, రెడీమేడ్ ఆహారాన్ని నివారించడం. రోజూ కనీసం అరగంటపాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం కూడా అవసరమే. ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రధాన అంశమైన ఒత్తిడిని తగ్గించుకోవడమూ కేన్సర్ను దూరంగా ఉంచేందుకు కీలకం. ఒత్తిడి కారణంగా కేన్సర్ బారినపడ్డవారు ఎందరు? అన్న సమాచారం స్పష్టంగా లేకున్నా... ఒత్తిడి కాస్తా అధిక రక్తపోటుకు దారితీస్తుందని.. ఇది శరీరంలో పలు మార్పులకు కారణమవుతుందన్నది తెలిసిందే. గర్భాశయ ముఖద్వార కేన్సర్ల తగ్గుదల మహిళల్లో రొమ్ము కేన్సర్లు ఎక్కువ అవుతుండగా... ఊపిరితిత్తులు, తల, మెడ భాగాల్లో వచ్చే కేన్సర్లు మహిళలతోపాటు పురుషుల్లోనూ ఎక్కువ అవుతున్నాయి. అయితే మహిళలకు వచ్చే గర్భాశయ ముఖద్వారా కేన్సర్ల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. అధిక శాతం ఊపిరితిత్తుల కేన్సర్లను ఇతర అవయవాలకు విస్తరించిన తరువాత మాత్రమే గుర్తిస్తున్నారు. తల, మెడ, కడుపు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా కేన్సర్లలో అధికం పరిమితస్థాయి వ్యాపించిన తరువాత గుర్తిస్తున్నారు. ఇరవై ఏళ్లకు రెట్టింపు ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కేన్సర్ కేసులు 20 ఏళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంటాయని రెండేళ్ల క్రితం జర్నల్ ఆఫ్ గ్లోబల్ ఆంకాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం తెలిపింది. ‘హిస్టరీ ఆఫ్ ద గ్రోయింగ్ బర్డన్ ఆఫ్ కేన్సర్ ఇన్ ఇండియా: ఫ్రమ్ యాంటిక్విటీ టు ద ట్వంటీఫస్ట్ సెంచరీ’ పేరుతో ప్రచురితమైన ఈ పరిశోధనను కోల్కతాలోని టాటా మెడికల్ సెంటర్కు చెందిన మోహన్దాస్ కే మల్లత్, లం డన్లోని కింగ్స్ కాలేజీ డాక్టరల్ విద్యార్థి రాబర్ట్ స్మిత్లు సిద్ధం చేశారు. బ్రిటిష్ లైబ్రరీతోపాటు లండన్లోనే ఉన్న వెల్కమ్ కలెక్షన్ లైబ్రరీల్లో భారత్లో కేన్సర్ వ్యాధిపై ఉన్న రెండు వందల ఏళ్ల పరిశోధన పత్రాలను వీరు పరిశీలించారు. దీంతో భారత్లో కేన్సర్ కేసులు పెరిగేందుకు జీవనశైలి మార్పులు ఒక్కటే కార ణం కాదన్న అంచనాకు రాగలిగామని మల్లత్ పేర్కొ న్నారు. ‘1900లలో జననాలతోపాటు మరణాలూ ఎక్కు వగా ఉండేవి. ఆ దశ నుంచి క్రమేపీ జననాలు ఎక్కువ, మరణాలు తక్కువన్న స్థితికి వచ్చాం. భవిష్యత్తులో జననాలు, మరణాలు తక్కువ ఉండే స్థితికి కొన్ని రాష్ట్రాలు చేరుకోవచ్చు. ఫలితంగా ఆయుఃప్రమాణాలు పెరిగిన చోట కేన్సర్ల వంటి వ్యాధులు పెరిగే చాన్స్ ఉంటుంది’ అని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఈ రకమైన మా ర్పులు వివిధ దశల్లో ఉన్నాయని.. ఎపిడిమియలాజికల్ ట్రాన్సిషన్ లెవెల్ (ఈటీఎల్) అని పిలిచే ఈ మార్పులు కేరళలో ఎక్కు వగా, యూపీలో తక్కువగా ఉన్నాయని మల్లత్ తెలిపారు. ఈటీఎల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానవాభివృద్ధి సూచికలు మెరుగ్గా, కేన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. భోర్ కమిటీ అమలే శరణ్యం కేన్సర్ను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. కేన్సర్ చికిత్సలను ప్రైవేట్ ఆసుపత్రులకు వదిలివేయరాదు. ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్సలు ఎంత ఖరీదైనవో తెలియంది కాదు. కేన్సర్ కేసులను తగ్గించాలనుకుంటే కేంద్రం చేయగల ప్రాథమిక అంశం 1946 నాటి భోర్ కమిటీ నివేదికను, ముదలియార్ కమిటీ నివేదికలను అమలు చేయడమే. అన్ని వైద్య కళాశాలల్లో మల్టీ డిసిప్లి నరీ కేన్సర్ చికిత్స విభాగాలను ఏర్పాటు చేయాలని, కేరళలోని రీజనల్ కేన్సర్ సెంటర్ మాదిరి ఆసుపత్రిని జిల్లాకొకటి ఏర్పాటు చేయాలని ఈ నివేదికలు ప్రభుత్వానికి సూచించాయి. జీవనశైలి మార్పుల ప్రభావం? దేశంలో కేన్సర్ కేసులు పెరిగిపోవడం వెనుక జీవన శైలి మార్పులు ఒక కారణ మని వైద్య నిపుణుల అంచనా. అనారోగ్యకర మైన ఆహార అలవాట్లు, పాల ఉత్పత్తిలో కృత్రిమ హార్మోన్ల వాడకం, బాగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొన్ని రకాల కేన్సర్లు ఎక్కువ అవుతోంటే.. రెడీమేడ్ ఆహారానికి చేర్చే రసాయనాలు, మాంసాహారం, రసాయన కాలుష్యం, మలబద్ధకం, శారీరక శ్రమ, వ్యాయామాల లేమి కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. దేశంలో నమో దవుతున్న కొత్త కేన్సర్ కేసుల్లో 27 శాతం పొగాకు వాడకం వల్ల వస్తున్నవే. పనిగంటలు ఎక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలు, ధూమ పానం, మద్యపానం, గర్భనిరోధక మాత్రల వాడకం వంటివి మహిళల్లో రొమ్ము కేన్సర్లు వచ్చేందుకు కారణాలుగా మారుతున్నాయి. పురుషులతో పోలిస్తే సాధారణంగా మహిళలు ఎక్కువ కాలం జీవించడం కూడా వారు కేన్సర్ బారిన పడే అవకాశాలను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడెన్ని? దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 2018లోనే 2,70,053 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అదే ఏడాది 1,44,032 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 1.08 లక్షల కేసులు ఉండగా బిహార్లోనూ లక్ష పైమాటే. ఆంధ్రప్రదేశ్లో గడిచిన మూడేళ్లుగా సగటున 69 వేల వరకూ కొత్త కేన్సర్ కేసులు నమోదవుతున్నట్టు జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ వెల్ల డించింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. -
గర్భిణిలపై కరోనా అధిక ప్రభావం
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్ సోకితే ఎన్నో రకాల ఇతర వ్యాధులు కూడా వారిలో విజృంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. దాని ప్రకారం కరోనా సోకిన గర్భిణుల్లో తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోవిడ్–19తో మహిళలు ప్రసవిస్తే వారిలో ఎనీమియా, డయాబెటీస్ వంటివి పెరిగిపోయి తల్లుల మరణానికి దారి తీసే అవకాశాలున్నాయి. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వ్యక్తిలో కోవాగ్జిన్ సింగిల్ డోస్తో యాంటీబాడీ స్పందన(రెస్పాన్స్) కనిపిస్తుందని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. ఈ రెస్పాన్స్ ఒక్కసారి కూడా వ్యాధి సోకని, టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో వచ్చే యాంటీబాడీ రెస్పాన్స్కు సమానంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. అధ్యయన వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్లో ప్రచురించారు. పరిశీలించిన అంశాలను బట్టి ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వారికి బీబీవీ152(కోవాగ్జిన్)సింగిల్డోస్ టీకా సరిపోతుందని భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. తాజా అధ్యయనంలో భాగంగా హెల్త్కేర్ వర్కర్లనుంచి కొందరిని ఎంపిక చేసుకొని వారిలో డే జీరో(టీకా ఇచ్చే రోజు), 28 వరోజు, 56వరోజు యాంటీబాడీ రెస్పాన్స్ను నమోదు చేశారు. అంతకుముందు కోవిడ్ లేని వ్యక్తుల్లో టీకా వల్ల వచ్చిన యాంటీబాడీ స్పందనను, కోవిడ్ సోకి తగ్గిన అనంతరం సింగిల్ డోస్ తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీ స్పందనను మదింపు చేశారు. రెండు కేసుల్లో యాంటీబాడీ రెస్పాన్స్ దాదాపు సమానంగా ఉన్నట్లు గమనించారు. చదవండి: రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు -
‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్లో 30 శాతం మంది బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’గా పరిగణిస్తున్న ‘హైపర్ టెన్షన్’ (బీపీ) అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలోని 30 శాతం మంది ‘అధిక రక్తపోటు’తో బాధపడుతున్నారని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 వరకు 184 దేశాల్లో 10 కోట్ల మందిపై నిర్వహించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు విశ్లేషించిన సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్న అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్, భారత్లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది. చదవండి: పండగలప్పుడు జరభద్రం! ప్రపంచస్థాయిలో 1990తో పోల్చితే 2019కల్లా బీపీ సమస్యల విషయంలో మహిళలు, పురుషుల సంఖ్య రెట్టింపైనట్లు వెల్లడైంది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. బీపీతో ముడిపడిన అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ‘సాక్షి’తో క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఎ.నవీన్రెడ్డి, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే.. గతంలో 50–60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25–30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది. చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. జీవనశైలి పద్ధతులను మార్చుకోకుండా బీపీని నియంత్రించలేం. బీపీకి నడక చాలా మంచి మందు. 90 శాతం వరకు కారణాలు లేకుండానే బీపీ వస్తుంది. దీనినే ‘ఎసెన్షియల్ హైపర్ టెన్షన్’ అని పిలుస్తాం. – డా. ఎ.నవీన్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణుడు,నవీన్రెడ్డి హాస్పిటల్ -
పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది?
మూడు డోసుల టీకా.. ఇప్పటివరకు ఉన్న అన్ని టీకాలు రెండు డోసులు ఇస్తుండగా.. జైకోవ్–డి వ్యాక్సిన్ మూడు డోసులు ఉంటుంది. మొదటిరోజుతోపాటు 28వ రోజున, 56వ రోజున ఈ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూదిలేని మందు.. ప్రస్తుతమున్న కరోనా టీకాలన్నీ ఇంట్రామస్క్యులర్ (కండరాల లోపల ఇచ్చేవి) కాగా.. జైకోవ్–డి టీకాను ఇంట్రాడెర్మల్ (చర్మానికి, కండరాలకు మధ్య) రూపంలో ఇస్తారు. దీనిలో సూది ఉండదు. ఫార్మాజెట్గా పిలిచే ప్రత్యేక ఇంజెక్టర్ను వాడుతారు. ఎలా పనిచేస్తుంది? జైకోవ్–డి టీకాను డీఎన్ఏ ప్లాస్మిడ్ విధానంలో అభివృద్ధి చేశారు. ఈ టీకా తీసుకున్నవారిలో అచ్చంగా కరోనా వైరస్పై ఉండే స్పైక్ ప్రొటీన్ల వంటి ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ దానిని వైరస్గా భావించి.. తగిన యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తర్వాత ఎప్పుడైనా కరోనా వైరస్ ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తే.. వెంటనే అడ్డుకుంటాయి. కొత్త వేరియెంట్లకు తగ్గట్టు డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో రూపొందించిన టీకాల్లో మార్పులు చేయడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు వస్తే.. దానికి తగినట్టుగా వెంటనే వ్యాక్సిన్లో మార్పులు చేసి వినియోగించవచ్చని అంటున్నారు. న్యూఢిల్లీ: పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా సిద్ధమైంది. పిల్లలతోపాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా పనిచేసే ‘జైకోవ్–డి’ టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ టీకా అత్యవసర వాడకానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. అత్యంత ఆధునికమైన డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో ఈ టీకాను రూపొందించారు. ఈ తరహా వ్యాక్సిన్లలో ప్రపంచంలోనే ఇదే మొదటిది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో కరోనా వ్యాక్సిన్ కూడా ఇదే. కాగా జైకోవ్–డి వ్యాక్సిన్ను అనుమతిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో దేశం మరో ముందడుగు వేసిందని, శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారని అభినందించారు. డీబీటీ, ఐసీఎంఆర్ సహకారంతో..: ‘మిషన్ కోవిడ్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా.. జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ వ్యాక్సిన్ను అభి వృద్ధి చేసింది. తొలిరెండు దశల్లో సంతృప్తికర ఫలితాలు రావడంతో.. దేశవ్యాప్తంగా 28వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ డేటాను పరిశీలించిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చని డీసీజీఐకి సిఫార్సు చేసింది. డీసీజీఐ శుక్రవారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు వివరాలతో డీబీటీ ప్రకటన విడుదల చేసింది. జైకోవ్–డి టీకా అన్నిరకాల కరోనా వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. రెండు నెలల్లో మార్కెట్లోకి..: జైకోవ్–డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం గత నెల ఒకటిన దరఖాస్తు చేసుకున్నట్టు జైడస్ క్యాడిలా సంస్థ వెల్లడించింది. పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా తమ టీకా సురక్షితమని ప్రకటించింది. అనుమతులు వచ్చాక రెండు నెలల్లోనే టీకాను మార్కెట్లోకి తెచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ఎండీ షర్విల్ పటేల్ వెల్లడించారు. దేశంలో ఆరో టీకా..: దేశంలో ఇప్పటివరకు సీరం ఇనిస్టిట్యూట్–ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవి షీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్–వి, అమెరికాకు చెందిన మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు అనుమతి ఉంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న జైకోవ్–డి టీకా ఆరోది కానుంది. అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్తో.. జైకోవ్–డి ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసి, అందుబాటులోకి వస్తున్న రెండో వ్యాక్సిన్. ఒకవేళ కరోనా సోకితే.. సాధారణ లక్షణాలు మాత్రమే కనిపించే వారి విషయంలో తమ టీకా 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని జైడస్ క్యాడిలా కంపెనీ ప్రకటించింది. అదే లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశమున్న వారిలో 66.6% మేర పనితీరు చూపుతుందని వెల్లడించింది. 50కిపైగా కేంద్రాల్లో 28వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపారు. దేశంలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో ఇదే అతిపెద్దది. డీఎన్ఏ ప్లాస్మిడ్ టీకా అంటే? వ్యాక్సిన్లకు సంబంధించి అత్యంత అధునాతనమైన కొత్త విధానమే డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీ. కణాల్లో కేంద్రకానికి బయట ఉండే డీఎన్ ఏను ప్లాస్మిడ్స్ అంటారు. ఈ ప్లాస్మిడ్స్ను జన్యుపరంగా మార్పిడి చేసి, టీకా ఉత్పత్తిలో వాడుతారు. టీకా ఇచ్చినప్పుడు జన్యుమార్పిడి ప్లాస్మిడ్లు.. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ సిస్టమ్)ను ప్రేరేపిస్తాయి. దీంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. భవిష్యత్లో కరోనా సోకితే.. వెంటనే హతమారుస్తాయి. -
థర్డ్వేవ్కు.. కేరళే కేంద్రమా!
భారత్లో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రంగా నిలిచిన కేరళ మరోమారు భయపెడుతోంది. సెకండ్ వేవ్ ముగిసిపోతోందని దేశమంతా ఊపిరి తీసుకుంటున్న వేళ థర్డ్వేవ్కు కేరళ కేంద్రంగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ కేరళ ప్రాంతంలో పెరిగిపోతున్న ఇన్ఫెక్షన్ వ్యాప్తి కేరళ ప్రభుత్వాన్నే కాదు, కేంద్రాన్ని కూడా కలవరపెడుతోంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు రాష్ట్రం మరోమారు వీకెండ్ లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది, అటు కేంద్రం ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. గతేడాది ఒకదశలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తోందని ప్రశంసలు అందుకున్న కేరళలో పరిస్థితి ఎందుకిలా మారింది? పరిస్థితి ఎంత డేంజర్? ప్రభుత్వం ఏంచేస్తోంది? కేంద్రం నుంచి ఎలాంటి సాయం లభిస్తోంది? నిపుణులేమంటున్నారు?.. చూద్దాం! పరిస్థితేంటి? కరోనా సెకండ్ వేవ్ ఆరంభమైన కొత్తలో కేరళ కోవిడ్ నిర్వహణలో మంచి పనితీరే చూపింది. కానీ క్రమంగా పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తాజాగా ఐసీఎంఆర్ చేసిన నేషనల్ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ(44 శాతం) నిలిచింది. అంటే రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్ ముప్పుందని తేలుస్తోంది. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే కేరళలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు తమిళనాడులో జూన్ 6న 20వేల పైచిలుకు కేసులుండగా, జూలై 27నాటికి ఈ కేసులు 1,767కు పరిమితమయ్యాయి. కర్ణాటకలో జూన్ 27న 1,501కేసులు నమోదయ్యాయి. కానీ కేరళలో జూలై 27న 22వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అదేరోజు దేశం మొత్తం మీద నమోదైన కొత్త కేసులు 43 వేలున్నాయి. అంటే ఒక్క కేరళ నుంచే దేశంలోని మొత్తం కేసుల్లో సగభాగం వచ్చాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33 .3 లక్షలకు చేరింది. దేశంలో ఆర్ రేట్ విలువ 0.95 ఉండగా, కేరళలో 1.11గా ఉంది. అలాగే దేశంలో టాప్ 30 కరోనా జిల్లాల్లో పది జిల్లాలు కేరళలోనే ఉన్నాయి. ఎందుకిలా? కేరళలో జనాభా సాంద్రత అధికం(చదరపు కిలోమీటర్కు 859 మంది). అలాగే జనాభాలో 15 శాతం వరకు 60 ఏళ్లు పైబడినవారున్నారు. అలాగే డయాబెటిస్లాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా అధికమే. ఇవన్నీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నాయి. తక్కువ టెస్టింగ్ రేటు, బ్యూరోక్రసీపై అధికంగా ఆధారపడాల్సిరావడం వంటి కారణాలు కరోనాపై కేరళ పోరాటానికి అడ్డుతగులుతున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో అనూహ్యంగా లాక్డౌన్ ఎత్తివేయడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమైందని కొందరి భావన. కేరళకు కేంద్ర బృందం రాష్ట్రంలో పరిస్థితిపై ఆందోళనగా ఉన్న కేంద్రం పరిస్థితి అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. ఎన్సీడీసీ డైరెక్టర్ ఎస్కే సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను బృందం సమీక్షిస్తుందని, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని, ప్రజలు గుంపులుగా కూడకుండా నిరోధించాలని కేంద్రం కోరింది. మరోవైపు రాçష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకుండా మరోమారు వీకెండ్ లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శని, ఆదివారాల్లో లాక్డౌన్ పాటించనుంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ మనదేశంలో థర్డ్వేవ్కు కేరళ కేంద్రంగా మారకూడదని ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని, ప్రజలు కూడా గైడ్లైన్స్కు అనుగుణంగా నడుచుకోవాలిన నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడో ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆర్– వాల్యూ అంటే? దేశంలో జూలై చివర్లో ఆర్– వాల్యూ (రిప్రొడక్టివ్ ఫ్యాక్టర్) 0.95గా ఉంటే... కేరళలో మాత్రం దేశంలోనే అత్యధికంగా 1.11గా ఉంది. ఇది ప్రమాదఘంటికగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒక కోవిడ్ బాధితుడి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతోందనే దాన్ని ఆర్ వాల్యూ సూచిస్తుంది. కేరళలో 1.11 ఆర్ వాల్యూ ఉందంటే దానర్థం... ప్రతి 100 మంది కోవిడ్ రోగుల నుంచి 111 మందికి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు లెక్క. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే... కేసులు అదుపులోకి వస్తున్న ట్లు, తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు పరిగణిస్తారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు (మార్చి– ఏప్రిల్లో) దేశ సగటు ఆర్ వాల్యూ ఏకంగా 1.37 శాతం ఉండేది. సెరో పాజిటివిటీ... ఐసీఎంఆర్ జూన్ 14 – జూలై 6వ తేదీల మధ్య పదకొండు రాష్ట్రాల్లో సీరో సర్వే (సెరో పాజిటివీటి... జనాభాలో ఎంతశాతం మందికి కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయో తెలుపుతుంది) నిర్వహించింది. దీంట్లో అన్ని రాష్ట్రాల్లో 69 శాతం పైనే సెరో పాజిటివిటీ ఉండగా... కేరళలో మాత్రం ఇది కేవలం 44.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంటే రాష్ట్ర జనాభాలో మరో 56 శాతం మందికి కోవిడ్ బారినపడే అవకాశం ఉన్నట్లు లెక్క. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఫ్యాకల్టీ, నాన్టీచింగ్ పోస్టులు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 పోస్టులు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(మెడికల్).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► విభాగాలు: నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ తదితరాలు. ► అర్హత: ఎంబీబీఎస్తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. »వయసు: 40ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021 ► వెబ్సైట్: https://www.icmr.gov.in ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 26 ఫ్యాకల్టీ పోస్టులు ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ(డీటీయూ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పరిశోధన/టీచింగ్ అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ప్రజంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్మెంట్ బ్రాంచ్, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, షాబాద్ దౌలత్పూర్, భావనా రోడ్, ఢిల్లీ–110042 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.08.2021 ► దరఖాస్తు హార్డ్కాపీలను పంపడానికి చివరి తేది: 18.08.2021 ► వెబ్సైట్: www.dtu.ac.in ఐఐఐటీ, కోటాలో 21 నాన్టీచింగ్ పోస్టులు జయపురలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ), కోటా.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 21 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ లైబ్రేరియన్–01, టెక్నికల్ అసిస్టెంట్–02, టెక్నీషియన్–05, సూపరింటెండెంట్–02, అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–06, ఆఫీస్ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్/బీఆర్క్/ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021 ► వెబ్సైట్: www.iiitkota.ac.in -
కోవిడ్ ప్రమాదంలో 40 కోట్ల మంది
న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్ బారిన పడే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు. దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది. పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు. 125 రోజుల్లో కనిష్ట స్థాయికి కేసులు దేశంలో 125 రోజుల తర్వాత ఒక్క రోజులో కనిష్టంగా 30,093 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,11,74,322కు చేరాయి. అదేవిధంగా, 111 రోజుల తర్వాత ఒక్క రోజులో అతితక్కువగా 374 కోవిడ్ మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,14,482కు చేరుకుంది. యాక్టివ్ కేసులు కూడా 117 రోజుల తర్వాత 4,06,130కి తగ్గాయని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 1.30% మాత్రమే. రికవరీ రేట్ కూడా 97.37%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,53,710 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. చిన్నతరగతులతో స్కూళ్లు ఆరంభించడం బెటర్! ఒకవేళ భారత్లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ సూచించారు. మానవ కణాల్లో వైరస్ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు. దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్(బ్లడ్ సీరమ్లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు. -
స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ అన్నారు. కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
వ్యాక్సిన్ వేసుకుంటే రిస్క్ 0.5 శాతమే!
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందని, అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అతితక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో మాత్రం సమస్యలు తలెత్తి, ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చే అవకాశముందని హెచ్చరించింది. చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్నామన్న ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా సోకుతోందని పేర్కొంది. కోవిడ్ టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకిన వారిపై ఐసీఎంఆర్ ఇటీవల అధ్యయనం చేసింది. మార్చి నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వెయ్యి మంది పేషెంట్ల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించింది. ఈ వివరాలతో రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకున్న తర్వాత కరోనా ఇన్ఫెక్షన్ సోకినా.. చాలా మందిలో పెద్దగా అనారోగ్య సమస్యలేవీ తలెత్తలేదని తెలిపింది. కేవలం సాధారణ లక్షణాలైన జలుబు, జ్వరం, దగ్గు వంటివే కనిపించాయని.. మామూలు మందులతోనే ఈ లక్షణాలు తగ్గిపోయాయని వెల్లడించింది. ప్రాణాపాయం తగ్గింది.. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రిస్క్ రేటు బాగా తక్కువగా ఉంటోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇలాంటివారికి కరోనా సోకినా.. 99.5శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారని, 0.5 శాతం మందికి మాత్రమే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతోందని తెలిపింది. ►వ్యాక్సిన్ తీసుకున్నవారికి సగటున 39 రోజుల తర్వాత కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. 70 శాతం మందిలో లక్షణాలు కనిపించకపోగా, మిగతావారిలో సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వస్తున్నాయని వివరించింది. ►తాము పరిశీలించిన బాధితుల్లో 85 శాతం మందికి డెల్టా (బి.1.617) వేరియంట్ సోకినట్టుగా గుర్తించామని పేర్కొంది. ►వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా బారినపడ్డ వారిలో 22 శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోందని.. అయితే వీరిలో చాలావరకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారేనని పేర్కొంది. 78 శాతం హోం ఐసోలేషన్, సాధారణ మందులతోనే రికవరీ అవుతున్నారని తెలిపింది. ►దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో 43 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని పేర్కొంది. అందువల్ల వారు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివి తప్పనిసరిగా పాటించాలని.. వీలైనంత జన సమూహాలున్న చోటికి వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేసింది. ►ఛత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా చేసిన వివిధ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్పెక్షన్ రావచ్చు. కానీ అనారోగ్యానికి గురై మరణించే అవకాశాలు తక్కువ. దీర్ఘకాలిక జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. -కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
ఆగస్టు మాసాంతంలో మూడో వేవ్!: ఐసీఎంఆర్
కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కు చెందిన ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్ వ్యాధుల విభాగం అధినేత డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. వైరస్ వ్యాప్తికి దారితీసే సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని సూచించారు. భారత్లో కరోనా థర్డ్ వేవ్ తథ్యమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఐఎంఏ సూచించింది. కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. -
రెండో డోసు తీసుకోకపోతే...!
గడువు దాటినా కోవిడ్–19 వ్యాక్సిన్ రెండో డోసు ఇంకా మీరు తీసుకోలేదా ? వ్యాక్సిన్ తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారా ? లేదంటే టీకా డోసులే దొరకడం లేదా ? కారణం ఏదైనా సెకండ్ డోసు మిస్సయితే ఏం జరుగుతుంది? అమెరికా నుంచి అండమాన్ వరకు సెకండ్ డోసు వేసుకోవడానికి ఎందుకు సంకోచం? ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్పై పోరాటానికి వ్యాక్సినే బ్రహ్మాస్త్రం. ఈ విషయాన్ని ఎందరో నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యాక్సిన్పై అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాల్లో రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలు అందుబాటులో ఉంటే మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. అయితే మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేదు. మిస్సయితే ఏం జరుగుతుంది ? కోవిడ్–19 రెండో డోసు ప్రాధాన్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. ఎందరో నిపుణులు తమ అభిప్రాయాలను వివిధ వేదికలపై పంచుకున్నారు. భారత్లో లభించే కరోనా టీకాల్లో ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్ డోసుగానే ఉపయోగపడిందని ఐసీఎంఆర్ మాజీ చీఫ్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు. ఒక్కటే డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్ సోకే అవకాశాలుంటాయని ఆయన హెచ్చరించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత మన శరీరం కరోనాపై పోరాటానికి ప్రాథమికంగా సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకున్నాక నిరోధకత మరింత బలోపేతమై మెమొరీ–బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్ మన శరీరంపై దాడి చేస్తే, వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యుద్ధం ప్రకటిస్తాయి. రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఆ అధ్యయనం చెప్పిందేమిటంటే కోవిడ్–19 రెండు డోసులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికాలోని యేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. మొత్తంగా 91,134 మంది కరోనా రోగుల్ని డిసెంబర్–ఏప్రిల్ వరకు వారిని పరీక్షించారు. ఆ రోగుల్లో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆ కరోనా రోగుల్లో 4.5% మందిలో స్వల్పంగా యాంటీబాడీలు ఉత్పత్తయితే, 25.4 శాతం మంది పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు చేరాయి. ఈ రోగుల్లో 225 మంది మరణిస్తే వారిలో వ్యాక్సిన్ తీసుకోని వారు 219 (97%) మంది కావడం గమనార్హం. మరో అయిదుగురు పాక్షికంగా నిరోధకత కలిగిన వారు కాగా, మృతుల్లో కేవలం ఒకే ఒక్కరు పూర్తి స్థాయి యాంటీబాడీలు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. అదే అధ్యయనంలో తేలిన అంశాలేమిటంటే... ► రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 96% మందికి ఆస్పత్రి అవసరం రాదు ► రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే 98.7% మంది మృత్యు ఒడికి చేరుకోరు ► ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకుంటే 77% మందికి మాత్రమే ఆస్పత్రిలో చేరే అవసరం రాదు ► ఒక్క డోసు తీసుకుంటే 64% మంది ప్రాణాలకే భద్రత ఉంటుంది. ఎందుకీ సంకోచం ? కోవిడ్–19 సెకండ్ డోసు తీసుకోకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముందు వెనుక ఆలోచించడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో ప్రభుత్వ వైఫల్యాలు కొన్నయితే, ప్రజల్లో అవగాహనా లేమి మరి కొంత కారణమవుతోంది. టీకా కొరత, మొదటి డోసు తీసుకున్న సమయంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు, రెండో డోసు తీసుకుంటే మరింత ఎక్కువ అవుతాయనే అపోహ, భారత్ వంటి దేశాల్లో నిరక్షరాస్యుల్లో టీకా అంటే ఒక్కటే డోసు అన్న భావన తరతరాలుగా నెలకొని ఉండడం వంటివెన్నో సెకండ్ డోసు తీసుకోకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయని ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ తన తాజా సంచికలో వెల్లడించింది. ఇక అమెరికాలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మొదటి డోసుతోనే 80% రక్షణ కల్పిస్తే, రెండో డోసు తర్వాత 90శాతానికి పైగా రక్షణ ఉంటుంది. ఈ వ్యత్యాసం తక్కువగా ఉండడంతో రెండో డోసు అవసరం లేదన్న అభిప్రాయం అత్యధికుల్లో నెలకొంది. కోవిడ్–19 టీకా మొదటి డోసు తీసుకున్న 70%మందిలో కరోనా పోరాటానికి శరీరం సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకుంటేనే వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవుతాయి. అదే ఏడాది పాటు రెండో డోసు తీసుకోకుండా ఉంటే, దానిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా మళ్లీ రెండు డోసులు తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ కలుగుతుంది’’ – డాక్టర్ జాకబ్ జాన్, వైరాలజిస్టు – సాక్షి, నేషనల్ డెస్క్ -
Oral Vaccine: ప్రయోగాలకు ఐసీఎంఆర్ రెడీ!
కొవిడ్-19 జబ్బు కోసం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ను ఇదివరకే భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం అది క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నోటి ద్వారా అందించే టీకాను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది ఐసీఎంఆర్. . కోల్కతా: ఈ మేరకు ఒక ప్రతిపాదనను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి పంపినట్లు భారత వైద్య పరిశోధన మండలి-కలరా అండ్ ఎంటెరిక్ సీసీజెస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఒక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని ఐసీఎంఆర్–ఎన్ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా వెల్లడించారు. ప్రయోగానుమతి లభించి, నిధుల లభ్యత కాగానే పని ఆరంభిస్తామన్నారు. ఒక్కసారి టీకా తయారయ్యాక జంతువులపై ప్రయోగిస్తారని తెలిపారు. మాములు టీకా తయారీలో ఉన్నట్లే ఇందులో అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాబ్లో ఓరల్ వ్యాక్సిన్ తయారీకి కనీసం 5–6 సంవత్సరాలు పడతుందని ఆమె వివరించారు. -
ఒక్క డోసుతో డెల్టా వేరియంట్ నుంచి రక్షణ: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవైపు వ్యాక్సిన్కు సంబంధించిన ప్రయోగాలు సాగుతూనే ఉండగా, మరోవైపు కోవిడ్ కొత్త కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఓ శుభవార్త చెప్పింది. కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇస్తే చాలని.. ఇది డెల్టా వేరియంట్ నుంచి సైతం రక్షణ కల్పింస్తుందని తేల్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో.. కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని పోల్చిచూస్తే డెల్టా వేరియంట్ నుంచి సైతం అత్యధిక రక్షణ పొందారని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. కోవిడ్ బారిన పడిన వారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీస్కు వ్యాక్సిన్ సింగిల్ డోస్ కలిస్తే, మరింత ప్రమాదకర వేరియంట్ల నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. -
‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్
హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్ఐహెచ్ డెల్టా వేరియంట్పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్ఐహెచ్ సహకరించింది. -
‘ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.. డిసెంబర్లో థర్డ్ వేవ్’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కి చెందిన కోవిడ్–19 వర్కింగ్ గ్రూపు చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా చెప్పారు. భారత ఔషధ పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఊహించిన దాని కంటే కాస్త ఆలస్యంగానే థర్డ్ వేవ్ వస్తుందని తేలిందని వెల్లడించారు. బహుశా ఈ ఏడాది డిసెంబర్లో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం వివిధ వార్తా సంస్థలతో ఆయన మాట్లాడారు. కోవిడ్–19లో కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియెంట్తో కరోనా థర్డ్ వేవ్ చెలరేగిపోవచ్చనే ఆందోళనలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ రెండింటిని లింక్ చేసి చూడలేమని చెప్పారు. అలాగని ఇది పూర్తిగా కొట్టి పారేసే అంశం కూడా కాదని అరోరా స్పష్టం చేశారు. ఎందుకంటే కరోనా వైరస్లో జన్యుపరమైన మార్పు లు జరిగినప్పుడల్లా కొత్త వేవ్లు ముంచుకొస్తుండడం చూస్తున్నామని అన్నారు. రోజుకి కోటి డోసులు లక్ష్యం కరోనా మూడో వేవ్ కాస్త ఆలస్యంగా వస్తే ప్రజలందరికీ వ్యాక్సిన్ వెయ్యడానికి కేంద్రానికి మరింత సమయం దొరుకుతుందని అన్నారు. వచ్చే 6 నుంచి 8 నెలల్లో రోజుకి కోటి డోసులు ఇవ్వడమే తమ లక్ష్యమని అరోరా చెప్పారు. 12–18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా ఇవ్వడానికి జైడస్ క్యాడిలా కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామన్నారు. మూడో వేవ్లో ఎక్కువ మందికి వైరస్ సోకినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉండదని అరోరా చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించడంపై అవగాహన పెరగడం వంటి వాటి వల్ల మొదటి రెండు వేవ్లంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండదని అరోరా అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తులపైనే డెల్టా ప్లస్ ప్రభావం కోవిడ్–19లో మిగిలిన వేరియెంట్లతో పోల్చి చూస్తే డెల్టా ప్లస్ ఊపిరితిత్తుల్లోని కణజాలంపైనే అధిక ప్రభావం చూపిస్తుందని అరోరా తెలిపారు. అలాగని ఇది అధికంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా ఎక్కువగా శరీరంపై దాడి చేస్తుందని చెప్పలేమన్నారు. ‘‘డెల్టా ప్లస్ వేరియెంట్ ఊపిరితిత్తుల కణజాలంపైనే ప్రభావాన్ని చూపిస్తోంది. అలాగని ఈ వేరియెంట్ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుందని చెప్పలేం. ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాపిస్తుందని కూడా నిర్ధారణ కాలేదు’’అని అరోరా వివరించారు. -
ఫ్లిప్కార్ట్లో కరోనా టెస్టు కిట్ల అమ్మకాలు.. 15 నిముషాల్లో రిజల్ట్స్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కరోనా యాంటిజెన్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. "కోవిసెల్ఫ్" అనే రూ.250 ఖరీదైన ఈ యాంటీజెన్ టెస్ట్ కిట్ను ఉపయోగించుకొని కరోనా పాజిటీవా, నెగిటీవా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్ ను రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు కూడా వినియోగించుకోవచ్చు. సెకండ్ వేవ్లో కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పడు ఇంట్లోనే ఉండి కోవిసెల్ఫ్ కిట్లతో పరీక్ష చేసుకుని 15 నిమిషాల్లో కరోనా ఫలితాలు పొందొచ్చు. పూణేకి చెందిన మైల్యాబ్ డిస్కవరీ అనే సంస్థ ర్యాపిడ్ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో యాంటిజెన్ కిట్ను తయారు చేసింది. ఇప్పటికే "కోవిసెల్ఫ్" కరోనా టెస్ట్ కిట్ను గతేడాది నవంబర్లో అమెరికా ఎఫ్డీఐ అనుమతులిచ్చింది. తాజాగా ఈ కోవిసెల్ఫ్ కిట్ను ఐసీఎంఆర్ సహకారంతో ఫ్లిప్కార్ట్ మార్కెట్లో విడుదల చేసింది. రూ.250కే ఈ కిట్ను అందిస్తుండగా.. కిట్ లో టెస్ట్ కార్డ్, ట్యూబ్, డిస్పోజల్ బ్యాగ్ ఉంటాయి. చదవండి : వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
భారత్ లో థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువే : ICMR
-
అన్ని వేరియంట్లపై ఆ రెండు టీకాలు పనిచేస్తాయి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆల్ఫా, డెల్టా, గామా, బీటా లాంటి వేరియంట్లన్నింటిపై కోవిషీల్డ్, కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. డెల్టా ప్లస్ వేరియంట్పై టీకాల పనితీరుపై పరిశోధనలు జరుగుతున్నాయంది. ఆల్ఫా తదితర వేరియంట్లపై ఫైజర్, మోదెర్నా టీకాలతో పోలిస్తే కోవిషీల్డ్, కోవాగ్జిన్ల ద్వారా వచ్చిన యాంటీబాడీ స్పందన తరుగుదల తక్కువగా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. డెల్టాప్లస్ వేరియంట్ ప్రస్తుతం 12 దేశాల్లో ఉందని, భారత్లో 10 రాష్ట్రాల్లో 48 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై టీకాల ప్రభావాన్ని పరిశోధిస్తున్నామని, వారం పది రోజుల్లో వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో సంభవించిన మరణాల్లో 80 శాతం దీనివల్లనే అన్నారు -
వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైరస్ ఇన్ఫెక్షన్కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన మొట్టమొదటి అధ్యయనం విడుదలైంది. వ్యాక్సిన్ ప్రభావంపై తీసుకున్న శాంపిల్స్పై జరిగిన అధ్యయనంలో వ్యాక్సిన్ రెండు డోస్లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అంతేగాక కరోనా సోకిన వారిలో కేవలం 16% మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, 10 శాతం మంది చికిత్స కోసం ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్గా తేలింది. వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్తో పోలిస్తే కోవాగ్జిన్ తీసుకునే వారిలో 77% యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు. మెడికల్ జర్నల్ రీసెర్చ్ స్క్వేర్లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకోని కారణంగా 87 శాంపిల్స్ను ఈ అధ్యయనం నుంచి మినహాయించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న తరువాత 274 మందిలోనూ వైరస్ జాడను కనుగొన్నారు. వీటిలో 35 శాంపిల్స్(12.8%) కోవాగ్జిన్ రెండు డోస్లను తీసుకోగా, 239 శాంపిల్స్ (87.2%) కోవిషీల్డ్ రెండు డోస్లను తీసుకున్నారు. అంతేగాక కోవాగ్జిన్ రెండు డోస్లు తీసుకున్న తరువాత వైరస్ సోకిన వారిలో 43% మంది ఇటీవల వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ వార్డుల్లో పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు. అదే సమయంలో, కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత 10% మంది ఆరోగ్య కార్యకర్తలు సైతం వ్యాధి బారిన పడ్డారు. కోవిషీల్డ్ రెండు డోస్ల తర్వాత కరోనా వైరస్ సంక్రమణకు గురికావడం మధ్య సగటు వ్యవధి 45 రోజులుగా గుర్తించారు. అయితే ఈ సంక్రమణ సగటు వ్యవధి కోవాగ్జిన్ తీసుకునే వారిలో 33 రోజులుగా ఉంది. అధ్యయన సమయంలో ఒక రోగి మృతి అధ్యయనం సమయంలో కోవిషీల్డ్ రెండు డోస్లు వేసుకున్న ఒక వ్యక్తికి వైరస్ సంక్రమించి మరణించినట్లు ఐసీఎంఆర్ నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒకే ఒక్క రోగి మరణించినట్లు ప్రభుత్వం ఇప్పటివరకు సమాచారం ఇవ్వగా, ఈ అధ్యయనంలో దాని సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు కేసులు భిన్నమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయన సమయంలో హాస్పిటల్లో చేరిన 9.9%మంది: వ్యాక్సిన్ రెండు డోస్లను తీసుకున్న తరువాత కరోనా సోకిన వారిలో 9.9% మంది అధ్యయన సమయంలో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే వీరు డిశ్చార్జ్ అయ్యేందుకు కనీసం 11 రోజులు పట్టిందని, ఒక రోగి ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని నివేదికలో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావమే వ్యాక్సిన్లు వేసిన తరువాత కూడా డెల్టా వేరియంట్ సంక్రమణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వేరి యంట్ యాంటీబాడీలను గణనీయంగా తగ్గిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చిలో వచ్చిన సెకండ్ వేవ్లో నమోదైన 80%కి పైగా కేసులు డెల్టా వేరియంట్తో ముడిపడి ఉన్నాయి. ఇది వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న వారిపై కూడా కరోనా సంక్రమణ ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. -
పంజాబ్ ‘ఫ్యామిలీమ్యాన్’... వెలికి తీశాడు భారీ స్కాం
వెబ్డెస్క్ :ఇండియన్ జేమ్స్బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తరహాలో ఇటీవల ఫ్యామిలీమ్యాన్ వెబ్సిరీస్ పేరు తెచ్చుకుంది. అందులో హీరో సామాన్యుడిలా కనిపిస్తూనే చిన్న చిన్న క్లూల సాయంతో ఉగ్రవాదుల కుట్రలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ దేశ భద్రతకు భరోసాగా ఉంటాడు. అచ్చంగా ఫ్యామిలీమ్యాన్ తరమాలోనే కోట్ల రూపాయల స్కామ్ని వెలుగులోకి తెచ్చాడు పంజాబ్కి ఓ సామాన్య ఎల్ఐసీ ఏజెంట్. ఎక్కడో పంజాబ్లో ఉంటూ ఇంకెక్కడో ఉన్న హరిద్వార్లో జరిగిన ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాంని చాకచక్యంగా వెలికి తీశాడు. కేవలం ఒక ఫోన్ మేసేజ్ ఆధారంగా కోట్ల రూపాయల కుంభకోణం గుట్టురట్టు చేశారు. ఎస్సెమ్మెస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హరిద్వార్ కుంభమేళా ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కామ్ను బయటపెట్టింది ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్. పంజాబ్లోని ఫరీద్కోట్లో విపన్ మిట్టల్ ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. 2021 ఏప్రిల్ 22న అతని ఫోన్కి ఓ మేసేజ్ వచ్చింది. అందులో ‘ మీ కరోనా నిర్థారణ పరీక్షా ఫలితాలు నెగటివ్గా వచ్చాయి’ అంటూ సందేశం ఉంది. అయితే కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే ఫలితాలు రావడమేంటని ఆశ్యర్యపోయాడు విపన్ మిట్టల్. వెళ్లవయ్యా.. వెళ్లూ... ఎక్కడో, ఏదో జరుగుతోందని అనుమానించిన విపన్ వెంటనే కలెక్టర్ కార్యాలయం చేరుకుని తనకు జరిగిన అనుభవం చెప్పాడు. అయితే కలెక్టరేట్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విపన్ని కసిరారు. విషయాన్ని అక్కడితో వదిలేయకుండా తన ఫోన్కి మేసేజ్ రావడం, తాను టెస్ట్ చేయించుకోకపోవడం తదితర విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐపీఎంఆర్)కి ఈ మెయిల చేశాడు. తగు చర్యలు తీసుకుంటామంటూ అక్కడి నుంచి రిప్లై వచ్చినా... వాస్తవంలో ఏం జరగలేదు. పట్టువదలక తనకు కావాల్సిన సమాచారం ఎంతకీ రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఆర్టీఐ చట్టం కింద విపన్ మిట్టల్ దరఖాస్తు చేశాడు . అందులో హరిద్వార్లో విపన్కి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపినట్టు తేలింది. ఫరీద్కోట్లో ఉన్న వ్యక్తికి హరిద్వార్లో కరోనా టెస్ట్ నిర్వహించినట్టు రిజల్ట్ రావడం ఏంటీ ? .. అసలేం జరిగిందనే ప్రశ్నలు ప్రభుత్వ అధికారులకు తలెత్తాయి...... చివరకు ఫేక్ కరోనా టెస్ట్ స్కాం వెలుగు చూసింది. హరిద్వార్ ఆరోగ్యశాఖ అధికారులు కుంభమేళ సందర్భంగా నాలుగు లక్షల టెస్టులు చేయగా... అందులో లక్ష వరకు ఫేక్ అని తేలుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్యామిలీమ్యాన్ ఎక్కడ? ఇండియాలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాం ని వెలికి తీసిన విపన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది తెలియనివ్వడం లేదు అధికారులు. విపన్ భద్రత దృష్ట్యా అతని వివరాలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
Covid-19: పుక్కిలించిన సెలైన్తో కరోనా టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ అయిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ)నీరి సంస్థ కరోనా టెస్టింగ్కు కొత్త విధానాన్ని కనిపెట్టింది. సెలైన్ ట్యూబ్తో 3 గంటల్లో కరోనా టెస్టింగ్ ఫలితాన్ని తెలియజేసే విధానాన్ని ఆవిష్కరించింది. ఈ విధానంలో నోట్లో పుక్కిలించిన సెలైన్తో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అత్యాధునిక ల్యాబ్ అవసరం లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణ వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారికి మరింత సౌలభ్యం చేకూరనుంది. దీని వల్ల సొంతంగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. నీరి ఆవిష్కరించిన ఈ నూతన టెస్టింగ్ పద్దతికి ఐసీఎంఆర్ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. తర్వలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు -
నేడు కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ బృందం
-
దేశంలో కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ ప్రకటన
-
ఐసీఎంఆర్ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐసీఎంఆర్ 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను విడుదల చేసింది. దేశం మొత్తం మీద 24.1 శాతం మందికి కరోనా సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో 700 గ్రామాలు / వార్డులలో 28,589 మంది సాధారణ జనాభా, 7,171 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా సేకరించిన నమూనాలను పరీక్షించిన తర్వాత పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని పేర్కొంది. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే వారి ద్వారా అప్పటికే 27 మందికి వైరస్ సోకినట్లే అని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువమంది కరోనా బాధితులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శాతం 26.2 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలలో 19.1 శాతంగా ఉంది. వైద్యులు, నర్సులు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడిక్స్ స్టాఫ్ మధ్య ఎక్కువ గణాంక వ్యత్యాసం లేనప్పటికీ, వైద్యులు నర్సులలో సంక్రమణ శాతం 26.6 శాతం ఉంటే, పరిపాలనా సిబ్బందిలో 24.9 శాతంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన సర్వేలోనే వ్యాప్తి రేటు ఇంత ఉంటే మార్చి, ఏప్రిల్ లో ఏ విధంగా ఉంటుంది మనం అర్ధం చేసుకోవాలి. అందుకని, ప్రతి ఒక్కరూ కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. చదవండి: కరోనా థర్డ్ వేవ్, సెంట్రల్ యాక్షన్ ప్లాన్ -
ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్ యూజర్ మ్యాన్యువల్లో కూడా కిట్ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షలు ఇలా చేసుకోవాలి.. ఈ కిట్ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి. కోవిసెల్ఫ్ కిట్లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్ స్వాబ్ (ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునేందుకు), శాంపిల్ తీసిన తర్వాత స్వాబ్ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి. నాసల్ స్వాబ్ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్ను తెరిచి ఈ స్వాబ్ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి. స్వాబ్ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్ కార్డు ఫోటో తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మొబైల్ యాప్లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్వ్యాలిడ్గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్ కోవిడ్ టెస్టింగ్ పోర్టల్లో భద్రపరుస్తారు. పాజిటివ్గా తేలితే కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉండాలి. చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. -
జూన్ చివరికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేస్తాం
న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా టెస్ట్లు నిర్వహిస్తుండగా జూన్ నెల చివరినాటికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్కు చెందిన ‘ఇంట్లోనే చేసుకోగల ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్టింగ్ కిట్’కు ఐసీఎంఆర్ తాజాగా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో భార్గవ మాట్లాడారు. ‘మరో మూడు కిట్ల తయారీ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికి వారంలోపు అనుమతులు రావచ్చు. 105 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంపెనీలు అర్హత సాధించగా వాటిలో 41 సంస్థలకు అమనుతులు ఇచ్చాం. వీటిలో 31 స్వదేశీ సంస్థలున్నాయి. జూన్ చివరికల్లా 18 లక్షల ఆర్టీ–పీసీఆర్, 27 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కలిపి మొత్తంగా రోజుకు 45 లక్షల టెస్ట్ల సామర్థ్యం సాధిస్తాం’ అని భార్గవ తెలిపారు. ‘మెడికల్ షాప్లో టెస్ట్ కిట్ కొనండి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. యూజర్ మ్యాన్యువల్ ప్రకారం కరోనా టెస్ట్ చేసుకోండి. తర్వాత కిట్ ఫొటోను యాప్లోకి అప్లోడ్ చేసి టెస్ట్ రిజల్ట్ పొందండి’ అని భార్గవ అన్నారు. మే 3న 17.13 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 12.1 శాతానికి పడిపోయాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. -
ఇంట్లోనే కరోనా టెస్టులు.. 2, 3 రోజుల్లో మార్కెట్లోకి కిట్లు
న్యూఢిల్లీ: కోవిడ్ నిర్ధారణ పరీక్షను(ర్యాపిడ్ టెస్ట్) ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతించింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ కిట్లు మార్కెట్లోకి రానున్నాయని ప్రకటించింది. ఒక్కో కిట్ ధర రూ. 250 నిర్ణయించినట్లు ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ కరోనా టెస్టుల సంఖ్య 20 లక్షలుగా ఉండగా, ఈ సంఖ్యను ఈ నెలాఖరుకు 25 లక్షలకు, జూన్ ఆఖరుకు 45 లక్షల పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని ఆయన ప్రకటించారు. ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్ల రాకతో టెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు
న్యూఢిల్లీ: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ (ర్యాట్) కిట్కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం అనుమతి ఇచ్చింది. లక్షణాలు ఉన్నవారు, ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలినవారితో సన్నిహితంగా మెలిగివారు మాత్రమే దీన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ సంస్థ రూపొందిన ఈ కిట్ను పరీక్షించి అనుమతించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ముక్కులో నుంచి తీసిన స్వాబ్తో పరీక్ష ఉంటుందని, ఉత్పత్తిదారు యూజర్ మాన్యూవల్లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని తెలిపింది. విచ్చలవిడిగా దీనితో ఇంట్లో పరీక్షలు నిర్వహించకూడదని హెచ్చరించింది. ఈ కొత్త యాంజిజెన్ కిట్తో ఇంట్లో చేసిన పరీక్షలో పాజిటివ్గా తేలితే.. వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని పేర్కొంది. వారికి మళ్లీ టెస్టులు అవసరం లేదని పేర్కొంది. లక్షణాలు ఉండీ ఒకవేళ నెగిటివ్గా వస్తే మాత్రం... అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. వైరల్ లోడ్ తక్కువగా ఉంటే.. కొన్నిసార్లు యాంటిజెన్ పరీక్షల్లో దొరక్కపోవచ్చని వివరించింది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా... లక్షణాలుంటే వారిని కోవిడ్ బాధితులుగా పరిగణించి చికిత్స అందించాలని... ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేదాకా వీరి విషయంలో ఆరోగ్యశాఖ ఇచ్చిన హోం ఐసోలేషన్ ప్రొటోకాల్ను పాటించాలని స్పష్టం చేసింది. హోం టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉందని, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. -
ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం తీసుకున్న ఐసిఎంఆర్
-
Black Fungus: బ్లాక్ ఫంగస్పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గుబులు రేపుతోంది. నాసో ఆర్బిటల్ మెనింగ్ మ్యుకర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్రల్ మ్యుకర్ మైకోసిస్గా పిలిచే ఈ ఫంగస్ వల్ల ఇది ఉత్పన్నమై ప్రాణాపాయం వరకూ తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మెదడుకు చేరుకుని అవయవాలను పాడు చేస్తోంది. నియంత్రణలో లేని మధుమేహ రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకుతుందని నిపుణులు తేల్చారు. దీంతోపాటు సైనసైటిస్ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్పై ఆందోళన వద్దని వారు సూచించారు. మధుమేహ బాధితుల్లోనే ఎందుకంటే.. కరోనా సోకిన పరిస్థితి తీవ్రమైన వారికి స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. కరోనా తగ్గిపోవాలనే ఉద్దేశంతో మధుమేహ రోగులకు విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల మధుమేహ బాధితుల్లో ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయినా.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఫంగస్ గాలి పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా రావచ్చనేది ప్రాథమిక అంచనా. హెచ్ఐవీ బాధితులకు అనుబంధంగా టీబీ ఎలా వచ్చి వాలుతుందో మధుమేహ రోగులకు ఫంగస్ అలా చేరేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇతర కారణాలూ ఉండొచ్చు వెంటిలేటర్లను శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఆక్సిజన్పై ఉన్న రోగులకు కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది. ముక్కుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు అంటే సైనసైటిస్ వంటివి ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటీ స్టడీలు లేవని వైద్యులు చెబుతున్నారు ఇలా గుర్తించవచ్చు.. ముందుగా ముఖంలో వాపు ఉన్నప్పుడు లక్షణాలు బయటపడతాయి. కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం వంటివి కూడా దీని లక్షణాలు. జాగ్రత్తలే మందు : ఐసీఎంఆర్ మధుమేహాన్ని వీలైనంత మేరకు అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడకుండా జాగ్రత్త పడటం. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్రగ్స్ను నిలిపివేయడం. లక్షణాలు కనిపించగానే ఇంటర్నల్ మెడిసిన్/న్యూరాలజిస్ట్/ఈఎన్టీ సర్జన్/ లేదా కంటివైద్యులు/ దంత వైద్యులు/మైక్రో బయాలజిస్ట్ వంటి వారిని కలిసి చూపించుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. (చదవండి: ప్రాంతీయతత్వంతో... ప్రజల ప్రాణాలు తీస్తారా?) స్టెరాయిడ్స్ ప్రభావమే ఎక్కువ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగస్ అటాక్ అవుతుంది. దీన్నే ఆపర్చ్యునిస్టిక్ (అవకాశవాద) ఇన్ఫెక్షన్ అంటాం. సైనసైటిస్ ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నియంత్రణలో లేని షుగర్ బాధితులకే ఇది ఎక్కువగా ఉంటుంది. – డా.వరప్రసాద్, అనస్థీషియా నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి మధుమేహ నియంత్రణతో బయటపడొచ్చు బ్లాక్ ఫంగస్ కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఇమ్యునో కాంప్రమైజ్ పర్సన్స్కు ఇది వస్తుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్గా భావించే స్టెరాయిడ్స్ వాడితే ఆటోమేటిగ్గా షుగర్ పెరుగుతుంది. కరోనా తగ్గాక కూడా ప్రతిరోజూ మధుమేహంపై పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడొచ్చు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్ల నుంచి ఫంగస్ సోకుతున్న దాఖలాలను ఇంకా గుర్తించలేదు. – డాక్టర్ కిషోర్, ఈఎన్టీ సర్జన్, కర్నూలు (చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి) -
రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్నేప్ పేర్కొన్నారు. 830 మందిపై ప్రయోగాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది. వేర్వేరు టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.. ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలను మార్చి తీసుకోవద్దు.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల! -
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్కు డీసీజీఐ ఆమోదం
న్యూఢిల్లీ: 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ గురువారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. జాగ్రత్తగా అన్నీ ప్రోటోకాల్స్ పరిశీలించిన తర్వాత 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ సమయంలో టీకా 28 రోజుల వ్యవధిలో కండరాల ద్వారా రెండు డోసులు ఇవ్వనున్నట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా, ఎయిమ్స్, నాగ్పూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరగనున్నాయి. ఇక మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా, డీఎస్ఎంబీ సిఫార్సులను సీడీఎస్సీవోకు సమర్పించాలని భారత్ బయోటెక్కు కమిటీ షరతు విధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో కోవాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం మనకు తెలిసిందే. దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ లేదు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్కు అనుమతులు లభించాయి. చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి -
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నది. కోవిడ్తో ప్రాణాలు పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,120 మంది కోవిడ్తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,58,317కు చేరింది. అదే సమయంలో దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,52,181 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30,94,48,585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున నమోదు కాగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 15 వేలు, రాజస్థాన్లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/svG1KPd1PB — ICMR (@ICMRDELHI) May 13, 2021 చదవండి: మరో 6-8 వారాలు లాక్డౌన్ ఉండాలి -
కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం
సాక్షి, హైదరాబాద్: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్లో కొందరు కరోనా బాధితులకు అందిస్తున్న మందులు, అనుసరిస్తున్న చికిత్స పద్ధతుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్)లో పనిచేసిన ఆయన ఎప్పటికప్పుడు కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఈ వైరస్కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ప్రపంచానికి తెలియజేసేవారు. గతేడాది జూన్లో ఆయన పదవీ విరమణ చేశారు. తాజాగా కరోనా వైరస్, అందిస్తున్న చికిత్స పద్ధతులపై కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ వెబ్ పోర్టల్ ‘ది ప్రింట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విచ్చలవిడి చికిత్సల వల్లే.. ‘కోవిడ్ చికిత్సకు పనికిరావని నిర్ధారణ అయిన చికిత్స పద్ధతులను విచక్షణరహితంగా వాడటం వల్ల వైరస్ రూపాంతరం చెందడమే కాకుండా.. మరింత శక్తిమంతం అవుతుంది. తేలికపాటి లక్షణాలున్న వారికి కూడా రెమిడెస్విర్ వాడటం, మోస్తరు నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి ప్లాస్మా ఇస్తే వైరస్ బలం పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ రకమైన చికిత్స పద్ధతులు, మందులు వాడొద్దని వైద్యులు, ఆస్పత్రులకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. లేదా వాటిని సహేతుకమైన పద్ధతిలో వాడటమైనా అలవాటు చేయాలి. భారత్లో రూపాంతరం చెందిన వైరస్లు ఎక్కువ కావడం ఇతర దేశాలకూ ఆందోళనకరమైన అంశం. అస్పష్టమైన చికిత్సలు, మందుల వాడకం ద్వారా టీకాలకు లొంగని రూపాంతరాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఏదైనా కొత్త వ్యాధిని ఎదుర్కొనేందుకు పురాతన కాలంలో ప్లాస్మాను ఉపయోగించేవారు. భారత్లో ప్రస్తుతం దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నాం. వైరస్ సోకిన ఏడో రోజు తర్వాత ప్లాస్మా అస్సలు ఇవ్వకూడదు. వైరస్లలో లోపాలతో కూడిన పునరుత్పత్తి ఎంజైమ్లు ఉంటాయి. వీటి కారణంగానే జన్యుపరమైన మార్పులు జరుగుతుంటాయి. వైరస్తో కూడిన కణాలు ఎన్ని ఎక్కువసార్లు విభజితమైతే.. రూపాంతరం చెందేందుకు, జన్యుమార్పులను పోగేసుకునేందుకు అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ జన్యు మార్పులన్నీ ప్రమాదకరం కాకపోయినా అసమర్థమైన, అహేతుకమైన యాంటీవైరల్ మందుల వాడకం లేదా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఒత్తిడి పెంచేందుకు ప్లాస్మాను ఉపయోగించినా వైరస్ అప్రమత్తమవుతుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆ క్రమంలో వైరస్ మరింత సమర్థ, శక్తిమంతంగా మారొచ్చు.’ చదవండి: (వ్యాక్సిన్ విదేశాలకు ఎందుకంటే..) రెమిడెసివిర్తో ఇలా జరగొచ్చు.. ‘వైరస్ పునరుత్పత్తి ఎంజైమ్లన్నింటిపై కాకుండా ఏదో ఒకదానిపై రెమిడెసివిర్ ప్రభావం చూపుతుంది. ఇదికాస్తా మందు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని జన్యుమార్పులు చేసి నకళ్లు సృష్టించేందుకు వైరస్కు అవకాశం కల్పిస్తుంది. ప్లాస్మా చికిత్స వాడిన వారిలో వైరస్ 4 రెట్లు ఎక్కువ వేగంతో రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రవి గుప్తా అధ్యయనంలో తేలింది. మన దేశంలో రెమిడెసివిర్తోనూ ఆ రకమైన ఫలితాలే ఇవ్వొచ్చు. ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేని కారణంగా దేశంలో కరోనా బాధితులకు ఎప్పుడు, ఏ చికిత్స వాడాలన్న విషయంలో స్పష్టత లేదు. ఈ సమాచారం ఉంటే రోగుల బంధువులు పలానా చికిత్స కావాలంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావు. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వొద్దు. రెమిడెసివిర్ ఇస్తే ఆస్పత్రిలో ఉండే సమయం కొంత తగ్గొచ్చు. తేలికపాటి లక్షణాలున్న వారికి ఈ యాంటీవైరల్ డ్రగ్ ఇవ్వడం సరికాదు. కరోనా వైరస్ తీవ్రమయ్యే దశలో కొన్ని చికిత్సలు సక్రమంగా పనిచేయవని చాలా మందికి తెలియదు. సామాజిక మాధ్యమాల్లో లేదా వేరే మార్గాల ద్వారా తెలుసుకుని పలానా చికిత్స ఇవ్వాలని ఆస్పత్రులకు వెళ్లడం బాధాకరం.’అని డాక్టర్ గంగ ఖేడ్కర్ వివరించారు. -
మరో 6–8 వారాలు లాక్డౌన్ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరో 6 నుంచి 8 వారాల పాటు కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధిపతి డాక్టర్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సుమారు 500 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10% పైన ఉందని, ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలు ఎంతకాలం అవసరమనే విషయాన్ని డాక్టర్ భార్గవ్ వివరించారు. అయితే వైరస్ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలను సడలించాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 5% పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు 8 వారాలు పడుతుందన్నారు. ఢిల్లీ విషయాన్ని ఉదహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుందని, కానీ ఇప్పుడు అది కాస్తా 17 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ఉన్నపళంగా ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేస్తే అది మరో విపత్తుకు కారణమౌతుందని తెలిపారు. చదవండి: (ఆరోగ్య రంగం.. హైదరాబాద్కు 5వ స్థానం) -
ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ కీలక వ్యాఖ్యలు
-
ఢిల్లీలో లాక్డౌన్ ఎత్తివేస్తే పెను విధ్వంసమే: ఐసీఎంఆర్ చీఫ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. మొదట్లో లాక్డౌన్ విధించము అని చెప్పిన రాష్ట్రాల నాయకులే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ను విధిస్తున్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ దేశంలో విధిస్తున్న లాక్డౌన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితిలో లాక్డౌన్ ఎత్తివేస్తే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. బలరామ్ మీడియాతో మాట్లాడుతూ.. మొదట దేశంలో అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను గుర్తించాలి. ఆపై ఆ ప్రాంతాలలో కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాలి. అలాగే భారతదేశంలోని 718 జిల్లాల్లో మూడింట నాలుగవ వంతు టెస్ట్-పాజిటివిటీ రేటు 10% పైన ఉంది. కనుక పాజిటివిటీ రేట్ ఉన్న జిల్లాల్లో కనీసం 8 వారాలు లాక్డౌన్ విధించాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో దాదాపు 90 శాతం అధిక పాజిటివిటీ నమోదవుతోంది. దీని అడ్డుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుంది. ఇక న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు టెక్ హబ్ వంటి ప్రధాన నగరాలు అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావడంతో అక్కడ కేసులు విపరీతంగా పెరగుతున్నాయి. ఇక అక్కడి ప్రభుత్వాలే కాక ప్రజలు కూడా వైరస్ కట్టడికి నివారణా చర్యలను పాటిస్తూ, లాక్డౌన్కు సహకరించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకుండా దూరంగా ఉండి, దానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలి వేశారు’’అని ఆయన అన్నారు. ( చదవండి: కోవిడ్ కల్లోలం: ఒక్కరోజే 4,205 మంది మృతి ) -
యువతపై సెకండ్ వేవ్ పంజా, కారణం ఏంటో చెప్పిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు. అందుకు కారణం యువత నిర్లక్ష్యంగా ఉండడమే. కోవిడ్ నిబంధనల్ని పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యువత పెద్ద సంఖ్యలో గుమిగూడడం ఓ కారణమని తెలిపారు. అయితే కొవిడ్ -19 మొదటి వేవ్, రెండో వేవ్ కేసుల్ని పరీక్షించగా పెద్దగా వయస్సు వ్యత్యాసం లేదన్నారు. 40 ఏళ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే 2020లో మొదటి వేవ్లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 31 శాతం మంది ఉన్నారు. 2021లో ఈ శాతం 32కి చేరుకుందని కేంద్రం మార్చిలో తెలిపింది. కాగా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. -
‘బ్లాక్ ఫంగస్’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి..
సాక్షి, న్యూఢిల్లీ: సూరత్లో కొద్ది రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న ఎనిమింది మంది కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించేలోపే వారి జీవితాలు అంధకారం అయ్యాయి. వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్ ఫంగస్. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్ను గుర్తించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్ మాదిరి ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏమిటి బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్, ‘మ్యూకోర్మైకోసిస్’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్’ అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించడం ఎలా... బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్ లెవల్స్ సడెన్గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి. ఏం చేయాలి.. రక్తంలో షుగర్ లెవల్స్ని అదుపులో ఉంచుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ని పరీక్షించుకోవాలి. సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి. ఆక్సిజన్ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవచ్చు. నిరోధించడం ఎలా.. బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి. వీలైనంత వరకు శరీరం మొత్తం కవర్ అయ్యేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. Evidence based Advisory in the time of #COVID-19 (𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠, 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬 & 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐌𝐮𝐜𝐨𝐫𝐦𝐲𝐜𝐨𝐬𝐢𝐬) @MoHFW_INDIA @PIB_India @COVIDNewsByMIB @MIB_India #COVID19India #IndiaFightsCOVID19 #mucormycosis #COVID19Update pic.twitter.com/iOGVArojy1 — ICMR (@ICMRDELHI) May 9, 2021 ‘మ్యూకర్మైకోసిస్’ అంటే మ్యూకోర్మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్మైకోసిస్కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే చికిత్సతో బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి -
అంతరాష్ట్ర ప్రయాణాలపై ఐసీఎంఆర్ గైడ్లైన్స్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో పాటు.. అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇతర రాష్ట్రాల వారు తమ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అంతరాష్ట్ర ప్రయాణాలకు సంబందించి కీలక సూచనలు చేసింది. పూర్తి ఆరోగ్యంగా ఉండి.. ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసేవారికి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వులు ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఊరటనిస్తాయి. ఇప్పటికే లాక్డౌన్ విధించిన పలు రాష్ట్రాల్లో ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దాంతో సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలున్న వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరం అనుకున్న వారు టెస్ట్లకు వెళ్తున్నారు. దాంతో కోవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతుంది. దేశంలో పెరుగుతున్న కేసులతో ఇప్పటికే పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. దీన్ని తగ్గించడం కోసమే ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. ఆర్టీపీసీఆర్ ద్వారా ఒక్కసారి పాజిటివ్ వచ్చిన వ్యక్తికి తరచుగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న వ్యక్తికి డిశ్చార్జ్ సమయంలో మరోసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సీబీఏనాట్తో పాటు ఇతర ప్లాట్ఫారమ్లతో కలిపి మొత్తం 2,506 మాలిక్యులర్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ప్రతి రోజు మూడు-షిఫ్ట్ల ద్వారా 15 లక్షల పరీక్షలు చేయగల సామార్థ్యం వీటి సొంతం. చదవండి: కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు! -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫీవర్ సర్వే
-
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కట్టడే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు మే 7 నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. రాష్ట్రంలో గతంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించారు. అంతేకాకుండా వారికి వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి.. లక్షణాలు ఉన్నవారికి అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు అందించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక యాప్లో నమోదు.. ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉంటే.. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి.. వారి వయసు వంటి వివరాలను ఏఎన్ఎంకు తెలియజేయాలి. ఏఎన్ఎం ఈ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. తర్వాత జ్వర లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో కరోనా పాజిటివ్గా తేలితే.. వెంటనే 104 కాల్సెంటర్కు ఫోన్ చేసి తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వలా లేదా కోవిడ్ కేర్ సెంటర్కు పంపడం లేదా ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు. ముందుగానే గుర్తించి ఐసొలేషన్కు పంపే అవకాశం.. ఈ నెల 4న ఐసీఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించాల్సిన పనిలేదని.. ఆయా కేసులను పాజిటివ్గానే గుర్తించి.. వారికి వైద్య సేవలు అందించాలని సూచించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా కలెక్టర్లు, జిల్లా డీఎంహెచ్వో (ఆరోగ్యశాఖ అధికారులు)లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫీవర్ సర్వేలో ఆశా కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు అనుసరించాలని సూచించింది. సర్వే చేయడం వల్ల బాధితులను ముందుగానే గుర్తించి ఐసొలేషన్కు పంపే అవకాశం ఉంటుందని, తద్వారా కోవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రతి కంటైన్మెంట్ జోన్లోనూ ఫీవర్ క్లినిక్స్ నిర్వహించి వైద్యం అందిస్తామన్నారు. -
కరోనా: ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
న్యూఢిల్లీ: ఐబూప్రూఫెన్ లాంటి కొన్ని పెయిన్ కిల్లర్లు కరోనా కారక ఇబ్బందులను మరింత పెంచుతాయని, హృద్రోగ, కిడ్నీ పేషెంట్లకు ఇవి ప్రమాదకారులని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కరోనా సమయంలో నొప్పుల బాధకు ఎన్ఎస్ఏఐడీఎస్ (నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డగ్స్ర్)ను తీసుకోవద్దని, వీటి బదులు అవసరమైతే పారసిటమాల్ టాబ్లెట్లను వాడాలని సూచించింది. బీపీ, సుగర్, హృద్రోగులు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. సూచనలు, సలహాలు... ► బీపీకి వాడే ఏసీఈ ఇన్హిబిటర్లు(రామిప్రిల్ లాంటివి) కానీ, ఏఆర్బీలు(లోసార్టిన్ లాంటివి) కానీ కరోనా తీవ్రతను పెంచుతాయనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. నిజానికి ఈ మందులు హృదయం పనితీరుకు మేలు చేయడంతోపాటు, అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అందువల్ల సొంతంగా వీటిని మానేయాలనే నిర్ణయం తీసుకోవద్దు. అలా చేస్తే హృదయ సంబంధిత ముప్పు పెరుగుతుంది. ► కరోనా సోకిన రోగుల్లో 80 శాతం మందికి శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. అయితే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు అధికమనే వాదన ఉంది. కానీ ఈ వాదన నిజం కాదు. ఈ సమస్యలున్నవారిలో కొందరికి మాత్రం కోవిడ్ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల ఈ బాధలున్నవారు అధిక జాగ్రత్త తీసుకోవడం మంచిదే! షుగర్ అదుపులోలేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ల రిస్కు ఎక్కువ. ► కోవిడ్ సోకినా సరే ఇప్పటికే వివిధ సమస్యలకు మందులు వాడుతున్నవారు వాటిని కొనసాగించాలి, కేవలం డాక్టర్ సూచిస్తేనే మానేయాలి. ► సమూహాల్లోకి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి. మాస్కును మూతి, ముక్కు, గడ్డం కవర్ చేసేలా ధరించాలి. దీంతోపాటు, సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్ను కంట్రోల్ చేయవచ్చు. ► కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే గైడ్లైన్స్ ప్రకారం ఐసోలేషన్ పాటించాలి, పరిస్థితి విషమిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ► మద్యపానం, ధూమపానం మానేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్దమైన వ్యాయామం చేయడం, బీపీ, సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, కరోనా గైడ్లైన్స్ను కచ్ఛితంగా పాటించడం ద్వారా ప్రజలు కరోనాను కట్టడి చేయవచ్చు. చదవండి: Last 24 Hours: అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు -
కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. ప్రాణం పోయిన అనంతరం చితిపైకి చేరేందుకు సైతం పార్థ్ధివ దేహాలతో కుటుంబసభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి..ఇవీ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు..! కరోనా మహమ్మారి సంక్రమణలో దేశం రోజుకో రికార్డును బద్దలుకొడుతోంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన సమయంలో మన దేశంలోని భారీ జనాభా దృష్ట్యా పరిస్థితులు చేజారవచ్చని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, లాక్డౌన్ లాంటి కఠిన చర్యలతో పరిస్థితులు ఎలాగోలా అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ ఏడాది సెకండ్ వేవ్ మాత్రం దేశంలో భారీ విస్పోటనం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్ తిరగరాస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా 3,14,835 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచదేశాల్లో కేవలం ఒక్క రోజులోనే నమోదైన కేసులలో ఇదే అత్యధికం. అంతకుముందు ఈ ఏడాది జనవరి 8న అమెరికాలో అత్యధికంగా 24 గంటల్లో 3.07లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి 10 రాష్ట్రాల్లోనే 75.66% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు 1,59,30,965కు చేరాయి. 1.33 లక్షలు పెరిగిన యాక్టివ్ కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ గణనీయ మార్పు వచ్చింది. గత 24 గంటల్లోనే 1.33 లక్షల యాక్టివ్ కేసులు పెరిగి ఆ సంఖ్య 22,91,428కి చేరుకుంది. అదే çసమయంలో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,104తో మొత్తం 1,84,657కు చేరింది. మరణాల రేటు ప్రస్తుతం 1.16% వద్ద నిలకడగా ఉంది. బ్రెజిల్ తరువాత, ప్రపంచంలో ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. మిగతా అన్ని దేశాల్లోనూ వెయ్యిలోపే మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో దేశంలో 1.79 లక్షల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు రికవరీల్లో ఇది ఒక రికార్డు. మరోవైపు, కరోనా ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 శాంపిల్స్ను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తంగా 27 కోట్ల 27 లక్షల 5 వేల 103 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య గురువారానికి 13.23 కోట్లు దాటింది. 24 గంటలలో 22 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 96వ రోజైన ఏప్రిల్ 21వ తేదీన 22,11,334 వ్యాక్సిన్ డోసులిచ్చారు. అందులో 15,01,704 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 7,09,630 మందికి రెండో డోస్ ఇచ్చారు. -
మొదటి డోసు తీసుకున్న 21 వేల మందికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: మొదటి డోసుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా తీసుకున్న సుమారు 21 వేల మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, రెండో డోసు తీసుకున్నాక కూడా 5,500 మంది ఈ మహమ్మారి బారినపడ్డారని కేంద్రం తెలిపింది. రెండో డోసుగా కోవాగ్జిన్ తీసుకున్న 17,37,178 మందిలో 0.04% మంది, కోవిషీల్డ్ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 0.03% మంది ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. టీకాలు వైరస్ వ్యాప్తిని, మరణాలను తగ్గించాయన్నారు. అయితే, టీకా తీసుకున్న తర్వాత కూడా వ్యాధి బారినపడటాన్ని బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్గా పిలుస్తారని ఆయన తెలిపారు. ఇలాంటి కేసులు, ప్రతి 10వేల మందిలో 2 నుంచి 4 వరకు ఉన్నాయని ఆయన అన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘కోవాగ్జిన్ టీకా 1.1 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4,208 మంది, అంటే 0.04% మంది కోవిడ్ బారినపడ్డారు. ఈ టీకాను రెండో డోసుగా తీసుకున్న 17,37,178 మందిలో 695 మంది, అంటే 0.04% మందికి పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కోవిషీల్డ్.. మొత్తం 11.6 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి వైరస్ సోకింది. కోవిషీల్డ్ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 5,014 మంది, అంటే 0.03% మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారు’అని వివరించారు. -
వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు
సాక్షి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సెకండ్వేవ్లో ఉధృతి ఆందోళన కరంగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఆసుపత్రులలో మందులు, బెడ్లు దొరకక, వెంటిలేటర్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా ప్రభావిత రాష్ట్రాలు, డిల్లీ, మహారాష్ట పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత చోటు చేసుకుంటున్నఘటనలు, కొన్ని విషాదకర వార్తలతో అనేక భయాందోళలను నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంచలన డేటాను విడుదల చేసింది. టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్ డేటా తేల్చంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత వైరస్ సోకుతున్న వారి నిష్పత్తి సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని ఈ డేటా తెలిపింది. టీకా మొదటి లేదా రెండవ మోతాదు తీసుకున్న చాలా రోజుల తరువాత కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తుల డేటాను ఐసిఎంఆర్ నిపుణుల బృందం వెల్లడించింది. (కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అందించారు. కోవాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సుమారు 93 లక్షల మంది తమ మొదటి మోతాదును, సుమారు 17 లక్షల మంది రెండవ మోతాదును పొందారు. మొదటి మోతాదు పొందిన 93 లక్షలమందిలో 4,208 మందికి, రెండవ షాట్ తీసుకున్న 17 లక్షలలో, 695 మంది మాత్రమే కరోనా సోకిందన్నారు. అలాగే సీరం ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ రెండవ మోతాదు తీసుకున్న తరువాత పాజిటివ్ పరీక్షించిన వారి శాతం 0.03 శాతంగా ఉంది. దాదాపు 10 కోట్ల మంది కోవిషిల్డ్ మొదటి మోతాదును స్వీకరించగా వీరిలో 17,145 మంది తొలి డోసు తర్వాత 1.5 కోట్లకు పైగా ప్రజలకు రెండవ మోతాదు ను తీసుకోగా, వీరిలో, 5,014 మంది పాజిటివ్ పరీక్షించారు. కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల నిష్పత్తి మొదటి మోతాదు తర్వాత 0.02 శాతం, రెండవ మోతాదు తర్వాత 0.03 శాతంగా ఉంది. అలాగే కరోనా టీకా తీసుకున్న తరువాత ప్రతి 10,000 జనాభాకు 2-4 మందికి మాత్రమే కోవిడ్-19 సోకుతోందనీ, ఆ తర్వాత వ్యాధి బారినపడే వారి శాతం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ అన్నారు. (కరోనా బారిన మరో కేంద్ర మంత్రి) కోవిషీల్డ్ 70 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కోవాక్సిన్ తన 3 వ దశ ట్రయల్స్లో 81 శాతం మధ్యంతర సామర్థ్యాన్ని చూపించిందని వెల్లడించారు. రెండవ మోతాదు తీసుకున్న 10-15 రోజుల తరువాత మాత్రమే తగినంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 87 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 79 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్మికులు తమ మొదటి మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్లను స్వీకరించారని చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 130 మిలియన్ల టీకాలను అందించారు. (ఉన్నట్టుండి పేలిన ఫోన్, జనం హడల్: వైరల్ వీడియో) #IndiaFightsCorona: 📍Post Vaccination break through infection (As on 20th April, 2021). - DG, @ICMRDELHI #We4Vaccine #LargestVaccinationDrive #Unite2FightCorona pic.twitter.com/xMNpyfxyBb — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 21, 2021 -
ఆ సమస్య కరోనా సెకండ్వేవ్లో ఎక్కువే..!
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటిదాకా కోవిడ్–19 మహమ్మారి బారినపడిన బాధితుల్లో 70కిపైగా శాతం మంది 40 ఏళ్ల వయసు దాటినవారే. మొదటి వేవ్, ప్రస్తుతం కొనసాగుతున్న రెండో వేవ్లో అత్యధిక శాతం మంది బాధితులు వయోధికులే కావడం గమనార్హం. ఎక్కువ వయసున్న వారికి కరోనా సులభంగా సోకుతోందని, వారు ఈ వైరస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. కరోనా సోకి, పరిస్థితి విషమించి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా సంభవించిన మరణాల విషయంలో మొదటి వేవ్కు, రెండో వేవ్కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తెలిపారు. కానీ, మెడికల్ ఆక్సిజన్ అవసరం మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్లో అధికంగా ఉందని వెల్లడించారు. ఫస్ట్ వేవ్లో 41.5 మంది బాధితులకు ఆక్సిజన్ అవసరం కాగా, సెకండ్ వేవ్లో 54.5 శాతం మందికి అవసరమవుతోందని చెప్పారు. వెంటిలేటర్ అవసరం మాత్రం తక్కువగానే ఉందన్నారు. కరోనా సోకితే ఊపిరి అందకపోవడం అనే సమస్య సెకండ్ వేవ్లో స్వల్పంగా పెరిగిందన్నారు. గొంతు నొప్పి, పొడి దగ్గు తదితర ఇతర లక్షణాలు ఫస్ట్ వేవ్లోనే ఎక్కువగా కనిపించాయని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు కనిపించని బాధితులు రెండో వేవ్లోనే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫస్ట్ వేవ్లో 7,600 మందిపై, సెకండ్ వేవ్లో 1,885 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించామన్నారు. చదవండి: (లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్) యువతకు కరోనా ముప్పు విషయంలో రెండు వేవ్ల మధ్య పెద్దగా తేడా లేదని నీతి ఆయోగ్(హెల్త్) సభ్యుడు వి.కె.పాల్ చెప్పారు. మొదటి వేవ్ బాధితుల్లో 31 శాతం మంది 30 ఏళ్లలోపు వారని, రెండో వేవ్ బాధితుల్లో 32 శాతం మంది 30 ఏళ్లలోపు వారని వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నవారికి రెమ్డెసివిర్ ఇంజక్షన్ అవసరం లేదన్నారు. ఆసుపత్రిలో చేరి, ఆక్సిజన్పై ఉన్నవారికి మాత్రమే ఈ ఇంజక్షన్ ఇవ్వాలని సూచించారు. చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి) -
దేశంలో కరోనా మరణ మృదంగం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వరుసగా నాలుగో రోజు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఏకంగా 2,61,500 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ మరణ శాసనం రాస్తోంది. మరో 1,501 మందిని బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు, మరణాల సంఖ్య 1,77,150కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు క్రియాశీల(యాక్టివ్) కరోనా కేసులు వరుసగా 39వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 18,01,316కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.18 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 86.62 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు గత ఏడాది ఆగస్టు 7న 20 లక్షల మార్కును, ఆగస్టు 23న 30 లక్షల మార్కును, సెప్టెంబర్ 5న 40 లక్షల మార్కును, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్కును, నవంబర్ 20న 90 లక్షల మార్కును, డిసెంబర్ 19న కోటి మార్కును దాటేశాయి. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17 వరకూ 26,65,38,416 నమూనాలను పరీక్షించారు. శనివారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించారు. దేశంలో కరోనా వల్ల 1,77,150 మంది మరణించగా, వీరిలో 59,970 మంది మహారాష్ట్రలో, 13,270 మంది కర్ణాటకలో, 13,071 మంది తమిళనాడులో, 11,960 మంది ఢిల్లీలో, 10,540 మంది పశ్చిమ బెంగాల్లో, 9,703 మంది ఉత్తరప్రదేశ్లో, 7,834 మంది పంజాబ్లో కన్నుమూశారు. భారత్లో కరోనా బారినపడి మృతిచెందిన వారిలో 70 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 162 పీఎస్ఏ ప్లాంట్లు మంజూరు దేశంలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లను నెలకొల్పేందుకు అంగీ కారం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ప్లాంట్ల ద్వారా ఆసుపత్రులు తమకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే నేషనల్ గ్రిడ్పై భారం తగ్గిపోతుంది. మొత్తం 162 పీఎస్ఏ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాట్లు చేస్తారు. వీటితో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 154.19 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇప్పటికే 33 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, చండీగఢ్లో 3, గుజరాత్లో 3, ఉత్తరాఖండ్లో 3, బిహార్లో 2, కర్ణాటకలో 2, తెలం గాణలో రెండు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహా రాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, యూపీరాష్ట్రాల్లో ఒక్కో టి చొప్పున నెలకొల్పుతున్నారు. దేశంలో ఏప్రిల్ ఆఖరుకల్లా మరో 55, మే చివరికిమరో 80 పీఎస్ఏ పాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 162 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే రూ.201.58 కోట్ల భారాన్ని కేంద్రమే భరిస్తోంది. ఇక ఆక్సిజన్ రైళ్లు దేశంలో కోవిడ్–19 ఉధృతరూపం దాల్చడంతో ఆక్సిజన్ సిలండర్లకి డిమాండ్ బాగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్కి కొరత ఏర్పడడంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ముంబైకి సమీపంలోని కలంబొలి, బోయిసార్ స్టేషన్ల నుంచి ఖాళీ ట్యాంకర్లు తీసుకొని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు సోమవారం తన ప్రయాణం ప్రారంభిస్తాయి. వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారోలలో లిక్విడ్ ఆక్సిజన్ను నింపుకొని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారం వెల్లడించారు. పరిశ్రమలకు ఆక్సిజన్ బంద్ పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల ను ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తద్వారా మెడికల్ ఆక్సిజన్ సరఫరా పెరిగి విలువైన ప్రాణాలను కాపాడుకోగలమని పేర్కొంది. ఈనెల 22 నుంచి ఇది ఈ నిషేధం అమలులోకి రానుంది. తొమ్మిది రకాల పరిశ్రమలకు దీనినుంచి మినహాయింపునిచ్చారు. పాజిటివిటీ రేటు 12 రోజుల్లోనే రెట్టింపు భారత్లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కేవలం 12 రోజుల్లోనే రెట్టింపయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8 శాతంగా ఉండేది. 12 రోజుల్లో ఇది 16.69 శాతానికి చేరింది. అంటే ప్రతి 100 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16.69 శాతం పాజిటివ్గా తేలుతున్నాయి. వీక్లీ పాజిటివ్ రేటు నెల రోజుల్లో 3.05 శాతం నుంచి 13.54 శాతానికి ఎగబాకింది. అత్యధికంగా వీక్లీ పాజిటివ్ రేటు చత్తీస్గఢ్లో 30.38 శాతం, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్తాన్లో 23.33, మధ్యప్రదేశ్లో 18.99 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. కరోనా వల్ల తాజాగా మరణించిన 1,501 మందిలో మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. 92 రోజుల్లో 12,26,22,590 డోసులు అగ్రరాజ్యం అమెరికాలో 12 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వడానికి 97 రోజులు పట్టింది. చైనాలో అయితే 108 రోజులు పట్టింది. భారత్లో మాత్రం కేవలం 92 రోజుల్లోనే 12 కోట్లకుపైగా టీకాలు డోసులు అర్హులకు ఇవ్వడం గమనార్హం. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రభాగాన నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ భారత్లో ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 18,15,325 సెషన్లలో 12,26,22,590 టీకా డోసులను అర్హులకు అందజేశారు. మొత్తం డోసుల్లో 59.5 శాతం డోసులను ఎనిమిది రాష్ట్రాల్లోనే ఇవ్వడం విశేషం. నాలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా చొప్పున డోసులను అందజేశారు. గుజరాత్లో 1,03,37,448, మహారాష్ట్రలో 1,21,39,453, రాజస్తాన్లో 1,06,98,771, ఉత్తరప్రదేశ్లో 1,07,12,739 డోసులు ఇచ్చారు. గుజరాత్లో ఏప్రిల్ 16 నాటికి కోటి డోసుల పంపిణీని పూర్తి చేయగా, మిగతా మూడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 నాటికి కోటి డోసుల పంపిణీ పూర్తయ్యింది. కరోనా వ్యాక్సినేషన్లో 92వ రోజు శనివారం 26,84,956 డోసులు ఇచ్చారు. -
ఒక్కరోజులో 2,17,353 కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు. 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే... దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి. 11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు.. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు. యడియూరప్పకు మళ్లీ కరోనా కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్లకూ కరోనా సోకింది. -
‘అందరూ ఇలా చేస్తే సెకండ్ వేవ్ను అడ్డుకోవచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణ కట్టడి సాధ్యమే అని ఐసీఎంఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కానీ గతంలో మాదిరిగా భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్–19 కోసం ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్లోని ఆపరేషనల్ రీసెర్చ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఏమాత్రంలేదని పేర్కొన్నారు. అంతేగాక సంక్రమణను అడ్డుకొనేందుకు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో, సూక్ష్మ స్థాయిలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, మాస్క్ ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దుమ్ము నుంచి కాపాడుకొనేందుకు కండువాలు మొహానికి అడ్డంగా పెట్టుకోవడం, మహిళలు చున్నీల వంటి వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు కరోనా విషయంలో ప్రజల్లో చాలా భయం ఉండేది. పండ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తరువాత కనీసం ఐదారు గంటలు పక్కన పెట్టేవారు. అయితే నెమ్మదిగా ప్రజల్లో కరోనా భయం పోయిందని, కరోనాను నివారించడానికి ప్రజల్లో కనీసం ఉండాల్సిన భయం తప్పనిసరి అని డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు కచ్చితంగా ఉపయోగించడం కొనసాగిస్తే, కరోనా సెకండ్ వేవ్ మూడు, నాలుగు వారాల్లో ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో ఒకచోట కలిసి కూర్చొనే పరిస్థితుల్లో, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం తప్పనిసరిగా మాస్క్లు ధరించాలనిన్నారు. కేవలం ఎన్–95 మాస్క్లు మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న క్లాత్ మాస్క్లను అయినా వాడుకోవచ్చన్నారు. మాస్క్లను ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు. -
COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ...
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: దాదాపు నెల రోజుల నుంచి కరోనా బెంబేలెత్తిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతూ ఉండగా, డబులింగ్ టైమ్ తగ్గుతూ వస్తోంది. దేశంలో గత 24 గంటల్లో ఏకంగా 68,020 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 11 తర్వాత.. ఒకరోజు వ్యవధిలో నమోదైన అధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,843 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,13,55,993కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.32 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,21,808గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.33 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 24,18,64,161 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం 9,13,319 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. 8 రాష్ట్రాల్లో.. దేశంలో సోమవారం నమోదైన కేసుల్లో 84.5శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో 40,414, కర్ణాటకలో 3,082, పంజాబ్లో 2,870, మధ్యప్రదేశ్లో 2,276 గుజరాత్లో 2,270, కేరళలో 2,216, తమిళనాడులో 2,194, ఛత్తీస్గఢ్లో 2,153 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాల్లోనే 80.17శాతం యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ 6.05 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. రిషికేశ్ తాజ్ హోటల్లో 76 మందికి కరోనా ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్లోని తాజ్ హోటల్లో ఏకంగా 76 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో మూడు రోజుల పాటు హోటల్ను మూసేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా హోటల్ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతవారంలోనే 16 కేసులు రావడంతో 48 గంటల పాటు హోటల్ను మూసేశారు. తాజా కేసులతో మూడు రోజుల పాటు మూసివేశారు. దీంతో పాటు ఇటీవల డెహ్రాడూన్లోని నెహ్రూ కాలనీ, రిషికేశ్లోని గుమనివాలా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి పూర్తి స్థాయి నిబంధనలు విధించిన నేపథ్యంలో తాజా కేసులు బయట పడటంతో ఈ ప్రాంతాల్లోని బ్యాంకులు, షాపులు, ఆఫీసులను కూడా మూసేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు కూడా కేవలం ఇంటికొకరే బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. హరిద్వార్లో తాజాగా 73 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. -
45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా!
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతుండటం, ప్రాధాన్యతావర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇకపై, 45 ఏళ్లు పైబడిన అందరినీ వ్యాక్సినేషన్ డ్రైవ్లో చేర్చాలనే యోచన చేస్తోంది. దీనిపై కసరత్తు కొనసాగుతోందనీ, అంతిమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని జాతీయ కోవిడ్–19 నిర్వహణ బృందం(నెగ్వ్యాక్) సభ్యుడు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన సమీరన్ పాండా చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ మొదలయ్యాక, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, వృద్ధు్దలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. దీంతో, వ్యాక్సినేషన్ గ్రూప్లోకి మరింత మందిని చేర్చాలంటూ తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగతా వయస్సుల వారిని కూడా వ్యాక్సినేషన్ గ్రూప్లో చేర్చే విషయమై ప్రస్తుతం వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం టీకా అందిన 3.5 కోట్ల మందికిగాను 1.38 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి మొదటి డోసు అందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో రోజుకు 1.25 లక్షల మందికి దేశ రాజధానిలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న కోవిడ్–19 కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రోజుకు టీకా పంపిణీ అయ్యే వారి సంఖ్యను 40 వేల నుంచి 1.25 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గడిచిన మూడు రోజులుగా రోజుకు 500 చొప్పున కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, ఇవి ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటాయన్నారు. నిబంధనలను సడలించి, అందరికీ టీకా అందుబాటులోకి తేవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి అందరినీ చేర్చి, డోసులను అవసరమైన మేర అందుబాటులో ఉంచితే ఢిల్లీలో మూడు నెలల్లో అందరికీ టీకా అందుతుందన్నారు. -
మళ్లీ ముదురుతున్న కరోనా
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు తప్పినట్టేనని దాదాపు అందరూ ఆశిస్తున్న సమయంలో అది కొత్త రూపాల్లో అలుముకుంటున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కరోనా రెండో దశగా భావించవచ్చునా లేదా అన్నది నిపుణులు నిర్ధారించాకే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఏడు రోజుల సగటు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి శాతం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. గత సెప్టెంబర్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా 98,000 వరకూ వుండగా, ఆ తర్వాత అది తగ్గుముఖంలో వుంది. ఈ నెల 11న కొత్త కేసుల నమోదు అత్యల్పంగా...అంటే 10,988 మాత్రమే వుండగా ఆ తర్వాత మళ్లీ క్రమేపీ పెరగటం మొదలుపెట్టాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్లలో కేసుల శాతం శరవేగంగా పెరగటం వల్ల జాతీయ సగటులో అది ప్రతిఫలిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలోనైనా అంతక్రితం కన్నా కేసులు పెరుగుతున్నాయి. మొత్తంగా గత 24 గంటల్లో కొత్త కేసులు 30 శాతం పెరిగాయని తాజా సమాచారం. అందుకే కొత్త కేసుల సంఖ్య బాగా పెరుగు తున్న రాష్ట్రాల్లో కరోనా టీకాల జోరు పెరగాలంటూ కేంద్రం లేఖలు రాసింది. అలాగే దీనికి సంబంధించి రెండో దశ వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఈసారి 60, అంతకన్నా ఎక్కువ వయసున్నవారికి టీకాలందిస్తారు. కొత్తగా బయటపడుతున్న కేసులను పూర్తిగా విశ్లేషించాకే వ్యాధి కారక వైరస్ పాతదా, కాదా అనేది తేలుతుంది. ఉత్పరివర్తనం వైరస్ ప్రధాన గుణం. ఒకపక్క దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన టీకా తయారీ ప్రక్రియ కొనసాగుతుండగానే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నకొద్దీ ఏ వైరస్ జన్యు అమరికైనా మారిపోతుంటుంది. మహారాష్ట్రలో బ్రిటన్కు చెందిన రెండు రకాల వైరస్లు–ఎన్440కె, ఈ484కె రకం కనబడ్డాయి. ఈ రకాలే కేరళ, తెలంగాణలనుంచి వచ్చిన శాంపిల్స్లో కూడా వున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డెరైక్టర్ జనరల్ చెబుతున్నారు. ఇవిగాక బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో బయటపడిన మరో రెండు రకాల కరోనా వైరస్లు కూడా ఇతరచోట్ల కనబడ్డాయి. ఇప్పుడు పెరిగిన కేసుల్లో ఈ రకం వైరస్ల శాతమెంతో ఇంకా తేల్చాల్సివుంది. అలాగే వాటి వ్యాప్తి ఎంత వేగంతోవుందో కూడా చూడాల్సివుంది. బ్రిటన్లో బయటపడిన కరోనా కొత్త రకాలకు మౌలికమైన కరోనా వైరస్తో పోలిస్తే 25 నుంచి 40 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం వున్నదని నిపుణులు తేల్చారు. వైరస్ రూపం మార్చుకుంటే దానివల్ల రోగుల్లో కనబడే లక్షణాలు మారతాయి. కరోనా నియంత్రణకు వినియోగిస్తున్న టీకాలు ఈ కొత్త రకాలను ఎదుర్కొనేంత సమర్థత కలిగివున్నాయా లేదా అన్నది తేలాల్సివుంది. అయితే మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించటం టీకా చేసే పనిగనుక వైరస్ కొత్త రూపంలో వచ్చినా ఆ వ్యవస్థ తన పని తాను చేస్తుందని నిపుణులు చెబుతారు. కానీ ఎన్440కె రకం వైరస్ మాత్రం రోగ నిరోధక వ్యవస్థకు దన్నుగా వుండే ప్రతిరక్షక కణాలను బేఖాతరు చేసిందని తాజాగా బయటపడింది. అంటే ఇప్పుడు రూపొందించిన టీకాకు అది లొంగలేదని అర్థం. ఆ వైరస్ రకం జన్యు అమరిక ఎలావుంది... ఇప్పుడు లభ్యమయ్యే ఇతర టీకాలకైనా అది లొంగే స్థితిలో వుందా లేదా అన్నది మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప తేలదు. అందుకోసం విస్తృతమైన డేటా అవసరమవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, మరికొన్ని ఇతర రాష్ట్రాలకు కేంద్రంనుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాయి గనుక అవి ఆ పనిలో వుంటాయి. వివిధ జంతువుల్లో వుండే వందలాది రకాల కరోనా వైరస్లలో మనుషులకు సోకే గుణమున్న వైరస్లు ఏడు రకాలని నిపుణులు తేల్చారు. మనుషుల్లో తొలి కరోనా వైరస్ను 1965లో కనుగొన్నాక, వాటివల్ల వచ్చే వ్యాధుల తీవ్రత, అందు వల్ల కలిగే ప్రమాదాలూ పెరుగుతూనే వున్నాయి. కోవిడ్–19 అటువంటిదే. దానివల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 లక్షలమంది మరణించారు. తాజా పరిణామాలు గమనించాక కరోనా వైరస్ విషయంలో ఇంతక్రితంలాగే జనమంతా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని అర్థమవుతుంది. వైరస్ బెడద తొలగి పోయిందని చాలామంది ఇప్పటికే భావించటం మొదలుపెట్టారు. బయటికెళ్లినప్పుడు పాటిం చాల్సిన ముందుజాగ్రత్తల్ని గాలికొదిలేస్తున్నారు. మాస్క్లు ధరించటం, శానిటైజర్ వాడటం తగ్గింది. వేడుకలు, ఉత్సవాలు, ఊరేగింపులు కూడా జోరందుకున్నాయి. భౌతిక దూరం పాటిస్తున్న జాడ లేదు. బయటపడ్డాయంటున్న కొత్త రకం వైరస్ రకాల లక్షణాల గురించి విన్నాకైనా ఈ విషయంలో అప్రమత్తత అవసరం. ఏ రాష్ట్రంలోనైనా కేసులు పెరుగుదల కనబడుతున్నదంటే అక్కడినుంచి రాకపోకలు ఎక్కువగా వుండే ఇరుగుపొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోక తప్పదు. ఒకసారి అనుభవమైంది గనుక ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటేనే లాక్డౌన్ల బెడద తప్పుతుంది. ఈ లాక్డౌన్ల విషయంలోనూ కొన్ని చేదు అనుభవాలున్నాయి గనుక ఎక్కడెక్కడ నిబంధనలు కఠినం చేయాలి... ఎక్కడ ఏమేరకు మిన హాయింపులివ్వొచ్చునన్న అంశంలో ప్రభుత్వాలు విచక్షణాయుతంగా ఆలోచించాలి. తక్కువ నష్టంతో మెరుగైన ఫలితాలు సాధించటంపై దృష్టి పెట్టాలి. కేంద్రం మార్గదర్శకాలు అందుకు తగ్గట్టు వుండాలి. -
కరోనా యాంటీబాడీస్పై కీలక సర్వే, వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి యాంటీబాడీస్ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మంగళవారం వివరాలు వెల్లడించాయి. కోవిడ్పై పోరాడే యాంటీబాడీస్ రాష్ట్ర వ్యాప్తంగా 24.1% మందిలో ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. డిసెంబర్లో జనగాం, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో మూడో విడత సీరో సర్వే జరిగింది. ఆ వివరాలను ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. జనగాం జిల్లాలో మే నెలలో 0.49%, ఆగస్టులో 18.2%, డిసెంబర్లో 24.8% మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. నల్లగొండ జిల్లాలో మేలో 0.24 శాతం, ఆగస్టులో 11.1%, డిసెంబర్లో 22.9 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. కామారెడ్డి జిల్లాలో మేలో 0.24%, ఆగస్టులో 6.9%, డిసెంబర్లో 24.7 శాతం అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంత సీరో సర్వేను రాష్ట్రానికి వర్తింపచేయగా, గతేడాది మేలో మొదటి సీరో సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 0.33 శాతం మాత్రమే కరోనా యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఆగస్టులో రెండో సీరో సర్వేలో 12.5 శాతం జనాభాలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. గత డిసెంబర్లో జరిపిన మూడో సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా 3 రెట్లు వృద్ధి ఆగస్టుతో పోలిస్తే డిసెంబర్లో దేశవ్యాప్తంగా సగటున యాంటీబాడీస్ 3.1 రెట్లు పెరగగా, తెలంగాణలో 2 రెట్లు పెరిగినట్లు ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయడం, మాసు్కలు ధరిం చడం వల్ల ఇప్పటికీ వైరస్ వ్యాప్తి నెమ్మదిగా, నిలకడగా ఉందని ఐసీఎంఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. అయితే మున్ముందు కూడా ప్రజలు మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని కోరారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా సర్వే.. హైదరాబాద్లో ప్రత్యేకంగా సీరో సర్వే జరుగుతోందని, తమ అంచనా ప్రకారం దాదాపు 50 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన మూడో సీరో సర్వేలో 21.5 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ వెల్లడించాయి. గతేడాది మే 11 నుంచి జూన్ 4 మధ్య నిర్వహించిన సర్వేలో 0.7 శాతం మందిలో, ఆగస్టు 17 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నిర్వహించిన సర్వేలో 7.1 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా మూడో సర్వేలో మహిళల్లో 22.7 శాతం, పురుషుల్లో 20.3 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడించాయి. వయసు వారీగా చూస్తే 10–17 ఏళ్ల వయసు వారిలో 25.3 శాతం, 18–44 ఏళ్ల వయసు వారిలో 19.9 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు వారిలో 23.4 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 23.4 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి అయినట్లు తెలిపాయి. మూడో సర్వే ప్రకారం ఆరోగ్య కార్యకర్తల్లో 25.7 శాతం యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు వెల్లడించాయి. కాగా, డాక్టర్లు, నర్సుల్లో మాత్రం అత్యధికంగా 26.6 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. యాంటీ బాడీస్ అంటే? వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు రకాల రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. వాటినే బీ సెల్ ఆధారిత, టీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి అంటారు. బీ సెల్ ఆధారిత రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి రెండు రకాలు. వాటినే ఐజీఎం, ఐజీజీ అంటారు. మన శరీరంలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వారం రోజుల్లో యాంటీ బాడీల ఉత్పత్తి మొదలవుతుంది. యాంటీబాడీస్ ఉన్నాయంటే గతంలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి పోయినట్లు అర్థం. ఇవి ఎన్ని నెలలు ఉంటాయనేది వైరస్ రకాన్ని బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం కోవిడ్లో అవి ఆరు నెలలు ఉంటాయి. -
గుడ్న్యూస్.. టీకా పంపిణీకి సిద్ధం
న్యూఢిల్లీ : కోవిడ్–19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన 10 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 3వ తేదీన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ తేదీలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఆరోగ్య శాఖ తాజా ప్రకటన నేపథ్యంలో 13వ తేదీన ముందుగా ప్రకటించిన మూడు కోట్ల మందికి దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘డ్రైరన్ అనుభవం ఆధారంగా కోవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అంతిమ నిర్ణయం వెలువడాల్సి ఉంది’ అని వివరించారు. వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ సిబ్బంది కొత్తగా రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్ భూషణ్ తెలిపారు. వారి వివరాలు వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసం అందుబాటులోకి తెచ్చిన ‘కో–విన్’ యాప్లో ఇప్పటికే నమోదై ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ ఇచ్చే సిబ్బంది, వ్యాక్సినేషన్ లబ్ధిదారుల కోసం 12 ప్రాంతీయ భాషల్లో సమాచారం వెళుతుందని చెప్పారు. ‘మొదటి విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి టీకా ఇచ్చే సమయం ఎలక్ట్రానిక్ విధానంలో కేటాయింపు జరుగుతుంది. లబ్ధిదారుడి ఫోన్కు సమాచారం వెళుతుంది. తర్వాతి డోస్ ఎప్పుడు ఇచ్చేదీ అందులోనే ఉంటుంది. టీకా డోసులు పూర్తయితే క్యూఆర్ కోడ్తో ఎక్నాలెడ్జ్మెంట్, యూనిక్ హెల్త్ ఐడీ కూడా వారికి అందుతుంది. ఇదంతా డిజి లాకర్లో ఉచితంగానే భద్రంగా ఉంటుంది’ అని వివరించారు. ఒకవేళ దుష్ప్రభావాలు తలెత్తితే అందుకు సంబంధించిన సమాచారం కో–విన్లోనే నమోదవుతుందన్నారు. ఆధార్ ధ్రువీకరణ కూడా ఉండటంతో టీకా వినియోగంలో అక్రమాలకు తావే ఉండదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం దేశీయంగా రూపొందించిన కో–విన్ యాప్ను కోరితే ఇతర దేశాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఐసోలేషన్లో 71 మంది దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ యూకే వేరియంట్ సోకినట్లు గుర్తించిన 71 మంది ఐసోలేషన్లో ఉన్నారని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. యూకే వేరియంట్ వ్యాప్తి కారణంగా దేశంలో కొత్తగా ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు. గత 24 గంటల్లో భారత్లో 16,375 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,56,844కు చేరుకుంది. కోవిడ్తో 201 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,850 కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,75,958 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.32 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,31,036 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 2.23 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.45గా ఉంది. ఈ నెల 4 వరకూ 17,65,31,997 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 8,96,236 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. -
కోటి కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఏకంగా కోటిదాటింది. కొత్తగా 26,786 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. కాగా, రాత్రి 11గంటలకు అదనంగా 25,173 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,620కు చేరింది. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 145,167కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,20,827కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.40 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.14 శాతం ఉన్నాయి. గత 12 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటోంది. మరణాల శాతం 1.45గా ఉంది. ఈ నెల 18 వరకూ 15,89,18,646 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం 11,13,406 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. చికిత్స తీసుకుంటున్న ఐసీఎంఆర్ చీఫ్ భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో కోవిడ్ చికిత్స పొందుతున్నారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. కార్డియాలజిస్ట్ అయిన భార్గవ దాదాపు ఏడెనిమిది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అనంతరంకొద్ది రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరారని అధికారులు చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ట్విట్టర్ లో వెల్లడించా రు. ప్రస్తుతం కరోనా లక్షణాలేమీ లేవని, వైద్యుల సల హా మేరకు ఐసోలేషన్లో ఉంటున్నట్లు వెల్లడించారు. దావానలంలా కోవిడ్.. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో కోవిడ్ మహమ్మారి దావానలంలా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు అభి ప్రాయపడింది. కరోనా వైరస్ చికిత్స సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తూ, ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 8 నెలలుగా వైద్యులతో సహా, ఆరోగ్యకార్యకర్తలు, నర్సులు అవిశ్రాంతంగా పనిచేయడంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, వారికి విరామాన్నిచ్చే కార్యాచరణ ఏదైనా కావాలని జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే, కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక చర్యలను పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
దేశానికంతా టీకా అక్కర్లేదు
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రధాన లక్ష్యం వైరస్ చైన్ను తెగ్గొట్టడమేనని, దాన్ని సాధించేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రతీఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. వ్యాక్సినేషన్ చేసేందుకు దేశంలో కొందరిని జాబితా నుంచి తొలగించారని వదంతులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవతో కలసి మీడియాతో మాట్లాడారు. అవసరమైనంత మందికి వ్యాక్సిన్ ఇచ్చాక.. ఇక అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఇలాంటి సాంకేతికపరమైన అంశాల్లో వాస్తవాలను ఆధారంగా చేసుకొని చర్చలు జరగాల్సి ఉంటుందన్నారు. జనాభాలో కొద్ది మందికే టీకా ప్రారంభిస్తామని, అందుకే కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్్కలను కవచంగా వాడాలని బలరాం భార్గవ అన్నారు. వ్యాక్సిన్లపై వచ్చే అసత్య వార్తలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మీడియా, వ్యాక్సిన్ తయారీదారుపై కూడా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ భద్రతపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడిస్తుందని చెప్పారు. నిర్ణీత వ్యవధిలోనే ప్రయోగాలు పూర్తి చెన్నై వాలంటీర్పై ఆక్స్ఫర్డ్ టీకా దుష్ప్రభావం కలిగించిందన్న ఆరోపణలతో, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సీరం ఇనిస్టిట్యూట్పై వచ్చిన ఆరోపణల కారణంగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎటువంటి మార్పులు ఉండబోవని, నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రయోగాలు పూర్తి అవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వాస్తవాల ఆధారంగా దుష్పరిణామాలను పరిశీలిస్తారని, ట్రయల్స్ ఆపాల్సిన అవసరంలేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ అన్నారు. ఆయన ఉద్యోగం పోయింది: వలంటీర్ భార్య వ్యాక్సిన్ ప్రయోగాల కారణంగా తన భర్త (40)చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారని, అమెరికన్ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడని వ్యాక్సిన్ తీసుకున్న చెన్నై వలంటీర్ భార్య తెలిపారు. వ్యాక్సిన్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్ బ్యాంకు ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోలేకపోతున్నారని, ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు వలంటీర్గా ముందుకొచ్చిన ఆ మార్కెటింగ్ ప్రొఫెషనల్కు అక్టోబర్ 1న వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. టీకా అత్యంత సురక్షితం: సీరం ఆ్రస్టాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి పరుస్తున్న కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రయోగం కారణంగా వలంటీర్కి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయన్న ఆరోపణలను ప్రపంచ వ్యాక్సిన్ తయారీ దిగ్గజ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది. వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని, రోగనిరోధకత పెంపొందిస్తుందని స్పష్టం చేసింది. సురక్షితమైందని తేలితే తప్ప టీకాను ప్రజల ఉపయోగం కోసం విడుదల చేయమని కంపెనీ తన బ్లాగ్లో తేల్చి చెప్పింది. -
లే'టెస్ట్' డ్రై స్వాబ్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి చేసిన ఓ వినూత్న పద్ధతికి భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గుర్తింపు లభించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ నమూనాలను సీసీఎంబీలో పరీక్షిస్తుండగా... ఆయా పరీక్షా పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సవరిస్తూ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని రూపొందించారు. ప్రస్తుతం కరోనా అనుమానితులకు చేసే పరీక్షల్లో భాగంగా ముక్కు లేదా గొంతు లోపల స్వాబ్స్ను ఉంచి శరీర ద్రవాల నమూనాలు సేకరించి వాటిని పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. రవాణా సమయంలో స్వాబ్స్ను వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (వీటీఎం) పేరున్న ద్రావణంలో ఉంచుతున్నారు. అయితే ఈ ద్రావణం బయటకు రాకుండా నమూనాలను ప్యాక్ చేసే క్రమంలో ఎంతో సమయం వృధా అవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటీఎం లీక్ అవుతున్నట్లు కూడా తెలిసింది. దీనివల్ల ఆయా నమూనాలు పరీక్షించేందుకు పనికిరాకుండా పోవ డమే కాకుండా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తేలింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సీసీఎంబీ... వీటీఎంను పూర్తిగా నివారించవచ్చని గుర్తించింది. పొడిగా ఉండే స్వాబ్ ద్వారా రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ)ను వేరు చేయాల్సిన అవసరం కూడా రాదని, నేరుగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు జరపవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా గుర్తించింది. ఆర్ఎన్ఏ వెలికితీతకు తగిన సౌకర్యాలు లేనిచోట ఈ పద్ధతిని వాడవచ్చని తెలిపింది. సమయం కలిసొస్తుంది: డాక్టర్ రాకేశ్ మిశ్రా సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెక్నిక్ ద్వారా కరోనా పరీక్షల్లో ఎంతో సమయం ఆదా అవుతుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించే ఆర్ఎన్ఏ వెలికితీత కోసం 500 నమూనాలకు సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆయన చెప్పారు. వీటీఎం, ఆర్ఎన్ఏ వెలికితీత వల్ల ఖర్చులు, ఫలితాల వెల్లడికి పట్టే సమయం పెరిగిపోతాయని, భారీ సంఖ్యలో నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితుల్లో వాటిని పరిహరించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని వివరించారు. డ్రై స్వాబ్ టెక్నిక్ను వాడటం ద్వారా పరీక్షల ఖర్చు 40–50 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారానే కొత్త రకం పరీక్షలను నిర్వహించగలగడం మరో విశేషమన్నారు. -
దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. సోమవారం పాజిటివ్ కేసులు 40 వేల కంటే తక్కువ నమోదైనట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,730కి చేరాయి. గత 24 గంటల్లో (మంగళవారం) 38,073 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు కరోనా కారణంగా 448 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,27,059 కి చేరిన్నట్టు కరోనా హెల్త్బులిటెన్లో తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి మొత్తం 79,59,406 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 92.64% గా నమోదైంది. మరణాల శాతం 1.48% గా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,05,265 గా ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రల వారీగా మరణాల సంఖ్య ఇప్పటి వరకు దేశంలో 1,27,059 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో మహారాష్ట్రలో 45,325, కర్ణాటకలో 11,362, తమిళనాడులో 11,362, పశ్చిమ బెంగాల్లో 7350, ఉత్తరప్రదేశ్లో 7231, ఢిల్లీలో 7060, ఆంధ్రప్రదేశ్లో 6802, పంజాబ్లో 4338, గుజరాత్లో 3765 మంది మరణించారు. సోమవారం కరోనా బారినపడి 448 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో మహారాష్ట్రకు 85 మంది, ఢిల్లీలో 71 మంది, బెంగాల్లో 56 మంది, 25 మంది ఉత్తర్ప్రదేశ్లో, 22 మంది కేరళలో, 20 మంది పంజాబ్లో మరణించారు. కరోనా బారిన పడి మరణించిన వారిలో అధిక శాతం మంది దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఇదే అంశం స్పష్టం చేసినట్టు తెలిపారు. కేసుల సంఖ్య ఎప్పుడు..ఎలా..! దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్ను ఆగష్టు 7న , 30 లక్షల మార్క్ను ఆగష్టు 23న, సెప్టెంబర్ 5న 40లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్కను దాటి ప్రస్తుతం 85 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 11,96,15,857 కరోనా టెస్టులు నిర్వహించినట్టు, నవంబర్ 9న 10,43,665 టెస్ట్లు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ తెలిపింది. -
ఫిబ్రవరికల్లా కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవాగ్జిన్ పేరుతో కంపెనీ తయారు చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) లు కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం బాగానే ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త, టీకా టాస్క్ఫోర్స్ సభ్యుడు రజనీకాంత్ గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ‘‘వచ్చే ఏడాది మొదట్లో.. ఫిబ్రవరి లేదా మార్చిలలో అందుబాటులోకి (టీకా) వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే భారత్ సిద్ధం చేసిన తొలి కోవిడ్ నిరోధక టీకాగా కోవాగ్జిన్ రికార్డు సృష్టిస్తుంది. భారతీయులను నిలిపేసిన చైనా భారత్ నుంచి చైనాకు వెళ్లేందుకు కేటాయించిన విమానాలను చైనా నిలిపివేసింది. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చైనా ఎంబసీ ప్రకటించింది. దాదాపు 2 వేల మంది ఈ చర్య వల్ల భారత్లోనే ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పర్మి ట్లు ఉన్నప్పటికీ నిలిపివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ 50 వేలు దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేల లోపు నమోదు కాగా, గురువారం ఆ సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో 50,210 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 704 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,611కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య 77,11,809కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.20 శాతానికి చేరింది. -
ఫిబ్రవరి నాటికే కోవాక్సిన్ : ఐసీఎంఆర్ శాస్త్రవేత్త
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ఆందోళన కొనసాగుతున్న తరుణంలో వాక్సిన్ల విషయంలో ఊరటనిచ్చే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరి నాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం సంస్థ ప్రకటించింది. తాజాగా హైదరాబాద్కు చెందిన భారత్ బయెటెక్ త రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ఫిబ్రవరి, 2021 లోనే లాంచ్ చేసే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్టు ఒకరు ప్రకటించారు. ఊహించిన సమయానికి కంటే ముందే కరోనావైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని తెలిపారు. తొలి స్వదేశీ వ్యాక్సిన్గా భావిస్తున్న కోవాక్సిన్ చివరి దశ ట్రయల్స్ దాదాపు 25 వేలమందితో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. (జనవరి నాటికి, అందుబాటు ధరలో కరోనా వ్యాక్సిన్) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి రూపొందిస్తున్న కోవాక్సిన్ను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుందని ఐసీఎంఆర్ రీసర్చ్ మేనేజ్మెంట్ హెడ్, సీనియర్ శాస్త్రవేత్త, కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు రజనీ కాంత్ వెల్లడించారు. మొదటి, రెండవ దశ ప్రయోగాల్లో టీకా మంచి సామర్థ్యాన్ని చూపించిందన్నారు. అయితే మూడో దశ ప్రయోగాలు కూడా ముగిస్తే తప్ప100 శాతం ఖచ్చి తత్వాన్ని నిర్ధారించలేమన్నారు. మూడో దశ ట్రయల్స్ ముగిసేలోపు కోవాక్సిన్ షాట్లను ప్రజలకు ఇవ్వవచ్చో లేదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని కాంత్ తెలిపారు. అయితే దీన్ని భారత్ బయోటెక్ సంస్థ ఇంకా నిర్ధారించలేదు. మరోవైపు జనవరి, 2021నాటికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో రానుందని పుణేకు చెందిన సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తగ్గుతున్న కరోనా ప్రభావం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల ఉండటమే దీనికి తార్కాణం.కొత్త కేసులు రోజుకు 50 వేలలోపే నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 46,963 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 470 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,111కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 74,91,513 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,70,458 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 6.97 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91.54 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. ఇప్పటి వరకూ 10,98,87,303 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 10,91,239 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
పీల్చే గాలి విషం
న్యూఢిల్లీ: గత ఏడాది భారత్లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్ఓజీఏ) నివేదిక 2020 వెల్లడించింది. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు. అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఈ నివేదిక రూపొందించింది. ప్రధానంగా పసిపిల్లలపై ఈ కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అధ్యయనం చేసింది. చిన్న పిల్లల మీద ఈ స్థాయిలో వాయుకాలుష్యం ప్రభావం చూపించడం అత్యంత దారుణమైన అంశమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ కల్పన బాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అరికట్టగలిగే మరణాలేనన్న కల్పన ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలన్నారు. పీఎం 2.5లోనూ భారత్దే మొదటి స్థానం గాలిలో కాలుష్యకారకమైన సూక్షా్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలిలో పీఎం 2.5 ► భారత్ 83.2 ► నేపాల్ 83.1 ► రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1 ► ఖతార్ 76.0 ► నైజీరియా 70.4 వాయు కాలుష్యంతో వస్తున్న వ్యాధులు వాయు కాలుష్యంతో భారత్లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి. ► ఊపిరితిత్తుల వ్యాధులు ► న్యుమోనియా ► హార్ట్ ఎటాక్ ► కేన్సర్ ► మధుమేహం ► నవజాత శిశువులకు సోకే వ్యాధులు ► గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ► భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి. ► గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. -
ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. మార్చిలో లాక్డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్ దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలంలో సెకండ్ వేవ్ ? దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, బెంగాల్తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు. పత్రికల ద్వారా సోకదు వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు. -
రెండోసారి కరోనా.. మరింత తీవ్రం
న్యూఢిల్లీ: రెండోసారి కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు మరింత తీవ్ర లక్షణాలు కనిపించే అవకాశమున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఎటువంటి ఇతర వ్యాధులేవీ లేని ఒక పాతికేళ్ల వ్యక్తికి 48 రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా సోకిందని లాన్సెట్ పత్రిక ప్రకటించింది. అతడికి రెండోసారి కరోనా సోకినప్పుడు వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్నాయని, కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ నెవాడాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధ్యయనం సూచించింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన వారి శరీరంలో తయారయ్యే యాంటీబాడీల జీవితకాలంపై కచ్చితమైన సమాచారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా లేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. -
కొత్త కేసులు 78 వేలు
న్యూఢిల్లీ: ఒక్క రోజులోనే 78,524 కేసులు బయటపడటంతో దేశంలో నిర్ధారణ అయిన మొత్తం కోవిడ్ కేసులు 68 లక్షలు దాటాయి. గురువారం నాటికి 58,27,704 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 85.25%గా ఉందని కేంద్రం తెలిపింది. మొత్తం కేసులు 68,35,655 కాగా, 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 971 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,05,526కు చేరుకుంది. మృతుల రేటు 1.54%నికి పడిపోయింది. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 9,02,425కు చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షల మార్కు, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5కి 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 60 లక్షల మార్కు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు 8,34,65,975 శాంపిల్స్ను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. -
కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్లో కోవిడ్–19 వ్యాక్సిన్.. కోవీషీల్డ్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ను తయారుచేసిన సంగతి తెలిసిందే. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కేజీహెచ్లో వ్యాక్సిన్ ట్రయల్స్కు శ్రీకారం చుట్టాయి. తొలి రోజు ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ పర్యవేక్షణలో కేజీహెచ్లో ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన 57, 90, 180వ రోజుల్లో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి.. వారి పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు. -
కోవిడ్ చికిత్సకు కొత్త ఆయుధం!
న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు ఇంకో ఆయుధం దొరికింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్ –ఈ సంస్థ ఈ ఘనతను సాధించింది. కోవిడ్ బారిన పడ్డ వారి రక్తం నుంచి యాంటీబాడీలతో కూడిన ప్లాస్మా గురించి మనం వినే ఉంటాం. పలు ప్రాంతాల్లో కోవిడ్ చికిత్స కోసం ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్నారు కూడా. అయితే బయోలాజికల్ –2 సంస్థ మనుషుల ప్లాస్మా స్థానంలో గుర్రాల నుంచి సేకరించిన ప్లాస్మాను వినియోగించడం విశేషం. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్ను గుర్రాల్లోకి ఎక్కించి.. యాంటీబాడీలు ఉత్పత్తి అయిన తరువాత సేకరించి శుద్ధి చేస్తారు. ఈ కొత్త పద్ధతిపై మానవ ప్రయోగాలు ఇంకా జరగాల్సి ఉందని, త్వరలోనే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను ఈ విషయమై సంప్రదిస్తామని భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త సమైరన్ పాండా తెలిపారు. గుర్రం నుంచి వేరు చేసి శుద్ధి చేసిన రక్తంలో శక్తిమంతమైన యాంటీబాడీలు ఉంటాయని, వైరస్ బారిన పడ్డ వారికి నేరుగా అందివ్వవచ్చునని అంచనా. గతంలోనూ పలు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం జంతువుల రక్తంలో యాంటీబాడీలను వృద్ధి చేసి వాడారు. కోవిడ్ రోగుల రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మాతో పోలిస్తే గుర్రపు సీరమ్లో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయని, వైరస్ను వేగంగా చంపగల సామర్థ్యం కలిగి ఉంటాయని ఐసీఎంఆర్ తెలిపింది. అధ్యయనంలో భాగంగా పది గుర్రాలకు నిర్వీర్యం చేసిన కరోనా వైరస్ను ఎక్కించి 21 రోజుల తరువాత దాని ప్లాస్మాను పరీక్షించారు. ఈ ప్లాస్మాలో ఐజీజీ యాంటీబాడీలు ఉన్నట్లు స్పష్టమైంది. (చదవండి: కోవిడ్ టీకా వచ్చే ఏడాదికి అనుమానమే) -
కరోనా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు పోయిందో!
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వారికి ఎప్పుడు వచ్చిందో తెలియదు.. ఎప్పుడు వెళ్లిందో తెలియదు.. ఎటువంటి లక్షణాలూ లేకుండానే వారు కోలుకున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రెండో దఫా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. విజయనగరం జిల్లాలో 38 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేలింది. అయితే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ వారి నుంచి నమూనాలు సేకరించి చూస్తే కరోనాతో పోరాడే యాంటీబాడీస్ వారిలో విపరీతంగా వృద్ధి చెంది ఉన్నాయి. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాంభార్గవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. మొదటి దశ సీరో సర్వైలెన్స్లో 20 శాతం మందికి యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టు తేలిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో తీసుకున్న నమూనాలు, కరోనా వచ్చిపోయిన వారి సంఖ్య జిల్లా నమూనాలు పాజిటివ్ శాతం విజయనగరం 418 159 38.0 కృష్ణా 399 117 29.3 నెల్లూరు 428 76 17.7 -
అన్నం తక్కువ తిందాం..!
సాక్షి, హైదరాబాద్: తిండి కలిగితే కండ కలదోయ్... కండకలవాడేను మనిషోయ్.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి. పరిశీలన సాగిందిలా... దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ మెనూ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎన్ ఐఎన్ సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11% పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను జూస్ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. -
మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతుండగానే చైనా నుంచి భారత్కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతోపాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) భారత్లోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందనీ, భారత్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్లలో ఒకటి (ఆర్బోవైరస్), సీక్యూవీ మానవులలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా ఆయా వ్యక్తుల్లో సక్యూవి యాంటీ బాడీస్ ఉన్నాయి కానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు. అయితే కొంతమందికి వ్యాధికి గురయ్యే ఉంటారని అభిప్రాయపడ్డారు. దీంతో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్లో ఈ వ్యాధికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన సమయంలో, మానవులు లేదా జంతువుల నమూనాలలో వైరస్ ను గుర్తించలేదు. -
కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం. దేశంలో మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం చాలా పాజిటివ్ ధోరణితో ఉందని ఆరోపించింది. పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచి, ప్రజల్లో తప్పుడు ఆశలను కల్పించవద్దని దేశ నాయకులకు పిలుపునిచ్చింది. అసలు నిజాలు చెప్పకుండా, కప్పివుంచడం అంటే ఆరోగ్య సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించకుండా ప్రజలను నిరోధించcడమేనని వ్యాఖ్యానించింది. నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని లాన్సెట్ పేర్కొంది. ఆశావాదాన్ని ప్రోత్సహించే ఒత్తిడికి దేశ శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది.అలాగే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా తప్పుబట్టింది. ఇది వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం పేర్కొంది. ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు,మరణాల డేటా పారదర్శకతను తప్పుబట్టింది ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు పోల్చదగినవా కావా అని తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలను వ్యక్తం చేసింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని పేర్కొంది. తప్పుడు ఆశావాదాన్ని ప్రజలకు అందించకుండా వీటన్నింటిని ఉపయోగించాలని, గౌరవించాలని హితవు పలికింది. అయితే కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది. -
24 గంటల్లో 87,882 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 86,961 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,87,580 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,130 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 87,882కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,96,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,03,299 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 33 లక్షలకు పైగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 18.28 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.12 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 20 వరకు 6,43,92,594 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 7,31,534 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ దేశంలో దాదాపు 6.3 కోట్లకుపైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 455 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కరోనా వల్ల మరణిస్తున్న వారిలో 70 శాతం మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారేనని చెప్పింది. -
అరకోటి దాటాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య ఏకంగా అరకోటి దాటేసింది. గత 24 గంటల్లో ఏకంగా 90,123 కొత్త కరోనా కేసులు భారత్లో నమోదయ్యాయి. ప్రపంచ పట్టికలో ఒకటో స్థానానికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు. కరోనా కేసుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికాకి, మనకి మధ్య కేసుల సంఖ్యలో తేడా క్రమేపీ తగ్గిపోతోంది. మంగళవారం రాత్రికి అమెరికా కేసుల సంఖ్య 68.77 లక్షలు ఉంటే, మన దేశంలో 50.20 లక్షలుగా ఉంది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 10 లక్షల కేసులకు చేరుకోవడానికి 169 రోజులు పడితే, 40 నుంచి 50 లక్షలకు చేరుకోవడానికి కేవలం 11 రోజులు మాత్రమే పట్టింది. దీనిని బట్టి దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత అర్థమవుతుంది. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయన హోం ఐసొలోషన్లో ఉన్నట్లు ట్వీట్చేశారు. భారత్లో సెకండ్ వేవ్ ? 1918లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ ఏడాదిలో మూడు దశల్లో విజృంభిం చింది. కరోనా అలా ఎన్ని దశల్లో విజృంభిస్తుందో నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందన్న అనుమానాలున్నట్టుగా కోవిడ్పై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ వెల్లడించారు. ‘కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకున్నాక మళ్లీ తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. అక్కడ సెకండ్ వేవ్ అని అనుకోవచ్చు’ అని చెప్పారు. కేసుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉంటోంది. గత 24 గంటల్లో.. గత 24 గంటల్లో 82,961 మంది రికవరీ కాగా, 1,290 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82,066 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,42,360 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.53 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
కరోనా మళ్లీ సోకడం అరుదే..
న్యూఢిల్లీ: కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. ఆగని కరోనా ఉధృతి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 83,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. మంగళవారం 83 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,054 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80,776 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 38,59,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,90,061 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
45 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. గురువారం 95 వేలకుపైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం ఆ రికార్డును దాటి 96 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో వచ్చిన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,414కు చేరుకుంది. గత 24 గంటల్లో 70,880 మంది కోలుకోగా 1,209 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 76,271కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,663కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,43,480గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారానికి ఇది 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యశవంతపుర: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. మేలోనే 64 లక్షల మందికి కోవిడ్ మే ఆరంభం నాటికే దేశంలో 0.73% మందికి అంటే 64 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు జాతీయ స్థాయి సీరో సర్వే లెక్కగట్టింది. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) చేపట్టిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమయ్యాయి. మే 11 నుంచి జూన్ 4వ తేదీ వరకు 28 వేల మంది నుంచి సేకరించిన రక్త నమూనాల్లో యాంటీబాడీలను ‘కోవిడ్ కవచ్ ఎలిసా’కిట్ను ఉపయోగించి లెక్కించారు. 18–45 మధ్య ఏళ్ల వారిలో సీరోపాజిటివిటీ(రక్తంలో యాంటీబాడీల స్థాయి) రేటు అత్యధికంగా 43.3% ఉండగా, 46–60 ఏళ్ల గ్రూపులో 39.5%, 60 ఏళ్లు పైబడిన వారిలో అతి తక్కువగా 17.2% మాత్రమే ఉన్నట్లు రుజవైందని నివేదిక తెలిపింది. మే ఆరంభంలోనే దేశంలో 64లక్షల మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. -
కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు పేర్కొంది. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 18-45 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది. ఆ తరువాత 46-60 సంవత్సరాల వారిలో 39.5 శాతం ఉండగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్ 4 వరకు ఈ సర్వే జరిగింది. కోవిడ్ కవచ్ ఎలీసా కిట్ ఉపయోగించి 28,000 మంది రక్తనమునాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్ కోసం పరీక్షించింది. చదవండి: దేశంలో రికార్డు స్థాయిలో 96,551 కేసులు -
రెండో స్థానంలోకి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలోకి చేరింది. కేసుల సంఖ్య దృష్ట్యా బ్రెజిల్ను దాటిపోయింది. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు కూడా భారత్లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల్లో 90,802 కేసులు బయ టపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,04,613కు చేరుకుంది. గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు, రెండు రోజులుగా 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 69,564 మంది కోలుకోగా 1,016 మంది మరణిం చారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 71,642కు చేరుకుందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,50,429 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.99% ఉన్నాయి. రికవరీ రేటు 77.30% పెరగ్గా, మరణాల రేటు 1.70%కి పడిపోయింది. యాంటీబాడీలు ఉన్నా కరోనా.. శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మీద ఉన్నవన్నీ ఊహాగానాలేనని, ఆధారసహిత ప్రయోగాలు లేవని అంటున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు తిరిగి కరోనా బారిన పడటం పట్ల ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలజీ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. యాంటీబాడీలు కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు, ప్రస్తుతమున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయని అన్నారు. శరీరంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తెలుసుకోకుండా కేవలం పాజిటివ్ లేదా నెగెటివ్ అని చెప్పడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం.. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికావ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది. మలైకా అరోరాకు కోవిడ్ పాజిటివ్ బాలీవుడ్ నటి, వీడియో జాకీ, మోడల్ కూడా అయిన మలైకా అరోరా(46)కు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో, కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి, వైద్యుల సలహా మేరకు తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు ఆమె సోమవారం ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. -
కంటైన్మెంట్లలో కట్టుదిట్టంగా..
సాక్షి, హైదరాబాద్: కట్టడి ప్రాంతా (కంటైన్మెంట్ జోన్లు)ల్లోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలున్నా, లేకున్నా కట్టడి ప్రాంతాల్లో పెద్దాచిన్నా అందరికీ నూటికి నూరు శాతం పరీక్షలు చేయాలని స్పష్టంచేసింది. కరోనా సామాజిక వ్యాప్తి జరగడంతో ఐసీఎంఆర్ ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. వీటిని అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో లక్షణాలున్నవారికి, వారి ప్రాథమిక, రెండో కాంటాక్టులకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో లక్షలాది మందికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2,300కుపైగా కట్టడి ప్రాంతాలున్నాయి. కొన్ని జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే కట్టడిలో ఉన్నాయి. ఇవికాక, ఇతర ప్రాంతాల్లో 65 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్న వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరని సూచించింది. అవసరాన్ని బట్టి రాష్ట్రాలు కొన్ని సవరణలతో ఈ మార్గదర్శకాలను పాటించవచ్చంది. ఒకరకంగా వైరస్ విస్తరిస్తున్న నగరాల్లో కట్టడి ప్రాంతాల్లో వంద శాతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. నాన్ కంటైన్మెంట్ ఏరియాల్లో ఇలా.. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణం చేసి వచ్చి, రోగ లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయాలి. ఇప్పటికే కరోనా నిర్ధారణైన వ్యక్తులు, కుటుంబసభ్యులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. లక్షణాలున్న ఆరోగ్య కార్యకర్తలు, వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఫ్రంట్లైన్ కార్మికులకూ పరీక్షలు తప్పనిసరి. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చినవారు, వలస వెళ్లొచ్చి.. లక్షణాలున్న వారికి, అత్యధిక హైరిస్క్ లో ఉండే 65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఆసుపత్రుల్లో ఏం చేయాలంటే? అన్ని ఆసుపత్రుల్లో తీవ్ర శ్వాసకోశ సమస్య ఉన్న రోగులందరికీ కరోనా టెస్టులు చేయాలి. రోగనిరోధక శక్తిలేని, ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, 65ఏళ్లు పైబడినవారు, అవయవ మార్పిడికి ఆసుపత్రిలో చేరిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్ష చేయాలి. ఒక్కోసారి వీరికి ఆసుపత్రిలో చేరడానికి ముందే టెస్టులు చేయాలి. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉన్న రోగులకు లేదా వారానికంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉన్న రోగులకు వైరస్ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షించకూడదు. కరోనా పరీక్ష చేసే వసతి లేనప్పుడు వీలైతే శస్త్రచికిత్సను వాయిదా వేయాలి. టెస్ట్ చేశాకే ఆపరేషన్ చేయాలి. ప్రసవానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులకూ కరోనా పరీక్షలు తప్పనిసరి. ఒకవేళ తల్లికి పాజిటివ్ వస్తే, 14 రోజుల పాటు బిడ్డకు పాలివ్వడం వంటివి చేయాల్సివస్తే మాస్క్ ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యం, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడే నవజాత శిశువులకూ టెస్ట్ చేయాలి. ర్యాపిడ్లో నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే.. వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే వారికి ముందే కరోనా టెస్ట్ చేయాలి. నెగెటివ్ ఉంటేనే ప్రయాణానికి అనుమతివ్వాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేశాక పాజిటివ్ వస్తే నిర్ధారించుకునేందుకు మరోసారి పరీక్ష అవసరంలేదు. కరోనా నుంచి కోలుకున్నాక వారికి తిరిగి పరీక్ష నిర్వహించనక్కర్లేదు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చాక కూడా సంబంధిత వ్యక్తిలో లక్షణాలుంటే, తప్పక ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలి. ఒకవేళ అప్పటికప్పుడు వారిలో లక్షణాలు లేకున్నా తర్వాత వారిలో వృద్ధి చెందితే మళ్లీ పరీక్ష చేయాల్సిందే. -
31 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విశ్వరూపం సాగుతోంది. కేవలం 13 రోజుల్లో కేసుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు చేరుకుంది. శనివారం రికార్డు స్థాయిలో 86,432 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరుకుంది. మూడు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,072 మంది కోలుకోగా..1,089 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 69,561కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,07,223కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,46,395గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.04 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.23 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.73 శాతానికి పడిపోయిం దని తెలిపింది. సెప్టెంబర్ 4 వరకు 4,77,38,491 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 10,59,346 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. తాజా 1,089 మరణాల్లో అత్యధికంగా మహా రాష్ట్ర నుంచి 378 మం ది మరణించారు. -
40 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం తాజాగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. రెండు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, మరో 1,096 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 8 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,31,124గా ఉంది. రికవరీ రేటు 77.15 శాతానికి పెరిగిందని కేంద్రం తెలిపింది. జూన్ తర్వాతే వ్యాక్సిన్ జెనీవా/మాస్కో : వచ్చే ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ చెప్పారు. ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్లన్నీ సమర్థవంతంగా పని చేస్తాయని నిర్ధారణ కాలేదని జెనీవాలో అన్నారు. డబ్ల్యూహెచ్వో అంచనాల ప్రకారం ఈ టీకాలేవీ 50% కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు. రెండు నెలల్లోనే మానవ ప్రయోగాలు పూర్తి చేసి వ్యాక్సిన్కు రష్యా అనుమతులు మంజూరు చేయడం, అమెరికా కూడా నవంబర్కి వ్యాక్సిన్ సిద్ధంగా చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా వ్యాక్సిన్ సురక్షితమే.. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్ వివరాలను వెల్లడించింది. ఈ ట్రయల్స్లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది. -
రికార్డు స్థాయిలో పరీక్షలు.. కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురు వారం తాజాగా రికార్డు స్థాయిలో 83,883 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,043 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 67,376కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,15,538గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.16 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 77.09 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.75 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు 4,55,09,380 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 11,72,179 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 24 గంటల్లో నిర్వహించిన అత్యధిక పరీక్షలు ఇవే కావడం గమనార్హం. తాజా 1,043 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 292 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 1,623 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో ప్రతి పది లక్షల మందికి 31వేలకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్ మరణాల్లో 51 శాతం మంది 60కి పైగా వయసు ఉన్నవారని చెప్పింది. కోవిడ్–19 మరణాల్లో 69 శాతం మంది పురుషులే ఉన్నారని గురువారం వెల్లడించింది. -
24 గంటల్లో 78 వేలకు పైగా
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. బుధవారం తాజాగా మరో 78,357 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,523 కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,026 మంది కోలుకోగా.. 1,045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29,01,908 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,01,282 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.26 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 76.98 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.76 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు 4,43,37,201 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 10,12,367 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. -
24 గంటల్లో 78 వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. సోమవారం తాజాగా మరో 78,512 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,245కు చేరుకుంది. 24 గంటల్లో 971 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 64,469కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,74,801కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,81,975గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 19.5 లక్షలకు పైగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. సోమవారానికి ఇది 76.62 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.78 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 30 వరకు 4,23,07,914 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 8,46,278 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. వారం రోజుల్లోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. 8 రోజుల్లో 5లక్షలకు పైగా కరోనా రోగులు కోలుకున్నారు. త్వరలో కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్ భువనేశ్వర్: దేశీయంగా తయారు చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్’త్వరలోనే రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో అడుగుపెట్టనుం దని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఎంఎస్) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ వెంకటరావు తెలిపారు. మొదటి దశ టీకా ప్రయోగంలో పాల్గొన్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని చెప్పారు. రెండో దశ టీకా తీసుకున్న తర్వాత మళ్లీ 14 రోజులకు రెండో డోస్ ఇస్తామని చెప్పారు. వీరిని పరిశీలనలో ఉంచుతామని చెప్పారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన 12 మెడికల్ కాలేజీల్లో ఐఎంఎస్ కూడా ఉంది. -
ఒక్క రోజులోనే 10 లక్షలు
న్యూఢిల్లీ: భారత్లో శనివారం భారీ స్థాయిలో పరీక్షలు జరిగాయి. ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 4.14 కోట్లు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఆదివారం తాజాగా మరో 78,761 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,42,733కు చేరుకుంది. గత 24 గంటల్లో 64,935 మంది కోలుకోగా 948 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63,498కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,13,933 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,65,302గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.60గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 19.5 లక్షల కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఆదివారానికి ఇది 76.61 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.79 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 29 వరకు 4,14,61,636 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 10,55,027 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా 948 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 328 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. భారత్ లో ప్రతి మిలియన్ మందికి రోజుకు 545 పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిపిన పరీక్షలు ప్రతి మిలియన్ మందికి 30,044 కి చేరాయి. కరోనా కేసులు 20 లక్షల నుంచి 30 లక్షలకు 16 రోజుల్లోనే చేరుకున్నాయి. 2.5 కోట్లు దాటిన కేసులు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీ ప్రభావాన్నే చూపుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచంలో 2.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధిక సంఖ్యలో అమెరికాలో 59 లక్షల కేసులు, బ్రెజిల్లో 38 లక్షల కేసులు, భారత్లో 35 లక్షలు కేసులు నమోదయ్యా యి. అమెరికా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత కేసులక 10 రెట్లు అధిక కేసులు ఉండవచ్చని చెబుతున్నారు. వారందరినీ గుర్తించి ఉండకపోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 8,42,000 మందికి పైగా మరణించారు. -
వారంలోనే నాలుగు లక్షలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,972కు చేరుకుంది. గత 24 గంటల్లో 65,050 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 26,48,998కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.72గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు ఎక్కువగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.47 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.81 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 28 వరకు 4,04,066,09 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 9,28,761 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ.. రెండోసారి రెనో: అమెరికాలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకింది. దేశంలో ఇలాంటిది ఇదే మొట్టమొదటి కేసుగా భావిస్తున్నారు. యూరప్తోపాటు హాంకాంగ్లో ఇటీవల ఇలాంటి కేసులు బయటపడిన విషయం తెలిసిందే. నెవడాలోని రెనోకు చెందిన ఓ వ్యక్తి(25) ఏప్రిల్లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. జూన్లో అతనికే మళ్లీ పాజిటివ్గా నిర్ధారణయింది. మొదటిసారి కంటే ఈసారి అతడిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. న్యుమోనియా కూడా రావడంతో ఆస్పత్రిలో ఆక్సిజన్తో చికిత్స అందించాల్సి వచ్చింది. కరోనా వైరస్ మళ్లీ సోకేందుకు అవకాశం ఉందనీ, రెండోసారి మరింత తీవ్రంగా ఉండొచ్చని నెవడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ డైరెక్టర్ మార్క్ పండోరి అన్నారు. 110 ఏళ్ల కోవిడ్ విజేత మలప్పురం: కరోనా సోకిందని తెలియగానే తీవ్ర భయాందోళనలకు లోనవుతున్న వారు ఎందరో. అలాంటిది కేరళలో ఓ శతాధిక వృద్ధురాలు కరోనాను జయించింది. రంధాథాని వరియత్ పథూ అనే 110 ఏళ్ల బామ్మకు తన కూతురు నుంచి కరోనా సోకింది. ఆగస్టు 18వ తేదీన మలప్పురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరిన పథూ కోలుకొని శనివారం డిశ్చార్జి అయ్యింది. ఆమెకు స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, నిబ్బరంగా ఉంటూ చికిత్స తీసుకుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే.కే.శైలజ వెల్లడించారు. పథూకు చికిత్స అందించి కోలుకునేలా చేసిన డాక్టర్లను మంత్రి అభినందించారు. -
ఆగని కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా దాడి ఆగడం లేదు. బుధవారం తాజాగా మరో 67,151 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,474కు చేరుకుంది. 24 గంటల్లో 63,173 మంది కోలుకోగా, 1,059 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59,449కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,67,758కు చేరు కోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,267గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.87గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 17,60,489 ఎక్కువ ఉన్నాయి. అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.30 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరణాల రేటు క్రమంగా 1.80 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 25 వరకు 3,76,51,512 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 8,23,992 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. తాజా 1,059 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 329 నమోదయ్యాయి. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగు తున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళు తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1524 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. -
కరోనా: ఒక్కరోజే 1059 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు చేరింది. వైరస్బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. (చదవండి: ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్) -
రికవరీ రేటు 75.27%
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మరో 61,408 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది. కరోనా కేసులు 30 లక్షల నుంచి 31 లక్షలకు కేవలం ఒక్క రోజులోనే చేరుకున్నాయి. 24 గంటల్లో 57,469 మంది కోలుకోగా, 836 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 57,542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,38,035కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,10,771గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 22.88గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే మూడు రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.27 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.85 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. ఆదివారం మరో 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137 కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉంది. హరియాణా సీఎంకు కోవిడ్ చండీగఢ్/పణజి: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోవిడ్ బారిన పడ్డారు. వారం క్రితం ఆయన కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత షెకావత్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. తన రిపోర్టులో కరోనా పాజిటివ్గా వచ్చిందంటూ సీఎం ఖట్టర్ సోమవారం ట్విట్టర్లో తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్చంద్ గుప్తా, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పాజిటివ్గా తేలింది. కేంద్ర మంత్రికి తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు కోవిడ్–19తో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఆయన్ను పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి వైద్యాధికారుల బృందం రానుందన్నారు. -
24 గంటల్లో 68,898 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 68,898 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 983 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 54,849కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,58,946కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,92,028గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.82గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.30 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.89 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 20 వరకు 3,26,61,252 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 1,504 ల్యాబ్లు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు ఢిల్లీలో 90.10 శాతం, తమిళనాడులో 83.50 శాతం, గుజరాత్లో 79.40 శాతం, రాజస్తాన్లో 76.80 శాతం, పశ్చిమబెంగాల్లో 76.50 శాతం, బిహార్లో 76.30 శాతం, మధ్యప్రదేశ్లో 75.80 శాతం ఉన్నట్లు తెలిపింది.