Influencer
-
Lasya Chittella: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గృహప్రవేశం (ఫోటోలు)
-
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్స్టాగ్రామ్లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్లైన్తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టతతన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు. -
నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. 13వ సంతానం?
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk)మరోసారి వార్తల్లో నిలిచారు. రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఇక, ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.క్లెయిర్ పోస్టుపై తాజాగా మస్క్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మస్క్.. Whoa అని కామెంట్స్ చేశారు. బిడ్డకు ఎవరు తండ్రి అని సమాధానం వచ్చేలా సెటైరికల్ పోస్టు పెట్టారు. ఇక, అంతకుముందు.. క్లెయిర్ తాను ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.అయితే, బిడ్డ విషయం గురించి తామిద్దరం దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని.. కానీ, కొన్ని మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేశాయని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తానే స్వయంగా తన బిడ్డ గురించి చెప్పడానికి ముందు వచ్చానని చెప్పారు. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నానని.. తమ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దని కోరారు. దీంతో, ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Whoa— Elon Musk (@elonmusk) February 15, 2025ఇదిలా ఉండగా.. మస్క్పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మస్క్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నారంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇక, ఎలాన్ మస్క్కు ఇప్పటికే 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేకపోగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎలాన్ కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn— Ashley St. Clair (@stclairashley) February 15, 2025纽约邮报挺厉害,2月15日采访了Ashley,详细回顾了她和马斯克交往怀孕生孩子的时间线:2023年5月•初次互动:Ashley St. Clair 在X(原Twitter)上与埃隆·马斯克开始互动。•私信联系:马斯克通过私信与她交流,话题从一张表情包(meme)开始。•对马斯克的印象:St. Clair… pic.twitter.com/2zndHn7IUG— 蔡子博士Chris (@caiziboshi) February 16, 2025 -
వినియోగదారుడా మేలుకో.. ఇన్ఫ్లుయెన్సర్ల మాయాజాలమిదే..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉంటోంది. వీరు ఫేస్బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram) యూట్యూబ్ (YouTube) తదితర డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చేసే పోస్టులకు మంచి రీచ్ వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగదారులపై తమ ఉత్పత్తుల ప్రచారంతో విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే వీరిలోని కొందరు చేసే అడ్వెర్టైజ్మెంట్లు, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఏఎస్సీఐ గతంలో సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన ప్రకటించింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఏఎస్సీఐ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.1. పారదర్శకత: ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్లకు సంబంధించిన వస్తుపరమైన ప్రయోజనాలను బహిర్గతం చేయాలి. ఆ వస్తువు లేదా సేవలకు సంబంధించిన చెల్లింపులు, బహుమతులు, ఉచిత ఉత్పత్తులు లేదా పరిహారం లాంటివి తప్పనిసరిగా వెల్లడించాలి.2. సరైన వివరణ: ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్ గురించి చెబుతున్నప్పుడు అది వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. హ్యాష్ట్యాగ్లు లేదా టెక్స్ట్లో అంతర్గతంగా దాచివుంచకూడదు. ఆ వివరాలు వినియోగదారునికి తెలిసేలా ఉండాలి3. స్పష్టత: ఎండార్స్మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, భాషలో ఉండాలి. అది అడ్వెర్టైజ్మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ లాంటి పదాలను ఉపయోగిస్తూ స్పష్టతవ్వాలి.4. వివిధ ప్లాట్ఫారాలు: ఏఎస్సీఐ వివిధ ప్లాట్ఫారాలకు నిర్దిష్ట రూపంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఇన్ఫ్లుయెన్సర్లు వాటిని గమనించి, ఆ నిర్దిష్ట నియమాలను పాటించాలి.5. ప్రస్తావన: ఇన్ఫ్లుయెన్సర్ మొదటి పోస్ట్లో మాత్రమే కాకుండా, స్పాన్సర్ చేస్తున్న ఉత్పత్తి లేదా సేవను గురించి ప్రస్తావించిన ప్రతిసారీ పారదర్శకత పాటించాలి.6. చట్టపరమైన సమ్మతి: ఇన్ఫ్లుయెన్సర్లు వారుంటున్న ప్రాంతంలోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఈ మార్గదర్శకాలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)లు రూపొందించి, అమలు చేస్తున్నాయి.7. పరిణామాలు: ఇన్ఫ్లుయెన్స ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది. వారికి జరిమానా కూడా విధిస్తారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మార్థదర్శకాలను ఉల్లంఘించినప్పుడు అని వారి ఖ్యాతిని దెబ్బతీస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను కోల్పోతారు. ఏఎస్సీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడం వలన ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్లో నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
రెండొంతుల డిజిటల్ స్టార్లు.. ఉల్లంఘనులే
ముంబై: ‘డిజిటల్ స్టార్లు’గా వెలుగొందుతున్న చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అడ్వరై్టజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడింట రెండొంతుల మంది (69 శాతం) యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ 2024’ జాబితాలో పేర్కొన్న ఇన్ఫ్లుయెన్సర్ల తీరుతెన్నులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఏఎస్సీఐ ఈ విషయాలు వెల్లడించింది. ఇందుకోసం 2024 సెప్టెంబర్–నవంబర్ మధ్యకాలంలో వారు ఇన్స్ట్రాగాం, యూట్యూబ్లో ప్రమోట్ చేసిన పోస్టులను విశ్లేషించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నిర్దేశించిన డిస్క్లోజర్ (కీలక వివరాలను ఫాలోయర్లకు వెల్లడించడం) మార్గదర్శకాలను పాటించడంలో 69 శాతం మంది విఫలమైనట్లు ఏఎస్సీఐ పేర్కొంది. పరిశీలించిన 100 పోస్టుల్లో 29 పోస్టుల్లో మాత్రమే తగినన్ని డిస్క్లోజర్స్ ఉన్నాయని, 69 కేసుల్లో ఉల్లంఘనలు రుజువయ్యాయని వివరించింది. ఫ్యాషన్–లైఫ్స్టయిల్, టెలికం ఉత్పత్తులు, పర్సనల్ కేర్ విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది. నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రమోట్ చేసే కంపెనీలు లేదా ఉత్పత్తులతో తమకున్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో వారి ఫాలోయర్లు పూర్తి సమాచారం ఆధారంగా సముచిత నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనల్లో పారదర్శకత లోపించడం, నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తుండటం ఆందోళనకరమైన విషయమని నివేదిక పేర్కొంది. నియంత్రణ సంస్థపరమైన చర్యలకు గురికాకుండా ప్రకటనకర్తలు, ఏజెన్సీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సమష్టిగా నిబంధనలకు అనుగుణంగా పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. -
ప్రియుడ్ని పెళ్లాడిన కర్లీ గర్ల్ అందమైన ఫోటోలు వైరల్
-
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన ‘కర్లీ గర్ల్’, యువరాణిలా..ఫోటోలు వైరల్
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ తన చిరకాల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. 'కర్ల్ గర్ల్' అనే ఇన్స్టా యూజర్నేమ్తో ప్రసిద్ధి చెందిన రూపాలీ హసీజా, బాక్సర్, హెల్త్ కోచ్ విజయ్కాంబ్లీని పెళ్లాడింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.దీంతో కొత్త జంటకు అభినందనల వెల్లువ కురుస్తోంది.పెళ్లికూతురు ముస్తాబులో రూపాలీ యువరాణిలా మెరిసిపోయింది. తెలుపు , గోధుమ రంగు మేళవించిన పువ్వులు, న్యూడ్-టోన్డ్ షీర్ చీరను ధరించింది. దానికి సరిపోయే దుపట్టాతో స్టైల్ చేసింది. రూపాలీ లుక్లో మరో హైలైట్ ఆమె ఆభరణాల ఎంపిక. వివాహ వేడుకను దృష్టిలో ఉంచుకుని, డైమండ్ నెక్పీస్, మ్యాచింగ్ కుందన్ మాంగ్ టీకా,మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులు భలే అందంగా అమరాయి. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్మరోవైపు, రూపాలి భర్త విజయ్ కాంబ్లీ ఆలివ్ రంగు కుర్తా-పైజామా ధరించాడు. అలాగే దానికి మ్యాచింగ్ తలపాతో పెళ్లి కొడుకు ముస్తాబులో రాజాలా ఉన్నాడు. తిలకం దిద్దడం, ముద్దు పెట్టుకోవడం లాంటి అందమైన ఫోటోను స్పెషల్ ఎట్రాక్షన్గా ఉన్నాయి. ఆచారాన్నిజనవరి 24న పెళ్లకున్నట్టు తెలిపింది. 10.1 లక్షలకుపైగా ఫాలోయర్లున్న రూపాలి తన స్పెషల్ డేగురించి ఇలా పోస్ట్ చేసింది. నేను నీ రాణిని, నువ్వు నా రాజావి."మై రాణి హన్ తేరే, తు రాజా మేరా వే మై హీర్ తేరే సజ్నా, తు రంఝా మేరా వే) అంటూ పేర్కొంది. (అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!) View this post on Instagram A post shared by R U P A L I H A S I J A (@curlgirlofficial)ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్గా పాపులర అయిన రూపాలీ ఎట్టకేలకు తన చిరకాల ప్రియుడిని వివాహం చేసుకుంది, అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ప్రపోజల్ ఫోటోలను షేర్ చేసింది. బీచ్లో అందమైన తమ డ్రీమ్ ప్రపోజల్ ఫోటోలను తమ బంధాన్ని అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే.గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయితాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.ఎవరీ గొడోయ్ ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్లతో ఫ్యాన్స్ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by RICARDO GODOI (@ricardo.godoi.oficial) -
ఇదేం విడ్డూరం..సింగిల్ అరటిపండు అంత ఖరీదా..?
మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరూ చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయలును చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశ్యం సబబే అనిపిస్తంది. మరోకోణంలో చూస్తే భారతీయలంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే..ఇక్కడొక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే..షాకవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటిపండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటిపండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్లు చెదిరే రేంజ్లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండే ధరే రూ. 100 పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.అయితే ఆ విదేశీయుడు హ్యూ. సరిగ్గా విన్నానా..? లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరుని చూసి కంగుతింటాడు ఆ విదేశీయుడు. సారీ తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే గాక ఇలా అమ్మితే కచ్చితంగా మీరు నష్టపోతారని అంటాడు. ఆ తర్వాత తన బ్రిటన్ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలస్తూ..భారత్లోని ఒక అరటిపండు ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చని అంటాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్ టాక్స్, చెల్లించి భారత్ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చెయ్యొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hugh Abroad (@hugh.abroad)(చదవండి: మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..) -
సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త టెక్నాలజీ సర్వత్రా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు’ (social influencers) వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థలు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేసేలా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు నూతన పంథాను అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్, డిజిటల్ మీడియా (Digital Media) ఇతర మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, (Instagram) ఎక్స్ (ట్విట్టర్).. ఇలా వివిధ రకాల ప్లాట్ఫామ్స్పై యువతరంతోపాటు వివిధ వయసుల వారు అధిక సమయమే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కొనుగోలు చేస్తున్న వస్తువులు, వివిధ కంపెనీల వస్తువులకు వారు చేస్తున్న ‘ఎండార్స్మెంట్స్’కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. కొందరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్నే తమ వృత్తిగానూ ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా...కంపెనీలు కూడా మార్కెటింగ్ వ్యూహాలను మార్చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారానో, మరో రూపంలోనో తమ ఉత్పత్తులను ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవి. ఎవరెంత...?మెగా ఇన్ఫ్లుయెన్సర్లు : సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో 10 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగి ఉన్నవారుమాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : సామాజిక మాధ్యమాల్లో 5 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగిన వారుమిడ్టైర్–ఇన్ఫ్లుయెన్సర్లు : 50 వేల నుంచి 5లక్షల దాకా ఫాలోవర్లు ఉన్నవారుమైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల నుంచి 50 వేల వరకు ఫాలోవర్లు కలిగి ఉన్నవారునానో–ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల వరకు ఫాలోవర్లు కలిగిన వారువేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్గతానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ద్వారా వినూత్న పద్ధతుల్లో ప్రచారానికి దిగుతున్నాయి. ప్రజాసంబంధాల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పేలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది వేగంగా విస్తరిస్తోంది. వివిధ బ్రాండ్లకు సంబంధించి టార్గెట్ వినియోగదారులను చేరుకునేందుకు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. డిజిటల్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖుల ద్వారా వివిధ కస్టమర్లను చేరుకునే ప్రయత్నాలను ఇప్పుడు తీవ్రతరం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ పర్సనాలిటీలుగా పేరుగాంచిన వ్యక్తుల ద్వారా వినియోగదారులకు ఆకర్షించడం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్ను ఉధృతం చేస్తున్నాయి. వివిధ ప్రముఖ బ్రాండ్ల వస్తువులను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారనే భావన వారి ఫాలోవర్లలో కలగని విధంగా చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని సాధించేస్తున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఇచ్చే ప్రకటనలు, ఆయా సందర్భాల్లో ఇచ్చే సందేశాల ద్వారా ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ‘బ్రాండ్ మేసేజ్’లను ఇచ్చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు నేరుగా ఆయా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం ఒక పద్ధతి కాగా, వాటి ప్రస్తావన లేకుండా ఏదైనా ఒక సామాజిక అంశం, ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం లేదా ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా వారు తమ ఫాలోవర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచారం చేయడం ద్వారా...వాటిని కొనుగోలు చేస్తే మంచిదని, ఫలానా వస్తువును సెలబ్రిటీ వాడుతున్నాడు కాబట్టి అది నాణ్యమైనది, మిగతా వాటి కంటే మెరుగైనదనే భావన కస్టమర్లలో ఏర్పడేలా వారి ఉవాచలు, వ్యాఖ్యలు, ప్రకటనలు వంటివి ఉపయోగపడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రచారం, ఆయా వస్తువుల గురించి ప్రస్తావన వంటి ద్వారా ప్రజాభిప్రాయం రూపుదిద్దుకునేలా ఇన్ఫ్లుయెన్సర్లు చేయగలుగుతున్నారు.భారత్లోనే ఎక్కువభారత్లో మధ్యతరగతి జనాభా అధికంగా ఉండడంతోపాటు ఈ తరగతి ప్రజలు ఎక్కువగా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండియన్ రిటైల్ మార్కెట్ అనేది అనేక రెట్లు పెరుగుతుండడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వేగంగా విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి అందివచ్చిన అవకాశాలుగా కలిసొస్తున్నాయి. ఈ కస్టమర్లను చేరుకొని, ఆయా వస్తువులు కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోపాటు స్థానిక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు పాత్రను చురుగ్గా పోషిస్తున్నారు.వార్తలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే తీరు, అందుకు అనుగుణంగా వీడియో ఫుటేజీ, సోషియో–పొలిటికల్ డేటా విశ్లేషణ వంటి వాటితో ప్రజలకు దగ్గర అయ్యారు. యువతను నేరుగా చేరుకునేలా చేసే వ్యాఖ్యానాలు, ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం ఆకట్టుకుంటోంది. తన పనితీరుతో తన మెయిన్ చానల్కు లక్షలాది మంది ఫాలోవర్లతోపాటుపెద్దసంఖ్యలో యూజర్లతో రికార్డు సృష్టించాడు. లోక్సభ ఎన్నికల సందర్భంగా 6 నెలల కాలంలోనే 60 లక్షల ఫాలోవర్లు పెరిగారు. రాఠీ వైరల్ వీడియోలను తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ, మరాఠీలోకి కూడా డబ్ చేస్తున్నారు – ధృవ్ రాఠీ (యూట్యూబర్, ఎడ్యుకేటర్)పర్యావరణం, నదులు, మన నేల వంటివాటిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ‘సేవ్ ద సాయిల్’పేరిట ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్వహించే టాక్షోలు లక్షలాది మందిని చేరుకుంటున్నాయి. సంస్కృతి పేరిట సంప్రదాయక కళలు, సంగీత రీతులను జనసామాన్యం చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. – సద్గురు జగ్గీవాసుదేవ్ (ఇషా హెడ్)ఓ ప్రముఖ జాతీయ న్యూస్చానల్లో పనిచేసి బయటకు వచ్చిన ఈయనకు లెక్కకు మించి అభిమానులున్నారు. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ చానళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం వాటికి 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. తన చానల్ ద్వారా నిజాలను వెల్లడించడంతోపాటు, అధికారంలో ఉన్న వారి పనితీరుపైనా విమర్శల వర్షం కురిపించడం ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.– రవీశ్కుమార్ (జర్నలిస్ట్)తాను నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ల ద్వారా ఫాలోవర్లకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. రన్వీర్ షో అకా టీఆర్ఎస్ పేరిట నిర్వహించిన షోలకు ఆర్నాల్డ్ షావర్జనిగ్గర్,. ఇస్రో చైర్మన్ డా. సోమ్నాథ్, ఆధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్దాస్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే వంటి వారు హాజరయ్యారు. తాను నిర్వహిస్తున్న 9 యూట్యూబ్ చానళ్ల ద్వారా 2.2కోట్ల మందిని చేరుకుంటున్నట్టుగా ఆయనే చెబుతుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతిని బాగా ప్రచారంలోకి తెచ్చేందుకు దోహదపడుతున్నారు. మాంక్ ఎంటర్టైన్మెంట్ కోఫౌండర్గా ఓ కొత్త మీడియా కంపెనీని ప్రారంభించి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.– రన్వీర్ అల్లాబాడియా అలియాస్ బీఆర్బైసెప్స్ (యూట్యూబర్) భారత్లోనే అత్యధికంగా పేరుగాంచిన కమేడియన్లలో ఒకడిగా నిలిచారు. తన హ్యుమర్తో కథలు చెప్పే విధానం, కవిత్వంతో కలగలిపి వివిధ అంశాలను వివరించడం, పూర్తి ప్రామాణికంగా వ్యవహరించడం ఆయన్ను అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటిదాకా వెయ్యికి పైగా షోలు చేశారు. లండన్ రాయల్ అల్బర్ట్ హాల్లో షో నిర్వహించిన ఆసియాకు చెందిన కమేడియన్గా పేరు సాధించారు. న్యూయార్క్లోని మాడిసన్ స్కేర్ గార్డెన్లోనూ షో నిర్వహించారు. చాచా విదాయక్ హై హమారే...వెబ్ సిరిస్ను అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించారు. – జకీర్ఖాన్ (బాద్షా ఆఫ్ కామెడీ) -
అందరూ చూస్తుండగానే సోషల్ మీడియా స్టార్ కన్నుమూత : దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అన్నాడో సినీ కవి. నిజమే కదా..ఏ విషాదం ఎలా ముంచుకొస్తుందో, ఎవరి మరణం ఎలా దూసుకొస్తుందో తెలియదు. ఆహార నియమాలుపాటిస్తూ, నిరంతరం వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్గా ఉన్నాం అనుకునేవారు కూడా గుండెపోటుతో విలవిల్లాడుతూ కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోషల్ మీడియా స్టార్ అకాల మరణం ఇలాంటి నిర్వేదాన్ని మిగులుస్తోంది. అప్పటివరకూ ఎంతో సంతోషంగా, ఆడుతూపాడుతూ ఉన్న ఆమెను మృత్యువు కబళించిన తీరు పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.27 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ అకోస్టా అనూహ్య మరణి ఆమె ఫ్యాన్స్ను విషాదంలోకి నెట్టేసింది. ఇన్స్టాగ్రామ్లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్న కరోల్, న్యూయార్క్లో(NewYork) తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. భోజనం చేస్తున్న సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరైంది. కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ప్రాణాలొదిలేసింది. కరోల్ ఆన్లైన్లో ‘కిల్లడమెంటే’(‘Killadamente’) అనే పేరుతో కూడా సుపరిచితురాలు. ఫ్యాషన్, జీవనశైలి, మాతృత్వంపై వీడియోలను షేర్ చేస్తే ఆదరణ పొందింది. బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తూ, తన వ్యక్తిగత విషయాలు, తాను నెట్టుకొచ్చినతీరు ముఖ్యంగా ఆందోళన, నిరాశతో తన స్ట్రగుల్ గురించి నిస్సంకోచంగా తెలియజేస్తూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కరోల్ మరణవార్తను ఆమె సోదరి కట్యాన్(Katyan) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియ జేసింది.“నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరీ.ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. ఇంత మంచి మనసున్న సోదరిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నీకు మనశ్సాంతి సోదరీ” అంటూ భావోద్వేగంతో ఒక సందేశం పోస్ట్ చేసింది. ఈ విషాదంలో తమకు సానుభూతి తెలిపిన అకోస్టా అభిమానులకు కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ పోస్ట్ ఇపుడు కనిపించడం లేదు. మరో పోస్ట్లో కరోల్ తన సోదరి మాత్రమే కాదని, పార్ట్నర్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ కట్యాన్ గుర్తు చేసుకుంది. View this post on Instagram A post shared by Reina (@killadamente) న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం, జనవరి 3న కరోల్ డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది పడిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరోల్ మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉందని సోదరి కట్యాన్ శవపరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, అప్పుడే అసలు విషయం తెలుస్తుందని పేర్కొంది. కరోల్ అకోస్టా మరణంపై ఫాలోవర్లు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది, ఇంత చిన్న వయసులో వెళ్లిపోయావు, వి మిస్ యూ , ఆర్ఐపీ, అన్న సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్స్టాగ్రామ్లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్కి ఇన్స్టాగ్రామ్లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్ల్యాండ్లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
‘స్వామీ.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు, త్వరలో జంటగా’ : ఇన్ఫ్లూయెన్సర్పోస్ట్ వైరల్
బీర్బైసెప్స్గా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రణవీర్ అల్లాబాడియా. భారతదేశంలోని అత్యంత ప్రముఖ యూట్యూబర్ పోడ్కాస్టర్కు ఒక మహిళా వీరాభిమాని ఉంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్తో ఇంటర్నెట్ సంచలనంగా మారిన రణవీర్ను రోహిణి అర్జు అనే అమ్మాయి విపరీతంగా అభిమానిస్తుంది. దీనికి సంబంధించి అనేక రీల్స్,వీడియోలు గతంలో నెట్టింట్ హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేయడం విశేషంగా నిలిచింది.ఆ అభిమాని పేరే రోహిణి అర్జు. ఈమె ఆధ్యాత్మికత కంటెంట్ క్రియేటర్. పశువైద్యురాలు. అల్లాబాడియా పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలను పోస్ట్ చేసింది. తాజాగా "స్వామీ, నేను వేచి ఉన్నాను..."అంటూ అతనికి ప్రపోజ్ చేసింది. ‘‘ఎంతమంది వెక్కిరించినా, ఎగతాళి చేసినా,పిచ్చి అనుకున్నా, ఎక్కడ ఎలా, ఉన్నావనేదానితో సంబంధం లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. రణ్వీర్ అల్లాబాడియా.. నా స్వర్వస్వం నీవే’’ అంటే పోస్ట్ చేసింది. ఆమె శరీరంపై ‘రణవీర్’ టాటూను కూడా గమనించవచ్చు. అక్కడితో ఆగలేదు. మరొక పోస్ట్లో, "స్వామీ,మీ కోసం జీవితకాలం వేచి ఉన్నాను, చివరకు భార్యాభర్తలుగా త్వరలో మారబోతున్నాము" అని పేర్కొంది. అల్లాబాడియా ఫోటోలను అల్పాహారం చేయడం, బెడ్ మీడ పెట్టుకుని నిద్రపోవడం దాకా రీల్స్ చేసింది. దీంతో ఇది మరోసారి నెట్టింట చర్చకు దారి తీసింది. కొంతమంది రణవీర్కు ట్యాగ్ చేస్తుండగా, మరికొంతమంది ఈమెకు వెంటనే మానసిక చికిత్స కావాలంటూ వ్యాఖ్యానించారు. ఇది ఎరోటోమానియా అనే మానసిక రుగ్మత అని కొందరు, కేవలం ఆన్లైన్ క్రేజ్, డబ్బు కోసం చేస్తున్న పని అని మరికొందరు వ్యాఖ్యానించారు. గతేడాది సెప్టెంబరులో, అల్లాబాడియాకు, తనని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రకటించేసింది. ఫలితంతో సంబంధం లేకుండా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. గతంలో కర్వా చౌత్ ఆచారాన్ని (పెళ్లైన మహిళలు, కొత్త పెళ్లికూతుళ్లు వ్రతం ఆచరించే) పాటిస్తున్న వీడియోను ఫోటోతో షేర్ చేయడం వైరల్గా మారిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Dr. Rohini Arju (@rohiniiarju) -
భర్తకు కన్నీటి నివాళి : బోరున విలపించిన ఇన్ప్లూయెన్సర్ సృజన సుబేది
క్యాన్సర్తో పోరాడి ఓడిపోయిన నేపాల్కు చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ బిబేక్ పంగేని అంత్యక్రియలు న్యూయార్క్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అతని భార్య సృజన సుబేది బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. ధైర్యంగా ఉండు మిత్రమా అంటూ నెటిజన్లు సృజనకు ధైర్యం చెబుతున్నారు.2022లో పంగేని క్యాన్సర్ను గుర్తిచారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సృజన కంటిరెప్పలా కాపాడుకుంది. అన్నివేళలా అతనికి తోడుగా ఉంటూ, ధైర్యం చెబుతూ కన్నతల్లి కంటే మిన్నగా సేవలందించింది. చివరికి ఆమె ప్రేమ ఓడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో పీహెచ్డీ విద్యార్థి అయిన బిబెక్ పంగేని సుదీర్ఘ పోరాటం తర్వాత (డిసెంబరు19న) తనువు చాలించారు.Last Farewell Of Bibek Pangeni In New York. #bibekpangeni #sirjanasubedi pic.twitter.com/Wzpjdff1cP— Neha Gurung (@nehaGurung1692) December 22, 2024మూడో దశ గ్లియోమాతో పోరాడుతున్న భర్త చికిత్సకు చికిత్స సమయంలో ధైర్యంగా నిలబడింది.ఎ లాగైన తన భర్తను కాపాడుకోవాలని తాపత్రయప పడింది. తన మొత్తం సమయాన్ని వెచ్చించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేసేది. తాను ధైర్యంగా ఉండటమే కాదు భర్తకు ప్రేమను పంచుతూ తనలాంటి వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. సోషల్మీడియాలో వీరి రీల్స్, వీడియోలు నెటిజనుల హృదయాలను కూడా కదిలించేవి. అతను తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఎవరి ప్రార్థనలు ఫలించలేదు. -
మోదీ మెచ్చిన పాపులర్ గేమర్ పెళ్లి సందడి (ఫోటోలు)
-
పెదవులు బొద్దుగా కనిపించాలంటే..!
ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__) View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)strong> ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
జన్నత్ జుబైర్ రహమానీ
యాక్ట్రెస్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె హోమ్ టౌన్ ముంబై. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ్యూజిక్ వీడియోస్లో కూడా పర్ఫార్మ్ చేసింది. 2017లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. వ్లాగ్స్, మేకప్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్కు దాదాపు యాభై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లిప్ సింక్ వీడియోలతో జన్నత్ టిక్టాక్లోనూ పాపులర్ అయింది. మన దగ్గర టిక్టాక్ బ్యాన్ అయ్యాక, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ అందులో ఫేమస్ అయిపోయింది. ఆమె ఇన్స్టాకి దాదాపు అయిదుకోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్కి తెలియజేయడానికి "Jannat Zubair Rahmani Official" అనే యాప్నీ లాంచ్ చేసింది జన్నత్. ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకుంది. -
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్టాక్ స్టార్, షాక్లో ఫ్యాన్స్
"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్టాక్ స్టార్ కుబ్రా అయ్కుట్ (Kubra Aykut) అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్మీడియ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయుకుట్ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్లోఅనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది .స్థానిక మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్ 23న ఆమె చనిపోయింది. టిక్టాక్ వీడియోలో, ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించడంతో ఈ ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టిక్టాక్లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు,ఇన్స్టాగ్రామ్లోరెండు లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. సూసైడ్ నోట్"నేను నా ఇష్టపూర్వంకంగానే దూకాను. ఎందుకంటే నాకు ఇక జీవించాలని లేదు. ఫిస్టిక్ని బాగా చూసుకోండి. నేను నా జీవితంలో అందరికీ మంచిదాన్నే, ఇక మంచిగా ఉండలేను. మంచిగా బతకడం వల్లన నాకేమీ ఒరగలేదు. స్వార్థం ఉంటేనే, సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదు.. నన్ను నేను ప్రేమించానుకుంటూ వెళ్లిపోతున్నాను. ఒక్క సారి నన్ను క్షమించండి’’ (హరివరాసనం : చిన్నారి విష్ణుప్రియ నృత్యాభినయం, వీడియో వైరల్) అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో పడిన్నట్టు తెలుస్తోంది. మరణానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియా ఇలా పోస్ట్ చేసింది "నేను నా శక్తిని సేకరించాను, కానీ నేను బరువు పెరగడం లేదు. ఈ రోజు నేను 44 కిలోగ్రాములకు పడిపోయాను, నేను ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు; నేను అత్యవసరంగా బరువు పెరగాలి”. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్లపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్ను విషాదంలో ముంచేసింది.ఇదీ చదవండి: చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో -
ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక యుగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా.. అది పుట్టించిన సెలబ్రిటీల హవా రానున్న రోజుల్లో మరింత పుంజుకోనుంది. నగరంలో సైతం పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోషల్ బీట్, ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ గురించిన విశేషాలు వెల్లడించింది.నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా బ్రాండ్లు, 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్స్– ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రూ.5,500 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా పరిశ్రమలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ 11 శాతంగా లెక్కించింది. ఈ నివేదికను బ్రాండ్లకు వారి మార్కెటింగ్ అవసరంతో పాటు ఈ పరిశ్రమ ఏటా 25% పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.ఒకప్పుడు ఉచితంగానే..దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి నేను ఇన్ఫ్లుయెన్సర్గా మారినప్పుడు కొన్ని బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం సంప్రదించాయి. అయితే అప్పుడు మాకు నామమాత్రంగా ఖర్చులకు తప్ప పారితోíÙకం రూపంలో ఏమీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం మంచి అమౌంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నగరంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్లో రూ.లక్ష నుంచి రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నాకు వస్తున్న బ్రాండ్స్ను బట్టి తొలుత ఫుడ్ ట్రావెలర్గా మాత్రమే ఉన్న నేను ఇప్పుడు లైఫ్స్టైల్ ఉత్పత్తులతో సహా అనేక బ్రాండ్స్కు వర్క్ చేస్తున్నాను. – అమీర్, ఇన్ఫ్లుయెన్సర్ఇవి చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి.. -
2027 నాటికి రూ.పది వేలకోట్లకు చేరే మార్కెట్
దేశంలో 2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని ‘ఇన్ఫ్లుయెన్సర్.ఇన్’ సంస్థ నివేదిక తెలిపింది. దేశీయంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం ఎలా ఉంది..ఇన్ఫ్లుయెన్సర్లు ఏమేరకు ప్రభావం చూపిస్తున్నారు..కంపెనీలు ఎలాంటి ప్లాట్పామ్ల ద్వారా తమ ఉత్పత్పులను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి..వంటి అంశాలను ఈ ‘ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024’ నివేదికలో తెలియజేశారు. ఈ నివేదిక రూపొందించేందుకు 100కు పైగా బ్రాండ్లపై సర్వే నిర్వహించారు. 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించినట్లు సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా ఇన్ఫ్లుయెన్సర్.ఇన్ సహ వ్యవస్థాపకులు సునీల్ చావ్లా మాట్లాడుతూ..‘డిజిటల్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్లకు వృద్ధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతుండడంతో కంపెనీలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లిక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్ల్లో తమ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాయి. ఈ సంస్థలు ఇన్ఫ్లుయెన్సర్ అనలిటిక్ టూల్స్ను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుంది’ అని చెప్పారు.ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024లోని కొన్ని ముఖ్యాంశాలు2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని అంచనా.డిజిటల్ మీడియా మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ విలువ 11 శాతంగా ఉంది.ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ వంటి విభాగాల్లో 40-57 శాతం బ్రాండ్లు 2026 నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్పై చేసే ఖర్చును 10% పెంచుతాయి.ఈ మార్కెటింగ్లో కంపెనీలకు కొన్ని సవాళ్లున్నాయి. అందులో ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్ఓఐ). అంటే సంస్థ ఉత్పత్తులను ఫలానా యాడ్ చూసే కొనుగోలు చేస్తున్నారనే కచ్చితమైన లెక్కలుండవు.ఇన్ఫ్యుయెన్సర్లు కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నమ్మకమైన ప్రేక్షకులను సంపాదించడం కష్టంగా మారుతుంది.2025 నాటికి బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ దేశీయంగా రూ.6,875 కోట్లకు చేరనుంది. ఏటా 25 శాతం వృద్ధి రేటుతో 2027 నాటికి ఇది రూ.10,750 కోట్లకు చేరుతుందని అంచనా.బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా 85 శాతం కంపెనీలు ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లను కలిగి ఉన్నాయి. 64 శాతం కంపెనీలు 5-20 శాతం ప్రత్యేకంగా ప్రచారకర్తలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపాయి.గతంలో కంటే 2024లో కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులను దాదాపు 10 రెట్లు పెంచినట్లు తెలిపాయి.ఇన్స్టాగ్రామ్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లతో 58.5 శాతం కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐ ఫండ్కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..93 శాతం క్రియేటర్లు కంపెనీలతో ఎక్కువకాలం కార్యకలాపాలు సాగించాలని కోరుకుంటున్నారు. 43 శాతం మంది ప్రచారం చేస్తున్న బ్రాండ్ క్వాలిటీపై కూడా దృష్టి సారిస్తున్నారు.క్రియేటర్లు అధికంగా బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎంచుకుంటున్న మాధ్యమాల్లో 93.8 శాతం ఇన్స్టాగ్రామ్, 54.4 శాతం యూట్యూబ్, 28.1 శాతం ఫేస్బుక్, మిగతా లింక్డ్ఇన్, స్నాప్చాట్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లను వినియోగిస్తున్నారు.కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలని ఎక్కువగా 90.2 శాతం ఇన్స్టాగ్రామ్, 51.2 శాతం యూట్యూబ్, 19.5 శాతం లింక్డ్ఇన్ను వినియోగిస్తున్నాయి. -
ఆమెలా కనిపించాలనుకోవడమే శాపమయ్యింది! ఎంతో గొప్పదైన..
ఇటీవల కాస్మెటిక్ సర్జరీలు కేవలం ప్రముఖులు, సెలబ్రిటీలకు పరిమితం కాలేదు. సాధారణ వ్యక్తులు, ఓ మోస్తారుగా డబ్బున్నవాళ్లు సైతం ఈ సర్జరీలు వెంటపడుతున్నారు. తీరా చేయించుకుని హాయిగా ఉంటున్నారా అంటే లేదనే చెప్పాలి. పలు సైడ్ ఎఫెక్ట్స్తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భాలీవుడ్ భామ, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్ ఉండాలని చేయించుకున్న సర్జరీలు ఆమెకు తీరని బాధను మిగిల్చింది. స్త్రీ జీవితంలో ఎంతో అపరూపమైన దానిపై దెబ్బకొట్టింది. జీవితంలో ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే..బ్రెజిల్ ఇన్ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లోన్లా కిమ్ కర్దాషియాన్లా కనిపించేందుకు ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చుచేసింది. అయితే తనకు నచ్చిన హీరోయిన్లా మారానన్న ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే ఆమె కర్దాషియాన్లా కనిపించేందుకు అంతలా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. చెప్పాలంటే ఆమెలా తన రూపును మార్చెందుకు శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదలకుండా సర్జరీలతో మార్పులు చేసుకుంది. చెప్పాలంటే సర్జరీలు చేయించుకోవడమే తన పని అన్నంతగా చేయించుకుంది. దీనికి ఆమె శరీరం ప్రతిస్పందించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె శరీరంలో పలు దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. ఇక ఆమె వాటి కోసం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. చెప్పాలంటే చావు అంచులాదాక వెళ్లింది. ఈ కాస్మెటిక్ సర్జరీల్లో బట్ ఫిల్లర్లను వినియోగిస్తారు. ఇది వక్షోజాలు, పిరుదులు ఆకృతిని పెంచేందుకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఇందులో వినియోగించే పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందరికి ఇది సరిపోకపోవచ్చు. ఇక్కడ పాంఫ్లోన్లా విషయంలో అదే జరిగింది. అది ఆమెకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రత్యుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఆమె సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది. చెప్పాలంటే ఆమె తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ. కర్దాషిలా కనిపించాలనే కోరిక మాతృత్వాన్ని దూరం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు సైతం మాట్లాడుతూ.."ఆమెకు ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకంగా మారింది. అదృష్టవశాత్తు ధ్యానం, సమతుల్య ఆహారం, చికిత్సతో మరణం అంచుల నుంచి బయటపడింది. కానీ అది ఆమె మాతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని ఊహించలేదు." అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాంప్లోన్లా 17 ఏళ్ల వయసు నుంచి ఈ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు 30 సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా 2022లో బాడీ డిస్మోర్ఫియాతో విలవిల్లాడింది. ఇక సర్జరీలు ఆపేయాలని అనుకుంటుండగా శరీరం రియాక్షన్ ఇవ్వడం ప్రారంభించింది. చివరకి అది కాస్తా ఆమె ప్రాణాలనే సంకటంలో పడేసింది. మానసికి ఆరోగ్యంపై దృష్టి సారించి ధ్యానం, యోగా వంటి వాటితో ఆరోగ్య మెరుగు పడేలా చేసుకుంది. అంతేగాదు తనలా ఇలాంటి సర్జరీలు జోలికి వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహాలిస్తోంది. (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
Santoshi Shetty: బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్గా..
ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ బ్లాగర్. ‘The Style Edge’ ఫౌండర్. సోషల్ మీడియా స్టార్. ఇన్స్టాలో ఆమెకు ఏడు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. సొంతూరు ముంబై. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేసింది.కాలేజీ రోజుల్లోనే తన పేరు మీదే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. డార్క్ స్కిన్ వల్ల తను ఎదుర్కొన్న వివక్షను వివరిస్తూ చేసిన వీడియోతో పాపులర్ అయింది. అది ఆమెకు మోడలింగ్ చాన్స్నిచ్చింది. ర్యాంప్ మీద షో స్టాపర్గా నిలిచింది. ‘Grazia India’ లాంటి ఫ్యాషన్ మ్యాగజీన్లు ఆమె ఫొటోతో కవర్ పేజ్ని మేకప్ చేసుకున్నాయి. బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్గా ఎన్నో అవార్డులూ అందుకుంది సంతోషి శెట్టి.ఇవి చదవండి: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి -
Vishwak Sen: థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపారం ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ప్రముఖ సినీ నటుడు విశ్వక్సేన్ తెలిపారు. నెక్లెస్ రోడ్లోని అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘థ్రిల్ సిటీ’ ఆధ్వర్యంలో థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విశ్వక్సేన్ ఆవిష్కరించారు. క్రియేటివిటీ ఫీల్డ్లో కొత్తగా ప్రవేశించేవాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చని అన్నారు. ఇందులో భాగంగా థ్రిల్సిటీ విడియోలను ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేయాలని కో–ఆర్డినేటర్ బందూక్ లక్ష్మణ్ తెలిపారు. మూడు విభాగాల్లో ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ లక్ష చొప్పున 3 లక్షల నగదు బహుమతులను అందిస్తున్నామన్నారు. -
మారుతున్న ప్రచార పంథా
ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.భారత్లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి. -
యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ
కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేస్తున్నా, ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది. నీషా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.నలుగురి కోసంఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్లో చేస్తున్నది కార్పొరేషన్లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ కంటెంట్ క్రియేటర్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి పూర్తిగా యూట్యూబ్నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది. View this post on Instagram A post shared by Nischa Shah (@nischa.me)2021 డిసెంబర్లో తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావడం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే సాగింది. ఈ క్రమంలోనే 2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్ చేస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్ చేస్తుంది. ముఖ్యంగా "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్టనర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్కు చెందిన నీషా షా నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) చదివారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇపుడు బ్యాంకింగ్ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా. -
ఓర్రీ న్యూ లుక్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓర్రీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. సినీతారలు. హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో అంతలా ఫేమస్ అయ్యాడు. రచయితగా, సింగర్గా, ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఓర్రీ తాజాగా న్యూ హెయిర్ కట్తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. నేను ప్రతి సాయంత్రం మేల్కొంటాను.. మీరు ఇప్పటికీ 9 నుంచి 5 వరకు పనిచేస్తూనే ఉంటారు.. అది ఎంత చెడ్డదోనని ఆశ్చర్యపోతున్నానంటూ పోస్ట్ చేశారు.అయితే ఒర్రీ హెయిర్ స్టైల్పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అతని న్యూ లుక్ను ఉద్దేశించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని లుక్ను చికెన్ హెయిర్ కట్ అంటూ కోడిపుంజుతో కొందరు పోల్చారు. మరికొందరేమో నా పాతబట్టలు తీసుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇంకొందరైతే ఏకంగా చికెన్ సెంటర్లో పనిచేసే వాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.ఎవరీ ఓర్రీ...ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్గా, ఫ్యాషన్ డిజైనర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, స్టైలిష్గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్బాల్ కూడా ఆడతాను. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
ఈ వీడియోలు యమా టేస్టీ..
సాక్షి, అమరావతి : జేక్ డ్రయాన్, ఆండ్రియా, చెయ్సింగ్, సారా టాడ్, బెరిల్ షెరెషెవ్స్కీ.. వీరంతా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. జేక్ డ్రయాన్ది ఇంగ్లండ్ అయితే.. ఆండ్రియా ఒక జర్మన్.. సారా టాడ్ ఒక ఆస్ట్రేలియన్.. బెరిల్ షెరెòÙవ్స్కీది న్యూయార్క్. వీరందరిలో ఒక సారూప్యత ఉంది. రకరకాల భారతీయ వంటకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇలా వారు ఇన్స్ట్రాగాం రీల్స్, యూట్యూబ్ షాట్స్ ద్వారా సోషల్ మీడియా వేదికపై లక్షలకొద్దీ ఫాలొవర్లను సంపాదించుకుని ఘుమఘుమలాడే మన దేశీయ రుచులకు ఎక్కడలేని ప్రాచుర్యం కల్పిపస్తున్నారు. యూట్యూబ్ వంటల వీడియోల్లో ఇటీవల కాలంలో కొత్త ఒరవడి మొదలైంది. కేవలం మన దేశానికి పరిమితమై ఉండే, లేదంటే ఇక్కడే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండే చాలారకాల వంటలపై మన దేశంతో ఏ సంబంధంలేని విదేశీయులు కొందరు రూపొందిస్తున్న వీడియోలు లక్షల మంది భారతీయులు మెచ్చుకునేలా ఉంటున్నాయి. ఫుడ్ బ్లాగర్ అయిన జేక్ డ్రయాన్ తనకు తానుగా దక్షిణాది భారతీయులకు అత్యంత ప్రియమైన సాంబారు–ఇడ్లీ వండుతూ చేసిన వీడియోను 25 లక్షల మంది వీక్షించారు. కేవలం ఇన్స్టాలోనే దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న డ్రయాన్ మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 17 రాష్ట్రాలకు చెందిన వంటకాలపై వీడియోలు చేశారు. ఇతను మన దేశాన్ని ఎప్పుడూ సందర్శించనప్పటికీ మనవాళ్ల ఆసక్తి, అభిరుచుల నాడి పట్టుకుని పసందైన వీడియోలు చేస్తున్నారు. బిహార్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘సత్తు కా పరంత’.. రాజస్థాన్ ‘దాల్ బాటి చుర్మా’ వీడియోలకు నెట్టింట అత్యంత ఆదరణ దక్కింది. అలాగే, జర్మనీకి చెందిన అండ్రియా మన దేశంలోని పంజాబ్ యువకుడిని పెళ్లి చేసుకుంది. దాంతో భారతీయ వంటకాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. అలా ఆండ్రియా రూపొందించిన భారతీయ వంటల వీడియోలకు సోషల్ మీడియా ఇన్స్ట్రాగాంలో ఆమెకు 1.69 లక్షల మంది ఫాలోవర్లును తెచి్చపెట్టింది. అంతేకాదు.. ఆ్రస్టేలియాకు చెందిన సారా టాడ్, న్యూయార్క్లో నివాసం ఉండే బెరిల్ షెరెషెవ్స్కీ లాంటి విదేశీయుల భారతీయ వంటల వీడియోలు మన దేశంలో యమా క్రేజ్ పొందాయి. ఉపాధి అవకాశాల్లోనూ అదరహో.. ఇక మన దేశంలో అత్యధిక మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిపస్తున్న రెండో అతిపెద్ద రంగంగా కూడా ఆహార రంగం ప్రగతి సాధించిందని ఆరి్థక నిఫుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఏటా 85 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు తెచ్చి పెడుతుండగా, 2028 నాటికి ఏటా కోటికి మందికి దక్కే అవకాశం ఉందని అంచనా. ది ఇండియా ఫుడ్ సర్వీవస్ రిపోర్టు–2024 ప్రకారం..ప్రస్తుతం దేశంలో ఏటా ఆహార రంగ వ్యాపారం రూ.5.69 లక్షల కోట్లు 2028 నాటికి చేరుకునే మొత్తంరూ.7.76 లక్షల కోట్లు ప్రస్తుతం ఈ రంగంలో ఏటా ఉపాధి అవకాశాలు 85 లక్షలమందికి 2028 నాటికి ఉపాధికోటి మందికి 2028 నాటికి ఈ రంగం వ్యాపార లావాదేవీల్లో సంఘటిత రంగంవాటా 53 %ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో అసంఘటిత రంగం వాటా56.7 %వంటలపైనే ఏటా రూ.5.69 లక్షల కోట్ల వ్యాపారం.. ఇలా యూట్యూబ్లో వంటల వీడియోలు చూస్తూ నచి్చన వంటలను చేసుకుని తినడమే కాదు.. అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదించే సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రెస్టారెంట్లు వీకెండ్స్, సెలవు రోజుల్లో కిక్కిరిసిపోయి ఉంటున్నాయంటే ఫుడ్ బిజినెస్కు ఏ స్థాయిలో ఆదరణలో ఉందో తెలుస్తుంది. నిజానికి.. ఆరి్థకవేత్తలు చెబుతున్న గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం ఈ ఆహార రంగంలో జరుగుతోంది. ఇంకోవైపు.. దేశంలో అన్ని వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న వృద్ధి కంటే ఒక్క ఆహార రంగంలోని వ్యాపార వృద్ధే అధికంగా ఉన్నట్లు వారంటున్నారు. ది ఇండియా ఫుడ్ సర్వీస్ రిపోర్టు–2024 ప్రకారం.. దేశ ఆహార రంగంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం కొనసాగుతుండగా, 2028 నాటికి అది ఏకంగా రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులు.. ఇలా.. ఈ రంగంపై భారీ వృద్ధి అంచనాలు ఉండడంతో బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలు సైతం ఈ రంగంపై కన్నేసి కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో 56.7 శాతం మేర అసంఘటిత రంగంలోని చిన్న హోటళ్ల ద్వారా సాగుతుండగా, 2028 నాటికి ఈ లావాదేవీలు 47 శాతానికి పరిమితమై ప్రభుత్వం వద్ద గుర్తింపు పొందిన సంఘటిత రంగం ద్వారా 53 శాతం లావాదేవీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. -
ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?
సోషల్ మీడియాలో ఇటీవల పలు ఫిట్నెస్ ఛాలెంజ్లు, డేరింగ్ ఛాలెంజ్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ వ్యక్తులు వరకు ప్రతిఒక్కరూ వాటిని చేసి చూపిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరడం వంటివి చేస్తారు. మొదట ఐస్ కూలింగ్ బకెట్ ఛాలెంజ్ అంటూ మొదలై అలా పలు రకాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఫిట్నెస్ పరంగానూ ఆరోగ్యపరంగానూ మంచివి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రమాదకర స్టంట్లే లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి రిస్కీ ఛాలెంజ్ ఫేస్ చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ ఇన్ఫ్లుయెన్సర్. ఏంటా ఛాలెంజ్? అంత డేంజరా అంటే..?చైనాలోని పాన్ జియోటింగ్ అనే ఇన్ఫ్లుయెన్సర్కి ఆన్లైన ఛాలెంజ్లను తీసుకోవడం అంటే మహా సరదా. అలాంటివి ఎన్నో ఛాలెంజ్లు తీసుకుంది. అలానే ఇటీవల ఆమె ఈటింగ్ ఛాలెంజ్ తీసుకుంది. దీన్ని లైవ్లో చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఛాలెంజ్లో జియోటింగ్ పదిగంటలకు పైగా ఎక్కువసేపు తినవలసి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందికరమైనది వద్దు అని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు హెచ్చరించినా..పది కిలోలకు పైగా ఆహారాన్ని తినేందుకు ఉపక్రమించింది. ఒక దశలో ఆమె శరీరం హెవీ ఫుడ్ని తట్టుకోలేకపోవడంతో చివరికీ ఆమె మరణానికి దారితీసింది. అంతేగాదు పోస్ట్మార్టం రిపోర్టులో డా ఆమె కడుపు వైకల్యంతో మరణించిందని రావడం గమనార్హం. ఆమె కడుపులో జీర్ణకానీ ఆహారం పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో మరణించిందని పోస్టమార్టం రిపోర్టులో తేలింది. అతిగా తినడం ఇంత ప్రమాదకరమైనదా అంటే..కొంతమంది రుచిలో మైమరిచి బాగా లాగించేస్తుంటారు. అలాగే అతని బ్రెయిన్ సైతం నచ్చిన ఫుడ్ని చూసి బాగా తినేలా ప్రేరేపించేస్తుంది. దీంతో కంట్రోల్ లేకుండా తింటాం. ఇలాంటప్పుడూ వెంటనే భయానక సమస్యలు రావుగానీ. పనిగట్టుకుని ఇలా పెద్ద మొత్తంలో ఆహారం తీసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా పెద్ద మొత్తంలో పొట్టలోకి ఆహారాన్ని పంపిస్తారో అప్పుడూ గ్యాస్ట్రిక్, ఆమ్లత్వం, కడుపునొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి ఎదురవ్వుతాయి.అదీగాక జీర్ణశయం కూడా అంత మొత్తంలోని ఆహారాలను జీర్ణించుకోలేకపోతుంది. పైగా ఆ ఆహారం కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం లేదా అధిక బరువు వంటి వాటికి దారితీసి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పెద్ద మొత్తంలో తినాలన్నా ఆత్రుతలో సరిగా నమలితినం. దీంతో ఆహారం సాఫీగా జీర్ణం గాక పొట్ట బరువై ఉక్కిరిబిక్కరిగా అయిపోయి ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఆహారం విషయంలో మనసుపెట్టి బాగా నమిలి ఆస్వాదిస్తూ మితంగా తీసుకోవడమే మంచిదని లేదంటే లేనిపోని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. అంతేగా ఫుడ్ ఛాలెంజ్ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.(చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!) -
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ లైవ్ టెలికాస్ట్లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయారు. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ ఈటింగ్ ఛాలెంజ్లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు తినడం వల్ల మరణించినట్లు సమాచారం. స్థానిక చైనా మీడియా వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతి ఈటింగ్ ఛాలెంజ్లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. ఇలా అతిగా తినడం మంచిది కాదని.. ఆమె కుటుంబసభ్యులు వారించినా పట్టించుకోలేదు.ఇలా చివరికి అదే ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొని ప్రాణాలో పోవడంతో విషాదం నెలకొంది. జియోటింగ్ మరణం అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్లో జీర్ణించుకోలేని విధంగా ఆహారం తినడం వల్లే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?
‘నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు– ‘చక్కని సంగీతం వింటాను. నచ్చిన పుస్తకం చదువుకుంటాను’... ఇలాంటి జవాబులు వినిపించడం సాధారణమే. అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ టియా విల్సన్ నోటి నుంచి వచ్చిన మాట విని నెట్ లోకులు షాకు అయ్యారు. ‘సౌకర్యవంతంగా. సుఖంగా నిద్రపోవడానికి నా భుజాన్ని డిస్లొకేట్ చేస్తాను. నిద్ర నుంచి లేచిన తరువాత తరిగి యథాస్థానంలో అమర్చుకుంటాను’ అంటుంది విల్సన్. ‘జోక్ చేస్తోందా?’ అనుకోవద్దు. ఆమె చెప్పింది నిజమే. ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (ఈడీఎస్)తో బాధపడుతోంది టియా విల్సన్. ‘ఈడీఎస్’ అనేది జన్యుపరమైన రుగ్మత. చర్మం సాగదీయబడినట్లుగా ఉంటుంది. కీళ్లు వదులవుతాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. భుజాన్ని డిస్లొకేట్ చేసినప్పుడు అచేతనంగా మారి వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ‘హౌ ఐ స్లీప్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో టియా విల్సన్ పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వీక్షకుల గుండెలను చెమ్మగిల్లేలా చేసింది. View this post on Instagram A post shared by Tia Wilson (@tortillawilson) (చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు..చివరికి?) -
రీల్స్ చేస్తూ జలపాతంలో పడి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మృతి
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో ఈ ఘటన జరిగింది.ముంబైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, కోస్ట్ గార్డ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి యువతిని బయటకు తీసుకుని వచ్చారు. అయితే కిందకు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువతిని మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.విహారయాత్ర.. విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు మనగావ్ పోలీసులు, తహలసీల్దార్ పర్యాటకులకు సూచనలు చేశారు. జలపాతాలను, కొండలను సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర ప్రవర్తనలను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్స్టాగ్రావ్ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్లోని ఫ్రోత్ ఆన్ టాప్లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు కేరాఫ్లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్కు థీటుగా బ్రాండ్స్కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్డ్ ఇన్ పోస్ట్లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.‘ఈ గుర్తింపు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్లో స్పందించాడు రాహుల్.కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుందిశతవరి శక్తి ఇది...– ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.– ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్ను చూపించింది.– సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ‘వావ్’ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 8000 మంది ఫాలోవర్లు ఉన్నారు.– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది. -
Adithya S nair: యువతి ప్రాణం తీసిన ట్రోలర్స్
ట్రోలింగ్ సర్వసాధారణమైన ఈరోజుల్లో.. సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. ఓ గీతాంజలి, ఓ రమ్య.. ఇప్పుడు ఆదిత్య ట్రోలర్స్ ధాటికి బలయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండడం భరించలేక నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆదిత్య బలవన్మరణానికి పాల్పడింది.కేరళ తిరువనంతపురం కున్నుపుజా ఏరియాకు చెందిన ఆదిత్య ఎస్ నాయర్(18) Adithya S nair ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇన్స్టాలోనే పరిచయమైన బినోయ్తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ యూట్యూబ్, ఇన్స్టా వీడియోలతో ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. అయితే రెండు నెలల కిందట ఈ జోడీ విడిపోయినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి బినోయ్ను సపోర్ట్ చేస్తూ.. ఆదిత్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు. అవి ఒక స్టేజ్ ధాటి మీమ్స్ వేసే దాకా వెళ్లింది. దీంతో భరించలేకపోయిన ఆమె జూన్ 10న ఉరేసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. వారం పాటు చికిత్స పొంది కన్నుమూసింది. దీంతో అప్పటిదాకా ట్రోల్ చేసిన మీమర్లే.. సింపథీ పోస్టులు వేస్తూ వస్తున్నారు. ‘‘వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి తెలిసి మందలించాం. చదువు మీద ఫోకస్ పెట్టాలని ఆదిత్యకు సూచించాం. అందుకే ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. కానీ, ఆ కుర్రాడు మాత్రం ఇలా మానసికంగా వేధించి నా కూతురిని చంపాడు అని ఆదిత్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య నాయర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. బినోయ్ను పూజాప్పుర పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
గర్ల్ ఫ్రెండ్ను పెళ్లాడిన ప్రముఖ యూట్యూబర్, భావోద్వేగ క్షణాలు
ప్రముఖ యూట్యూబర్ అరుణ్ మైని తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్ద్రిషను పెళ్లాడాడు. ఈశుభవార్తను సోషల్ మీడియాద్వారా పంచుకున్నాడు.ఈ వివాహానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ ఫోటోలను షేర్ చేశాడు."8 జూన్ 2024 నేను నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రేరణ, నా దేవత, నా సర్వస్వాన్ని పెళ్లి చేసుకున్నాను. మా జీవితాల్లోని ఆ మూడు రోజుల ఆనంద క్షణాలను హాయిగా గడిపాం. సంపూర్ణంగా ఎంజాయ్ చేశాం. ఇక భవిష్యత్లుగా జంటగా జీవించే లైఫ్ గురించి ఉత్సాహంగా ఉన్నాం’ అంటూ తమ పెళ్లి కబురు గురించి ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఎక్స్లో అరుణ్ చేసిన పోస్ట్కు సుమారు 30 లక్షల లైక్స్ వచ్చాయంటేనే అతని క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో రాయల్ లుక్లో ఈ లవ్బర్డ్స్ అరుణ్, ద్రిష అందంగా మెరిసిపోయారు.‘మిస్టర్ హూఈజ్ ది బాస్’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా అరుణ్ మైనీ ఆధునిక టెక్ కంటెంట్, డిజిటల్ టెక్నాలజీ ఇలా అనేక విషయాల గురించి తన ఛానల్లో మాట్లాడుతాడు. అతని యూట్యూబ్ ఛానెల్లో1. 8 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. ఇన్స్టాగ్రాంలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.I just married my best friend pic.twitter.com/lW2oICMV1I— Arun Maini (@Mrwhosetheboss) June 11, 2024అరుణ్ దంతపు రంగు షేర్వానీని , తలపాగా ,దుపట్టాలో కొత్త పెళ్లికొడుకుగా మారిపోయాడు. ఇక ధృషా అయితే భారీగా ఎంబ్రాయిడరీ చేసిన రెడ్ రంగు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. ఆకుపచ్చ రత్నాలతో బంగారు చోకర్, ఆకుపచ్చ రత్నంతో రాయితో పొదిగిన చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
Nancy Tyagi ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే కేన్స్లో అదరగొట్టేసింది!
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి కేన్స్ 2024లో ఎలా చేరింది. ఉత్తరప్రదేశ్లోని బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్ దాకా ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.ఇంటర్ మంచి మార్కులతో పాసైన తరువాత 2020 ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. ఇక సివిల్స్ కోచింగ్కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నడుపుకునే తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది. ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్ అయింది.కేన్స్లో యువ డిజైనర్గా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్, డిజైనర్ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు. ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర తదితర లుక్స్తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత. కేన్స్ కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా వీపరీతంగా నచ్చేసింది.ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్, సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా. ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫ్యాషన్తో మరింత అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. -
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఓ మహిళ ఒక తల్లిగా, వ్యాపారవేత్తగా, మోడల్గా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాయర్ నేపథ్యం నుంచి పూర్తి విరుద్ధ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతేగాదు ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అద్భుతమైన డిజైనర్ డ్రెస్లో మెరిసింది. ఇంతకీ ఎవరంటే ఆమె..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్, మహిళా వ్యాపార వేత్త అయిన దీపా బుల్లెర్ ఖోస్లా శక్తిమంతమైన మహిళ. విభిన్న రంగాల్లో దూసుకుపోతూ కూడా ఓ తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె కంటెంట్ క్రియేటర్గా, సామాజకి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూనే వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేగాదు ముంబై ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎంటర్ప్రెనూర్గా ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 2.1 మిలియన్ ఫాలోవర్స్ని కలిగి ఉంది. మరోవైపు అందం, ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇక ఫ్రాన్స్లో అట్టహాసంగా జరుగుతున 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రఖ్యాత డిజైనర్ వాల్డ్రిన షైతీ షెల్ఫ్ రూపొందించిన మెటాలిక్ స్ట్రక్చర్డ్ డ్రెస్లో గ్లామరస్గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డిజైనర్ డ్రెస్ ముందుభాగంలో ఉన్న లోహ గులాబీ హైలెట్గా నిలిచింది. అందుకు తగ్గట్లుగా బాబ్ స్టైల్ హెయిర్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు. ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఈవెంట్లో తన అత్యాధుని ఫ్యాషన్ డిజైనర్వేర్ డ్రెస్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలకు "బ్యాక్ ఎట్ ది కార్పెట్ అట్ ఆల్ స్టార్ట్... హోమ్కమింగ్ @festivaldecannes" అనే క్యాప్షన్ తోపాటు హార్ట్ ఎమోజీని జోడించి మరీ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. ఐతే ఆమె ఈ కేన్స్ ఈవెంట్లో గత ఆరేళ్లుగా పాల్గొంటుందట. ఆమె నేపథ్యం..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్ తన పాఠశాల విద్యను ఊటీలో పూర్తి చేసింది. తల్లి డాక్టర్ కావడంతో తాను కూడా అదే వృత్తిలో ఉండాలనుకుంది. ఐతే ఇంటర్నషిప్లో తన ఆలోచనను మార్చుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయిన వెంటనే నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టోలో న్యాయవాదిగా పనిచేసింది. తదనంతరం లండన్లోని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఐఎంఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీలో ఇంటర్న్షిప్ చేసింది. అయితే ఎంతోకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగలేదు. మళ్లీ డిజట్ కంటెంట్ క్రియెటర్గా కెరీర్గా ఎంచుకుని మరీ దూసుకుపోయింది. ఇక 2022లో తన బ్యూటీ బ్రాండ్ ఇండెవైల్డ్ను ప్రారంభించింది. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన ఆయుర్వేదం బ్రాండ్లో పాతుకుపోయింది. చర్మ రక్షణలో ప్రామాణిక ఉత్పత్తులే బెటర్ అని భావించి ఇటువైపు దృష్టి సారించి వ్యాపారవేత్తగా మారింది. 32 ఏళ్ల దీపా తన భర్త డచ్ దౌత్యవేత్త ఒలేగ్ బుల్లెర్తో కలిసి లాభప్రేక్షలేని పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఇది లింగ సమానత్వంపై యూఎస్ UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు సోషల్ మీడియా శక్తిని వినియోగించుకుంటుంది. ఇన్ని రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉన్న కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ముఖ్యంగా దీపాకి నాలుగేళ్ల కూతురు దువాతో స్పెండ్ చేయడం మహా ఇష్టం. "సహనానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీది వెంటనే చేయనవసరం లేదని, అలా అని ప్రతి అడుగు వెనక్కి వేసి బ్రేక్ తీసుకోవడం కూడా సరైనది కాదు" అంటుంది దీపా. తన కలలన్నింటిని సాకారం చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోవతూ.. ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచింది దీపా బుల్లెర్ ఖోస్లా . View this post on Instagram A post shared by Diipa Büller-Khosla (@diipakhosla) (చదవండి: 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!) -
ఇద్దరు భార్యల ముద్దుల యూట్యూబర్ : మెకానిక్గా మొదలై రూ. 200 కోట్లకు
నేటి ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్లుగా సోషల్ మీడియా కూడా అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. అంతేకాదు నాగ్పూర్ చాయ్వాలా ఢిల్లీ వడా పావ్ గర్ల్, హైదరాబాద్ కుమారాంటీ సోషల్ మీడియా ఈ వ్యక్తులకు సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో మెకానిక్గా జీవితాన్ని మొదలు పెట్టి రూ. 200 కోట్లకు యజమానిగా మారిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.యూట్యూబర్ అర్మాన్ మాలిక్ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకడిగా పాపులర్. ఇటీవలి ఇంటర్వ్యూలో, అర్మాన్ మాలిక్ తన జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. వివాదాస్పద జీవితం, ఇద్దరు భార్యలు, వందల కోట్ల సంపద లాంటి వివరాలను షేర్ చేశాడు.అర్మాన్ మాలిక్ 8వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇంటి నుంచి పారిపోయాడు. నాలుగు రోజులకే ఇంటికి తిరిగి వచ్చి, తనకు చదువు ఇష్టం లేదని, కార్లంటే ఇష్టమని వర్క్షాప్లో పని చేయాలని తండ్రికి చెప్పాడు.అలా మెకానిక్గా పనిచేయడమే కాకుండా, మాన్యువల్ వర్కర్ లాంటి అనేక ఇతర ఉద్యోగాలు కూడా చేశాడు.యూట్యూబర్ తన వ్లాగ్లతో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.జేబులో ఒక్క పైసా కూడా లేకుండా వ్లాగింగ్ జర్నీ ప్రారంభించాడు. ఆసక్తికరమైన కంటెంట్తో, అర్మాన్ చాలా తొందర్లోనే అటు ప్రజాదరణను ఇటు ధనాన్ని సంపాదించాడు. , యూట్యూబర్ తన వద్ద రూ. రూ. 200 కోట్ల నికర విలువ. అదీ 2.5 సంవత్సరాలలో యూట్యూబ్ ద్వారా సంపాదించాడట.అర్మాన్ ముందు చూపుతొలుత టిక్టాకర్ ఉన్న అర్మాన్ నెలకు 2 లక్షలు సంపదించాడు. కోవిడ్-19 సమయంలో అర్మాన్ వద్ద కేవలం రూ. 35వేలు మాత్రమే. ఆ తరువాత యూట్యూబ్ ఫేస్బుక్, ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చాడు. ఎవరీ అర్మాన్అర్మాన్ చిన్నపుడే తల్లి కేన్సర్తో పోరాడి మరణించింది. తండ్రి మద్యానికి బానిసకావడంతో అతను కూడా చాలా త్వరగా మరణించాడు. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకునే సమయానికి అర్మాన్ వయసు కేవలం 19 ఏళ్లు. అర్మాన్కు ఒక అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీంతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. కేవలం 2 వేల రూపాయలతో హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి బ్యాంకులో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ పాయల్ను అనే అమ్మాయిని కలిశాడు. వీరిద్దరూ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో ఈ దంపతులకు చిరయౌ అనే కుమారుడు జన్మించాడు.భార్య ఫ్రెండ్ కృతికతో ప్రేమ,పెళ్లిఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత, అర్మాన్ తన భార్య, పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతికతో ప్రేమలో పడ్డాడు. కృతికను వివాహం చేసుకున్నాడు దీంతో పాయల్తో భర్తనుంచి విడిపోయింది. కానీ తరువాతి కాలంలో రాజీపడి ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు అర్మాన్ మాలిక్. అర్మాన్ మాలిక్ భార్యలకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగాయట. పాయల్, 2011లో ఒకసారి, మరోసారి గర్భస్రావం అయ్యింది. అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, ఆమె ఫెలోపియన్ ట్యూబ్లలో ఫెలోపియన్ ట్యూబ్ను తొలగించాల్సి వచ్చింది. చివరకు 2016లో కొడుకు చిరయు పుట్టాడు. 2023లో, పాయల్ ఐవీఎఫ్ ద్వారా అయాన్,తుబా కవలలకు జన్మనిచ్చింది. 2018లో అర్మాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కృతికకు గర్భస్రావాలు అయ్యాయి. చివరికి నాల్గోసారి జైద్ (మగబిడ్డ)కు జన్మనిచ్చింది.అర్మాన్ మాలిక్ 10 ప్లాట్లు, వాటి కథకుటుంబసభ్యులకు ప్రేమగా చూసుకున్న అర్మాన్ మాలిక్ తన సిబ్బందిని కూడా తన కుటుంబంలానే చూసుకుంటాడు. అతనికి మొత్తం 10 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు భార్యలు, నలుగురు పిల్లల కోసం కేటాయించగా, మిగిలిన ఆరు సిబ్బందికి కేటాయించాడట. ఇందులో ఒకటి పూర్తిగా స్టూడియోగా ఉపయోగిస్తాడు. -
కాన్స్లో ఆ ముగ్గురు
కాన్స్ ఫెస్టివల్లో సినిమాలకు ఎంట్రీ దొరికినా సెలబ్రిటీలకు ఆహ్వానం దొరికినా చాలా ఘనత. ఈసారి కాన్స్లో చాలా ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ప్రదర్శితం కానుంది. అదలా ఉంటే మన దేశానికి చెందిన ముగ్గురు యువ ఇన్ఫ్లుయెన్సర్లను కాన్స్ ఆహ్వానించింది. మే 14–25 మధ్య జరగనున్న ఈ ఫెస్టివల్లో ఆర్జె కరిష్మా, ఆస్థా షా,నిహారికా ఎన్.ఎమ్ రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడవనున్నారు.వారి పరిచయాలు.ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేటి నుంచి (మే 14) నుంచి ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో ్ర΄ారంభం కానుంది. ఆస్కార్ అవార్డ్స్తో సమానంగా కాన్స్ అవార్డులను భావిస్తారు. ఈసారి భారతదేశం నుంచి ΄ాయల్ క΄ాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా మెయిన్ కాంపిటీషన్లో ఎంట్రీ సాధించింది. సినిమాకు, సంస్కృతికి ్ర΄ాధాన్యం ఇచ్చే ఈ ఫెస్టివల్లో భారతదేశం నుంచి కొంతమంది యువ ఇన్ఫ్లుయెన్సర్లకు ఆహ్వానం అందింది. అతిరథ మహారథులతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశం వీరు ΄÷ందారు. స్ఫూర్తినిచ్చే తమ జీవితాల ద్వారా, ప్రతిభ, విజయం ద్వారా వీరు అవకాశం ΄÷ందారు. అలాంటి ముగ్గురి పరిచయం.ఆస్థా షాసోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తన జీవిత ΄ోరాటంతో ప్రభావం చూపుతున్న ఆస్థా షాది ఢిల్లీ. 24 ఏళ్ల ఆస్థా 8 ఏళ్ల వయసు నుంచి విటిలిగో (తెల్లమచ్చలు) బారిన పడింది. పూర్తిగా నివారణ లేని ఈ చర్మవ్యాధి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతి ఒక్కరూ ‘ఈ అమ్మాయికి పెళ్లవుతుందా’ అని తల్లిదండ్రులను వేధించేవారు. అన్ని రకాల వైద్య విధానాలతో విసిగి΄ోయిన ఆస్థా నేను ఎలా ఉన్నా నా జీవితం ముఖ్యం అనుకుని చదువు మీద దృష్టి పెట్టింది. మంచి ప్రతిభ చూపి ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్లో ఫైనాన్షియల్ అనలిస్ట్గా పని చేస్తోంది. ఇన్స్టా, ట్విటర్ ద్వారా ΄ాపులర్ అయ్యి డబ్బు సం΄ాదిస్తోంది. ‘ఆడపిల్లలకు విటిలిగో ఉంటే ఆ అమ్మాయిలను తల్లిదండ్రులే ఇంటి నుంచి బయటకు రానీకుండా చూస్తారు. ఆమెను న్యూనతకు గురి చేస్తారు. విటిలిగో కేవలం ఒక చర్మస్థితి. ఇప్పుడు నేను పూర్తి విటిలిగోతో తెల్లగా అయి΄ోయాను. కాని నా జీవితాన్ని సమర్థంగా జీవిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతూ ముందుకు సాగి΄ోండి’ అని చెప్పి లక్షలాది మంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచుతోంది ఆస్థా. అందుకే ఆమెకు ఆహ్వానం.ఆర్జె కరిష్మాసోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెలకు 30 లక్షలు సం΄ాదిస్తున్న కరిష్మా బహురూ΄ాలు వేసి కామెడీ చేయడంలో నేర్పరి. చిన్నప్పుడు ఒకరోజు కరిష్మా గదిలో నుంచి రకరకాల గొంతులు వినిపిస్తుంటే తల్లి కంగారు పడి తలుపు తట్టి ‘కరిష్మా నీతో ఎవరున్నారు’ అని అడిగితే తలుపు తెరిచిన కరిష్మా అవన్నీ తాను మిమిక్రీ చేస్తున్న గొంతులని చెప్పింది. జమ్ము కశ్మీర్కు చెందిన కరిష్మా నటి కావాలనుకుని ఆర్.జె. అయ్యి ఆ తర్వాత కామెడీ బిట్స్ చేసే యూట్యూబర్గా ఖ్యాతి ΄÷ందింది. ఇండోర్లో రెడ్ ఎఫ్.ఎం. లో పని చేసేటప్పుడు ఆమె షో సూపర్హిట్ అయ్యింది. మానవ ప్రవర్తనల్లోని భిన్నత్వాన్ని ఆమె చూపే విధానం వల్ల చాలా సీరియస్ విషయాలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకు సాగవచ్చనే ధిలాసా ఇస్తుంది. అందుకే ఆమెకు ఈ ఆహ్వానం.నిహారికా ఎన్.ఎమ్.బెంగళూరులో పుట్టి పెరిగి ఇప్పుడు లాస్ ఏంజెలిస్లో ఉంటున్న నిహారికకు తెలుగు బాగా వచ్చు. బహుశా తెలుగు మూలాలు ఉండొచ్చు. యూట్యూబ్లో, ఇన్స్టాలో నిహారిక చేసే వీడియోలకి లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. నిహారికతో షో చేస్తే ప్రచారం లభిస్తుందని భావించే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. 27 ఏళ్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్ లోపలొకటి బయటొకటిగా ఉండే మనుషులను గేలి చేస్తూ బోలెడన్ని వీడియోలు చేసి నవ్విస్తుంటుంది. ‘మార్కులు వస్తేనే జీవితం. గొప్ప మార్కులు వచ్చినవారే గొప్ప జీవితాన్ని గడపగలరు అనే భావన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. పిల్లల తెలివితేటలు, ఆసక్తిని బట్టి వారిని ్ర΄ోత్సహిస్తే వారు సక్సెస్ అవుతారు. నేను డాక్టరో ఇంజనీరో కావాలని మా అమ్మా నాన్నలు అనుకున్నారు. కాని లక్షలాది మంది అభిమానించే యూ ట్యూబర్ని అయ్యాను. కలలు కని ముందుకు సాగండి’ అనే సందేశం ఇస్తుంటుంది నిహారిక. ఆమె ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద హంగామా చేయనుంది. -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్హుడ్ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
Video: ఇదేం పిచ్చి.. ఇన్స్టా రీల్స్ కోసం హైవేపై పిస్తోల్తో డ్యాన్స్
ఇది సోషల్ మీడియా కాలం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ 24 గంటలు ఆన్లైన్లోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ లైకులు, వ్యూవర్షిప్ కోసం అట్రాక్ట్ చేస్తున్నారు. రోజురోజుకీ ఈ పిచ్చి పీక్స్కు వెళుతోంది. వాటి కోసం ఒక్కోసారి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా ఓ యువతి వైరల్ అవ్వడం కోసం తుపాకీతో నడిరోడ్డుపై రీల్స్ చేయడంతో ఇరకాటంలో పడింది.ఉత్తర ప్రదేశ్లోని లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్తోల్తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ .. లక్నో హైవేపై ఓ భోజ్పురి పాటైకు స్టెప్పులేసింది. యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియో వైరల్కావడంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక యువతి డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024 -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్ప్రదేశ్లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్ను ‘ఇన్స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్స్టాగ్రామ్కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్ , సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..) -
సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..
ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..? రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి. సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు. చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు. అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్వెజ్కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. -
Angry Rantman Death: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. గుండె పగిలిందంటున్న ఫ్యాన్స్
#Angry Rantman ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్,యూట్యూబర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్మ్యాన్ (Angry Rantman)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో అభిమానుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్న వయసులోనే వెళ్లి పోయాడంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కర్ణాటకు చెందిన అబ్రదీప్ సాహా సోషల్ మీడియాలో రాంట్ మ్యాన్ పేరుతో చాలా పాపులర్. సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఫాలోయర్లు ఆకట్టుకునేవాడు. అతికొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలి అతని యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ ప్రకారం యాంగ్రీ రాంట్మ్యాన్ గత నెలలో పెద్ద ఆపరేషన్ జరిగింది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ ఆ తరువాతి అప్డేట్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు తెలుస్తోంది. 2017, ఆగస్టు 18 లో అబ్రదీప్ తన YouTube ఛానెల్ని “నేను అన్నాబెల్లె మూవీని ఎందుకు చూడను!!!!!!” , అలాగే ‘ది కన్జూరింగ్’ చూసిన తర్వాత ఇకపై హారర్ చిత్రాలను చూడడానికి చాలా భయపడ్డానంటూ రివ్యూ వీడియోలు చేశాడు. తనదైన హావభావాలతో ఫన్నీ రివ్యూలతో నెట్టింట్ హల్ చల్ చేసేవాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో కేజీఎఫ్ సినిమా రివ్యూతో మరింత ట్రెండింగ్లోకి వచ్చాడు. కేవలం 27 ఏళ్ల వయసులో అకాల మరణంతో మరోసారి ట్రెండింగ్లో నిలవడం విషాదం. యాంగ్రీ రాంట్ మ్యాన్ హ్యాష్ ట్యాగ్ వైరలవుతోంది. Gonna miss pearls of wisdom like these. #AngryRantman pic.twitter.com/wQhnNUGC5G — Ritesh (@Szoboszlai8_) April 17, 2024 -
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్గా మారారు. ఇక ఒరిజినల్గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్కు సెల్ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నన్ను వాడుకుని వదిలేస్తే అట్టర్ ఫ్లాపే అవుతుంది: నటి
అన్నీ అనుకున్నట్లుగా జరగవు.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నో పాత్రలు రాసుకుంటారు, షూటింగ్ చేస్తారు. తీరా ఎడిటింగ్లో సగం కంటే ఎక్కువ పాత్రలు డిలీట్ చేస్తారు. మరికొన్నింటిని నిమిషాల నుంచి సెకన్లకు కుదిపేస్తారు. అలా ఇటీవలే డీజే టిల్లులో శ్రీసత్యకు అన్యాయం చేశారు. తనతో డైలాగులు చెప్పించి మరీ ఎడిటింగ్లో అదంతా తీసేయించారు. అందరి టైం వేస్ట్ ఇప్పుడు తనకూ అలాంటి అన్యాయమే జరిగిందంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆశా బోరా. నాలాంటిదాన్ని పిలిచి మరీ స్టఫ్లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. 'ఇంతోటిదానికి నా టైం వేస్ట్ చేసి, మీ టైం వేస్ట్ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరి నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు. ఆరోగ్యం బాలేకపోయినా.. ఉఫ్.. అయినా హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్ మీడియా ఫేస్లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్కు వచ్చాను. యాంటి బయాటిక్స్ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. డైలాగ్స్ ఉంచినా బాగుండేది ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా, ట్రావెలింగ్ ఖర్చులు చెల్లించకుండా, హోటల్లో బస చేసేందుకు డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనుకూడా లేదు. వాహ్.. గ్రేట్! కనీసం విజయ్ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచినా కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్ లైన్ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!' అంటూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ స్టార్ టీమ్పై విమర్శలు గుప్పించింది. View this post on Instagram A post shared by Asha Borra (@asha.borra) చదవండి: ‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ! -
నాపై 74 తులాల బంగారం చోరీ కేసు, చచ్చిపోదామనుకున్నా:నటి
జూనియర్ ఆర్టిస్ట్, నటి సౌమ్య శెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిందంటూ కొద్దిరోజుల క్రితం ఓ వార్త వైరలైంది. విశాఖపట్నం దొండపర్తిలో రిటైర్డ్ పోస్టల్ అధికారి జనపాల ప్రసాద్బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నగల్లో కొంత విక్రయించి గోవా వెళ్లి ఎంజాయ్ చేయగా మిగిలిన 40 తులాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నోరు నొక్కేస్తున్నారు బెయిల్మీద బయటకు వచ్చిన సౌమ్య ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్లో లేకపోయినా రిమాండ్లో ఉంది, జైల్లో ఉందంటూ అసత్య ప్రచారం చేసి నన్ను జాతీయ స్థాయిలో పాపులర్ చేశారు. బయటకొచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా.. కానీ నా భర్త బతికి పోరాడాలని చెప్పారు. ఫైట్ చేస్తాను. పోరాడతా.. మీరు అబద్ధాన్ని నిజం చేశారు. కానీ నన్ను భయపెట్టలేరు. నాకు దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చికుక్కను చేసి జైల్లో వేద్దామనుకున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనూ నా నిజం చెప్పుకోవాలి. కోర్టులో ఏది రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్ను నాశనం చేశారు. నా వైపు దేవుడున్నాడు. పోరాడతాను' అంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేసింది. అలాగే రిటైర్డ్ పోస్టల్ అధికారి కుటుంబానిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్, ధనుష్లపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Soumya killampalli (@soumyashettysomu23) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్లో..! -
Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా, మోటా లీడర్ల ప్రయత్నాల్లో భాగమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్... రీల్స్, షార్ట్స్, మీమ్స్.. మాధ్య మమేదైనా సరే.. ఓటరు మానసిక స్థితిని ప్రభావితం చేసే మార్గాలే! అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. పార్టీలు తమ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ బాట పడుతున్నాయి... కరోనా తర్వాతి ప్రపంచంలో సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. డేటా–సేకరణ, విజువలైజేషన్ ప్లాట్ఫాం స్టాటిస్టికా ప్రకారం ఫేస్బుక్కు భారత్లో 36.7 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్కు 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వారి అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో వీటితో పాటు ఎక్స్, ఇన్స్టా, వాట్సప్ చానళ్లదీ కీలక పాత్రే. అందుకే పార్టీలు ప్రచారానికి సోషల్ ప్లాట్ఫాంలను ఎంచుకుంటున్నాయి. ఫేస్బుక్లో ప్రతి పార్టీకీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఓ పేజ్ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికీ ఓ సైన్యమే ఉంది. ఇక వాట్సాప్ గ్రూప్లకైతే కొదవే లేదు. ఇవి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కులాలు, మతాలవారీగా ఎప్పుడో ఏర్పాటయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాంలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ 2014లో అధికారంలోకి వచి్చంది. ఎక్స్లో ప్రధాని మోదీకి ఏకంగా 9.7 కోట్ల ఫాలోయర్లున్నారు. రాహుల్కు 2.5 కోట్ల మంది ఉన్నారు. పర్సనల్ అప్రోచ్.. ఎన్నికలంటే ఇంటింటికీ వెళ్లి ఓట్లగడం పాత పద్ధతి. ఇప్పుడంతా పర్సనల్ అప్రోచ్. బీజేపీ ఇటీవల వాట్సాప్ ఉన్న వాళ్లందరికీ ‘ప్రధాని నుంచి లేఖ’ పంపింది. కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని పౌరులను కోరింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ అనే వెబ్సైట్నూ ప్రారంభించింది. మోదీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నదీ చెబుతూ వీడియో చేసి పెట్టడానికి వీలు కల్పించింది. సాధారణ పౌరుడిని ప్రధానే నేరుగా అభిప్రాయం కోరడం, ఓటేయడానికి కారణాన్ని అడిగి తెలుసుకోవడం కచి్చతంగా వారి అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మారుస్తుందన్నది బీజేపీ అంచనా. రాహుల్ గాంధీ వాట్సాప్ చానల్ను కాంగ్రెసే నిర్వహిస్తోంది. అందులో రాహుల్ ప్రజలతో సంభాíÙస్తారు. వారి ప్రశ్నలకు బదులిస్తారు. ఈ వాట్సాప్ సమాచారం సర్క్యులేషన్ను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎక్కువ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరింత ఎక్కువ మంది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా అనుసంధానం కావచ్చన్నది కాంగ్రెస్ భావన. ప్రభావశీలతపై సందేహాలూ.. సోషల్ మీడియా ప్రభావంపై అనుమానాల్లేకపోయినా ఓటర్లుగా ఫలానా పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో వాటి శక్తిపై మాత్రం సందేహాలున్నాయి. వాటి ప్రచారం తటస్థ ఓటర్ల వైఖరిలో మార్పు తేవచ్చేమో గానీ సంప్రదాయ ఓటర్లు, పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేయబోదని విశ్లేషకుల అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థి కులం, స్థానిక అనుబంధం, పార్టీకి విధేయత వంటివే సంప్రదాయ ఓటర్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అభ్యర్థి చరిష్మా, విశ్వసనీయత, పార్టీకి ప్రజాదరణ కూడా ఓటర్లను కదిలిస్తాయని విశ్లేషిస్తున్నారు. కీలకంగా ఇన్ఫ్లుయెన్సర్లు... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఎక్కువమందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్స్, షార్ట్స్ ప్రాచుర్యంతో వీరి ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోయర్స్ ఉన్నవారిని ‘నానో’ ఇన్ఫ్లూయెన్సర్లని, లక్ష దాకా ఉంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, 10 లక్షలుంటే మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, అంతకు మించితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్ఫ్లూయెన్సర్లు కీలకంగా మారారు. ముందున్న బీజేపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరిగింది. పార్టీలు వారికి ప్రధాన ఖాతాదారులుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంది... ► ప్రభుత్వ పథకాలపై కంటెంట్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తో కలిసి పని చేయడానికి నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. ఇదంతా బీజేపీకి లబ్ధి చేసేదే. ► వివిధ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ 50కి పైగా సమావేశాలను ఏర్పాటు చేసింది. మోదీ నేతృత్వంలో మంత్రులు కూడా ప్రధాన చానళ్లకు బదులు పాడ్కాస్ట్ షోలు, యూట్యూబ్ చానళ్లలో కనిపిస్తున్నారు. ► ఎస్.జైశంకర్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి కేంద్ర మంత్రులు యూట్యూబ్లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లున్న పాడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాదియాకు ఇంటర్వ్యూలిచ్చారు. కాంగ్రెస్దీ అదే బాట... ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వాడుకునే విషయంలో కాంగ్రెస్ కూడా ఏమీ వెనకబడి లేదు. భారత్ జోడో యాత్రలోనూ, తాజాగా ముగిసిన భారత్ జోడో న్యాయ్ యాత్రలోనూ వారిని బాగానే ఉపయోగించుకుంది... ► రెండు జోడో యాత్రల్లోనూ ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకే రాహుల్ ప్రాధాన్యమిచ్చారు. ► ‘అన్ ఫిల్టర్డ్ విత్ సమ్దీశ్’ యూ ట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ► ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కామియా జానీతో తన భోజనం తదితరాల గురించి పిచ్చాపాటీ మాట్లాడారు. ► రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన హయాంలో ‘జన్ సమ్మాన్’ వీడియో పోటీలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సోషల్ ప్లాట్ఫాంల్లో 30 నుంచి 120 సెకన్ల వీడియోలు షేర్ చేసిన వారిలో విజేతలకు నగదు బహుమతులిచ్చారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాప్తి సగటున 40 శాతం ఉందని అంచనా. ఆ లెక్కన 2 లక్షల ఓటర్లుండే అసెంబ్లీ స్థానంలో సోషల్ మీడియా ద్వారా కనీసం 70 నుంచి 80 వేల మందిని ప్రభావితం చేసే వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలాసార్లు విజేతను తేల్చడంలో ఐదారు వేల ఓట్లు కూడా నిర్ణాయకంగా మారుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంఖ్యేనని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాను ఇప్పుడు ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. – అంకిత్ లాల్, అడ్వైజర్, పొలిటికో – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. నాన్నకు ఇప్పటికీ కోపమే!
మొదట్లో బిగ్బాస్ షోలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. సీరియల్, సినిమా, మోడలింగ్కు చెందినవారినే ఎక్కువగా తీసుకువచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న జనాలకు సైతం బిగ్బాస్ ఆఫర్ ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నోరా ముస్కాన్ మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హౌస్లో తన కష్టాలను ఏకరువు పెట్టింది. వేరేవేరే పేర్లతో.. 'నా అసలు పేరు సైబాల్ సదత్. పొన్నుస్ అనే నిక్నేమ్తో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అదేం పేరని మా ఫ్రెండ్ ఏడిపించడటంతో నోరాగా మార్చుకున్నాను. నా అసలు పేరు వాడితే ఎక్కడ మా పేరెంట్స్కు తెలిసి పెద్ద గొడవ అవుతుందోననే ఇలా పేరు మార్చుకున్నాను. నాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. కానీ మా బంధం వర్కవుట్ కాకపోవడంతో విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. నా భర్త కూడా విడాకుల ప్రక్రియ మరింత ఆలస్యం కావాలనే చూశాడు. విడాకులు తీసుకుంటే తప్పా? ఎందుకని అందరూ డివోర్స్ను పెద్ద తప్పులా చూస్తారు? ఇద్దరు మనుషులు కలిసుండలేనప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడంలో తప్పేముందో అర్థం కాదు. పైగా ఇక్కడ కూడా తప్పంతా అమ్మాయిదే అన్నట్లు మాట్లాడతారు. ఇక నాకు ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో అప్పుడే నేను స్వతంత్రంగా, నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. అలా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కూడా కొన్నాను. మా నాన్న పట్టించుకోవట్లే కానీ మా నాన్నకు ఇదంతా ఇష్టం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం తనకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు నా ఇంటివైపే రాలేదు. ఈ మూడేళ్లలో మా నాన్నను కలిసిందే లేదు. ఏదేమైనా నేను వాళ్లను నిందించడం లేదు. వాళ్ల ఆలోచనా విధానం వేరు. కానీ ఎవరూ నా ప్రయాణాన్ని ఆపలేరు' అని చెప్తూ ఎమోషనలైంది సైబాల్. చదవండి: చాలా సింపుల్గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్.. ఫోటోలు వైరల్ -
డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం!
'సమాజం మారాలి.. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు తేవాలి. ఈ ప్రసంగాలు వింటూనే ఉంటాం. మారాలని అందరూ కోరుకుంటారు. మార్పు కోసం ఏం చేయాలో తెలిసిన వాళ్లెందరు? సమాజం మారాలంటే ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఆ మార్పు మనతోనే మొదలు... అనుకోవాలి. మార్పు దిశగా తొలి అడుగు వేయగలిగిన చొరవ ఉండాలి. అలా డిజిటల్ ఎరాలోకి అడుగుపెట్టారు డాక్టర్ గీత. తన పాదముద్రలతో అభివృద్ధి దారి చూపిస్తున్నారు.' ఈ డిజిటల్ యుగంలో దాదాపుగా అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఇలాంటి డిజిటల్ ఎరాను ముందుగానే ఊహించి సమాజాన్ని ప్రభావితం చేసిన సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ గీతాబోర. ప్రపంచదేశాలన్నీ ఒక తాటిమీదకు వచ్చి ఒకేరకమైన నైపుణ్యాలతో గ్లోబల్ వేదిక మీద పోటీ పడుతున్న తరుణంలో మన గ్రామీణ విద్యార్థుల్లో ఎంతమంది ఈ పోటీలో నిలవ గలుగుతున్నారనే ప్రశ్న వేసుకుని అందుకు సమాధానంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్లో శిక్షణ అవసరాన్ని గుర్తించారామె. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్లేస్మెంట్ దొరక్క మిగిలిపోయిన పిల్లలు బీపీవోల్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగాల్లో ఉపాధిని వెతుక్కోవాల్సి రావడం, క్రమంగా నైట్లైఫ్కు అలవాటు పడిపోవడం, యువశక్తి నిరీ్వర్యం కావడంతోపాటు సమాజంలో చాపకింద నీరులా వ్యసనాలు విస్తరించడాన్ని గ్రహించారు. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టా చేతపట్టుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు సొంతంగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలని, స్టార్టప్ దిశగా నడవడానికి విద్యార్థి దశలోనే ఈ ఆలోచనకు అంకురం వేయాలని ఆలోచించారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సరి్టఫికేట్ కోర్సుకు రూపకల్పన చేశారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా సమాజానికి తన కంట్రిబ్యూషన్ గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారామె. 'మన సమాజం ఉద్యోగాలు వెతుక్కునే సమాజంగానే ఉండిపోవడానికి కారణం కూడా పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు యువత ఆలోచనలను చిదిమేయడమే. పెద్దవాళ్ల కంటే యువత ఒక తరం ముందు ఉంటుంది. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలకు ఒక అండ దొరికితే వాళ్లు అద్భుతాలు చేస్తారు'. – డాక్టర్ గీతారెడ్డి బోర, ఫౌండర్, యష్మి సొల్యూషన్స్, యష్మిత ఈ టెక్నాలజీస్, చైర్పర్సన్, సీఐఎమ్ఎస్ఎమ్ఈ, ఆంధ్రప్రదేశ్ ‘‘నేను పుట్టింది, పెరిగింది వైజాగ్లో. ఎంసీఏ తర్వాత హైదరాబాద్లో పన్నెండేళ్లపాటు ఉన్నాను. ఇప్పుడు నా కంపెనీ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలను వైజాగ్ నుంచే నిర్వహిస్తున్నాను. సమాజం మారాలని వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు, విద్యావ్యవస్థను గాడిలో పెడితే, యువత ఆలోచనలను అభివృద్ధి వైపు మరలి్చనట్లయితే సమాజం దానంతట అదే మారుతుంది. సరిగ్గా నేను అదే చేస్తున్నాను. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 41 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రసంగించి, నాలుగువందల మంది విద్యార్థులను ప్రభావితం చేయగలిగాను. వారిలో 150 మంది తమ సొంత ఆలోచనలతో ఎంటర్ప్రెన్యూర్ షిఫ్ వైపు అడుగులు వేస్తున్నారు. పెద్దవాళ్లు అనుభవం పేరుతో యువత ఆలోచనలకు పరిధులు విధిస్తుంటారు. ఇది చాలా తప్పు. యువత ఆలోచనలను బయటకు చెప్పగలిగేలా వాళ్లను ్రపోత్సహించాలి. పెద్దవాళ్లు ఎప్పుడూ యువత ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి తమ అనుభవం నుంచి కొన్ని సూచనలు చేయవచ్చు. అంతేతప్ప యువత ఎలాంటి ఉపాధిని వెతుక్కోవాలనే ఆలోచనలు కూడా తామే చేయాలనుకోకూడదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మెంటార్, రీసోర్స్ పర్సన్, మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను. చైల్డ్ అబ్యూజ్, మహిళల పట్ల వివక్ష, మహిళల కుటుంబ, వైవాహిక పరమైన చిక్కులకు న్యాయసలహాలతో కౌన్సెలింగ్ ఇస్తున్నాను. మా వైజాగ్లో భూబకాసురుల చేతిలో చిక్కుకున్న భూమి వివరాలను, ఒరిజినల్ డాక్యుమెంట్ల ఆధారాలను ప్రభుత్వానికి తెలియచేసి, బాధితులకు అండగా నిలిచాను. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉమన్గా సమాజానికి ఇస్తున్న సేవకుగాను ‘నారీప్రెన్యూర్’ గుర్తింపును అందుకున్నాను. ఇప్పుడు నా మీద మహిళల కోసం పని చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గ్రామీణ మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి కార్యక్రమాల మీద పని చేస్తున్నాను. పరిమితమైన వనరులు, సాధారణ విద్యార్హతలు కలిగిన గ్రామీణ మహిళ తన మేధను ఉపయోగించి ఎదగడానికి అవసరమైనట్లు శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తున్నాను. ఆడవాళ్లు అభ్యుదయ కోణంలో ఆలోచించనంత కాలం సమాజం అభివృద్ధి దిశగా నడవదు. అందుకే మహిళ మారాలి, ఆమె మారితే పిల్లల ఆలోచనలు మారుతాయి. ఆ భావితరం మనం కోరుకున్న సమాజాన్ని నిర్మిస్తుంది’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి బోర. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఇవి చదవండి: వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్గా ఉండాల్సిందే.. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్లకు బిగ్గెస్ట్ క్లయింట్స్గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్లు, స్కిన్కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్లు బ్రాండ్తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్! ఒక్కో ఇన్స్టా పోస్టే లక్ష..!
ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్టాక్ స్టార్లుగా వచ్చి ఇన్స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్లో ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్.. బ్యూటీ ఖాన్ అసలు పేరు మముదా ఖాతున్. సొంతూరు కోల్కతా. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్ అబౌట్ డాన్సర్ కావాలని. టిక్ టాక్ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్ .. ఇన్స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్ కూడా. షార్ట్ వీడియో కంటెంట్కి ఫేమస్. ఆమె ఇన్స్టా హ్యాండిల్కి 12.4 మిలియన్స్కి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ వెబ్సైట్స్.. ఆమె ఒక్కో ఇన్స్టా పోస్ట్కి 50 నుంచి 1 ల్యాక్ ’ చార్జ్ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్సైట్స్ అంచనా. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్ .. ఆమె మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. సోషల్ మీడియానా మజాకా! (చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!) -
'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది!
ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ప్యాకేజింగ్ ఆహారా పదార్థాలు ఆయా కంపెనీలు లేబుల్ చేసినట్లు ఆరోగ్యకరమైనవి కావడం లేదు. మొదట్లో అడ్వర్టైస్మెంట్లతో ఊదరగొట్టి చివరికీ.. అవే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పెదవివిరవడం చూస్తూనే ఉన్నాం. అయినా అవేమీ వాటి తీరు మార్చుకోవు. మనం కూడా గత్యంతర లేకనో అలవాటు పడో గానీ అవే కొనేస్తున్నాం. కానీ ఇక్కడొక ఇన్స్టాగ్రాం వినియోగదారుడు ఒక్క వీడియోతో ప్రముఖ కంపెనీని షేక్ చేశాడు. దెబ్బకు దిగొచ్చి తీరు మార్చుకునేలా చేశాడు. వివరాల్లోకెల్తే..ఓ ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ హిమంత్ సింకా అకా ప్రముఖ క్యాడ్బరీ సంస్థకి చెందిన బోర్న్విటా చాక్లెట్స్, హెల్త్ డ్రింగ్లో చక్కెర కంటెంట్ అధికంగా ఉందని ప్రూవ్ చేశాడు. బోర్న్విటా ప్రతి వందగ్రాముల పొడిలో సుమారు 37.4 గ్రాముల చక్కెర ఉందని వాదించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఇది నిజంగా ఆరోగ్యానికి హానికరమైనదని డయాబెటిస్ పేషెంట్లుగా మారుస్తుందని విమర్శలు చేశారు. పైగా ఆ కంపెనీ లెబుల్పై చెబుతున్నవన్నీ అబద్ధాలే అని ప్రజలను మాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇందులో వాడే షుగర్ వల్ల డయాబెటిస్, ఉపయోగిస్తున్న ఫుడ్ కలర్స్ క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పారు. తాను పోషకాహార నిపుణుడనని, ఆరోగ్య నిపుణుడిగా దీన్ని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. ఆ బ్రాండ్ టాగ్లైన్పై కూడా హిమంత్ సింకా విమర్శలు కురిపించారు. అయితే కంపెనీ తొలుత అవన్నీ అశాస్త్రీయమైనవంటూ కొట్టిపారేసింది. పైగా హిమంత్ సింకాకి లీగల్ నోటీసులు కూడా పంపించింది సదరు బోర్న్విటా కంపెనీ. అయితే హిమంత్ విడుదల చేసిన వీడియో అప్పటికీ నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యింది. Bournvita.. is it... I'm Shocked 😳😳😳😳 I am a victim from childhood #bournvita #childhood #victim #young #india pic.twitter.com/gmiI3tci4e — Prof Dr Shibu A (@shibu_prof) April 5, 2023 అదీగాక ఈ వీడియోని రాజకీయవేత్త పరేష్ రావల్, మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కూడా షేర్ చేశారు. దీంతో ఎనిమిది మంది వైద్యులు, పోషకాహార నిపుణులతో కూడిన ప్రముఖ భారతీయ పోషకాహార సంస్థ హిమత్సింకా వీడియోలో చెప్పింది కచ్చితమైనదని ధృవీకరించింది. దెబ్బకు బోర్న్ విటా కంపెనీ దిగొచ్చి చక్కెర పరిమాణాన్ని సుమారు 14.4% మేర దిగొచ్చింది. చరిత్రలో తొలిసారి ఇలా విమర్శలు అందుకున్న వెంటనే ఓ కంపెనీ మార్పుకి నాంది పలికి షుగర్ కంటెంట్ని తగ్గించింది. దీంతో ఏ కంపెనీ తప్పుగా లేబుల్ చేస్తూ మార్కెట్ చేసే సాహసం చేయదని అన్నారు హిమంత్ సింకా. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసిన పోరాటం ఇది, కేవలం బోర్న్ విటాకు వ్యతిరేకం కాదని అన్నారు. జంక్పుడ్ విక్రయించే ఏ కంపెనీకి అయినా తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ముఖ్యంగా దాని లేబుల్పై తప్పుడు ప్రచారం చేస్తే అస్సలు ఉపేక్షించనని అన్నారు. ఈ ఘటనతో ప్రతి కంపెనీ ప్యాకేజింగ్ ఫుడ్ విషయంలో తప్పక జాగ్రత్త పడుతుంది. ఇది మాములు విజయం కాదు 'బిగ్ విన్'. ఎందుకంటే? ఒక్క వీడియోతో కంపెనీ మూలాలే కదిలిపోయాలా చేశాడు హిమంత్ సింకా. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer) (చదవండి: పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?) -
ప్రయాణ పాఠాలతో.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న యువకుడు!
ప్రయాణ ప్రేమికుడైన అనునయ్ సూద్ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్ సూద్. వ్లోగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు అందుకున్నాడు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్విట్జర్లాండ్ టూరిజం, విజిట్ సౌదీ, న్యూజిలాండ్ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... ‘నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్ సూద్. ఇంజినీరింగ్ చేసిన అనునయ్ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్ ఆర్గనైజింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్ లీడర్గా వ్యవహరించాడు. అనునయ్ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. ‘మెటా–సోషల్’ అనేది పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్ కంపెనీ. ‘ట్రావెలింగ్పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్ ‘ప్రాజెక్ట్ ఘర్’ పేరుతో హోమ్స్టే సర్వీస్ వెంచర్ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్పై ఫ్యాషన్ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్ ఫొటోగ్రఫీపై మనకు విజన్ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్ సూద్. కొత్తదారులలో... ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. – అనునయ్ సూద్ (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
ఎంటర్ప్రెన్యూర్లుగా రాణిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు
‘ఎంటర్ప్రెన్యూర్గా రాణించడం అంటే మాటలా?’ అన్నది ఒకప్పటి మాట. మాటల మాంత్రికులైన యువ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కలర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కలలు కంటున్నారు. ‘వ్యాపారం అంటే మాట్లాడినంత తేలిక కాదు’ అనే విమర్శను దాటి ఇన్ఫ్లూయెన్సర్లుగా తమ అనుభవాన్ని ఉపయోగించి ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేస్తున్నారు. బ్రాండ్స్ ద్వారా గుర్తింపు పొందిన యంగ్ ఇన్ఫ్లూయెన్సర్లు ఆ తరువాత తామే ఒక బ్రాండ్గా మారుతున్నారు. మాసివ్ ఆన్లైన్ ఫాలోయింగ్తో ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్స్టైల్ యూ ట్యూబర్ జ్యోతీ సేథీ ఎంటర్ప్రెన్యూర్గా అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ‘అభారి’ పేరుతో శారీ బ్రాండ్ను లాంచ్ చేసింది. వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అయింది.‘సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ముందు వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్ల పల్స్ తెలుసుకోగలిగాను. వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది జ్యోతి సేథీ. ముంబైకి చెందిన సంజయ్ ఖీర్ ఆరో తరగతిలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న సంజయ్ ఫుడ్కు సంబంధించి యూట్యూబ్ చానల్ ‘యువర్ ఫుడ్ ల్యాబ్’ ప్రారంభించాడు. 13 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకు΄ోయాడు. మూడు నెలల క్రితం కిచెన్ అండ్ హోమ్ అప్లయెన్స్ బ్రాండ్ ‘వైఎఫ్ఎల్ హోమ్’ను స్టార్ట్ చేశాడు. ‘ఒక వీడియోను రూపొందించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒక బ్రాండ్ను నిర్మించడానికి మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది పెద్ద సవాలు. ఆ సవాలును ఓపికతో మాత్రమే స్వీకరించాలి. కంటెంట్ క్రియేటర్గా నాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. అయితే ప్రొడక్ట్ మాట్లాడాలి’ అంటున్నాడు సంజయ్ ఖీర్. ఇన్ఫ్లూయెన్సర్గా తనకు ఉన్న పది సంవత్సరాల అనుభవంతో రెండు సంవత్సరాల క్రితం ‘వియరీఫెడ్’ అనే బ్యూటీ బ్రాండ్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది అనమ్ చష్మావాలా. తన స్కిన్ టోన్కు మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ గురించి ఎంత వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఈ నిరాశ నుంచే బ్రాండ్ ఆలోచన చేసింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ తరువాత తన బ్రాండ్ను పట్టాలకెక్కించింది. 26 సంవత్సరాల హిమాద్రి పటేల్ ఇన్ఫోసిస్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ఇన్ఫ్లూయెన్సర్గా సక్సెస్ అయిన తరువాత ఎత్నిక్ క్లాతింగ్ బ్రాండ్ ‘డ్రై బై హిమాద్రి’ స్టార్ట్ చేసింది. కంటెంట్ క్రియేటర్గా ప్రయాణం ప్రారంభించిన రణ్వీర్ అల్హబాదియా పాడ్కాస్ట్ షో ‘ది రణ్వీర్ షో’తో డిజిటల్ ప్రపంచంలో సుపరిచితుడయ్యాడు. కాలేజి ఫ్రెండ్ విరాజ్ సేథ్తో కలిసి ‘మాంక్ ఎంటర్టైన్మెంట్’ కంపెనీ ప్రారంభించి విజయం సాధించాడు. ఫ్యాషన్ సెన్స్, ఫన్–లవ్ కంటెంట్తో కంటెంట్ క్రియేటర్గా పేరు తెచ్చుకున్న దీక్షా ఖురానా ‘డీక్లాతింగ్’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్నవారికి ఎంటర్ప్రెన్యూర్గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు.‘సక్సెస్ఫుల్ బ్రాండ్లను క్రియేట్ చేయడానికి మౌలిక సదుపాయాల కొరత ఇన్ఫ్లూయెన్సర్లకు అడ్డంకిగా ఉంది’ అంటున్నాడు ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ‘వన్ ఇంప్రెషన్’ సీయీవో అపాక్ష్ గుప్తా అంతమాత్రాన ‘ఇది మన స్పేస్ కాదు’ అనుకోవడం లేదు, అధైర్యపడడం లేదు యువ ఇన్ఫ్లూయెన్సర్లు. ఒక్కో అడుగు వేసుకుంటూ నడకలో వేగం పెంచుతున్నారు. ఎంటర్ప్రెన్యూర్లుగా విజయం సాధిస్తున్నారు. కలా నిజమా అనుకున్నాను నా బ్రాండ్కు ఆర్డర్లు మొదలై, పెరుగుతూ పోతున్న క్రమంలో ‘ఇది కలా నిజమా?’ అనుకున్నాను. ఈ విజయం నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఇంకా ఏం చేయవచ్చు’ అని రక రకాలుగా ఆలోచించేలా చేసింది. ఇన్ఫ్లూయెన్సర్తో పోల్చితే ఎంటర్ప్రెన్యూర్గా బాగా కష్టపడాలి. – అనమ్ చష్మవాలా, బ్యూటీ బ్రాండ్ ‘వియరీఫెడ్’ ఫౌండర్ ఆ కష్టమే ఇక్కడ కూడా... వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అయితే ముందుగా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్గా నాకంటూ పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఆ తరువాత వ్యాపారం వైపు అడుగులు వేశాను. యూట్యూబ్ ద్వారా ఒక కంపెనీ ఎలా మొదలు పెట్టాలి? జీఎస్టీ నంబర్ అంటే ఏమిటి... మొదలైన విషయాలను తెలుసుకున్నాను. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటి నుంచి విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. అలాంటి కష్టమే వ్యాపారంలో పెడితే విజయం సాధిస్తాను అని నమ్మాను. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అది పెద్ద విజయం. – జ్యోతి సేథీ, క్లాత్ బ్రాండ్ ‘అభారీ’ ఫౌండర్ ట్రెండ్ సెట్ చేయాలి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్కు సంబంధించి సుపరిచిత బ్రాండ్లతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ఆ తరువాత సొంతంగా ‘డీక్లాతింగ్’ క్లాతింగ్ బ్రాండ్ను స్టార్ట్ చేశాను. బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ముందు ‘నా బ్రాండ్ ట్రెండ్ సెట్ చేయాలి’ అనుకున్నాను. అందరిలో ఒకరిగా కాకుండా మనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకోగలం. – దీక్షా ఖురానా, క్లాతింగ్ బ్రాండ్ ‘డీక్లాతింగ్’ ఫౌండర్ -
కోవిడ్ టైంలో కంటెంట్ క్రియేషన్, ఫేమ్తో పాటు డబ్బు కూడా
బాధ పడితే బాధ మాత్రమే మిగులుతుంది. అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి నవ్వితే ఏమవుతుంది? ‘అలా ఎలా కుదురుతుంది? బాధ బాధే, నవ్వు నవ్వే’ అని గట్టిగా అనుకున్న బాధాసర్పదష్టులు కూడా వీరి హాస్యం ముందు మౌనంగా ఉండలేకపోయారు. హాయిగా నవ్వేసి ఆ కొద్ది సమయమైనా బాధ నుంచి విముక్తి పొందారు. యువతరం ఎక్కడ ఉంటుందో నవ్వు అక్కడ ఉంటుంది. ఆ నవ్వునే పెట్టుబడిగా పెట్టి యువతరంలో ఎంతోమంది కామెడీ కంటెంట్ క్రియేటర్లుగా కీర్తి, డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా కొత్త వాళ్లు నవ్వుల రంగస్థలంపై మెరుస్తున్నారు. తమదైన హాస్యాన్ని పరిచయం చేస్తున్నారు... సోషల్ మీడియాలోని రకరకాల విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. మిథిక ద్వివేది, రాజ్ గ్రోవర్, సలోని గౌర్, విష్ణు కుషాల్లాంటి యంగ్ కామెడీ కంటెంట్ క్రియేటర్లు దూసుకుపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది లాక్డౌన్ టైమ్లో ఫేమస్ అయిన వారు. అప్పటి రోజుల్లో నుంచే కడుపుబ్బా నవ్వించే షార్ట్–ఫామ్ వీడియో స్పూఫ్లను రూపొందించారు. బ్రాండ్ ప్రమోషన్లలో కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నారు. ‘కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లు సత్తా ఉన్న రచయితలు. ఆడియెన్స్ను ఎలా ఆకట్టుకోవాలో వారికి బాగా తెలుసు. ప్రమోషన్స్కు ఎంటర్టైన్మెంట్ను సృజనాత్మకంగా జోడిస్తున్నారు’ అంటున్నాడు సోషల్ సమోస సీయివో హితేష్ రజ్వానీ. ఒకప్పటి టీవీ సీరియల్ ‘కస్తూరీ జిందగీ’లోని పాపులర్ పాత్రను చిన్నప్పుడు అనుకరిస్తూ అందరినీ నవ్వించేది కరిష్మా గంగ్వాల్. తాను ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీని కెరీర్గా తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రేడియో వేదికగా తన టాలెంట్ను శ్రోతలకు పరిచయం చేసింది. అప్పటి వరకు తన గొంతునే పరిచయం చేసిన కరిష్మ ప్రేక్షకులకు ముఖ పరిచయం చేయాలనుకుంది. కోవిడ్ టైమ్లో కంటెంట్ క్రియేషన్కు శ్రీకారం చుట్టింది. అత్తా–కోడళ్ల సంభాషణతో తొలిసారిగా ఒక ఫన్నీ వీడియో చేసింది. ‘ప్రేక్షకులు ఏమనుకుంటారో ఏమో’ అని సందేహించింది. అయితే తన సోదరి సలహాతో సోషల్మీడియాలో పెట్టింది. ఆ ఫన్నీ వీడియో 1.3 మిలియన్ల వ్యూస్ను దక్కించుకొని కరిష్మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కరిష్మకు ఇన్స్టాగ్రామ్లో 6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. జమ్మూలో పుట్టి పెరిగింది కరిష్మ. డాక్టర్లు, ఇంజనీర్ల కుటుంబం వారిది. తాను కూడా డాక్టరో, ఇంజనీరో కావాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తల్లిదండ్రులను ఒప్పించి కామెడీనే తన కెరీర్ చేసుకుంది.తన మిమిక్రీ స్కిల్స్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది చాందిని భాబ్డ. ‘ఆలియాభట్ను అనుకరించాలంటే చాందిని మాత్రమే’ అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడు తన ఉపాధ్యాయులు, చుట్టాలు పక్కాలను కెమెరా ముందు అనుకరిస్తూ అందరినీ తెగ నవ్వించేది చాందిని. ఇరవైనాలుగు సంవత్సరాల చాందిని 2016లో కామెడీ కంటెంట్ క్రియేషన్ ప్రారంభించింది. న్యాయశాస్త్రం చదివిన చాందిని అమెజాన్ మినీ టీవీ కామెడీ షో ‘కానిస్టేబుల్ గిర్పాడే’లో నటించింది.తీరిక సమయంలో సలోని గౌర్ ఫన్నీ వీడియోలు బాగా చూసేది. ‘నీలో నవ్వించే టాలెంట్ ఉంది’ అని ఫ్రెండ్స్ తరచుగా అనడంతో ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ రంగంలోకి దిగింది. తక్కువ టైమ్లోనే కామెడీ కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ సాధించింది. సలోనికి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సలోని అబ్జర్వేషనల్ కామెడీని తన బలంగా చేసుకుంది. ఇరవై సంవత్సరాల వయసులో సోనీ లివ్లో ‘అన్కామన్ సెన్స్ విత్ సలోని’ పేరుతో సొంత షో స్టార్ట్ చేసింది. ‘ఒక్కరోజు నవ్వకపోయినా ఆ రోజు వృథా అయినట్లే’ అంటాడు చార్లీ చాప్లిన్.అయితే నవ్వడం ఎంత వీజియో, నవ్వించడం అంత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజాల కెత్తుకుంటున్నారు కామెడీ కంటెంట్ క్రియేటర్లు. ఒకవైపు సీనియర్ల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సృజనాత్మక ఆలోచనలతో తమదైన కామెడీ కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు.‘ప్రేక్షకుల అర క్షణం నవ్వు చాలు వెయ్యి ఏనుగుల బలం తెచ్చుకోవడానికి’ అంటుంది లక్నోకు చెందిన 19 సంవత్సరాల మిథిక ద్వివేది. ఈ కామెడీ కంటెంట్ క్రియేటర్కు వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. నవ్వడం అదృష్టం... నవ్వించడం అంతకంటే అదృష్టం ‘లా’లో మాస్టర్స్ డిగ్రీ చేసినప్పటికీ నా ఆలోచనలన్నీ కంటెంట్ క్రియేషన్ చుట్టే తిరుగుతుంటాయి. ఎవరో చెప్పింది వినడం కంటే మనసు చెప్పింది వినడమే మంచిదని నా నమ్మకం. ఐడియాల కోసం కొన్నిసార్లు ‘ఇలా అయితే ఎలా ఉంటుంది’ అంటూ కసరత్తులు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం స్పాంటేనియస్గా వస్తుంటాయి. నా బెస్ట్ కంటెంట్లో ఎక్కువ శాతం స్పాంటేనియస్గా వచ్చిందే. నవ్వడం అదృష్టం. నవ్వించగలగడం అంతకంటే అదృష్టం. – చాందిని, కామెడీ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ కోసం... కామెడీ అయినా సరే కంటెంట్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. సహజంగా ఉండాలి. ప్రేక్షకులు దానితో రిలేట్ కావాలి. కంటెంట్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు. వెళ్లిన ఫంక్షన్ కావచ్చు....మనకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. దాన్ని మన స్టైల్లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేదే ముఖ్యం. – సలోని గౌర్, కామెడీ కంటెంట్ క్రియేటర్ కొత్తదనం కావాలి కామెడీ పుస్తకాలు చదివీ, సీరియల్స్ చూసి కామెడీని సృష్టించలేం. జనాల్లోకి వెళ్లి పరిసరాలను గమనించాల్సిందే. ఆసక్తికరమైన సంభాషణలు, పదాలు విన్నప్పుడు పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్ట్ రాస్తుంటాను. ఆ తరువాత షూట్స్, ఎడిట్స్, అప్లోడ్స్కు వెళతాను. ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడాను. – కరిష్మ గంగ్వాల్, కామెడీ కంటెంట్ క్రియేటర్ -
ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్! జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు..
అమెరికన్ ఫిట్నెస్ ఇన్ప్లుయెన్సర్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఎలాంటి కారణాలు లేకుండానే చనిపోయింది. ఓ రెస్టారెంట్కి భోజనానికి వెళ్లినప్పుడూ ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బరువు తగ్గాలనుకోవడమే ఆమెకు శాపమైందా? త్వరిగతిన బరువు తగ్గితే ప్రాణాలు కోల్పోతామా? తదితరాల గురించే ఈ కథనం.! అమెరికాలోని 40 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ బ్రాందీ మల్లోరీ 2014లో ఏబీసీ వెయిట్ లాస్ రియాలటీ షోతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే? అక్కడ ఆ వెయిట్లాస్ షోలో ఏకంగా మల్లోరి 70 కిలోల బరువు తగ్గింది. విపరీతమైన బరువుతో బాధపడుతున్నవారికి ఆమె ఆదర్శంగా నిలిచింది. ఆమెలా బరువు తగొచ్చనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆమె ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చుకుని కార్ వద్దకు వచ్చింది. అంతే ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఏమో!..ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయగా కారణాలు ఏమి తెలియలేదు. చివరకి బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న విధానమే కారణమా? అనే సందేహలు తలెత్తాయి. దీంతో ఆ దిశగా విచారణ చేయగా.. బరువు తగ్గడం కోసం చేసే విపరీతమైన వ్యాయామాలు కారణంగానే చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకోసం వారి అనుసరించే కట్టుదిట్టమైన డైటే.. ప్రధాన కారణం అని అన్నారు. "సడెన్గా కేలరీలు పరిమితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వల్ల బరువు తొందరగా తగ్గొచ్చు గానీ అది మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే? పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టానికి దారితీస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలకు ప్రభావితం చేసి ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే సప్లిమెంట్స్ కూడా ప్రమాదమే. అవి మధుమేహం వంటి ఇతరత్ర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకం కావొచ్చు. కొందరూ బారియాట్రిక్ సర్జరీలతో గణనీయమైన బరువు తగ్గేలా లక్ష్యం పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్పీడ్గా బరువు తగ్గినప్పటికీ జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏదిపడితే అది తినకూడదు. అందువల్ల త్వరితగతినే బరువు తగ్గేందుకు అనుసరించే పద్ధతులకు మన శరీరం వెంటనే సహకరించలేదు. మనం సడెన్గా మొదలు పెట్టే డైట్కి మన శరీర వ్యవస్థ అడ్జెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి నిధానంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే యత్నాలు చేయండి అని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇలానే హఠాన్మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్దే. ఈ నేపథ్యంలో తన ఫేస్తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?
రేవ్పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ ఎందుకు స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం... యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనప్రమేయం ఉందని తేలితే తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. అతడే కింగ్ పిన్, అరెస్ట్ చేయండి మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎంపి మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు. నోయిడా, గురుగ్రామ్లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న ఇస్కాన్.. ఇపుడు నేను, ఇలా అయితే లోక్ సభ సీటు వచ్చేస్తుందా? మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్ అనిపించాయని దీనిపై తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఎల్వీష్ ట్వీట్ చేశాడు. మొన్న ఇస్కాన్ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్ చేశారు... ఇలా లోక్సభ టిక్కెట్ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Judge saab proof ye rha pic.twitter.com/2db31v0bVb — Dr Nimo Yadav (@niiravmodi) November 3, 2023 పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్ మేనకా గాంధీ ఫౌండర్గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్ అనే అతను సెక్టార్ 51 బాంకెట్ హాల్కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విచారణ నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన సంగతి తెలిసిందే. Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime - that means… pic.twitter.com/26qX6gciG3 — ANI (@ANI) November 3, 2023 -
గూగుల్ జాబ్నే వద్దనుకున్న ఈ ఇన్ఫ్లుయన్సర్ గురించి తెలుసా?
నిహారిక ఎన్ఎం (Niharika NM).. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్తో చాలా పాపులర్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలతో కలిసి రీల్స్ చేసిన ఆమె ఆమధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కనిపించి మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన నిహారిక ప్రఖ్యాత అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ గూగుల్ (Google)లో జాబ్ వచ్చినా వద్దనుకుందని మీకు తెలుసా? తాజాగా జరిగిన మనీకంట్రోల్ క్రియేటర్ ఎకానమీ సమ్మిట్లో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేనే బ్రాండ్ కావాలనుకున్నా బెంగళూరులో జన్మించిన నిహారిక కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్ జాబ్ను వద్దనుకోవడం ఆవేశపూరిత నిర్ణయం కాదని, ఆ ఆఫర్ను తిరస్కరించే ముందు తమ కుటుంబమంతా కూర్చుని లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లు వివరించారు. కంటెంట్ క్రియేటర్గా ఇతర బ్రాండ్లకు మార్కెటింగ్ చేయడం కన్నా తానే బ్రాండ్ కావాలని కోరుకున్నానని అందుకే గూగుల్ జాబ్ను వద్దనుకున్నట్లు చెప్పారు. తాను ఆ ఉద్యోగంలో చేరి ఉంటే తన అమ్మ గర్వపడేదని చెప్పుకొచ్చిన నిహారిక.. అప్పటి వరకూ తన డ్రీమ్ కూడా అదేనని పేర్కొన్నారు. “ఆ ఉద్యోగం సంపాదించడం నా కల. అందుకోసం చాలా కష్టపడ్డాను. తీరా అది పొందినప్పుడు 'లేదు, ఇప్పుడు నాకు అది వద్దు' అని తిరస్కరించడం అంత సులభం కాదు. ఇది కుటుంబ నిర్ణయం” అని ఆమె వివరించింది. అందరికీ ఒకే సూత్రం సరిపోదు ఇక గూగుల్లో ఎంపిక గురించి మాట్లాడుతూ ‘అది చాలా విభిన్న ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గూగుల్ ఇంటర్వ్యూను క్రాక్ చేయడానికి అందరికీ ఒకే సూత్రం సరిపోదు’ అన్నారు. తన లాగా కంటెంట్ క్రియేషన్లో అడుగుపెడుతున్న యువత కోసం కొన్న ఆచరణాత్మక సలహాలు కూడా ఇచ్చింది నిహారిక. ముందు చదువు పూర్తి చేయాలని, ఒక వేళ జాబ్ చేస్తున్నట్లయితే అది పూర్తిగా మానేయకుండా కొనసాగిస్తూ కంటెంట్ క్రియేషన్ను సైడ్ హస్టిల్గా కొనసాగించాలని సలహా ఇచ్చింది. -
రీల్స్ చేసే భర్త కావాలి.. వైరలవుతున్న యువతి మ్యాట్రిమోనీ ప్రకటన
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఏడడుగులు వేసి ఒక్కటవుతున్నారు. పెళ్లి అంటే ఎన్నో పనులు ఉంటాయి. ఇందులో ముందుగా వరుడు, వధువును ఎంపిక చేసుకోవడం పెద్ద టాస్క్. ప్రేమ పెళ్లిలో ఈ ఇబ్బంది ఉండదు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహంలో అబ్బాయి లేదా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకప్పుడు బంధువులు, పెళ్లిళ్ల పేరయ్యలు, తెలిసిన వాళ్లు సంబంధాలు తెచ్చేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చ్చిన అమ్మాయి, అబ్బాయి కావాలని పేపర్, మ్యాట్రిమోని వెబ్సైట్లలో ప్రకటనలు ఇచ్చే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఓ యువతి తనకు కావాల్సిన వరుడి విషయంలో కొంచెం కొంచెం వింత నిబంధనలు పెట్టింది. ఇన్ఫ్లుయెన్సర్గా చేసే ఒక అమ్మాయి పెళ్లి కోసం ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన రియా అనే యువతి వరుడు కావలెను అంటూ యాడ్ ప్రచురణ ఇచ్చింది. ఇందులో తనకు సరిపోయే రీల్ భాగస్వామి + పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.. అతనికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదని, తనలో కలిసి కపుల్/రిలేషన్ రీల్స్ చేయాలని పేర్కొంది. కొత్త ఆలోచనలు MOI MOI లాంటి ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్కు ఆలోచనలు ఇవ్వాలని, అతడు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండకూడదని చెప్పింది తనను కలుసుకునే ముందు.. అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్డ్ చూసి నాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో తెలుసుకోవాలని పేర్కొంది. అతడికి నా రీల్స్ / వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాలి అని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. -
హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం
చెక్ రిపబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ తన ఫాలోయర్లకోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్ నుంచి జార విడవడం వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే తొలిసారి డాలర్ల వర్షం అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్ను అబ్బుర పరిచాడు. దీంతో ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు ఫ్యాన్స్. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కజ్మా అనే మారుపేరుతో బార్టోస్జెక్ సోషల్మీడియాలో బాగా పాపులర్. తను ప్రకటించిన ఒక పోటీ ప్రకారం కజ్మా తన చిత్రం 'వన్మాన్షో: ది మూవీ'లో పొందుపరిచిన కోడ్ను ఛేదించాలి. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీంతో మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రోగ్రాం కింద సైన్ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్మనినీ గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించాడు. దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును ఎక్కడ పడేస్తాడనే ఎన్క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈమెయిల్ పంపాడు. అన్నట్టుగా సేమ్ ప్లేస్కి వెళ్లి నిర్ణీత సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. హెలికాప్టర్ నుంచి డాలర్ల వర్షం కురపించాడు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు ''ప్రపంచంలో తొలిసారి నిజమైన డబ్బు వర్షం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. గాయాలు కాలేదు కూడా అంటూ తన పోస్ట్లో వెల్లడించాడు. View this post on Instagram A post shared by Kazma Kazmitch (@kazma_kazmitch) -
ఢీ అంటే ఢీ ఆర్ట్ ఆఫ్ డీఇన్ఫ్లుయెన్సింగ్
‘ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూశారు. ఇక డీఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూసే టైమ్ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్ డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్.సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్కు అడ్డుపడే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రాడక్ట్ను హైప్ చేస్తే డీఇన్ఫ్లుయెన్సర్లు ఆ హైప్ను ఛాలెంజ్ చేస్తున్నారు.... మార్కెటింగ్ డాటా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కంతార్ స్టడీ రిపోర్ట్ ప్రకారం వినియోగదారులపై ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్ల వరకు రకరకాలప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్ఫ్లుయెన్సింగ్! ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ హ్యాష్ట్యాగ్తో టిక్ టాక్లో ఈ ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియా ఎనాలటిక్స్ ఫర్మ్ ట్యూబ్లర్ ల్యాబ్స్ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. మ్యాడి వెల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ప్రముఖ కాస్మటిక్ స్టోర్స్లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్ పట్ల కస్టమర్లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్ఫ్లుయెన్సర్ల జాబితా నుంచి డీఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలోకి చేరింది. న్యూయార్క్కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా. మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్ చైనీస్ వ్లోగర్ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు. స్వీడన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ట్రిప్ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్ఫ్లూయెన్సర్లు వోవర్–హైప్డ్ప్రాడక్ట్స్ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రోఫెసర్ అయిన అమెరికస్ రీడ్ ఇలా అంటున్నారు...‘ఇన్ఫ్లుయెన్సర్లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్ను ప్రమోట్ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్కు ‘యాంటీ క్యాపిటలిస్ట్’ ట్రెండ్గా నామకరణం చేశారు. డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని, పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్ఫ్లుయెన్సింగ్కు విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది. ‘ఈ ట్రెండ్ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్ ఇన్ఫ్లు్లయెన్సర్ జెస్సిక. ‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పగానే కస్టమర్ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్లలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్కు చెందిన ఇన్ఫ్లున్సర్ కోలిన్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 4,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ హెల్త్, ఫైనాన్స్, లైఫ్స్టైల్ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్ఫ్లూయెన్సింగ్ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్ మూలంగా ఇన్ఫ్లుయెన్సర్లుప్రాఫిట్కు మాత్రమే కాదు మెరిట్కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది. సమస్య ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్ క్రియేటర్ -
మేకప్ వీడియోలతో సూపర్ క్రేజ్..ఏకంగా 19M ఫాలోవర్స్
ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ యూట్యూబ్.. పేరు బ్రెట్మ్యాన్. ఫిలిప్పీన్స్లో పుట్టాడు, హానలూలూలో పెరిగాడు. అమెరికన్ సిటిజన్గా సెటిల్ అయ్యాడు. బ్రెట్మ్యాన్ అసలు పేరు Sacayanan Laforga. వాళ్ల నాన్నకు.. రెజ్లర్స్ బ్రెట్ ‘ద హిట్మన్’ హార్ట్, డ్వైన్ ‘ద రాక్’ జాన్సన్ అంటే చాలా ఇష్టమట. అందుకే కొడుకును.. ఆ ఇద్దరి పేర్లు కలిసొచ్చెటట్టు బ్రెట్మ్యాన్ రాక్ అని పిలవడం షురూ చేశాడట. ఒరిజినల్ పేరు కన్నా నాన్న పెట్టిన బ్రాట్మ్యాన్ రాకే మంచిగా ఉందని దానికే ఫిక్స్ అయ్యాడట కొడుకు. 2015లో మేకప్ టిప్స్ వీడియోస్తో సోషల్ మీడియాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోస్లో కాండిడ్ హ్యూమర్ కామెంట్రీతో పాపులర్ అయ్యాడు. ఇన్నోవేటివ్ ఫ్యాషన్ సెన్స్కీ ఫేమస్ అయ్యాడు. ఇవన్నీ కలిసే బ్రెట్మ్యాన్ని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ని చేశాయ్. అకార్డింగ్ టు ఆన్లైన్ సోర్స్ .. బ్రెట్మ్యాన్ రాక్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, 18.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 15.1 మిలియన్ టిక్టాక్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Bretman Rock (@bretmanrock) View this post on Instagram A post shared by Vogue Philippines (@voguephilippines) -
ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!
బ్రెజిలియన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అడ్రియానా థైసెన్ (49) అకస్మాత్తుగా కన్నుమూయడం విషాదాన్ని రేపింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 100 పౌండ్లు (45 కిలోలు) తగ్గి పాపులర్ అయిన థైసెన్ అనూహ్యంగా కన్నుమూసింది. ఆమె అకాల మరణ వార్తను ఆమె బంధువు ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. థైసెన్ సెప్టెంబరు 17న బ్రెసిలియాకు దక్షిణంగా ఉన్న ఉబెర్లాండియాలోని తన నివాసంలో అంతుచిక్కని వ్యాధితో మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించ లేదు. ఆమె మృతిపై సంతాపాన్నిప్రకటించి, ఆత్మశాంతికి ప్రార్దనలు చేయాలని మాత్రమే అభ్యర్థించారు. థైసెన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్ల సంఖ్య 6 లక్షలకు పై మాటే. ముఖ్యంగా తన వెయిట్ లాస్ జర్నీతో కేవలం 100 మందితో మొదలు పెట్టి క్రమంగా బాగా పాపులర్ అయింది. అదే ఆమెకు ఇంటర్నెట్ స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిన్ననాటి నుండి అధికత బరుతో బాధపడేది. చివరికి మాదకద్రవ్యాల బానిసై, డిప్రెషన్లోకి వెళ్లి పోయింది. కానీ దీన్నుంచి బయటపడటానికి భయంకరమైన పోరాటమే చేసింది. 39 ఏళ్ల నాటికి 220 పౌండ్ల (సుమారు 100 కిలోలు) బరువుతో ఆమె తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. తన కష్టాలను వివిధ టాక్ షోలలో మాట్లాడుతూ థైసెన్ సోషల్ మీడియాలో దారుణంగా విలపించేది. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ప్రోత్సహించేది. ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామంతో కమిటెడ్గా పనిచేసి బరువు తగ్గానంటూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే 'ద్రికాస్ స్టోర్' అనే ప్లస్-సైజ్ యాక్టివ్వేర్ , దుస్తుల బ్రాండ్ను కూడా నడిపింది. పోషకాహార నిపుణుడి వద్దకు వెళ్లే స్థోమత లేక ఆన్లైన్లో లభించిన చిట్కాలను ఉపయోగించి పండ్లు సలాడ్స్, జ్యూస్లతో తనదైన ఆహార నియమాలు,కఠిన వ్యాయాయంతో తనను తాను తీర్చిదిద్దు కుంది. అలా ఫిబ్రవరి 2013లో 107 కిలోల బరువునుంచి 62.7 కేజీలకు చేరుకోవడం అంటే మాటలు కాదు. కానీ చివరికి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. థైసెన్ ఇక లేదన్న వార్తను ఆమె లక్షలాది ఫాలోయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారిక దృవీకరణేదీలేనప్పటికీఘామె ఆత్మహత్య చేసుకుందని కమెంట్ చేస్తున్నారు. అద్భుతమైన, అందమైన మహిళ, ఆత్మహత్య చేసుకోవడంబాధాకరం, సోషల్మీడియా కామెంట్లే ఆమెను చంపేశాయని కొందరంటే, అర్ధంలేని కామెంట్లు మానేసి డిప్రెషన్తో బాధపడుతున్న వారిని మాటల్ని విందాం అంటూ మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆత్మహత్య అవగాహన నెల, యెల్లో రిబ్బన్తో ప్రాతినిధ్యం వహించే 'ఎల్లో సెప్టెంబర్' థైసెన్ మృతిపై పలువురు వినియోగదారులు విచారం వ్యక్తం చేశారు. ఎవరితోనూ పోల్చుకోకండి, ఏదైనా మన చేతిలో మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి, ప్రతి ఒక్కరికి భిన్నమైన శారీరక స్వభావం, చర్మం, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులు ఉంటాయి. దాని ప్లాన్ చేసుకోండి.మనం కోరుకున్నది పొందడం మనపై తప్ప మరెవరిపైనా ఆధారపడదు దీనికి నేనే రుజువు. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఇదీ తరచుగా ఆమె ఫ్యాన్స్కు చెప్పేమాట. -
అమ్మ లిప్స్టిక్, అమ్మమ్మ చీరలతో యంగ్ ఎంట్రప్రెన్యూర్గా..
జీవితంలో ఇది అవ్వాలి! అది అవ్వాలి! అని కలలు కంటుంటాము. కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి. కొంతమంది పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు. హిమాద్రి పటేల్ మాత్రం ఈ కోవకు చెందిన అమ్మాయి కాదు. ఇక ఇంతేలే అని సరిపెట్టుకోకుండా తను అనుకున్నది సాధించేందుకు అందర్ని ఒప్పించి, కష్టపడి.. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తోంది. డెహ్రాడూన్కు చెందిన 26 ఏళ్ల హిమాద్రి పటేల్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. మేకప్ అంటే ఎంతో ఆసక్తి. అమ్మ వాడే లిప్స్టిక్ రాసుకుని తనని తాను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుండేది. ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు తాపత్రయ పడేది. ఇంటర్మీడియట్లో ఉండగానే జాతీయ, అంతర్జాతీయ మేకప్ ట్యుటోరియల్స్ చూసి మెకప్ మెళుకువలు నేర్చుకుంటుండేది. ఇలా నేర్చుకుంటూ తను కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంది. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈలోపు ఇంటర్మీడియట్ పూర్తయింది. తరువాత ఫ్యాషన్ను కెరీర్గా మలచుకోవాలనుకుంది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేయమని చె΄్పారు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను నొప్పించలేక కంప్యూటర్ సైన్స్లో చేరింది. బీటెక్ చదువుతున్నప్పటికీ మేకప్ మెళకువలు నేర్చుకుంటూనే ఉంది. ఇన్ఫోసిస్ను వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా... బీటెక్ చదువుతున్నప్పటికీ మనసు యూట్యూబ్పైనే ఉండడంతో మరోసారి తల్లిదండ్రులను యూట్యూబ్ ఛానల్ పెడతానని అడిగింది. అయినా ఒప్పుకోలేదు. అప్పుడు హిమాద్రి అక్క... ‘‘ఛానల్ను పెట్టనివ్వండి. ఆమెకు మూడు నెలలు సమయం ఇద్దాం. ఆలోపు తనని తాను నిరూపించుకుంటే ఒకే. లేదంటే మనం చెప్పినట్టు చేస్తుంది’’ అని తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో హిమాద్రి పటేల్ పేరుతోనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. ఒక లిప్స్టిక్, ఐలైనర్తో ఛానల్లో వీడియోలు పోస్టుచేయడం ప్రారంభించింది. అందంగా కనిపించేందుకు ఎటువంటి హానీ లేని మేకప్ను ఎలా వేసుకోవాలో చెబుతూ వీడియోలు పోస్టుచేసేది. ఎక్కువగా నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు చెబుతుండడంతో తన ఛానల్కు మంచి ఆదరణ లభించింది. మరోపక్క బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. క్యాంపస్ సెలక్షన్స్లోనూ మంచి ప్రతిభచూపి ఇన్ఫోసిస్, క్యాప్జెమినీలలో ఉద్యోగం సంపాదించింది. అయినా హిమాద్రికి పెద్ద సంతోషంగా అనిపించలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటివరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తనకి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇన్ఫోసిస్లో చేరమని చెప్పారు. కానీ తను యూట్యూబ్ ఛానల్ను నడుపుతానని చెప్పింది. అప్పటికే హిమాద్రి మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు యూట్యూబర్గా కొనసాగడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ వివిధ రకాల సరికొత్త కంటెంట్ను అప్లోడ్ చేస్తూ సంపాదిస్తూ, ఎక్కువమంది ఫాలోవర్స్తో.. బ్యూటీ, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయ్యింది. అమ్మమ్మ చీరలుచూసి... హిమాద్రి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కట్టుకునే చీరలను జాగ్రత్తగా గమనించేది. నిమిషంలో కుచ్చిళ్లు పెట్టుకుని అందంగా చీరకట్టుకుని సైకిల్ తొక్కేది అమ్మమ్మ. అంతేగాక చీరలకు తనే స్వయంగా డిజైన్లు కుట్టుకోవడం, ఇంట్లో అందరికి స్టోల్స్ అల్లడాన్ని చూసి పెరిగిన హిమాద్రి అలాంటి బట్టలనే మార్కెట్లో విక్రయించాలనుకుని..‘డ్రై బై హిమాద్రి’ పేరిట క్లాత్ బ్రాండ్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తోంది. అలనాటి డిజైన్ చీరలు, డ్రెస్లను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా హిమాద్రి దూసుకుపోతోంది. గౌరవంగా... డ్రై (ఈఖఐ) అంటే సంస్కృతంలో గౌరవం అని అర్థం. అమ్మాయిలు, మహిళలు ధరించే చీరలు, డ్రెస్లు ఏవైనా గౌరవించేలా వారి కట్టుబొట్టు ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తోంది హిమాద్రి. వ్యాపార రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు. కుటుంబం నుంచి వచ్చిన తొలివ్యాపారి కావడంతో హిమాద్రి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ రకాల చిక్కులను తన అక్క సాయంతో ఎదుర్కొంటూ.. చిన్నచిన్న వేడుకల నుంచి వెడ్డింగ్ డ్రెస్ల వరకు అన్ని వస్త్రాలను రూపొందించి డ్రైబ్రాండ్కు గుర్తింపు తెచ్చుకుని యంగ్ ఎంట్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఐదు గంటలకు పడుకునేవాళ్లం అక్కా నేను రాత్రంతా మేలుకుని చేయాల్సిన పనిగురించి పరిశోధించి, వివరంగా తెలుసుకుని పేపర్ వర్క్ పూర్తిచేసేవాళ్లం. లీగల్ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకునేవాళ్లం. అలా అన్నివిధాలా సన్నద్దమయ్యాక అంటే రెండేళ్ల తరువాత డ్రై బ్రాండ్ను గతేడాది అక్టోబర్లో తీసుకొచ్చాం. ఆర్థికంగా ఎవరూ సాయం చేయలేదు. యూట్యూబ్, కంటెంట్ బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో దాచుకున్న డబ్బులనే డ్రై బ్రాండ్కు పెట్టుబడిగా పెట్టుకున్నాను. ప్రారంభంలో పెద్దగా ఆర్డర్లు ఏమీ రాలేదు. నెల తరువాత ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆర్డర్లతో పెట్టుబడికి కొంత, మిగతాది వర్కర్లకు జీతాలకు ఇచ్చేదాన్ని. అలా చేస్తూ ఇప్పుడు కాస్త లాభాలు ఆర్జిస్తున్నాను. – హిమాద్రి పటేల్ -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్మీడియా ఛానెల్స్లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్స్రైబర్స్కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్మీడియా ఛానెల్లో ప్రమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్ట్యాగ్ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్ట్యాగ్లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్ట్యాగ్లు లేదా లింక్ల సమూహంతో యాడ్స్ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్స్ట్రీమ్లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల కోసం కంటెంట్ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫైనాన్షియల్ మీడియా పోస్టులకు చెక్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ఆర్థికపరమైన(ఫైనాన్షియల్) సలహాలిచ్చేవారిపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలిచే వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణకు తాజాగా చర్యలు చేపట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 10,000 నుంచి రూ. 7.5 లక్షలవరకూ చార్జ్చేసే సలహాదారులు ఇటీవల అధికమైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. తద్వారా ఇన్వెస్టర్లకు కచి్చతమైన, నిష్పక్షపాత సమాచారం లభించేందుకు వీలు కలి్పంచనుంది. అదీకృత సలహాలకు అవకాశంతోపాటు.. మోసాలను తగ్గించేందుకు సెబీ చర్యలు తోడ్పడనున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ పేర్కొన్నారు. సెబీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక సలహాదారులు(ఫిన్ఫ్లుయెన్సర్లు) సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. రిజిస్టర్కానివారు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లతో జట్టు కట్టేందుకు అనుమతించరు. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్కావడంతోపాటు, నిబంధనలు పాటించవలసిరావడంతో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనం(అకౌంటబిలిటీ) పెరుగుతుందని, ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడతాయని రైట్ రీసెర్చ్, పీఎంఎస్ వ్యవస్థాపకుడు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఫిన్ఫ్లుయెన్సెర్ల పాత్రకు జవాబుదారీతనం పెంచడం ద్వారా సెబీ ఇన్వెస్టర్లకు రక్షణను పెంచుతున్నదని అజీజ్ పేర్కొన్నారు. దీంతోపాటు పరిశ్రమలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. సెబీ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వద్ద రిజిస్టరైన ఫిన్ఫ్లుయెన్సెర్లు తమ రిజి్రస్టేషన్ నంబర్, కాంటాక్ట్ వివరాలు తదితరాలను పొందుపరచవలసి ఉంటుంది. -
సుకుమారి సూపర్ స్టంట్స్
పాపులర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్స్టాగ్రామ్లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి. ‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్. -
యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
ఓ యూట్యూబర్ కారణంగా న్యూయార్క్ వీధులు శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్లో ఫ్రీ గిఫ్ట్ల కోసం భారీగా గుమిగూడిన యువతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్తో సహా ఇన్స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. తనను కలవాలంటే మ్యాన్ హట్టన్కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్లో ప్లే స్టేషన్ కన్సోల్తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. భారీగా ప్రజాదరణ ఉన్న సీనట్ పోస్టుకు స్పందించిన యువత శుక్రవారం సాయంత్రం దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కాలనీల్లో కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదీ చదవండి: 3 Years Jail For Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ -
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) -
నవ్వుల పువ్వుల తోటమాలి
‘ధర్నా దుర్గ’ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దుర్గ ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయలేదు. సింగిల్ నినాదం కూడా చేయలేదు. అయితే ఆమె నవ్వులు మాత్రం ధర్నా చేయకపోయినా హల్చల్ చేస్తాయి. నాప్స్టాప్గా నవ్వేలా చేస్తాయి... ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేక పోయినా దుర్గ ఉండాల్సిందే. ఎందుకంటే దుర్గ ఉన్నచోట ‘హాహాహో’లతో కూడిన భారీ నవ్వుల వర్షం కురుస్తుంది. ఆ నవ్వుల వర్షంలో తడిసిపోవడానికి చుట్టాలు పక్కాలు అమిత ఉత్సాహం చూపుతారు. ఆ నవ్వుల బలంతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్గా బోలెడు పేరు తెచ్చుకుంది దిల్లీకి చెందిన ధర్నా దుర్గ. నిజజీవితంలోని సంఘటనల చుట్టూ హాస్యాన్ని అల్లుకునే ధర్నా దుర్గకు సామాజిక మాధ్యమాలలో భారీ అభిమాన గణం ఉంది. హీరోయిన్ల గొంతును అనుకరించడం తన ప్రత్యేకత. సారా అలీఖాన్ గొంతును అద్భుతంగా అనుకరిస్తుంది. సారా ఫేవరెట్ డైలాగ్ ‘నమస్తే దర్శకో’పై ఫన్నీగా వీడియో చేసింది దుర్గ. ఈ వీడియో చూసి సారా అలీఖాన్ ముచ్చటపడడమే కాదు, దుర్గను మెచ్చుకుంటూ వీడియోను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో, ఇంటికే పరిమితం కావాల్సిన అనివార్యత వల్ల చాలామందిలాగే దుర్గ కూడా బోర్గా ఫీలైంది. దాని నుంచి బయటపడడానికి సెలబ్రిటీలను అనుకరిస్తూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇవి తన స్నేహితులకు తెగ నచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది. ఇక అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తలపై ‘కామెడీ క్వీన్’ అనే కిరీటం వచ్చి చేరింది. ‘ఈ వీడియోలు ఏమిటో, లైక్లు ఏమిటో!’ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసేవారు దుర్గ తల్లిదండ్రులు. వారికి అన్నీ ఓపికగా చెప్పేది దుర్గ. తమ చుట్టాలు పక్కాలలో ‘ఫస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా తొలి గుర్తింపు తెచ్చుకుంది దుర్గ. నాటక రంగ నేపథ్యం ఉన్న దుర్గకు లోతైన పరిశీలన శక్తి ఉంది. అది తాను చేసే ఫన్నీ వీడియోలకు ఎంతో ఉపయోగపడుతుంది. రియాలిటీ షోలపై దుర్గ వేసే ఫన్నీ పంచ్లకు నవ్వు ఆపుకోవడం చానా కష్టం. ‘బిగ్ బాస్’లాంటి ప్రసిద్ధ రియాలిటీ షోల నుంచి క్యారెక్టర్లను అల్లుకొని ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. నృత్య నైపుణ్యం దుర్గ అదనపు బలం. కొరియోగ్రాఫర్లపై ఫన్నీ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘డ్యాన్సర్ ధర్నా దుర్గ’గా పేరు తెచ్చుకుంది. వేలాదిమందిని నవ్విస్తున్న ధర్నా దుర్గ... ‘నవ్విస్తే ఇంత పేరు వస్తుందని తెలియదు’ అంటోంది నవ్వుతూ! -
ఇండియాలోనే పాపులర్ యూట్యూబ్ చానెల్.. పొలిటికల్ లీడర్స్ కూడా
ఎన్నికల సమయం రాబోతూ ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సోషల్ ఇన్ఫ్లూయర్స్ను సంప్రదించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పొందుతున్నారు. ‘కర్లీ టేల్స్’ యూ ట్యూబ్ చానల్తో విశేషంగా ఫాలోయర్స్ను సాధించుకున్న కామియా జని ఇటీవల రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరే వంటి నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 20 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ ఉన్న కామియా జని కేవలం ఈ ఇంటర్వ్యూల ద్వారా పేరు, పైకం సంపాదిస్తోంది. కామియా జని ‘సండే బ్రంచ్’ పేరుతో చేసే యూ ట్యూబ్ ఇంటర్వూలు 100వ ఎపిసోడ్కు చేరుకున్నప్పుడు గెస్ట్గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ‘శివాజీ పార్కులో చిన్నప్పుడు క్రికెట్ ఆడితే చాలా ఆకలేసేది. మూడు నాలుగు వడపావ్లు లాగించేసేవాణ్ణి’ అని చెప్పాడు. వెంటనే కామియా జని ‘మీ కోసం జుహూ, అంధేరి, శివాజీ పార్క్ నుంచి మూడు వడపావ్లు తెప్పించాను. వాటిలో ఏది శివాజీ పార్క్దో మీరు తిని కనిపెట్టి చెప్పాలి’ అంది. సచిన్ టెండూల్కర్ చిటికెలో కనిపెట్టాడు. ఇలా ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరూ? ‘సండే బ్రంచ్’కు విరాట్ కోహ్లీ ఒక వారం గెస్ట్. ‘అనుష్కతో పెళ్లయ్యాక మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకూడదని హనీమూన్కు ఫిన్లాండ్ వెళ్లాం. హాయిగా తిరుగుతున్నాం. ఒక చోట కాఫీ తాగుతూ ఉంటే ఒక సర్దార్జీ మమ్మల్ని గుర్తు పట్టాడు. కోహ్లీ... మా ఇంటి పేరు కూడా కోహ్లీనే అన్నాడు. పెద్దాయనా... ఇప్పుడు హడావిడి చేసి మా గుట్టు బయట పెట్టకు అని బతిమాలుకున్నాం’ అని సరదా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.ఇలాంటి సరదా కబుర్ల కోసం కామియా జని ఇంటర్వ్యూలు చూస్తారు. భారత్జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రాజస్థాన్లో ఉన్నప్పుడు ‘సండే బ్రంచ్’కు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామియా జనితో ‘నాకు పాతికేళ్ల వయసు వచ్చినప్పుడు లండన్లో ఒక కార్పొరెట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ రోజుల్లో మొదటి జీతం 2,500 పౌండ్లు అందుకున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది’ అని గుర్తు చేసుకున్నాడు. కామియా జని యూట్యూబ్ చానల్ ‘కర్లీ టేల్స్’కు 20 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన వీడియోలకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె చానల్ ఇండియాలో అత్యంత పాపులర్ చానల్గా గుర్తింపు పొందింది. అందుకే కొత్త సినిమా రిలీజ్ అయినా, ఈవెంట్ జరుగుతున్నా సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కనుక రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల వ్యూస్ కామియా జనికి భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నాయి. ఒకప్పుడు జర్నలిస్ట్ ముంబైలో ఒక సాధారణ ఆటో డ్రైవర్కు జన్మించిన కామియా జని మాస్ మీడియాలో డిగ్రీ చేసింది. తర్వాత ఎల్ఎల్బీ చేసి 2006లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్ ఎడిటర్గా పని చేసింది. ఆ తర్వాత సిఎన్బిసి తదితర చానల్స్లో పని చేసి 2016 నాటికి ఈ రోజువారీ పని బోర్ కొడుతోందని భావించి ఉద్యోగం మానేసింది. ఆమెకు ప్రయాణాలు, ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ, నచ్చింది తింటూ వాటి మీద వీడియోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే విశేషమైన ఆదరణ లభించింది. కామియా జని జట్టు రింగులు రింగులుగా ఉంటుంది కనుక ‘కర్లీ టేల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టింది. ‘సండే బ్రంచ్’ పేరుతో సెలబ్రిటీలను బ్రంచ్కు పిలిచి వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తూ పిచ్చాపాటి కబుర్లతో ఇంటర్వ్యూ చేయడం కామియా జని స్టయిల్. విహారం, ఆహారం అంటే అందరికీ ఇష్టం కనుక వ్యూస్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఫోలోయెర్స్ ఉన్నవారే నిర్ణేతలు ఇవాళ ఎక్కువమంది ఫాలోయెర్స్ ఉన్నవారే అభిప్రాయాలను నిర్మిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది కనిపెట్టారు. లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సాయం పొందుతున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ప్రచారం పొందుతున్నారు. ఇటీవల్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే కామియా జనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కామియా జని లాంటి వాళ్లకు ఇంకా డిమాండ్ పెరగనుంది. -
నాకు ఏదైనా త్వరగా బోర్ కొడుతుంది, కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను: నిహారిక
బెంగళూరుకు చెందిన నిహారిక ఇంజినీరింగ్, ఎంబీఏ చేసింది. అయితే తనలోని క్రియేటివిటీ ఆమెను వేరే మార్గం వైపు నడిపించింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న నిహారికాకు ‘డోన్ట్ జస్ట్ ఫాలో ట్రెండ్స్. సెట్ దెమ్’ అనే మాట అంటే చాలా ఇష్టం... ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ‘ఇంజినీరింగ్ తప్ప ఏదైనా చేయాలి’ అని గట్టిగా అనుకుంది నిహారిక! పేరెంట్స్ ససేమిరా అన్నారు. దీంతో చదువు తప్పలేదు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కంటెంట్ క్రియేటర్గా ప్రయాణం మొదలుపెట్టింది. సోషల్ లైఫ్ పెద్దగా లేని నిహారిక తన స్టడీరూమ్లో ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకుంటూనే, మరోవైపు కామెడీ స్కెచ్లు రాసేది. ‘మొదట్లో నన్ను ఎవరూ సీరియస్గా తీసుకునేవారు కాదు. నన్ను అనుకరిస్తూ కామెంట్స్ పెట్టేవారు. అయితే వాటికి నేనెప్పుడు బాధ పడలేదు. స్వభావరీత్యా నేను చాలా సెన్సిటివ్ పర్సన్ని. అయితే కాలేజీలోకి అడుగు పెట్టిన తరువాత మరీ ఇంత సున్నితంగా ఉంటే బాగుండదు అనిపించింది. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రతిదానికి బాధ పడాల్సిన అవసరం లేదు. మానసికంగా దృఢంగా ఉండడం అనేది కంటెంట్ క్రియేటర్గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు బాగా ఉపయోగపడింది. మొదట్లో వెక్కిరించిన వారే ఆ తరువాత మెచ్చుకునేవారు’ అంటుంది నిహారిక. చవకబారు విమర్శల మాట ఎలా ఉన్నా నిర్మాణాత్మక విమర్శను ఇష్టపడుతుంది. ‘కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగు పెట్టుకోవడానికి నిర్మాణాత్మకమైన విమర్శ తోడ్పడుతుంది’ అంటుంది నిహారిక. ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’ ద్వారా నిహారిక పేరు ఎక్కడికో వెళ్లియింది. నిహారిక కంటెంట్కు తొలి ప్రేక్షకురాలు నిహారికానే! ప్రేక్షక స్థానంలో కూర్చున్నప్పుడు తాను ఆ కంటెంట్ ఎంజాయ్ చేయగలిగితేనే ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతుంది. 2022లో తన తొలి షార్ట్–ఫార్మట్ కంటెంట్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగిచూసుకోలేదు. తన ఫస్ట్ వైరల్ వీడియో ‘లివింగ్ ఎలోన్ 101’పదమూడు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్ల వ్యూస్ను దాటేసింది. ‘ప్రేక్షకుల పెదాల మీద నవ్వులు పూయించే ఔషధం ఇంట్లో దొరకదు. జనాల్లోకి వెళ్లాలి. చిన్న ఎక్స్ప్రెషన్ నుంచి విలువైన మాట వరకు ఎన్నెన్నో బయటి ప్రపంచంలోనే దొరుకుతాయి’ అంటుంది నిహారిక. ‘నాకు ఏదైనా సరే త్వరగా బోర్ కొడుతుంది. దీని వల్ల నాకు జరిగిన మేలు ఏమిటంటే నా కంటెంట్ను ఇతరులు బోర్గా ఫీల్ కావడానికి ముందుగానే కొత్త కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను’ అంటుంది నిహారిక ఎన్ఎం. View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) -
యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం భారీ షాక్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లు, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లపై కేంద్రం దృష్టిసారించింది. ఆదాయపుపన్ను నిబంధనల్ని ఉల్లంఘించిన క్రియేటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రియేటర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను కేంద్ర విభాగానికి చెందిన ఇన్ ట్యాక్స్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదాయాలు, లాభాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉందంటూ పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం, కేరళకు చెందిన 10 మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులు, యాక్టర్స్లను ఐటీ అధికారులు విచారించారు. సోషల్ మీడియాలో ప్రభావశీలురుగా చెలామణి అవుతున్నవారు, కంటెంట్ క్రియేటర్లు ఊహించని విధంగా సంపాదిస్తున్నారని, కానీ ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ ఇక, కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్ల నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారని, బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించేలా ప్రోత్సాహిస్తూ వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇందులో వారి బ్రాండ్ ఎండార్స్మెంట్లు, చెల్లింపులు, చెల్లించని ప్రమోషన్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్ల వినియోగం, ఖర్చలు, ఆయా సంస్థల నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా చేసే ప్రకటనల రూపంలో జరిపే చెల్లింపులపై చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. కేరళతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్ల కార్యకలాపాలు నిర్వహించే సంస్థల గురించి ఆరాతీస్తున్నారు. కొత్త నిబంధనలు గత ఏడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు లేదా అవసరాలు తీర్చుకుంటే.. సదరు వ్యక్తి 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా?
భారతదేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు పాపులారీటీ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనేలేదు.మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లతో వేలాదిమంది యూట్యూబర్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదాయ ఆర్జనలోనూ తమ మర్క్ను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో టాప్లో ఎవరున్నారో తెలుసా? ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యధిక నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్గా నిలిచాడు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, బిజినెస్ మేన్గా భువన్ బామ్ స్ఫూర్తిదాయకమైన విజయగాథను చూద్దాం. బడ్డింగ్ ఆర్టిస్టుగా వినోద పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభించిన భువన్ బామ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చాడు. తన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగాడు. దేశంలోని టాప్ యూట్యూబర్లలో ఒకరిగా నిలిచాడు. 26 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భువన్ బామ్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.122 కోట్లు. ఈ సంపాదనంతా, బ్రాండ్, ఎండార్స్మెంట్ డీల్స్, తన సొంత వెబ్ సిరీస్, సినిమా పాత్రలు , యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం గుజరాత్లోని వడోదరకు చెందినవాడు భువన్ బామ్. చిన్నప్పటినుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో దాన్నే కరియర్గా ఎంచుకున్నాడు ఢిల్లీలోని చిన్న కేఫ్లు , రెస్టారెంట్లలో పాడటం మొదలు, రియాలిటీ టీవీ షో పాటల పోటీల్లోనూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని సంపాదన నెలకు రూ. 5000 మాత్రమే. ఈ చాలీ చాలని జీతమే అతనిలో ఎదైనా సాధించాలంటే పట్టుదల పెరిగింది. దాంతో యూట్యూబ్ వైపు మళ్లాడు. అలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం బిబి కి వైన్స్ అనే కామెడీ ఛానెల్తో పాపులర్ అయ్యాడు. కాశ్మీర్ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన మహిళను అభ్యంతర కరమైన ప్రశ్నలు అడిగిన వార్తా విలేకరిని దూషించిన వీడియోను అప్లోడ్ చేసిన పాపులరయ్యాడు. దీనికి ముందు అనేక మ్యూజిక్ ఆల్బమ్స్తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. 2018లో తాను రూపొందించిన ప్లస్మైనస్ షార్ట్ ఫిలిం కూడా బాగా పేరు తెచ్చుకుంది. దివ్య దత్తో కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2019లో ది బెస్ట్ షార్ట్ఫిలిం అవార్డు కూడా గెల్చుకుంది. సఫర్, రహగుజార్, అజ్ఞాతవాసి లాంటి ఆల్బమ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అంతేనా యూట్యూబ్లో టిటు టాక్స్ అనే కొత్త డిజిటల్ సిరీస్లో షారుఖ్ ఖాన్ ఫస్ట్ గెస్ట్గా కనిపించాడు. మే 2020లో, బామ్ 'లైఫ్లైన్ ఆఫ్ సొసైటీ'లో ఇండియాలో లాక్డౌన్ సమయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. ఎలక్ట్రీషియన్, హౌస్ హెల్ప్, రైతులు, చిన్నచిన్న వ్యాపారులు తదితరుల కష్టాలను రికార్డు చేసిన ఈ వీడియోలు విశేషంగా నిలిచాయి. జనవరి 2021లో తన ఛానల్ బిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందని స్వయంగా ప్రకటించాడు. ఇటీవల ధిండోరా అనే వెబ్ సిరీస్తోపాటు, భువన్ రొమాంటిక్ కామెడీ అమెజాన్ మినీ టీవీ సిరీస్ రఫ్తా..రఫ్తాతో తానేంటో నిరూపించు కున్నాడు. హిట్ సిరీస్లు షోలతో ఇలా ఒకదాని తరువాత సక్సెస్తో దూసుకుపోతున్ భువన్ జనవరి 2023లో, తాజా ఖబర్తో ఓటీటీ అరంగేట్రం చేసాడు. జూన్ 26న రోడ్డు ప్రమాదంలో మరణించిన సహనటుడు దేవరాజ్ పటేల్కు హృదయపూర్వక నివాళులర్పించారు. అయితే 2021లో కోవిడ్ కారణంగా బామ్ తల్లిదండ్రులు చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యంపై అడుగులు వేస్తూ తనలాంటివారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.