Inter
-
పుస్తకాలతో కుస్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్, పదో తర గతి పబ్లి క్ పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులు నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పిల్లల పరీక్షలపైనే తల్లిదండ్రులు దృష్టి పెట్టారు. హాస్టళ్లల్లో రాత్రింబవళ్లూ స్టడీ అవర్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు కాలే జీలు, స్కూళ్ల హాస్టల్స్లో విద్యార్థులను చదివించడం కోసం ప్రత్యేక సిబ్బంది పని చేస్తున్నారు. విస్తృతంగా స్టడీ మెటీరియల్స్ ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోని 417 ప్రభుత్వ కాలేజీల్లో 1.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లకు ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. నెల రోజుల క్రితమే అన్ని చోట్లా సిలబస్ పూర్తయింది. 15 రోజులుగా రివిజన్ చేయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు.వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నారు. టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి మొదలవుతాయి. 5.50 లక్షల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 1.40 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. వందశాతం పాస్ ఫలితాలపై స్కూళ్లు దృష్టి పెట్టాయి. విద్యాశాఖ అన్ని సబ్జెక్టులకూ స్టడీ మెటీరియల్స్ను స్కూళ్లకు పంపింది. నిద్రలేని రాత్రులు గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులకు నిద్ర కూడా కరవవుతోంది. ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్ర లేపి గంటపాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సబ్జెక్టు అధ్యాపకులు ముఖ్యమైన చాప్టర్స్పై ప్రశ్నలు వేస్తున్నారు. సరైన సమాధానం రాకపోతే ఆ చాప్టర్పై శిక్షణ పెంచుతున్నారు. ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు? వారిని ఏ విధంగా ప్రిపేర్ చెయ్యాలనే అంశాలపై స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు రోజూ నివేదికలు కోరుతున్నాయి. పరీక్షలు అయ్యే వరకు ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశాలు వెళ్లాయి.సబ్జెక్టు టీచర్లకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పోటీ పెడుతున్నాయి. ఎక్కువ మంది మంచి జీపీఏ, ర్యాంకులతో పాసయ్యేలా చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆశ చూపుతున్నాయి. ఈసారి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కూడా టార్గెట్లు పెట్టారు. సబ్జెక్టులవారీగా మంచి స్కోర్ చేసిన స్కూళ్లను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే స్థాయిలో పిల్లల చదువుపై దృష్టి పెట్టారు. పిల్లలకంటే ముందే నిద్రలేచి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను కనిపెట్టుకుని ఉంటున్నారు. పరీక్షలపైనే దృష్టి ఇది కీలక సమయం. పిల్లలకు పరీక్షలయ్యే వరకు ఏ పనికీ వెళ్లదల్చకోలేదు. వారిని ఎలా చదివించాలనే అంశాలపైనే దృష్టి పెడుతున్నాం. వాళ్లకు ఏం కావా లో దగ్గరుండి చూసుకుంటున్నాం. కంటిమీద కును కు లేకున్నా వాళ్ల భవిష్యత్ కోసమే పనిచేస్తున్నాం. –ఎస్కే జబ్బర్ (విద్యార్థి తండ్రి, జడ్బర్ల)మార్కులు పెంచేలా ప్రిపరేషన్ ఒకటికి పదిసార్లు ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నాం. సబ్జెక్టువారీగా అధ్యాపకులను అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న చాప్టర్స్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. త్వరగా గుర్తుండిపోయేలా శిక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –ఆర్ పార్వతిరెడ్డి (హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం)మెరుగైన ఫలితాల కోసంప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులూ మంచి ర్యాంకులు పొందేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ముఖ్యమైన ప్రశ్నలతో పాటు, గతంలో వచ్చిన ప్రశ్నలను గుర్తించి.. ఈసారి తేలికగా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు)క్షణం తీరిక ఉండటం లేదు పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు, టీచర్లకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన దీపికల ద్వారా విద్యార్థి తేలికగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూస్తున్నాం. – ఆర్ రాజగంగారెడ్డి (ప్రభుత్వ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల్లోకి షూస్, సాక్స్లకు నో ఎంట్రీ
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?గుజరాత్లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.పరీక్షల్లో జరిగే కాపీయింగ్ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్లు ధరించకూడదని ఆదేశించింది. ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ (జనరల్) ఫలితాల కోసం క్లిక్ చేయండిఇంటర్ ఫస్ల్ ఇయర్ సప్లమెంటరీ(వొకేషనల్) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్కు రూ.1300, రీకౌంటింగ్కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం పెరిగిన ఇంటర్ ఫీజులు...‘ఇంటర్’ ద డ్రాగన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ఫీజుల మోత మోగుతోంది. ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. గత ఏడాదితో పోలి స్తే ఏకంగా 40–50% అదనంగా డిమాండ్ చేస్తున్నా యి. ఇటీవలే టెన్త్ పరీక్షలు మొదలైన నేపథ్యంలో.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి.. తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేమీ చేయలేమని అంటున్నారు. 4 లక్షల మంది విద్యార్థులపై భారం రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు టెన్త్ పాసవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్టియర్లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవే టువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజ మాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సి న పరిస్థితి. వాస్తవానికి కరోనా మహ మ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10– 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వర కూ పెంచాయి. అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. కోవిడ్ సమయంలో కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారని, కొరత కారణంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నాయి. నిర్వహణ భారం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. అఫిలియేషన్ ఫీజు పెంచకున్నా.. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మూడు కేటగిరీల కింద అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇస్తుంది. ప్రతీ విద్యాసంస్థలో గరిష్టంగా 960 మందిని చేర్చుకునేందుకు అనుమతిస్తారు. అఫిలియేషన్ ఫీజు కింద ఏటా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలేజీల నుంచి రూ.1.20 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీల నుంచి రూ.60 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల నుంచి రూ.20వేల చొప్పున వసూలు చేస్తారు. రెండేళ్లకోసారి ఈ ఫీజులను సమీక్షించి పెంచాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా పెంచలేదు. 50శాతం దాకా పెంపు.. సాధారణ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది వరకూ గరిష్టంగా రూ.60 వేల ఫీజు ఉంటే.. ఈసారి రూ.90 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు రూ.1.25 లక్షల నుంచి రూ. 2 లక్షలకుపైగా (కాలేజీని బట్టి) డిమాండ్ చేస్తున్నాయని.. అదే హాస్టల్నూ కలిపితే ఏకంగా రూ.3.25 లక్షల వరకు చెప్తున్నారని వాపోతున్నారు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పెంచడాన్ని చూసి.. సాధారణ కాలేజీలు కూడా పెంచుతున్నాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలోనూ వార్షిక ఫీజులను రూ.75 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 20శాతం మేర పెరిగాయని.. ప్రైవేటు కాలేజీల రవాణా, ఆటో చార్జీలు కూడా 30శాతం వరకూ పెంచారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో ఇంటరీ్మడియట్ విద్య కోసమే రూ.లక్షల్లో వెచి్చంచాల్సి వస్తోందని వాపోతున్నారు. అంత ఫీజు ఎలా కట్టగలం? ఇటీవల టెన్త్ పరీక్షలు రాసిన మా అబ్బాయిని చేరి్పంచాలంటూ ఓ ప్రైవేటు కాలేజీ సిబ్బంది వెంటపడ్డారు. అడ్మిషన్ కోసం వెళ్తే ఏటా రూ.2.25 లక్షల ఫీజు అని చెప్పారు. కావాలంటే ఓ రూ.25 వేలు రాయితీ ఇస్తామన్నారు. అంత ఫీజేమిటని అడిగితే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని, అందుకే ఫీజులు పెంచామని చెప్పారు. రెండేళ్లకు రూ.4 లక్షల ఫీజు ఎలా కట్టగలం. వేరే కాలేజీల్లో ఆరా తీసినా అడ్డగోలుగా పెంచారు. ప్రభుత్వం నియంత్రణ చేపడితే పేదలకు ఊరటగా ఉంటుంది. – సుచిత్ర, ఇంటర్ విద్యార్థి తల్లి, హైదరాబాద్ దోపిడీని నియంత్రించకుంటే ఆందోళన ప్రైవేటు కాలేజీల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సర్కారు నుంచి ఏ విధమైన ఆదేశాలూ లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు భరించలేని విధంగా కాలేజీలు ఫీజులు పెంచుతున్నాయి. తక్షణమే నియంత్రణ చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్ ఆగడాలను అడ్డుకోరా? అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవకుండానే ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టడం చట్ట విరుద్ధం. దీనికితోడు పేదలు ఏమాత్రం భరించలేని విధంగా ఫీజులు పెంచడం దుర్మార్గం. పాలక వర్గాలు దీన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని అడ్డుకోవాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఫీజుల నియంత్రణ అవసరం కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల అన్ని కాలేజీలూ ఆ నింద మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే కాలేజీలను కేటగిరీలుగా విభజించి, ఫీజుల నిర్ణయం చేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి ఫీజుల కట్టడి చట్టాలు అవసరం. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిశీలిస్తున్నాం ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియంత్రణ కోసం ఏం చేయాలనేది పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధంగా ఉంది. – జయప్రదాబాయి, ఇంటర్ బోర్డ్ సీనియర్ అధికారి -
త్వరలో ఇంటర్, పది ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు. -
ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజి లాకర్లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్ పాసైన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్ రూపంలో ఫీజు చెల్లించగా, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ, ఈ ఏడాది ఫీజులను, నామినల్ రోల్స్ను కూడా ఆన్లైన్ చేయడంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. ఇంటర్ పరీక్షలకు 9,59,933 మంది.. ఇక మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 5,17,591 మంది, రెండో ఏడాది 4,45,342 మంది మొత్తం 9,59,933 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. ఇప్పటికే ఆయా జూనియర్ కాలేజీల్లోని పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అలాగే, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు 2,130 సెంటర్లను సిద్ధంచేశారు. ఈసారి ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఇదే ఆన్లైన్ విధానం కొనసాగుతుందన్నారు. డిజిలాకర్లో 68.73 లక్షల సర్టిఫికెట్లు.. రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్లో సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వ లెన్సీ, జె న్యూనెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు కావాలన్నా తీసుకునేలా ‘డిజిలాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. ఇందుకోసం ‘జ్ఞానభూమి’ ని డిజిలాకర్కు అనుసంధానించింది. ఇందులో ఇప్పటివరకు 2006 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తిచేసిన 68,73,752 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచారు. సర్టిఫి కెట్లలో తప్పుపడిన పేరును సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. డిజి లాకర్గా పిలుస్తున్న ‘డిజిటల్ డాక్యుమెంట్స్ రిపోజిటరీ’లో ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థులు తమ పత్రాలను పొందవచ్చు. గతంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు ‘డూప్లికేట్’ పొందాలంటే పోలీసు వి భాగం ఎన్ఓసీ, నోటరీ అఫిడవిట్తో దరఖాస్తు చేయడంవంటి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చే ది. ఈ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడంతో విద్యార్థి తన మొబైల్ ఫోన్లోని డిజిలాకర్ యాప్ ద్వారా సర్టిఫికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది. -
ఇంటర్ విద్యార్థినిపై కన్నేసిన కామాంధుడు
-
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్నగర్లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
తర్ఫీదు ఇవ్వకుంటే చిక్కులే!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కార్యాచరణ ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) విధివిధానాలు విడుదలైతే స్పష్టత ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్) ఆఖరులో హడావుడితో నష్టం ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు. రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
ఇంటర్ ఆంగ్లంలోనూ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఇంటర్మీడియె ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లోనే ప్రాక్టి కల్స్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది నుంచి కొత్తగా ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండబో తున్నాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ప్రాక్టి కల్స్ను విడగొట్టి ఒక్కో విభాగానికి 4 మార్కులు చొప్పన కేటాయించనున్నారు. దీంతోపాటే మొద ట్నుంచీ క్లాస్వర్క్ మాదిరి రికార్డు రాయడాన్ని చేర్చనున్నారు. దీనికి కూడా 4 మార్కులు ఇవ్వను న్నారు. మొత్తం 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటా యి. ఇందులో విద్యార్థులు కనీసం 7 మార్కులు తెచ్చుకోవాలి. థియరీని 80 మార్కులకు నిర్వహించనుండగా అందులో కనీసం 28 మార్కులు రావా లి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ప్రాక్టికల్స్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే కసరత్తు చేపట్టిన ఇంటర్ బోర్డు... నిపుణుల చేత ఆంగ్ల ప్రాక్టికల్ విధానంపై వివరాలను క్రోడీ కరించి ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసు కుంది. ఆంగ్ల భాష కీలకమైనది కావడం, ఇంటర్ పూర్తయినా విద్యార్థులకు దీనిపై పట్టులేకపోవడంతో ప్రాక్టికల్స్ను అనివార్యంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధ్యయనాలు సైతం ఇంటర్ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని చెబుతుండటం, విదేశీ విద్యకు వెళ్లేందుకూ ఆంగ్లంపై పట్టు అనివార్యం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. కాలేజీలకు సూచనలు... ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ విధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. పరీక్షలకు కావల్సిన సమయం ఉన్నప్పటికీ బోధన సమయంలోనే విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాక్టి కల్స్ ఆవశ్యకత, సన్నద్ధత ఎలా ఉండాలనే దానిపై ప్రతి కాలేజీలోనూ అవగాహన కల్పించాలని ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్కు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తరగతి గదిలో పరస్పర సంభాషణలు, ఏదైనా అంశంపై మాట్లా డించే పద్ధతిని అనుసరించాలని సూచించారు. వారానికి ఒక గంటపాటు ఈ తరహా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆంగ్లంలో ధారాళంగా చదవడం, రాయడం కూడా అభివృద్ధి చేయాల న్నారు. దీంతోపాటే స్పెల్లింగ్లపైనా పట్టు సాధించేలా ప్రోత్సహించాలని, ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీన్ని పెంచాలని భావిస్తున్నారు. కోవిడ్ దెబ్బతో సాధ్యమా? ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై అధ్యాపకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెన్త్లో కోవిడ్ ప్రభావం కన్పిస్తోంది. లెర్నింగ్ లాస్ ఎక్కువగా ఉందని విద్యాశాఖ సైతం పేర్కొంది. ముఖ్యంగా ఆంగ్ల భాషలో గ్రామర్, స్పెల్లింగ్లపై విద్యార్థులు సరైన స్థాయిలో పట్టు సాధించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్లోకి తీసుకొనే అంశాలన్నీ గ్రామర్తో ముడివడి ఉన్నాయి. గ్రామర్లో బేసిక్స్ లేకుండా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ను గుర్తించడం కష్టమని అధ్యాపకులు అంటున్నారు. రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్షన్లోనూ విద్యార్థులు వెనుకబడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తాం ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రతి జిల్లాలోనూ సబ్జెక్టు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తాం. విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ప్రాక్టికల్స్ కొత్తగా చేపడుతున్నా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – జయప్రదాబాయ్, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి -
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే
సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు ►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు ►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు ►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు ►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు ►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు ►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే ►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ -
టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు మార్చి 29వ తేదీతో (బుధవారం) ముగిశాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్కు 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మే మొదటి వారంలోనే ఫలితాలు.. పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది. గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాల్యుయేషన్, టేబులేషన్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డ్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ మూల్యాంకనం ఇలా.. ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు.ఇక ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
ఇంటర్‘నెట్’ స్టడీతో ఫస్టియర్ ఫట్..!
సాక్షి, హైదరాబాద్: అదిగో.. ఇదిగో.. అంటూ ఫలితాల విషయంలో విద్యార్థులను హైరానా పెట్టిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది. ఒకేషనల్స్తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరవగా 2,24,012 (49 శాతం) మందే పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. బాలికలు 56 శాతం మంది, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్లో అత్యధికంగా 63 శాతం మంది, మెదక్లో అతి తక్కువగా 20 శాతం మంది పాసయ్యారు. అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు ప్రైవేటు సంస్థలకే దక్కాయి. అరకొర విద్యాబోధన సాగిన ప్రభుత్వ కాలేజీలు గరిష్ట మార్కుల్లో ప్రైవేటుతో పోటీ పడలేకపోయాయి. ‘ఏ’ గ్రేడ్ ఉత్తీర్ణులే ఎక్కువ పాసైన విద్యార్థుల్లో 75 శాతానికి పైగా మార్కులను (ఏ గ్రేడ్) సాధించినవాళ్లే ఎక్కువున్నారు. మొత్తం 1,15,358 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 1,58,139 మంది పరీక్ష రాస్తే 61 శాతం, బైపీసీలో 1,05,585 మంది రాస్తే 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో ప్రభుత్వ కాలేజీల్లో గరిష్ట మార్కు 466 కాగా, ప్రైవేటు కాలేజీల్లో 467. బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. ఏడాది మొత్తం సంక్షేమ హాస్టళ్లు తెరవకపోవడంతో అక్కడ గరిష్ట మార్కులు ప్రభుత్వ కాలేజీల కన్నా తక్కువగా వచ్చాయి. ఒకేషనల్ కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీల్లోనే ఉత్తీర్ణత ఎక్కువుంది. మొత్తం 49,331 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరైతే 24,226 (49 శాతం) మంది ఉతీర్ణలయ్యారు. ఇందులో బాలికలు 62 శాతం ఉన్నారు. చప్పుడు లేకుండా.. ఇంటర్ బోర్డు మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఫలితాలను వెబ్సైట్లో పెట్టేసింది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మరీ తక్కువగా ఉండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చడీచప్పుడు లేకుండా ఫలితాలు వెల్లడించింది. ఆన్లైన్ చదువులు విద్యార్థులకు అర్థం కాకపోవడం, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు సక్రమంగా ఆ సదుపా యం అందుబాటులో లేకపోవడంతో కొన్ని వర్గాలు ఆందోళన చెందినట్టే ఉత్తీర్ణత 49 శాతం దాటలేదు. అనుక్షణం ఉత్కంఠగానే.. మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది అనుక్షణం ఉత్కంఠగానే సాగాయి. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తొలుత అందరినీ రెండో ఏడాదికి ప్రమోట్ చేశారు. థర్డ్ వేవ్ ఆందోళనలతో ఫస్టియర్ పరీక్షలు అనివార్యమని బోర్డు భావించింది. సెప్టెంబర్ నుంచి ఇదే టెన్షన్. చివరకు అక్టోబర్, నవంబర్లో పరీక్షలు జరిగాయి. రీ వెరిఫికేషన్కు 22 వరకు చాన్స్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఐడీ, పాస్వర్డ్ సంబంధిత కాలేజీలకు పంపినట్టు బోర్డు తెలిపింది. తప్పులుంటే ప్రిన్సిపాల్స్ ద్వారా బోర్డుకు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలంది. -
ఇంటర్ చదివి.. 20 ఫేక్ కంపెనీల సృష్టి!
సాక్షి, విశాఖపట్నం: కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్టీ లొసుగుల్ని పసిగట్టాడు. అంతే, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలను సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడవేశాడు. నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్టు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లను రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలుపరిచాడు. ఈ భారీ నకిలీ ఇన్వాయిస్లని పరిశీలించిన డీజీజీఐ, సెంట్రల్ జీఎస్టీ వర్గాలు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 20 నకిలీ సంస్థల రాకెట్ గుట్టు రట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం జోనల్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ భాస్కరరావు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.60 కోట్లు రికవరీ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు భాస్కరరావు చెప్పారు. -
తెలంగాణ: ముగిసిన తొలిరోజు ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేల 354 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నారు.ద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు,శానిటైజేశన్,మాస్కులు తప్పని సరి చేశారు .పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపధ్యంలో విద్యార్దులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. చివరి నిమిషంలో కూడ కొందరు విద్యార్దులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా థర్మల్ స్క్రీనింగ్లో అస్వస్థతగా ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్ గదిలో ఉంచుతారు. ఓపిక ఉంటే అక్కడైనా పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురైతే 040–24601010 లేదా 040–24655021కు కంట్రోల్రూం నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. చదవండి: ఆలస్యమైనా తప్పనిసరి -
ఆటో డ్రైవర్ కూతురు ఇంటర్లో అదరగొట్టింది
డెహ్రాడూన్ : చదువులో ప్రతిభ కనపర్చడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డుకాదని నిరూపించిందో యువతి. ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఐరమ్(18) అక్కడి పూల్చంద్ నారి శిల్ప బాలికల ఇంటర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్ చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల చదువు దగ్గర ఏమాత్రం రాజీ పడలేదు. తండ్రి కష్టాన్ని వృధాకానీకుండా.. ఐరమ్ చదువు తన ఊపిరిగా చేసుకుంది. ఇష్టపడి చదివి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. అంతేకాదు బయాలజీలో 99 శాతం మార్కులు సాధించింది. దీనిపై ఐరమ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యురాలు కావాలన్నదే నా లక్ష్యం. నేనిప్పుడు నీట్కు సిద్ధం అవుతున్నాను. నేను డాక్టర్ అవ్వటం వల్ల మా ఇంటి ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేసిన నా ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉన్నాను. కోవిడ్ కారణంగా నాన్న సంపాదన బాగా తగ్గింది. నేను, మా అక్క ఇద్దరం ఒకే ఫోన్లో ఆన్లైన్ తరగతులు విన్నాం’’ అని పేర్కొంది. ఐరమ్ తండ్రి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘ నా పిల్లలకు మంచి విద్య అందించటానికి డెహ్రాడూన్ వచ్చాను. నాకొచ్చే అరకొర సంపాదనతో నా నలుగురు పిల్లలను చదివించటం సాధ్యపడలేదు. అందుకే పెద్ద బిడ్డను చదువు మాన్పించి నాకు సహాయంగా ఉండమని కోరాను. అయితే, లాక్డౌన్ కారణంగా ఉన్న పని కూడా పోయింది. లోన్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పించాను. వారందరూ చక్కగా డిగ్రీ చదువులు పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఐరమ్ ఇంటర్లో ప్రతిభ కనపర్చడం గర్వంగా ఉంది. నా పిల్లలెవరూ భవిష్యత్తులో ఆటో నడపరని భావిస్తున్నాను’’ అని అన్నాడు. -
టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తేదీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి విద్యాబోధన దిశగా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
TS : ఇంటర్ 2nd ఇయర్ పరీక్షలపై కీలక ఉత్తర్వులు
-
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. -
తెలంగాణలో ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా
-
ఒకటి నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (చదవండి: ఓపెన్ విద్యార్థులందరూ పాస్) (చదవండి: ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ ‘ప్రాబ్లమ్’
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రయోగాత్మక విద్యే విద్యార్థి భవితకు పునాది. కొన్నేళ్లుగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా కొనసాగుతూ వచ్చింది. పారదర్శకంగా నిర్వహించేందుకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకులాటలో మునిగి తేలుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రలోభాల ఎసరు పెట్టి ఈ విధానాన్నీ కలుతం చేస్తున్నాయి. ఎక్కడైతే మాకేంటి అంటూ ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లకు ముడుపుల మత్తు చల్లి తమ దారికి తెచ్చుకుంటున్నాయి. దీనికిగాను అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచే దండుకుంటున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్కు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కూడా ప్రాక్టికల్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రాక్టికల్స్ గండం తప్పించటానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేస్తున్నారు. ఒక్కో విద్యార్థి చేత రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూల్ చేసి ప్రాక్టికల్స్ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్ కోసం సమయం వెచ్చించే తీరిక లేకపోవటం, నేర్చుకున్నా చేయగలమో లేదోనన్న భయంతో విద్యార్థులు అడిగినంత డబ్బులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల అక్రమాలను అడ్డుకోవటానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలను తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డ వారు తమ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది కూడా నిరి్వగ్నంగా అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం ఈ ఏడాదైనా అవకతవకలను ఆరికట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతునన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్... సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 298 కళాశాలల నుంచి ఇంటరీ్మడియట్ రెండో ఏడాదికి చెందిన 36,460 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విభాగం నుంచి 29,458, బైపీసీ విభాగం నుంచి 7,002 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, పరికరాలు ఉన్న 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ను సమర్థవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఆర్ఐవో తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యం వాస్తవమే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలలో ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేయించటం లేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆయా యాజమాన్యాలు కేవలం థీయరీపైనే దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు ప్రాక్టికల్స్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల తనిఖీల్లో ఇటువంటి పరిస్థితి గుర్తించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాం. ప్రాక్టికల్స్ విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించం. – జెడ్ఎస్ రామచంద్రరావు, ఇంటర్ బోర్డు ఆర్ఐవో, గుంటూరు -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను వారంలోపు విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్ మెమోలను అందుబాటులో పెట్టామని, ఈ సారి ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాలికలు 41.35 శాతం, బాలురు 35.4 శాతం పాసయ్యారని తెలిపారు. -
వరంగల్లో ఇంటర్ ప్రశ్నాపత్రాల గల్లంతు
-
గురుకులాల్లో ఇంటర్ సీట్లకు డిమాండ్
పాడేరు : ఏజెన్సీలోని మూడు బాలికల గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశం కోసం గురువారం స్థానిక అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2050 మంది విద్యార్థినులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. పాడేరు, అరకు గురుకుల బాలికల జూనియర్ కళాశాలల్లో(ఆంగ్ల మాధ్యమం) 9 గ్రూపులకు 330 సీట్లు, జీకే వీధిలోని (తెలుగు మీడియం) మూడు గ్రూపులకు 120 సీట్లు ఉన్నాయి. గ్రూపు కు పరిమితంగా సీట్లు ఉండడంతో చాలా మందికి సీట్లు దక్కలేదు. టెన్త్లో 8.0 గ్రేడ్పాయింట్లు, పీటీజీ వారికి 7.0 గ్రేడ్ పాయింట్లు పైగా సాధించి న వారికి ఇంగ్లిష్ మీడియం కళాశాలల్లోను, 9.0 గ్రేడ్ పాయింట్లు పైగా వచ్చిన వారికి మాత్రమే తెలుగు మీడియం కళాశాలల్లో సీట్లు లభించాయి. ఈ మూడు కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో మొత్తం 450 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. సీట్లు పెంచాలని విద్యార్థినుల వినతి : ఏటా గురుకులాల్లో సీట్లు లభించక విద్యార్థినులు సతమతమవుతున్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం గురుకుల జూనియర్ కళాశాలలు మాత్రమే ఉండడం, తక్కువ సీట్లు ఉండడంతో అడ్మిషన్లు పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థినులు గురుకులాల్లో సీట్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 1500 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది వారి సంఖ్య రెండువేలకు దాటింది. సీట్లు దక్కక పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురుకుల కళాశాలల్లో సీట్లు పెంచాలని బాలికలు ఐటీడీఏ వద్దకు చేరి అధికారులను కోరారు. 500 సీట్లు పెంపునకు ప్రతిపాదన : మూడు గురుకుల కళాశాలల్లో 500 సీట్లు పెంపు కోసం ప్రతిపాదనలు చేశామని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది టెన్త్ పాస్ పర్సంటేజి పెరగడంతో పాటు విద్యార్థులు మంచి గ్రేడ్ పాయింట్స్ సాధించడంతో గురుకులాల్లో ఇంటర్ సీట్ల పెంపు అవసరాన్ని ముందే గుర్తించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీ గురుకుల కార్యదర్శి భాను ప్రసాద్తో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం మొదటి కౌన్సెలింగ్లో 450 సీట్లు భర్తీ చేశామని, సీట్లు పెంపు అనుమతి రాగానే మలివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
తల్లిదండ్రులు మందలించారని..
అల్వాల్: ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాసానికిలోనైన ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భీమవర ప్రాంతానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్లో ఉంటూ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె రామలక్ష్మి(17) బీమవరంలో ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికిలోనైన రామలక్ష్మి బుధవారం తల్లితోపాటు ఇంటిపై పనులు చేస్తూ రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. -
నో... హాలిడేస్ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘వేసవి సెలవుల్లో జూనియర్ కళాశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదు. మే నెలాఖరులో ఇంటర్లో ప్రవేశాలకు బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం’ ఇవి ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన నిబంధనల సారాంశం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే ఇంటర్æ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల హడావుడితో అలసినవిద్యార్థులు సేద తీరేదెన్నడు ? ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకూ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 93,932 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 59 వేల మంది హాజరయ్యారు. ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమై పరీక్షల హడావుడి, ఆందోళనతో అలసిపోయి సెలవులతో సేద తీరాల్సిన సమయంలో ఊపిరి తీసుకునే సమయం లేకుండా ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్తో పాటు హాస్టల్ క్యాంపస్లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు నగర శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులకు జూన్ నెలలో ప్రవేశాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని ఇంటర్బోర్డు అకడమిక్ కేలండర్లో పొందుపర్చగా, కాలేజీల యాజమాన్యాలు ఇందుకు కొత్త భాష్యాన్ని చెబుతున్నాయి. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన దృష్ట్యా వేసవి సెలవులను ఎంజాయ్ చేయడం వల్ల విద్యార్థులు వెనుకబడి పోతారని తల్లిదండ్రులకు నమ్మబలికి, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రథమ సంవత్సర పరీక్షలు రాసినవిద్యార్థులకు సైతం... సీనియర్ ఇంటర్ విద్యార్థులను జేఈఈ–అడ్వాన్స్డ్, నీట్ శిక్షణ పేరుతో క్యాంపస్లలో పెట్టి రుద్దుతున్న కాలేజీల యాజమాన్యాలు ప్రథమ సంవత్సర విద్యార్థులను సైతం వదలడం లేదు. టెన్త్ విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం కళాశాలలు ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించాయి. దీనికి బ్రిడ్జి కోర్సు, ఐఐటీ కోచింగ్ అంటూ రకరకాల పేర్లు పెట్టారు. జిల్లాలో ఈ విధంగా టెన్త్ పూర్తి చేసిన, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు జరుగుతున్నా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇంటర్ తరగతులను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు ఇంటర్బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆర్ఐవో జెడ్.ఎస్ రామచంద్రరావుకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్దాస్, జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సాంబశివపేటలోని ఆర్ఐవో కార్యాలయంలో రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఇంటర్బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకూ వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, గుంటూరు నగరంతో పాటు జిల్లా వివిధ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అడ్మిషన్లు ప్రారంభించి రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్బోర్డు నిబంధనలకువిరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపైకఠిన చర్యలు చేపట్టని పక్షంలో ఎస్ఎఫ్ఐఆధ్వర్యంలో కళాశాలల వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఆర్ఐవోను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.కిరణ్, రాజేష్ తదితరులున్నారు. తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. మే నెలాఖరులో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు ఆటవిడుపు లేకుండా తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై దాడులు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు చేపడతాం.– జెడ్.ఎస్ రామచంద్రరావు,ఇంటర్బోర్డు ఆర్ఐవో -
ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన
-
మార్కుల పోటీలో... రాలిపోతున్న విద్యాకుసుమాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకులే ప్రధానమనే భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే అదునుగా కళాశాలల యాజమాన్యం విద్యార్థులపై చదువు పేరుతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పోతోంది. సెలవుల్లోనూ ఆటవిడుపుకు దూరం అవుతున్నారు. తమ బాధను అర్థం చేసుకునే వారు లేక, తీవ్ర ఒత్తిడిని భరించలేక పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఒకానొక దశలో పిల్లలు జీవితంపై విరక్తి చెంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంటర్ విద్యార్థులే ఉంటున్నారు. ఉన్నత విద్యకు వారధి ఇంటర్ కావడంతో వీరిపై ఒత్తిడి ఎక్కువ అవుతోంది. పదో తరగతి వరకు స్వేచ్ఛగా విద్యనభ్యసించిన విద్యార్థులు ఇంటర్కు వచ్చే సరికి చతికిలబడుతున్నారు. ముఖ్యంగా జైలును తలపించే కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఆటలు, షికారులు లేకపోవడంతో మానసిక రోగిలా మారుతున్నారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఒత్తిడి లేని విద్యనందించేలా చర్యలు తీసుకోవాలంటూ మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లల ఆసక్తి, వారి ఇష్టాలను పట్టించుకోవడం లేదు. తమ ఆశలు, ఆకాంక్షలను వారిపై రుద్ది ఇంజినీరింగ్, మెడిసిన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లలు ఆయా కోర్సులను అర్థం చేసుకోలేక, తమకు ఇష్టమైన కోర్సు చదవలేక మథన పడుతున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే పిల్లల బలవన్మరణాలు తగ్గుతాయని మానసికవేత్తలు, మేథావులు చెబుతున్నారు. తరచూ మాట్లాడాలి తల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వారు చదువులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీయాలి. మానసికంగా ధైర్యం నింపడం ద్వారా వారిలో ఉన్న ఆందోళన దూరం అయి చురుగ్గా ఉంటారు. విద్యార్థిని అనుమానాస్పద మృతి గత మూడేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరూ వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నవారే. తాజాగా శుక్రవారం ఉదయం తిరుపతి సమీపంలోని తనపల్లి రోడ్డులో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థిని కె.శ్రుతి(17) అనుమానాస్పదంగా మృతి చెందింది. వాయల్పాడు మండలం శాకంవారిపల్లికి చెందిన సిద్ధమల్లు, కళావతి దంపతుల కుమార్తె కె.శ్రుతి ఆ కళాశాలలో ఇం టర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతోనే మృతి చెందిం దంటూ తల్లిదండ్రులు, కళాశాల యాజమానులు చెబుతున్నారు. పోస్టుమార్టం చేస్తే నిజాలు తెలిసొచ్చేవని, పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు చెబుతున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్ విద్యార్థి సంఘం, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలం టూ డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ కళాశాలను నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా కళాశాలను నిర్వహిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు. చదువు పేరుతో విద్యార్థులను బలితీసుకుంటున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. కళాశాలలు పునఃప్రారంభమైన కొద్ది రోజులకే ఆత్మహత్యల పర్వం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు బనాయించాలని, గుర్తింపు రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు సుధీర్, హేమంత్కుమార్రెడ్డి, శివకృష్ణ, జయప్రకాష్, ప్రసాద్, దిలీప్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమామ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివారెడ్డి, చలపతి, ఎస్ఎఫ్ఐ నాయకులు మాధవకృష్ణ, గిరి, ఎన్ఎస్యూఐ నాయకుడు వసీం, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో ఇంటర్ ఫస్టియర్ కొత్త పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్ను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్ 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్ నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది. మూడు రోజుల్లో రిఫండ్ చేస్తాం: టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పేమెంట్లు ఫెయిలైన అభ్యర్థులకు తిరిగి 3 రోజుల్లోగా రిఫండ్ చేస్తామని టీఎస్పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్–4, టీఎస్ఆర్టీసీలో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పేమెంట్లను ఎస్బీఐ ఈ–పే ద్వారా స్వీకరిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 11వరకు చేసిన పేమెంట్ల సమస్యల్ని పరిష్కరించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పాలీసెట్ చివరి దశ సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్–2018 ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. చివరి దశ కౌన్సెలింగ్లో కొత్తగా 9,100మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రం లోని 170 పాలిటెక్నిక్ కాలేజీల్లో 38,359 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్ కలుపుకొని 29,663 సీట్లు భర్తీ అయ్యాయని, 8,696 సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం లోగా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్కార్డు/డెబిట్కార్డు ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని, కాలేజీల్లో నేడు, రేపు చేరాలని సూచించారు. -
బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల ఇన్చార్జి వీసీ డాక్టర్ అశోక్కుమార్ బుధవారం కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు (తెలంగాణ రాష్ట్రం) 85 శాతం, స్థానికేతరులకు 15శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. భర్తీ కాని సీట్లను గ్లోబల్, ఎన్ఆర్ఐ కోటా కింద 5 శాతం మేర కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కోటా కింద బయట ఇంటర్ పూర్తి చేసినవారికి నేరుగా బీటెక్ ఫస్టియర్లో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్4లోపు పంపించాలన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూలై 2న ఓరియంటేషన్ నిర్వహించి, 3న తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లు www.rgukt.ac.in, http://admissions.rgukt. ac.inలలో సంపద్రించాలని సూచించారు. -
కేజీబీవీల్లో ఇంటర్
ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన.. తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇకనుంచి ఇంటర్ కూడా కొనసాగించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం అంగీకరించి.. ఇంటర్ బోధనకు సిద్ధమైంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్య అందుతుండగా.. ఇక నుంచి ఇంటర్ వరకు బోధించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరమైన నిధులు విడుదల చేస్తుండగా.. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కరీంనగర్ఎడ్యుకేషన్: డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బాలికల విద్య సబ్ కమిటీ సమావేశం గత డిసెంబర్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ను కలిసి కేజీబీవీల్లోఇంటర్ వరకు విద్యను పొడగించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరుగనున్నాయి. జిల్లాలో 11 కేజీబీవీలు కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 5,370 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితోపాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజనం మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, ఇతర స్నాక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా న్యాప్కిన్స్, కాస్మోటిక్ కిట్లను అందిస్తున్నారు. భవనాలు నిర్మించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది తర్వాత చదువు కొనసాగించే వీలు కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలామంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం.. సొంత గ్రామాలకు వెళ్లిపోవడం.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీలను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2100 మంది ఉన్నారు. ఉత్తీర్ణులైన వారందరికీ ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులకు ప్రయోజనం– అనురాధ, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరుగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదో తరగతి వరకే విద్య అందుతోంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. -
ఇంటర్లో చేరేముందు ఇలా..
నిడమర్రు:పది పరీక్షలు ముగిసాయి. టెన్త్ తర్వాత విద్యార్థులు ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపడం సహజం. ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజనీరింగ్లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సంప్రదాయక డిగ్రీలో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. ఇంటర్మీడియట్తోనే అరంగేట్రం చేయాల్సిందే. అయితే ఇంటర్లో ఉండే గ్రూపులు, వాటి ఎంపికల్లో విద్యార్థికి కొన్ని మార్గదర్శకాలు.. ఉన్నత విద్యకి ఇంటర్ వారధి ఉన్నత విద్యకు ఇంటర్ ‘వారధి’లాంటిది. అందుకే ఇంటర్లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపు మీదే మిగిలిన(ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో విద్యార్థులు ముందే ఒక నిర్థారణకు రావాలి. ఇంటర్లో ఉండే గ్రూపుల గురించి విద్యార్థికి అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం పొందాలి. అంతకంటే ముందు ఆయా గ్రూపుల్లోని సబ్జెక్ట్లపై తన బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని గ్రూపులను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి. పోటీ పరీక్షలకు కొత్తరూపు కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షలను నిర్వహించేలా ప్రయత్నం నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలపై విద్యార్థి అవగాహన పెంచుకోవాలి. మెడికల్కు నీట్, ఇంజనీరింగ్లో ప్రవేశాలకు ఐసీట్ లను నిర్వహిస్తున్నందున, రూపు మారుతున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంచుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. 85 గ్రూపు కాంబినేషన్స్ ఇంటర్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సైకాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్, మ్యూజిక్, కామర్స్, సోషియాలజీ వంటి సబ్జెక్ట్లు కొన్ని గ్రూపుల్లో కాంబినేషన్గా ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్ ప్రధానంగా ఇంజనీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ఈ గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్తోపాటు ఐఐటీల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ–మెయిన్ రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. బిట్స్ పిలానీలో ప్రవేశానికి జరిగే బిట్శాట్ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఎస్సీ ఇంటర్ తర్వాత బీఎస్సీలో చేరేటప్పుడు మ్యాథ్స్ –ఫిజిక్స్–కెమిస్ట్రీ కాంబినేషన్స్లో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన గ్రూపుల్లో చేరవచ్చు. బైపీసీ గ్రూపు వైద్య సంబంధిత, ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చర్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూపు విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టీకల్చర్ తదితర రంగాల్లో ఈ గ్రూపు విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఎంఈసీ, సీఈసీ గ్రూపులు సేవారంగంవైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ, సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ ఎనాలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు, బీమా సంస్థల్లో, స్టాక్ మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు. ∙గణితం, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం వల్ల మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాలోŠల్ ఉన్నత విద్యకు అవకాశం ఉంది. ఇటీవల ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుంది. ఆర్ట్స్ గ్రూపులు పోటీ పరీక్షలకు దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. కానీ ఐటీ రంగానికి కష్టకాలం రావడం, ఇంజనీరింగ్ చేసినవారిలో నిరుద్యోగత ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు సైతం యూపీఎస్సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తున్నాయి. దీంతో ఆర్ట్స్ గ్రూపులకు ఆదరణ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్లో రాణించేందుకు కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరుతున్నారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్(సోషల్, కల్చ రల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. -
ఇంటర్ లేక ఇబ్బందులు
మన్ననూర్ : ఇంటర్ చదివేందుకు కళాశాల లేక నల్లమల్ల లోతట్టు చెంచు విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మన్ననూర్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. చెంచుల పిల్లలు పదో తరగతి వరకు చదివి ఉన్నత చదువులకు దూరమవుతున్నారని నాలుగేళ్ల క్రితం పీటీజీ పాఠశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఎక్సలెన్స్ పేరుతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎక్సలెన్స్ విధి విధానాలకు అనుకూలమైన వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంతో గత నెలలో ఈ కళాశాలను హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్కు తరలించారు. దీంతో ప్రస్తుతం కళాశాల భవనం ఖాళీగా చూసే వాళ్లను ఎక్కిరిస్తున్నట్లు ఉంది. ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదిలా ఉండగా పీటీజీ పాఠశాలలో ప్రత్యేకించి చెంచు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నత చదువుల కోసం చెంచు విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లడం కలగానే మిగులుతుందంటున్నారు. సంభందిత అధికారులు స్పందించి కనీసం ఇంటర్ విద్య వరకు చెంచు విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లలేం పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థాయి సౌకర్యాలు లేవు. ఇక్కడే అందుబాటులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. అధికారులు మా జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలి. – మల్లేష్, పీటీజీ విద్యార్థి, మన్ననూర్ పట్టణ ప్రాంతాలకు వెళ్లలేరు నిర్బంధంగా పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న చెంచు విద్యార్థులు ఇంటర్ విద్యను ఒక్కసారిగా పట్టణ ప్రాంతాల్లో ఉండి చదువడం కొంచెం కష్టమే. ఇక్కడి పీటీజీ పాఠశాల అప్గ్రేడ్ చేసి ఇంటర్ విద్యను అందిస్తే వయస్సుతో పాటూ ఆలోచన విధానాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. – రాజారాం, ప్రిన్సిపాల్, పీటీజీ పాఠశాల, మన్ననూర్ -
ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు రీషెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థులు జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఇంటర్ ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని వీరికి ముందుగా నిర్ణయించిన సంక్రాంతి సెలవులను కూడా మార్పు చేసింది. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు మార్పు చేసింది. ఇప్పుడు ఈనెల 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 26న గణతంత్ర దినోత్సవం, 27న ఎథిక్స్ పరీక్ష, 28న ఆదివారం, 29న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉన్నందున ఆయా రోజుల్లో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటర్మీడియెట్లో 8పాయింట్ల గ్రేడింగ్
-
8పాయింట్ల గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2019లో రెండో సంవత్సర విద్యార్థులకు ఈ విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మార్కుల విధానం వల్ల తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఆ అంచనాలను అందుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కుల విధానానికి స్వస్తిపలికి కేవలం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్ బోర్డు, తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులతో ఏర్పాటైన సలహా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్లో గ్రేడింగ్ విధానం ఉన్నా ఏ గ్రేడ్లో ఎంత మంది ఉత్తీర్ణులవుతున్నారనే వివరాలను మాత్రమే బోర్డు ఇస్తోంది. విద్యార్థుల మెమోల్లో గ్రేడ్లను ఇవ్వడం లేదు. కానీ ఇకపై మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. పదో తరగతి తరహాలోనే.... రాష్ట్రంలో పదో తరగతి తరహాలోనే ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని బోర్డు అమల్లోకి తేనుంది. ఎనిమిది పాయింట్లుగా తీసుకురానున్న ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకు మార్కుల పరిధిని బట్టి గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్, అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్ పాయింట్లనుబట్టి గ్రేడ్ పాయింట్ల యావరేజ్ ఇస్తారు. అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల యావరేజ్నుబట్టి ఓవరాల్ గ్రేడ్ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం జీరో గ్రేడ్ పాయింట్తో ఈ గ్రేడ్ ఇస్తారు. ఎంసెట్లో వెయిటేజీపై 3 ప్రతిపాదనలు... గ్రేడింగ్ విధానం అమలు నేపథ్యంలో ఇంటర్ మార్కులకు ఉన్న వెయిటేజీ విషయంలో బోర్డు ప్రభుత్వానికి పంపేందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో తొలి ప్రతిపాదన ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించి ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. ఇక రెండోది మార్కులకు బదులు సబ్జెక్టులవారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లనుబట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వడం. ఇక మూడోది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా బోర్డు వద్ద మార్కులు ఉంటాయి కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కులను బోర్డు ఎంసెట్ కన్వీనర్కు అందజేస్తే ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేయడం. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో వెయిటేజీ రద్దుపైనే బోర్డు దృష్టిసారిçంచినట్లు తెలిసింది. ఎందుకంటే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసినా, ఇంటర్ మార్కుల కోసం లేదా జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నా మార్కులు వారికి తెలిసేటప్పటికి ప్రవేశాలు పూర్తవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం..
-
ఇంటర్లోనూ గ్రేడింగ్
సాక్షి, అమరావతి: పదో తరగతి మాదిరిగానే ఇంటర్లోనూ ర్యాంకుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిం చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యం లో సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా, డీజీపీ సాంబశివరావు తది తరులు.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి గంటా మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ర్యాంకుల విధానాన్ని ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ విషయాన్ని ఎంసెట్ నిర్వాహకులు చూసుకుంటారని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను రోజుకు పద్దెనిమిది న్నర గంటల పాటు చదివిస్తున్నారని, దీంతో ఒత్తిడికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింద న్నారు. కాలేజీల యాజమాన్యాలు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే కఠిన చర్య లు తప్పవన్నారు. ఇకపై విద్యార్థులకు విధిగా ఆదివారం సెలవు ఇవ్వాల్సిందే నని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల బలవన్మర ణాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్టు గంటా తెలిపారు. ఈ కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తుందని, దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు కాలేజీల హాస్టళ్లు 150కి పైగా ఉన్నాయని.. మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే వాటిని రద్దు చేస్తామన్నారు. ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా ఒక మానసిక వైద్యుడిని నియమించుకొని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని 2012 నుంచి ఇప్పటి వరకూ 35 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీరిలో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని గంటా వెల్లడించారు. -
ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐఓ సురేష్ను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచర్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షకు 585 మంది విద్యార్థులకు గాను 438 మంది హాజరయ్యారు. పదో తరగతి పరీక్షకు సంబంధించి ఐదుగురుకు గాను గాను ముగ్గురు హాజరైనట్లు వివరించారు. -
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
రూ. 20 లక్షల బంగారు, వెండి వస్తువుల స్వాధీనం కాకినాడ క్రైం : వారు ముగ్గురూ అంతర్ రాష్ట్ర నేరస్తులు.. రాష్ట్రంలో పలు పోలీస్స్టేషన్లలో పోలీసు కేసులున్నాయి.. పగటిపూట సింగిల్గా ఉంటున్న ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించడం, రాత్రిపూట ఇంట్లో పడి దోచుకోవడం... జైలుకెళ్లడం... బెయిల్పై వచ్చి చోరీలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ముగ్గురు అంతర రాష్ట్ర నేరస్తులను ఎట్టకేలకు కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నేరస్తుల వివరాలను వెల్లడించారు. జిల్లాలో కాజులూరు బ్రాహ్మణ వీధికి చెందిన ముప్పయ్ సంవత్సరాల షేక్ అజీజ్ (నాని), పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, కొండగూడెంకు చెందిన ఇరవై ఆరేళ్ల అంతర్ రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్, రాజమహేంద్రవరం మల్లిఖార్జునగర్కు చెందిన నలభై అయిదేళ్ల షేక్ బాషి (బాషా)లతో కలసి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 ఇళ్లల్లో రాత్రి పూట చోరీలకు పాల్పడ్డారు. ఇందులో షేక్ అజీజ్పై గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, పెదపూడి, రాయవరం, అనపర్తి, అన్నవరం, రామచంద్రపురం, ద్రాక్షరామ, అంబాజీపేట, విజయవాడ, భీమడోలు, తణుకు, ఏలూరు జరిగిన 50 చోరీ కేసులలో అరెస్ట్ శిక్ష అనుభవించాడు. చీకట్ల సతీష్ హైదరాబాద్, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, కూచిపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, వైజాగ్, విజయనగరం లో సుమారు 40 కేసుల్లో అరెస్టయి 2016 డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. షేక్ అజీజ్ మార్చి నెలలో జైలులో ఉన్న నేరస్తుడు చీకట్ల సతీష్ని బెయిల్పై తీసుకొచ్చి మరో నేరస్తుడు షేక్ బాషితో కలసి రావులపాలెం, నిడదవోలు,2015 జనవరిలో సర్పవరం కాకినాడ పబ్లిక్ స్కూలు, 2016లో అశోక్నగర్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. చీకట్ల సతీష్ కాకినాడ టూటౌన్ పరిధిలోని రెండు మోటార్ సైకిళ్లు, పశ్చిమగోదావరి జిల్లాలో లక్కవరం, ద్వారకా తిరుమల, నర్సాపురం, సమిశ్రగూడెంలో ఏడు ఇళ్లలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వీరి ముగ్గురిలో షేక్ అజీజ్పై 12 కేసులు, చీకట్ల సతీష్పై 12 , షేక్ బాషిపై 3 కేసులలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నేరస్తులు కాజులూరులో షేక్ అజీజ్ ఇంటిలో ఉన్నట్టు సమాచారం రావడంతో సోమవారం కాకినాడ క్రైం డీఎస్పీ ఏ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు కేవీవీ రామారావు, జి.హరీష్కుమార్ల ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేశారు. 500 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, 9.323 కిలోల వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిల్స్, ఒక ఎల్ఈడీ టీవీని నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడటం, గంజాయి అక్రమ రవాణా, మిలీషియా çకమాండర్ అరెస్ట్, దొంగతనాల రికవరీలలో సిబ్బంది మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. క్రైం డీఎస్పీ పల్లపురాజు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్లో ‘అనంత’ ఆఖరు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తొలిసంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం దక్కించుకుంది. మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 24,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,166 మంది 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,633 బాలురకు గానూ 8,293 మంది 66 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 11,987 మంది బాలికలకు గానూ 8873 మంది 74 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి 8986 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4180 మంది 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 5366 మంది బాలురకు గానూ 2413 మంది 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 3620 మంది బాలికలను గానూ 1767 మంది 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
‘గురుకుల’ కౌన్సెలింగ్ గందరగోళం
– కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని అధికారులు – ఇబ్బందులు పడిన విద్యార్థులు డోన్ టౌన్: గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి డోన్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లావ్యాప్తంగా గురుకుల 880 సీట్లు ఉండగా.. 2,300 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. పట్టణానికి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఒక క్రమపద్ధతి పాటించకపోవడంతో, ఒకే సారి కేంద్రంలోకి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అనుమతించడంతో తోపులాట జరిగింది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్.. పోలీసులు వచ్చిన తరువాత 12 గంటలకు ప్రారంభమైంది. కనీస సౌకర్యాలేవీ..? పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరవుతారని అధికారులకు తెలిసినా..ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. పట్టణం నుంచి పాఠశాలకు ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. ఇదిలా ఉండగా.. కౌన్సెలింగ్ నిర్వాహణను జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ప్రిన్సిపాల్ ఉమాకుమారిని ఆదేశించారు. సౌకర్యాలు లేకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తితో ఎస్ఎఫ్ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివన్న తదితరులు వాగ్వాదానికి దిగారు. -
26న గురుకుల కళాశాల కౌన్సెలింగ్
అనంతపురం రూరల్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ ప్రవేశానికి ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న బాలురకు కాళసముద్రం, 27న కురుగుంట కళాశాలలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ వచ్చే విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఫిజికల్ పిట్నెస్ ధ్రువపత్రంతో పాటు 4పాస్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. -
ఇంటర్కు ఆధార్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ నంబరు తప్పనిసరని ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి విద్యార్థి ఆధార్ కార్డును సమకూర్చుకోవాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, అన్ని మేనేజ్మెంట్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్లో చేరాలనుకునే విద్యార్థులు 201718 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆధార్ను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శని వారం ముగిశాయి. చివరిరోజు కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలు నిర్వహి ంచారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,618 మంది విద్యార్థులకుగాను 16,808 మంది హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 16,846 మందికి గాను 16,186 మంది హాజరయ్యారు. 660 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 772 మందికి గాను 622 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి 3,113 మంది విద్యార్థులకుగాను 2,930 మంది హాజరయ్యారు. 183 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 2687 మందికి గాను 2554 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 426 మందికి గాను 376 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరయ్యారు. -
చౌతాలా (82) ఇంటర్ పాసయ్యారు!
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా(82) హయ్యర్ సెకండరీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టీచర్ల నియామక కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో పదేళ్ల శిక్షఅనుభవిస్తున్నారు. తీహార్లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా హయ్యర్ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా చెప్పారు. ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
– జిల్లాలో 80 పరీక్ష కేంద్రాల ఏర్పాటు - సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 23వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 29,272 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 9549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఇప్పటీకే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. 11 కేంద్రాలకు సకాలంలో బస్సుల సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో కరెంట్ కట్ కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఒకరు, డిపార్ట్మెంటల్ అధికారి ఒకరు ఉంటారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇన్విజిలేటర్లను ఆ కేంద్ర పర్యవేక్షకులు నియమించుకుంటారు. -
ఇంటర్ ప్రవేశానికి 15న తుది గడువు
అనంతపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.apswreis.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితాను జత చేసి దగ్గరలోని గురుకుల కళాశాలలో ఈనెల 15లోపు అందజేయాలన్నారు. -
రేపు జాబ్మేళా
– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి కర్నూలు (ఓల్డ్సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు. -
8న జాబ్ మేళా
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో చదివి 2014లోపు పాస్ అయిన విద్యార్థు«లకు ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి టి.వి సుబ్రమణ్యేశ్వరరావు సోమవానం ప్రకటనలో తెలిపారు. స్థానిక బిక్యాంపులోని ఒకేషనల్ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఒకేషనల్ కోర్సులు చేసిన నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
వసతి..కిరికిరి
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ - ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఇష్టారాజ్యం - 16 కాలేజీలకు అనుమతులు లేవని నివేదిక - వీటిలో టీడీపీ నాయకుల అనుచరుల కాలేజీలు - త్వరలో షోకాజ్ నోటీస్లు జారీ చేస్తామన్న ఇంటర్ బోర్డు అధికారులు కర్నూలు సిటీ: జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధలు పాటించకుండా ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేట్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసుల విచారణ జరపగా..ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల బలవన్మరణాలకు ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో సరైన సదుపాయలు లేకపోవడమే కారణమని తేలింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, భద్రత కోసం సరైన సిబ్బందిని నియమించక పోవడమూ కారణమని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా నిర్వహిస్తున్న కాలేజీలు 16 ఉన్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు నివేదిక పంపారు. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి...! జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిలో జిల్లాలో నంద్యాలోని రాపూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్తో కూడిన అనుమతి ఉంది. మిగతా వాటికి ఒక్కదానికి అనుమతి లేదు. హాస్టళ్లతో కలిపి కాలేజీలను నిర్వహిస్తున్నవి సుమారు 30 శాతం ఉంటాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు కేవలం 16 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను బోర్డుకు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై తనిఖీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ముందే గుర్తించిన కాలేజీలకు నోటీస్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నాయకుల అనుచరులకు చెందిన విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ కాలేజీలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తనిఖీలు చేయని బోర్డు అధికారులు...! జిల్లాలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇస్తున్న అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రతి కాలేజీని తనిఖీ చేసిన నివేదికను ఇంటర్ బోర్డుకు అందజేయాలి. అయితే అధికారులు ప్రైవేట్ కాలేజీలను తనిఖీ చేయడంలేదు. కాలేజీల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి – వై.పరమేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల్లో కేవలం నంద్యాలలోని రావూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్ అనుమతి ఉంది. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డుకు అందజేశాం. వీరిపై చర్యలు తీసుకునే అంశం కమిషనర్ పరిధిలో పరిశీలనలో ఉంది. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
దేవనకొండ: మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో బుధవారం.. ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన దేవనకొండ మండలం డీ కోటకొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ స్వామిల కుమార్తె సునిత(17) కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్ సీఈసీ గ్రూపు చదివింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మార్కులు తక్కువచ్చాయని కుంగి పోయింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
– మార్కులు తక్కువొచ్చాయని ఒకరు – ఫెయిల్ అయ్యానని మరొకరు – ఇరువురి పరిస్థితి సీరియస్ – కర్నూలుకు తరలింపు ఇంటర్ ఫలితాలు ఇద్దరు విద్యార్థుల మనస్సులను గాయపరిచాయి. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాలు జీర్ణించుకోలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. కోవెలకుంట్ల: మండల పరిధిలోని గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గంగన్న, సుదర్శనమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. గంగన్న ఉయ్యాలవాడ మండలంలో వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. కూతురు అల్లూరు సుమలత నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి 108 అంబులెన్స్లో కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించారు. 70శాతం శరీరభాగాలు కాలిపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కులు తక్కువ వచ్చాయని.. మండలంలోని గుంజలపాడు గ్రామానికి చెందిన రాజారెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కుమారుడు సతీష్రెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతున్నాడు. ఫలితాలు విడుదల కానుండటంతో తండ్రితోపాటు కోవెలకుంట్లకు వచ్చాడు. ఇంటర్ ఫలితాల్లో 420 మార్కులు రావడంతో తన స్నేహితుడికంటే మార్కులు తక్కువ వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. తాను తర్వాత వస్తానని తండ్రిని ఆటో ఎక్కించి పంపాడు. క్రిమి సంహారక గుళికలు మింగి బైక్పై ఇంటికి చేరుకుని వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. -
అమ్మాయిలు అదుర్స్!
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల - మొదటి సంవత్సరంలో 59 శాతం - రెండో సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణత - ఉత్తీర్ణత శాతాల్లో స్వల్పతేడాలు - వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మిడుతూరు ప్రభుత్వ కళాశాల కర్నూలు(సిటీ): ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు గురువారం విజయవాడలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. రెండు ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో పదో స్థానం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఏడో స్థానంలో జిల్లా నిలిచింది. గత ఏడాది కంటే మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. గత ఏడాది ఫస్ట్ ఇయర్ 64 శాతం ఉత్తీర్ణత కాగా ఈ ఏడాది 59 శాతానికి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది 71 శాతం కాగా ఈ ఏడాది కాస్త పెరిగి 75 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జిల్లాలో మొత్తం 76,807 మంది మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 36,398 మంది పరీక్షకు హాజరు కాగా.. 21,307 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 19,448 మందికి గాను 10,128 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 16,950 మంది పరీక్షకు హాజరు కాగా 11,179 మంది (66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 30,694 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,164 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,081 మందికి గాను 11,357 మంది (71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 14,613 మందికి గాను 11,807 మంది (81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఫలితాల్లో జిల్లా గత ఏడాది 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 10వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గత ఏడాది 8వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల్లో 42.94 శాతం ఉత్తీర్ణత... జిల్లాలో మొత్తం 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం 6,838 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,936 మంది (42.94 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53 శాతం ఫలితాలు రాగా, ఈ ఏడాది 42.94 శాతానికి తగ్గింది. ఈ ఫలితాల్లో దేవనకొండ మండలం జిల్లాలో అత్యధిక శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88.89 శాతం, ఆస్పరి ప్రభుత్వ జూనియర్ కళాశాల 88.18 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. అతి తక్కువ ఉత్తీర్ణత శాతం కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 230 మంది విద్యార్థులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా గూడూరు జూనియర్ కళాశాలలో 230కి గాను 29 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,418 మంది విద్యార్థులకు గాను 3,844 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా స్వల్పంగా పెరిగి 70.95 శాతానికి చేరుకున్నాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మిడుతూరు గుర్తింపు పొందింది. 44.91 శాతంతో అతి తక్కువ ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన కళాశాలగా గూడూరు నిలిచింది. ఎయిడెడ్ కళాశాలలు... జిల్లాలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సర విద్యార్థులు 1,766 మంది పరీక్షలకు హాజరు కాగా 627 మంది (37.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,332 మంది విద్యార్థులకు 831 మంది (62.37 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల, బేతంచెర్ల అత్యధిక ఫలితాలు సాధించగా బాలశివ జూనియర్ కళాశాల అతితక్కువ ఫలితాలు సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కళాశాలలు... జిల్లాలోని ఒకేషనల్ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 1,242 మంది పరీక్షలకు హాజరు కాగా 734 మంది (59.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,132 మందికి గాను 930 మంది (82.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
రేపు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు
అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్వే హొటల్లో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 10,31,285 మంది రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాదికన్నా ఈసారి పరీక్ష ఫలితాలను వారం రోజులు ముందుగా విడుదల చేస్తుండడం విశేషం. పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్ జనరల్ ఫలితాలకు 54242కు ఐపీఈ1 స్పేస్ హాల్టిక్కెట్ నెంబర్ పంపాలి. సెకండియర్ జనరల్ ఫలితాలకు ఇదే నెంబర్కు ఐపీఈ2 స్పేస్ ఇచ్చి హాల్టిక్కెట్ నెంబర్ పంపించాలి. 5676750 నెంబర్కు ఎస్సెమ్మెస్ పంపి సమాచారం తెలుసుకోవచ్చని బోర్డు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 17న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెల 27న విడుదల చేయాలని భావించినా జేఈఈ ఫలితాలను విడుదల చేస్తుండడంతో ఇంటర్ ఫలితాలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తికానున్నది. 17న ఫలితాలను విడుదల చేస్తామని, సాంకేతిక సమస్యలు తలెత్తితే 18న ప్రకటిస్తామని బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
– మార్కులు తక్కువ వస్తాయని భయపడి ఆత్మహత్య ఎమ్మిగనూరు రూరల్: మార్కులు తక్కువ వస్తాయని భయపడి గుడేకల్ గ్రామానికి చెందిన ఇంటర్ మీడియట్ విద్యార్థిని..బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన కొండయ్య, శాంతమ్మలకు కుమార్తె కె.ఇందిరమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో రెండో సంవత్సరం బైపీసీ చదువుతుంది. నాగలదిన్నె నుంచి రోజు బస్సుకు రావటం ఎందుకని మండల పరిధిలోని గుడేకల్లో తన తాత గోవిందప్ప దగ్గర ఉంటోంది. రెండు రోజుల కిత్రం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్్ట ఫెయిల్ అయ్యానని, రెండో సంవత్సరం పరీక్షలు సరిగా రాయలేదని ..మార్కులు తక్కువ వస్తాయని మదన పడేది. బుధవారం ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చీరతో ఉరివేసుకుంది. విగతజీవిగా మారిన మనవరాలిని చూసి అవ్వాతాతలు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
– చివరి రోజు 601 మంది గైర్హాజరు కర్నూలు సిటీ : ఈనెల ఒకటిన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఆదివారంతో ముగిసాయి. దీంతో విద్యార్థులతోపాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల 13 నాటికి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల కారణంగా ఈ నెల9న జరగాల్సిన పరీక్ష 19కి వాయిదా పడింది. చివరి పరీక్ష రోజున 26962 మంది విద్యార్థులకుగాను, 26361 మంది హాజరయ్యారు. మొత్తం 601 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిన నలుగురు విద్యార్థులను మాస్ కాపీయింగ్ కింద బుక్ చేశారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం సెషన్కు సెలవు ఇచ్చారు. ఇదిలా ఉండగా పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థులు ఒకరికొకరు బాయ్ చొప్పుకోవడం కనిపించింది. పెట్టెబేడా సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరివెళ్లారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
– ఎలాంటి పొరబాట్లకు తావివ్వొద్దు – విద్యార్థులకు నష్టం కల్గితే చర్యలు తప్పవు – ఆర్ఐఓ వెంకటేశులు – కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైంది. తొలిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలవుతుండడంతో రిజిస్ట్రేషన్లకు చాలా సమయం పడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియే సాగింది. ఒక్కొక్కరికి 15 పేపర్లు ఇచ్చారు. తొలివిడతగా మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం, హిందీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయనున్నారు. ముందుగా ఎగ్జామినర్లు, సీఈలతో ఆర్ఐఓ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఏస్థాయి ఉద్యోగి అలసత్వం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీసీ కెమరాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర అధికారులు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారన్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో అందరూ వేళకు చేరుకోవాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన బోర్డు అధికారులు తమను మూల్యాంకనం విధులకు నియమిస్తే ఇక్కడి అధికారులు తీసుకోవడం లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను విధులకు నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయని, వాటిని రద్దుచేసి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలంటూ రాష్ట్ర అధికారులు ఆదేశించారని ఆర్ఐఓ, డీవీఈఓ తెలిపారు. ఇందుకు కాంట్రాక్ట్ అధ్యాపకులు ససేమిరా అన్నారు. దీంతో కాస్త సమయం ఇవ్వాలని కోరగా వారు ఆందోళన విరమించారు. ఇంతలోనే నియామక ఉత్తర్వులు వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. -
విద్యార్థిని అదృశ్యం
కర్నూలు: కర్నూలు నగరం టౌన్మోడల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుచరిత (17) రెండు రోజులుగా కనిపించడం లేదు. కల్లూరు ఎస్టేట్లోని భగవాన్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా. పెద్ద కూతురు సుచరిత టౌన్మోడల్ కళాశాలలో చదువుతోంది. గురువారం రాత్రి 8గంటల సమయంలో దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి బయటికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో ఆమె కోసం నగరమంతా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఛామన చాయ ఉండి, 5అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లే టపుడు పంజాబీ డ్రస్సు ధరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు తెలిపారు. -
ఇంటర్ పరీక్షల్లో నలుగురు డిబార్
డోన్ టౌన్ : ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం పరిక్షల్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను సిట్టింగ్ స్క్వాడ్ సోమవారం డిబార్ చేసింది. డోన్ మోడల్ స్కూల్ కేంద్రంగా నిర్వహిస్తున్న పరీక్షలను సోమవారం జిల్లా సిట్టింగ్ స్క్వాడ్ నాగస్వామి నాయక్, డిపార్ట్మెంటల్ అధికారి నాగయ్య, ప్రిన్సిపాల్ నాగరవీందర్ తనిఖీలు చేశారు. మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న నవోదయ, వెంకటేశ్వర, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన నలుగురిని గుర్తించి డిబార్ చేశారు. -
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 33, 563 మంది విద్యార్థులకుగాను 32,824 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 739 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైట్లు ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. వాస్తవానికి జిల్లాలో పరీక్షకు హాజరుకావాల్సింది 37,912 మంది అని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరీక్ష జరిగిన రోజున మాత్రం ఆదే అధికారులు 33,563 మంది మాత్రమే పరీక్షకు అర్హులని చెబుతున్నారు. రికార్డు పరంగా ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 4,349 మంది విద్యార్థులు తక్కువ చూపుతున్నారెందుకని ఆర్ఐఓను అడిగితే మిగతా వారు ఫీజులు కట్టని వారు, హాజరు శాతం తక్కువగా ఉన్న వారు ఉంటారని చెబుతున్నారు. -
’సర్వీస్’ దోపిడీ
– ఇంటర్ కాలేజీల నయా దందా – విద్యాపన్ను అంటూ రూ.1200 వసూలు – రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బుకాయింపు – పరీక్షకు ముందు వసూళ్ల పర్వం సాక్షి, రాజమహేంద్రవరం : ఇంటర్ పరీక్షలకు ముందు కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాయి. హాజరు శాతం తగ్గిందన్న పేరుతో పరీక్షకు ఒక్కరోజు ముందు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,000 వరకు వసూలు చేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంతా కట్టకపోతే హాల్టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తున్నారు. హాజరు దోపిడీ ఇలా సాగిస్తున్న కార్పొరేట్ కాలేజీలు ‘విద్యాపన్ను’ పేరిట వసూలు చేస్తున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వీస్ టాక్స్ అంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. అదీ హాల్టిక్కెట్లు ఇచ్చే ముందు ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఇదేమిటీ అని అడిగిన వారికి సర్వీస్ టాక్స్ అంటూ కాలేజీ సిబ్బంది సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపన్ను పేరిట రూ.1200 చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కాలేజీ సిబ్బందికి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని కొన్ని కార్పొరేటర్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి సర్వీస్ టాక్స్ పేరిట రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్టిక్కెట్లు ఇచ్చే ముందు కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. పరీక్షలకు ముందు డబ్బుల కోసం పిల్లలను ఇలా వేధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరు కావాల్సిన తన కుమార్తెకు హాల్టిక్కెట్టు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందని, చివరికి రూ.1200 కడితేనే గాని హాల్టిక్కెట్టు ఇవ్వలేదని రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థిని తండ్రి దివ్యాంగుడైన ఎ.తారకేశ్వరరావు వాపోయారు. ఎలాంటి పన్నూ లేదు... విద్యాపన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అలా ఎవరైనా వసూలు చేస్తున్నట్టయితే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే టీసీ ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పాం. హాల్టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ విధంగా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశాం. – ఎ.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం. -
ఇలా మొదలయ్యాయి
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం ఫస్టియర్ పరీక్షలకు 36,108 మంది హాజరు 1,845 మంది గైర్హాజరు ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ఉత్సాహంగా కేంద్రాలకు పయనమయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 8గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థుల వెంట రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్1 పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 37,953 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 1,845 మంది గైర్హాజరయ్యారు. 36,108 మంది పరీక్షలు రాశారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ ఖాదర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ను నియమించి ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టేలా చూస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కాపీ కొడితే నాలుగేళ్లు డిబార్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే నాలుగేళ్లపాటు పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలంటూ ఆదేశాలు అందాయని ఆర్ఐవో తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
– 96.96 శాతం హాజరు – గైర్హాజరైన వారిలో సైన్స్ విద్యార్థులే అధికం కర్నూలు సిటీ: బుధవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే సమయంపై ముందు నుంచే అధికారులు ప్రచారం కల్పించ పోవడంతో అక్కడక్కడ కొంత ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా మరి కొన్న చోట్ల పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన వారికి అనుమతించక పోవడంతో విద్యార్థులు కన్నీళ్ళు పెట్టుకుంటు వెనుదిరిగారు. 1213 మంది విద్యార్థులు గైర్హాజరు : జిల్లాలో ఉన్న 218 జూనియర్ కాలేజీలకు చెందిన మొత్తం 39963 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 38750 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 1213 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయినట్లు ఆర్ఐఓ తెలిపారు. మొదటి రోజు జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టిస్ కానీ, కాపీయింగ్ జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. హాజరుకానివారిలో సైన్స్ విద్యార్థులే అధికం: నిర్ణీత హాజరు శాతం లేని సైన్స్ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వక పోవడంతో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ విద్యార్థులకయితే నిర్ణీత రుసం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు. అయితే మంగళవారం బ్యాంకు అధికారుల ధర్నా వల్ల బ్యాంకులు తెరుచుకోలేదు. ఈ కారణంతో మరి కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందలేకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై ముందు నుంచే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చిరించినా బోర్డు అధికారులు సరైన రీతిలో స్పందించక పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని తెలుస్తోంది. నిర్ణీత సమయానికి కేంద్రాలకు...! ఇంటర్ బోర్డు అధికారులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన మేరకు కేంద్రాలకు చేరుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి చేరుకోలేక పోయారని వెనిక్కి పంపించారు. ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డి నగరంలోని వాసవి, కోల్స్, అమరావతి జూనియర్ కాలేజీలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ... నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ సునీతను అడిగి తెలుసుకున్నారు. -
ఇంటర్ విద్యార్థి దుర్మరణం
కోసిగి: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. డి.బెళగల్ గ్రామానికి చెందిన కిష్టప్ప, తాయమ్మఽ దంపతుల కుమారుడు రాజు(17) కోసిగి జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో కళాశాలకు బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో ఆటో పట్టణంలోకి చేరుకుటుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటోడ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి రాజుతో పాటు మరో విద్యార్థి రామాంజినేయులు, ప్రయాణికులు మూకయ్యశెట్టి, గర్భిణి మహాలక్ష్మి, డ్రైవర్ వీరేష్, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది. రాజు తండ్రి కిష్టప్ప నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి తాయమ్మ వికలాంగురాలు. ఒక చెల్లెలు ఉంది. సెలవుల్లో రాజు వ్యవసాయ పనులు చేస్తూ చదువులోనూ రాణించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.ఽ సమాచారం అందుకున్న కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని సంతాపం ప్రకటించారు. విద్యార్థి మృతితో కళాశాలకు, పాఠశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సెలవు ప్రకటించారు. ఎస్ఐ ఇంతియాజ్ బాషా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
– నేటి నుంచి ప్రారంభం కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి ఇంటర్ప్రాక్టికల్స్
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ పరీక్షలకు సర్వసిద్ధం చేసిన జిల్లా ఇంటర్బోర్డు అధికారులు జిల్లాలో హాజరుకానున్న 33,594 మంది విద్యార్థులు ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ కంబాలచెరువు : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వసిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్బోర్డు అధికారులు సమయాత్తమయ్యారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 కళాశాలల్లో.. ఈనెల మూడోతేదీ నుంచి 22 వరకు ఈ పరీక్షలు జిల్లావ్యాప్తంగా మొత్తం 96 కళాశాలల్లో జరగనున్నాయి. వీటికి మొత్తం 33,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా వీటిని నిర్వహించనున్నారు. నాలుగు స్పెల్స్లో జరిగే ఈ పరీక్షలు ప్రథమ స్పెల్గా 43 కళాశాలలు, రెండో స్పెల్లో 48 కళాశాలలు, మూడో స్పెల్లో 51 కళాశాలలు, నాలుగో స్పెల్స్లో 43 కళాశాలల్లో జరగనున్నాయి. సైన్స్ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో, ఒకేషనల్ విద్యార్థులకు 19 రకాల సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లో జరిగే ప్రాక్టికల్స్కి 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అలాగే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టర్తో ఉండే హైపవర్ కమిటీలో అధికారిగా జిల్లా ఆర్ఐవోగా పనిచేసిన వెళ్లిన కేపీ దాశరథి వ్యహరించనున్నారు. వీరితో పాటు రెవెన్యూ స్క్వాడ్, పోలీస్శాఖ ఉంటుంది. ఆర్జేడీ ఎ.అన్నమ్మ, ఆర్ఐఓ ఎ.వెంకటేష్, డీవీఈవో కె.హెప్సీరాణి ఆధర్యంలో ఈనెల 24న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్, మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్శాఖ వి««ధులపై ఆ శాఖాధికారితో, ఆరోగ్య సమస్యలపై మెడికల్ అధికారులతో, పరీక్ష సమయంలో విద్యుత్ అవాంతరాలు రాకుండా విద్యుత్ అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రంలోకి విధులు నిర్వర్తించే డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సహా ఎవరూ సెల్ఫోన్ వాడరాదని ఉత్తర్వులు జారీచేశారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కర్నూలు(అర్బన్): కర్నూలు నగర శివారు నన్నూరులో సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రఫీక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డోన్ పట్టణం కొత్తపేటకు చెందిన లాల్బాషాæ కుమారుడైన రఫీక్ గత సంవత్సరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ కోర్సులో చదువుతూ మధ్యలో ఆపేశాడు. తిరిగి ఈ విద్యా సంవత్సరం నన్నూరులోని నారాయణ కళాశాలలో చేరి బైపీసీ గ్రూపు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రీఫైనల్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్థాపానికి లోనయ్యాడు. కళాశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మంగళవారం రాత్రి హెయిర్ డయ్యర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్లో గ్యాంబ్లింగ్
- జంబ్లింగ్లో ‘కార్పొరేట్’ మాయ - సెంటర్లను మార్చుకున్న కార్పొరేట్ కాలేజీలు? - ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం - వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి. కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...! కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు. విద్యార్థులే సమిధలు.. వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట. కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్ఐవో జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు. -
నేడు ‘నైతిక’ పరీక్ష
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు శనివారం ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నట్లు డీవీఈఓ టీవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డిలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతిక పరీక్ష, ఈ నెల31వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
పరీక్షా కాలం
ఇంటర్మీడియెట్లో ప్రాక్టికల్స్కూ జంబ్లిగ్ విధానం ఫిబ్రవరి 3నుంచి ప్రాక్టికల్స్ మార్చి 1నుంచి పబ్లిక్ పరీక్షలు ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తొలిసారిగా ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక.. పక్షం రోజుల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని సైన్స్ ల్యాబ్లను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ముందుగానే పరిశీలించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వేల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 21,925 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3నుంచి 22వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 29, ఎయిడెడ్ కాలేజీల్లో 11, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 21 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులు 4,662 మంది, ఎంపీసీ విద్యార్థులు 17,263 మంది కలిపి మొత్తం 21,925 మంది ప్రాక్టికల్స్కు హాజరు కావాల్సి ఉంది. పబ్లిక్ పరీక్షలకు 104 కేంద్రాలు : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీలు 29, ఎయిడెడ్ కళాశాలలు 14, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 3, ప్రైవేట్ విద్యాసంస్థలు 58 ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థుల్లో జనరల్ 33,499 మంది, ఒకేషనల్ విద్యార్థులు 4,011 మంది, సెకండ్ ఇంటర్లో జనరల్ విద్యార్థులు 32,211 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3,516 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లాలో 194 జూనియర్ కాలేజీలు, 60 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షలకు అంతా సిద్ధం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్ ల్యాబ్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు సైన్సు ల్యాబ్లను ముందుగానే పరిశీలించుకునే అవకాశం కల్పించాం. ఈనెల 19న కలెక్టరేట్లో ఇంటర్ విద్యామండలి కమిషనర్తో జరిగే వీడియో కాన్ఫరెన్స్కు జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్ విధిగా హాజరుకావాలి. ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : చదువులో వెనుకబడిన ఇంటర్ విద్యార్థి మెడిసిన్ సీటు వస్తుందో రాదోనన్న భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో నేవీలో పనిచేస్తున్న గోపాల్ కుమారుడు చక్రవర్తి (17) అనంతపురంలోని హౌసింగ్బోర్డులో ఉంటూ కార్పొరేట్ కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో పాసైన ఇతను రెండో సంవత్సరంలో కొంత వెనుకబడినట్లు కళాశాల నుంచి పలుమార్లు కుటుంబ సభ్యులకు ఫోన్ద్వారా సమాచారమందించారు. రెండో సంవత్సరంలో మార్కులు తక్కువ వస్తే మెడిసిన్లో సీటు వస్తుందో రాదో అని తల్లితో చెప్పి బాధపడేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చక్రవర్తి సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ రంగయాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
దివిలి (పెద్దాపురం) : ఆ మనస్సుకు ఏ కష్టమొచ్చిందో, ఏమో.. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దాపురం మండలం దివిలి బీఎస్ఆర్ కళాశాలలో మొల్లేరు మల్లవరానికి చెందిన టేకుమూడి సునీత(17) చంద్రమాంపల్లిలోని తన పిన్ని గుబ్బల లక్ష్మి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లవరానికి పంపించేశారు. బుధవారం సాయంత్రానికి ఈ విషయం బయటకు పొక్కడంతో ఎస్సై వై.సతీష్ చంద్రమాంపల్లిలోని మృతురాలి పిన్ని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కళాశాల యాజమాన్యం బుధవారం సెలవు ప్రకటించింది. -
మేల్కొంటున్నారు
ప్రయోగాలపై పట్టు సాధిస్తున్న విద్యార్థులు జంబ్లింగ్ విధానం ఖరారుతో ముమ్మర సాధన బాలాజీచెరువు(కాకినాడ) :ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగంపై పట్టు సాధించి మంచి మార్కులు కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉన్నది రెండు నెలలే.. ప్రయోగ పరీక్షలు 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇటీవల వరకు ఈ పరీక్షలు విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారో! అక్కడే జరిగేవి. ఈ విధానం వల్ల కొంత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిం చాయి. చాలా ప్రైవేట్ కళాశాల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా తూతూమంతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. పరీక్షల నిర్వహణకు వచ్చే వారిని ప్రసన్నం చేసుకుని ఎక్కువ మా ర్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు వేస్తున్నారనే అపవా దూ ఉంది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ విధానం ప్రకటిస్తూనే పరీక్షలు దగ్గరికి వచ్చే సరికి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ముందుగానే కొత్త విధానంలో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో అన్ని కళాశాలలు ఈ ప్రాక్టికల్స్పై దృష్టిసారించాయి. ఏంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయనశాస్రా్తలు, బైపీసీ విద్యార్థులు రసాయన, భౌతిక శాస్రా్తలతో పాటు వృక్ష, జంతు శాస్రా్తల ప్రయోగాలపై పట్టు సాధిస్తున్నారు. సమయం రెండు నెలలే ఉండడంతో విద్యార్థులు రికార్డులు, రసాయనాల విశ్లేషణ, కణజాలల గుర్తింపు, స్లైడ్ చూడటం, బొమ్మల తర్ఫీదు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అ«లాగే అధ్యాపకులు విద్యార్థులను జంబ్లింగ్ విధానానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. జంబ్లింగ్ ప్రాక్టికల్స్కు ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ల్యాబ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించాం. – ఎం.వేంకటేష్, ఇంటర్మీడియట్ కళాశాలల తనిఖీ అధికారి, రాజమండ్రి -
ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1తేదీ వరకు అపరాద రుసుము లేకుండా అవకాశం ఉందని ఇంటర్ విద్యమండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ «ఖాదర్ మంగళవారం తెలిపారు. రూ.120ల అపరాధ రుసుముతో నవంబర్ 10తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500ల అపరాధ రుసుముతో 17తేదీ వరకు, రూ.వెయ్యి అపరాద రుసుముతో 28తేదీ వరకు, రూ.2వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 21తేదీ వరకు, రూ.3వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 31తేదీ వరకు, రూ.5వేలు అపరాధ రుసుముతో 2017 జనవరి 18తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు -
హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతిగృహంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జాస్మిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినులు 9, 10, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారై ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం నుంచి అందజేస్తామని , పూర్తి చేసిన వాటిని 26వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్ఎన్వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్ఎన్వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
మనోవ్యాధితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం రూరల్ : మనోవ్యాధితో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపాల్నగర్కు చెందిన నాదెండ్ల మనోజ్సాయికుమార్ (18) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతోపాటు నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఎంతకీ రాలేదు. మంగళవారం ఉదయం పంపుల చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అతని తల్లిదండ్రులు తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి మంగ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ విధానంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని డీఈవో డి.మధుసూదనరావు, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ టీటీఎఫ్ రూజ్వెల్ట్ మంగళవారం తెలిపారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8 వరకు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, తణుకు పట్టణాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏలూరులో ఒక పరీక్షా కేంద్రం, తణుకులో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
‘త్రీ ఇన్ ఒన్’
– ప్రిన్సిపల్, డీవీఈఓ, ఆర్జేడీ విధులు ఒక్కరికే – గాడితప్పుతున్న పరిపాలన అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థి జీవితంలో కీలక మలుపు ఇంటర్ విద్య. వారి భవిష్యత్తుకు పునాది ఇంటర్ దశ. ఇంతటి ప్రాధాన్యత కల్గిన ఇంటర్ విద్య అమలులో అధికారుల పర్యవేక్షణ కూడా కీలకం. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. లేపాక్షి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న వెంకటరమణను జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి (ఎఫ్ఏసీ)గా నియమించింది. దీంతోపాటు తాజాగా ఇంటర్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (కడప) పోస్టులోనూ ఆయననే కూర్చోబెట్టింది. ప్రిన్సిపల్ బాధ్యతలతోపాటు డీవీఈఓ, ఆర్జేడీగా విధులు నిర్వర్తించడం ఎలా సాధ్యమని, ఈ క్రమంలో ఆయా శాఖల్లో పాలనావ్యవహారలు గాడితప్పుతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా అధ్యాపకులు.. వెంకటరమణ ప్రిన్సిపల్గా పని చేస్తున్న లేపాక్షి జూనియర్ కళాశాలలో కొందరు అధ్యాపకుల మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ లేకపోవడంతో కొందరు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఓ అధ్యాపకుడు రోజుల తరబడి కళాశాలకు రాకపోయినా వచ్చిన రోజు మాత్రం అన్ని రోజులకు హాజరైనట్లు సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడ సమస్యలు అక్కడే.. జిల్లాలో 41 జూనియర్, ఒకేషనల్ జూనియర్ కళాశాలలున్నాయి. చాలా కళాశాలల్లో కనీస వసతులైన తాగునీరు, తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. ఒకేషనల్ జూనియర్ కళాశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. ఓజేటీ(ఆన్ జాబ్ ట్రైనింగ్)లు, బ్రిడ్జి కోర్సులపై దష్టి సారించాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ జంబ్లింగ్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ∙నేపథ్యంలో ప్రాక్టికల్ తరగతుల నిర్వహణ పర్యవేక్షించాల్సిన బాధ్యత డీవీఈఓదే. తూతూ మంత్రంగా తనిఖీలు.‘. మరోవైపు ఆర్జేడీ కేడర్లో రాయలసీమ జోన్ పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ ఇంటర్ విద్య అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ పర్యటించి సమస్యాత్మక కళాశాలలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్, డీవీఈఓ, ఆర్జేడీ మూడు పోస్టుల్లోనూ ఒకే వ్యక్తి ఉంటే ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అనంతపురం కర్నూలు, శ్రీకాకుళం మూడు జిల్లాల్లోనూ ఆగస్టు 31న డీవీఈఓ పోస్టులు ఖాళీ అయితే అనంతపురం మినహా తక్కిన రెండు జిల్లాల్లోనూ పది రోజుల్లోపే డీవీఈఓ ఎఫ్ఏసీ బాధ్యతలను సీనియర్ ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. ఇక్కడ మాత్రం ఆర్జేడీని కొనసాగించడం వెనుక ఆంతర్యం అధికారులే చెప్పాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ ప్రభావం రానున్న ఇంటర్ ఫలితాల్లో పడనుంది. -
29 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 29 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఏలూరు, తణుకులో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2,880 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వారికి అన్ని సెంటర్లలో మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 29న బిల్గ్రేడ్ ఫౌండేషన్ బృందం పర్యటన జిల్లాలో ఆన్లైన్ ద్వారా అమలు చేసే పథకాలను బిల్గ్రేడ్ ఫౌండేషన్ వారు తణుకు, భీమడోలులో పర్యటించి పథకాల అమలుపై స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. 29న ఏలూరు చేరుకుని రెండు బృందాలుగా తణుకు, భీమడోలు మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా జరుగుతున్న పనులు, పింఛన్లు, ఎరువుల పంపిణీ, వైద్యం ఇతర అంశాలపై అడిగి తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఏలూరు కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారుల సమావేశంలో బృందం పాల్గొంటారు -
రేపు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్యార్థులకు త్వరలో జరిగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్)కు సంబంధించి నిర్వహణపై చర్చిం చేందుకు స్థానిక కొత్తూరు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. రేపు ఆంగ్ల బోధనోపాధ్యాయులకు శిక్షణ జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న ఇంగ్లిషు టీచర్లకు బుక్కపట్నం డైట్ కళాశాలలో బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 18 వరకు ధర్మవరం, పెనుకొండ డివిజన్లకు, 20 నుంచి 24 వరకు అ నంతపురం, గుత్తి డివజన్ల పరిధిలోని టీచర్లు హాజరుకావాలని సూ చించారు. గతంలో ఆంగ్లపరీక్ష రాసిన ప్రతి ఉపాధ్యాయుడు త ప్ప కుండా శిక్షణకు హాజరుకావాలని, ఈ పరీక్షకు గైర్హాజరైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు తప్పక హా జరుకావాలని తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల జాబితా పంపండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు జాబితా, మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య వివరాలు ఎంఈఓలకు అందజేయాలని హెచ్ఎంలను డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో ఆదేశించారు. ఎంఈఓలు, మండలస్థాయిలో నిర్దేశించిన కమిటీ సభ్యులు బుధవారం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించే సమావేశానికి వివరాలతో హాజరుకావాలని సూచించారు. మీడియం, పాఠశాలల వారీగా మండలంలో ని 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టు వారీగా మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన పాఠశాల, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. -
ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని మృతి
గురజాడ కళాశాలలో సంఘటన కడుపు నొప్పా! ప్రేమ వ్యవహారమా! వివరాలు గోప్యంగా ఉంచిన యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్ను నిర్దేశించి వారి జీవితానికి పూలబాటలు వేయాల్సిన కళాశాలలు అందుకు భిన్నంగా తయారయ్యాయి. సరస్వతీ నిలయాలు విద్యార్థుల పాలిట మృత్యు కూపాలుగా మారుతున్నాయి. తమ చిన్నారి భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగొందుతుందన్న కోటి ఆశలతో తల్లిదండ్రులు కళాశాలలకు పంపితే అక్కడ నుంచి భావి భారత పౌరులుగా రావాల్సిన వారు మృతదేహాలుగా వస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల రోదన చెప్పనలవి కానిదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణం వెనుక ఉన్న వాస్తవాలు తెరమరుగవుతున్నాయి. దీంతో తమ చిన్నారుల మరణానికి అసలు కారణం ఏంటో తెలియని విపత్కర పరిస్థితి తల్లిదండ్రులది. తాజాగా గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీలో కడుపునొప్పి తాళలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... పాత శ్రీకాకుళం : శ్రీకాకుళం రూరల్ మండలం మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషనల్ సోసైటీలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నక్కల కల్పన (18) కళాశాలలో ఫ్యాన్కు ఉరి వేసుకుని శనివారం మృతి చెందింది. ఈమె మృతి వెనుక బలమైన కారణాలు ఉన్నప్పటికీ కళాశాల యాజమాన్యం వాస్తవాలను గోప్యంగా ఉంచి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందన్న వివరాలను మాత్రమే చెబుతోంది. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసకు చెందిన కల్పన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కల్పన తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. అందులో కల్పనే పెద్దమ్మాయి. రోజూలాగే శుక్రవారం కుడా కళాశాలకు వెళ్లిన కల్పన అదే రోజు రాత్రి నుంచి నీరసంగా కనిపించిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. మరుసటి రోజు శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో వార్డెన్ కుమారి హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థినులను స్టడీ అవర్కు నిద్రలేపింది. తనకు తలనొప్పిగా ఉందని కాసేపు అయ్యాక స్టడీ అవర్కు వెళ్తానని కల్పన వార్డెన్కు చెప్పి బాత్రూంకు వెళ్లింది. దీంతో వార్డెన్ పది నిమిషాల్లో వస్తాను స్టడీ అవర్కు వెళ్లిపోవాలంటూ చెబుతూ ఆ పక్కనే మరో గదిలో ఉన్న సిక్తో ఉన్న విద్యార్థినుల వద్దకు వార్డెన్ వెళ్లిపోయింది. ఈలోగా కల్పన తన వేసుకున్న కళాశాల డ్రస్సుకు చెందిన చున్నీతోనే హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కాసేపు అయ్యాక అటుగా వచ్చిన వార్డెన్ కుమారి ఒక్కసారిగా చూసి ఆందోళనకు గురైంది. అప్పటికే కల్పన మృతి చెందింది. దీంతో విద్యార్థులంతా హాస్టల్ గదిలోకి పరుగులు తీశారు. వెంటనే విషయాన్ని బయటకు పొక్కకుండా చూసేందుకుగాను కళాశాల యాజమాన్యం కల్పన మృతదేహాన్ని నిమిషాలు వ్యవధిలోనే కిందకు దించేస్తూ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య కల్పన కడుపునొప్పి తాళలేకే ఆత్మహత్య చేసుకుందని తండ్రి అప్పారావు విలేకరులకు తెలిపారు. రూరల్ పోలీసుస్టేషన్లో కూడా అలాగే కేసు నమోదు అయ్యింది. రూరల్ ఏఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపికమ్మ పాటతో మంచి గుర్తింపు కల్పన మంచి డ్యాన్సరని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. గత ఏడాది ఫ్రెషర్స్డే నాడు కల్పన ముకుందా చిత్రంలోని ‘గోపికమ్మ’ పాటకు డ్యాన్స్ చేసి మంచి గుర్తింపు పొందింది. తోటి విద్యార్థినులతో ఎప్పుడూ చలాకీగా ఉండే కల్పన ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు. ప్రేమ వ్యవహారమా? ఇదిలా ఉండగా కల్పన ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో వారికి తెలిసిపోవడంతో కల్పన కుటుంబీకులు వేరే సంబంధాలు చూసినట్లు భోగట్టా. దీంతో మహూర్తాలు కుడా పెట్టుకున్నారని, ఈ విషయం కల్పనకు నచ్చక, ప్రేమను గెలిపించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. -
అమ్మా నాన్నా.. ఆలోచించండి
– మార్కులు, ర్యాంకుల విధానంతో అసలుకే మోసం – కన్నపేగుకు కడుపుకోతను మిగులుస్తున్న వైనం – ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకోవాలి – కళాశాలలు, ఇంటి వాతావరణం మారాలన్న విద్యావేత్తలు మార్కుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ కళాశాల విద్యార్థి అగ్రస్థానంలో ఉండాలని కళాశాలలు, తమ బిడ్డను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తుండటమే ఇందుకు కారణం. కన్నవారి, కళాశాలల ఆశలు, ఆకాంక్షలను ఆందుకోలేక పోతున్నామని మార్కుల సాధనలో వెనుకబడుతున్నామనే ఆందోళనే విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతోంది. మానసిక సంఘర్షణకు లోనవుతన్న విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వై. ప్రణయ్రెడ్డి రైలుకింద పడి బలన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలో గత రెండేళ్లలో నారాయణ విద్యా సంస్థల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడారు. ఇతర కాలేజీలు, పాఠశాలలు కలుపుకొని ఈ సంఖ్య మొత్తం ఏడుకు చేరుకుంది. – కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) గ్రూపు కుదించారని.. నన్నూరులోని నారాయణ బాయ్స్ క్యాంపస్లో గతేడాది సెప్టెంబర్ నాలుగో తేదీన శ్రీకాంత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మరణించాడు. ఇతని గ్రూపును కుదించడంతో తోటి విద్యార్థుల ఎదుట తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడు. అధ్యాపకుడు కొట్టాడని.. 2016 జూలైలో కర్నూలులోని బుధవార పేటకు చెందిన సందీప్ అనే విద్యార్థి ఆర్ఎంకే ప్లాజాలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విద్యార్థిని తరగతి గదిలోనే అధ్యాపకుడు కొట్టినట్లు సమాచారం. అంతేకాక సూటిపోటీ మాటలు కూడా కుంగదీయడంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రై వేటు పాఠశాలలు, కళాశాలల చదువు దారేటో తెలియడం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీతో విద్యార్థులను విశాంత్రి లేకుండా పరుగులెత్తించి ఊపిరి తీస్తున్నారు. భవిష్యత్లో ప్రయోజకులవుతారో లేదో కానీ చదువు పూర్తి కాకుండానే ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారు. కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా బలవంతంగా చదువు పేరుతో అధ్యాకుల వేధింపులు కొనసాగుతున్నాయి. సెల్లార్ లాంటి తరగతి గదుల్లో వందలాది మంది పిల్లలను కూర్చోబెట్టి చదువులు చెబుతుండడంతో గురువులు చేప్పే బోధనాభ్యాసం తికమక పెట్టి కొందరు ఆయోమంలో పడుతున్నారు. మరోవైపు తరగతిలో నలుగురి మధ్య మార్కుల పేరుతో విభజించి అధ్యాపకులు అవమాన పరుస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు కనీసం వయస్సును కూడా చూడకుండా బెత్తంతో కొడుతూ బర్రెల్లాగా వ్యవహరిస్తున్నారు. అవమాన పరుస్తున్నారు. దీనికి కుంగి, కషించి విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రై వేట్ విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా నారాయణ, చైతన్య పాఠశాలల యాజమాన్యాలకు నేరుగా ప్రభుత్వంతోనే సంబంధాలు ఉండడంతో సర్కార్ అటువైపు చూడడం లేదు. ఏదో కంటితుడుపు చర్యగా అప్పటికప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకొంటోంది. ఇప్పటి వరకు చాలా కమిటీలు ఆచరణలోకి వచ్చిన నివేదిక ఇచ్చినవి మాత్రం ఒక్కటి లేదు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి – తమ పిల్లలను ఇంజనీరు, డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు రూ. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేటు విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారే కానీ ఎలా చదువు చెబుతున్నారో పరిశీలించడం లేదు. – వారానికో.. పది రోజులకే ఇంటికి ఫోన్ చేస్తేమార్కులు తక్కువచ్చాయి.. ఇలాగైతే ర్యాంకు ఎట్లా వస్తుందని కోపగించుకుంటున్నారే కానీ పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోవడం లేదు. – కళాశాలలో ఒత్తిడిని బరించలేక చదువు మానేస్తామని విద్యార్థులు చెబుతున్నా తల్లిదండ్రులు మాత్రం రూ. లక్షలు కట్టాం..ఎలాగైనా పూర్తి చేయాలని సూచిస్తున్నారే కానీ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేకపోతున్నారు. – కార్పొరేట్ కళాశాలలో చదివిన వారు మాత్రమే ఉన్నత ఉద్యోగాలు చేయడం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం లేదు. – ప్రస్తుతం విద్యా సంస్థల్లో సాంస్కతిక, ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం లేదు. ఈ విషయాలపై తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలను ప్రశ్నించడం లేదు. పిల్లల అభిరుచిని గమనించాలి: చెన్నయ్య, ప్రిన్సిపాల్ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, కర్నూలు తల్లిదండ్రుల ఆలోచన తీరు మారాలి. పిల్లల మనసత్వాన్ని కనుగొని కోర్సులు, కళాశాలల ఎంపిక చేసుకొనివ్వాలి. అంతేకాని పిల్లలకు ఇష్టం లేకునా తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్ది సాధించాలని ఒత్తిడి చేస్తే అలాంటి పిల్లల తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదముంది. యాజమాన్యాలు స్వేచ్ఛనివ్వాలి : వై.నరసింహులు, వీసీ, రాయలసీమ యూనివర్సిటీ యాజమాన్యాలు విద్యార్థుల మనసును తెలుసుకొని బోధన చేయాలి. మార్కులు ర్యాంకులతో చదవాలని ఒత్తిడి చేయరాదు. విద్యార్థికి ఇష్టమైన సమయంలోనే చదవనివ్వాలి. వారికే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. లేదంటే భవిష్యత్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. -
కదిరి కళాశాలలో కలకలం
ఇంటర్ విద్యార్థిపై బ్లేడ్తో దాడి బైక్పై పరారైన దుండగులు కదిరిలోని బసిరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్తో దాడిచేసి గాయపరచడం కలకలం రేగింది. వివరాల్లోకెళితే.. మూర్తిపల్లికి చెందిన నరసింహనాయక్ సీఈసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం కళాశాల వెలుపల మూత్ర విసర్జనకు వెళ్లాడ. ముఖానికి మాస్కు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి వెంకటేష్ ఎక్కడ..? అని అడిగారు. నా సోదరుడే ఏంటి.. అని నరసింహనాయక్ అనడంతో ఆ వ్యక్తులు బ్లేడుతో అతని కుడి చేతికి, అరచేతికి, కుడికాలికి విచక్షణారహితంగా కోసి బైక్పై వెళ్లిపోయారు. రక్త గాయాలతో విద్యార్థి గట్టిగా కేకలు వేయగా తోటి విద్యార్థులు పరుగున వచ్చారు. ప్రిన్సిపల్ సునీల్కుమార్రెడ్డి, తోటి విద్యార్థులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు రాజేంద్ర ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని పరామర్శించారు. కళాశాల ఆవరణలోనే ఇలాంటి దురాగతాలు జరగడం దురదృష్టకర మన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలతో దాడి జరిగిందా.. లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
గాడి తప్పిన ఇంటర్ విద్య
అధ్యాపకుల కొరత రెన్యూవల్కు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా ఇంటర్ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా వారి పోస్టులను రెన్యూవల్ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పోస్టులు 652... పని చేస్తోంది 156 మంది జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్ కలిపి మొత్తం 41 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కొత్తూరు(కురవి) : తల్లిదండ్రులు తరుచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన ఎ.ఎల్లయ్య, సరిత దంపతుల కుమార్తె నేరడలోని మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. శనివారం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటాన్ని చూసి మనస్తాపానికి గురై దుక్కి మందును తాగింది. ఆమెను మానుకోటలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు గడువు 13వ తేదీ
విద్యారణ్యపురి : జిల్లాలో టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే గ డువు ఈనెల 13వ తేదీ వరకు ఉందని డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం.శంకర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఒక్క పేపర్కు రూ. 25 అపరాధ రుసుముతో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు , ఒక్క పేపర్కు రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు లు చెల్లించవచ్చన్నారు. ఇంటర్ విద్యార్థులు థియరీ సబ్జెక్టుకు రూ.150 చొప్పున, ప్రాక్టికల్స్కు పేపర్కు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. టెన్త్ విద్యార్థులు ఒక్క థియరీ సబ్జెక్టుకు రూ.100 చొప్పున, ప్రాక్టికల్స్ పేపర్కు ఒక్క దానికి రూ.50 చొప్పున మీసేవా, ఏపీ ఆ న్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు. కాగా, ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు ఈఏడాది అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. -
బీసీ గురుకుల ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి : జిల్లాలోని మహాత్మాజ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ వరకు చేసిందని, 2016–17 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవిప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చిట్యాల, కొడంగల్లో బాలురు, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో బాలికలను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరం కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పదో తరగతి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని, దరఖాస్తులు రూ.150 ఫీజు చెల్లించి ఆన్లైన్లో మాత్రమే చేయాలన్నారు. ఆగస్టు 11న ప్రవేశాలు, 16న తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పదికి ఆదర్శం.. ఇంటర్కు అధ్వానం
– మోడల్ స్కూళ్ల దుస్థితి – ఆ వైపునకు రాని ఇంటర్ విద్యార్థులు – రెండేళ్లుగా ఇదే పరిస్థితి – సుదూరంలో స్కూళ్లు – బోధనా సిబ్బంది కొరత ఆళ్లగడ్డ: కార్పొరేట్కు దీటుగా గ్రామీణ పేద విద్యార్థులకు సైతం అన్ని వసతులతో కూడిన ఆంగ్ల మీడియం విద్యను అందించేందుకు ఉద్దేశించిన మోడల్ స్కూళ్లు పదోతరగతి వరకే పరిమితమవుతున్నాయి. పదో తరగతి వరకు సీట్లు భర్తీ అవుతున్నా ఇంటర్కు వచ్చే సరికి విద్యార్థులంతా ఇతర కాలేజీలవైపు వెళ్తున్నారు. ఫలితంగా ఇంటర్ విద్యార్థులు లేక మోడల్ స్కూళ్లు వెలవెలబోతున్నాయి. పది వరకు పర్వాలేదు.. ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో సీటు కోసం పోటీ అధికంగా ఉంటోంది. 75 మార్కులు దాటితే తప్ప సీటు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధ్యాపకులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు, భూస్వాములు సైతం ప్రయివేటు పాఠశాలలను కాదని తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇంటర్కు ఆదరణ కరువు పది వరకు ఇంత ప్రాధాన్యం ఉన్న మోడల్ స్కూళ్లకు ఇంటర్ మీడియట్కు వచ్చే సరికి ఆదరణ కరువైంది. పది వరకు ఇక్కడే చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం ఇంటర్ మీడియట్ను అక్కడే చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లుగా ఆయా స్కూళ్లలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్కు దాటకపోవడం ఇందుకు నిదర్శనం. రుద్రవరం మోడల్ స్కూల్లో ఇంటర్కు ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం గమనార్హం. అన్ని పాఠశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి 20 సీట్ల ప్రకారం 80 సీట్లు ఉన్నాయి. ఇలా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలను తీసుకుంటే 160 సీట్లు అందుబాటులో ఉండగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఏ మోడల్ స్కూలు చూసినా ఇంటర్ విద్యార్థుల సంఖ్య 30 మందికి మించడం లేదు. ఎంపీసీ, బైపీసీకే పరిమితం ఇంటర్ మీడియట్ విషయానికొచ్చేసరికి పాఠశాలల్లో బోధనా సిబ్బంది సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఇటువైపు వచ్చేందుకు విద్యార్థులు సంకోచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులుండగా దాదాపు అన్ని స్కూళ్లలో అధ్యాపకుల కొరత కారణంగా ఎంపీసీ, బైపీసీ మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో మిగతా గ్రూపులపై ఆసక్తి ఉన్న వారు దూరమవుతున్నారు. వర్షం వస్తే నడవలేం: విష్ణువర్ధన్, జూనియర్ ఇంటర్ పొలాల్లో స్కూలు బిల్డింగ్ కట్టించారు. రోడ్డు వేయకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా దారి బురదగా మారుతోంది. దీంతో ఇబ్బంది పడుతున్నాం. బాడుగ ఇంట్లో ఉంటున్నాం: శిరీష, సీనియర్ ఇంటర్ మాది అహోబిలం. హాస్టల్ ఉంటుందని సారోళ్లు చెబితే ఇంటర్కు ఇక్కడే చేరాను. సంవత్సమైనా హాస్టల్ తెరవలేదు. రోజూ ఊరు నుంచి వచ్చేందుకు వేళకు బస్సులు లేకపోవడంతో అమ్మతో కలిసి ఇక్కడే ఇళ్లు బాడుగకు తీసుకుని ఉంటున్నాం. రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే ఫలితం ఉంటుంది: డాక్టర్ మహమ్మద్ఇష్మాయిల్, రుద్రవరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనేక స్కూళ్లలో బోధనకు కాంట్రాక్టు సిబ్బందే దిక్కయ్యారు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమిస్తే విద్యార్థులను ఇంటర్కు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. హాస్టల్ ఏర్పాటు చేయాలి: ఇప్తెకార్హుస్సేన్, ఆళ్లగడ్డ ప్రిన్సిపాల్ బాలికలను బస్సులు, ఆటోల్లో పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. హాస్టల్ ప్రారంభించి వసతి కల్పిస్తే ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడే 10 వరకు చదువుకున్న బాలికలందరూ ఇంటర్లో చేరే అవకాశం ఉంది. పాఠశాలల్లో ఉండాల్సిన సిబ్బంది, విద్యార్థుల వివరాలు.. మండలం – ఉండాల్సిన అధ్యాపకులు– ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు – పార్ట్టైం టీచర్లు – 5 నుంచి 10 వరకు విద్యార్థులు – ఇంటర్ రుద్రవరం – 21– 6 – 7 – 30 – 0 – 0 ఆళ్లగడ్డ – 21 – 7 – 10 – 350 – 24 – 6 ఉయ్యలవాడ– 21 – 6 – 11 – 380 – 30 – 12 -
‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి
– అధ్యాపకుడు మందలించాడని ఇంట్లో ఫ్యాన్కు ఉరి? కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని బుధవారపేటలో నివాసం ఉంటున్న మహానంది, సరస్వతి దంపతులకు నలుగురు సంతానం కాగా.. రెండవ కుమారుడు సందీప్ స్థానిక నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సందీప్ను తరగతి గదిలో మ్యాథ్స్ లెక్చరర్ మందలించినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల ఎదుట చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు లోనైనట్లు సమాచారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోగా.. అప్పటికి ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని తండ్రి ఆటోడ్రై వర్ కాగా.. తల్లి నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వీపర్గా పని చేస్తున్నారు. విధులు ముగించుకొన్ని తల్లి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా విగతజీవిగా మారిన కుమారుడిని చూసి నిశ్చేష్టురాలయింది. స్థానికుల సహకారంతో సమాచారం భర్తకు చేరవేసింది. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంలో కళాశాల ప్రేమయం లేదని చెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు మధ్యవర్తిగా ఈ పంచాయితీ జరిగినట్లు సమాచారం. చివరకు.. తమ కుమారుడు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్రావు తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది నన్నూరు సమీపంలోని నారాయణ బ్రాంచ్లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కార్పొరేట్ కళాశాలల్లో ఒత్తిళ్లకు అద్దం పడుతోంది. -
డీఈసీఈ.. ఇంటర్తో సమానమే!
ఎల్ఐసీ, మహిళా ఉద్యోగి వివాదంలో హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆంధ్రా, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించిన మూడేళ్ల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమో(డీఈసీఈ) కోర్సు రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సుతో సమానం కాదన్న జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) వాదనలను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. రెండు అత్యున్నత విద్యా సంస్థలు డీఈసీఈ డిప్లొమో కోర్సును ఇంటర్ తత్సమాన కోర్సుగా గుర్తించినప్పుడు, ఎల్ఐసీ అందుకు విరుద్ధమైన వైఖరిని తీసుకోవడం అర్థం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. డీఈసీఈ డిప్లొమో చేసిన ఓ మహిళకు అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చి, ఆ తరువాత డీఈసీఈ డిప్లొమో ఇంటర్ తత్సమాన కోర్సు కాదంటూ ఆమెను ఉద్యోగంలోని నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ బి.శివశంకరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
35%పాస్
♦ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ♦ ఫస్టియర్లో 79.59 శాతం ఉత్తీర్ణత సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 26,815 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,349 మాత్రమే పాసై 35 శాతం ఉత్తీర్ణత సాధించారు. వార్షిక పరీక్షల్లో సంతృప్తికరంగా ఫలితాలుండగా.. అడ్వాన్సడ్ సప్లిమెంటరీలో మాత్రం అతి తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా ఇంటర్మీడియెట్ ఫస్టియర్కు సంబంధించి 88,364 మంది అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫెయిల్ అయిన వారితోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసినవారున్నారు. ఈక్రమంలో 70,329 మంది పాసై 79.59శాతం ఉత్తీర్ణత సాధించారు. -
హాస్టల్ కోసం వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
బోడుప్పల్: హాస్టల్ తెరిచారో లేదో తెలుసుకోవడం కోసం వెళ్లిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన బుధవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ శ్రీరాంనగర్ కాలనీలో నివసించే బూడిద మల్లయ్య కుమార్తె రోజ(17) నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ తెరిచారో లేదా తెలుసుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాజుద్దీన్ వివరించారు. -
ఎంసెట్లో పాస్.. ఇంటర్లో ఫెయిల్!
ఎంసెట్లో ర్యాంకు పొంది ఇంటర్లో ఫెయిలైన 18,143 మంది సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్లో ఫెయిల్ అవడంతో 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదు. మరో 3,114 మంది తమ ఇంటర్ మార్కుల వివరాలను అందజేయకపోవడంతో వారి ర్యాంకులను కూడా ప్రకటించలేదు. తెలంగాణ ఎంసెట్కు మొత్తంగా 2,46,540 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,23,542 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,00,861 మంది ఎంసెట్లో అర్హత సాధించారు. అయితే 18,143 మంది ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. మరో 3,114 మంది ఇంటర్ ఉత్తీర్ణత వివరాలను ఇవ్వనందున ఎంసెట్ కమిటీ 1,79,609 మందికి మాత్రమే ర్యాంకులను ప్రకటించింది. -
కసిపెంచిన కష్టాలు
♦ అడ్డా కూలీ బిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంకు ♦ పేదింట విరిసిన కుసుమం...మౌనిక ♦ పట్టుదలే పునాదిగా రాణింపు ♦ కష్టాలు వెంటాడుతున్నా అద్వితీయ ప్రతిభ ♦ ఇంటర్లో 987(ఎంపీసీ) మార్కులతో.. ♦ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు కైవసం గజ్వేల్/కొండపాక: తండ్రి ఓ అడ్డా కూలీ... తల్లి బీడీ కార్మికురాలు... కేవలం రెండెకరాల మెట్ట పొలం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇవన్నీ ఆ విద్యార్థి లక్ష్యానికి అవరోధంగా మారలేదు. తనను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే తల్లిదండ్రుల ఆశను తీర్చడానికి నిరంతరం శ్రమించింది. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ సెలవులు వచ్చినప్పుడల్లా కూలీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. కసిగా చదివి తాజాగా శుక్రవారం విడుదలైన ఇంటర్(ఎంపీసీ) 987/1000మార్కులతో రికార్డు సృష్టించింది. కష్టాలే తనలో విజయకాంక్షను రగిల్చాయని ఆ విద్యార్థిని చెబుతోంది. ఈ సందర్భంగా శనివారం ‘సాక్షి’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆ వివరాలు..కొండపాక మండలం ధమ్మక్కపల్లి గ్రామానికి కూరాటి నర్సింలు. యాదమ్మకు మౌనిక(17), జ్యోతి(14), ప్రసాద్(13), మధు(9)లు సంతానం. నర్సింలు రెండెకరాల ఆసామి. వరుసగా నాలుగు బోరుబావులు వేసినా అవి ఫెయిల్ కావడంతో ఆశలు చాలించుకొని..ఆ భూమిలో ఏటా పత్తి, మొక్కజొన్న లాంటి మెట్టపంటలు సాగు చేసుకుంటున్నాడు. మూడేళ్లుగా కాలం కలిసి రాక వ్యవసాయంపై ఆశలు చాలించుకొని...అడ్డా కూలీగా స్థిరపడ్డాడు. గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద పనికెళ్తున్నాడు. గ్రామం చుట్టు పక్కల.. లేదంటే సిద్దిపేటకు పనికి వెళ్తుంటాడు. పనికి వెళ్లనిదే పూట గడిచే పరిస్థితి లేదు. నిత్యం పని వెతుక్కుంటాడు. యాదమ్మ బీడీలు చుడుతుంది. మౌనిక కొండపాకలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతోంది. ఇంటర్ చదువుతున్న మౌనికకు పేదరికం ఏనాడూ అవరోధంగా మారలేదు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి మాత్రం మౌనిక చలించిపోయింది. నిత్యం విజయకాంక్షతో రగిలిపోయింది. ఇంటర్ ఎలాగైనా రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా శ్రమించింది. తల్లిదండ్రులకు తోడూ అధ్యాపకుల ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాన్ని సాధించడానికి బాటలు వేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 987/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకును సాధించి అందరినీ అబ్బురపరిచింది. ఐఏఎస్ కావడమే లక్ష్యం చిన్నప్పటి నుంచి కష్టాల్లో పుట్టిపెరిగాను. నేను బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్లికిక కష్టాలుండొద్దు. ఐఏఎస్ సాధించాలనేదే నా జీవిత లక్ష్యం. పాఠశాలలో నన్ను మ్యాథ్స్ లెక్చరర్ అక్బర్ సార్, ప్రిన్సిపాల్ జ్యూటికా వన్నీసా మేడమ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి సహకారం జీవితంతో మరిచిపోలేను. చురుకైన విద్యార్థిని మా విద్యా సంస్థలో మౌనిక చాలా చురుకైన అమ్మాయి. ఇలాంటి విద్యార్థిని మా విద్యాసంస్థలో ఉన్నందుకు సంతోషించేవాళ్లం. పాఠాలు శ్రద్ధగా వినేది. చదువులో ఎప్పుడూ ముందుండేది. - జ్యూటికావన్నీసా, ప్రిన్సిపాల్ ఏకసంతాగ్రహి మౌనిక లాంటి విద్యార్థినులు చాలా అరుదు. ఏ విషయం చెప్పినా బాగా గుర్తు పెట్టుకునేది. ప్రతి పరీక్షలోనూ మొదటి స్థానం సాధించేది. ఎన్ని ఇబ్బందులున్నా బాధపడేది కాదు. దిగమింగుతూ లక్ష్యాన్ని సాధించింది. ఈ అమ్మాయి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. - షేక్ అక్బర్, మ్యాథ్స లెక్చరర్ కష్టాలను లెక్కచేయ.. నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలున్నాయని చదవడం ఆపేయలేదు. మేము ఉపాసముంటే తనూ ఉపాసముంది. మాతోపాటు ఎన్నో సార్లు కూలీ పనులకు వచ్చింది. మా కష్టంలో పాలు పంచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా బిడ్డ చదువు ఆపేయ. ఆమెను కలెక్టర్ను చేస్తానని మాట ఇచ్చిన. దీనికి ఎంతైనా కష్టపడుతా. నా బిడ్డకోసం కష్టపడడంలో ఎంతో ఆనందముంది. - మౌనిక తండ్రి కూరాటి నర్సింలు -
ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి టాప్
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రంగారెడ్డిజిల్లా సత్తా చాటింది. శుక్రవారం విడుదలయిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో రంగారెడ్డి తొలి స్థానంలో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో 69 శాతం, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 76 శాతంతో రంగారెడ్డి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్(56 శాతం) రెండో స్థానంలో నిలవగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఖమ్మం(66 శాతం) రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు నల్లగొండ 41 శాతంతో ఇంటర్ ఫస్టియర్లో చివరిస్థానంలోనూ, ఇంటర్ సెకండ్ ఇయర్లో మెదక్, నల్లగొండలు చివరిస్థానంలో నిలిచాయి. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి హైదరాబాద్: విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈసారి ఇంటర్మీడియెట్ బోర్డు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా 262,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివర తేదీగా ప్రకటించారు. ఫలితాలను వెబ్సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు. ఈ వెబ్సైట్లలో ఫలితాలు పొందొచ్చు www.sakshieducation.com www.sakshi.com tsbie.cgg.gov.in http://results.cgg.gov.in http://examresults.ts.nic.in -
నేడు ఇంటర్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు గత మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. వీటికి 9,64,664 మంది (ప్రథమ సంవత్సర విద్యార్థులు-4,56,655, ద్వితీయ సంవత్సర విద్యార్థులు-5,08,009) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను వెబ్సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు. ఇక జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ తమ కాలేజీ ఫలితాలను యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా http://bietelangana. cgg.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈ వెబ్సైట్లలో ఫలితాలు పొందొచ్చు www.sakshieducation.com www.sakshi.com tsbie.cgg.gov.in http://results.cgg.gov.in http://examresults.ts.nic.in -
రేపు ఇంటర్మీడియెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. 22న ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగీకరించినట్ల్లు తెలిసింది. -
22న ఇంటర్ ప్రథమ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఈనెల 22న విడుదల చేసేందుకు రాష్ర్ట ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఆ రోజున వీలు కాకపోతే 23న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాల విడుదల తేదీని మంగళవారం లేదా బుధవారం అధికారికంగా ప్రకటించనుంది. ఇక ద్వితీయ సంవత్సర ఫలితాలనూ ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. పదో తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో అది పూర్తి కాగానే మే మొదటి వారం చివర్లో లేదా రెండో వారంలో ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. -
ఓపెన్ పై విజిలెన్స్
♦ రంగంలోకి దిగిన అధికారులు ♦ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ♦ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన ఖమ్మం : ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు ప్రోత్సహించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూచిరాతను తలపించే విధంగా పరీక్షలు జరగడం.. అత్తకు బదులు కోడలు, తండ్రికి బదులు కొడుకు, అన్నకు బదులు తమ్ముడు పరీక్ష రాస్తూ పట్టుబడిన విషయాలు.. అధికారులు మాస్ కాపీయింగ్ను ప్రోత్సహించిన విధానాలను వివరిస్తూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం విదితమే. దీనికి బాధ్యులెవరనే విషయాలను తెలుసుకునేందుకుజిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఉన్నతాధికారులు విద్యా శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అక్రమాలకు బీజాలు ఎక్కడ పడ్డాయి.. అసలు సూత్రధారులెవరు.. అనే విషయాలపై ఆరా తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికోసం విజిలెన్స్ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు తెలిసింది. కలెక్టర్ లోకేష్కుమార్ స్వయంగా ఇల్లెందు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు నేరుగా వెళ్లి తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు. పకడ్బందీగా మాస్ కాపీయింగ్.. అభ్యర్థులకు పదోన్నతి, ఉద్యోగ అవకాశాలు, లెసైన్స్లు తదితర అవసరాల కోసం పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్ల అవసరం ఉంటుంది. అయితే పరీక్ష రాయకుండానే పాస్ అయ్యే మార్గం వెతుక్కున్న వారికి పలువురు దళారులు తారసపడటం.. వారికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పలువురు అధికారులతో ఉన్న పరిచయాలను ఎరగా చూపి పాస్ చేయిస్తామని హామీలు ఇస్తూ.. వారి వద్ద నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం చూసి కూడా రాయలేని వారిని పాస్ చేయించేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనువైన సెంటర్ల నుంచి అడ్మిషన్లు పొందడం.. ఆ తర్వాత సెంటర్ల ఏర్పాటు.. అక్కడ అనువైన వారిని సీఎస్, డీఈలతోపాటు ఇన్విజిలేటర్లను వేయించడంలో సఫలమయ్యారనే ప్రచారం జరిగింది. ప్రణాళికలో భాగంగానే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, సమాధాన పత్రాలను బయటకు తీసుకెళ్లి రాయించడం వంటి వాటిపై ‘సాక్షి’ కథనాలు రాయడంతో.. అధికారులు స్పందించారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇల్లెందులో తండ్రికి బదులు కొడుకు.. కొత్తగూడెంలో అత్తకు బదులు కోడలు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. అక్రమార్కుల వేటలో అధికారులు ఎక్కడా లేని విధంగా ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ ప్రతీ రోజు పట్టుబడటంపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరువు తీస్తున్న వరుస సంఘటనలకు మూలం ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీనికోసం పలువురు అభ్యర్థులను పరీక్షలు ఎలా రాస్తున్నారు.. పాస్ గ్యారెంటీ కోసం ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చారు.. అధికారుల పాత్ర ఏమిటనే విషయాలను పరీక్ష రాస్తున్న వారిని నేరుగా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు.. తమకేమీ తెలియదని, పాస్ చేయిస్తామని, పెద్ద పెద్ద అధికారులు తమకు తెలుసు.. అందరినీ మేనేజ్ చేస్తాం.. పాస్ గ్యారెంటీ అంటూ వేలాది రూపాయలు తీసుకొని ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అక్రమార్కులకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని మాస్ కాపీయింగ్లో కీలక భూమిక పోషించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
మళ్లీ లీకయిందోచ్..
బెంగళూరు: కర్ణాటకలో వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. పదిరోజుల్లో రెండోసారి ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. పేపర్ లీకవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. బెంగళూరులోని పీయూసీ భవనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడే మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. కాగా, పేపర్ లీకేజీకి బాధ్యత వహించి విద్యాశాఖమంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
ఇంటికి పోదాం చలో చలో
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగియడంతో విద్యార్థులు ఇంటి బాటపట్టారు. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు మంగళవారం వరకు కొనసాగాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. సెలవులు కాగానే మళ్లీ కలుద్దాం అంటూ బయలుదేరారు. విద్యార్థులతో నగర బస్టాండ్ సందడిగా మారింది. -నిజామాబాద్అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
* పావుగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి * అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది * హాజరు కానున్న 9.64 లక్షల మంది విద్యార్థులు * హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుంది. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులను నిర్ధేశిత సమయం కన్నా పావుగంట(8.45గంటలకే) ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యం చేసి ఆ తర్వాత నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు చెల్లించకపోవడం లేదా ఇతర కారణాలతో ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వని పక్షంలో వెబ్సైట్(www.tsbie.cgg. gov.in) నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గమనిస్తే.. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్ను అడ్డుకునేందుకు 50 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 200 వరకు సిట్టింగ్ స్క్వాడ్లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇన్విజిలేషన్ విధుల్లో 24,651 మంది లెక్చరర్లు, 3,388 మంది టీచర్లు పాల్గొంటారు. పరీక్షలకు 1,257 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 478 ప్రభుత్వ కాలేజీలు, 34 ఎయిడెడ్ కాలేజీలు, 745 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 118 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సూచనలు - పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు ఇచ్చిన ఓఎంఆర్ బార్కోడ్లో పేరు, హాల్టికెట్ నంబర్, మీడియం వివరాలను విద్యార్థులు సరిచూసుకోవాలి. - జవాబుల బుక్లెట్లో 24 పేజీలు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు. కొత్త సిలబస్, పాత సిలబస్ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా న్యూ సిలబస్ ప్రశ్నపత్ర ంతోనే రాయాలి. - దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇంటర్ పరీక్షల నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. - పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి. - చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు. ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు ఫస్టియర్ జనరల్ 4,20,161 ఒకేషనల్ 36,494 సెకండియర్ జనరల్ 4,73,882 వొకేషనల్ 34,127 మొత్తం 9,64,664 -
ఎక్సైజ్ కానిస్టేబుల్: కనీస విద్యార్హత ఇంటర్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ప్రభుత్వం మార్పులు చేసింది. పోలీస్శాఖలోని కానిస్టేబుల్ పోస్టుల కనీస విద్యార్హతను ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్ఎస్సీ నుంచి ఇంటర్కు పెంచారు. కానీ ఎక్సైజ్ శాఖలో మాత్రం కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్ఎస్సీనే అర్హతగా కొనసాగుతూ వచ్చింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల జీతభత్యాలు మొదలు పీఆర్సీ వరకు పోలీస్ కానిస్టేబుళ్ల కన్నా తక్కువగా ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష’ పాసైనవారే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగానికి అర్హులని పేర్కొంటూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1998ను తెలంగాణకు అన్వయించుకొని మార్పులు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రా (రెవెన్యూ) ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విద్యార్హతను మార్చిన నేపథ్యంలో కొత్త నియామకాలకు సర్కార్ పచ్చజెండా ఊపినట్టేనని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. 1,000కి పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన సాయికృష్ణ(16) స్థానిక కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో గురువారం రాత్రి వైర్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
'ఇంటర్ జంబ్లింగ్' పై సర్కార్ పునరాలోచన
-
జంబ్లింగ్ వద్దు...
-
వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు
-
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మార్చి 2 నుంచి ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షలు, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలు, మార్చి-2016 షెడ్యూల్ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తేది ఫస్టియర్ పేపర్స్ తేది సెకండియర్ పేపర్స్ బుధవారం పార్ట్-2 గురువారం పార్ట్-2 2.03.2016 (ద్వితీయ భాష-1) 03.03.2016 (ద్వితీయ భాష-2) శుక్రవారం పార్ట్ 1 శనివారం పార్ట్-1 4.03.2016 (ఆంగ్లము-1) 05.03.2016 ఆంగ్లం-2 మంగళవారం పార్ట్-3 బుధవారం పార్ట్-3 8.03.2016 గణితం-1(ఏ), బోటనీ-1, 09.03.2016 గణితం-2(ఏ), బోటనీ-2, సివిక్స్-1, సైకాలజీ-1 సివిక్స్-2, సైకాలజీ-2 గురువారం గణితం-1(బీ), జువాలజీ-1 శుక్రవారం గణితం-2(బీ), జువాలజీ-2 10.03.2016 హిస్టరీ-1 11.03.2016 హిస్టరీ-2 శనివారం ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 సోమవారం ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 12.03.2016 క్లాసికల్ లాంగ్వేజ్ -1 14.03.2016 క్లాసికల్ లాంగ్వేజ్ -2 మంగళవారం కెమిస్ట్రీ-, కామర్స్-1, ఫైన్ ఆర్ట్స్-1, బుధవారం కెమిస్ట్రీ-, కామర్స్-2, ఫైన్ ఆర్ట్స్-2, 15.03.2016 సోషియాలజీ-1, మ్యూజిక్-1 16.03.2016 సోషియాలజీ-2, మ్యూజిక్-2 గురువారం జియోలాజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1 శుక్రవారం జియోలాజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2 17.03.2016 లాజిక్-1, హోం సైన్స్-1, 18.03.2016 లాజిక్-2, హోం సైన్స్ -2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-2 బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-1 (బీ.పీ.సీ విద్యార్థులకు) (బీ.పీ.సీ విద్యార్థులకు) శనివారం మోడరన్ లాంగ్వేజ్-1 సోమవారం మోడరన్ లాంగ్వేజ్-2 19.03.2016 జియోగ్రఫీ -1 21.03.2016 జియోగ్రఫీ -2 పై పరీక్షలకన్నా ముందు.. (ఎ) ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష-27.01.2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు (బి) ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష-30.01.2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు (సి) ప్రాక్టికల్ పరీక్షలు 04.02.2016 నుంచి 24.02.2016 -
ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
అధ్యాపకుల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ కడప అర్బన్/చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరం ఓం శాంతినగర్కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని(16), సిద్దవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన వీరుఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరారు. ఇదే క్యాంపస్లో హాస్టల్లో ఉంటూ 103వ గదిలో కలసి ఉంటున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్ తరువాత హాస్టల్ గదిలోకి వెళ్లారు. కొంత సేపటి తర్వాత ఇతర విద్యార్థినులు వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించారు. కళాశాల సిబ్బంది వచ్చి చూసే సరికే మృతి చెందారు. మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని అధ్యాపకుల వేధించడంవల్లే మనీషా, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారిని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం: కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యలకు యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే కారణమని మృతుల బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలో ఫర్నీచర్, ద్వారం, కిటీకీల అద్దాలు ధ్వంసం చేశారు. -
పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్లోకి తెచ్చే ఏర్పాట్లు చేసింది. పోటీ పరీక్షల కోసం ఇన్నాళ్లు కోచింగ్లకు వెళ్లినా.. మార్పు చేసిన పరీక్షల విధానం, సిలబస్ కారణంగా అకాడమీ రూపొందించే పుస్తకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్కు అనుగుణంగా జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన పుస్తకాలను రాయించి ముద్రించింది. వాటితోపాటు జనరల్ స్టడీస్ పుస్తకాలను తెచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో మరిన్ని పుస్తకాలను ప్రొఫెసర్లతో రాయిస్తోంది. త్వరలోనే మరిన్ని పుస్తకాలను తీసుక వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల పేపర్లు, అందులో వచ్చే వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కసరత్తు చేపట్టింది. గతంలోనే తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన తెలుగు అకాడమీ.. ఇప్పుడు తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాలను రాయిస్తోంది. వీటితోపాటు భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం, భౌగోళిక విజ్ఞాన శాస్త్రం, భూసంస్కరణలపై క్వశ్చన్ బ్యాంకులు రూపొందిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 లక్ష్యంగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పోటీ పరీక్షలే ప్రధాన లక్ష్యంగా, వాటి సిలబస్ ఆధారంగా పుస్తకాల రచనకు అకాడమీ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి సిలబస్ వచ్చిన వెంటనే ఆయా అంశాలతో కొత్త పుస్తకాలను సరిచూసుకొని ముద్రించి మార్కెట్లోకి తేనుంది. ఇప్పటికే జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర తదితర పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో... తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమని సుల్తాన్లు, కుతుబ్షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలను పొందుపరుస్తోంది. ఉపయుక్తంగా ఇంటర్, డిగ్రీ పుస్తకాలు ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్మీడియెట్, డిగ్రీలోని పాఠ్య పుస్తకాలను పోటీ పరీక్షల కోసం సిలబస్కు అనుగుణంగా తీసుకొచ్చాయి. సిలబస్లోని అంశాలపై ప్రత్యేకంగా పాఠాలు ఉన్నాయి. దీంతో పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ పుస్తకాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వాటిని పునర్ ముద్రించే పనిలో పడింది. తెలంగాణ చరిత్ర, భూగోళం, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇంటర్ పుస్తకాల్లోని ఈ అంశాలు అభ్యర్థులకు ఉపయోగపడనున్నాయి. అలాగే, తెలంగాణకు అనుగుణంగా మార్పు చేసిన డి గ్రీ పుస్తకాల ముద్రణ పైనా తెలుగు అకాడమీ దృష్టి పెట్టింది. -
కొత్త బంగారులోకం
జాగ్రత్తలు అవశ్యం మంచి స్నేహమే ఉత్తమ మార్గం సానుకూల దృక్పథం అవసరం ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకాలజిస్టుల సలహా ఇంటర్ పూర్తవగానే భవిష్యత్తుపై కొత్త ఆశలు ఇంజినీరింగ్ వైపు నడిపిస్తాయి. ఇంజినీరింగ్ అంటేనే కొత్త ప్రపంచం. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులు ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్లో అడుగుపెట్టారు.. మునుపెన్నడూ లేని చదువులు.. కొత్త వాతావరణం.. విభిన్న మనస్తత్వాల మధ్య కొత్త స్నేహాలు. అందరితో కలిసి నాలుగేళ్లు సాగాలి. ప్రతి అంశం పట్లా జాగ్రత్తగా మెలిగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. దూకుడు మీదున్న వయసు ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంది. ఫలితంగా దురలవాట్లు. ర్యాగింగ్, మానసిక ఒత్తిడి.. ఇలాంటి వాటికి లొంగకుండా నడుచుకోవాలి. వీటిపై తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు కన్నేసి ఉంచాలి. వీటన్నింటిపైనా అవగాహన కల్పించడం కోసం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో నైపుణ్యాలే అదనపు అర్హతలు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువొక్కటే సరిపోదు. నైపుణ్యాలు, కమ్యూనికేషన్, పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి. ఈ నాలుగేళ్లలో సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. మనం ఏ విషయంలో ఇంకా మెరుగు పడాలో గుర్తించి దానికి అధిక సమయం కేటాయించాలి. దేశవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారు. ఇందులో కేవలం 15 శాతం మందినే ఉద్యోగాలు వరిస్తున్నాయి. 85 శాతం మార్కులు సాధించినా నైపుణ్యాలు లేక ఉద్యోగం దక్కడం గగనమై పోయింది. నిరంతరం సాధన చేస్తేనే ఈ అవరోధాన్ని దాటడం కష్టం కాదని విద్యార్థులు గుర్తించాలి. భాష, వ్యాకరణ దోషాలు కూడా ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ నాలుగే ళ్లలో వీటిని సవరించుకుంటే విజయానికి దగ్గరైనట్లే. సానుకూల దృక్పథం అలవర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. కఠిన శిక్షలు తప్పవు.. విద్యార్థులు తమ భవిష్యత్ను చేజేతులా నాశనం చేసుకోవద్దు. ర్యాగింగ్కు పాల్పడ్డ చాలామందికి శిక్ష లు పడ్డాయి. ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. ర్యాగింగ్ చేసినట్లు గుర్తిస్తే.. తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. తరగతుల నుంచి బహిష్కరించడం, కళాశాలలో అడ్మిషన్ రద్దు చేయడం, పరీక్షలకు అనుమతించక పోవడం, ఫలితాలను విత్హెల్డ్లో పెట్టడం తదితర శిక్షలు ఉంటాయి. ర్యాగింగ్పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాలల యాజమాన్యాలపై కూడా చర్యలు తప్పవు. అనుబంధ గుర్తింపు రద్దు వంటి తీవ్ర చర్యలు ఉంటాయి. - స్వాతిలక్రా, అదనపు పోలీస్ కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) ఇలా చేస్తే మేలు.. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. సబ్జెక్ట్ అర్థం కాకున్నా వినడం ద్వారా కొంతైనా అవగతమవుతుంది. బుర్రకెక్కని విషయాలను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి. అంతేగాక తోటివారితో చర్చిస్తే కూడా తొందరగా అర్థమవుతుంది. అంత సులువుగా మర్చిపోరు. స్నేహం మంచిదే కానీ.. సీనియర్స్తో ఫ్రెండ్లీగా ఉంటూ తోటివారితో చనువుగా మెలగాలి. ఆనందంతో పాటు బాధలను పంచుకునే స్నేహానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. చేసే ఏ పనికైనా మంచి.. చెడుని విశ్లేషించి అడుగేయాలి. ఇంజినీరింగ్లోనే అధిక మంది విద్యార్థులు దురలవాట్ల బారిన పడుతున్నారని సర్వే చెబుతోంది. మొబైల్, చాటింగ్, వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్ వెబ్సైట్లకు వీలైనంత తక్కువ సమయం కేటాయించాలి. మొదటి నుంచే వీటి వాడకాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం. మానసిక నిపుణుల మాట.. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. కళాశాల పరిస్థితులు, తోటివారి న డవడిక, సీనియర్ల కదలికలపై దృష్టి సారించాలి. ఒంటరితనం వద్దు. నలుగురి మధ్య అధికంగా ఉండడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాన్ని లైబ్రరీకి కేటాయించాలి. పుకార్లను నమ్మొద్దు. చూసి, విన్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. సీనియర్లు అందరూ చెడ్డవారు కాదన్న భావనతో ఉండాలి. అయితే, ఎవరు మంచో.. చెడో నిశితంగా పరిశీలించాలి. చెడు స్నేహాన్ని దూరంగా పెట్టండి. అప్పుడప్పుడు ఆటలూ ఉండాలి. తల్లిదండ్రులకు సలహాలివి.. కళాశాల నుంచి రాగానే పిల్లలతో కచ్చితంగా మాడ్లాడాలి. ఆ రోజు విషయాలు ఏంటో తెలుసుకోవాలి. ఒత్తిడి ఫీలైతే అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే సలహాలివ్వాలి. వారి అభిరుచులకు పిల్లలు కొంత సమయం వెచ్చించేలా వీలు కల్పించాలి. ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం పొందుతారు. ప్రవర్తన, నడవడిక, మాట తీరును ఎప్పటికప్పుడు గమనించాలి. తేడా గమనిస్తే దగ్గరకు తీసుకుని వివరాలు అడగండి. తల్లిదండ్రులతో మొదలవ్వాలి.. యువతకు అతివేగం మీదున్న మోజు వారి ప్రాణాలను మింగేస్తుందన్న వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. ఈ క్రమంలో ఎదుటివారూ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, రాష్ రైడ్ వల్ల కలిగే నష్టాలపై మొదట తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. ఇంటి నుంచి ఎలా వెళ్తున్నారో.. తిరిగి సురక్షితంగా ఎలా రావాలో మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. మా బాధ్యతగా విద్యార్థులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో యాజమన్యాలు భాగమవ్వాలి. - దివ్య చరణ్రావు, అదనపు డీసీపీ (ట్రాఫిక్ -2), సైబరాబాద్ కౌన్సిలింగ్ తప్పనిసరి.. కళాశాల వాతావరణానికి విద్యార్థులు అలవాటు పడేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో చదువు కంటే.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ర్యాగింగ్ చేస్తారన్న భయంతో చాలా మంది విద్యార్థులు కాలేజీల్లో అడుగు పెడుతున్నారు. ఇతర విద్యార్థుల నుంచి సంజ్ఞలు, చూపులు ఎదురైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటివారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రతి 100 మంది విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం సున్నిత మనస్తత్వ వ్యక్తులు ఉంటారు. ర్యాగింగ్పై ఫిర్యాదులను యాజమాన్యాలు నేరుగానే కాకుండా మెయిల్, బాక్స్ పద్ధతి ద్వారా అందేలా చూడాలి. విషయాన్ని నమ్మకమైన స్నేహితులకు, తల్లిదండ్రులకు చెప్పాలి. - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైక్రియాటిస్ట్ (మెడిసిటీ) -
నేడు విద్యా సంస్థల బంద్
పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ ఇం టర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రైవేటు కాలేజీడ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల సాధనకు బంద్ చేపట్టనున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య తెలిపారు. -
ఆన్లైన్ అడ్మిషన్లు..విద్యార్థులకు శాపం
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతిభ ఉన్నా, ఎక్కువ మార్కులు సాధించినా కళాశాలలో సీటు పొందలేక పోతున్నారు. - ప్రతిభ ఉన్నా టీటీడీ విద్యాసంస్థల్లో దక్కని సీట్లు - అత్తెసరు మార్కులు పొందినవారికి రాచ మార్గం యూనివర్సిటీక్యాంపస్: చిత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించాడు. టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించినందువల్ల తనకు సీటు ఖాయం అనుకున్నాడు. అయితే టీటీడీ ప్రకటించిన మెరిట్లిస్టులో అతనిపేరు లేదు. అతని కన్నా తక్కువ మార్కులు వచ్చిన, 50 శాతం మార్కులు సాధించిన వారికి సీట్లు వచ్చాయి. తనకు మాత్రం రాలేదు. సీటు ఎందుకు రాలేదని సంబంధిత కళాశాలకు వెళితే అంతా ఆన్లైన్ తప్పిదమే..తప్ప తమది కాదని తప్పించుకుంటున్నారు. జాబితాలో సదరు అభ్యర్థి దరఖాస్తు కూడా లేకపోవడంతో సీటు రాక నిరాశకు గురయ్యాడు. ఇదీ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. టీటీడీ విద్యాసంస్థల్లో అత్తెసరు మార్కులు పొందినవారు రాచ మార్గంలో సీట్లు పొందుతున్నారు. దీంతో వారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సీటు పొందని వారికి రెండో విడతలో అడ్మిషన్ ఇస్తామంటున్నారు. తీరా చూస్తే వారి దరఖాస్తులు కనిపించడంలేదు. దీంతో ఆ విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ విధానం అమలు కోసం టీటీడీ రూ.20 లక్షల వ్యయం చేసి, ఓ సాఫ్ట్వేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అడ్మిషన్ల వ్యవహారంపై ఈ సంస్థ ముందస్తు చర్యలు తీసుకోలేదు. అలాగే సాంకేతిక సమస్యలు తలెత్తితే సరి చేసేందుకు, ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతినిధిని నియమించలేదు. దీంతో తప్పులు దొర్లి విద్యార్థులు నష్టపోతున్నారు. 22 తర్వాత దరఖాస్తులు పరిశీలించిన అధికారులు టీటీడీ ఆన్లైన్ విధానం ప్రకారం గత జూన్ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు ఊంజల్పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని వేంచేపుగా ఆలయం నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. తదుపరి సర్వాంగ సుందరంగా అలంకృతుడైన స్వామివారు హనుమంతునిపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమాల్లో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు రవి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. నేడు గరుడ సేవ.. అవతారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి 7.15గంటలకు సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 2గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30గంటలకు ఊంజల్సేవ నిర్వహించనున్నారు. -
ఆదర్శం... అపహాస్యం !
విజయనగరం అర్బన్: గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ (ఆదర్శ) స్కూల్స్ వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండుడగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన ఆదర్శ పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నాయి. నాణ్యమైన బోధనలు అందక పాఠశాలస్థాయిలో విద్యార్థులు వెనుతిరుగుతున్నారు. అదే విధంగా ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాల్లో అధికవేతనాలిచ్చిన బోధన, బోధనేతర సిబ్బందితో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు ఆ పేరునే అపహాస్యం చేస్తున్నాయి. బోధన ప్రమాణాలు లేక.. జిల్లాలో 16 మండలాల్లో మూడేళ్ల క్రితం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ బోధన అందుతుందని, అర్హతగల టీచర్లను నియమించారని, బోధనాప్రమాణాలు బాగుంటాయని తొలి రెండేళ్లు వీటిలో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడ్డారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ లోపంతో కొన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల బోధన ప్రమాణాలు దిగజారాయి. దీంతో పాఠశాల నుంచి వెనుతిరిగే విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరిగింది. 16 పాఠశాల నుంచి పాఠశాలలోని 6, 7, 8, 9వ తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులు పాఠశాలలను వీడారు. జిల్లా కేంద్రంలోని విజయనగరం మోడల్ స్కూల్ నుంచి అత్యధికంగా 25 మంది వరకు పాఠశాలను విడిచిపెట్టారు. టీసీల కోసం దరఖాస్తులు చేసిన వారు ఇంకా ఉన్నారు. అదే విధంగా ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసిన వారంతా చేరడం లేదు. కళాశాలల్లో ప్రధానమైన సబ్జక్టులకు అధ్యాపకుల కొరత ఉండడంతో ప్రవేశాలకు ముందుకు రావడం లేదు. ఇంటర్ మొదటి సంవత్సరానికి ఒక్కొక్క గ్రూప్కి 20 మంది చొప్పున నాలుగు గ్రూప్లకు 80 మంది విద్యార్థులను చేర్చుకునే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలోని 16 పాఠశాలల్లో 1,280 సీట్లకు ప్రవేశాలు కల్పించవచ్చు. తొలి ఏడాది 2013-14లో ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ మినహా మిగిలిన గ్రూపులకు వెయ్యి మంది వరకు దరఖాస్తులు చేసుకోగా కేవలం 700 మంది మాత్రమే ప్రవేశాలకు ముందుకొచ్చారు. కళాశాలలకు వెళ్లాక బోధన సిబ్బంది కొరత కారణంగా వీరిలో 50 శాతం మంది రెండవ సంవత్సరం అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇంటర్ బోధనలు చేపట్టే పీజీటీ అధ్యాపకుల కొరత ఒకవైపు పట్టిపీడిస్తుంటే... మరో పక్క కళాశాల నిర్వాహణపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్కూళ్లపై రాష్ట్ర విద్యాశాఖకు పూర్తి స్థాయిలో అధికారాలు ఉండవు. దీంతో సంబంధిత ప్రిన్సిపాళ్లు పాఠశాల అభివృద్ధి పై శ్రధ్దచూపడం లేదనే తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుల, ఉపాధ్యాయుల మధ్య విభేదాలతో బోధన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని వాపోతున్నారు. గెస్ట్ అధ్యాపకులేరి..? బోధనా సిబ్బంది కొరత ఉన్న పాఠశాల్లో గెస్ట్ అధ్యాపకులను వేసుకొనే వెసులుబాటు సంబంధిత ప్రిన్సిపాళ్లుకు ఉంది. ప్రాధాన్యత ఉన్న ఖాళీల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్ అధ్యాపకులను నియమించుకోవచ్చు. ఆ మేరకు పాఠశాల స్థాయిలో ఆర్ధిక లావాదేవీల్లో వెలుసుబాటు కల్పించారు. జిల్లాలో 16 పాఠశాలలకు బోధన సిబ్బంది 320 మంది అవరసం కాగా, 228 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. వీటిలో 7 కళాశాలలకు ప్రిన్సిపాళ్లతో పాటు 48 పీజీటీలు, 37 టీజీటీలు ఖాళీలున్నాయి. ప్రాధాన్యతగల ఇంటర్ ఎంపీసీలోని మాథ్స్ పీజీటీలో అధికంగా ఉన్నాయి. దీంతో ఇంటర్మీడియట్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. కంప్యూటర్ సామాగ్రి ఉన్నా.. ఒక్కో పాఠశాలకు ఏడు కంప్యూటర్లు గత ఏడాది మొదటి నెలలోనే సరఫరా చేశారు. స్థానిక విజయనగరం మోడల్ స్కూళ్లో ఏడాది గడిచినా కంప్యూటర్లను గదుల్లో పెట్టకుండా స్టోర్ రూంలోనే ఉంచారు. కంప్యూటర్ విద్యను బోధించే ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలకు ఉన్నారు. పాఠశాలల్లో వంటగది, అందుకు సంబంధించిన డైనింగ్ హాల్లు ఉన్నప్పటికీ పలు పాఠశాలల్లో ఆరుబయటే వంటలు సాగుతున్నాయి. -
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర ఇంటర్ బోర్టు కార్యాలయంలో ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 66.23, సెకండియర్ లో 42.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. విభాగాల వారీగా ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. సీనియర్ ఇంటర్ జనరల్ సీనియర్ ఇంటర్ ఒకేషనల్ జూనియర్ ఇంటర్ జనరల్ జూనియర్ ఇంటర్ ఒకేషనల్ -
టాప్ రే!
ద్వితీయ ఇంటర్ ఫలితాల్లోనూ రంగారెడ్డిదే అగ్రస్థానం రెండో స్థానంలో మళ్లీ హైదరాబాదే ఈసారీ బాలికలదే హవా సిటీబ్యూరో: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లోనూ జంట జిల్లాల విద్యార్థులు జయభేరి మోగించారు. మొదటి సంవత్సర ఫలితాల మాదిరిగానే విజయ పరంపర కొనసాగించారు. సోమవారం విడుదలైన ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో 75 శాతం, హైదరాబాద్ జిల్లాలో 64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా రెండు జిల్లాల్లోనూ బాలికలే అధిక మార్కులు సాధించారు. -
పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్
తిరుచానూరు : ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాల్లో పేద రైతు కొడుకు... రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన నల్లపూసల శంకర్రెడ్డి, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 తెచ్చుకుని, స్టేట్ ఫస్ట్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి తండ్రి శంకర్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తపరిచాడు. -
మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. విద్యార్థులు మే 1లోగా దరఖాస్తు చేసుకుని, పరీక్ష ఫీజు చెల్లించాలని, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేసింది. వొకేషనల్ కోర్సుల కు సంబంధించిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సిన పాత విద్యార్థులు ఈ ఒక్కసారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పరీక్షలు రాయవచ్చు. జనరల్ కోర్సులకు సాధారణ ఫీజు రూ. 300, వొకేషనల్ కోర్సులైతే రూ. 400తోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ. 100 చొప్పున చెల్లించాలని బోర్డు పేర్కొంది. కాగా, విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1లోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్కు ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్ కమ్ జవాబుపత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున చెల్లించాలి. మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్ష ఫీజులను చెల్లించవచ్చు. ఎథిక్స్, మానవీయ విలువలపై పరీక్షను జూన్ 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 9న నిర్వస్తారు. వొకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. -
ఈసారి కూడా బాలికలదే హవా..
-
ఈసారి కూడా బాలికలదే హవా..
హైదరాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు కన్నా బాలికల ఉత్తీర్ణత 16శాతం ఎక్కువగా ఉంది. ఒకేషనల్ కోర్సులో కూడా బాలికలే ప్రథమంగా నిలిచారు. మరోవైపు ఫలితాల్లో 71 శాతంతొ రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉండగా, 43 శాతంతో నల్గొండ జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 26 నుంచి మార్కుల జాబితా పొందవచ్చు. -
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ మార్కులను, గ్రేడ్లను వెబ్సైట్లలో పొందవచ్చు. 4,31,361మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,39,954 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.62శాతం నమోదు కాగా, బాలికలు 61.68%, బాలురు 49.60% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఫీజు కట్టాల్సిన చివరి తేదీ మే 1. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఒకేషనల్లో మొత్తం 53.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేడు ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు
-
నేడు ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఫలితాల విడుదల తరువాత విద్యార్థులు తమ మార్కులను/గ్రేడ్లను www.sakshieducation.comతో పాటుwww.examresults.ts.nic.in, www.results.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. మార్చిలో 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రధాన పరీక్షలను నిర్వహించినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,73,237 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,06,789 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను పొందే మరిన్ని సదుపాయాలు.. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్ ద్వారా 1100 (పరిష్కారం కాల్ సెంటర్) నంబరుకు, మరే ఇతర ల్యాండ్ఫోన్/మొబైల్ ద్వారా 18004251110 నంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు. అలాగే ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, ఈసేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ పొందవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా.. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబరు టైప్ చేసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. అన్ని రకాల వినియోగదారులు ఇంటర్మీడియెట్ జనరల్ ఫలితాల కోసం ఐపీఈ2 అని టైప్ చేసి (క్యాపిటల్ లెటర్స్) స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరు ఎస్ఎంఎస్ పంపించి పొందవచ్చు. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరుకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలను పొందవచ్చు. ఏపీజేఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్టికెట్ నంబరు టైప్ చేసి 56767999 నంబరుకు ఎస్ఎంఎస్ పంపవచ్చు. ఒక్క హాల్టికెట్ నంబరునే టైప్ చేసి 57272 నంబరుకు ఎస్ఎంఎస్ పంపొచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు ఏపీ12హాల్టికెట్ నంబరు టైప్ చేసి 52070 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించాలి. అన్ని రకాల వినియోగదారులు ఏపీ12హాల్టికెట్ నంబరు టైప్ చేసి 58888 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఐపీఈజీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్టికెట్ నంబరు టైప్ చేసి 5676750 (జనరల్ విద్యార్థులు) ఎస్ఎంఎస్ పంపించాలి. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్టికె ట్ నంబరు టైప్ చేసి 5676750 ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలను పొందవచ్చు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
విశాఖపట్నం: ఇంటర్మీడియెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రశ్నపత్రం విద్యార్థుల చేతిల్లో ఉంటుంది. ఎలాంటి ప్రశ్నలు వస్తాయోనని విద్యార్థుల ఆందోళన. ఏర్పాట్లల్లో లోపాలేమన్నా ఉన్నాయేమోనని అధికారులు ఆందోళనల మధ్య పరీక్ష ప్రారంభం కానుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటకీ నిర్వహణలో లోపాలు ఏటా వెలుగుచూస్తున్నాయి. జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కొరత వెంటాడుతుంది. రవాణ సమస్యల వల్ల ఏజెన్సీ, రూరల్ క ళాశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయినా కళాశాల యాజామాన్యాల బాధ్యతరాహిత్యంతో నేల పరీక్షలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది నేలబారు పరీక్షలు ఉండకూడదని అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అవసరమైతే పరీక్ష కేంద్రాల్లో అద్దె ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 111 పరీక్షకేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచి 50,279 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కోర్సు నుంచి 46,552 మంది, ఒకేషనల్ నుంచి 3,427 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 24,040, బాలురు 25,373 మంది ఉన్నారు. ఏజెన్సీలోని సమస్యాత్మకమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద జీపీఎస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ మాస్కాపీయింగ్ను అరికట్టడానికి ఈ జీపీఎస్ సిస్టమ్వినియోగిస్తున్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణకు అయిదు సిట్టంగ్ స్క్వాడ్, నాలుగు ఫై ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. వీరితో పాటు రెవిన్యూ, ఆర్ఐవో, డీవీఈవో, ఆర్జేడీ అబ్జర్వ్ బందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. 8గంటలకే చేరుకోవాలి.. : ఇంటర్ విద్యార్థులు ఉదయం 8గంటలకే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. హాల్టికెట్ మరిచిపోకుండా తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. హాల్టికెట్తో పాటు గుర్తింపు కార్డు ఉండాలి. ముందుగా విద్యార్థి హాల్టికెట్ న ంబర్కు కేటయించిన గదిని వెతకాలి. పరీక్షగదికి వెళ్లి అక్కడ విద్యార్థి నంబర్ ఉందోలేదో పరిశీలించి లేకపోతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్ లేదా డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. పరీక్షాగదిలో ఓఎంఆర్ సీట్ను జాగ్రత్తగా పూరించాలి. ఆన్సర్సీట్ తనిఖీ చేసి 25 పేజీలుంటే జవాబులు రాయాలి. ప్రశ్నాపత్రం ఒకటికి రెండుధపాలు పరిశీలించి పరీక్ష రాయాలి. పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు... ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేశాం. చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. ఇన్విజిలేటర్లతో సమావేశమై బోర్డు నిర్దేశించిన ఆదేశాల గురించి చర్చించాలని ఆదేశాలు జారీ చేశాం. పరీక్షగదిలోకి సెల్ఫోన్లు ఇతర ఎలాక్ట్రినిక్ వస్తువులు ఎవరు తీసుకెళ్లిన చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఫర్నిచర్ కొరత ఉన్న పరీక్షాకేంద్రాలకు అద్దె కుర్చీలు వేయాలని సూచించాం. విద్యార్థులకు కేంద్రాలకు చేరుకునేలా బస్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులకు కోరాం. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసే విదంగా చర్యలు తీసుకున్నాం. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చర్యలు తీసుకున్నాం. జీపీఎస్ సిస్టం కూడా అమలు చేశాం. పరీక్షాకేంద్రాల ప్రధాన గేటు వద్దే విద్యార్థులకు తనిఖీలు నిర్వహించి పరీక్ష గ దిలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశించాము. కాబట్టి విద్యార్థులు 8గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. స్లిప్పులు, ముబైల్ ఫోన్లు తీసుకొచ్చిన విద్యార్థులను డిబార్ చేస్తాం. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. - ఎల్జె జయశ్రీ. ఆర్ఐవో సమస్య ఉంటే కంట్రోల్ రూం పరీక్షాకేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా బోర్డు కార్యాలయంలో కంట్రోల్రూమ్కు తెలియజేయాలి. డెక్ కన్వీనర్ల పేరుతో త్రిమెన్ కమిటీ ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. హాల్ టికెట్లు అందకపోయినా, హాల్టికెట్లల్లో తప్పులు పడిన, పరీక్షహాల్లోకి అనుమతి ఇవ్వకపోయినా వెంటనే డెక్ కన్వీనర్లకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. డెక్ కన్వీనర్లు పి.విలాసమూర్తి-94405 20773, బి.సుజాత-94909 43643, ఉగాదినాయుడు-9985050830 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. సిటీ బస్సులు రెడీ ఇంటర్మీడి యెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బుధవారం నుంచి ఆర్టీసీ సిటీ బస్సులను సిద్ధం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలకు జరగనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 7.45 గంటల నుంచి ప్రతి బస్స్టాప్ వద్ద బస్సులు ఏర్పాటు చేస్తున్నామని విశాఖ రీజయన్ చీఫ్ ట్రాఫిక్ డిప్యూటీ మేనేజర్ (అర్బన్) ఎ.వీరయ్యచౌదరి తెలిపారు. విశాఖలోని 104 సెంటర్లకు బస్ సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. -
ఇంటర్ పరీక్షకు భారీగా గైర్హాజరు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర పరీక్షల మొదటిరోజు భారీ సంఖ్యలో విద్యార్థులు గైర్హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈసారి 75 శాతం హాజరు లేని విద్యార్థులకు హాల్టికెట్లను ఇచ్చేందుకు నిరాకరించడమే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జనరల్, వొకేషనల్ అభ్యర్థులు 4,94,401 మంది పరీక్ష కోసం నమోదు చేసుకోగా తెలంగాణలోని 10 జిల్లాల్లోనే 37,138 మంది విద్యార్థులు హాజరుకాలేదు. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు మొదటి రోజు 65,814 మంది గైర్హాజరు కాగా, ఈసారి 10 జిల్లాల నుంచే 37,138 మంది గైర్హాజరు కావడం గమనార్హం. ప్రైవేటు కాలేజీల్లోనే కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో కూడా 75 శాతం హాజరు లేని విద్యార్థులకు హాల్టికెట్లను నిరాకరించినట్లు తెలిసింది. ఇక జిల్లాల్లో సజావుగా పరీక్షలు జరిగాయి. కొన్ని చోట్ల వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల ఒకే కేంద్రాన్ని ఎక్కువ మంది విద్యార్థులకు కేటాయించడం వల్ల విద్యార్థులు పక్కపక్కనే కూర్చొని పరీక్షలు రాసినట్లు సమాచారం. ఉదయం 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించబోమన్న బోర్డు ఆదేశాల నేపథ్యంలో కొన్ని చోట్ల విద్యార్థులు హాజరు కాలేకపోయినట్లు సమాచారం. దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డుకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం 9 గంటల తరువాత 5 నిమిషాల వరకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేసి డీబార్ చేశారు. -
ఆ విద్యార్థులకూ న్యాయం
హైదరాబాద్: కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల హాల్టికెట్లు పొందలేకపోయిన విద్యార్థులకు ఊరట కల్పించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజులను చెల్లించినప్పటికీ యాజమాన్యాలు చేసిన తప్పు వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూసేలా నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థుల దరఖాస్తులు తీసుకొని హాల్టికెట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ తెలిపారు. గతంలోనే ఫీజులు చెల్లించినట్లు ఆధారం చూపించిన వారి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ పొరపాటు లేని విద్యార్థులకు అన్యాయం జరగొద్దని, వారు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పరిస్థితిని బట్టి ఆలస్య రుసుము ఈ విషయంలో బోర్డును ఆశ్రయించిన యాజమాన్యాల నుంచి విద్యార్థుల పరీక్ష ఫీజులు, ఆలస్య రుసుము, దరఖాస్తులు తీసుకొని హాల్ టికెట్లు ఇవ్వాలని ఆదివారం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక్కో విద్యార్థికి సంబంధించిన పరీక్ష ఫీజును ఆలస్యంగా చెల్లింపు కారణంగా యాజమాన్యాలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల చొప్పున ఆలస్య రుసుము విధించింది. ఈ మేరకు బోర్డును ఆశ్రయించిన యాజమాన్యాల నుంచి పరీక్ష ఫీజు, ఆలస్య రుసుముతోపాటు దరఖాస్తులను స్వీకరించి అప్పటికప్పుడే హాల్టికెట్లు ఇచ్చేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. గతంలో పరీక్ష రాసి, ఫెయిలైన ప్రైవేటు విద్యార్థుల దరఖాస్తులైతే రూ. 5 వేలు చొప్పున, రెగ్యులర్ విద్యార్థుల దరఖాస్తులైతే రూ. 10 వేల చొప్పున యాజమాన్యాలకు జరిమానా విధించి దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజులను యాజమాన్యాలకు విద్యార్థులు సకాలంలోనే చెల్లించినా, ఆ ఫీజులను ఇంటర్బోర్డుకు జమ చేయకుండా, ఆన్లైన్లో ఆ విద్యార్థుల దరఖాస్తులను బోర్డుకు పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై చర్యలు చేపట్టింది. ఆలస్య రుసుము/జరిమానా చెల్లించి హాల్టికెట్లు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. కానీ యాజమాన్యాలకే పరీక్ష ఫీజులను చెల్లించని విద్యార్థుల విషయంలో తామేం చేయలేమని పేర్కొంది. పరీక్షలకు సర్వం సిద్ధం: నేటి నుంచి నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష హాల్లోకి వెళ్లాలని తెలిపారు. 9 గంటల తరువాత అనుమతించరని పేర్కొన్నారు. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తంగా 9,73,237 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. హాల్టికెట్లు అందని విద్యార్థులు, లేదా పోగొట్టుకున్న వారెవరైనా తమ వెబ్సైట్ నుంచి (ఠీఠీఠీ.ఛజ్ఛ్ట్ఛ్చీజ్చ్చ.ఛిజజ.జౌఠి.జీ) హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వారి పాత హాల్ టికెట్ నంబరు లేదా పదో తరగతి హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చని వివరించారు. -
వాట్ నెక్ట్స్
టెన్త్ తరువాత ఇంటర్... ఆపై ఇంజనీరింగో... డిగ్రీనో... ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో రొటీన్గా జరిగిపోతాయి. కానీ... డిగ్రీ తరువాత! పీజీ... అని ఠక్కున చెప్పలేం. తేల్చుకోవడం కష్టం. విజ్ఞానంతో పాటు వయసు, ఆలోచన, అన్నింటికీ మించి పరిస్థితుల ప్రభావం మన కెరీర్ను, ఇంకా చెప్పాలంటే లైఫ్ లైన్ను డిసైడ్ చేసే సందర్భం ఇదే. ఏ బాదరబందీ లేకుండా సరదాగా సాగిపోయే కాలేజీ డేస్ నుంచి ఒక్కసారిగా డైవర్షన్ తీసుకోవడం ఎవరికైనా ఇబ్బందే. సనత్నగర్ ‘హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్’ ఫైనలియర్ డిగ్రీ విద్యార్థినులను ఇదే ప్రశ్న వేస్తే... కొందరిలో ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్... ఇంకొందరిలో భవిష్యత్పై భయం... మరికొందరిలో ఏంచేయాలనే స్పష్టత... మొత్తానికి అంతా కలసి ‘వాట్ నెక్ట్స్’ అన్నదానికి ఓ కన్క్లూజన్ కోసం ప్రయత్నించారు. మనీష: డిగ్రీ తర్వాత పీజీ అనేది టెన్త్ తర్వాత కాలేజ్ అన్నంత ఈజీకాదు. శ్రీలత: అమ్మాయిలం కదా! డిగ్రీ తర్వాత జాబ్ చెయ్యాలా.. ఫర్దర్ స్టడీస్కి వెళ్లాలా.. లేదంటే ఇంట్లోవాళ్లు పెళ్లంటే.. మీ ఇష్టం అనాలా... డిసైడ్ చేసుకునే సమయం. రాజశ్రీ: అందరికీ ఫర్దర్ స్టడీస్కి వెళ్లాలని, లేదంటే జాబ్ చేయాలని ఉంటుంది. కానీ చాయిస్లన్నీ మాచేతుల్లో ఉండే వయసు కాదు కదా! ఇంట్లోవాళ్లు పెళ్లి తప్పదంటే! తేజ: ఏముంది... కుదరదు చదువుకుంటామనో, జాబ్ చేస్తామనో గట్టిగా చెప్పేయడమే. రాజశ్రీ: అందరి పరిస్థితులు ఒక్కలా ఉండవు కదా! నేను మాత్రం ఇంకా చదవాలనుకుంటున్నాను. మౌనిక: నేను మాత్రం జాబ్ చేయాలనుకుంటున్నాను. నేనే కాదు... ఇక్కడున్న నా స్నేహితురాళ్లు చాలామంది చాయిస్ కూడా అదే. నావరకూ నేను అప్పుడే జాబ్ సెర్చ్ మొదలుపెట్టేశాను. తేజ: మా ప్రియాంక అయితే ఆల్రెడీ మంచి జాబ్ కొట్టేసింది. ప్రియాంక: అవును... ఈ మధ్యనే నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. ధారాపటేల్: నేను మాత్రం ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ చదువుదామనుకుంటున్నా మాధురి: డిగ్రీ వరకూ అంటే పూర్తిగా తల్లిదండ్రులు మీద ఆధారపడి చదువుకుంటాం. ఆ తర్వాత కూడా అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నేను పార్ట్టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటున్నా. నందినిగాయిత్రి: నేను నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్ని. ఇంట్లోవాళ్లు చదువు, జాబ్, పెళ్లి ఏదైనా నా నిర్ణయమే తమదంటారు. శ్రీలత: నా చాయిస్ కూడా జాబే. దీక్షిత: ఏం జాబ్లో ఏమోనండి. బయట చాలా కాంపిటీషన్ ఉంది. చాలామంది అమ్మాయిలు డిగ్రీ అవ్వగానే సర్టిఫికెట్స్ పట్టుకుని ఇంటర్వ్యూలకు రెడీ అయిపోతున్నారు. అబ్బాయిలు కూడా ఉంటారు కదా! మయూరి: ఇప్పుడు కాలేజీలో కూర్చుని ఇలా ఎన్ని కబుర్లయినా చెప్పుకోవచ్చు. ఇంటికెళ్లాక మన పెద్దవాళ్ల మాటలు విన్నాక చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద చదువులా... పెళ్లా అన్నదగ్గర! మౌనిక: కాంప్రమైజ్ అనే పదం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. బదర్ సుల్తానా: అమ్మాయి అంటేనే కాంప్రమైజ్ అని అర్థం కదా! స్కూల్లో ఉన్న ఆలోచనలు కాలేజీకి వచ్చాక మారిపోతాయి. కాలేజీలో ఉన్న ప్లానింగ్ డిగ్రీకొచ్చాక ఉండదు. డిగ్రీ పూర్తయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అమ్మానాన్నల ప్లానింగ్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కరిష్మా: ఆ మాట అనాల్సింది అమ్మాయిలు కదా! మనకెందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతోంది! (నవ్వుతూ) మౌనిక: అఫ్కోస్... మా ఉమెన్ కాలేజీలో మాతో కలిసి చదువుతున్న ఒకే ఒక అబ్బాయి తేజ. (నవ్వుతూ) మల్లీశ్వరి: కాలం మారిందండి. పేరెంట్స్ చాలావరకు మాకే చాయిస్ ఇస్తున్నారు. సౌమ్య: ఎంత చాయిస్ ఇచ్చినా ఒక వయసొచ్చాక.. చాలావరకూ ఇంటి పరిస్థితులను బట్టే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. -
ఆసరాకు కొత్త అర్థం
అవయవాలు అన్నీ ఉన్నా ఏ పని చేయకుండా ఇతరుల నుంచి సాయం ఆశించేవారున్న ఈ సమాజంలో పుట్టుకతో చేతులు లేకపోయినా... అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూన్న ఈమె మనోనిబ్బరం ముందు శారీరక వైకల్యం సైతం తలవంచక తప్పలేదు. ఆమె గురించి చదవడమంటే ఆసరాకు కొత్త అర్థాన్ని తెలుసుకోవడమే! - తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్కు చెందిన కీసరి సమ్మయ్య, కోమల కూతురు రజిత (34). పుట్టుకతోనే చేతులు లేకపోయినా కాళ్లతోనే పలకా బలపం పట్టి ఇంటర్ వరకు చదివింది. చేతులు లేవన్న మాటే తప్ప రజిత అన్ని పనులను సాధారణ మనుషులకంటే చక్కగా చేయగలదు. కాళ్లతోనే కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, కుట్లు, అల్లికలు వంటి అన్ని పనులను అద్భుతంగా చేయగలదు. కాలితోనే ఫోన్ను ఆపరేట్ చేయగలదు. రజితలో ఉన్న ప్రతిభను గుర్తించిన కొన్ని స్వచ్ఛందసంస్థలు ముందుకు వచ్చి ఆమెను ప్రోత్సహించాయి. దానితో నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్లో నిర్వహించిన ప్రత్యేక కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో చేరి కాళ్లతోనేకీబోర్డు, మౌస్లను ఆపరేట్ చేస్తూ సాధారణ విద్యార్థులతో పోటీపడి నెలరోజుల వ్యవధిలోనే ఎంఎస్ ఆఫీస్, వర్డ్ కోర్సులను నేర్చుకుని సర్టిఫికేట్ సాధించింది. సాయం చేసే చేతులు సాటివారికి సాయం చేయాలనే తలంపుతో చిన్నప్పటి నుంచి స్కౌట్స్లో చేరింది. వివిధ కాం్యపుల్లో వలంటీర్గా పని చేసి నాలుగుకు పైగా ప్రశంసాపత్రాలను పొందింది. ఆ సేవాగుణంతోనే అందరికీ ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకుంది. అప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారని ఐదోకాన్పులో జన్మించిన ఆడబిడ్డ మాకు వద్దు అనుకుంటున్న ఓ తల్లిదండ్రులను సంప్రదించి వారి నుంచి ఐదోబిడ్డను దత్తత తీసుకుని, ఆ బిడ్డకు అన్నీ తానై పెంచుతోంది రజిత. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివినా, తనబిడ్డను కాన్వెంటుకు పంపుతోంది. ఎండమావి ‘నీ పరిస్థితి మొత్తం నాకు తెలుసు. నిన్ను అర్థం చేసుకున్నాను. నీకు జీవితాంతం తోడు ఉంటాను’ అంటూ 2007 ఆదర్శవివాహం పేరుతో ఓ వ్యక్తి రజిత జీవితంలోకి ప్రవేశించాడు. ఏడాది పాటు సజావుగా కాపురం చేశాడు. తాగుడుకు బానిసై ఉన్నట్టుండి ఓ రోజు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటికే వారికి సాత్విక అనే పాప ఉంది. ఓవైపు తన ఇద్దరు పిల్లలు, మరోవైపు వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత రజితపై పడింది. ఆదుకోని ప్రభుత్వం వికలాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకు రజితను ఆదుకోలేదు. ‘ఏదైనా చిన్నవ్యాపారం పెట్టుకుంటాను లోన్ ఇప్పించమంటూ’ పదోతరగతి పాస్ అయ్యాను, కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి ఇంత ఆసరా చూపండ’ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చుట్టూ తిరిగింది. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటూ చెప్పేవారే తప్ప సాయం అందలేదు. దాంతో కుటుంబపోషణకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కాళ్లకు చక్రాలు వికలాంగులకు రైల్వేశాఖ పాస్లు ఇస్తుంది. దానిప్రకారం వికలాంగులు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వారికి తోడుగా వచ్చే వారికి టికెట్ చార్జీలో సగం మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి నెలకు రూ. 500 ిపింఛను తప్ప ఏ ఆధారం లేని రజితకు ఈ రైల్వేపాసే ఆధారం అయ్యింది. పొద్దున్నే ఉదయం ఎనిమిదిగంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ చేరుకుని హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ఎదురు చూసేది. ‘మీ టికెట్ చార్జీలో సగం నాకిస్తే చాలు, మీరు రైలులో ప్రయాణం చేయొచ్చు. మీకు సీటు కూడా ఆపి ఉంచాను. నాతో రండి’ అంటూ బతిమాలుతూ... ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లలో తిరిగేది. ఇలా రోజుకు రూ 100 నుంచి రూ 200 సంపాదిస్తూ కొంతకాలం కుటుంబాన్ని పోషించింది. అయితే దురదృష్టవశాత్తుజరగరానిది జరిగితే తనపై ఆధార పడ్డ నలుగురికి ఉన్న ఒక్క ఆధారం పోతుందనే భయంతో ఈ పనిని ఇటీవలే మానేసింది. ఓ ఆధారం ఉంటే బాగుండు పిల్లలందరూ దైవంలా భావించే పుస్తకాలను తాను కాలితో తాకడం, దానితోనే చదవడం చేస్తుంటే తోటిపిల్లలు ఈసడింపుగా చూసేవారు. ఆటోలో ప్రయాణించినప్పుడు డ్రైవర్లకు కాళ్లతో డబ్బులు ఇస్తుంటే చాలామంది డ్రైవర్లు అదోలా చూసేవాళ్లు. కుటుంబాన్ని పోషించేందుకు నిత్యం రైళ్లలో తిరుగుతుంటే పాస్ను దుర్వినియోగం చేస్తున్నావంటూ టీసీలు తిట్టేవారు. ఇలా అవమానాలు ఎదుర్కొంటూనే నా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నా. కొత్తగా ఏమైనా నోటిఫికేషన్లు విడుదలైతే రాత పరీక్ష ద్వారా ఉద్యోగం పొందాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. అంతవరకు నా చదువు, ప్రతిభ చూసి ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పిస్తే నా పిల్లల పోషణ బాధ్యతకు ఏ లోటు ఉండదు’’ అని చెబుతున్న రజిత దీనగాథను ఎవరైనా జాలిగల వారు... మంచి మనసున్న వారు ఒక్కరైనా చెవిన వేసుకుంటే ఆమె కష్టాలు కొన్నైనా గట్టెక్కుతాయేమో! -
ప్రాక్టికిల్స్
ఇంటర్, డిగ్రీ ప్రయోగాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రయోగాత్మక పద్ధతిలో బోధిస్తే ఎలాంటి విద్యార్థులకైనా సులువుగా అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు... పరిశోధనల రంగం వైపు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు ప్రయోగాలు దోహదం చేస్తారుు. అలాంటి ప్రయోగాలు జిల్లాలో ప్రాక్టి‘కిల్స్’గా మారుతున్నారుు. జిల్లాలో విద్యాశాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇంటర్మీడియట్లో గానీ... డిగ్రీలో గానీ ఎవరూ ‘ప్రాక్టికల్’గా ఆలోచించడం లేదు. ప్రయోగశాలలు, పరికరాల కొరత.. వసతుల లేమి.. తక్కువగా ఉన్న సైన్స్ విద్యార్థుల సంఖ్య వెరసి ప్రయోగశాలలు నిష్ర్పయోజనంగా మారడంపై ‘సాక్షి’ ఫోకస్.. ఎంసెట్లో ప్రవేశాలకు ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీ ఉంది. ఇందులోనూ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత కీలకం... మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాక్టికల్స్పై ఏళ్లకేళ్లుగా చిన్నచూపే మిగులుతోంది. పలు కళాశాలల్లో ప్రయోగశాలలు (ల్యాబ్ల), పరికరాల కొరత పీడిస్తుండగా... వసతుల లేమి వేధిస్తోంది. మరికొన్ని కాలేజీల్లో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో తూతూమంత్రంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సర్కారుతోపాటు ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇదే తంతు కొనసాగుతుండడం గమనార్హం. సంవత్సర పరీక్షలు సమీపిస్తేనే ప్రయోగాలు చేరుుంచడం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులకు అలవాటుగా మారింది. ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నారుు. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి 16,183 మంది ఎంపీసీ... 8,689 మంది బీపీసీ... మొత్తం 24,872 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నిష్ర్పయోజనంగా మారిన ప్రయోగాలపై ‘సాక్షి’ ఫోకస్.... ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో నిర్లక్ష్యం విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో బీపీసీ, ఎంపీసీ గ్రూప్కు సంబంధించి సైన్స్ విద్యార్థులకు బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో కొన్ని ప్రాక్టికల్స్ చేరుుంచాలి. కానీ, ఎక్కువ శాతం ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థులకు ప్రాక్టిల్స్ చేయించడం లేదు. మొత్తం సెకండియర్లోనే చేయిస్తున్నారు. అదీ... వార్షిక పరీక్షలు సమయానికి రెండు మూడు నెలల ముందు ఒక్కో సబ్జెక్టులో ముఖ్యమైన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం ల్యాబ్స్ ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఫీజులతోప్రయోగ పరికరాలు, కెమికల్స్ను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పలు ప్రభు త్వ కాలేజీల్లో పరికరాలు కొనుగోలు చేశారు... ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని కాలేజీల్లో సరియైన వసతులు లేక ప్రాక్టికల్స్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా... ఈ ఏడాది 30 కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, ల్యాబ్ వసతులు సరిగా లేకపోవడంతో 13 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా.... హసన్పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొంత కాలం హైస్కూల్లోనే నడిపారు. ఇప్పుడు కొత్తభవనం అందుబాటులోకి వచ్చింది. కానీ, ల్యాబ్ వసతి లేదు... పరికరాలు లేవు. ఈ మేరకు ఆ కాలేజీ సైన్స్ విద్యార్థులకు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తీసుకొచ్చి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ఇలా సుమారు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతోంది. గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సైన్స్ విద్యార్థులకు సరిపడా వసతులు లేవు. దీంతో సంగెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. జనగామ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లోనే కొనసాగుతోంది. సైన్స్ గ్రూప్లో తక్కువ మంది విద్యార్థులుండడంతో తరగతి గదిలోనే వీలునుబట్టి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయిస్తుంటారు. పరీక్షలకు మాత్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను కేంద్రంగా కేటాయించారు. మో‘ఢల్’ స్కూళ్లు... జిల్లాలో 29 మోడల్ స్కూళ్లల్లో ఇంటర్ విద్యార్థులు ఉండగా... ల్యాబ్ సౌకర్యాలు అంతంతమాత్రమే. కొన్నింటిలో ప్రధానంగా విద్యుత్, నీటి సౌకర్యం లేదు. మరి కొన్నింటిలో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆరు మోడల్ స్కూళ్ల (ములుగు ఘనపూర్, బచ్చన్నపేట, డోర్నకల్, చెన్నారావుపేట, గీసుకొండ, కేసముద్రం)ను ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలుగా కేటాయించారు. ఎరుుడెడ్... జిల్లాలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు ఏడు ఉండగా... నాలుగింటిని ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ‘ప్రైవేట్’లో అక్టోబర్, నవంబర్లోనే.. జిల్లాలో 242 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో ఎక్కువ శాతం కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు ఉన్నారుు. కానీ... పరీక్షలు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్, నవంబర్లో కొంతమేర ప్రాక్టికల్స్ను చేయిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో.... ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.... కొన్నింటిలో ల్యాబ్ వసతులు లేక సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జ్ఞానం అందకుండా పోతోంది. రంగశారుుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే కొనసాగుతోంది. బీఎస్సీ సైన్స్ విద్యార్థులు 16 మంది మాత్రమే ఉన్నారు. వీరికి హన్మకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. మరిపెడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కాలేజీలోనే నడుస్తోంది. ఇక్కడ కొన్ని గదుల్లో, మరో చోట కొన్ని గదుల్లో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం కలిపి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వీరికి ల్యాబ్ వసతి లేదు. తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని కొన్ని గదుల్లో నడిపిస్తున్నారు. సైన్స్లో 30మంది విద్యార్థుల వరకే ఉన్నారు. ల్యాబ్ వసతి లేదు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కళాశాలలోనే అసౌకర్యాల నడుమ షిఫ్ట్ సిస్టంలో కొనసాగిస్తున్నారు. 50 మంది విద్యార్థుల వరకు సైన్స్ విద్యార్థులున్నారు. సమస్యల నడుమ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలోనే పాలిటెక్నిక్ను కూడా కొనసాగిస్తుండడం కారణం. -
ఇంటర్ కుర్రాడి కిడ్నాప్ డ్రామా..!
ఖమ్మం క్రైం: ఓ కాలేజీ కుర్రాడు వేసిన ‘కిడ్నాప్ డ్రామా’... ఒకవైపు అతడి తల్లిదండ్రులను, మరోవైపు కళాశాల సిబ్బందిని, ఇంకోవైపు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసలేం జరిగిందంటే... ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం గ్రామానికి ఆ కుర్రాడి పేరు మధు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు రోజులాగానే మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత.. ‘‘అమ్మా, నాన్నా.. ఆరుగురు వ్యక్తులు వచ్చి నన్ను కళాశాల ముందు కిడ్నాప్ చేసి ఇన్నోవా వాహనంలో తీసుకెళుతున్నారు. నన్ను రక్షించండి. లేదంటే వాళ్లు నన్ను చంపేస్తారు’’ అంటూ, తన సెల్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడుతూ చెప్పాడు. ఆ తల్లిదండ్రులు తీవ్ర భయూందోళనతో రోదిస్తూ ఉరుకులు పరుగులతో కళాశాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో చెప్పారు. వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. ఆ కుర్రాడి తల్లిదండ్రులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఇంతలోనే మధు సెల్ నుంచి తల్లికి ఫోన్ వచ్చింది. ‘‘అమ్మా.. నన్ను కొడుతున్నారు... లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే పోలీసులు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్పై దృష్టి పెట్టారు. ఈ ఫోన్ కాల్సన్నీ నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి సెల్ టవర్ నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ఆ సెల్ పరిధిలోని ప్రాంతాల్లో టూటౌన్ సీఐ సారంగపాణి ఆధ్యర్యంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది కలిసి వెతుకుతున్నారు. ఈ లోపు మధు ఫోన్ నుంచే మరో ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లండి’’ అని, బెదిరింపు ధోరణిలో చెప్పాడు అవతలి వ్యక్తి. ఈ ఫోన్ కూడా ఇదే సెల్ టవర్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు నిర్థారించుకున్నారు. ఆ ‘కిడ్నాపర్లు’ ఇక్కడో ఎక్కడో ఉంటారనుకుని పోలీసులు తేల్చుకున్నారు. వెతకగా.. వెతకగా... బ్రిడ్జి దగ్గరలోని ముళ్ల పొదల్లో ఆ సెల్ ఫోన్ ఉన్నట్టుగా గమనించి, నెమ్మదిగా అక్కడకు వెళ్లారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. మరింతగా దగ్గరగా వెళ్లి చూశారు. ఏముంది...? ‘కిడ్నాపైన’ కుర్రాడు మధు అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు..! పోలీసులను చూడగానే అతడు కొన్ని క్షణాలపాటు అవాక్కయ్యూడు. ఆ వెంటనే ఏడుస్తూ.. ‘‘నన్ను కిడ్నాప్ చేసినవారు ఇప్పుడే వెళ్లారు’’ అని చెప్పాడు. అతడిని పోలీసులు స్టేషన్కు తీసుళ్లి విచారించారు. అంతా ఉత్తిదే.. డ్రామా ఆడా.. ‘‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అంతా ఉత్తిదే. నేనే కిడ్నాప్ డ్రామా ఆడా’’ అని, ఆ కుర్రాడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ‘‘నాకు ఎంపీసీ గ్రూప్ ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను’’ అని చెప్పాడు. కిడ్నాపర్ మాదిరిగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కూడా తానేనని, గొంతు మార్చి మాట్లాడానని చెప్పాడు. ఈ కుర్రాడు గతంలో కూడా ఇలాగే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులు చెప్పారు. అతడిని పోలీసులు గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే దండిస్తామని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని గంటలపాటు కలవరపాటుకు గురిచేసిన ఈ వ్యవహారం ఇలా సుఖాంతమవడంతో అందరూ హారుుగా ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంటర్ సంస్కృతం పేపర్-2లో మాతృభాషలో సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్న విద్యార్థులు పేపర్-2లోని ప్రశ్నలకు సమాధానాలను మాతృభాషలో రాసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్-2లోని 1, 2, 3 ప్రశ్నలకు విద్యార్థులు వారి మాతృభాష, లేదా వారు ఎంచుకున్న భాషలో సమాధానాలు రాయవచ్చని వివరించారు. 2015 మార్చి పరీక్షలనుంచి అమలయ్యే ఈ విధానం అయిదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. -
హాస్టల్ పైనుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
-
ముగిసిన ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
890 మందికి ప్రవేశాలు నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఉదయం 8గంటల నుంచే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండోరోజు అంతకుముందురోజు గైర్హాజరైన వారిలో ఒకరు రావడంతో అతనితో కలిపి మొత్తం 416మందిని కేటాయించగా అందులో 20మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 396మంది కౌన్సెలింగ్లో పాల్గొనగా, వారిలో నలుగురి అడ్మిషన్లు పెండింగ్పెట్టారు. మిగిలిన 392మందికి ప్రవేశాలు కల్పించారు. చివరిరోజు విద్యార్థులకు, వారితో పాటు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను చేశారు. మంచినీరు, ఉచిత భోజన వసతి కల్పించారు. 890 మందికి ప్రవేశం.... నూజివీడు ట్రిపుల్ఐటీకి 936మంది అభ్యర్థులను ఆర్జీయూకేటీ కేటాయించగా రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్లో 890మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రెండు రోజుల్లో 40మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరి ఉండవచ్చని ట్రిపుల్ఐటీ అధికారులు భావిస్తున్నారు. అనంతరం మిగిలిన సీట్ల భర్తీని వెయిటింగ్ లిస్టులో ఉంచిన అభ్యర్థులతో నింపనున్నారు. ఈ సీట్లకు 26,27తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టు యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నప్పటికీ వెయిటింగ్ లిస్టులో ఎంపికైన వారికి యూనివర్సిటీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్తో పాటు, ఓఎస్డీ రామకృష్ణారెడ్డి, పీఆర్వో వీరబాబు, ప్రొఫెసర్లు హనుమంతరావు, రామనర్శింహం, పర్యవేక్షించారు. సందేహాలను డెరైక్టర్ కార్యాలయ సిబ్బంది రాజగోపాలరెడ్డి, చెన్నారెడ్డి, రామకిషోర్ నివృత్తి చేశారు. కౌన్సెలింగ్లో దాదాపు 100మంది ట్రిపుల్ఐటీ సిబ్బంది విధులు నిర్వహించారు. అలాగే నూజివీడు ఏఎస్డబ్ల్యువో మేరీమాత, ఏబీసీడబ్ల్యువో జయరాజులు ఎస్సీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఓరియంటేషన్ తరగతులు ... ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్విద్యకు సంబంధించిన మొదటి సంవత్సరం తరగతుల్లో భాగంగా ఓరియంటేషన్ తరగతులు 28నుంచి ప్రారంభించనున్నట్లు డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ తెలిపారు. కౌన్సెలింగ్లో సీటు వచ్చిన విద్యార్థులందరూ తరగతులకు హాజరవ్వాలని పేర్కొన్నారు. సీటు లభించిన వారందరికీ గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. 29నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అవధుల్లేని సంతోషం...అంతులేని ఆనందం రోజువారీ కూలీ నాలీ పనులు చేసుకుని రోజులు గడిపే పేద కుటుంబాలకు చెందిన ప్రతిభ గల పిల్లలందరికీ .... ట్రిపుల్ఐటీలో సీట్లు లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రవేశాలు పొందిన వారిలో 85శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీలో సీట్లు పొందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు తమ మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు... ఎంతో ఆనందంగా ఉంది తల్లిదండ్రులు లేనప్పటికీ బాబాయి, మామయ్యల సంరక్షణలో చదువుకున్నా. జెడ్పీహైస్కూల్లో చదువుకోగా పదిలో 9.7జీపీఏ వచ్చింది. పేద కుటుంబమైనప్పటికీ ట్రిపుల్ఐటీలో సీటు రావడం ఎంతో సంతోషంగా ఉంది. - జి.అనిత, అనంతవరప్పాడు, గుంటూరు జిల్లా కల నెరవేరింది ట్రిపుల్ఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో చదివా. సీటు రావడంతో కల నెరవేరినట్లైంది. పదిలో 9.5జీపీఏ వచ్చింది. వ్యవసాయ కూలి కుటుంబం కావడంతో డబ్బులు పెట్టి చదివించే స్థోమత లేదు. ట్రిపుల్ఐటీలో సీటు రావడం ఒక రకంగా అదృష్టమే. - నూతక్కి జాన్సీరాణి, నూతక్కి. గుంటూరు జిల్లా ఉద్వేగంగా ఉంది ట్రిపుల్ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా, ఉద్వేగంగా ఉంది. తండ్రి తాపీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరోతరగతి నుంచి హైస్కూల్లో చదివా. పదిలో 9.7 జీపీఏ వచ్చింది. ఇంజినీరుగా బయటకు వచ్చి సమాజానికి సేవ చేస్తా. - మురికిపూడి ప్రవీణ, వినుకొండ నాన్న కల నేరవేరింది నా తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాజమండ్రిలోని మున్సిపల్ హైస్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్నా. పదిలో 9.5జీపీఏ వచ్చింది. ట్రిపుల్ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా తండ్రి కల నెరవేర్చా. - పమిడిపల్లి పూర్ణబాబు, రాజమండ్రి అమ్మ కష్టానికి ఫలితం మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ కూలిపనులు చేసుకుంటూ చదివించింది. మండపేటలోని జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్నా. పదిలో 9.7 జీపీఏ వచ్చింది. అమ్మ పడిన కష్టానికి ఫలితం దక్కింది. - కానూరు దుర్గాప్రసాద్, మండపేట ఉన్నత స్థానమే లక్ష్యం మా నాన్న ప్రసాద్ కూలిపనులకు వెళ్లి తెచ్చే నాలుగు కాసులతోనే ఇల్లు గడుస్తుంది. పదో తరగతి వరకు నర్సాపురంలోని హాస్టల్లో ఉండి చదువుకున్నా. పదిలో 9.7జీపీఏ వచ్చింది. ఇంజినీరింగ్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నదే లక్ష్యం. - కట్టా లావణ్య, శేరివేల్పూరు, గుడివాడ మండలం -
మొద్దు నిద్ర వదిలింది!
కనువిప్పు సప్త వ్యసనాలలో ‘అధికంగా నిద్రపోవడం’ అనేది ఉందో లేదో తెలియదుగానీ, నాకు మొదటి నుంచి పరిమితికి మించి నిద్ర పోయే అలవాటు ఉండేది. ‘కంటినిండా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది’ అని ఎక్కడైనా చదివినప్పుడల్లా... రెచ్చిపోయి మరింత నిద్రపోయేవాడిని. ఎప్పుడైనా ఉదయం లేవాల్సి వచ్చినప్పుడు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ రోజంతా డల్గా ఉండేది. ‘‘రోజూ పొద్దుటే లేవడం మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది’’ అని ఎవరో సలహా ఇవ్వడంతో నాలుగు రోజుల పాటు ప్రయత్నించానుగానీ నా వల్ల కాలేదు. మళ్లీ షరా మామూలే. లేటుగా నిద్ర లేచేవాడిని. ఇంటర్లో ఉన్నప్పుడు సిటీలో రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాడిని. రూమ్లో ఒక్కడినే ఉండడం వల్లే నేను ఎంత సేపు పడుకున్నా... ఎవరూ లేపే వారు కాదు. ఇదే నా కొంప ముంచింది. మరుసటిరోజు కెమిస్ట్రీ పరీక్ష రాయాలి. దీంతో చాలా సేపు చదువుకొని లేటుగా నిద్రపోయాను. ఎప్పుడో మెలకువ వచ్చింది. లేచి టైమ్ చూస్తే మధ్యాహ్నం కావొస్తోంది!! గుండెలో రాయిపడినట్లు అయింది. ఉత్తపుణ్యానికి పరీక్ష రాసే అవకాశం కోల్పోయాను. ఇక ఆరోజు నుంచి గట్టిగా అనుకున్నాను. ఆరునూరైనా ఆరు లోపల నిద్ర లేవాలని. నేను ఈ నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాలు దాటింది. ఎప్పుడూ ఆలస్యంగా నిద్ర లేవలేదు. ఉదయాన్నే లేవడం వల్ల చురుగ్గా కూడా ఉండగలుగుతున్నాను. - కె.శేఖర్, నిజామాబాద్ -
కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్, ఇంటర్ తర్వాత ఉజ్వల భవితను కోరుకునే విద్యార్థులకు వివిధ కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్ను నిర్వహించిందని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఈ కెరీర్ ఫెయిర్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆమె చెప్పారు. బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉలుమ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సాక్షి టీవీ నిర్వహించిన కెరీర్ ఫెయిర్కు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సుల్తాన్ ఉలుమ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ.. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉపాధి అవకాశాలున్న కోర్సులపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, ఈ దిశగా సాక్షి టీవీ యాజమాన్యం చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ఓయూ కెమిస్ట్రీ విభాగాధిపతి పార్థసారథి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే కెరీర్కు దోహదపడే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న సమాచారాన్ని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గాయత్రి అకాడ మీ చైర్మన్ పీవీఆర్కే మూర్తి మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో కెరీర్ ఫెయిర్లు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంపీసీ కోర్సు కన్నా, బైపీసీ కోర్సు చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వాసుదేవరావు మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు తయారు కావాలని, వారిని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనన్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరేందుకు కామర్స్ కోర్సులు ఎంతగానో దోహద పడతాయన్నారు. ఉద్యోగి స్థాయి నుంచి యజమాని స్థాయికి ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీ కోర్సు చక్కని సోపానమన్నారు. కార్యక్రమంలో బటర్ ఫ్లై ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శరత్చంద్ర, రిషీకేశ్ హంబే తదితరులు పాల్గొన్నారు. నేడు కూడా... సాక్షి కెరీర్ ఫెయిర్ను ఆదివారం కూడా కొనసాగించనున్నారు. ఇందులో దక్కన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ, ఈ మార్గ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఇక్ఫయ్ హయ్యర్ ఎడ్యుకేషన్, షైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రేవ్ ఇనిస్టిట్యూట్ , ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్స్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. ‘సాక్షి భవిత’ నిర్వహించిన కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. రెగ్యులర్కు భిన్నంగా ఇంటర్మీడియేట్ పూర్తయింది. సాక్షి కెరీర్ ప్రోగ్రామ్ ద్వారా రెగ్యులర్గా చదివే వాటికి భిన్నమైన కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇలాంటి ఉపయోగకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాక్షికి కృతజ్ఞతలు. - అభినవ్, ఇంటర్ అవగాహన పెరిగింది ఇంటర్ తర్వాత వేసే అడుగే కెరీర్కు ముందడుగు. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నాయని తెలిసింది. వాటిలో చేరితే ఎలాం టి అవకాశాలు వస్తాయో ఇక్కడ వివరించారు. - ఈశ్వర్, ఇంటర్ విభిన్న కోర్సులు తెలిశాయి ఇటీవలే టెన్త్ పూర్తయింది. తరువాత ఇంటర్ కాకుండా ఏంచేయాలన్నదానిపై అవగాహన కోసం ఇక్కడకు వచ్చా. విభిన్న కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. - నారాయణ, టెన్త్ -
ఇంటర్ బోర్డూ విభజన
తొలుత కమిషనరేట్లో విలీనం తర్వాత రెండుగా విభజన నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులు పాఠశాల విద్య, రాజీవ్ విద్యా మిషన్ విలీనం.. ఆగస్టు నాటికి అడ్వాన్స్డ్ పరీక్షల ప్రక్రియ పూర్తి రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకే మరికొన్నింటిపై తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్టు మరో ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూల్లో ఉన్నా.. అధికారులు మాత్రం బోర్డు విభజన ప్రక్రియ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్ను ఇంటర్ బోర్డులో కలిపేస్తారు. తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సేవలందించటానికి వీలుగా విభజిస్తారు. ప్రస్తుత బోర్డు నేతృత్వంలో ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఇంటర్ విద్య, ఇంటర్ బోర్డు ఒకే విభాగంగా, ఒకే అధికారి పరిధిలో పనిచేసేలా విలీనం చేస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ నాటికి వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు బోర్డులు ఏర్పాటవుతారుు. ప్రస్తుతం ప్రాథమిక విద్య, సెకండరీ విద్య కు వేర్వేరుగా విభాగాలు, ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇవి రెండూ ఒకే విభాగంగా, ఒకే ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పని చేస్తాయి. పాఠశాల విద్యా డెరైక్టరేట్ (డీఎస్ఈ), రాజీవ్ విద్యా మిషన్లు(ఆర్వీఎం) ఒకే విభాగంగా ఉంటాయి. పదో షెడ్యూల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలను విభజించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని కూడా విభజిస్తారు. ఆయా సంస్థల్లోని ఉద్యోగుల విభజన ప్రక్రియ చివరకు దశకు చేరుకుంది. ఎవరెవరూ ఏయే ప్రాంతాలకు చెందినవారు.. ఆయా సంస్థలను విభజించాల్సి వస్తే.. ఏయే రాష్ట్రాలకు ఏయే కేడర్లలో ఉద్యోగులు అవసరమనే పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. పదో షెడ్యూలులోని సంస్థల విభజనపై ఉన్నత స్థాయిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పది పరీక్షల పరేషాన్.. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడడం, జూన్ రెండు లోపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పూర్తవుతుంది. కానీ, పదో తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెల్లడించే అవకాశం ఉంది. దీంతో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఓ అవగాహనకు వచ్చి.. ఈసారికి కలిపి పరీక్ష నిర్వహించాలనుకుంటే రెండింటికి కలిపి ఒకటిగానే నిర్వహిస్తారు. వేర్వేరుగా నిర్వహించాలనుకుంటే ఎక్కడివక్కడే జరుగుతాయి. ఇంటర్, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మూల్యాంకనం మాత్రం ఎక్కడివి అక్కడే చేస్తారు. డీఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు అక్కడే ప్రస్తుతం ఉపాధ్యాయులు జిల్లాల ఎంపిక కమిటీల ద్వారా నియమితులైన వారే కాబట్టి ఏ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆ జిల్లాల్లోనే ఉండనున్నారు. విభజన ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల సేవల విషయంలో ఎలాంటి సమస్య లేదు. మొత్తం 3.16 లక్షల మంది టీచర్లలో తెలంగాణలో 1.40 లక్షల వరకుండగా, మిగతావారు సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నారు. అయితే వేర్వేరు జిల్లాల్లో డిప్యూటేషన్లు, హైదరాబాద్ వంటి జిల్లాల్లో ఓపెన్ కోటాకు మించి నియమితులైన వారి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
నేను... నేనేనా?!
కనువిప్పు మాకు మేము ‘పంచపాండవులు’ అని పేరు పెట్టుకొని ప్రతి తగాదాలో తలదూర్చేవాళ్లం. లెక్చరర్లను ఎదురించేవాళ్లం. ఒకసారి మా ఫ్రెండ్ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. సినిమాల ప్రభావమో ఏమిటోగానీ... గొడవలు పడడం, గొడవల్లో తల దూర్చడం. దీన్ని హీరోయిజంగా భావించేవాడిని. ఇంటర్ చదివే రోజుల్లో అయితే చదువు కంటే గొడవల మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మా గ్రూపులో మొత్తం అయిదుగు సభ్యులం. ఒకసారి మా ఫ్రెండ్ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. ఒక వారం తరువాత...ఆ రోజు నేను ఏదో పని ఉండి పక్క ఊరు నుంచి వస్తున్నాను. సమయం రాత్రి పది దాటింది. టీ స్టాల్ దగ్గర ఒక బ్యాచ్ కనిపించింది. మేము చావబాదిన సీనియర్ అందులో ఉన్నాడు. ‘వీళ్లు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?’ అని మనసులో అనుకొని వేరే రూట్లో వెళ్లే ప్రయత్నంలో ఉండగానే- ‘‘రేయ్ ఆగరా’’ అనే అరుపు వినిపించింది. నేను పారిపోబోతుండగా...అందరూ ఒక్కసారిగా వచ్చి నా మీద పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. రెండు వారాల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాను. కొంత కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు మా నాన్న కొన్ని పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టి ‘‘ఇవి చదువుకోరా. బోర్ కొట్టదు’’ అన్నారు. అవి ప్రముఖుల జీవిత చరిత్రలు. నా ఆసక్తిని గమనించి మరికొన్ని పుస్తకాలను తెచ్చిచ్చాడు నాన్న. ఆ పుస్తకాలు చదివిన తరువాత జీవితానికి సార్థకత లేకపోతే వృథా అనే భావన ఏర్పడింది. ఇక ఆనాటి నుంచి గొడవలు వదిలేశాను. చదువులో ముందున్నాను. ఇప్పుడు నన్ను ఎవరైనా పొగడుతుంటే ‘నేను నేనేనా?’ అనిపిస్తుంది! -వలస శేషుకుమార్, కాగజ్నగర్ -
మూల్యాంకనంలో తప్పులపై సీరియస్
మూల్యాంకనంలో తప్పిదాలపై విద్యాశాఖ సీరియస్గా ఉంది. కొందరి నిర్లక్ష్యంతో ఏటా ఎందరో విద్యార్థులు ఫెయిల్కావడం, తక్కువ మార్కులు పొందడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు గురువులపై గురిపెట్టాయి. ఒకటి, రెండు తప్పిదాలకు నోటీసులు జారీ చేయడం, అంతకన్న ఎక్కువ ఉంటే జరిమానాతో పాటు శాశ్వతంగా మూల్యాంకనం నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండేళ్ల నుంచి ఎస్ఎస్సీ బోర్డు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ బోర్డు అమలుపర్చనుంది. జంకుతున్న గురువులు స్పాట్వాల్యుయేషన్లో తక్కువ సమయంలో ఎక్కువ జవాబు పత్రాలు మూల్యాంకనం చే సి డబ్బులు దండుకోవాలనే వారికి ఇదీ చేదు వార్తే. విద్యార్థులు తమకెన్ని మార్కులు వచ్చాయో, చేసిన తప్పిదాలేంటో తెలుసుకోవడానికి ఆయా బోర్డులు జవాబు జిరాక్స్ పత్రాలు ఇస్తున్నాయి. ఇందులో తప్పుగా దిద్దినట్లు తేలితే విద్యార్థులు నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. పునఃపరిశీలనలో మార్కులు పెరుగుదలను బట్టి ఉపాధ్యాయులు, అధ్యాపకులపై చర్యలు ఉంటాయి. దీంతో మూల్యాంకనంలో పాల్గొనేందుకు గురువులు జంకుతున్నారు. 2012-13 మార్చి, ఏప్రిల్లో జరిగిన మూల్యంకనంలో జిల్లా వ్యాప్తంగా 102 మంది వరకు తప్పిదాలు చేశారు. ఇందులో ఏఈలు, సీఈలకు చిన్నతప్పిదాలకు పాల్పడ్డ వారికి తదుపరి మూల్యంకనానికి అనర్హులుగా ప్రకటించింది. ఐదు తప్పులు చేసిన ఏఈ, సీఈలకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధింపుతోపాటు వారికి ఎస్సెస్సీ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జరిమానా ఇలా.. పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలకు పాల్పడే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, జరిమానా విధిస్తారు. ఒకటి నుంచి ఐదు తప్పిదాలు చేసిన ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు, ఆరు నుంచి 10 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.200, 11 నుంచి 20 తప్పిదాలకు ఎగ్జామినర్ రూ.వెయ్యి, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.500, 21 నుంచి 30 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.1,500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.700, 30కి పైగా తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.2 వేలు, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు మూల్యాంకనం విధులు అప్పగించరు. ఈ సంవత్సరం ఇదే పద్ధతి ఇంటర్లో అమలుకానుంది. -
గుడ్డిగా నమ్మొద్దు!
వేదిక వృత్తిని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దు. నా విషయంలో నా తల్లిదండ్రులు చేసిన పొరపాటు అలాంటిదే. నేను ఇంటర్ చదువుతుండగా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట వచ్చిన సంబంధంలో అబ్బాయి చదువుకోలేదని మావాళ్లు ఒప్పుకోలేదు. రెండో సంబంధం అబ్బాయి చాన్నాళ్ల నుంచి పట్నంలో ఉన్నాడు...ఎలాంటి చెడు అలవాట్లుంటాయోనని వద్దన్నారు. ఇంతలో మా బంధువులబ్బాయి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడని, అబ్బాయి కూడా బాగానే ఉంటాడని మా మేనత్త చెప్పింది. కానీ అబ్బాయికి స్నేహితులెక్కువనీ, ఖర్చు కూడా ఎక్కువని మా నాన్న ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క బిడ్డను కావడంతో మావాళ్ళు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొనేవారు. ఇంతలో నాన్న స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి సిఐగా పనిచేస్తున్నాడనగానే మా నాన్న ఎగిరి గంతేశారు. ‘పోలీసంటే పెళ్లి తర్వాత మనమ్మాయి గురించి పూర్తిగా మరచిపోవచ్చు. ఎంచక్కా పోలీసాయన చేతిలో పెడితే ఏ గొడవా ఉండదు’ అన్నారు. అబ్బాయి ఎలా ఉంటాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది, కుటుంబం వివరాలు ఏమిటన్నది కనుక్కున్నారు. తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు...హడావిడిగా పెళ్లి చేసేశారు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఆయనకి పక్కజిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది. ఒకోరోజు ఇంటికి వచ్చేవారు కాదు. అదేంటంటే...డ్యూటీ అనేవారు. ఒకసారి క్యాంపు పని అని చెప్పి నాలుగురోజులు రాలేదు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి ‘సార్ ఉన్నారా మేడమ్...’ అన్నాడు. క్యాంపుకెళ్లారని చెప్పగానే ‘క్యాంపు ఏమిటి మేడమ్! సార్ సెలవులో ఉన్నారు కదా!’ అన్నాడు. అప్పుడిక అనుమానం వచ్చి ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. ఆయనకు చాన్నాళ్ల నుంచి ఒకమ్మాయితో అక్రమసంబంధం ఉంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇదే పని మరొక వ్యక్తి చేసుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించేదాన్ని. కానీ, పోలీసు వృత్తిలో ఉండి కూడా ఇలాంటి ఘోరాలు చేస్తే ఇంకెవరికి చెప్పాలి. పదిమందికీ రక్షణ కల్పించాల్సిన వాళ్ల గురించి చెడుగా చెప్పడానికి మనసు రావడంలేదు. కానీ, చేస్తున్న వృత్తుల్ని చూసి మోసపోకండని నలుగురి కళ్లు తెరిపించే ప్రయత్నం చేయాలని ఉంది. నాకు అసలు విషయం అర్థమైనట్లు ఇంకా నా భర్తకు తెలియదు. తెలిస్తే...నాకు భయపడి తను చేస్తున్న తప్పుని సరిదిద్దుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకే నా చదువుని కొనసాగింద్దామనుకుంటున్నాను. ఈ ‘వేదిక’ ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేదేమిటంటే...అబ్బాయి ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి బుద్ధిమంతుడై ఉంటాడనే అపోహల్లో ఉండకండి! - ఓ సోదరి, ఖమ్మం