koratala siva
-
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్నీల్తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన వికటకవి వెబ్సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్సిరీస్లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్డ్రాప్లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ప్రభాస్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్2పై అంచనాలు పెంచేసిన కొరటాల
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవర పార్ట్2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్లో అసలు కథ ఉంది. 100 శాతం చూస్తారు. సీట్ ఎడ్జ్లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది. అందరికీ మంచి ఫీల్ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..'ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవర విజయం వెనుక డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైంది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ.. మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడు నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం సమష్టి కృషితో దేవర మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్లో ఉండి నన్ను నడిపిస్తున్న కల్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. బృందావనం నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం.. ఒక దర్శకుడిగా కాదు.. సోదరుడిగా నాకు సపోర్ట్గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.ఇదీ చదవండి: 25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?దేవర సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యచరణ ప్రారంభించారట. ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలుపెట్టేశారట. అయితే, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది. దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు. దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీమ్ ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
Devara Collections Day 3: మొదటి వారంలో సత్తా చాటిన 'దేవర'
ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద తారక్ సత్తా చాటాడు. మొదటిరోజు కాస్త మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం రెండోరోజు కలెక్షన్లపై పడింది. అయితే, దేవరపై ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ మారింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూడోరోజు కలెక్షన్లు నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్లో దేవర భారీ కలెక్షన్లే క్రియేట్ చేశాడు.కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడురోజులకు గాను రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు రూ. 71కోట్లు, మూడోరోజు రూ. 61 కోట్లు రాబట్టాడు. అయితే, దేవరకు బాలీవుడ్లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర రూ. 500 కోట్ల మ్యాజిక్ టార్గెట్ను సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా కూడా దేవరకు పోటీగా లేకపోవడం బాగా కలిసోచ్చే అంశమని చెప్పవచ్చు. మరో రెండురోజుల్లో తెలుగురాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్ ఆడియన్స్ కూడా దేవర థియేటర్ వైపు అడుగులేస్తారు. ఇలా చాలా అనుకూలా అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర రూ. 500 కోట్ల మార్క్ కలెక్షన్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. -
రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్
ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది. ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024 -
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్స్టర్ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్లో సముద్రం లోపల ఎన్టీఆర్తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ని తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Devara : ఆయుధ పూజ సాంగ్ విన్నారా.. ఫ్యాన్స్కి పూనకాలే!
దేవర నుంచి ఆయుధ పూజ రిలీజైంది. అసలు వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో సడెన్గా ఈ పాటను వదిలి సినిమా రిలీజ్కి కొన్ని గంటల ముందు సర్ప్రైజ్ చేశారు మేకర్స్. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ పాట కోసం ఎదురు చూశారు.(చదవండి: ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?)తాజాగా దేవర జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి..అందులో ఆయుధ పూజ సాంగ్ని కూడా యాడ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగు ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇక దేవర విషయానికొస్తే.. జగతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'దేవర'ను చూసిన అనిరుధ్.. ఆ రెండు సినిమాలతో పోలిక
ఎన్టీఆర్- కోరటాల శివ కాంబినేషన్లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలైన 'అవెంజర్స్, బ్యాట్మ్యాన్' చిత్రాలను చూసిన ఫీల్ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. కొరటాల శివ హైదరాబాద్లో ఏ థియేటర్కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అని అనిరుధ్ పంచుకున్నారు.జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పకులు. -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
చిరంజీవి తో విభేదాలు.. కొరటాల రియాక్షన్ వైరల్..
-
రండి.. నాతో చేతులు కలపండి.. యూత్కి ఎన్టీఆర్ పిలుపు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Telangana Anti Narcotics Bureau (@telanganaantinarcoticsbureau) -
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్లో చూశాను. తన డైలాగ్ పేపర్స్ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
చిరంజీవి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు : కొరటాల
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.ఎన్టీఆర్కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?ఎన్టీఆర్తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాం.దేవర కంటే ముందు అల్లు అర్జున్తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.జాన్వీ కపూర్ గురించి?శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి గల కారణం?ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.సైప్ అలీఖాన్ గురించి?నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్కే దాదాపు గంట సమయం పట్టేది.సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా. -
‘ఆంధ్రావాలా’తో దేవర పోలిక.. కొరటాల ఏం అన్నారంటే..
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు మారిపోయారు. కథలో కొత్తదనం ఉంటేకానీ థియేటర్స్కి రావడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చలేదంటే ఫ్యాన్స్ సైతం టికెట్ పెట్టి సినిమా చూడడానికి ముందుకు రావడం లేదు. అందుకే మన దర్శకనిర్మాతలు డిఫరెంట్ స్టోరీస్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా ఓ చిన్న కామన్ పాయింట్ కనిపించినా.. చాలు మరొక సినిమాతో పోల్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఈ కథ పలానా సినిమాను గుర్తు చేస్తుందని చెప్పేవారు. (చదవండి: ఆ హిట్ డైరెక్టర్తో రజనీకాంత్ సినిమా..!)కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ మొదలు టీజర్, ట్రైలర్ని చూసి వేరే సినిమాలతో పోలిక పెడుతున్నారు. అసలు కథ ఏంటి అనేది తెలియకుండానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై కూడా నెట్టింట అలాంటి ట్రోల్స్ వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కొరటాల ఆ ట్రోల్స్పై స్పందించారు.‘ఆంధ్రావాలా’ తో పోలికకొరటాల శివ దర్శకత్వం మహించిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు బయటకు చెప్పలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఎన్టీఆర్ని తండ్రి, కొడుకుల పాత్రల్లో చూపించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఆంధ్రావాలా’లో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడు. దేవరలో అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఈ సినిమా కథతో దేవరకు సంబంధం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.అలా ఎలా పోలుస్తారు: కొరటాలతాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రావాలా’ట్రోలింగ్పై కొరటాల స్పందించారు. ఈ సినిమాలో హీరో తండ్రికొడుకులు నటించినంత మాత్రనా అదే కథ అంటె ఎలా? అసలు ఆ కథతో దీనికి సంబంధమే లేదు. ఒక హీరో తండ్రికొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి(నవ్వుతూ..). అసలు అదేం పోలిక? ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ’ అని కొరటాల అన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాను చెడును ప్రచారం చేయడానికే ఎక్కువగా వాడుతున్నారని, అలా కాకుండా మంచికి ఉయోగించాలని కోరారు. నెగెటివల్ కామెంట్ చేయడం వేరే..ద్వేషించడం వేరు. కామెంట్ చేయడంలో తప్పలేదు..ద్వేషించకూడదు అని కొరటాల అన్నారు. -
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో నేడు(సెప్టెంబర్ 22) హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. (చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదల)ఈ ఈవెంట్కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ గొడవకు దిగారు. అత్యుత్సాహంతో హోటల్ అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠి చార్జీ చేసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈవెంట్నే రద్దు చేశారు. దీంతో నిరుత్సాహంతో ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.రుణపడి ఉంటా..'దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలనుకున్నాను. సెక్యూరిటీ కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం. దీనికి నిర్మాతలను, ఈవెంట్ ఆర్గనైజర్లను నిందించడం తప్పని నా అభిప్రాయం. మీరు కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈరోజు కుదరకపోయినా సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం దేవరకు అవసరం. మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత' అని ఓ వీడియో రిలీజ్ చేశారు.దేవర విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 27న రిలీజ్ కానుంది. We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za— Devara (@DevaraMovie) September 22, 2024 -
దేవర' కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న కొరటాల..!
-
తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్
ఎన్టీఆర్ 'దేవర' మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్.. ప్రస్తుతం హైదరాబాద్కి తిరిగొచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు 'దేవర' ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆలియా భట్-కరణ్ జోహార్-ఎన్టీఆర్ది రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు హీరో తారక్-కొరటాలతో విశ్వక్, సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం అని.. మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలానే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి రెండు పేజీల డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు.'ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటే పోతే దాదాపు 8-9 గంటలు సినిమా వచ్చేది' అని ఎన్టీఆర్ చెప్పారు.(ఇదీ చదవండి: మోసం చేస్తున్న మల్టీప్లెక్స్లు.. చెప్పేదొకటి చేస్తున్న మరొకటి)తారక్-కొరటాల ఇంకే ఏమేం చెప్పారో తెలియాలంటే దిగువన ఇంటర్వ్యూ చూసేయండి. -
కోలీవుడ్లో నా ఫేవరేట్ డైరెక్టర్ ఆయనే: జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా చెన్నైలో దేవర టీమ్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈవెంట్కు హజరైన జూనియర్ ఎన్టీఆర్ దేవర గురించి పలు ఆసక్తికర విషయానలు పంచుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. చెన్నై నాకెప్పుడు ప్రత్యేకమే. నా చిన్నప్పుడు కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా దేవర కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మేము అనుకున్న దాన్ని ఫర్ఫెక్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం మేమంతా స్ట్రాంగ్ పిల్లర్స్లా నిలబడి పనిచేశాం. డైరెక్టర్ విజన్కు అనుగుణంగా నడుచుకున్నాం. దేవర కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకం. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పాత్రను అద్భుతంగా చేసింది. ఆమె నటనను తెరపై చూడాల్సిందే.' అని అన్నారు. (ఇది చదవండి: దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్)మన భాషలు వేరైనప్పటికీ.. మనందరినీ ఒక్కటిగా చేసేది సినిమా అని ఎన్టీఆర్ తెలిపారు. ఇక్కడ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ కాదు.. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తమిళంలో డైరెక్ట్గా సినిమా చేయండి సార్ అని యాంకర్ ప్రశ్నించగా.. నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్.. తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేయండి.. తెలుగులో డబ్ చేసుకుంటాం.. అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. The man of the moment ❤️🔥@tarak9999’s speech at the #Devara Tamil Press Meet! 💥#DevaraOnSep27th pic.twitter.com/hq7L255Nmu— Devara (@DevaraMovie) September 17, 2024 -
Devara: రిలీజ్ కు ముందే రికార్డులు!
-
దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్.. రిలీజ్కు ముందే రికార్డులు!)కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. A fight between the heads of 4 different villages.⁰Ancestral weapons.⁰So much blood. Sacrifices to the gods. Prayers.And so much more… #Devara 💥💥💥#DevaraOnSep27th pic.twitter.com/AZR03wYW8P— Devara (@DevaraMovie) September 15, 2024 -
దేవర మూవీ క్రేజ్.. రిలీజ్కు ముందే రికార్డులు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.రిలీజ్కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్లో ప్రీమియర్ ప్రీసేల్స్లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయినట్లు దేవర టీమ్ ట్వీట్ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీసేల్స్తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్లో సెప్టెంబర్ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్)ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. What do we call his mayhem? #Devara 🔥 pic.twitter.com/0rxdYD1JPJ— Devara (@DevaraMovie) September 14, 2024 -
ఆ షాట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.దేవర మూవీలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందులో ఒక్క ఫైట్ సీక్వెన్సులు మాత్రమే కాదు.. చివరి అరగంట అందరినీ అలరిస్తుందన్నారు. అద్భుతమైన విజువల్స్, ఫైట్ సీక్వెన్సెస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెప్పారు. సముద్రంలో షార్క్పై కనిపించిన షాట్ కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఆ సీన్ చాలా ఎక్కువ సమయం తీసుకుందని జూనియర్ వెల్లడించారు. ఒక రోజు మొత్తం ఆ షాట్కే కేటాయించినట్లు ఎన్టీఆర్ వివరించారు. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. Simple ga cheppalante…last 40 mins motham tagalapadipoddi antunnaru 😁🔥#Devara #DevaraTrailer pic.twitter.com/fRe1vyrYwF— Devara (@DevaraMovie) September 10, 2024 -
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్లో ఐరన్ థ్రోన్ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.జాన్వీ కపూర్తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా దేవర పార్ట్-1కు సంబంధించిన ఎన్టీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చివరిదశ షూట్ జరుగుతోందని వెల్లడించారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని.. టీం అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెట్లో డైరెక్టర్తో ఫోటో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB— Jr NTR (@tarak9999) August 13, 2024 -
ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
ఎన్టీఆర్ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్ఫుల్ డైలాగ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం. 'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్ వింటే ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. Actress Mani Chandana garu has started dubbing for #Devara, She is playing #JanhviKapoor's mother role in the film ❤️సాదా సీదా మగాళ్ళు కావాలా...ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా...! 🔥🔥🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/WcbbRVJ0kk— Dhanush🧛 (@Always_kaNTRi) July 10, 2024 -
ఎన్టీఆర్ కోసం అనిరుధ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సాంగ్
-
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.దేవర అప్డేట్తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఎన్టీఆర్ పుట్టినరోజుకు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ రిలీజ్ కానుంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు.ALL SET for the mighty storm 🌊#DevaraFirstSingle ~ #FearSong will unleash tsunami of madness that will sweep through every coast on May 19th 💥An @anirudhofficial Musical 🎶 #DevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/mRfxMps4FA— Devara (@DevaraMovie) May 15, 2024 -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్గా స్టార్ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్లో జరిగిన ‘దేవర’ షూటింగ్లోనే జాయిన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. -
గోవాలో ఆటా పాటా
గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్లో రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఓ మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త మాస్ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
'దేవర'లో ఎన్టీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఎవరో తెలుసా..?
జూ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న దేవర యూనిట్లోకి ఒక కొత్త హీరోయిన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో మరాఠీ హీరోయిన్ టాలీవుడ్కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరాఠీ బ్యూటీగా భారీ క్రేజ్ ఉన్న శ్రుతి మరాటేకు తారక్తో ఛాన్స్ దక్కిందని దేవరలో ఆమె సెకండ్ హీరోయిన్గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. దేవర చిత్రంలో తారక్ డ్యుయల్ రోల్లో కనిపిస్తాడు. పాపులర్ హీరోయిన్ శ్రుతి మరాఠేకు ఛాన్స్ ఇప్పటికే జాన్వీ కపూర్ ఒక హీరోయిన్గా ఉంది. మరి రెండో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వస్తున్న సమయంలో శ్రుతి మరాఠే పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరాఠ, హిందీ చిత్రాల్లో వెరీ పాపులర్ హీరోయిన్గా గుర్తింపు ఉంది. తారక్ ఫ్యాన్స్పేజీలలో ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. వాటికి శ్రుతి మరాటే కూడా రియాక్ట్ అయింది. తారక్ అంటే చాలా ఇష్టం అని ఆమె పోస్ట్ చేయడంతో ఈ వార్త నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గుజరాత్కు చెందిన శ్రుతి మరాఠే గతేడాదిలో పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది. అప్పట్లో ఆమె వీడియోలు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి దేవరలో ఆమెకు ఛాన్స్ నిజంగానే వస్తే ఇక్కడ మరింత పాపులర్ అవడం ఖాయం అని చెప్పవచ్చు. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఏప్రిల్ 5న పార్ట్ -1 విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్ విషయంలో కొంత జాప్యం ఏర్పడింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత పెండింగ్లో ఉందని సమాచారం. దీంతో దేవర సినిమా దసరాకు విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pune Wedding Photographer (@kruti_photostudio.23) View this post on Instagram A post shared by Bharat Prajapat (@clickography) -
శ్రీమంతుడు వివాదం.. తెరపైకి రూ. 15 లక్షల టాపిక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్ర యూనిట్ రియాక్ట్ అయింది. శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ యూనిట్ విజ్ఞప్తి చేసింది. శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చేంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఎంటో తెలుస్తోంది. ఈ వ్వవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. రూ. 15 లక్షలు ఇస్తామన్నారు: శరత్ ఈ వివాదంపై రచయిత శరత్ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ' 2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో ఇదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ను కూడా మొదలు పెట్టాలనుకున్న సమయంలో 'శ్రీమంతుడు' థియేటర్లోకి వచ్చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు కొందరు సనిమా చూసి అది నా కథే అని చెప్పడంతో నేను కూడా వెళ్లి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్తో మాట్లాడాను కూడా ఈ కథ నాదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఎంటర్ అయ్యారు. రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వారి సాయంతోనే కోర్టు మెట్లెక్కాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను.' అని శరత్ చంద్ర పేర్కొన్నారు. -
శ్రీమంతుడు వివాదం.. దేవర డైరెక్టర్కు షాకిచ్చిన సుప్రీంకోర్టు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!) గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాతే శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని.. తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా మీ పిటిషన్న డిస్మిస్ చేయమంటారా? మీరే వెనక్కి తీసుకుంటారా? అని న్యాయవాది నిరంజన్రెడ్డిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో సుప్రీం ఓకే చెప్పింది. కాగా.. కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా ప్రేక్షకులను పలకరించాయి. అయితే తీవ్రమైన పోటీ ఉండడంతో రవితేజ సినిమా రిలీజ్ను వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతి సందడి ముగియడంతో అందరి దృష్టి సమ్మర్ సీజన్ సినిమాపైనే ఉంది. మరికొద్ది రోజుల్లో రానున్న సమ్మర్లో అలరించేందుకు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రవితేజ ఈగల్ మూవీ మేకర్స్ను ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 9న రిలీజవుతోన్న ఈ చిత్రానికి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా రిలీజ్పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమ్మర్లో రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయితే తాము పోటీలో ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సినిమాలకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే సంక్రాంతికి నేను ప్రెసిడెంట్గా ఉండను. మరో ఆరు నెలల్లో నా టర్మ్ అయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్ అఫీషియల్గా చెప్పాం. దేవర పోస్ట్ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఇప్పటికే ఒకసారి చెప్పాం కదా ' అని క్లారిటీ ఇచ్చారు. -
భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్కి పెద్ద భారమే!
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’తర్వాత ఎన్టీఆర్తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో పేర్కొంది. కానీ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రం అప్పుడే మొదలైంది. (చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి రానుందా?) తాజాగా ఓవర్సీస్ డీల్ పూర్తయినట్లు సమాచారం. రూ.27 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఇది పెద్ద డీల్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే అక్కడ ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. ఇది పెద్ద భారమే. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత ఓవర్సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగినప్పటికీ.. 5.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అంటే చాలా కష్టమే. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదని సినీ పండితులు అంటున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్తో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో సినిమా హిట్ అయితే మాత్రం ఓవర్సీస్లో ఎన్టీఆర్ రికార్డు సృష్టించడం ఖాయం. -
Devara Glimpse: జూ.ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ గ్లింప్స్ వీడియో ఎలా ఉంది? కొరటాల మార్క్ మేకింగ్.. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్) 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తొలుత ఒక పార్ట్ అనుకున్నారు గానీ తర్వాత రెండు భాగాలుగా చేశారు. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 79 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. అలానే ఎన్టీఆర్ చెప్పిన.. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది. ఈ వీడియోలో 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించారు. అలానే అనిరుధ్ మార్క్ బీజీఎం కూడా ఉంది. అదిరిపోయే విజువల్స్కి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలతో పాటు 'దేవర' గ్లింప్స్ వీడియోని థియేటర్లలో ప్లే చేయబోతున్నారని టాక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు రిలీజ్) -
ఫ్యాన్స్కు పోస్టర్తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ
పాన్ ఇండియా స్టార్ జూ ఎన్టీఆర్ దేవర కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 2024 బాక్సాఫీస్ దేవర సొంతం కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక శుభవార్తను కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు. తన ఎక్స్ పేజీలో సరికొత్త లుక్లో ఉన్న తారక్ ఫోటోతో ట్రీట్ ఇచ్చారు. దేవర గ్లింప్స్ను జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో 2024 ఫుల్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదిలో దేవర బరిలోకి దిగాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ఈ చిత్ర టీజర్పై చేసిన వ్యాఖ్యలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పులికి అందరూ సలాం కొడతారు.. త్వరలో వచ్చే టీజర్ను చూస్తే అర్థం అవుతుంది అనేలా ఆయన చెప్పారు. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా దేవర అంచనాలకు మించే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఏదేమైనా 2024 బాక్సాఫీస్ దేవర సొంతం అని చెప్పవచ్చు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year. Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0 — Jr NTR (@tarak9999) January 1, 2024 -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
అసలు 'దేవర' కథేంటి? సినిమా వెనక ఇంత కథ ఉందా..?
-
నీటిలో డిష్యుం డిష్యుం
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటికే తొలి షెడ్యూల్లో షిప్లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు కొరటాల శివ. తాజాగా ‘దేవర’లో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ని ఆరంభించారని టాక్. పూర్తిగా నీటిలో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా ఉంటుందని భోగట్టా. దాదాపు 20 రోజుల పాటు ఈ ఫైట్ని చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చేందుకు ఎన్టీఆర్ మూడు రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఫైట్ మాస్టర్ కింగ్ సోలొమన్ ఈ సీక్వెన్స్ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
'దేవర' విలన్ ఇతడే.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు. (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు. BHAIRA Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781 — Jr NTR (@tarak9999) August 16, 2023 (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) -
Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్థుతం ఈ సినిమా షూటింగ్కు సంబంధించి నాలుగు భారీ షెడ్యూల్ను పూర్తి చేసింది. రీసెంట్గా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రెండు వారాల పాటు దేవర షూటింగ్ జరిగింది. (ఇదీ చదవండి: Salar: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రికార్డ్స్ అన్నీ బద్దలే) ఇందులో భాగంగా ఓ కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ను మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ డైరెక్షన్లో ఎన్టీఆర్ అదరగొట్టాడని తెలుస్తోంది. రేపటి నుంచి (జులై 3) మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందు కోసం దేబాయ్ వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని కొరటాల ముందే చెప్పాడు. బిగ్ ఎమోషనల్ పాన్ ఇండియా చిత్రంగా దేవరను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్పూత్ సెన్సేషనల్ కామెంట్స్) ఈ నేపథ్యంలో దేవరకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్గా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయనున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ డ్యూయెల్ పాత్రలో మెప్పించనున్నారని, అందు కోసం తండ్రి క్యారెక్టర్ సరసన సాయిపల్లవిని తీసుకున్నారని కూడా వైరల్ అవుతుంది. రెండు పార్టులుగా తీసేందుకే కథను రెడీ చేశారట కొరటాల.. అందుకే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తన సన్నిహితులతో చెప్పారట. దేవర రెండు భాగాలుగా వస్తే యంగ్ టైగర్ ఫ్యాన్స్కు జాతరేనని చెప్పవచ్చు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయం వరకు ఉంటే కానీ రెండో పార్ట్ గురించి రివీల్ అవుతుంది. -
ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవర'. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంత చెమడ్చుతున్నారో ఈ పిక్ చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జిమ్లో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఈ ఫోటోను చూస్తే పని పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడో అర్థమవుతోంది. 'దేవర ఏట్ వర్క్.. ఎక్కడైనా సరే అంకితభావం ముందు ఏదీ అడ్డురాదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. షూటింగ్కు కొన్ని రోజులు గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి వేకేషన్ వెళ్లారు మన జూనియర్ టైగర్. వేకేషన్లో కూడా ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇదీ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Kumar Mannava (@kumarmannava) -
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ బర్త్ డే...కాకరేపుతున్న NTR30 టైటిల్
-
తన బర్త్ డే రోజున ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిన తారక్..
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
NTR 30: తెలుగు సెట్స్లోకి జాన్వీ కపూర్ తొలి అడుగు
తెలుగు సెట్స్లోకి జాన్వీ కపూర్ తొలి అడుగు సోమవారం ఆరంభమైంది. శ్రీదేవి ఫ్యాన్స్ అందరూ ఆమె కుమార్తె జాన్వీ దక్షిణాదికి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ సినిమా కమిట్ కావడం ఫ్యాన్స్ని ఆనందపరిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లోకి జాన్వీ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్, జాన్వీపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు కొరటాల శివ. -
సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్ తన నివాసంలో గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో ఈవ్నింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ జేమ్స్'.. అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి రామ్చరణ్ మాత్రం రాలేదు. రీసెంట్గానే మాల్దీవులు ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన చరణ్ మరి తారక్ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఇక గత నెలలో రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా తారక్ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq — Jr NTR (@tarak9999) April 12, 2023 -
NTR30 చిత్రం ప్రారంభం.. ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ (ఫొటోలు)
-
ఎన్టీఆర్ 30 కి నో చెప్పిన స్టార్ హీరో...కొరటాలకి బిగ్ షాక్
-
వస్తున్నా..: వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే తారక్ కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. #NTR30 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలాడు తారక్. వస్తున్నా.. అంటూ తాను సెట్స్లో అడుగుపెట్టిన వీడియోను రిలీజ్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్న వాయిస్ వింటేనే గూస్బంప్స్ వస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే! కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్గా, బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్గా పని చేస్తున్నారు. కల్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే మిర్చితో డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. తొలి సినిమాతోనే మంచి మార్కులు పట్టేశాడు. స్వతాహాగా రైటర్ కావడంతో ఈ సినిమాలో డైలాగ్స్ కూడా తనే రాశాడు. తర్వాత మహేశ్బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశాడు. Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO — Jr NTR (@tarak9999) April 1, 2023 -
NTR30 కోసం రంగంలోకి ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్లో టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలె పట్టాలెక్కింది. ఈ క్రమంలో తాజాగా NTR30కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ను వదిలారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ వర్క్స్ చేస్తున్న విషయ తెలిసిందే. చదవండి: బర్త్డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? తాజాగా ఈ సినిమాకు మరో హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్గా వర్క్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. హాలీవుడ్ చిత్రాలు ‘300’, ‘ఆక్వామేన్’, ‘ది బ్యాట్మేన్’ వంటి వాటికి వర్క్ చేశారు బ్రాడ్ మిన్నిచ్. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #BradMinnich will be the VFX supervisor for crucial sequences in #NTR30 💥💥 Get ready for a stunning visual treat on the Big Screens 🤩#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/LUdpwNuNFe — NTR Arts (@NTRArtsOfficial) March 28, 2023 -
NTR30: ఇచ్చిన మాట కొరటాల నిలబెట్టుకుంటాడా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ జీవితాలే కాదు..డైరెక్టర్స్ జీవితాలు కూడా హిట్స్, ప్లాప్స్ మీదే ఆధారపడి ఉంటాయి. హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ అయినా ఒక ప్లాప్ మూవీతో ఫేడ్ అవుట్ అయిపోతాడు. మళ్లీ మరో సినిమాతో సక్సెస్ అందుకుంటేనే ఆ డైరెక్టర్స్ కి ఆఫర్స్ వస్తాయి. లేకపోతే అంతే సంగతులు. ఆచార్య లాంటి డిజాస్టర్ తీసిన కొరటాల సేమ్ స్టిట్యూవేషన్ లో ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 తో తన ఎంటో చూపించాలనుకుంటున్నాడు. కొరటాల శివ తను తీసే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మేసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు. మిర్చి తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ ...డెబ్యూ మూవీతోనే మాస్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొరటాల రైటర్ కావటంతో ...మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ లో డైరెక్టర్ గా తన స్టైల్ ఏంటో చూపించాడు కొరటాల. ఆ తర్వాత మహేశ్ తో శ్రీమంతుడు...ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కించి డైరెక్టర్ గా కొరటాల హ్యాట్రిక్ అందుకున్నాడు. కొరటాల సినిమా అంటే మెసేజ్ తో పాటు..హీరో ఎలివేషన్స్ ..అండ్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని...శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రూవ్ చేశాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మహేశ్ తో తెరకెక్కించిన సినిమా భరత్ అను నేను. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ ను ముఖ్యమంత్రిగా చూపించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు..సినీ అభిమానులందరికీ మంచి కిక్ ఇచ్చింది. తన కథ...కథనాలతో తెరకెక్కిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కావటంతో...కొరటాల తనదైన శైలిలో ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాన్ చేశాడు. ఈ సినిమా విషయంలో కొరటాల అంచనాలు తలకిందులైయ్యాయి. మెగాస్టార్ కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య ప్లాప్ కావటంతో కొరటాల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చిరంజీవి అయితే చాలా సార్లు ఆచార్య ప్లాప్ కావటానికి డైరెక్టర్ కొరటాల శివ కారణమంటూ ఇన్ డైరక్ట్ గా కామెంట్స్ చేశాడు. ఇక ఆచార్య సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొరటాల కోరినట్లే ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆచార్య సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ..కొరటాల ఎన్టీఆర్ 30 కమిట్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.ఇక కొరటాల తో ఎన్టీఆర్ మూవీ ఉండదనే మాట కూడా వినిపించింది. అయితే ఎన్టీఆర్ కొరటాల పై ఉన్న నమ్మకంతో ఇచ్చిన మాటకి అలాగే ఫిక్స్ అయ్యాడు. కాకపోతే పాన్ ఇండియా మూవీ తీయాలని కండీషన్ పెట్టాడు. దీంతో కొరటాల ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉండే స్టోరీని రెడీ చేశాడట. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పిక్షనల్ యాక్షన్ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. తన కథ పై కొరటాల ఎంత నమ్మకంగా ఉన్నాడనేది...ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ తన చేతిలో పెట్టిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి డ్యామేజ్ చేయకుండా...డైరెక్టర్ గా కొరటాల ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. పైగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కించటం కొరటాలకు ఇదే ఫస్ట్ టైమ్.. ఓ విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఇమేజ్ కి మించి తనపై బరువు వేసుకున్నాడు. కానీ సెట్స్ పై ఎలాంటి టెన్షన్ పడకుండా ముందుగానే అంత సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ చాలా నమ్మకంగా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కిస్తానని చెప్పగలిగాడని ఇండస్ట్రీలు వర్గాలు చెబుతున్నాయి. కొరటాల..తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనే విషయం తెలియాలంటే ....వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే. -
NTR 30: వేడుకగా ప్రారంభోత్సవం.. స్టోరీ ఇదే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై హైదరాబాద్లోని స్టార్ హోటల్లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి పాల్గొన్ని ఎన్టీఆర్, జాన్వీకపూర్ల ముహుర్తంపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చదవండి: జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ అలాగే ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, కల్యాణ్రామ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టంట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ పూజ కార్యక్రమం అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. ఇదిలా ఉంటే పూజ అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ స్క్రిప్ట్ గురించి హింట్ ఇచ్చారు. ‘‘జనతా గ్యారేజ్’ తారక్తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్డ్రాప్లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్డ్రాప్. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. Sensational directors @ssrajamouli and #PrashanthNeel at the #NTR30 Puja and opening ceremony. - https://t.co/Uh0d9lsc89#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @YuvasudhaArts pic.twitter.com/IXZiYRR0BH — NTR Arts (@NTRArtsOfficial) March 23, 2023 -
జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్
నందమూరి అభిమానులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నా ఆ సమయం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురువారం(మార్చి 23న) హైదరాబాద్లో ఐటీసీ కొహినూర్లో వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. పూజ అనంతరం జక్కన్న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల ముహుర్తపు తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. దీంతో ఎంతో కాలంగా సస్సెన్స్లో ఉన్న ఈ మూవీ హీరోయిన్పై తాజాగా క్లారిటీ వచ్చేసింది. Sensational directors @ssrajamouli and #PrashanthNeel at the #NTR30 Puja and opening ceremony. - https://t.co/Uh0d9lsc89#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @YuvasudhaArts pic.twitter.com/IXZiYRR0BH — NTR Arts (@NTRArtsOfficial) March 23, 2023 #NTR30 Muhurtham clicks 😍😍@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @ssrajamouli #prashanthNeel @anirudhofficial @prakashraaj pic.twitter.com/KzyTigO4wQ — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 23, 2023 చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన రష్మిక.. ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. NTR30లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ టీంతో మాటలు కలుపుతూ సరదగా గడిపింది. తన అభిమాన నటుడు, కో-స్టార్ ఎన్టీఆర్ని కలిసిన సమయంలో ఆమె ఆనందంతో మురిసిపోయింది. ఎన్టీఆర్ ఆమె పలకరించగా ఆనందంతో ఆమె ముఖం మెరిసిపోయిన ఫొటో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. కాగా త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా ఎన్టీఆర్ 30ని వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు తమిళ యంగ్ మ్యూజిక్ సన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The main man @tarak9999 has lit up the #NTR30 Puja and opening ceremony 🔥🔥 Watch live! - https://t.co/VBPX14RSNd#NTR30Begins 🔥#JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts @NTRArtsOfficial pic.twitter.com/uminJeklOw — Vamsi Kaka (@vamsikaka) March 23, 2023 చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. -
NTR30: నెత్తుటి కత్తితో ముహూర్తం ఫిక్స్..
‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 23న జరపనున్నట్లు శనివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో కోర్టు సెట్ను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675 — NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023 -
ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్తో కలిసి హైదరాబాద్లో సముద్రం సెట్, ఓ దీవి సెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్తో తలపడేందుకు విలన్గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్ మూవీలో ఆదిపురుష్ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ 30 లో విలన్గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. విలన్గా సైఫ్ అలీఖాన్! మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక విలన్గా సైఫ్ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్కి ఊహించని గెస్ట్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఆహ్వానం! ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఎన్టీఆర్ 30 క్రేజీ అప్ డేట్.. కొరటాల భారీ యాక్షన్ ప్లాన్!
అమెరికాలో జరిగిన ఆస్కార్ హడావుడి ముగిసింది. ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ను ఆస్కార్ వరించింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇకపై తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 నుంచి అప్డేట్ రావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి నుంచి ఎన్టీఆర్ ఫోకస్ ఎన్టీఆర్ 30 పైనే పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మూవీ లాంఛ్ కార్యక్రమం ఈ నెల 18న గ్రాండ్గా జరగనుంది. ఆ తర్వాత మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 29 నుంచి ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. పీరీయాడికల్ మూవీగా తెరకెక్కించనున్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ సముద్రం బ్యాక్ డ్రాప్లోనే కనిపించింది. ఆ ఫస్ట్ లుక్లో సముద్రం ఒడ్డున వున్న రాయిపై జాన్వీ కపూర్ కూర్చొని ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సముద్రం సెట్ మాత్రమే కాదు... ఓ దీవి లాంటి సెట్ కూడా రెడీ చేయించారు. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తలపడేందుకు విలన్గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కనిపంచనున్నారు. ఈ సినిమా ప్రారంభం రోజే కొరటాల నటీనటుల పేర్లను ప్రకటించనున్నారు. ఆచార్యతో డిజాస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న కొరటాల...ఎన్టీఆర్ 30తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్గా మారింది. డైరెక్టర్ కొరటాల ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్నే యాక్షన్ సీక్వెన్స్తో ప్లాన్ చేశారట. ఈ భారీ యాక్షన్ ఫైట్ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా కంపోజ్ చేశారనే టాక్. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్గా నిలవనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.ఈ సినిమాలో లావుగా కనిపించేందుకు ఎన్టీఆర్ కొంచెం బరువు కూడా పెరిగాడు. కాగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ 30 మూవీ ఫుల్ యాక్షన్ మూవీ తెలియటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ ఖాయం..!
‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 టైటిల్ ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ 30 చిత్రంలో నటించేదుకు జాన్వీ ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో టాలీవుడ్లో జాన్వీ ఎంట్రీ యంగ్ టైగర్తోనే మొదలవనుంది. దీనిపై ఈ నెలాఖరులో మరింత స్పష్టత రానుంది. ఎన్టీఆర్ 30 చిత్ర బృందం గత 6 నెలలుగా పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ చివరికి జాన్వీ కపూర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్కు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయడం ఖాయం. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నెలాఖరులోగా సెట్స్పైకి వెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుంచి సెట్స్పైకి వెళ్లి 6 నుంచి 7 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
NTR 30 నుంచి క్రేజీ అప్డేట్! అప్పుడే షూటింగ్ స్టార్ట్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించిన అనంతరం కొరటాల, ఎన్టీఆర్ సైలెంట్గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా మూవీ రిలీజ్ చేసింది చిత్రం బృందం. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అయితే ఈ మూవీ ఇప్పటి వరకు సెట్స్పైకి రాని విషయం తెలిసిందే. దీంతో ఇంకా షూటింగ్యే మొదలు పెట్టని సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకొనుందట. హైదరాబాద్లోనే తొలి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించి షూటింగ్ జరుగనుందని సమాచారం. కాగా ఆచార్య మూవీ ప్లాప్తో కొరటాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కొరటాల గత చిత్రాల తరహాలోనే సామాజికాంశాలకు కమర్షియల్ హంగులను మేళవించి ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవర్నది ఖారారు కాలేదు. గతంలో జాన్వీ కపూర్, అలియా భట్ల పేర్లు వినిపించగా తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. -
NTR 30:ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించి చాల నెలలు అయినప్పటికీ.. ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం బృందం ఓ క్రేజీ అప్డేట్ని వదిలి పుకార్లకు చెక్ పెట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఎన్టీఆర్. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఒక హిట్ ఎన్టీఆర్కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్ కొరటాలకి అవసరం. A man's fury is the cure for a disease called courage 🔥🔥#NTR30 in cinemas on April 5th, 2024 💥 Shoot begins next month 💥 Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ — NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023