koratala siva
-
జపాన్లో ఎన్టీఆర్ మాస్ జాతర - అభిమానితో 'దేవర' స్టెప్పులు (ఫొటోలు)
-
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్నీల్తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన వికటకవి వెబ్సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్సిరీస్లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్డ్రాప్లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ప్రభాస్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్2పై అంచనాలు పెంచేసిన కొరటాల
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవర పార్ట్2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్లో అసలు కథ ఉంది. 100 శాతం చూస్తారు. సీట్ ఎడ్జ్లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది. అందరికీ మంచి ఫీల్ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..'ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవర విజయం వెనుక డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైంది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ.. మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడు నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం సమష్టి కృషితో దేవర మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్లో ఉండి నన్ను నడిపిస్తున్న కల్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. బృందావనం నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం.. ఒక దర్శకుడిగా కాదు.. సోదరుడిగా నాకు సపోర్ట్గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.ఇదీ చదవండి: 25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?దేవర సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యచరణ ప్రారంభించారట. ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలుపెట్టేశారట. అయితే, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది. దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు. దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీమ్ ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
Devara Collections Day 3: మొదటి వారంలో సత్తా చాటిన 'దేవర'
ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద తారక్ సత్తా చాటాడు. మొదటిరోజు కాస్త మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం రెండోరోజు కలెక్షన్లపై పడింది. అయితే, దేవరపై ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ మారింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూడోరోజు కలెక్షన్లు నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్లో దేవర భారీ కలెక్షన్లే క్రియేట్ చేశాడు.కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడురోజులకు గాను రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు రూ. 71కోట్లు, మూడోరోజు రూ. 61 కోట్లు రాబట్టాడు. అయితే, దేవరకు బాలీవుడ్లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర రూ. 500 కోట్ల మ్యాజిక్ టార్గెట్ను సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా కూడా దేవరకు పోటీగా లేకపోవడం బాగా కలిసోచ్చే అంశమని చెప్పవచ్చు. మరో రెండురోజుల్లో తెలుగురాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్ ఆడియన్స్ కూడా దేవర థియేటర్ వైపు అడుగులేస్తారు. ఇలా చాలా అనుకూలా అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర రూ. 500 కోట్ల మార్క్ కలెక్షన్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. -
రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్
ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది. ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024 -
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్స్టర్ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్లో సముద్రం లోపల ఎన్టీఆర్తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ని తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Devara : ఆయుధ పూజ సాంగ్ విన్నారా.. ఫ్యాన్స్కి పూనకాలే!
దేవర నుంచి ఆయుధ పూజ రిలీజైంది. అసలు వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో సడెన్గా ఈ పాటను వదిలి సినిమా రిలీజ్కి కొన్ని గంటల ముందు సర్ప్రైజ్ చేశారు మేకర్స్. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ పాట కోసం ఎదురు చూశారు.(చదవండి: ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?)తాజాగా దేవర జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి..అందులో ఆయుధ పూజ సాంగ్ని కూడా యాడ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగు ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇక దేవర విషయానికొస్తే.. జగతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'దేవర'ను చూసిన అనిరుధ్.. ఆ రెండు సినిమాలతో పోలిక
ఎన్టీఆర్- కోరటాల శివ కాంబినేషన్లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలైన 'అవెంజర్స్, బ్యాట్మ్యాన్' చిత్రాలను చూసిన ఫీల్ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. కొరటాల శివ హైదరాబాద్లో ఏ థియేటర్కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అని అనిరుధ్ పంచుకున్నారు.జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పకులు. -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
చిరంజీవి తో విభేదాలు.. కొరటాల రియాక్షన్ వైరల్..
-
రండి.. నాతో చేతులు కలపండి.. యూత్కి ఎన్టీఆర్ పిలుపు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Telangana Anti Narcotics Bureau (@telanganaantinarcoticsbureau) -
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్లో చూశాను. తన డైలాగ్ పేపర్స్ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
చిరంజీవి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు : కొరటాల
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.ఎన్టీఆర్కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?ఎన్టీఆర్తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాం.దేవర కంటే ముందు అల్లు అర్జున్తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.జాన్వీ కపూర్ గురించి?శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి గల కారణం?ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.సైప్ అలీఖాన్ గురించి?నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్కే దాదాపు గంట సమయం పట్టేది.సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా. -
‘ఆంధ్రావాలా’తో దేవర పోలిక.. కొరటాల ఏం అన్నారంటే..
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు మారిపోయారు. కథలో కొత్తదనం ఉంటేకానీ థియేటర్స్కి రావడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చలేదంటే ఫ్యాన్స్ సైతం టికెట్ పెట్టి సినిమా చూడడానికి ముందుకు రావడం లేదు. అందుకే మన దర్శకనిర్మాతలు డిఫరెంట్ స్టోరీస్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా ఓ చిన్న కామన్ పాయింట్ కనిపించినా.. చాలు మరొక సినిమాతో పోల్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఈ కథ పలానా సినిమాను గుర్తు చేస్తుందని చెప్పేవారు. (చదవండి: ఆ హిట్ డైరెక్టర్తో రజనీకాంత్ సినిమా..!)కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ మొదలు టీజర్, ట్రైలర్ని చూసి వేరే సినిమాలతో పోలిక పెడుతున్నారు. అసలు కథ ఏంటి అనేది తెలియకుండానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై కూడా నెట్టింట అలాంటి ట్రోల్స్ వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కొరటాల ఆ ట్రోల్స్పై స్పందించారు.‘ఆంధ్రావాలా’ తో పోలికకొరటాల శివ దర్శకత్వం మహించిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు బయటకు చెప్పలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఎన్టీఆర్ని తండ్రి, కొడుకుల పాత్రల్లో చూపించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఆంధ్రావాలా’లో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడు. దేవరలో అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఈ సినిమా కథతో దేవరకు సంబంధం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.అలా ఎలా పోలుస్తారు: కొరటాలతాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రావాలా’ట్రోలింగ్పై కొరటాల స్పందించారు. ఈ సినిమాలో హీరో తండ్రికొడుకులు నటించినంత మాత్రనా అదే కథ అంటె ఎలా? అసలు ఆ కథతో దీనికి సంబంధమే లేదు. ఒక హీరో తండ్రికొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి(నవ్వుతూ..). అసలు అదేం పోలిక? ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ’ అని కొరటాల అన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాను చెడును ప్రచారం చేయడానికే ఎక్కువగా వాడుతున్నారని, అలా కాకుండా మంచికి ఉయోగించాలని కోరారు. నెగెటివల్ కామెంట్ చేయడం వేరే..ద్వేషించడం వేరు. కామెంట్ చేయడంలో తప్పలేదు..ద్వేషించకూడదు అని కొరటాల అన్నారు. -
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో నేడు(సెప్టెంబర్ 22) హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. (చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదల)ఈ ఈవెంట్కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ గొడవకు దిగారు. అత్యుత్సాహంతో హోటల్ అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠి చార్జీ చేసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈవెంట్నే రద్దు చేశారు. దీంతో నిరుత్సాహంతో ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.రుణపడి ఉంటా..'దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలనుకున్నాను. సెక్యూరిటీ కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం. దీనికి నిర్మాతలను, ఈవెంట్ ఆర్గనైజర్లను నిందించడం తప్పని నా అభిప్రాయం. మీరు కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈరోజు కుదరకపోయినా సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం దేవరకు అవసరం. మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత' అని ఓ వీడియో రిలీజ్ చేశారు.దేవర విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 27న రిలీజ్ కానుంది. We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za— Devara (@DevaraMovie) September 22, 2024 -
దేవర' కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న కొరటాల..!
-
తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్
ఎన్టీఆర్ 'దేవర' మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్.. ప్రస్తుతం హైదరాబాద్కి తిరిగొచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు 'దేవర' ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆలియా భట్-కరణ్ జోహార్-ఎన్టీఆర్ది రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు హీరో తారక్-కొరటాలతో విశ్వక్, సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం అని.. మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలానే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి రెండు పేజీల డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు.'ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటే పోతే దాదాపు 8-9 గంటలు సినిమా వచ్చేది' అని ఎన్టీఆర్ చెప్పారు.(ఇదీ చదవండి: మోసం చేస్తున్న మల్టీప్లెక్స్లు.. చెప్పేదొకటి చేస్తున్న మరొకటి)తారక్-కొరటాల ఇంకే ఏమేం చెప్పారో తెలియాలంటే దిగువన ఇంటర్వ్యూ చూసేయండి. -
కోలీవుడ్లో నా ఫేవరేట్ డైరెక్టర్ ఆయనే: జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా చెన్నైలో దేవర టీమ్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈవెంట్కు హజరైన జూనియర్ ఎన్టీఆర్ దేవర గురించి పలు ఆసక్తికర విషయానలు పంచుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. చెన్నై నాకెప్పుడు ప్రత్యేకమే. నా చిన్నప్పుడు కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా దేవర కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మేము అనుకున్న దాన్ని ఫర్ఫెక్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం మేమంతా స్ట్రాంగ్ పిల్లర్స్లా నిలబడి పనిచేశాం. డైరెక్టర్ విజన్కు అనుగుణంగా నడుచుకున్నాం. దేవర కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకం. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పాత్రను అద్భుతంగా చేసింది. ఆమె నటనను తెరపై చూడాల్సిందే.' అని అన్నారు. (ఇది చదవండి: దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్)మన భాషలు వేరైనప్పటికీ.. మనందరినీ ఒక్కటిగా చేసేది సినిమా అని ఎన్టీఆర్ తెలిపారు. ఇక్కడ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ కాదు.. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తమిళంలో డైరెక్ట్గా సినిమా చేయండి సార్ అని యాంకర్ ప్రశ్నించగా.. నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్.. తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేయండి.. తెలుగులో డబ్ చేసుకుంటాం.. అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. The man of the moment ❤️🔥@tarak9999’s speech at the #Devara Tamil Press Meet! 💥#DevaraOnSep27th pic.twitter.com/hq7L255Nmu— Devara (@DevaraMovie) September 17, 2024 -
Devara: రిలీజ్ కు ముందే రికార్డులు!
-
దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్.. రిలీజ్కు ముందే రికార్డులు!)కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. A fight between the heads of 4 different villages.⁰Ancestral weapons.⁰So much blood. Sacrifices to the gods. Prayers.And so much more… #Devara 💥💥💥#DevaraOnSep27th pic.twitter.com/AZR03wYW8P— Devara (@DevaraMovie) September 15, 2024 -
దేవర మూవీ క్రేజ్.. రిలీజ్కు ముందే రికార్డులు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.రిలీజ్కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్లో ప్రీమియర్ ప్రీసేల్స్లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయినట్లు దేవర టీమ్ ట్వీట్ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీసేల్స్తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్లో సెప్టెంబర్ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్)ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. What do we call his mayhem? #Devara 🔥 pic.twitter.com/0rxdYD1JPJ— Devara (@DevaraMovie) September 14, 2024 -
ఆ షాట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.దేవర మూవీలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందులో ఒక్క ఫైట్ సీక్వెన్సులు మాత్రమే కాదు.. చివరి అరగంట అందరినీ అలరిస్తుందన్నారు. అద్భుతమైన విజువల్స్, ఫైట్ సీక్వెన్సెస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెప్పారు. సముద్రంలో షార్క్పై కనిపించిన షాట్ కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఆ సీన్ చాలా ఎక్కువ సమయం తీసుకుందని జూనియర్ వెల్లడించారు. ఒక రోజు మొత్తం ఆ షాట్కే కేటాయించినట్లు ఎన్టీఆర్ వివరించారు. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. Simple ga cheppalante…last 40 mins motham tagalapadipoddi antunnaru 😁🔥#Devara #DevaraTrailer pic.twitter.com/fRe1vyrYwF— Devara (@DevaraMovie) September 10, 2024 -
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్లో ఐరన్ థ్రోన్ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.జాన్వీ కపూర్తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా దేవర పార్ట్-1కు సంబంధించిన ఎన్టీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చివరిదశ షూట్ జరుగుతోందని వెల్లడించారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని.. టీం అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెట్లో డైరెక్టర్తో ఫోటో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB— Jr NTR (@tarak9999) August 13, 2024 -
ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
ఎన్టీఆర్ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్ఫుల్ డైలాగ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం. 'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్ వింటే ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. Actress Mani Chandana garu has started dubbing for #Devara, She is playing #JanhviKapoor's mother role in the film ❤️సాదా సీదా మగాళ్ళు కావాలా...ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా...! 🔥🔥🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/WcbbRVJ0kk— Dhanush🧛 (@Always_kaNTRi) July 10, 2024 -
ఎన్టీఆర్ కోసం అనిరుధ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సాంగ్
-
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.దేవర అప్డేట్తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఎన్టీఆర్ పుట్టినరోజుకు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ రిలీజ్ కానుంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు.ALL SET for the mighty storm 🌊#DevaraFirstSingle ~ #FearSong will unleash tsunami of madness that will sweep through every coast on May 19th 💥An @anirudhofficial Musical 🎶 #DevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/mRfxMps4FA— Devara (@DevaraMovie) May 15, 2024 -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్గా స్టార్ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్లో జరిగిన ‘దేవర’ షూటింగ్లోనే జాయిన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. -
గోవాలో ఆటా పాటా
గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్లో రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఓ మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త మాస్ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
'దేవర'లో ఎన్టీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఎవరో తెలుసా..?
జూ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న దేవర యూనిట్లోకి ఒక కొత్త హీరోయిన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో మరాఠీ హీరోయిన్ టాలీవుడ్కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరాఠీ బ్యూటీగా భారీ క్రేజ్ ఉన్న శ్రుతి మరాటేకు తారక్తో ఛాన్స్ దక్కిందని దేవరలో ఆమె సెకండ్ హీరోయిన్గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. దేవర చిత్రంలో తారక్ డ్యుయల్ రోల్లో కనిపిస్తాడు. పాపులర్ హీరోయిన్ శ్రుతి మరాఠేకు ఛాన్స్ ఇప్పటికే జాన్వీ కపూర్ ఒక హీరోయిన్గా ఉంది. మరి రెండో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వస్తున్న సమయంలో శ్రుతి మరాఠే పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరాఠ, హిందీ చిత్రాల్లో వెరీ పాపులర్ హీరోయిన్గా గుర్తింపు ఉంది. తారక్ ఫ్యాన్స్పేజీలలో ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. వాటికి శ్రుతి మరాటే కూడా రియాక్ట్ అయింది. తారక్ అంటే చాలా ఇష్టం అని ఆమె పోస్ట్ చేయడంతో ఈ వార్త నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గుజరాత్కు చెందిన శ్రుతి మరాఠే గతేడాదిలో పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది. అప్పట్లో ఆమె వీడియోలు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి దేవరలో ఆమెకు ఛాన్స్ నిజంగానే వస్తే ఇక్కడ మరింత పాపులర్ అవడం ఖాయం అని చెప్పవచ్చు. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఏప్రిల్ 5న పార్ట్ -1 విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్ విషయంలో కొంత జాప్యం ఏర్పడింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత పెండింగ్లో ఉందని సమాచారం. దీంతో దేవర సినిమా దసరాకు విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pune Wedding Photographer (@kruti_photostudio.23) View this post on Instagram A post shared by Bharat Prajapat (@clickography) -
శ్రీమంతుడు వివాదం.. తెరపైకి రూ. 15 లక్షల టాపిక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్ర యూనిట్ రియాక్ట్ అయింది. శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ యూనిట్ విజ్ఞప్తి చేసింది. శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చేంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఎంటో తెలుస్తోంది. ఈ వ్వవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. రూ. 15 లక్షలు ఇస్తామన్నారు: శరత్ ఈ వివాదంపై రచయిత శరత్ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ' 2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో ఇదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ను కూడా మొదలు పెట్టాలనుకున్న సమయంలో 'శ్రీమంతుడు' థియేటర్లోకి వచ్చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు కొందరు సనిమా చూసి అది నా కథే అని చెప్పడంతో నేను కూడా వెళ్లి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్తో మాట్లాడాను కూడా ఈ కథ నాదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఎంటర్ అయ్యారు. రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వారి సాయంతోనే కోర్టు మెట్లెక్కాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను.' అని శరత్ చంద్ర పేర్కొన్నారు. -
శ్రీమంతుడు వివాదం.. దేవర డైరెక్టర్కు షాకిచ్చిన సుప్రీంకోర్టు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!) గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాతే శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని.. తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా మీ పిటిషన్న డిస్మిస్ చేయమంటారా? మీరే వెనక్కి తీసుకుంటారా? అని న్యాయవాది నిరంజన్రెడ్డిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో సుప్రీం ఓకే చెప్పింది. కాగా.. కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా ప్రేక్షకులను పలకరించాయి. అయితే తీవ్రమైన పోటీ ఉండడంతో రవితేజ సినిమా రిలీజ్ను వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతి సందడి ముగియడంతో అందరి దృష్టి సమ్మర్ సీజన్ సినిమాపైనే ఉంది. మరికొద్ది రోజుల్లో రానున్న సమ్మర్లో అలరించేందుకు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రవితేజ ఈగల్ మూవీ మేకర్స్ను ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 9న రిలీజవుతోన్న ఈ చిత్రానికి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా రిలీజ్పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమ్మర్లో రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయితే తాము పోటీలో ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సినిమాలకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే సంక్రాంతికి నేను ప్రెసిడెంట్గా ఉండను. మరో ఆరు నెలల్లో నా టర్మ్ అయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్ అఫీషియల్గా చెప్పాం. దేవర పోస్ట్ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఇప్పటికే ఒకసారి చెప్పాం కదా ' అని క్లారిటీ ఇచ్చారు. -
భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్కి పెద్ద భారమే!
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’తర్వాత ఎన్టీఆర్తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో పేర్కొంది. కానీ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రం అప్పుడే మొదలైంది. (చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి రానుందా?) తాజాగా ఓవర్సీస్ డీల్ పూర్తయినట్లు సమాచారం. రూ.27 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఇది పెద్ద డీల్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే అక్కడ ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. ఇది పెద్ద భారమే. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత ఓవర్సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగినప్పటికీ.. 5.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అంటే చాలా కష్టమే. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదని సినీ పండితులు అంటున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్తో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో సినిమా హిట్ అయితే మాత్రం ఓవర్సీస్లో ఎన్టీఆర్ రికార్డు సృష్టించడం ఖాయం. -
Devara Glimpse: జూ.ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ గ్లింప్స్ వీడియో ఎలా ఉంది? కొరటాల మార్క్ మేకింగ్.. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్) 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తొలుత ఒక పార్ట్ అనుకున్నారు గానీ తర్వాత రెండు భాగాలుగా చేశారు. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 79 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. అలానే ఎన్టీఆర్ చెప్పిన.. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది. ఈ వీడియోలో 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించారు. అలానే అనిరుధ్ మార్క్ బీజీఎం కూడా ఉంది. అదిరిపోయే విజువల్స్కి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలతో పాటు 'దేవర' గ్లింప్స్ వీడియోని థియేటర్లలో ప్లే చేయబోతున్నారని టాక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు రిలీజ్) -
ఫ్యాన్స్కు పోస్టర్తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ
పాన్ ఇండియా స్టార్ జూ ఎన్టీఆర్ దేవర కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 2024 బాక్సాఫీస్ దేవర సొంతం కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక శుభవార్తను కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు. తన ఎక్స్ పేజీలో సరికొత్త లుక్లో ఉన్న తారక్ ఫోటోతో ట్రీట్ ఇచ్చారు. దేవర గ్లింప్స్ను జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో 2024 ఫుల్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదిలో దేవర బరిలోకి దిగాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ఈ చిత్ర టీజర్పై చేసిన వ్యాఖ్యలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పులికి అందరూ సలాం కొడతారు.. త్వరలో వచ్చే టీజర్ను చూస్తే అర్థం అవుతుంది అనేలా ఆయన చెప్పారు. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా దేవర అంచనాలకు మించే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఏదేమైనా 2024 బాక్సాఫీస్ దేవర సొంతం అని చెప్పవచ్చు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year. Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0 — Jr NTR (@tarak9999) January 1, 2024 -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
అసలు 'దేవర' కథేంటి? సినిమా వెనక ఇంత కథ ఉందా..?
-
నీటిలో డిష్యుం డిష్యుం
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటికే తొలి షెడ్యూల్లో షిప్లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు కొరటాల శివ. తాజాగా ‘దేవర’లో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ని ఆరంభించారని టాక్. పూర్తిగా నీటిలో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా ఉంటుందని భోగట్టా. దాదాపు 20 రోజుల పాటు ఈ ఫైట్ని చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చేందుకు ఎన్టీఆర్ మూడు రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఫైట్ మాస్టర్ కింగ్ సోలొమన్ ఈ సీక్వెన్స్ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
'దేవర' విలన్ ఇతడే.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు. (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు. BHAIRA Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781 — Jr NTR (@tarak9999) August 16, 2023 (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) -
Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్థుతం ఈ సినిమా షూటింగ్కు సంబంధించి నాలుగు భారీ షెడ్యూల్ను పూర్తి చేసింది. రీసెంట్గా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రెండు వారాల పాటు దేవర షూటింగ్ జరిగింది. (ఇదీ చదవండి: Salar: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రికార్డ్స్ అన్నీ బద్దలే) ఇందులో భాగంగా ఓ కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ను మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ డైరెక్షన్లో ఎన్టీఆర్ అదరగొట్టాడని తెలుస్తోంది. రేపటి నుంచి (జులై 3) మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందు కోసం దేబాయ్ వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని కొరటాల ముందే చెప్పాడు. బిగ్ ఎమోషనల్ పాన్ ఇండియా చిత్రంగా దేవరను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్పూత్ సెన్సేషనల్ కామెంట్స్) ఈ నేపథ్యంలో దేవరకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్గా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయనున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ డ్యూయెల్ పాత్రలో మెప్పించనున్నారని, అందు కోసం తండ్రి క్యారెక్టర్ సరసన సాయిపల్లవిని తీసుకున్నారని కూడా వైరల్ అవుతుంది. రెండు పార్టులుగా తీసేందుకే కథను రెడీ చేశారట కొరటాల.. అందుకే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తన సన్నిహితులతో చెప్పారట. దేవర రెండు భాగాలుగా వస్తే యంగ్ టైగర్ ఫ్యాన్స్కు జాతరేనని చెప్పవచ్చు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయం వరకు ఉంటే కానీ రెండో పార్ట్ గురించి రివీల్ అవుతుంది. -
ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవర'. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంత చెమడ్చుతున్నారో ఈ పిక్ చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జిమ్లో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఈ ఫోటోను చూస్తే పని పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడో అర్థమవుతోంది. 'దేవర ఏట్ వర్క్.. ఎక్కడైనా సరే అంకితభావం ముందు ఏదీ అడ్డురాదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. షూటింగ్కు కొన్ని రోజులు గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి వేకేషన్ వెళ్లారు మన జూనియర్ టైగర్. వేకేషన్లో కూడా ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇదీ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Kumar Mannava (@kumarmannava) -
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ బర్త్ డే...కాకరేపుతున్న NTR30 టైటిల్
-
తన బర్త్ డే రోజున ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిన తారక్..
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
NTR 30: తెలుగు సెట్స్లోకి జాన్వీ కపూర్ తొలి అడుగు
తెలుగు సెట్స్లోకి జాన్వీ కపూర్ తొలి అడుగు సోమవారం ఆరంభమైంది. శ్రీదేవి ఫ్యాన్స్ అందరూ ఆమె కుమార్తె జాన్వీ దక్షిణాదికి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ సినిమా కమిట్ కావడం ఫ్యాన్స్ని ఆనందపరిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లోకి జాన్వీ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్, జాన్వీపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు కొరటాల శివ. -
సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్ తన నివాసంలో గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో ఈవ్నింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ జేమ్స్'.. అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి రామ్చరణ్ మాత్రం రాలేదు. రీసెంట్గానే మాల్దీవులు ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన చరణ్ మరి తారక్ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఇక గత నెలలో రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా తారక్ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq — Jr NTR (@tarak9999) April 12, 2023 -
NTR30 చిత్రం ప్రారంభం.. ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ (ఫొటోలు)
-
ఎన్టీఆర్ 30 కి నో చెప్పిన స్టార్ హీరో...కొరటాలకి బిగ్ షాక్
-
వస్తున్నా..: వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే తారక్ కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. #NTR30 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలాడు తారక్. వస్తున్నా.. అంటూ తాను సెట్స్లో అడుగుపెట్టిన వీడియోను రిలీజ్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్న వాయిస్ వింటేనే గూస్బంప్స్ వస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే! కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్గా, బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్గా పని చేస్తున్నారు. కల్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే మిర్చితో డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. తొలి సినిమాతోనే మంచి మార్కులు పట్టేశాడు. స్వతాహాగా రైటర్ కావడంతో ఈ సినిమాలో డైలాగ్స్ కూడా తనే రాశాడు. తర్వాత మహేశ్బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశాడు. Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO — Jr NTR (@tarak9999) April 1, 2023 -
NTR30 కోసం రంగంలోకి ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్లో టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలె పట్టాలెక్కింది. ఈ క్రమంలో తాజాగా NTR30కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ను వదిలారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ వర్క్స్ చేస్తున్న విషయ తెలిసిందే. చదవండి: బర్త్డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? తాజాగా ఈ సినిమాకు మరో హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్గా వర్క్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. హాలీవుడ్ చిత్రాలు ‘300’, ‘ఆక్వామేన్’, ‘ది బ్యాట్మేన్’ వంటి వాటికి వర్క్ చేశారు బ్రాడ్ మిన్నిచ్. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #BradMinnich will be the VFX supervisor for crucial sequences in #NTR30 💥💥 Get ready for a stunning visual treat on the Big Screens 🤩#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/LUdpwNuNFe — NTR Arts (@NTRArtsOfficial) March 28, 2023 -
NTR30: ఇచ్చిన మాట కొరటాల నిలబెట్టుకుంటాడా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ జీవితాలే కాదు..డైరెక్టర్స్ జీవితాలు కూడా హిట్స్, ప్లాప్స్ మీదే ఆధారపడి ఉంటాయి. హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ అయినా ఒక ప్లాప్ మూవీతో ఫేడ్ అవుట్ అయిపోతాడు. మళ్లీ మరో సినిమాతో సక్సెస్ అందుకుంటేనే ఆ డైరెక్టర్స్ కి ఆఫర్స్ వస్తాయి. లేకపోతే అంతే సంగతులు. ఆచార్య లాంటి డిజాస్టర్ తీసిన కొరటాల సేమ్ స్టిట్యూవేషన్ లో ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 తో తన ఎంటో చూపించాలనుకుంటున్నాడు. కొరటాల శివ తను తీసే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మేసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు. మిర్చి తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ ...డెబ్యూ మూవీతోనే మాస్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొరటాల రైటర్ కావటంతో ...మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ లో డైరెక్టర్ గా తన స్టైల్ ఏంటో చూపించాడు కొరటాల. ఆ తర్వాత మహేశ్ తో శ్రీమంతుడు...ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కించి డైరెక్టర్ గా కొరటాల హ్యాట్రిక్ అందుకున్నాడు. కొరటాల సినిమా అంటే మెసేజ్ తో పాటు..హీరో ఎలివేషన్స్ ..అండ్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని...శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రూవ్ చేశాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మహేశ్ తో తెరకెక్కించిన సినిమా భరత్ అను నేను. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ ను ముఖ్యమంత్రిగా చూపించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు..సినీ అభిమానులందరికీ మంచి కిక్ ఇచ్చింది. తన కథ...కథనాలతో తెరకెక్కిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కావటంతో...కొరటాల తనదైన శైలిలో ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాన్ చేశాడు. ఈ సినిమా విషయంలో కొరటాల అంచనాలు తలకిందులైయ్యాయి. మెగాస్టార్ కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య ప్లాప్ కావటంతో కొరటాల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చిరంజీవి అయితే చాలా సార్లు ఆచార్య ప్లాప్ కావటానికి డైరెక్టర్ కొరటాల శివ కారణమంటూ ఇన్ డైరక్ట్ గా కామెంట్స్ చేశాడు. ఇక ఆచార్య సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొరటాల కోరినట్లే ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆచార్య సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ..కొరటాల ఎన్టీఆర్ 30 కమిట్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.ఇక కొరటాల తో ఎన్టీఆర్ మూవీ ఉండదనే మాట కూడా వినిపించింది. అయితే ఎన్టీఆర్ కొరటాల పై ఉన్న నమ్మకంతో ఇచ్చిన మాటకి అలాగే ఫిక్స్ అయ్యాడు. కాకపోతే పాన్ ఇండియా మూవీ తీయాలని కండీషన్ పెట్టాడు. దీంతో కొరటాల ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉండే స్టోరీని రెడీ చేశాడట. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పిక్షనల్ యాక్షన్ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. తన కథ పై కొరటాల ఎంత నమ్మకంగా ఉన్నాడనేది...ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ తన చేతిలో పెట్టిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి డ్యామేజ్ చేయకుండా...డైరెక్టర్ గా కొరటాల ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. పైగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కించటం కొరటాలకు ఇదే ఫస్ట్ టైమ్.. ఓ విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఇమేజ్ కి మించి తనపై బరువు వేసుకున్నాడు. కానీ సెట్స్ పై ఎలాంటి టెన్షన్ పడకుండా ముందుగానే అంత సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ చాలా నమ్మకంగా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కిస్తానని చెప్పగలిగాడని ఇండస్ట్రీలు వర్గాలు చెబుతున్నాయి. కొరటాల..తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనే విషయం తెలియాలంటే ....వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే. -
NTR 30: వేడుకగా ప్రారంభోత్సవం.. స్టోరీ ఇదే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై హైదరాబాద్లోని స్టార్ హోటల్లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి పాల్గొన్ని ఎన్టీఆర్, జాన్వీకపూర్ల ముహుర్తంపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చదవండి: జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ అలాగే ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, కల్యాణ్రామ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టంట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ పూజ కార్యక్రమం అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. ఇదిలా ఉంటే పూజ అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ స్క్రిప్ట్ గురించి హింట్ ఇచ్చారు. ‘‘జనతా గ్యారేజ్’ తారక్తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్డ్రాప్లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్డ్రాప్. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. Sensational directors @ssrajamouli and #PrashanthNeel at the #NTR30 Puja and opening ceremony. - https://t.co/Uh0d9lsc89#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @YuvasudhaArts pic.twitter.com/IXZiYRR0BH — NTR Arts (@NTRArtsOfficial) March 23, 2023 -
జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్
నందమూరి అభిమానులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నా ఆ సమయం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురువారం(మార్చి 23న) హైదరాబాద్లో ఐటీసీ కొహినూర్లో వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. పూజ అనంతరం జక్కన్న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల ముహుర్తపు తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. దీంతో ఎంతో కాలంగా సస్సెన్స్లో ఉన్న ఈ మూవీ హీరోయిన్పై తాజాగా క్లారిటీ వచ్చేసింది. Sensational directors @ssrajamouli and #PrashanthNeel at the #NTR30 Puja and opening ceremony. - https://t.co/Uh0d9lsc89#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @YuvasudhaArts pic.twitter.com/IXZiYRR0BH — NTR Arts (@NTRArtsOfficial) March 23, 2023 #NTR30 Muhurtham clicks 😍😍@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @ssrajamouli #prashanthNeel @anirudhofficial @prakashraaj pic.twitter.com/KzyTigO4wQ — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 23, 2023 చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన రష్మిక.. ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. NTR30లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ టీంతో మాటలు కలుపుతూ సరదగా గడిపింది. తన అభిమాన నటుడు, కో-స్టార్ ఎన్టీఆర్ని కలిసిన సమయంలో ఆమె ఆనందంతో మురిసిపోయింది. ఎన్టీఆర్ ఆమె పలకరించగా ఆనందంతో ఆమె ముఖం మెరిసిపోయిన ఫొటో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. కాగా త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా ఎన్టీఆర్ 30ని వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు తమిళ యంగ్ మ్యూజిక్ సన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The main man @tarak9999 has lit up the #NTR30 Puja and opening ceremony 🔥🔥 Watch live! - https://t.co/VBPX14RSNd#NTR30Begins 🔥#JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts @NTRArtsOfficial pic.twitter.com/uminJeklOw — Vamsi Kaka (@vamsikaka) March 23, 2023 చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. -
NTR30: నెత్తుటి కత్తితో ముహూర్తం ఫిక్స్..
‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 23న జరపనున్నట్లు శనివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో కోర్టు సెట్ను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675 — NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023 -
ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్తో కలిసి హైదరాబాద్లో సముద్రం సెట్, ఓ దీవి సెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్తో తలపడేందుకు విలన్గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్ మూవీలో ఆదిపురుష్ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ 30 లో విలన్గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. విలన్గా సైఫ్ అలీఖాన్! మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక విలన్గా సైఫ్ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్కి ఊహించని గెస్ట్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఆహ్వానం! ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఎన్టీఆర్ 30 క్రేజీ అప్ డేట్.. కొరటాల భారీ యాక్షన్ ప్లాన్!
అమెరికాలో జరిగిన ఆస్కార్ హడావుడి ముగిసింది. ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ను ఆస్కార్ వరించింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇకపై తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 నుంచి అప్డేట్ రావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి నుంచి ఎన్టీఆర్ ఫోకస్ ఎన్టీఆర్ 30 పైనే పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మూవీ లాంఛ్ కార్యక్రమం ఈ నెల 18న గ్రాండ్గా జరగనుంది. ఆ తర్వాత మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 29 నుంచి ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. పీరీయాడికల్ మూవీగా తెరకెక్కించనున్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ సముద్రం బ్యాక్ డ్రాప్లోనే కనిపించింది. ఆ ఫస్ట్ లుక్లో సముద్రం ఒడ్డున వున్న రాయిపై జాన్వీ కపూర్ కూర్చొని ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సముద్రం సెట్ మాత్రమే కాదు... ఓ దీవి లాంటి సెట్ కూడా రెడీ చేయించారు. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తలపడేందుకు విలన్గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కనిపంచనున్నారు. ఈ సినిమా ప్రారంభం రోజే కొరటాల నటీనటుల పేర్లను ప్రకటించనున్నారు. ఆచార్యతో డిజాస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న కొరటాల...ఎన్టీఆర్ 30తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్గా మారింది. డైరెక్టర్ కొరటాల ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్నే యాక్షన్ సీక్వెన్స్తో ప్లాన్ చేశారట. ఈ భారీ యాక్షన్ ఫైట్ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా కంపోజ్ చేశారనే టాక్. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్గా నిలవనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.ఈ సినిమాలో లావుగా కనిపించేందుకు ఎన్టీఆర్ కొంచెం బరువు కూడా పెరిగాడు. కాగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ 30 మూవీ ఫుల్ యాక్షన్ మూవీ తెలియటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ ఖాయం..!
‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 టైటిల్ ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ 30 చిత్రంలో నటించేదుకు జాన్వీ ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో టాలీవుడ్లో జాన్వీ ఎంట్రీ యంగ్ టైగర్తోనే మొదలవనుంది. దీనిపై ఈ నెలాఖరులో మరింత స్పష్టత రానుంది. ఎన్టీఆర్ 30 చిత్ర బృందం గత 6 నెలలుగా పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ చివరికి జాన్వీ కపూర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్కు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయడం ఖాయం. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నెలాఖరులోగా సెట్స్పైకి వెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుంచి సెట్స్పైకి వెళ్లి 6 నుంచి 7 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
NTR 30 నుంచి క్రేజీ అప్డేట్! అప్పుడే షూటింగ్ స్టార్ట్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించిన అనంతరం కొరటాల, ఎన్టీఆర్ సైలెంట్గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా మూవీ రిలీజ్ చేసింది చిత్రం బృందం. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అయితే ఈ మూవీ ఇప్పటి వరకు సెట్స్పైకి రాని విషయం తెలిసిందే. దీంతో ఇంకా షూటింగ్యే మొదలు పెట్టని సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకొనుందట. హైదరాబాద్లోనే తొలి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించి షూటింగ్ జరుగనుందని సమాచారం. కాగా ఆచార్య మూవీ ప్లాప్తో కొరటాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కొరటాల గత చిత్రాల తరహాలోనే సామాజికాంశాలకు కమర్షియల్ హంగులను మేళవించి ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవర్నది ఖారారు కాలేదు. గతంలో జాన్వీ కపూర్, అలియా భట్ల పేర్లు వినిపించగా తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. -
NTR 30:ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించి చాల నెలలు అయినప్పటికీ.. ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం బృందం ఓ క్రేజీ అప్డేట్ని వదిలి పుకార్లకు చెక్ పెట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఎన్టీఆర్. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఒక హిట్ ఎన్టీఆర్కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్ కొరటాలకి అవసరం. A man's fury is the cure for a disease called courage 🔥🔥#NTR30 in cinemas on April 5th, 2024 💥 Shoot begins next month 💥 Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ — NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023 -
ఎన్టీఆర్ 30 అప్డేట్: మూవీ సెట్స్పైకి వచ్చేది అప్పుడేనట!
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్30 (NTR30) మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సెట్పైకి రాలేదు. చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియోతో చెక్ దీంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇటివలె ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రీప్కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పట్లో ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్ రానట్లేనా? అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం కొత్త సంవత్సరంలోనే ఈ మూవీ సెట్స్పైకి రానుందని తెలుస్తోంది. చదవండి: ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సంక్రాంతికి కుదిరిందనీ, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫిల్మ్నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం చిత్ర బృందం ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్న తారక్ న్యూఇయర్ వేడుకలను అక్కడే జరుపుకొనున్నాడట. జూ. ఎన్టీఆర్ వచ్చాకా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రానికి తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. -
న్యూ లుక్లో యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా ఆ క్రేజే వేరు. తాజాగా న్యూ లుక్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు యంగ్ టైగర్. తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ కొత్త స్టైల్ అంతా తదుపరి చిత్రం 'ఎన్టీఆర్30' కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇన్స్టాలో స్టోరీలో పోస్ట్ చేస్తూ..' ఏ న్యూ డే.. ఏ న్యూ వైబ్' అలీమ్హకీంతో మరోసారి అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్తో పాటు హెయిల్ స్టైలిస్ట్ అలీమ్ హకీం కూడా వెనకవైపు ఉన్నారు. దీనిపై జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాలో లుక్ ఇదేనంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) కాగా.. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన పోస్టర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించి మేకర్స్ ట్వీట్ చేశారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ కలిసి చర్చిస్తున్నట్లుగా ఫోటోలు ట్విటర్లో షేర్ చేశారు. ఈ నెలలోనే సినిమాను లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించలేదు. తాజాగా ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. కొరటాల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ సైతం మార్చుకున్నారు. అయితే గతంలో కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వైరలైంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు టాక్. #NTR30 pre production in full swing 💥 Director #KoratalaSiva, @RathnaveluDop and @sabucyril putting in their best to create a spectacular cinematic experience ❤️🔥@tarak9999 @anirudhofficial @sreekar_prasad @NANDAMURIKALYAN @YuvasudhaArts pic.twitter.com/ysBe45WEiK — NTR Arts (@NTRArtsOfficial) November 6, 2022 -
షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్
-
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిదిపోయే గుడ్ న్యూస్. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్తో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన ఈ పోస్టర్లో జూనియర్ సముద్రంలో నిలబడి ఆయుధాలు పట్టుకుని కనిపించగా అది నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్) ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 12న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. -
'ఆచార్య' ఫ్లాప్.. స్పందించిన మెగాస్టార్
మొదటిసారి తండ్రి, తనయుల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. తాజాగా ఆ మూవీ ఫెయిల్యూర్పై మెగాస్టార్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. భారీ అంచనాలతో రిలీజైన ఆచార్య బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆచార్యపై చిరంజీవి మాట్లాడుతూ 'సినిమా ఫలితం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. మన పనిలో మనం బెస్ట్ ఇస్తామంతే. ఆచార్య పరాజయం నన్ను బాధ పెట్టలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేం చేశాం. ఈ చిత్రంలో చిన్న విచారం ఏంటంటే.. చరణ్ నేను కలిసి మొదటిసారి నటించాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే అంతటి హైప్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు' అని అన్నారు. చిరంజీవి, రామ్చరణ్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' రిలీజ్కు సిద్ధమైంది. దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది. -
NTR 30: జూనియర్ ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో ‘నేషనల్ క్రష్’?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్30(NTR30) మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ను ప్రకటించినప్పుటి నుంచి ఎన్టీఆర్ 30కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ను జరపుకోనుంది. చదవండి: అషురెడ్డి బర్త్డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి ఈ క్రమంలో ఇందులో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా.. ఆ తర్వాత సమంత ఫైనల్ అయ్యిందన్నారు. రెమ్యునరేషన్ విషయంలో సమంత ఈ ప్రాజెక్ట్కు నో చెప్పగా.. అసలు ఈ ఈ ప్రాజెక్ట్ ప్రస్తావనే తన దగ్గరికి రాలేదని జాన్వీ స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకున్న అంశం. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. డైరెక్టర్ కొరటాల నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఈ సినిమాలో హీరోయిన్గా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ను సొంతం చేసుకుంది రష్మిక. దీంతో భాషతో సంబంధం లేకుండ సౌత్, నార్త్లో వరసు పెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె క్రేజ్దృష్ట్యా రష్మికను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చిత్రం బృందం భావిస్తోందట. ఇప్పటికే ఆమెను కలిసి కొరటాల కథ చెప్పాడని, దీనికి ఆమె ఒకే కూడా చెప్పిందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. కాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుందని సమాచారం. -
జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్?
ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రేంజ్లో ఎన్టీఆర్ 30 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ప్రస్తుతం తారక్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర్తసుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి రానుంది. అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం కోసం కొరటాల భారీ తారాగణంతో ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి కథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతిబాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం అలాగే ఇందులో పవర్ఫుల్ మహిళా పాత్ర ఉందట. దానికి కోసం అలనాటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెను కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సుదీర్ఘ విరామం అనంతరం ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లే చేశానని, ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదన్నారు. మళ్లీ అలాంటి పాత్ర వస్తే చేస్తానని చెప్పిన విజయశాంతి ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ మరి విజయశాంతి ఎన్టీఆర్ సినిమాకు ఒకే చెప్తుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరోయిన్ సమంతల పేర్లు వినిపంచగా వీరు ఈ ప్రాజెక్ట్ చేయట్లేదనేది స్పష్టమైంది. మరి కొరటాల చివరకు హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. -
ఆచార్య ఎఫెక్ట్.. ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల కీలక నిర్ణయం!
ఆర్ఆర్ఆర్ తర్వాత ఏంటి ? ఈ ప్రశ్నకి ఆల్రెడీ రామ్చరణ్ సమాధానం చెప్పేశాడు. స్టార్ డైరె క్టర్ శంకర్తో సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. మరో పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకి వెళ్లిపోయింది.ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ మాత్రం ఇంకా కెమెరా ముందుకు రాలేదు. తర్వాత చిత్రం కొరటాల శివతో చేయాల్సి ఉంది. అయితే ఆచార్య ప్లాప్తో ఎన్టీఆర్ మనసు మార్చుకున్నారని, కొరటాల సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ మూవీనే స్టార్ట్ అవుతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. కొరటాల శివతోనే ఎన్టీఆర్ సినిమా ఉంటుందట. ఈసారి ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో రంగంలోకి దిగబోతున్నారట. జనతా గ్యారేజ్కి మించి న హిట్ ఇవ్వడానికి కొరటాల స్క్రిప్ట్ సిద్ధం చేసేశాడన్నది ఆ వార్త సారాంశం. (చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్కు కారణం ఇదేనా?) వాస్తవానికి ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే ఎన్టీఆర్తో కొరటాల తీయబోయే సినిమాపై అంచ నాలు పెరుగుతూ వచ్చాయి. అయితే…ఆచార్య ఫ్లాప్తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కొరటాల చెప్పిన కథ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదట. కొన్ని మార్పులు సూచించారట. ఇన్నాళ్లు మార్పులు మీద ఫోకస్ పెట్టిన కొరటాల.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ కథని పూర్తిగా పక్కనపెట్టి మరో కథకి పదును పెట్టారట. (చదవండి: జూ.ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!) సముద్రం, షిప్లు సినిమాలో కొంత భాగం ఉంటాయట. అలానే మాఫియా బ్యాక్గ్రౌండ్లో మూవీ సాగుతోందట. దీంతో…సందేశాత్మక కథకి కమర్షియల్ టచ్ ఇస్తూ సినిమాలు తీసే కొరటాల… ఈసారి యాక్షన్, మాస్ డోస్ పెంచబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో …మిర్చికి మించి మసాలా ఉండొచ్చని, అదే జరిగితే మరో బ్లాక్బస్టర్ ఖాయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఎన్టీఆర్. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్ని ఎదుర్కొన్నాడు. నిజానికి కొరటాల శివ కెరీర్లో ఇదే ఫస్ట్ ఫ్లాప్. చిరంజీవి, రామ్చరణ్లను పెట్టుకుని కొరటాల యావరేజ్ మార్క్ కూడా దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఒక హిట్ ఎన్టీఆర్కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్ కొరటాలకి అవసరం. అందులోనూ ఇది పాన్ ఇండియా మూవీ. అందుకే యాక్షన్ జానర్ అయితే పాన్ ఇండియా సినిమాకి కరెక్ట్గా సెట్ అవుతుందని కొరటాల భావిస్తున్నారట. కథ తుది మెరుగు లు దిద్దుకుంటుందని.. ఎన్టీఆర్ నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే నవంబర్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. -
జూ.ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా ఎన్టీఆర్ 30 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. ఈ క్రమంలో హీరోయిన్ వేటలో ఉంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఇందులో ఎన్టీఆర్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ఆ తర్వాత రీసెంట్గా సమంత పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు కొరటాల సమంతను సంప్రదించారనే వార్తలు బయటకు రావడంతో తారక్తో సామ్ మరోసారి జతకట్టనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కు సమంత నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ కుదరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సమంత అడిగినంత పారితోషికం మేకర్స్ ఇవ్వలేకపోయారట. కొరటాల ఈ మూవీ కోసం హీరోయిన్కి రూ. 2.5 కోట్ల ఫిక్స్ చేశారట. అయితే సామ్ మాత్రం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. కానీ, కొరటాల రూ. 2.5 కోట్లు మాత్రమే ఇస్తామనడంతో సామ్ ఈ ప్రాజెక్ట్ చేయనని తెగేసి చెప్పినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం కానీ సమంత కానీ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా గతంలో కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. చదవండి: నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: స్టార్ హీరోయిన్ బ్లాక్బస్టర్ హిట్ అయిన ఈ చిత్రంలో సమంత కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమెను ఫుల్లెన్త్ హీరోయిన్గా తీసుకోవాలని భావించిన కొరటాల ఆమెను సంప్రదించాడట. కానీ సామ్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ సినిమాను వదులుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్స్ చేతిలో ఉన్నంత మాత్రానా అంత తలపోగరు ఎందుకంటూ సమంతను తిట్టిపోస్తున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తుంది. అరేంజ్మెంట్స్ ఆప్ లవ్ అనే చిత్రంతో ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిననున్న ఈ చిత్రంలో సామ్ లెస్బియన్ పాత్రలో నటించనుంది -
జూనియర్ ఎన్టీఆర్కు అస్వస్థత అంటూ వార్తలు.. నిజమేంటంటే?
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయన తర్వాతి సినిమాల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడ్డాడని, దీంతో ఈ సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా పడనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తారక్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. ముందైతే కొరటాల శివను పక్కా సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అప్పటివరకు తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్ను ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్30గా రూపొందే ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్ అటెంప్ట్, ఫేస్బుక్లో వీడియో సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
ఎన్టీఆర్ 30: సెట్స్పైకి వచ్చేది అప్పుడే!
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కోరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ 30 రూపొందే ఈ చిత్రం ఇప్పటికే సెట్స్పైకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ను కూడా కొరటాల టీం ఇవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫిదా చేసిన ప్రభుదేవా.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల స్క్రీప్ట్లో కొన్ని మార్పులు, చెర్పులు చేసే పనిలో ఉన్న కొరటాల దాన్ని పూర్తి చేశారట. అంతేకాదు త్వరలోనే ప్రీ ప్రోడక్ష్న్ పనులను కూడా మొదలు పెట్టి మూవీని సెప్టెంబర్లో సెట్స్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రంలోని హీరోయన్ ఇతర తారగణంకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. కాగా ఎన్టీఆర్30(NTR30)గా రూపొందే ఈ ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు..
‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్దాదా ఎమ్బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్కు చికిత్స చేయించుకుని ఆరోగ్యంతో తిరిగొచ్చిన సోనాలి బింద్రె ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్సిరీస్తో రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో బిగ్బి సందడి, ఫొటో వైరల్ ఇటీవల జూన్ 10న ఈ వెబ్ సిరీస్ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించింది. సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపంచాయి. చదవండి: మైక్ టైసన్ బర్త్డే, స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపిన ‘లైగర్’ టీం తాజాగా సోనాలి బింద్రె ఈ వార్తలను కొట్టి పారెసింది. తను ఆర్థికంగానూ, అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్ కావాలనొ అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ‘నాకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం కాదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సంతకం చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండ చేస్తాను’ అని తెలిపింది. -
కొరటాలపై కోపంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంకా అలాగే ఎన్టీఆర్ కలిసి నటించారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ద్వారా వీరిద్దరు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులర్ అయ్యారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎన్టీఆర్ కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం వీరు ఇద్దరూ కూడా వారి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. అయితే కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలై దారుణంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఆచార్య ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద పడనుంది. (చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన) ఆచార్య సినిమా డిజాస్టర్ వల్ల ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా జనతా గ్యారేజ్ కు వంటి ఒక మంచి స్క్రిప్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పట్టాలెక్కి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ వల్ల మూడేళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ..ఇక ఈ సినిమా ద్వారా తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించటం లేదు. ఇక ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. -
ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Sonali Bendre Reacts On Acting In NTR 30 Movie With koratala Siva: ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం గురించి అడగ్గా స్పందించారు. ఏంటి ? నేనా ? అసలు దాని గురించే నాకు తెలియదు. దయ చేసి దాని గురించి మీరే చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా తెలియదు. నిజంగా అది నేను కాదేమో. ఇవన్ని తప్పుడు వార్తలు. ఒకవేళ అది నిజమైతే నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్లా ఉంది. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సోనాలి బింద్రే. ప్రస్తుతం సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్లో జర్నలిస్ట్ అమీనా ఖురేషీ పాత్రలో నటిస్తోంది. వినయ్ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. చదవండి:👇 నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అది అల్లు అర్జున్ స్టోరీనా?.. కొరటాల, ఎన్టీఆర్ మూవీపై నెట్టింట చర్చ
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా గురించి అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమా కథను కొరటాల ఎప్పుడో రాసుకున్నాడని, ఓ స్టార్ హీరోతో ఆ చిత్రాన్ని తీయాలనుకున్నాడట. అది కుదరకపోవడంతో అదే కథతో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల మొదట అనుకున్న స్టార్ హీరో అల్లు అర్జునే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య రిజల్ట్ కొరటాలకు షాకిచ్చింది. ఈ సమయంలో ఆయన కొత్త కథ రాసుకోవడం కాస్త కష్టమే. అందుకే గతంలో రాసి పెట్టుకున్న బెస్ట్ స్టోరీనే పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యాడట. గతంలో ఈ కథని బన్నీకి వినిపించాడట. ఈ స్టోరీతోనే సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు మాట తప్పి యంగ్ టైగర్తో ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఈ రూమర్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. (చదవండి: పాన్ ఇండియా స్టార్డమ్ కోసం సేఫ్సైడ్ గేమ్!) గతంలో తివిక్రమ్ కూడా ఎన్టీఆర్ విషయంలో ఇలానే చేశాడు. అజ్ఞాతవాసితో డిజాస్టర్ తర్వాత వెంటనే తారక్ సినిమా ఉన్నప్పుడు.. గతంలో తాను పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న కోబలి కథ నుంచి కొంత తీసుకుని అరవింద సమేత స్టోరీని డెవలప్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కొరటాల కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. -
అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేసిన ఆచార్య.. ఎప్పుడంటే
చిరంజీవి, రామ్చరణ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈనెల 20న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. అయితే అదే రోజున రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుండటం విశేషం. they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7 — amazon prime video IN (@PrimeVideoIN) May 13, 2022 -
ఎన్టీఆర్ 31వ మూవీ డైరెక్టర్ అతనేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు. ఆయన బర్త్డే నాడు అంటే మే 20న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంది. అదే రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుదంట. బర్త్ డే కానుకగా కొరటాల సినిమాతో పాటు మరో సినిమా గురించి కూడా అప్ డేట్స్ రానుందట. ఆ మూవీ ఎవరిదీ? కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్దా లేక లేక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుదా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు సస్పెన్స్గా మారింది. ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్ ఎవరనేదానిపై ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ జోరుగా డిస్కస్ చేస్తున్నారు. టైగర్ రీసెంట్ గా కేజీయఫ్ 2 డైరెక్టర్ తో కనిపించాడు.ఆయనే 31 వ సినిమా దర్శకుడు అనేది ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. (చదవండి: ‘బాలీవుడ్’ వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ) అయితే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా చాలా కాలంగా తారక్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు.ఈ దర్శకుడి తోనే టైగర్ తన 31వ చిత్రం చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది.ఉప్పెన తర్వాత కేవలం తారక్ ను దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ జానర్ లో బుచ్చిబాబు ఒక స్టోరీ రాసిపెట్టుకున్నాడు. కేవలం తన కోసమే చాలా కాలంగా బుచ్చిబాబు వెయిట్ చేస్తుండటంతో 31వ సినిమా తారక్ తనతోనే చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా 31 వ చిత్రం ఎవరితో అనేది మే 20న క్లారిటీ రానుంది. మరో వైపు ఆచార్య రిజల్ట్ తో బాగా డిస్టర్బ్ అయ్యాడు కొరటాల శివ. అందుకే షూటింగ్ కు మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నాడు తారక్. ఇప్పటికే కంప్లీట్ అయిన ప్యాన్ ఇండియా స్టోరీని కొరటాల రీరైట్ చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. అందుకే ఈ మూవీని జూన్ నుంచి కాకుండా జులై లేదా ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించాలనకుంటున్నారట. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4441454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్!
Prashanth Neel, Jr NTR Movie Shooting Starts Soon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్ని పవర్ ఫుల్ పొలిటీషియన్గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2, సలార్ మూవీ షూటింగ్లతో బిజీ కారణంగా ఈ ప్రాజెక్ట్పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇప్పటికే ఎన్టీఆర్కు ఒక లైన్ స్క్రిప్ట్ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును ‘దసరా’ రోజున లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగు కూడా మొదలవుతుందని ఫిలిం దూనియాలో టాక్. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ సెక్సెస్తో ఫుల్జోష్లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్ మూవీ కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మే 5న ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్లు వారి వివాహ వార్షికోత్సవాలను ఇరు కుటుంబాలతో కలిసి ఒక్కచోటే సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్-లిఖిత, ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వార్షికోత్సవం ఒకేరోజు కావడం విశేషం. చదవండి: నటికి చేదు అనుభవం, అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులు -
‘ఆచార్య’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘ఆచార్య’ నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: నిరంజన్రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ దర్శకుడు: కొరటాల శివ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫి: తిరు ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 29,2022 మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం( ఏప్రిల్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ధర్మస్థలి.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ అది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య(చిరంజీవి). బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ మొదలు..‘ భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీస్తే.. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. కొత్త కథని ఆశిస్తారు. కానీ కొరటాల మాత్రం ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు. కథను పక్కకు పెట్టి.. స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు డైరెక్టర్. మహేశ్ బాబు వాయిస్ ఓవర్తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడం, రెండు పాటలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ... కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవుతుంది. దీంతో సెకండాఫ్పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్ మినహా మిగతాదంతా సింపుల్గా సాగుతుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. అయితే నక్సలైట్స్గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక నీలాంబరి(పూజా హెగ్డే), సిద్ధల మధ్య వచ్చే సీన్స్ అయితే కథకు అతికినట్టుగా ఉంటాయి తప్ప..ఎక్కడా ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది. ‘లాహే లాహే’ ‘భలే భలే బంజారా' సాంగ్కి రామ్ చరణ్తో చిరు వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం మెగాస్టార్ ప్రత్యేకత. ‘ఆచార్య’గా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్ సీన్స్తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా లాహే లాహే పాటతో పాటు స్పెషల్ సాంగ్కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ‘భలే భలే బంజారా’ సాంగ్కి రామ్ చరణ్తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్ చరణ్. ప్రతి సీన్లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. ఇక విలన్గా సోనూసూద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం అంతంత మాత్రమేనని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఓకే. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ధర్మస్థలి టెంపుల్ టౌన్ని తెరపై చక్కగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 29)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ఫస్టాప్ డీసెంట్గా ఉందని, సెకండాఫ్లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. #Acharya 1st half - Decent and Ordinary 2nd half - 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma 👍🏻 Overall my Rating is 3.5/5@AlwaysRamCharan #AcharyaOnApr29 — Mahi Reviews (@MahiReviews) April 28, 2022 Just come back ... Confidently tell you , extra shirt tesukellandi .. 2nd half their both screen presense , fights, songs and climax boss viswaroopam ... Sure shot hit ..#Acharya #AcharyaOnApr29 — Venky Tiranam (@Venkytiranam) April 28, 2022 First half : Edho ala vellipoyindhi .. #Acharya Slow Paced , no elevations no high Not at all Koratalaaa movie ..😭 pic.twitter.com/aXi2zePm5T — Uday #SVPonMAY12🔔 (@UDAyVarma1882) April 29, 2022 ఫస్టాఫ్ ఏదో అలా వెళ్లిపోయింది. ఎలివేషన్స్లేవు... స్లోగా సాగుతుంది. ఇది కొరటాల సినిమాలా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Okka high moment ledu till now 2nd half aina bagundali 😭🤞 Mani sir e range rod 🤧🤧#Acharya https://t.co/SOplnQC0nl — సినిమా పిచ్చోడు (@KPReddy_) April 29, 2022 #Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే@kchirutweets ఏ పాత్ర అయిన నీకు 👌 pic.twitter.com/U1PtiasD5c — BaLu (@RCharaaan) April 29, 2022 #Acharya show complete super hit movie 3.5/5... Pakka hit chusi cheppandi.. Chudakunkunda cheppoddu plzzz — RangaSwamyReddy (@rangas312) April 29, 2022 Genuine review :- Frist half story narration Superbbb & #Chiranjeevi garu Dance Grace 👌🔥💥.E age lo kuda ha grace ante Really impressive. #ManiSharma garu music is Highlight.Interval bang aythe Mass Rampage 💥🤙#SIDDHA #Ramcharan acting is so gud upto now.Overall gud #Acharya pic.twitter.com/O1WTExwPBk — 🕊 புதியபறவை 🕊 (@MigaMike) April 29, 2022 #Acharya is terrible. Might have been considered a good actioner had it released a decade ago. Sticks to the most basic revenge template. The writing and characters are so bland that it even renders a performer like Chiranjeevi charmless. Even Mani Sharma couldn't salvage this. — Ram Venkat Srikar (@RamVenkatSrikar) April 29, 2022 Climax takes Charan to another level as an actor and puts #Acharya to a blockbuster. Apart from first 20mins of second half it is full of high moments — Manish Polisetty (@endhukureturns) April 28, 2022 An outright DISASTER.. a pointless story that goes no where, highly outdated. nothing worked for the movie everyone and everything is weakest. Only bhanjara song is good.. don't dare to watch 1/5 #Acharya — Peter (@urstrulyPeter) April 28, 2022 #Acharya Overall a low-grade 1st half with a slightly better but still outdated 2nd half! Apart from a few scenes and enjoyable dances, nothing else works. Outdated screenplay/story with poor BGM and VFX. Kortala’s Weakest Work by far. Rating: 2-2.25/5 — Venky Reviews (@venkyreviews) April 28, 2022 First half is dope 🔥! Idhi kada Megastar ante anattundhi. Not just for fans it is made for every normal cinema goer. Apart from that one scene of Chamak Chandra comedy everything else is fcking fabulous! Dont miss this rebooted Siva Shankar Vara Prasad Rao #Acharya — Manish Polisetty (@endhukureturns) April 28, 2022 -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను స్పీడ్గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్తో చిట్చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్చాట్లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య'
Koratala Siva Interesting Comments On Acharya Movie: ‘‘నా సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాటి తాలూకు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. నావి సందేశాత్మక సినిమాలు అనుకోను. ఒకవేళ నా సినిమాల వల్ల ప్రభావితమై మంచి పనులు జరిగితే చాలా సంతోషపడతాను’’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 28) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కొరటాల శివ పంచుకున్న విశేషాలు. నక్సలిజం బ్యాక్డ్రాప్ ఉండే ఓ వ్యక్తి ఓ టెంపుల్ టౌన్లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఆచార్య’ కథ రాసుకున్నాను. ఏ సినిమాలో అయినా విలన్పై హీరో పోరాడుతున్నాడు అంటే అది ధర్మం కోసమే. అయితే ధర్మం అవసరం అని ‘ఆచార్య’ సినిమాలో అండర్లైన్ చేశానంతే. కాకపోతే కథా నేపథ్యం కాస్త కొత్తగా ఉంటుంది. చదవండి: సిద్ధ పాత్రను పవన్ కల్యాణ్ చేసేవాడు!: చిరంజీవి ఇద్దరి లక్ష్యం ఒక్కటే ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్లో సిద్ధ అనే విద్యార్థి (రామ్చరణ్ పాత్ర) ఏ సమస్యని అయినా సరే అందంగా డీల్ చేస్తాడు. కానీ ‘ఆచార్య’ (చిరంజీవి పాత్ర పేరు) ఆవేశపరుడు. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. టెంపుల్ టౌన్లో ఉన్న సిద్ధ ఎందుకు అడవులకు వెళ్లాడు? అడవుల్లో ఉండాల్సిన ‘ఆచార్య’ ఎందుకు టెంపుల్ టౌన్కు రావాల్సి వచ్చింది అన్నదే కథ. రెండు కళ్లు చాల్లేదు చిరంజీవిగారు ఏ స్థాయి కమర్షియల్ స్టారో నాకు తెలుసు. ఆయన ఇమేజ్ను తగ్గించకుండా కమర్షియల్ పంథాలోనే ‘ఆచార్య’ కథ చెప్పాం. మాస్ ఎంగేజింగ్ బ్లాక్స్ ‘ఆచార్య’లో చాలానే ఉన్నాయి. తండ్రీ కొడుకులు కాబట్టి చిరంజీవి, చరణ్ల మధ్య మంచి సింక్ ఉంది. ఇద్దరూ బాగా చేశారు. ఇద్దరూ నటిస్తుంటే చూడ్డానికి నాకు రెండు కళ్లూ సరిపోలేదు. సిద్ధ క్యారెక్టర్ ఇంట్రవెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఫ్రీగా చేయలేదు ‘ఆచార్య’ సినిమాని ఫ్రీగా చేయలేదు. రిలీజ్ తర్వాత పారితోషికాలు తీసుకుంటాం. ప్రతి సినిమా నాకు టెన్షనే. ఓ పరీక్ష రాసినట్లే. పరీక్ష బాగా రాయకపోతే ఏ సమస్యా లేదు. అదే బాగా రాస్తే మనం అనుకున్న మార్కులు వస్తాయా? రావా? అని టెన్షన్. ‘ఆచార్య’ పరీక్ష బాగా రాశాను. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ సినిమా అప్డేట్.. నా తర్వాతి సినిమా ఎన్టీఆర్తో ఉంటుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే.. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. 'నేను తెలుసుకున్న పవర్ఫుల్ సోల్స్ క్యారెక్టర్స్లో స్వామి వివేకానంద ఒకరు. మీడియా, సోషల్ మీడియా వంటి మాధ్యమాలు లేని రోజుల్లో కూడా ఆయన వల్ల చాలామంది ప్రభావితం అయ్యారు. ప్రపంచం మొత్తం చూసేలా చాలా పెద్ద స్థాయిలో స్వామి వివేకానందగారి మీద ఓ సినిమా చేయాలని ఉంది. కానీ చాలా పరిశోధన చేయాలి. నాకు అంత అనుభవం రావాలి. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ‘గాంధీ’ సినిమాను ఎలా తీశారో అలా తీయాలని ఉంది.' అని కొరటాల శివ పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రామ్చరణ్ (ఫొటోలు)
-
అమ్మవారిని దర్శించుకున్న రామ్చరణ్, ఆలయంలో ఫ్యాన్స్ రచ్చ!
సాక్షి, విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రామ్ చరణ్, కొరటాల శివ కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతరం రామ్చరణ్ను చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు. దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలిచ్చారు. మొబైల్ ఫోన్లతో వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడ్డారు. పోలీసులు, ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. దుర్గ గుడి దర్శనం అనంతరం చరణ్, శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Mass @AlwaysRamCharan Fans🔥😎🤙#acharya #AcharyaOnApril29th #RamCharan #SIDDHA pic.twitter.com/Lha6KP7JRe — SIDDHA (@Pavanlucky988) April 27, 2022 చరణ్ బాబు ఎక్కడికైనా వస్తే అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకి పంపుతుంది అనిపించేంత జనసముద్రం🤙🔥 బెజవాడ సన్నిధిలో చరణ్ అభిమానుల సింహ గర్జన 🔥🤙 బెజవాడ గడ్డ 🔥చరణ్ బాబు అడ్డా🔥@AlwaysRamCharan #RamCharan #AcharyaOnApr29 #Acharya pic.twitter.com/fX7LwzHDSK — TeamRC_Chittoor (@RcChittoor) April 27, 2022 Security arrangements should have been better... Man Of Masses #RamCharan Swamy in Vijayawada With Director #KoratalaSiva garu !! Visiting Kanaka durgamma Temple Today ❤️🙏 pic.twitter.com/FgRrydSoKx — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 #RamCharan craze all over 🔥👌🏻 #Acharya promotionspic.twitter.com/LS0FbYUvBM — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 చదవండి: ఆచార్య ఫస్ట్ రివ్యూ: రామ్చరణే బాస్! మరి చిరంజీవి? -
సిద్ధ పాత్రను పవన్ కల్యాణ్ చేసేవాడు!: చిరంజీవి
Chiranjeevi Interesting Comments On Acharya Movie And Ram Charan" ‘‘ఆచార్య’ సినిమాలో నేను, చరణ్ తొలిసారి కలిసినప్పుడు వచ్చే భావోద్వేగమైన సన్నివేశంలో గ్లిజరిన్ వాడకున్నా మాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ సీన్కి సెట్లో అందరూ ఉద్వేగానికి లోనై లంచ్ బ్రేక్కి కట్ చెప్పినా కదల్లేదు. నటన పరంగా చరణ్ పరిణితి చెందడం పట్ల ఓ తండ్రిగా, సహ నటుడిగా చాలా గర్వపడుతున్నా’’ అని చిరంజీవి అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ.. 'చరణ్ నటనను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ‘ఆచార్య’లో తన నటన కొత్తగా అనిపించలేదు (నవ్వుతూ). నటన పరంగా నేను ఇప్పటి వరకూ చరణ్కి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.. ఎవరు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం. తను ఇన్వాల్వ్ అయి చేస్తే ఒరిజినాలిటీ ఉంటుంది. తనకు తానుగా నేర్చుకుంటూ ఎదుగుతూ ఈ స్థాయికి రావడం హ్యాపీ.' 'చరణ్ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ సీన్ ఓకే అని చెప్పిన తర్వాత కెమెరా ముందు నుంచి సంతృప్తిగా పక్కకి వస్తాడు. సీన్ అయిపోయిన తర్వాత కారావ్యాన్లోకి వెళ్లకుండా సెట్లో అందరితోనూ కలివిడిగా ఉండటం, భోజనం చేయడం హ్యాపీ. సెట్స్లో నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్ చేయకపోతే ప్రత్యామ్నాయం నా తమ్ముడు పవన్ కల్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్ని పవన్ 100 శాతం తీసుకువస్తాడు.' '‘ఆచార్య’కి మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ చేస్తుండగా నాకు అన్యాయం చేశాడు చరణ్(నవ్వుతూ). సెట్స్కి సురేఖను(చిరంజీవి భార్య) రమ్మని నేను చెబితే, ‘రావొద్దమ్మా’అంటూ చరణ్ రాకుండా చేశాడు. ‘అమ్మ వస్తే నీతో నేను కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. మనం ఇలా షూటింగ్లో ఇన్ని రోజులు గడిపే అవకాశం మళ్లీ రావొచ్చు.. రాకపోవచ్చు.. ఇక్కడ మీతో కలిసి ఉండటం మధురానుభూతి..’ అంటూ సురేఖను సెట్స్కి రానివ్వకుండా చేశాడు.' 'నేను నిత్య విద్యార్థిని. నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరినీ ఆచార్యగానే భావిస్తా. నేను నటనను ‘అ ఆ’లతో ప్రారంభిస్తే చరణ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు. పాత పాత కలిస్తే ఏమవుతుంది మోత తప్ప. నేను పాత కాబట్టి కొత్త దర్శకులతోనే చేస్తున్నా(నవ్వుతూ). కొత్త దర్శకులతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నా.' ఇద్దరూ ఆ చాన్స్ ఇవ్వలేదు : కొరటాల శివ నా ఆలోచనల నుంచి వచ్చిన కథే ‘ఆచార్య’. పూర్తిగా కల్పితమైన స్టోరీ. ‘ఆచార్య’ లో కాషాయం, కమ్యూనిజం నేపథ్యాలను మాత్రమే తీసుకున్నాం. ధర్మం కోసం పాటుపడే ఇద్దరు బలమైన వ్యక్తుల కథ ఇది. ఇందులో సిద్ధ పాత్రకు మహేశ్బాబును తీసుకోవాలనుకోలేదు. చిరంజీవి, రామ్చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు మానిటర్లో ఎవర్ని చూడాలా అని కన్ప్యూజ్ అయ్యేవాణ్ణి. ఎలాంటి సన్నివేశంలోనూ వారిద్దరూ రీటేక్, రీషూట్కి చాన్స్ ఇవ్వలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా: రామ్చరణ్ ‘ఆచార్య’ లో నాన్న(చిరంజీవి)తో చేయడం నిజంగా ఒత్తిడితో కూడిన పనే. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా. రాజమౌళిగారు చెప్పినట్టు సెట్స్లోకి నేనెప్పుడూ తెల్లకాగితంలా వెళతా. పాత్రని అర్థం చేసుకుని డైరెక్టర్స్కి మౌల్డ్ అవుతాను. ‘ఆర్ఆర్ఆర్’ నా సినిమా. ‘ఆచార్య’ నాన్నగారిది. ఇందులో నేను అతిథి పాత్ర చేశా. మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబుకి థ్యాంక్స్. అడగడంలో తప్పు లేదు: చిరంజీవి కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుంటుపడింది. అలాంటప్పుడు చిత్రపరిశ్రమ మేలు కోసం చేయూత ఇవ్వండి అని ప్రభుత్వాలను వేడుకోవడం తప్పు కాదు. సినిమా పరిశ్రమ నుంచి 50కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. ప్రభుత్వాలు కనికరించి టిక్కెట్ ధరల పెంపు జీవోలు ఇచ్చాయి.. ప్రేక్షకులు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించడానికి అత్యధిక బడ్జెట్ పెట్టాం.. అనుకోని పరిస్థితుల్లో తీసుకున్న అప్పులకు అంతకంత వడ్డీలు అయ్యాయి. ప్రభుత్వాలకు మేము 42 శాతం పన్నులు కడుతున్నాం. వాటిల్లో నుంచి కొంత ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
‘ఆచార్య’ మూవీ (ఫొటోలు)
-
సురేఖ షూటింగ్కి వస్తానంటే చరణ్ వద్దన్నాడు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న చిరంజీవి, కొరటాల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చరణ్తో కలిసి సినిమా చేయడంపై చిరంజీవి మాట్లాడుతూ..'ఈ సినిమా ద్వారా చరణ్, నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఆచార్య షూటింగ్ కోసం మారేడుమిల్లిలో 12 రోజుల పాటు ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూం, జిమ్ షేర్ చేసుకున్నాం. ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్లో కోస్టార్స్గా ఒకే చోట టైం టైం స్పెండ్ చేయడం అన్నది బ్యూటిఫుల్ మూమెంట్. అప్పుడు షూటింగ్ చూసేందుకు వస్తానని సురేఖ చెప్పినా చరణ్ ఒప్పుకోలేదు. డాడీతో నేను ఉంటాను అని రావొద్దన్నాడు. కొడుకుగా చరణ్ ఎంత సంతోషడ్డాడో నేను కూడా అంతే సంతోషించా. తండ్రీ, కొడుకులుగా మా ఇద్దరికీ ఇది ఒక తీపి ఙ్ఞాపకంలా మిగిలిపోతుంది' అని పేర్కొన్నారు. ఆచార్య గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియాలంటూ పూర్తి వీడియో చూడాల్సిందే. -
‘ఆచార్య’ నుంచి కాజల్ అవుట్.. కారణం ఇదేనట
‘ఆచార్య’ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల మదిలో మెదిలిన ఓకే ఒక ప్రశ్న ఈ మూవీలో కాజల్ ఉందా? లేదా? ఉంటే ట్రైలర్లో ఎందుకు చూపించలేదు? ఒకవేళ ఆమె పాత్రని తొలగిస్తే.. కారణం ఏంటి?. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య నుంచి కాజల్ని తొలగించినట్లు సృష్టం చేశాడు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. ‘సినిమా అనుకున్నప్పుడు.. హీరో అన్నాక హీరోయిన్ పక్కా ఉండాలి అనుకున్నాం. అందుకే హీరోయిన్ కోసం ఓ ఫన్నీ క్యారెక్టర్ క్రియేట్ చేశాం. కాజల్తో నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. కానీ ‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదు. పాటలు పెట్టలేం. ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. ఆమెను తప్పుగా వాడుకుంటున్నట్లు అనిపించింది. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్) అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చెయ్ అన్నారు. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకో అని చెప్పారు. కాజల్కు ఇదే విషయాన్ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు. అందంగా నవ్వి.. అందరినీ మిస్ అవుతున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో కలిసి సినిమా చేద్దామని అన్నారు. అలా కాజల్ పాత్రను తొలగించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు. అయితే లాహేలాహే సాంగ్లో కాజల్ ఉంటుందా లేదా? విషయంపై మాత్రం కొరటాల క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసే తెలుసుకోవాలని చెప్పారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందుకే ‘ధర్మస్థలి’ సెట్ వేయాల్సి వచ్చింది: కొరటాల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ‘ధర్మస్థలి’అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారట. ‘ధర్మస్థలి’ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని మొదటి నుంచి ప్రచారం చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ‘ధర్మస్థలి’ ఎలా సృష్టించారో చెప్పారు దర్శకుడు కొరటాల శివ. ‘సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్ టౌన్ కావాలనుకున్నాం. చాలా ప్రాంతాలు తిరిగాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి.షూటింగ్ కాధ్యం కాదేమో అనిపించింది. చివరకు మేమే ‘ధర్మస్థలి’సృష్టించాలనుకున్నాం. ‘ధర్మం’గురించి చెప్పే కథ కాబట్టి ఆ టౌన్ పేరు కూడా ధర్మస్థలి అని పేరు పెట్టాం. ఆ పేరు మా టీమ్ మొత్తానికి నచ్చింది. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. (చదవండి: చరణ్కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..) దీంతో మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ఎన్నో దేవాలయాలను సందర్శించి, పరిశోధన చేసి సెట్ నిర్మించారు. ఆ సమయంలో మేము పూజలు కూడా చేశాం. దేవాలయాల పవిత్రత దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది? అక్కడి వెళ్దాం అనే అభిప్రాయం అందరిలో వస్తుంది. అదొక అందమైన ప్రదేశం. కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 ఎకరాల్లో సెట్ని నిర్మించాం’అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. All the hard work, devotion & vision behind building one of the India's Largest Set DHARMASTHALI. Watch the #SpiritOfDharmasthali ft #KoratalaSiva. - https://t.co/Sl9y4EmWK6#Acharya #Siddha#AcharyaOnApr29 pic.twitter.com/NIBQiku6Qb — Konidela Pro Company (@KonidelaPro) April 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరణ్కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఈవెంట్కు హోస్ట్గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్ను చూస్తారు: మెహర్ రమేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి
‘‘రాజమౌళిగారు ఓ బాట వేశారు. ఇక ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న సుకుమార్గారు తీసిన ‘పుష్ప’ ఇండియన్ సినిమా అయిపోయింది. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ అయిపోయింది. అల్లు అర్జున్, యశ్, రామ్చరణ్, ఎన్టీఆర్.. అఫ్కోర్స్ వీరందరి కంటే ముందు ప్రభాస్... పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. కంటెంట్లో బలం ఉంటే ఏ ప్రాంతం వారయినా అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు చెరిగిపోవాలి. భాషతో సంబంధం లేకుండా ఇది ఇండియన్ సినిమా. ప్రతి యాక్టర్ కూడా ఇండియన్ యాక్టర్.. అనేది రావాలి.. వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రామ్చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘1988లో నాగబాబు ‘రుద్రవీణ’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేం ఢిల్లీ వెళ్లాం. కార్యక్రమానికి ముందు హైటీ ఉంటుంది. ఆ హాలులో ఇండియా సినిమా వైభవం అంటూ కొన్ని సినిమాల పోస్టర్స్, యాక్టర్స్.. అంటూ క్లుప్తంగా కొంత నోట్స్ ఉంది. పృథ్వీ రాజ్కుమార్, దిలీప్కుమార్, దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్రగార్ల ఫొటోలు ఉన్నాయి. ఎమ్జీఆర్గారు, జయలలితగారు ఉన్న స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్గారి ఫోటో ఉంది. అంతే... కన్నడ కంఠీరవ రాజ్కుమార్గారిది కానీ విష్ణువర్ధన్ గారిది కానీ, మన గొప్ప నటులు ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగార్లు కానీ, తమిళంలో శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ లేవు. ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇటు ప్రాంతీయ సినిమాలకు కూడా సరైన గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను మద్రాస్లో కూడా ఈ విషయాలను ప్రెస్తో పంచుకున్నాను. కానీ నా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసింది. మావన్నీ ఇండియన్ సినిమాలే అని ప్రతి ఒక్కరు గర్వపడేలా, ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలాంటి సినిమాలు మనం రొమ్మువిరుచుకుని నిలబడేలా చేశాయి. అలాంటి సినిమాల రూపకర్త రాజమౌళి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళిగారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిని సభాముఖంగా అభినందిస్తున్నాను. రాజమౌళిగారు ప్రోత్సహించడం వల్లే ‘ఆచార్య’ సాధ్యమైంది. చరణ్ను, నన్ను కలిసి స్క్రీన్పై సురేఖ చూడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పటికీ చరణ్ ‘ఆచార్య’ చేయడానికి రాజమౌళిగారు ఒప్పుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మా ఇంటి సభ్యుడైపోయారు. ‘డాడీ సినిమాలో నేను కనబడితే చాలు అని!’ శివతో చరణ్ అన్నాడట. నేనంటాను... చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అన్న డౌట్ వచ్చింది. రాజమౌళిగారితో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలకు, వారి తర్వాతి సినిమాలు ఫ్లాప్స్ అనే టాక్ విన్నాను. అది ‘ఆచార్య’ రూపుమాపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మరో హిట్ అవుతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మగధీర’ టైమ్లో కథ చెప్పినపుడు చరణ్ విషయాలు చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారనుకున్నాను. కానీ తర్వాతి కాలంలో చిరంజీవిగారు చరణ్కి ఎటువంటి సలహాలు ఇవ్వరని తెలుసుకున్నాను. తన తప్పులను దిద్దుకొని, దర్శకుడు చెప్పిన ప్రతీది నేర్చుకొని, తనకు తానుగా ఎదిగిన వ్యక్తి రామ్చరణ్. చిరంజీవిగారు తనతో కలిసి నటించే వ్యక్తులతో, చివరికి ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఇది చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చిరంజీవిగారి అభిమానిగా చెబుతున్నా... చిరంజీవిగారు ఎంత బాగా నటించినా నా హీరో చరణే.. సినిమాలో బాగా నటించాడు (నవ్వుతూ). మంచి సందేశాలిచ్చే సినిమాల దర్శకుడు కొరటాల శివ. మాస్ చిత్రంగా ముందుకు వస్తున్న ‘ఆచార్య’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాన్ కరెప్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. సినిమాల ద్వారానే నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నేను మా నాన్నగారిని ఇన్నేళ్లుగా చూసి ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ, మారేడుమిల్లిలో 20 రోజులు నాన్నగారితో నటించి, దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవాలతో పోలిస్తే ఈ 20 ఏళ్లు నథింగ్ అనిపించింది. నాన్నగారితో నటించడం డబుల్ బొనాంజాలా భావిస్తున్నా. మా నిర్మాతలు పెద్ద పిల్లర్స్గా నిలిచారు’’ అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘1991లో నిర్మల్లోని ఓ థియేటర్కు వచ్చారు చిరంజీవిగారు. రోడ్లపై ఉన్న ఆ జనసందోహంలో నేనూ ఒకడిని. చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేయగలిగా. యాక్టర్స్, రెమ్యునరేషన్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అసలు పారితోషికం తీసుకోకుండానే సినిమా చేశారు. సినిమా రానివ్వండి.. వచ్చిన తరవాత తీసుకుంటాము అని నాకు సపోర్ట్ చేసిన నా ఇద్దరు హీరో (చిరంజీవి–చరణ్)లు, దర్శకుడికి థ్యాంక్స్. సినిమాల బిజినెస్ ఆంధ్రాలో ఎక్కువగా ఉండేది. తెలంగాణలో తక్కువ. అలా తెలంగాణలో బిజినెస్ పరంగా కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు .. ఇలా సినిమాల కలెక్షన్స్ పెరిగాయి. ఫలితంగా థియేటర్స్ పెరిగాయి. చిరంజీవిగారి సినిమాలతోనే అది జరిగింది. ఈ రోజు తెలుగు సినిమా పాన్ ఇండియా గురించి ఆలోచించగులుతోందంటే కారణం చిరంజీవిగారే’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి సినిమాల టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చించుకున్నాం. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలనుకుంటే ఇప్పుడు ఆయనతో కెమెరా, యాక్షన్ అంటూ సినిమాకి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. సినిమాకు ‘ఆచార్య’ అని టైటిల్ పెట్టాం. కానీ మాకు చిరంజీవి అనే ఒక ఆచార్య దొరికారు’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు: రామ్చరణ్ వెబ్ సిరీస్తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
'ఆచార్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశాను: చిరంజీవి
చిరంజీవి ఇంకా అర్ధాకలితోనే ఉన్నారు.. ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న సెలబ్రిటీకి ఆకలా? మెత్తటి పరుపులు ఉన్న స్టార్కి నిద్ర లేని రాత్రులా? ఎందుకు? నటన మీద ఉన్న ఆకలి అది.. వృత్తి మీద ఉన్న ప్రేమ అది.. అందుకే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మెగాస్టార్. ‘ఆచార్య’ రిలీజ్ సందర్భంగా ‘సాక్షి’కి చిరంజీవి ఇచ్చిన ‘ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ’ విశేషాలు. ► ‘ఆచార్య’ మీ సినిమాలా ఉంటుందా? లేక మీ చెర్రీ (రామ్చరణ్) సినిమాలానా? చిరంజీవి: నాలానో, రామ్చరణ్లానో ఉండదు.. కొరటాల శివగారి సినిమాలా ఉంటుంది. ఓ మంచి సందేశాత్మక కథకు మాస్ కమర్షియల్ అంశాలన్నీ కలిపి ప్రేక్షకుల మన్ననలు పొందేలా తన స్టైల్లో తీశారు. ఒక వైవిధ్యమైన నేపథ్యానికి సమకాలీన విషయాలను తీసుకున్నారాయన. నేను, చరణ్ ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి మా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవి పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేశారు శివగారు. ఆయన్నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలు కూడా ఉంటాయి. ► 150 సినిమాలకు పైగా చేసిన మీరు ఎన్నో కథలు విన్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ కథ విన్నప్పుడు ఏమనిపించింది? ఎవరైనా కథ వింటారు. కానీ, నేను కథను వినను.. చూస్తాను. అంటే.. ఇలా ఉంటుంది అని విజువలైజ్ చేసుకుంటాను. అలా కథని చూస్తున్నప్పుడు మనసుని, ఎమోషన్స్ని టచ్ చేస్తే చాలు.. వెంటనే ఓకే చెప్పేస్తాను. నా సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ కథ విన్నప్పుడే ఓకే చెప్పినవి తప్ప రెండు మూడుసార్లు విని, రికార్డు చేసుకుని మళ్లీ అవగాహన చేసుకుని ఓకే చెప్పలేదు. స్పాంటేనియస్గా నా మనసు స్పందిస్తే వెంటనే ‘యస్’ చెప్పేస్తాను. ‘ఆచార్య’కి నాకు, కొరటాలకి మధ్య ఒకే ఒక మీటింగ్ జరిగింది. కథ వినగానే మంచి అనుభూతి వచ్చింది.. చేద్దామని చెప్పాను. ► ఈ సినిమాలో మీరు, చరణ్ ఉండటం డబుల్ ధమాకా. మీ ఇద్దరి పాత్రలనూ దర్శకుడు బ్యాలెన్స్ చేయగలిగారా? మా ఇద్దర్నీ బ్యాలెన్స్ చేయడం కోసం శివ గారు ఏమీ చేయలేదు. కథకు అనుకూలంగానే మా పాత్రలు మలిచారు. అంతేకానీ బ్యాలెన్స్ గురించి ఆలోచించలేదు. ► నిజానికి చరణ్ది చిన్న పాత్ర అనీ, ఆ తర్వాత పెంచారనీ వార్తలు వచ్చాయి.. మరి నిజమేంటి? చరణ్ది చిన్న పాత్ర అని ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ ఫస్ట్ నుంచీ తనది ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే.. తర్వాత పెంచలేదు. చెప్పాలంటే ఫస్టాఫ్ హీరో నేను.. సెకండాఫ్ హీరో చరణ్. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇచ్చే ఫినిషింగ్ హృద్యంగా ఉంటుంది.. గుండె కదిలేలా ఉంటుంది. నేనీ సినిమాకి ‘యస్’ చెప్పడానికి అదే ప్రధాన కారణం. అది క్లయిమాక్స్కి ముందు చూస్తారు. సెకండాఫ్లో 50 శాతం చరణ్ ఉంటాడు.. మిగతా 50 శాతం ఇద్దరం కలిసి ఉంటాం. అందుకే డబుల్ ధమాకా అనేది కరెక్ట్ మాట. ► ‘భలే భలే బంజారా..’ పాటలో ‘తగ్గు...’ అని చరణ్ని అన్నారు? ఇప్పుడందరూ ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ యుఫోరియాలో ఉన్నారు. ‘నాటు నాటు’ పాటలో కుర్రాళ్లు (రామ్చరణ్–ఎన్టీఆర్) వీరకొట్టుడు కొట్టేశారు.. ‘ఓ మై గాడ్’ అనిపిస్తుంది. అందుకని ‘ఆచార్య’లోనూ చరణ్ నుంచి డ్యాన్స్లు ఎక్స్పెక్ట్ చేస్తారని, ఆ రకంగా చరణ్ ఉంటే నేను తేలిపోతానని తగ్గు అన్నాను (నవ్వుతూ). ‘నేను ఎంత ప్రయత్నించినా ఆ స్టైల్, మూమెంట్స్తో మీరు కొట్టేస్తారు డాడీ’ అని చరణ్ అన్నాడు. ► ‘ఆచార్య’లో ఇటు భక్తి అటు నక్సలిజమ్ని ఎలా మ్యాచ్ చేయగలిగారు? అదే శివ మ్యాజిక్. ఆయన మ్యాజిక్తో ‘ఆచార్య’ని అద్భుతంగా మలిచారు. మా సినిమా డ్రమటిక్ డైలాగ్స్తో ఫుల్ మాస్లా ఉండొచ్చు కానీ ఆయనలా కూడా... అంటే నిండు గోదావరిలో హాయిగా పడవ ప్రయాణంలా ఉంటుంది. కానీ నది కింద కరెంటు హెవీగా ఉంటుంది. ఆ కరెంట్ అన్నది ఈ సినిమాలో కమర్షియల్గా కనిపిస్తుంది. ► ‘భలే భలే బంజారా..’ పాట తీస్తున్నప్పుడు మీ అమ్మ (అంజనాదేవి), చరణ్ అమ్మ (సురేఖ) సెట్స్లో ఉన్నారు. మీ సతీమణిని ఇంప్రెస్ చేయాలని స్టెప్పులు వేశారా? లేక మీ అమ్మగారిని ఆనందపరచాలనా? తమ బిడ్డలు బాగా చేశారనిపించుకోవాలనే అందమైన పోటీ ప్రతి తల్లి ప్రేమలో ఉంటుంది. మా అబ్బాయి బాగా చేశాడని మా అమ్మ అంటే.. లేదు మా అబ్బాయే బాగా చేశాడని సురేఖ.. ఇలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరి ప్రెజెన్స్లో మేమిద్దరం షూటింగ్ చేయడం అనేది మాకు మంచి అనుభూతి. ► మామూలుగా రాజమౌళి తనతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోలు వేరే సినిమా చేసేందుకు ఒప్పుకోరు.. మరి ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న చరణ్కి ‘ఆచార్య’ చేయడానికి అనుమతి ఎలా లభించింది? ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమైనప్పుడే ‘ఆచార్య’ కూడా దాదాపు ప్రారంభమైంది. ముందు నా పాత్ర, ఇతర సన్నివేశాలన్నీ పూర్తి చే సి, క్లైమాక్స్ తీసేటప్పుడు చరణ్ వస్తే సరిపోతుందని కొరటాల అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో వైవిధ్యమైన గెటప్పులు ఉన్నాయి కాబట్టి మధ్యలో చరణ్ని బయటికి వదల్లేను అని రాజమౌళి అన్నారు. కానీ కరోనా వల్ల, షూటింగ్కి ఎక్కువ సమయం పట్టడం వల్ల రాజమౌళి ఒక్కటి ఆలోచించారు. ‘‘ఆచార్య’లోని సిద్ధ పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చేమో కానీ నువ్వు (రామ్చరణ్) చేస్తే వచ్చే అందం, నిండుదనం వేరుగా ఉంటాయి. పైగా కొరటాలగారు కూడా అడిగారు కాబట్టి నువ్వు ‘ఆచార్య’ చెయ్. నేను అడ్జెస్ట్ చేసుకుంటాను’’ అన్నారు రాజమౌళి. సిద్ధ పాత్ర చరణ్ చేస్తేనే అందం వస్తుంది.. తనే ఎందుకు చేయాలి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ పాత్రలో ఇంకో హీరోని ఊహించుకోలేం. అంటే నటన పరంగా కాదు... మాకున్న బంధం పరంగా కూడా ఆ సినిమా చేయాలి. ► బంధం అంటున్నారంటే సినిమాలోనూ తండ్రీకొడుకులుగా కనిపిస్తారా? ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. కానీ, ఆ అనుభూతి వస్తుంది. అదే కొరటాల మ్యాజిక్. ‘ఆచార్య’లో నేను కానీ, చరణ్ కానీ.. ఏ ఒక్కరు లేకున్నా వర్కవుట్ కాదు. ► కెరీర్ స్టార్టింగ్లో వరుసగా నాలుగైదు సినిమాలు చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? (నవ్వేస్తూ)... ఎనర్జీ అనేది ప్యాషన్ నుంచి వస్తుంది. నా నరనరాల్లో, అణువణువు సినిమా పట్ల ప్యాషన్ ఉంది. ఆ ఇష్టం జీవితకాలం ఉంటుంది.. అది మధ్యలో పోయేది కాదు. నేను ఎప్పుడు మేకప్ వేసుకున్నా, కెమెరా ముందు నిలబడినా, నా ముఖంపై ఆ లైట్లు పడినా ఎనర్జీ అనేది అలా పెల్లుబికి వస్తుంది. ► ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.. పైగా దాదాపు 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశారట.. యస్... ఈ మధ్య ఓ రెండు సినిమాల షూటింగ్ని వెంట వెంటనే చేశాను. ముంబైలో సల్మాన్ ఖాన్తో ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్లో పాల్గొని, మరో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ‘గాడ్ ఫాదర్’కి ఒక మేకోవర్, ఇంకో సినిమాకి ఇంకో మేకోవర్. పుణె నుంచి వచ్చీ రాగానే ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యాను.. షూటింగ్కి వెళుతూ ‘అమ్మా.. వెళ్లొస్తాను’ అని అమ్మకు చెప్పాను. ‘ఎందుకు నాన్నా... ఇంత కష్టపడతావు?’ అని అమ్మ అన్నారు. ఒకప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తే.. ‘ఇంత కష్టపడాలా?’ అని అమ్మ అనేవారు. ‘అమ్మా.. ఇంత కష్టపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? కష్టపడాలనే మనస్తత్వం ఉన్నా కూడా మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కావాలి కదమ్మా’ అనేవాడిని. ఇప్పుడు కూడా అంతే కష్టపడుతున్నానని ఆమె ఫీలింగ్. ఇప్పుడు అమ్మతో ‘యంగ్స్టర్స్తో పోటీ పడేలా నాకు వెంట వెంటనే మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎంత కష్టపడి చేస్తే నేను అంత హుషారైపోతాను. ద బెస్ట్ ఇస్తుంటాను. నీ ఆశీర్వాదాలు కావాలమ్మా నాకు. అయ్యో.. నా బిడ్డ అని జాలి పడకు’ అంటుంటాను. ‘నేను బాధపడితే నీ ఉత్సాహం తగ్గిపోతుంది అంటున్నావు కాబట్టి నీ కోసం అయితే నేను పైకి అనను రా.. కానీ లోపల ఫీల్ అవుతాను... జాగ్రత్త నాన్న..’ అని అమ్మ అన్నారు. అమ్మల మనసు అంతే.. ఇక ‘గాడ్ఫాదర్’ షూటింగ్ హుషారుగా చేస్తున్నాను కానీ నా కళ్లు పొడిబారిపోతున్నాయి. అప్పటికి 40 గంటల్లో నిద్రపోలేదు. ట్రావెలింగ్.. షూటింగ్తో సరిపోయింది. నా కళ్లు పొడిబారడం చూసి, యూనిట్లో అందరికీ గడచిన 40 గంటల్లో నేను నిద్రపోలేదని తెలిసింది.. ఆశ్చర్యపోయారు. అయితే నిద్ర పోతే పోయింది కానీ షూటింగ్ తాలూకు ఎంజాయ్మెంట్ మాత్రం ఫుల్లుగా దక్కింది. ► అమ్మ బాధ చెప్పారు... మరి మీ సతీమణి ఏం అన్నారు? రేఖ కూడా అమ్మలానే అంటుంది. ‘ఏంటండీ ఇప్పుడూ ఇంత కష్టపడాలా... ఇంత బిజీనా’ అని రేఖ అంటే.. ‘రేఖా... నా నుదుటిపై చెమటి బిందువులు మెరవకపోతే నీ మెడలో ఏదీ మెరవదూ’ అన్నాను (నవ్వులు...). ఇక అప్పటినుంచి అవి (నగలు) పెట్టుకున్నప్పుడల్లా మీ చెమటను ముట్టుకున్నట్లు ఉంటుంది నాకు’ అని రేఖ అంటుంటుంది. ఈ మధ్య కూడా నగలు పెట్టుకున్నప్పుడు ఇలానే అని నవ్వింది. ► యాక్చువల్లీ కెరీర్ ఆరంభంలో అవకాశాలు దక్కకపోతే నిద్రలేని రాత్రులు ఉంటాయి.. అయితే స్టార్డమ్ వచ్చాక మీ ‘ప్లాటర్ ఫుల్’ అనే పరిస్థితుల్లోనూ నిద్ర త్యాగం చేసి, సినిమాలు చేస్తున్నారు.. ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం అనే కిక్ ఉంది చూశారు... అది మామూలుగా ఉండదు. సినిమాల్లో అవకాశం వస్తే చాలు.. ఏ త్యాగం చేయడానికైనా సిద్ధం అన్నట్లుగా చాలామంది ఉన్నారు. డబ్బులు కూడా వద్దు.. వెండితెరపై మా బొమ్మ పడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ‘ప్లాటర్ ఫుల్’ అయ్యాక కూడా కష్టపడాలనే ఆ ఆకలిని జీవితాంతం ఉంచుకోవాలి. అప్పుడే వందశాతం ఉద్యోగానికి న్యాయం చేసినవాళ్లం అవుతావు. కడుపు నిండిన వ్యవహారంలా జాబ్ చేస్తే అన్యాయం చేసినవాళ్లం అవుతాం. అలా అన్యాయం చేసేవాళ్లకు నేను ఒకే ఒక సలహా ఇస్తా... ‘పని చేయవద్దు. విరమించుకో..’. ఎవరికోసం చేస్తున్నావ్. కడుపు నిండిపోయింది. బ్యాంకు బ్యాలెన్స్ నిండిపోయింది కదా అని ఒక క్రమశిక్షణ లేకుండా లేట్గా రావడంతో పాటు నిర్లక్ష్య వైఖరితో పని చేయడం వల్ల బాగా తీయాలన్న డైరెక్టర్ ఉత్సాహం నీరుగారిపోతుంది. అందుకే ఎప్పుడూ అర్ధాకలితోనే ఉండాలి. సినిమా పరంగా, నటన పరంగా వస్తే నేను ఎప్పటికీ అర్ధాకలితోనే ఉంటాను. ‘ఆచార్య’ షూటింగ్ అప్పుడు నేను ఒక్కరోజు కూడా సెట్స్కు ఆలస్యంగా వెళ్లలేదు. కొరటాల శివ: ఒకరోజు ‘ఆచార్య’ షూటింగ్ని ఉదయం ఎనిమిది గంటలకు సెట్ చేశాం. ‘దారిలో ఉన్నాను.. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయ్యేలా ఉంది. వేరే షాట్ పెట్టుకుంటారా?’ అని చిరంజీవిగారు ఫోన్ చేశారు. అయితే మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ 7 గంటల 45 నిమిషాలకే సెట్స్లోకి వచ్చారు చిరంజీవి: ట్రాఫిక్ క్లియర్ అయింది... వచ్చేశాను.. (నవ్వులు..) ► షూటింగ్ లొకేషన్లో చిన్న ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడుతున్నారట... కనీసం మీ ‘కార్వ్యాన్’లో కూడా కూర్చోవడంలేదట.. యాక్టర్స్గా మన కంఫర్ట్ కోసం కార్వ్యాన్ ఉండాలి. ఆ సౌకర్యాలను వినియోగించుకోవాలి. కానీ ఐసొలేట్ అయిపోవడానికి వాడకూడదు. షూటింగ్ గ్యాప్లో మనసు విప్పి మాట్లాడితే తోటివారికి దగ్గర కావొచ్చు. అందరికీ దగ్గర కావడానికి టీ బ్రేక్, భోజన సమయం మంచి అవకాశాలు. షాట్ గ్యాప్లో ఆర్టిస్టులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సెట్స్లో మంచి వాతావరణం ఉంటుంది. జబర్దస్త్ యాక్టర్స్ నాతో మాట్లాడటానికి కొంచెం సిగ్గు, కొంచెం భయంతో ఉంటారు. కానీ సెట్స్లో నేనే వారితో మాట్లాడితే వారి మనసు సంతోషపడుతుంది. అలా సెట్స్లో ఒక పాజిటివ్ వైబ్ రావడానికి నా వంతు కృషి చేస్తుంటాను. సెట్స్లో మేమంతా ఉత్సాహంగా ఉంటే డైరెక్టర్స్కు బాగుంటుంది. అంతేకానీ ఓ ఐదు నిమిషాల షాట్ గ్యాప్లో కూడా హీరో కార్వేన్లోకి వెళ్లిపోతే మళ్లీ ఆ హీరో షాట్లోకి రావడానికి మరో పది నిమిషాల సమయం పడుతుంది. ఇలా ఒకరోజులో చాలాసార్లు పది నిమిషాలు వృథా అయిపోకూడదు. అదే హీరో అలర్ట్గా ఉన్నాడంటే లొకేషన్లో అందరూ అలర్ట్గా ఉంటారు. చరణ్ అయితే సెట్లోనే ఓ టెంట్ వేసుకుని లొకేషన్లో అందరితో కలిసిపోయి ఉంటాడు. ఇంటి వంటకాలను అందరికీ రుచి చూపిస్తాడు. నేను, కొరటాల, తిరు (కెమెరామేన్) బ్రేక్పాస్ట్ అయితే మా ఇంటి నుంచే లాగించేవాళ్లం. తిరు అయితే.. సార్.. ఇంతలా టిఫిన్ చేస్తే.. నాకు ఫస్ట్ షాట్కే నిద్ర వస్తుంది అనేవారు (ఫుల్ నవ్వులు..) మా సినిమా షూటింగ్లు వేడుకల్లా జరుగుతుంటాయి. ► ‘ఆచార్య’లో పాన్ ఇండియా స్టార్ (చరణ్)తో చేశారు.. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ.. గతంలో మీరు హిందీలో ‘ఆజ్ కా గూండారాజ్’ వంటి సినిమాలు చేసి, అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా.. ఏమంటారు? అంతేగా.. (నవ్వుతూ). అప్పట్లో నేను హిందీలో చాలా సినిమాలు చేశాను. అయితే ఒకప్పుడు ఇండియాలో తెలుగు అనే ఒక ప్రాంతీయ భాషా సినిమా ఉందని మన పక్కనే ఉన్న ముంబై వాళ్లకు కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమా వచ్చేవరకూ ఆ పరిస్థితి ఉంది. ‘క్లాసిక్ సినిమా, అద్భుతంగా ఉంది. ఇది తెలుగు సినిమానా?’ అనుకునేదాకా ‘శంకరాభరణం’ తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా మరుగున పడిపోయింది. 80వ దశకంలో ఎప్పుడు చూసినా సరే మద్రాసు సినిమాలు అనేవారు.. మహా అయితే తమిళ సినిమాల గురించి చెప్పుకునేవారు. మలయాళ సినిమా వారు అవార్డులు తెచ్చుకున్నారు తప్ప కన్నడ, తెలుగు సినిమాలకు గుర్తింపే లేని రోజులను చూశాను. చాలా బాధపడ్డాను. ఇప్పుడు రాజమౌళి ఈ హద్దులు, సరిహద్దులను చెరిపేశాడు. సినిమాల పరంగా రాజమౌళి తెలుగుకి ఒక గర్వకారణంలా గౌరవం, గుర్తింపు తీసుకొచ్చాడు. అతని మూలంగా తెలుగులో ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు, కన్నడలో ప్రశాంత్ నీల్ తీసిన ‘కేజీఎఫ్’.. వీటి మూలంగా వాళ్ల అస్తిత్వం చెక్ చేసుకునే పరిస్థితిని బాలీవుడ్కి కల్పించారు ఈ దర్శకులు. ఆ తర్వాత అందరూ మనవైపు దృష్టి సారించారు. ఇవి ప్రాంతీయ భాషా చిత్రాలు కాదు.. మనమందరం ఇండియన్స్.. ఇది ఇండియన్ సినిమా అనే కీర్తిని తీసుకొచ్చినందుకు రాజమౌళికి హ్యాట్సాఫ్. ► తండ్రీ కొడుకు పోటాపోటీగా నటించి ఉంటారు.. అలాగే ఎక్కువమంది జూనియర్ ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకునే పరిస్థితి ఉండేదేమో.. కొరటాల శివ: టేక్స్ అనేవి చిరంజీవి సార్కు ఉండవు. ఒక్కోసారి సార్ పక్కవారి కోసం మళ్లీ చేస్తారు. ఓ షాట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు తప్పు చేసినా సరే ఓ దర్శకుడిగా నాకు కంగారు వచ్చేది. ఆ జూనియర్ ఆర్టిస్టు దగ్గరకు మేము పరిగెత్తాలి. కానీ ఈలోపే చిరంజీవి సార్ ఆ ఆర్టిస్టుని దగ్గరకు తీసుకుని ‘నువ్వు ఇలా చేస్తే.. మనం ఇద్దరం సింక్లో ఉంటాం’ అని చెప్పేవారు. అంటే.. సార్ వారి కోసమే వన్ మోర్ టేక్ చేసే పరిస్థితి. సినిమా పట్ల చిరంజీవిగారికి ఉన్న ప్రేమ అద్భుతం. చిరంజీవి: ఓ పెద్ద ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు ఓ చిన్న తప్పు జరిగినా అది పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ‘అయినా.. ఆ చిన్న తప్పును ఎవరు గమనిస్తారండీ.. చాదస్తం’ అని కొందరు అంటారు. కానీ.. ప్రతి ఫ్రేమూ పర్ఫెక్ట్గా ఉండాలి. నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని డైరెక్టర్లు టేక్ ఓకే చెప్పవచ్చు. కానీ హీరోగా నేనే దర్శకుడి ఇబ్బందిని అర్థం చేసుకుని చొరవ తీసుకుని మళ్లీ చేస్తా అంటాను. అప్పుడు డైరెక్టర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు. ► ఏపీలో టికెట్ల ధరల గురించి ఏమంటారు? టికెట్ల ధరల విషయంపై ప్రభుత్వం స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. సినిమా బడ్జెట్ని బట్టి టికెట్ ధరల పెంపుపై వెసులుబాటు అనేది ఉంటుంది. కచ్చితంగా ‘ఆచార్య’ సినిమాకు ఏదో ఒక వెసులుబాటు ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. జగన్గారు (ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి) ఏ గైడ్లైన్స్ అయితే ప్రతిపాదించి జీవోగా ఇచ్చారో దాని ప్రకారం అన్ని రకాల సినిమాలకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రకారం ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే.. ఏపీలో 20శాతం షూటింగ్స్ చేయాలనే నిబంధనని ప్రభుత్వం పెట్టకముందే మేము మారేడుమిల్లి అడవుల్లో దాదాపు 25 శాతం షూటింగ్ చేశాం. చదవండి 👉 నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు ► భవిష్యత్లో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారని చాలామంది ఆలోచన.. దీనిపై? అస్సలు ఇన్వాల్వ్ కాను.. ఆ డౌట్ అక్కర్లేదు. ► వైజాగ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే విషయం గురించి? సినిమా షూటింగ్లకు, సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాలుగా చాలా అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన లొకేషన్స్ వైజాగ్లో ఉన్నాయి. ఎలాగైతే అప్పట్లో చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందో, ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి చెందుతూనే, సినీ పరిశ్రమకు మరో శాఖగా వైజాగ్లో కూడా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఔత్సాహిక కళాకారులు ఉన్నారు. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఆర్టిస్టులు అటూ ఇటూ వెళ్తారు. 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగాలన్న ప్రభుత్వ ప్రతిపాదన మంచి విషయం. దీనివల్ల చాలా మందికి ఉపాధి, ప్రోత్సాహం లభిస్తాయి. ► మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు సెట్స్లో ఎలా చేయాలి? అని ఇంట్లో చరణ్, మీరు మాట్లాడుకునేవారా? చరణ్కి సలహాలిచ్చారా? ఇంటికి వెళ్లాక ఇక ఇంట్లో సినిమా అనే మాట వినపడదు. నేనే కాదు.. పవన్కల్యాణ్, రామ్చరణ్.. సినిమాల గురించి మాట్లాడుకోం. సినిమా అన్నది సెట్స్ వరకే. అది మా వృత్తి. దాన్ని మేం ఇంట్లోకి తీసుకురాము. కానీ ఆ సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ మాత్రం ఇంట్లో ఉంటాయి. ఇక సలహాలిచ్చే విషయం గురించి చెప్పాలంటే.. నేను ఏ రోజూ ఎవరికీ నటన విషయంలో సలహా ఇవ్వను. సీన్లో సింక్ కోసం తప్పిస్తే.. ఇలా చేయమని ఎవరికీ సలహా ఇవ్వను. చరణ్కు కూడా ఇవ్వను. ఎందుకంటే ఇలా చేయాలని నేను సలహా ఇస్తే వాళ్ల నటన నేను చెప్పినట్లుగా ఉంటుంది కానీ వాళ్లు చేసినట్లుగా ఉండదు. నటన అనేది మన సహజమైన ప్రవర్తన. ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. ఒకరి ఒరిజినాలిటీతో కూడిన ఆర్గానిక్ ఫీల్ పోకుండా ఉండాలంటే వేరొకరు ఒకరికి నటన పరంగా సలహాలు ఇవ్వకూడదన్నది నా సలహా. ► ‘ఆచార్య’ సినిమాకు మహేశ్బాబు వాయిస్ ఇవ్వడం గురించి.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇండస్ట్రీలో రావాలి. సరే... ఇలాంటి మంచి వాతావరణం కోసం నువ్వు ఏం చేశావ్ అని నన్నడిగితే... ‘కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొన్ని ఈవెంట్స్కు నన్ను అతిథిగా రమ్మన్నప్పుడు వెంటనే అంగీకరించాను. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఎస్ఎమ్ఎస్ ఇచ్చినా చాలు. రెస్పాండ్ అవుతాను. కొందరు మా ఇంటికే వచ్చి పోస్టర్లు రిలీజ్ చేయించుకుంటారు. నాకు టైమ్ దొరికితే హెల్ప్ చేస్తాను. ఒక సినిమా గురించి ఇంట్లోనే ఓ బైట్ ఇవ్వడం, ఫస్ట్ లుక్ను లాంచ్ చేయడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ‘ఓ పిట్టకథ’, రీసెంట్గా ‘మిషన్ ఇంపాజిబుల్..’ ఇలా చాలా సినిమాల ఫంక్షన్స్కు వెళ్లాను. ఇలా ప్రోత్సహించడం నా బాధ్యత అనుకుంటాను. ఏదో రకంగా హెల్ప్ చేస్తాను. అందరూ ఫాలో అవుతారని నా ఒపీనియన్. ► మీరు ఇండస్ట్రీ పెద్ద అనేది కూడా ఒక టాపిక్.. దీని గురించి ఏమంటారు? ‘ఇండస్ట్రీ పెద్ద’ అనే మాటను నేను ఎంటర్టైన్ చేయను. నేనే కాదు.. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ పట్ల తమ వంతు బాధ్యత వహించి తీరాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో కొంత మనం పొందుతున్నప్పుడు ఎంతో కొంత ఇవ్వడం కూడా ఉండాలి. ఇండస్ట్రీకి ఏం వచ్చినా సరే భుజం కాసేలానో, చేయూత ఇచ్చేలానో, ఆపన్నహస్తం అందించేలానో ఉంటాను.. అది నా బాధ్యత. దానికి పెద్ద అనే ఒక పదవి అవసరం లేదు. ఆయా సమయాలు, పరిస్థితులు, ఆయా సెక్టార్లను బట్టి ప్రతివారూ ఆ బాధ్యత వహించాలి. అది ఏ ఒక్కరో తీసుకునే బాధ్యత కాదు. నా వంతు బాధ్యతగా ఇండస్ట్రీకి ఏ అవసరం వచ్చినా నేను వందశాతం సపోర్ట్ చేస్తా, ముందుకు వస్తాను. ► ఆచార్య గురించి ఫైనల్గా..? అన్ని వర్గాల వారికి నచ్చే పసందైన విందు ‘ఆచార్య’ సినిమా. – డి.జి. భవాని var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి 👉🏼 ఇండియాకు వచ్చిన విల్స్మిత్.. అతన్ని కలవడమేనా కారణం ? ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడే -
మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జక్కన్న
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మగధీర' టైమ్లో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్ చరణ్ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్ నువ్వు ఇలా చెయ్ అలా చెయొద్దు అని చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్ బాగుంది, నీ యాక్టింగ్ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు. తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాని నుంచి ప్రతీది నేర్చుకుని తనకు తానుగా ఎదిగాడు. మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్లో అని నేను కష్చితంగా చెప్పగలనంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ నాకు ఆయనలోని కాంపటేటివ్నెస్ నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని చిరంజీవి కోరుకుంటారు. ఆ లక్షనం చూడటానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగ చేసారని అనిపిస్తారు. కానీ ఒక డైరెక్టర్గా నాకు నా హీరోనే మీకంటే బెటర్ సర్ అనడంతో రాజమౌళితో పాటు పక్కనే ఉన్న మెగాస్టార్ సైతం నవ్వుకున్నారు. -
ఇంతకుముందు చూడని మెగాస్టార్ను చూస్తారు: మెహర్ రమేష్
Meher Ramesh About Chiranjeevi In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. తాజాగా (శనివారం ఏప్రిల్ 23) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్ రాజా, మెహర్ రమేష్ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే పాల్గొన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఆచార్యలోని నీలాంబరి వీడియో సాంగ్ లాంచ్ చేశారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ 'మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒక పండుగల ఉంటుంది. అలాంటిది కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరినీ చూపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్కి కన్నుల పండగే. ఆచార్య చిత్రంలో నేను ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూశాను. మునుపెన్నడూ చూడని మెగాస్టార్ను చూస్తారు. బంజారా సాంగ్లో చిరు, చరణ్ డ్యాన్స్ ఐఫీస్ట్లా ఉంటుంది' అని తెలిపారు. చదవండి: ‘ఆచార్య’ కోసం రంగంలోకి మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_601242433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేషనల్ క్రష్కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక రాకెట్ లా దూసుకుపోతోంది.వన్ బై వన్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతోంది.మొన్నటికి మొన్న రణభీర్ చిత్రంలో ఆఫర్ అందుకుంది.సందీప్ వంగా హిందీ చిత్రంలో యానిమల్ లో ముందుగా పరిణీతి చోప్రాను అనుకున్నారు.మళ్లీ ఏమైందో ఏమో అ అవకాశాన్ని రష్మిక అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. కోలివుడ్లో ఇప్పటికే ఒక సినిమా చేసిన రష్మిక.. ఈ సారి ఏకంగా దళపతి విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. (చదవండి: హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు, హృదయం ముక్కలైంది) బాలీవుడ్, కోలివుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో తెరకెక్కబోయే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ రష్మిక పేరు వినిపిస్తోంది. ఈసారి కొరటాల నేషన్ క్రష్ రష్మిక డేట్స్ డుగుతున్నాడట.ముందుగా ఆలియాను హీరోయిన్ గా అనుకున్నారు.కాని రణభీర్ తో మ్యారేజ్ తర్వాత ఆలియా తన డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టం అని చెప్పడంతో లాస్ట్ మినుట్ లో ఆ ఆఫర్ రష్మికకు వెళ్లిందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_601242433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"ఆచార్య" రామ్ చరణ్ కొరటాల శివ స్పెషల్ ఇంటర్వ్యూ
-
నాన్న అలా చేసే సరికి కన్నీళ్లొచ్చాయి : రామ్ చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరు, రామ్ చరణ్ ప్రమోషన్స్ షురు చేశారు. తాజాగా ఓ చిట్ చాట్లో పాల్గొన్న రామ్ చరణ్ తన తండ్రితో కలిసి 'ఆచార్య'లో నటించిన అనుభవాలను పంచుకున్నాడు. తాను ఈ చిత్రంలో నటించడమే కాదు షూటింగ్ జరుగుతున్నంత కాలం ప్రతి నిమిషం తన తండ్రి చిరంజీవితో కలిసి ఉండటం తనకు చాలా భావోద్వేగపూరితమైనదని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాకూ, డాడీకి షూటింగ్కి వీలుగా ఉండేలా ఒక డబుల్బెడ్రూం ఇంటిని ఇచ్చారు. అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ చేశాం. రోజూ కలిసి షూటింగ్కు వెళ్లేందుకు రెడీ అయ్యేవాళ్లం. అలానే సెట్స్లో ఇద్దరం కలిసి పని చేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్ను మాటల్లో వర్ణించలేను. ఇక నాకు ఇలా ఉంటే నాన్న అక్కడ ఓ రోజు చరణ్ నీకు అర్ధం కావడం లేదేమో దీని వాల్యూ. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. 'ఆచార్య' వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. షూటింగ్కి ముందు లేదా తరువాత ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా 'ఆచార్య' చిత్రం తమకు చాలా స్పెషల్ అంటూ తన తండ్రి చిరంజీవిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే దర్శకుడు శంకర్తో చేస్తున్న చిత్రంపై ఫుల్గా ఫోకస్ పెట్టి జెట్స్పీడ్లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు చెర్రి. -
‘ఆచార్య’ రీషూట్పై స్పందించిన డైరెక్టర్ కొరటాల
Koratala Siva Clarifies Acharya Movie Reshoot: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదా అనంతరం ఏప్రిల్ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్పై ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్యలోని కొన్ని సీన్లను కొరటాల రీషూట్ చేశారు’ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ కొరటాల స్పందించారు. చదవండి: నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేసిన హీరో సిద్ధార్థ్ సినిమా రీషూట్ చేస్తే తప్పు ఏముందని, దాన్ని అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారో? అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక సీన్ రీటేక్ చేస్తున్నామంటే అది మరింత బెటర్ అవుట్పుట్ కోసమే కదా. ఒక సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా తీయొచ్చని దర్శకుడికి అనిపించినప్పుడు తప్పకుండ రీషూట్కు వెళ్లాల్సిందే. అందులో తప్పులేదు. అదే.. అనుకున్న సీన్ బాగా రాకపోయినా అది అలాగే వదిలేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఒక సినిమాను రూపొందించేముందు ప్రేక్షకులను వందశాతం సంతృప్తి పరచడమే ధ్యేయంగా పెట్టుకుంటాం. చదవండి: ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా? అందుకే థియేటర్కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని అందించాలంటే రీషూట్కు వెళ్లడంలో తప్పులేదు. ఒకవేళ నేను అలా చేయాల్సి వస్తే నిర్మాతలను ఒప్పించి మరి ముందుకు వెళ్తాను’అని ఆయన అన్నారు. ఇక చివరగా ఆచార్య రీషూట్ వార్తలపై స్పందిస్తూ.. అందరు అనుకుంటున్నట్టు ఆచార్య మూవీని రీషూట్ చేయలేదని, ఆ అవసరం కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. -
తారక్ చిత్రం నుంచి తప్పుకున్న ఆలియా..?
ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత బాలీవుడ్ భామ ఆలియా భట్ యంగ్టైగర్ జూ.ఎన్టీఆర్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఆ సమయంలో ఆలియా కూడా తారక్తో కలిసి నటించడానికి ఉత్సాహం చూపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి ఆలియా తప్పుకున్నట్టు తెలుస్తోంది. తన బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్తో ఆలియా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఈ జంట హనీమూన్ ట్రిప్కి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ముందుగా వారు కమిటైన సినిమాలను పూర్తి చేయాలి. దాంతో తారక్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలియా ప్లేస్లో మరో హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారట కొరటాల టీమ్. ఇక దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. అదరగొడుతున్న 'ఆచార్య' ట్రైలర్
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్, ఫైటింగ్లు అభిమానులకు సూపర్ ఐ ఫీస్ట్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. -
'మెగా' ఫ్యాన్స్కు 'ఆచార్య' ట్రీట్.. 152వ సినిమా 152 థియేటర్లలో హంగామా..
Chiranjeevi Acharya Trailer Release In 152 Theatres: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది 'ఆచార్య' చిత్రబృందం. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం 'ఆచార్య' కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ను పెంచిన చిత్ర బృందం ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసి అభిమానులకు ఒక శుభవార్త తెలిపింది. ఆచార్య ట్రైలర్ను సోషల్ మీడియాతోపాటు వెండితెరపై కూడా ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో 'ఆచార్య' ప్రచార చిత్రాన్ని ప్రదర్శించబోతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్ హంగామా చేయనుంది. ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 గంటలకు ఈ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? The 152nd film of Megastar @KChiruTweets calls for Mega Massive celebrations at 152 screens🤘#AcharyaTrailer will be celebrated in the below screens on 12th April at 5:49 PM 🔥@AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @SonuSood #ManiSharma @MatineeEnt pic.twitter.com/fdTUz3aWSJ — Konidela Pro Company (@KonidelaPro) April 11, 2022 -
ఇట్స్ అఫిషియల్: చిరంజీవి 'ఆచార్య' ట్రైలర్ వచ్చేది ఆరోజే..
Chiranjeevi Acharya Trailer To Be Released On This Date: 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిచండమే కాకుండా ఇందులో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' మూవీ ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? ఏప్రిల్ 12న ఆచార్య సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తెలిపారు. ఇదివరకు ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరింజీవికి సరసన చందమామ కాజల్ హీరోయిన్గా చేయగా, రామ్ చరణ్కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇందులో సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అలాగే 'ఆచార్య'కు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరు-మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥 Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29 Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k — Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022 చదవండి: మెగా ఫాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! -
విహార యాత్రకు ఎన్టీఆర్ ప్లాన్!
దాదాపు నాలుగేళ్లుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ థియేటర్స్లోకి వచ్చింది. ప్రస్తుతం రికార్డులే టార్గెట్గా దూసుకెళ్తోంది. ఆర్ర్ఆర్కు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి తారక్, చరణ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ కాస్త అసంతృప్తిగా ఉన్నాడని పుకార్లు వచ్చినప్పటికీ.. ఇటీవల ఆయన విడుదల చేసిన ప్రత్యేకమైన లేఖతో వాటికి చెక్ పడింది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. చరణ్ ఇప్పటికే శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ కొరటాల శివతో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాస్త విరామం తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించబోతున్నాడట తారక్.ఈ రెండు నెలలు విహార యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.అంతే కాదు కొరటాల సినిమాలో క్యారెక్టర్ కోసం భారీగా వెయిట్ కూడా తగ్గాలనుకుంటున్నాడట. అరవింద సమేత లుక్ లోకి మారిపోయేందుకు టైగర్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియాభట్ ఫీ మేల్లీడ్ రోల్లో నటిస్తోంది. అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. -
అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా ఓ చిత్రం రానున్నట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం. ఇక ఆ చిత్రం పూర్తి చేసిన వెంటనే బన్నీ, ధనుష్ కాంబో మూవీపై కొరటాల శివ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
మెగా ఫాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక వరుసగా తెలుగు చిత్రాలు బాలీవుడ్లో విజయం సాదిస్తుండటంతో ‘ఆచార్య’ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రం హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని హిందీలో పంపిణీ చేయనున్న 'పెన్ స్టూడియోస్' సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ నుంచి పలు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. గత శుక్రవారం రవితేజ నటించిన 'ఖిలాడి' చిత్రాన్ని కూడా డబ్ చేసి 'పెన్ స్టూడియోస్' హిందీలో రిలీజ్ చేసింది. ఇక వీటితో పాటు వారి స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా 'గంగూభాయి కతియావాడి' ఈ నెల 25న రిలీజ్కు సిద్దంగా ఉంది. ఇక 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు 'అటాక్ పార్ట్ 1' జెర్సీ హిందీ రిమేక్ వంటి చిత్రాలు పెన్ స్టూడియోస్ నుంచి వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలానే ‘ఆచార్య’ హిందీ వర్షెన్ను కూడా ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఇక దీంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. -
సీఎం జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు: ప్రభాస్
-
ఒకే ఫ్రేమ్ లో చిరు, ప్రభాస్, మహేష్
-
నీ భాష నాకు అర్ధం కాదు.. ఎన్టీఆర్పై ఆలియా భట్ పంచ్!
రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లో బాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్పై ఆలియా సెటైర్ వేసింది. జూ.ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నాడని..అది తనకు అర్దం కావడం లేదని చెప్పింది. అయితే దానిని ఎవరైనా అనువదించి తనకు చెప్తారేమోనని దిక్కులు చూడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చింది. ఓ ప్రెస్మీట్లో ఎన్టీఆర్ను ఎదురుగా పెట్టుకొనే ఇలా చెప్పేసింది ఆలియా. ఇక దానికి సమాదానంగా ఎన్టీఆర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. మేము తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం. కాకపోతే అది నీకు అర్ధం కావడం లేదంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు. అయితే తారక్ కౌంటర్ ఇచ్చినప్పటికీ ఆలియా మాత్రం తగ్గలేదు. కాదు మీరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదని నవ్వుతూనే ఎదురుదాడి చేసింది. గతంలో ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లినప్పుడు శ్రద్ధాకపూర్ హీందీ, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ప్రభాస్ ఇంగ్లీష్తో మేనేజ్ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా తెలుగు, ఇంగ్లీష్తో పాటు హీందీలో కూడా తారక్ అనర్గళంగా మాట్లాడగలడని తెలిసిందే. ఇలాంటి సిల్లీ ఇష్యూస్ స్టార్స్ మధ్య సర్వసాదారనమేనని చెప్పవచ్చు. ఇక ఈ విషయం అలా వుంటే.. తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్టు ఆలియా భట్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాగా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను రెడీ చేసినట్టు సమాచారం. -
ఎన్టీఆర్కు జోడీగా ఆలియా, వారం రోజుల్లో..!
‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరిందని, ఫిబ్రవరి 7న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్నగర్ టాక్. కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తారు. కాగా ఈ సినిమా నేపథ్యం, నటీనటుల గురించిన చర్చలు కూడా ఫిల్మ్నగర్లో జోరందుకున్నాయి. విజయనగరం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించే ఈ సినిమాకు పొలిటికల్ టచ్ ఉంటుందని భోగట్టా. ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తారని, అనిరుద్ మ్యూజిక్ అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
NTR30: ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్టుపై లేటెస్ట్ అప్డేట్..
NTR30: Jr Ntr And Koratala Siva Movie Update: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు తారక్. 2018లో అరవింద సమేతతో చివరిసారిగా థియేటర్లో సందడి చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కారణంగా మరో సినిమా చేయలేదు. దీంతో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా ఎన్టీఆర్కి ఇది 30వ సినిమా. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. -
చిరంజీవి ‘ఆచార్య’ మూవీ స్టిల్స్
-
మహేశ్బాబులా అశోక్ ముందుకెళ్లిపోతాడు: రాఘవేంద్రరావు
‘‘నాకు హీరో కావాలనుంది’ అని అశోక్ చిన్నప్పటి నుంచి అనేవాడు.. ‘రాజకుమారుడు’తో మహేశ్బాబుని పరిచయం చేశాను. మహేశ్లా అశోక్ కూడా టకటకా ముందుకెళ్లిపోతాడు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సూపర్స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘శ్రీమంతుడు’కి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. మహేశ్గారు ఎలా నటిస్తున్నారో నోట్ బుక్లో రాసుకుంటున్నప్పుడే సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసింది’’ అన్నారు. గల్లా పద్మావతి మాట్లాడుతూ– ‘‘నటన అంటే ఇష్టం’ అని అశోక్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాం. సింగపూర్, అమెరికాలో చదువుకుని వచ్చాక కూడా తనలో నటనపై అదే ప్యాషన్ కనిపించింది. అందుకే నేను, జయదేవ్గారు ప్రోత్సహించాం’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. హీరో రానా, నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు. -
సిద్ధ వచ్చేశాడు.. ఆచార్య కొత్త టీజర్ చూశారా ?
Ram Charan Teaser Out From Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. టీజర్లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. ఇంతేకాకుండా ఈ టీజర్లో అనేక విషయాలు పొందుపరిచారు. 'ధర్మస్థలికి ఆపద వస్తే, అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని రామ్చరణ్ డైలాగ్ చెప్పినతీరు ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ ఎండింగ్లో వచ్చే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆచార్య నుంచి ఇదీవరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన సిద్ధ పాత్రకు సంబంధించిన ఈ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చూస్తే తెలుస్తోంది. మెగస్టార్ చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్రంలో 'మ్యాన్ అఫ్ హ్యుమానిటీ' సోనూసూద్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఇంతకుముందు రిలీజైన లాహే లాహే.. పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత కనిపించిన సంగతి తెలిసిందే. ఇది చదవండి: ఫ్యాన్స్కి దీపావళి ట్రీట్ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం -
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ అయ్యేది అప్పుడే..!
Chiranjeevi Acharya Movie Release Date: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమాలోని 'లాహే లాహే', 'నీలాంబరి' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'లాహే లాహే' పాట అయితే యూట్యూబ్లో 60 మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. అయితే పాటలు, నటీనటుల లుక్స్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ సినిమా విడుదలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆచార్య రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) అలాగే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ సిద్ధగా కనిపించనున్నారు. ఇవాళ సినిమా విడుదల తేది ప్రకటన తర్వాత సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ను నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనిని 'ధర్మమే సిద్ధ' అంటూ మెగాస్టార్ చిరింజీవి షేర్ చేయగా, 'గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్ఫుల్ టీజర్ రానుంది'. అని రామ్ చరణ్ ట్వీటారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) Siddha is a memorable character for many reasons. Powerful Teaser is on its way!#SiddhasSaga on Nov 28th.#Acharya #AcharyaOnFeb4th Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/gUs7iiJOaK — Ram Charan (@AlwaysRamCharan) November 24, 2021 ఇదిలా ఉంటే తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే ఇదే తేదిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ తెలిపారు. కానీ పుష్ప షూటింగ్ను ఇంకా పూర్తి చేసుకోలేదు. డిసెంబర్ 17 వరకు పుష్ప షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకే చివరిగా ఫిబ్రవరి 04, 2022ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చదవండి: యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'లాహే లాహే' సాంగ్ -
ప్రతీకార కథాంశంతో కొరటాల, ఎన్టీఆర్ చిత్రం
Jr NTR Koratala Siva New Movie: ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న జూ. ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివతో మూవీని మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చదవండి: హ్యాపీ మూడ్లో చై, ఆకట్టుకుంటున్న లుక్ కాగా ఈ చిత్రం ప్రతీకార కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సరికొత్తగా ఉంటుందని, మాస్ అంశాలతో పాటు సామాజిక సందేశం మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది. నందమూరి కల్యాణ్రామ్, సుధాకర్మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్లో మొదలుకానున్నదని సినీ వర్గాల నుంచి సమాచారం. చదవండి: కుటుంబంతో ఎన్టీఆర్ ఫారిన్ టూర్, అరుదైన ఫొటోలు షేర్ చేసిన తారక్ -
డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్రకటన
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ‘నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్డేట్ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్ చేశాడు. pic.twitter.com/R6g7vwyNp5 — koratala siva (@sivakoratala) June 25, 2021 ఇక డైరెక్టర్గా కూడా తర్వలోనే రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఇటీవల కొరటాల బర్త్డే సందర్భంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికే ముందే తన రిటైర్మెంట్కు ప్లాన్ చేసుకున్నానని, తన డైరెక్షన్లో పది సినిమాలు చేసిన అనంతరం దర్శకుడిగా సినిమాలకు గుడ్బై చెప్పి నిర్మాతగా సెటిలైయిపోతానంటూ ఆయన ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచినట్లు వచ్చిన ఈ న్యూస్ సినీ ప్రేక్షకులు, ఆయన ఫాలోవర్స్ అంతా షాక్కు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాకు గుడ్బై చెప్పాలనుకుంటున్నట్లు ప్రకటించడంతో.. నెటిజన్లు ఆయనకు ఏమైంది ఇలా చేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని అనంతరం జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేసేందుకు సన్నాహలు చేస్తున్నాడు. చదవండి: అప్పుడే డైరెక్టర్గా రిటైర్మెంట్ ప్రకటించిన కొరటాల శివ! -
ఆ కలానికి మార్పుతేవాలనే తపన ఉంది: చిరంజీవి
Koratala Siva: హీరో అంటే వందమందిని ఒక్కవేటుతో నరికేవాడు కాదు. ఒక్కమాటతో గొడవను శాశ్వతంగా చల్లార్చేవాడేనని తన పాత్రల ద్వారా నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. సామాజిక కోణంలో సినిమాలు రూపొందిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. నేడు(జూన్ 15) కొరటాల శివ బర్త్డే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. ‘ఆచార్య’ సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంగా చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రమిది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చదవండి: అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్న విజయ్ సేతుపతి -
NTR30: ఫార్మల్ డ్రస్, స్మార్ట్ లుక్.. ఎన్టీఆర్ ఫోటో వైరల్
Happy Birthday Jr NTR: యంగ్టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్కు ఇది 30వ చిత్రం. ఇటీవల ఈ ప్రాజెక్టను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా NTR30 టీమ్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ని అందించింది. ఎన్టీఆర్ కొత్త లుక్ని విడుదల చేస్తూ బర్త్డే విషెష్ అందజేసింది. ఇందులో ఎన్టీఆర్ ఫార్మల్ డ్రస్ లో స్మార్ట్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతంఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. . ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్.. కొరటాల శివ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించనున్నారు. Wishing our Young Tiger @tarak9999 a very Happy Birthday. Sending you cheer & wishing you good health ❤️#NTR30#NTRKoratalaSiva2 @sivakoratala @NTRArtsOfficial pic.twitter.com/rj2rkPO3RH — Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2021 -
వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్ వీళ్లే..
2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది, సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్ను టార్గెట్ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్ ఎవరంటే... ‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్ను ప్యాన్ ఇండియన్ స్టార్ని చేస్తే, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరును చేర్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్ కూడా సమ్మర్ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. -
ఇట్స్ అఫీషియల్: 'ఆచార్య' వాయిదా
కరోనా వల్ల గతేడాది తెలుగు ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. కొన్ని నెలలపాటు థియేటర్లు తెరుచుకోనేలేదు. కానీ విచిత్రంగా ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం జనాలు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తూ థియేటర్లకు తరలి వచ్చారు. ఫలితంగా ఎన్నో సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇది చూసి సినీ ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు వచ్చాయని అందరూ సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభించడంతో సినిమాకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఈసారి ప్రభుత్వాల కన్నా ముందే తెలుగు ఇండస్ట్రీ స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు సినిమాలు వాయిదాబాట పట్టాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్సేన్ 'పాగల్' రిలీజ్లు వాయిదా వేసుకోగా తాజాగా మెగాస్టార్ కూడా అదే బాటలో నడిచాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. Keeping in view of the pandemic situation, #Acharya movie will not be releasing on May 13. New Release date will be announced once the situation becomes normal. Wear mask, Stay home & stay safe!#AcharyaPostponed — Matinee Entertainment (@MatineeEnt) April 27, 2021 దీంతో ఈ సినిమా మే 13న రిలీజ్ అవ్వడం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టులో ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్చరణ్ సిద్ధ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. చదవండి: సినిమా షూటింగ్లకు ‘సెకండ్ బ్రేక్’ ‘ఆచార్య’ టీంకు భారీ షాక్, మెగాస్టార్కు సైతం అదే బెడద -
కొరటాల ప్రాజెక్ట్కు నో చెప్పిన విజయ్.. కారణం ఇదేనట
కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించి మంచి సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు అందిచండంతో సిద్ధహస్తుడు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ ‘మిర్చి’ మొదలు మహేశ్బాబు ‘భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో మరో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కొరటాల శివ ఆఫర్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తిరస్కరించాడనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. తన స్నేహితుని కోసం ఓ సినిమా చేయమని అడిగితే విజయ్ దేవరకొండ నో చెప్పారట. వివరాల్లోకి వెళితే.. యువ సుధా ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్, కొరటాల శివ మధ్య మంచి అనుబంధం ఉంది. కొరటాల శివ సక్సెస్ బాటలో దూసుకెళ్లడంతో ఆయన అండతో సుధాకర్ నిర్మాతగా నిలదొక్కుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన టాలీవుడ్లో చాలా సినిమాలు నిర్మిస్తున్నాడు. భవిష్యత్తులో కొరటాల తీయబోయే సినిమాలను యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా.. కొరటాల శివ టాప్ డైరెక్టర్గా కొనసాతున్నప్పుడే తన నిర్మాణ సంస్థను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నాడట సుధాకర్. కొరటాల కూడా తన స్నేహితుడి బ్యానర్ కోసం కొత్త ప్రాజెక్టులను సెట్ చేయాలని చూస్తున్నాడట. అందులో భాగంగా యువసుధ ఆర్ట్స్, యువ దర్శకుడు వెంకి కుడుముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేశాడట. దీని కోసం రౌడీ హీరోని సంప్రదించారట. అయితే విజయ్ మాత్రం కొరటాల ఆఫర్ని సున్నితంగా తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లే కొరటాల ఆఫర్ని విజయ్ రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా రాబోయే రెండేళ్ల వరకు విజయ్ డేట్స్ ఖాళీగా లేవట. అందుకే కొరటాల ప్రాజెక్ట్కి నో చెప్పాడట. ఇక విజయ్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్టు కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నాడట కొరటాల శివ. చదవండి: సోహైల్కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్ ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’ -
ఎన్టీఆర్ ఎఫెక్ట్.. బన్నీ సినిమా ఆగిపోయిందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందాల్సింది. జీఏ 2, యువసుధ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ జూనియర్ ఎన్టీఆర్తో కొరటాల శివ చేయనున్న సినిమా ఎనౌన్స్మెంట్ సోమవారం వచ్చింది. దీంతో కొరటాల, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఆగిందనే టాక్ టాలీవుడ్లో వినిపించింది.‘‘అల్లు అర్జున్ , కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఆగిపోలేదు. పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం’’ అని యువసుధ ఆర్ట్స్ ప్రతినిథులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక కొరటాలను ఎన్టీఆర్ లాగేసుకోవడంతో పుష్ప తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకుంటాడా లేదా వేరే దర్శకుడితో సినిమా చేస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్తో ‘ఐకాన్’ అనే సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. చదవండి: NTR 30: ఈసారి లోకల్ రిపేరింగ్ కాదు.. అంతకు మించి -
NTR 30: ఈసారి లోకల్ రిపేరింగ్ కాదు.. అంతకు మించి
2016లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎంత హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడిగా కనిపించిన ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు. సరిగ్గా ఐదేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ విషయాన్ని కొరటాల శివ సోమవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా ఇది తారక్కు 30వ సినిమా. ఇక ఈ చిత్రం షూటింగ్ అయినా మొదలు పెట్టకముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. Very happy to collaborate with @tarak9999 garu once again. Last time repairs were local...but for a change we will cross boundaries this time.#NTR30#NTRKoratalaSiva2@YuvasudhaArts @NTRArtsOfficial pic.twitter.com/cN0lFMOiuf — koratala siva (@sivakoratala) April 12, 2021 వచ్చే ఏడాది ఏప్రిల్ 29న తారక్ సినిమాను థియేటర్లలో వదులుతామని వెల్లడించాడు. 'ఇంతకుముందు లోకల్ రిపేరింగ్స్ మాత్రమే చేశాం.. కానీ ఈసారి దాని సరిహద్దులు చెరిపేస్తాం..' అని చెప్పుకొచ్చాడు శివ. దీనిపై తారక్ స్పందిస్తూ.. మరోసారి కొరటాలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఈ సినిమాను తారక్ సోదరుడు నందమూరి కల్యాణ్రామ్ సమర్పిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ‘ఆచార్య’ తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారట. తాజా అనౌన్స్మెంట్తో తారక్.. త్రివిక్రమ్తో, కొరటాల శివ.. అల్లు అర్జున్తో సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. Equally delighted to work with you once again @sivakoratala garu 🤗 https://t.co/FH29q0ynrj — Jr NTR (@tarak9999) April 12, 2021 చదవండి: త్రివిక్రమ్తో తారక్ సినిమా వాయిదా -
ఎన్టీఆర్-కొరటాల కాంబోలో మరో సినిమా.. నేడే బిగ్ అనౌన్స్మెంట్!
‘అరవింద సమేత వీరరాఘవ’(2018) సినిమా తర్వాత హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా గతంలోనే చురుగ్గా సాగాయి. అయితే ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని... హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో దర్శకుడితో, హీరో మహేశ్బాబుతో త్రివిక్రమ్ సినిమా చేయనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి. ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగుతుందనే ప్రచారం కూడా సాగింది. కానీ తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ‘జనతా గ్యారేజ్’(2016) తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మళ్లీ ఇప్పుడు కలిసి పని చేయనున్నారట. మరి.. అల్లుఅర్జున్–కొరటాల శివ కాంబినేషన్లోని సినిమా పరిస్థితి ఏంటి? అన్న అన్ని ప్రశ్నలకు సోమవారం ఓ స్పష్టమైన ప్రకటన ఇవ్వనున్నారు. ఆంతరంగిక వర్గాల కథనం ప్రకారం త్రివిక్రమ్తో తారక్ సినిమా ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలో త్రివిక్రమ్, మహేశ్బాబు సినిమా పట్టాలెక్కుతోంది. మరోపక్క కొరటాల శివ, అల్లు అర్జున్ల సినిమా కూడా ఇప్పటికి ఆగిపోయినట్టే. దాని బదులు కొరటాల – తారక్ల కాంబినేషన్ చిత్రం మొదలు కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ‘ఆచార్య’ తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారట. -
లెట్స్ డు కుమ్ముడు!
‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లోనో, పాటలోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్చరణ్. ‘ఆచార్య’లో తొలిసారి పూర్తి స్థాయిలో కలసి నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఇటీవలే చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ పాటలో కొన్ని స్టెప్పులేసి వెళ్లారు చరణ్. ‘ఆచార్య’లో సీన్స్ మాత్రమే కాదు... లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మే 13న ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. -
‘ఆచార్య’ మూవీ స్టిల్స్