New bike
-
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్సైకిల్పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్తో 5 స్పీడ్ గేర్బాక్స్ను ఈ బైక్లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
తళుక్కుమన్న టీవీఎస్ సరికొత్త రోనిన్
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ రోనిన్ మోటార్సైకిల్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న టీవీఎస్ మోటోసోల్ 4.0 కార్యక్రమంలో ఈ సరికొత్త మోడల్ తళుక్కుమంది. 225 సీసీ ఇంజన్తో ఇది తయారైంది. 20 బీహెచ్పీ, 19 ఎన్ఎం టార్క్ అందిస్తుంది.5 స్పీడ్ గేర్బాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కట్–ఆఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ వంటి హంగులు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ మిడ్–వేరియంట్ రైడర్ల భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డ్యూయల్–ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో రూపొందింది. బేస్ వేరియంట్కు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు.‘ఈ అప్గ్రేడ్ టీవీఎస్ రోనిన్ యొక్క మూడు వేరియంట్లలో మరింత స్థిరమైన భేదాన్ని సృష్టిస్తుంది. ఇది రంగు, గ్రాఫిక్స్లో మాత్రమే కాకుండా కార్యాచరణలో కూడా స్పష్టమైన వ్యత్యాసాలను అందిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు రోనిన్ మోడల్లలో ఇప్పటికే ఉన్న డెల్టా బ్లూ, స్టార్గేజ్ బ్లాక్లను భర్తీ చేస్తాయి.గివీతో టీవీఎస్ జోడీ..ఈ సందర్భంగా మోటార్సైకిల్ లగేజ్ సిస్టమ్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గివీతో టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ రైడింగ్ స్టైల్స్, స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన ప్రీమియం లగేజ్ సొల్యూషన్లను అందజేస్తుందని టీవీఎస్ వివరించింది.ప్రత్యేకంగా టీవీఎస్ ద్విచక్ర వాహనాల కోసం కస్టమ్–డిజైన్ చేయబడిన ఫ్రేమ్లు, మౌంట్లను గివీ అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల యాక్సెసరీల విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, ఆధునిక మోటార్సైక్లిస్ట్లకు అత్యాధునిక డిజైన్, సౌకర్యాన్ని అందిస్తుందని టీవీఎస్ వివరించింది. -
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్కు అప్డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్లో ఈ బైక్ను కంపెనీ ఆవిష్కరించింది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్లలో లభిస్తుంది.కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్గ్రేడ్ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్పెగ్లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్బాక్స్తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన లైనప్కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తరువాత.. 650 సీసీ విభాగంలో మరో బైక్ లాంచ్ చేసింది. 'ఇంటర్సెప్టర్ బేర్ 650' పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్).రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ఆధారంగా నిర్మితమైన ఈ బైక్ స్క్రాంబ్లర్ బైక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఆ రెండు బైకుల ఫీచర్స్ ఈ ఒక్క బైకులోనే గమనించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్, సైడ్ ప్యానెల్స్పై నంబర్ బోర్డ్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నీ కూడా ఈ బైకును చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 బైక్ 130 మిమీ ట్రావెల్తో 43 మిమీ షోవా యుఎస్డి ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు 115 మిమీ ట్రావెల్తో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ హిమాలయన్ బైకులో కనిపించే ఫుల్ కలర్డ్ TFT స్క్రీన్ కూడా ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్648 సీసీ ఇంజిన్ కలిగిన ఇంటర్సెప్టర్ బేర్ 650.. 47 Bhp పవర్, 57 Nm టార్క్ అందిస్తుంది. 216 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పుడు డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
టీవీఎస్ అపాచీ లేటెస్ట్ ఎడిషన్.. మరింత పవర్ఫుల్!
టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్టీఆర్ 310 లాగే ఉంటుంది.కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్లెట్లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్పీ, 29ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్బాక్స్ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్బాక్స్తో బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో వస్తుంది.యూఎస్డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో రెండు చివరల డిస్క్ బ్రేక్లు, రైడ్ మోడ్లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ను కూడా వీటిలో చేర్చింది. అవుట్గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.ధరలుకొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెడ్ (క్విక్షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్షిఫ్టర్తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్జే
ముంబై: మహీంద్రా గ్రూప్నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్జే బైక్ను భారత్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్లో జావా బ్రాండ్ భారత్లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్లు, టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్ఈడీ పైలట్ లైట్లు, హెడ్లైట్, టెయిల్ లైట్ అప్డేటెడ్ ఎడిషన్లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్లో అయితే ఎల్ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్ను ఐదు-స్పీడ్ గేర్బాక్స్తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్) అనే ఐదు వేరియంట్లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్తో రావడం విశేషం. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్లు, వెనుక స్లైడింగ్ కాలిపర్తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
లాంచ్కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ బైక్
ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్ 2024 ఎఫ్ 900 జీఎస్. ఈ బైక్ టీజర్లను సంస్థ ఇప్పటికే విడుడల చేసింది. దీన్ని బట్టి చూస్తే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.చూడటానికి కొత్తగా కనిపించే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ ముందు భాగం సైడ్ ఫెయిరింగ్లను పొందుతుంది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద TFT డాష్ బోర్డు, కీలెస్ ఇగ్నిషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ బరువు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా తక్కువ.ఇదీ చదవండి: నిమిషానికి 693 రాఖీలు.. ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ 895 సీసీ ఇంజిన్ కలిగి 105 బ్రేక్ హార్స్ పవర్, 93 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఆగస్టు చివరి నాటికి అధికారికంగా విడుదలవుతుందని సమాచారం. దీని ధర రూ. 13 లక్షల నుంచి రూ. 14.5 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్మాస్టర్ ఎలైట్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్లు ఉన్నాయి.రోడ్మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్సైకిల్గా రూపొందిన రోడ్మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ను కలిగి ఉంది.ఈ బైక్లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్రెస్ట్లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్లు ఉన్నాయి.రోడ్మాస్టర్ ఎలైట్లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్లు ఉన్నాయి.హార్డ్వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్'
టీవీఎస్ మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేదు. అంటే ఈ బైకులో స్టాండర్డ్ మోడల్లోని అదే ఇంజిన్ పొందుతుంది.టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్స్ కలిగి ఆలివ్ గ్రీన్ కలర్ స్కీమ్ కూడా పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్దాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది.రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ బైక్ USD ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే కాకుండా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లను పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. -
డుకాటీ కొత్త బైక్.. ధర ఎంతంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ డుకాటీ 2025 పానిగెల్ వీ4ను ఆవిష్కరించింది. కంపెనీ మొదటిసారి దేశీయ విఫణిలో ఈ బైకును 2018లో లాంచ్ చేసింది. ఆ తరువాత అనేక మార్పులకు లోనవుతూ వచ్చిన ఈ బైక్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 డుకాటీ పానిగెల్ వీ4 సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ కలిగి ఉంది. ఈ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 216 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని మునుపటి బైక్ కంటే కూడా 2.7 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.2025 డుకాటీ పానిగెల్ వీ4 బైక్ 6.9 ఇంచెస్ TFT డిస్ప్లే పొందుతుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.కొత్త ఫెయిరింగ్ డిజైన్, రీడిజైన్ ఎల్ఈడీ హెడ్లైట్, నార్మల్ స్వింగార్మ్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. టైయిల్లైట్ కూడా రీడిజైన్ చేశారు. ఈ బైక్ అధికారిక ధరలు ఇంకా వెల్లడికాలేదు. అయితే దీని ధర రూ. 2772 లక్షల నుంచి రూ. 33.48 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. -
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
-
దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి బైక్: ధర ఎంతో తెలుసా?
డుకాటి భారతదేశంలో హైపర్మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్మోటార్డ్ 950 ఆర్విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.హైపర్మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్తో ఇంజిన్లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్ లాంచ్ చేసింది.డుకాటీ లాంచ్ చేసిన హైపర్మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్లైట్, హై ఫ్రంట్ మడ్గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
కేవలం 100 మందికి మాత్రమే ఈ బైక్.. వేలంలో కొనాల్సిందే
దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయి.హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle. Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024 -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇంజిన్లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?
జావా మోటార్సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్తో పాటు రెడ్ అండ్ క్రోమ్లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.జావా 42 బాబర్ కొత్త వేరియంట్లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. -
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్సైకిల్' త్వరలోనే '2024 రోడ్మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
మార్కెట్లో లాంచ్ అయిన 'మార్విక్ 440' బైక్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడటానికి హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్లో యూజర్ చాట్ వైరల్ -
విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్జీ బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్నేమ్తో రానున్న ఈ కొత్త సీఎన్జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు. సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్' - ఫోటోలు చూశారా? పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. -
‘యమహా’ యమ్మా ఏం బైక్ గురూ..! (ఫొటోలు)
-
అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్పై రైడ్!
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు. View this post on Instagram A post shared by Sai (@always__about__akkineni) (ఇది చదవండి: లెస్బియన్స్గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) -
అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125కొత్త బైక్: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Aprilia SR Storm 125 వాహన తయారీలో ఉన్న పియాజియో వెహికిల్స్ తాజాగా అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125 స్కూటర్ ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.స్పోర్టీ స్టైలింగ్తో ఆకర్షణీయంగా ఉంది. ఇంజీన్ 125 సీసీ 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఐ-గెట్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 9.6 సెకన్లలో అందుకుంటుంది. డిస్క్ బ్రేక్స్తో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, గ్రాఫిక్స్తో ట్యూబ్యులార్ స్టీల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. పరిచయ ఆఫర్ ధర ఎక్స్షోరూంలో రూ.1,07,999 ఉంది. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్తో కరిజ్మా బ్రాండ్ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్తో వస్తుంది.ఇంకా ఈ బైక్లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్స్క్రీన్తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్గా, స్టైలిష్గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది. సుజుకి హయాబుసా పవర్ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్ హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ బై డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో లభిస్తుంది. రైడింగ్ మోడ్లు, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) అంచనా ధర & ప్రత్యర్థులు సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్నేమ్తో ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో అతిపెద్ద మోటార్సైకిల్గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
టీవీఎస్ నుంచి కొత్త బైక్.. పేరేంటో తెలుసా?
అనేక ఆధునిక వాహనాలు భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ 'అపాచీ ఆర్టీఎక్స్' (Apache RTX) అనే నేమ్ప్లేట్ను ట్రేడ్మార్క్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపాచీ విభాగంలో 160సీసీ, 180సీసీ, 200సీసీ, 310సీసీ బైకులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్ చేరటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్పై టీవీఎస్ కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు ఒక బైక్ కూడా విడుదల చేయలేదు. రాబోయే కొత్త బైక్ టీవీఎస్ ఆర్టీఆర్ కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు అడ్వెంచర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ బైకులు ఆల్ ఇన్ వన్ బైకులుగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్రూఫ్ లీక్పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ తప్పకుండా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరుత లాంటి వేగం ఈ బైక్ సొంత - ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్బైక్లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. -
2023 హోండా యూనికార్న్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Honda Unicorn Lunched: హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న యునికార్న్ బైకు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన 2023 హోండా యూనికార్న్ ధర రూ. 1,09,800. ఈ బైక్ మునుపటి మోడల్ ధర రూ. 1,05,718 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే ఈ అప్డేటెడ్ బైక్ ధర మునుపటి కంటే కూడా రూ. 4,082 ఎక్కువ. ఈ బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. ఈ అప్డేటెడ్ బైక్ డిజైన్ & ఫీచర్స్ అన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు 715 మిమీ, మొత్తం బరువు 140 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా యూనికార్న్ కూడా ఒకటి కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) ఇంజిన్ & వారంటీ అప్డేటెడ్ హోండా యూనికార్న్ బైకులో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్పిఎమ్ వద్ద 12.9 bhp పవర్, 5500 ఆర్పిఎమ్ వద్ద 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి డ్రమ్ బ్రేక్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి - ధర ఎంతో తెలుసా?) హోండా కంపెనీ కొత్త యునికార్న్ కోసం స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల వారంటీ మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ కొనుగోలుపైన 10 సంవత్సరాల వారంటీ కవరేజ్ పొందవచ్చు. -
భారత్లో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైక్ - ధర & వివరాలు
2023 Hero Xtreme 160R 4V: భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో మోటోకార్ప్ కొత్త బైక్ పేరు 'ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి'. ఇది స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, రూ. 1.32 లక్షలు & రూ. 1.36 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). డిజైన్ & ఫీచర్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి రీ డిజైన్ చేయబడిన ఫుల్ ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది, స్విచ్ గేర్ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీటు సెటప్ కలిగి రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోనోషాక్ షోవా 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ యూనిట్ వంటివి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మిగిలిన వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫోర్క్ / మోనోషాక్ సెటప్ ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో LCD డిస్ప్లే లభిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. కావున కాల్, నోటిఫికేషన్ అలర్ట్ వంటి వాటిని పొందవచ్చు. కాగా దీనికి సింగిల్ పీస్ సీటు, ఫోన్ మౌంట్, బార్ ఎండ్ మిర్రర్ వంటి యాక్ససరీస్ లభిస్తాయి. ఆసక్తి కలిగిని వినియోగదారులు బైకుని మరింత అందంగా చేయాలనుకుంటే ఈ యాక్ససరీస్ పొందవచ్చు. (ఇదీ చదవండి: ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం - అసలు విషయం ఏంటంటే?) ఇంజిన్ & పర్ఫామెన్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకులోని 163 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఎయిర్ కూల్డ్తో పాటు ఆయిల్ కూలర్ను పొందుతుంది. కావున ఇది ఆధునిక 4 వాల్వ్ హెడ్ పొందుతుంది. ఇది 16.9 bhp పవర్ 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 140 కేజీల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రత్యర్థులు భారతదేశంలో విడుదలైన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి ధరల పరంగా బజాజ్ పల్సర్, అపాచే ఆర్టిఆర్ 4వి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. సంస్థ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు జూలై రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ఫొటోలు విడుదల
అమెరికన్ టూవీలర్ కంపెనీ హార్లే డేవిడ్సన్ బైక్లంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ బైక్లను భారత్లోనూ చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440) ఫొటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో భారత్లో వీటిని అభివృద్ధి చేసి తయారు చేయడం విశేషం. కంపెనీ విడుదల చేసిన కొత్త ఫొటోల ఆధారంగా హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ఇంజిన్, డిజైన్, హార్డ్వేర్కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజిన్ ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 440సీసీ ఇంజన్ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ మోటార్తో ఇది పోటీపడుతుంది. తరువాతి పవర్ ఫిగర్లు 20.2బీహెచ్పీ, 27ఎన్ఎం టార్క్. హార్లే-డేవిడ్సన్ 440సీసీ పవర్ట్రెయిన్ స్పెసిఫికేషన్లను వెల్లడించనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్కు సమానమైన అవుట్పుట్ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ హార్లే డేవిడ్సన్ XR డిజైన్ ఎథోస్ నుంచి ప్రేరణ పొందిన ఎక్స్440 అనేది రోడ్స్టర్ అంటే ఇది ఫ్లాట్, విశాలమైన హ్యాండిల్బార్తో రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. పాదాల పెగ్లు క్రూయిజర్ లాగా ముందుకు, వెనుకకు కదిలే వీలు ఉండదు కాబట్టి సీటింగ్ స్థానం తటస్థంగా ఉంటుంది. సరళమైన గుండ్రని ఆకారపు ఎల్ఈడీ హెడ్లైట్, వృత్తాకార ఇండికేటర్లు, అద్దాలు ఉంటాయి. స్లిమ్గా రూపొందించిన చతురస్రాకారపు ఇంధన ట్యాంక్పై హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ట్యాగ్ ఉంటుంది. హార్డ్వేర్ కొత్త ఎక్స్440 రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్లతో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్లతో వస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్లతో 18 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ ఉంటాయి. అలాగే సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. Soak in the beauty. The scenery isn’t too shabby either. Come 3rd July, everything will change. The H-D X440.#HarleyDavidson #HarleyDavidsonIndia #HD120 #HDIndia #HDX440 #X440 All pictures shown are for illustration purposes only. Actual products may vary. pic.twitter.com/onkurmHRY1 — Harley-Davidson Ind (@HarleyIndia) June 9, 2023 ధర బజాజ్ ట్రయంఫ్ 400, హార్లే డేవిడ్సన్ ఎక్స్440 రెండు మోటార్సైకిళ్లూ పోటాపోటీగా వస్తున్నాయి. జులైలో వీటిని ఆయా కంపెనీలు మార్కెట్కు పరిచయం చేయనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి పోటీగా వస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉండవచ్చు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
రూ. 60760కే హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ఎడిషన్ - అదిరిపోయే ఫీచర్స్
Hero HF Deluxe Black Canvas Edition: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్కి చెందిన మరో కొత్త ఎడిషన్ను లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ పేరు 'హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్' (HF Deluxe Black Canvas). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & కలర్ ఆప్షన్స్ కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి కిక్ వేరియంట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 60760 & రూ. 66,408 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే పెయింట్ స్కీమ్లో కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. ఇప్పుడు రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి) డిజైన్ & ఫీచర్స్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 3డీ హెచ్ఎఫ్ డీలక్స్ ఎంబ్లమ్ పొందుతుంది. ఇందులో అన్ని లైట్స్ హాలోజన్ యూనిట్లు కావడం విశేషం. ఫీచర్స్ విషయానికి వస్తే.. ట్యూబ్లెస్ టైర్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, టో-గార్డ్ వంటివి ఉన్నాయి. ఇక పరిమాణం పరంగా ఈ బైక్ పొడవు 1965 మిమీ, వెడల్పు 720 మిమీ, వీల్బేస్ 1,235 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.9 బీహెచ్పీ పవర్ 6000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఈ బైక్పై కంపెనీ 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్లో యమహా డార్క్ నైట్ ఎడిషన్ లాంచ్ - వివరాలు
Yamaha YZF-R15 V4 Dark Knight Edition: భారతదేశంలో యమహా బైకులకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ తాజాగా మరో బైకుని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు 'వైజెడ్ఎఫ్-ఆర్15 వి4' (YZF-R15 V4) డార్క్ నైట్ ఎడిషన్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్ని బతి ధరలు కూడా మారుతూ ఉంటాయి. వైజెడ్ఎఫ్-ఆర్15 రెడ్ కలర్ ధర రూ. 1.18 లక్షలు, డార్క్ నైట్ ధర రూ. 1.82 లక్షలు, బ్లూ అండ్ ఇంటెన్సిటీ వైట్ ధరలు రూ. 1.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ చూడటానికి దాదాపు బ్లాక్ కలర్ పొందుతుంది. అయితే ఇందులో లోగోలు, అల్లాయ్ వీల్స్ వంటివి గోల్డ్ హైలైట్లను పొందుతాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ఇంజిన్ ఇంజిన్ కూడా స్టాండర్డ్ ఎడిషన్ బైక్తో సమానంగా ఉంటుంది. కావున అదే లిక్విడ్ కూల్డ్ 155 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 18.4 hp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, కెటిఎమ్ RC 200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్లో హీరో ఎక్స్పల్స్ 200 4వి లాంచ్ - పూర్తి వివరాలు
Hero Xpulse 200 4V: భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు అప్డేటెడ్ 'హీరో ఎక్స్పల్స్ 200 4వి' (Hero Xpulse 200 4V) విడుదలైంది. అదే సమయంలో ర్యాలీ ఎడిషన్ ప్రో వేరియంట్గా కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు, ఇతర ఫీచర్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ హీరో ఎక్స్పల్స్ 200 4వి బైక్ ధర రూ. 1.44 లక్షలు, కాగా ర్యాలీ ఎడిషన్ ప్రో ధర రూ. 1.51 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ బైక్స్ వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. డిజైన్ & ఫీచర్స్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ బైక్స్ అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది, కావున ఇది మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతే కాకుండా పొడవైన విండ్స్క్రీన్, కొత్త స్విచ్ గేర్ వంటివి మరింత ఫ్రీమియంగా ఉంటాయి. బ్లాక్ ఎలిమెంట్స్ స్థానములో ఇవి పెద్ద హ్యాండ్ గార్డ్లను పొందుతాయి. ఇవన్నీ రైడర్కి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ అప్డేటెడ్ హీరో ఎక్స్పల్స్ బైకుల ఇంజిన్లలో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ 200 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు ఓబిడి-2 కంప్లైంట్తో పాటు ఈ20 అనుకూలతను పొందుతుంది. ఇంజిన్ 19.1 hp పవర్, 17.35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబీఎస్ కోసం రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ బైకులో ఫుట్ పెగ్లు ఇప్పుడు 35 మి.మీ తక్కువ, వెనుక 8 మి.మీ ఎక్కువతో సెట్ చేశారు. కావున రైడింగ్ చేయడానికి మునుపటికంటే చాలా అనుకూలంగా ఉంటుంది. USB ఛార్జర్ మరింత అనుకూల ప్రదేశంలో నిక్షిప్తం చేశారు. ఇక ప్రో వేరియంట్ ర్యాలీ కిట్ పొందటం వల్ల రెండు చివర్లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ పెరిగి అడ్జస్టబుల్, బెంచ్ స్టైల్ సీట్, హ్యాండిల్బార్ రైజర్లు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రైడింగ్కి సిద్ధమైపోండి.. మరిన్ని హంగులతో 390 అడ్వెంచర్ వచ్చేసింది!
2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త మార్పులు.. గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్జెలర్ టూరెన్స్ టైర్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్కి ఫిదా అవ్వాల్సిందే!) లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి -
కొత్త బండి.. రెండు హెల్మెట్లు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండటం... కొన్ని సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ ధరించినా వెనుక కూర్చొనే వ్యక్తులకు (పిలియన్ రైడర్) హెల్మెట్ లేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో ఈ తరహా ప్రమాదాలను నివారించాలని పోలీసులు భావిస్తున్నారు. వాహనదారుడితోపాటు వెనుక కూర్చొనే వారు సైతం హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వెళ్లనున్నారు. ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలోనే రెండు నాణ్యమైనహెల్మెట్లను కొనడాన్ని తప్పనిసరి చేస్తే మరింత ఫలితం ఉంటుందని యోచిస్తున్నారు. నూతన ద్విచక్ర వాహన ధరతోపాటు రెండు నాణ్యమైన హెల్మెట్ల ధరను సైతం జోడించి షోరూంలు విక్రయించేలా చూడాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీన్ని అమలు చేసేలా రవాణా శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పోలీసు శాఖ తరఫున కోరనున్నట్లు చెప్పారు. ఇలా రెండు హెల్మెట్ల వాడకం క్రమంగా పెరిగితే రోడ్డు ప్రమాదాలు జరిగినా ద్విచక్రవాహనదారుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు. -
అందరికి తెలిసిన బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో మళ్ళీ తన అవెంజర్ 220 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ క్రూజ్ 220, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 సరసన స్ట్రీట్ 220. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త అవెంజర్ 220 బైక్ చూడటానికి దాని స్ట్రీట్ 160 మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో రౌండ్ హెడ్ లాంప్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఒక చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ప్లాట్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. బజాజ్ అవెంజర్ 220 బైక్ 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 18.7 bhp పవర్, 17.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ బిఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందింది. కావున మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఈ బికా ధరలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది అవెంజర్ క్రూజ్ 220 కంటే తక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీని ధర బహుశా రూ. 1.40 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ గురించి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుతున్న అదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి, విడుదల చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే 'యులు' (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త వైన్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే (ఎక్స్-షోరూమ్). ఈ ధర కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత ఇది రూ. 64,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే డెలివరీలు మే 2023 నుంచి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్షన్స్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. ఇవి రెండూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) బ్యాటరీ & రేంజ్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు ఛేస్విది. ఇందులో 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. (ఇదీ చదవండి: ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!) కొత్త యులు వైన్ బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ మల్టిపుల్ మొబిలిటీ ఫ్యాక్స్ పొందుతుంది. కావున బ్యాటరీ యాజ్-ఏ-సర్వీస్ సబ్స్స్క్రిప్షన్ మీద నెలవారీ చార్జీలను ఉపయోగించుకోవచ్చు. దీనికింద నెల చార్జీలు రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంటాయి. దీని వల్ల రైడింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్లాన్ ద్వారా కిలోమీటరుకు 70 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. చూడటానికి బైక్ చిన్నగా ఉన్నప్పటికీ 100 కేజీలు పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. -
సాయుధ బలగాల కోసం వీర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్: కన్జూమర్ టెక్నాలజీ సంస్థ ఉడ్చలో కొత్తగా వీర్బైక్ పేరిట ఎలక్ట్రిక్ సైకిల్ను ఆవిష్కరించింది. సాయుధ బలగాల కోసం దీర్ఘకాలం మన్నే, చౌకైన రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు. (ఇదీ చదవండి: రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!) మన్నికైన తేలికపాటి ఫ్రేమ్, ఎలక్ట్రిక్ కటాఫ్లతో డిస్క్ బ్రేక్లు, సర్దుబాటు చేసుకోగలిగే సీటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఏడాది వారంటీ తదితర ప్రత్యేకతలు ఈ విద్యుత్ బైక్లో ఉంటాయని సంస్థ సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్ఫోర్స్ బ్లూ తదితర అయిదు రంగుల్లో ఈ బైక్లు లభ్యమవుతాయని తెలిపారు. -
హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో 2023 హోండా SP125 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ త్వరలో అమలులోకి రానున్న బిఎస్6 ఫేస్-2 నిబంధనలకు అనుకూలంగా తయారైంది. ధర: 2023 హోండా ఎస్పి125 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ.85131, రూ.89131 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలు దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 1,000 ఎక్కువ. (ఇదీ చదవండి: YouTube: అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..) డిజైన్ & ఫీచర్స్: కొత్త హోండా ఎస్పి125 డిజైన్, ఫీచర్స్ పరంగా ఎక్కువ అప్డేటెడ్స్ లేదు. అయితే ఇది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆఫర్లో లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితోపాటు టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) ఇంజిన్: 2023 హోండా ఎస్పి125 బైక్ 123.94 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.8 హెచ్పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. -
హోండా 100 సీసీ షైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా 100 సీసీ షైన్ 100 బైక్ను ఆవిష్కరించింది. మహారాష్ట్ర ఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర రూ.64,900 ఉంది. డెలివరీలు మే నుంచి మొదలు కానున్నాయి. ఏడాదిలో 3 లక్షల యూనిట్ల విక్రయం లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వచ్చే మూడు ఏళ్లలో దీనిని 6 లక్షల యూనిట్లకు తీసుకువెళతామని వివరించింది. దేశంలో టూవీలర్ల మార్కెట్లో 100 సీసీ విభాగం మూడింట ఒక వంతు కైవసం చేసుకుంది. ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో గుజరాత్ ప్లాంటులో కొత్త తయారీ లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అట్సుషి ఒగటా తెలిపారు. షైన్ 100 రాకతో కంపెనీ చరిత్రలో తొలిసారిగా వచ్చే ఏడాది పూర్తి తయారీ సామర్థ్యంతో ప్లాంట్లు నడిచే అవకాశం ఉందన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఎంఎస్ఐకి 35 శాతం వాటా ఉంది. 2024 మార్చినాటికి భారత్లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ రంగ ప్రవేశం చేయనుంది. -
100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
భారత బైక్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్తో హోండా కంపెనీ కొత్త బైక్ను విడుదల చేసింది. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్ బైక్లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్ పేరుతో 100 సీసీ మోటర్ సైకిల్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్షోరూం). అంటే హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువే.. హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు హోండా షైన్ 100 సీసీ బైక్ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్తో కూడిన ట్యాంక్ ఉన్నాయి. ఇంజిన్ ఇన్హిబిటర్తో కూడిన సైడ్ స్టాండ్ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్)ను ఈ 100సీసీ బైక్లోనూ చేర్చారు. ఇక డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్ వీల్స్ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
రూ. 16.47 లక్షల కొత్త కవాసకి బైక్
భారతీయ మార్కెట్లో కవాసకి ఇండియా కొత్త జెడ్900ఆర్ఎస్ (Z900RS) బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 16.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మన దేశానికీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో వస్తుంది. కావున ధర దాని మునుపటి మోడల్ ఏజ్ఎక్స్-ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. 2023 కవాసకి జెడ్900ఆర్ఎస్ బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్పిఎమ్ వద్ద 107 బీహెచ్పీ పవర్ 6,500 ఆర్పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. కొత్త జెడ్900ఆర్ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్ల్యాంప్, టియర్డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్తో కూడిన మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ అనే రెండు కలర్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఈ బైకులో ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్లు 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్లు అమర్చబడి ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్గా లభిస్తుంది. (ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ స్టార్ 'రామ్ చరణ్' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?) -
హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్తో
పాపులర్ అమెరికన్ బైక్ తయారీ కంపెనీ హార్లే-డేవిడ్సన్, చైనీస్ దిగ్గజం కియాన్జియాంగ్ మోటార్సైకిల్తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో తక్కువ సామర్థ్యం కలిగిన బైక్ మోడల్ అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా పుట్టుకొచ్చిన X350 రేపు (మార్చి 10) మార్కెట్లో విడుదలకానుంది. హార్లే-డేవిడ్సన్ చైనీస్ మార్కెట్లో ఎక్స్350 బైకుతో పాటు, ఎక్స్500 బైకుని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బైకులో (ఎక్స్500) ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ బైకుల్లో వి-ట్విన్ ఇంజిన్ లేకపోవడం గమనార్హం. దీని స్థానంలో లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఈ బైకుల డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. నియో రెట్రో రోడ్స్టర్ స్టైలింగ్ ఇప్పుడు చూడవచ్చు. ఎల్ఈడీ లైటింగ్స్, యుఎస్డీ ఫోర్క్, ఆఫ్సెట్ మోనోషాక్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా చిన్న డిజిటల్ ఇన్సెట్తో అనలాగ్ స్పీడోమీటర్ కూడా అందుబాటులో ఉంటుంది. రెండు బైక్లు హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ లైనప్లో జాబితా చేయబడ్డాయి. కావున భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా విక్రయించబడే అవకాశం ఉంది, ప్రస్తుతం ఈ కొత్త బైకులు చైనీస్ మార్కెట్లో మాత్రమే విడుదలవుతాయి, భారతదేశంలో ఈ బైకుల లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్ లాంచ్ చేసిన ఆడి: ధర, ప్రత్యేకతలు
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లాంచ్ చేసింది. ఇది ఎల్, ఎస్, ఎమ్ అనే మూడు సైజుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 8,900 యూరోలు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7.69 లక్షలు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆవిష్కరణల్లో భాగంగానే ఈ ఎలక్ట్రిక మౌంటెయిన్ బైక్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైకులో ఇటలీకి చెందిన ఫాంటిక్ మోటార్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం జరిగింది. ఇది ఆడి ఆర్ఎస్ క్యూ ఈ-ట్రాన్ ఆధారంగా రూపొందించబడింది, అంతే కాకుండా ఈ మోడల్ 2022 డేకర్ ర్యాలీ నాలుగు స్టేజెస్లో విజయం సాధించింది. (ఇదీ చదవండి: Kia Niro: మగువలు మెచ్చిన కారు.. 2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత) ఆడి ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 720kWh బ్యాటరీ ప్యాక్ బూస్ట్, ఎకో, స్పోర్ట్, టూర్ అనే నాలుగు సైక్లింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని ఎకో మోడ్ మాగ్జిమమ్ రేంజ్లో ప్రయాణించడానికి, స్పోర్ట్ మోడ్ స్పోర్టీ సైక్లింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ హ్యాండిల్ బార్ మీద ఉన్న డిజిటల్ డిస్ప్లేలో స్పీడ్, బ్యాటరీ లెవెల్ వంటి వాటిని చూడవచ్చు. -
Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఉగాది పండుగకు ముందే సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ విడుదల చేసింది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్స్లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 83,368, రూ. 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇందులో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని తెలుసుసుకోవచ్చు. ఇది 125 సీసీ విభాగంలో విడుదలైన కొత్త బైక్. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7,500 ఆర్పిఎమ్ వద్ద 10.84 బీహెచ్పి పవర్, 6,000 ఆర్పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ 68 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఎల్ఈడీ హెడ్లైట్, విజర్, డ్యూయల్-టోన్ స్ట్రిప్స్ వంటి వాటిని పొందటమే కాకుండా, గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. -
మ్యాటర్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర తక్కువ, సూపర్ డిజైన్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో 'మ్యాటర్ ఎనర్జీ' (Matter Energy) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఏరా' లాంచ్ చేసింది. ఇది 4000, 5000, 5000+, 6000+ అనే నాలుగు వేరియంట్స్లో విడుదలైంది. ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుని నాలుగు వేరియంట్స్లో విడుదల చేసినప్పటికీ కేవలం మొదటి రెండు వేరియంట్స్ని మాత్రమే విక్రయిస్తుంది. మిగిలిన రెండు భవిష్యత్తులో విక్రయించబడతాయి. టాప్ వేరియంట్ 150 కిమీ రేంజ్ అందించగా, మిగిలిన మూడు వేరియంట్లు 125 కిమీ రేంజ్ అందిస్తాయి. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ 5kWh బ్యాటరీ, 10.5kW లిక్విడ్-కూల్డ్ మోటార్ పొందుతుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఏరా 5000 వేరియంట్ ఆప్సనల్ 7 ఇంచెస్ LCD టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగి ఆప్సనల్ బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, OTA అప్డేట్లు, ప్రోగ్రెసివ్ బ్లింకర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. 5000+ వేరియంట్లో లైఫ్స్టైల్, కేర్ ప్యాకేజీతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్గా లభిస్తుంది. కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. ఈ బైక్ 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్బాక్స్ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్ మరే ఇతర బైకులలో లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ) ప్రస్తుతం, కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, పూణే, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీల గురించి అధికారిక సమాచారం అందకపోయినప్పటికీ, త్వరలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్సన్స్ కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇంజిన్ & పర్ఫామెన్స్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. -
ఎంఎస్ ధోని మనసు దోచిన టీవీఎస్ బైక్ ఇదే!.. ధర ఎంతో తెలుసా!
భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న MS ధోని ఇటీవల 'టీవీఎస్ రోనిన్' బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే అనేక వాహనాలు కలిగిన ధోని గ్యారేజిలో ఇప్పుడు మరో అతిధి చేరింది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ గతేడాది రోనిన్ బైక్ విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్స్ని డ్యూయెల్ టోన్ కలర్స్లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశారు. ధోని డెలివరీ చేసుకున్న బైక్ విషయానికి వస్తే, ఇది 225 సీసీ ఇంజిన్ కలిగి 20 బిహెచ్పి పవర్ 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో గరిష్టంగా గంటకు 120 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ సైలెంట్ స్టార్ట్లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ను కలిగి ఉంది. టీవీఎస్ రోనిన్ రౌండ్ హెడ్ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త రోనిన్ బైక్ డబుల్ క్రెడిల్ స్ప్లిట్ చాసిస్తో 41 మి.మీ అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు, వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇప్పటికే కవాసకి నింజా హెచ్2, ఎక్స్132 హెల్క్యాట్, యమహా RD350, రాజ్దూత్, సుజుకి షోగన్, యమహా RX100, టీవీఎస్ అపాచీ 310, హార్లే డేవిడ్సన్, డుకాటీ వంటి 100 కంటే ఎక్కువ బైకులు కలిగి ఉన్నారు. తాజాగా ఇప్పుడు టీవీఎస్ రోనిన్ తన గ్యారేజిని అలంకరించింది. -
క్లాసీ, స్టయిలిష్ లుక్లో ‘జీటీ150 ఫేజర్ బైక్’: వివరాలు ఇలా..
సాక్షి,ముంబై: జపాన్కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బ్రాండ్ యమహా కొత్త బైక్ను విడుదల చేసింది. యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్గా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ లుక్లో స్టయిలిష్గా యూత్ను ఆకట్టుకునేలా లాంచ్ చేసింది. చైనాలో ఈ బైక్ ప్రారంభ ధరను 13,390 యువాన్లు అంటే ఇది భారతీయ రూపాయలలో దాదాపు రూ. 1.60 లక్షలు. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్టు సమాచారం. యమహా జీటి 150 ఫేజర్ ఇంజీన్ ఇందులోని 150సీసీ ఇంజన్ 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది . ఇక ఫీచర్ల విషయానికి వస్తే అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్లో రౌండ్ హెడ్ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్లు, ఫెండర్లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ పి150కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250, కేవలం 2 వేలతో
న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్పోలో కొత్త బైక్ను లాంచ్ చేసింది. SR125 సిరీస్లో కీవే ఎస్ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్పో 2023లో ఆవిష్కరించింది. రెట్రో మోడల్ బైక్ ఎస్ఆర్ 250 ప్రారంభ ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 2 వేల రూపాయలతో ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్ఆర్ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్ చేస్తోంది. We are excited to Launch the All-New #SR250 from Keeway. Buckle up to witness a Retro ride with a twist! Priced at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit: https://t.co/TZ4YeuD8Jb or call: 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #Launch #Hungarian pic.twitter.com/TS3Joj6XeH — KeewayIndia (@keeway_india) January 11, 2023 The SR 250 is available in 3 appealing colours! Price starts at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit : https://t.co/TZ4YeuD8Jb or call : 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #SR250 #AutoExpo2023 #AutoExpo #Launch #Hungarian pic.twitter.com/IU6s0KuxJ6 — KeewayIndia (@keeway_india) January 11, 2023 -
టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్: న్యూ లుక్ చూస్తే ఫిదానే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్, కొత్త అప్డేట్స్తో స్పెషల్గా దీన్ని ఆవిష్కరించింది. కొత్త పెరల్ వైట్ కలర్లో వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజీన్, ఫీచర్లు 5 స్పీడ్ గేర్బాక్స్తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుపరిచారు. ఇది 250 ఆర్పీఎం వద్ద 17.39 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్తో కొత్త పెర్ల్ వైట్ కలర్ కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్, బ్రేక్ లివర్లు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్మోడ్స్లో లభ్యం. TVS SmartXonnect కనెక్టివిటీ రేర్ రేడియల్ టైర్ గేర్ షిఫ్ట్ సూచిక సిగ్నేచర్ ఆల్-LED హెడ్ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్ TVS Apache RTR సిరీస్ బైక్స్ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రేసింగ్ వారసత్వం, అనుభవంతో స్పెషల్ ఎడిషన్ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
స్పోర్టీ లుక్లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!
సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్ స్పోర్ట్స్ బైక్ లవర్స్ను అకట్టుకునేలా కొత్త వెర్షన్ బైక్ను ఆవిష్కరించింది. కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650నిలాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త! 2023 కవాసాకి నింజా 650 ఇంజీన్, ఫీచర్లు స్పోర్టీ లుక్లో తీసుకొచ్చిన ఈ బూక్లో 649 సీసీ పార్లల్-ట్విన్ ఇంజన్ను జత చేసింది. ఇది 8,000 rpm వద్ద 68 పవర్ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్షీల్డ్ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్పిట్కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్లు తమ బైక్ను వైర్లెస్గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్తోపాటు, ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్లు,కొత్త డన్లప్ స్పోర్ట్మ్యాక్స్ రోడ్స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?) ధర, లభ్యత దేశంలో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్షిప్ల వద్ద ఇప్పటికే కొత్త నింజా 650 బుకింగ్లు మొదలు కాగా, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. -
రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్ వచ్చేసింది..సూపర్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్లో భాగంగా ఇటలీలోని మిలన్లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్లో అదరగొడుతోంది. ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్ఎంపీ వద్ద 47 హెచ్పీ పవర్ను, 5650 ఆర్ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా. -
హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0
సాక్షి,ముంబై: పండుగ సీజన్ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్ను రిలీజ్ చేసింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్ బైక్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది. హీరో కనెక్ట్తో తీసుకొచ్చిన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 రైడర్లను కనెక్ట్గా ఉండేలా చేసే స్మార్ట్ మొబిలిటీ బైక్. దీని ద్వారా ఈ వెహికల్ లైవ్ లొకేషన్ను ట్రేస్ చేయవచ్చు. ఇంకా టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్,పిలియన్ గ్రిప్పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తో వస్తోంది. హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్లలో రూ. 1,29,738 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇంజీన్, ఫీచర్లు 163cc ఎయిర్-కూల్డ్ BS-VI కంప్లైంట్ ఇంజన్. ఇది 6500 RPM వద్ద 15.2 PS పవర్ అవుట్పుట్ను అందిస్తుంది.కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్ ,పిలియన్ గ్రిప్పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తోపాటు జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టోప్ల్ అలర్ట్, టో ఎవే అలర్ట్ , అన్ప్లగ్ అలర్ట్లతో సహా రైడర్ వారి వాహనం గురించి అప్డేట్గా ఉంచేలా ఫీచర్లను ఇందులో పొందుపర్చింది. -
కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు
సాక్షి,ముంబై: బైక్మేకర్ కీవే బెండా వీ302 సీ బైక్ను భారత మార్కెట్లోవిడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.89 లక్షల (ఎక్స్-షోరూమ్). అధీకృత బెనెల్లీ/కీవే డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.10,000 చెల్లించి కీవే వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ బైక్ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ గ్లోసీ గ్రే, గ్లోసీ బ్లాక్ , గ్లోసీ రెడ్ అనే మూడు రంగులలో లభిస్తుంది. బెండా వీ302 సీ ఇంజీన్ను పరిశీలిస్తే 298cc, ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ను అమర్చింది. ఇది గరిష్టంగా 29.5hp శక్తిని ,26.5Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్బాక్స్తో పాటు, డిస్క్ బ్రేక్స్, మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే స్టెప్-అప్ సింగిల్-పీస్ సౌకర్యవంతమైన సీటు, విస్తృత హ్యాండిల్ బార్, వైడ్ రియర్ వీల్, బైక్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్ల ఇంధనాన్ని నిల్వ చేయగలదు. అలాగే వీల్స్అన్నింటికీ -LED లైటింగ్ సెటప్ను అందించింది. ప్రస్తుతం, కీవే చైనీస్ మోటార్సైకిల్ తయారీదారు కియాన్జియాంగ్ గ్రూప్లో భాగం. బెనెల్లీ కూడా దీని సొంతమే. 1999లో వచ్చిన కీవే 98 దేశాలలో దాని ఉత్పత్తులను అందిస్తోంది. బెనెల్లీ సిస్టర్ కంపెనీ కీవే మే 2022లో మూడు కొత్త ఉత్పత్తుల ద్వారా దేశీయ మార్కట్లోకి ప్రవేశించింది. కీవే కె-లైట్ 250V, కీవే వియెస్టే 300 కీవే సిక్స్టీస్ 300iబైక్స్ను ఇక్కడ తీసుకొచ్చింది. -
బీఎండబ్ల్యూ కొత్త స్పోర్టీ బైక్ : ఇంతకంటే తక్కువ ధరలో మరే బైక్ లేదట!
సాక్షి, ముంబై: బీఎండబ్ల్యూ ఎఫర్డ్బుల్ ప్రైస్లో సరికొత్త బైక్ను భారత మార్కెట్లో శుక్రవారం లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్ఆర్ పేరుతో ఈ సూపర్ బైక్స్ మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్కనునుగుణంగా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్తో ఆకర్షణీమైన రంగుల్లో తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ జీ310 ఆర్, జీఎస్ అడ్వెంచర్ టూరర్ తర్వాత 310 సిరీస్లో బవేరియన్ బ్రాండ్కు సంబంధించి మూడో మోడల్ ఇది. ఇప్పటికే బుకింగ్లను ప్రారంభించిన కంపెనీ నెలకు రూ. 3,999ల ఈజీ ఈఎంఐ ఆప్షన్ను కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్ను వెనుక టెయిల్-ల్యాంప్లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్తో పాటు, రీడిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ప్రధానంగా ఉన్నాయి. ఈ బైక్లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ను అమర్చింది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని, 7,700 rpm వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్బాక్స్ అందించింది. ఇందులో రైడ్ , డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లున్నాయి. మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్210, కేటీఎం ఆర్సీ 390 లాంటి బైక్స్కి పోటీగా నిలవనుంది. Reveal your racing attitude with the first-ever BMW G 310 RR. Ex-showroom prices start at INR 2.85 Lakhs. Also available at an attractive EMI of INR 3,999 per month*. #BMWMotorradIndia #BMWMotorrad #BMWG310RR #G310RR #BMWG310RRBookingsOpen #NewLaunch #RevealYourRacingAttitude pic.twitter.com/whJ1QDSoDJ — BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 15, 2022 -
ఎట్టకేలకు కీవే కే-లైట్ 250వీ బైక్ వచ్చేసింది: ఫీచర్లు, ధర వివరాలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హంగేరియన్ కంపెనీ కీవే తాజాగా కే-లైట్ 250వీ మోటార్సైకిల్ను లాంచ్ చేసింది. పరిచయ ఆఫర్లో రూ.2.89 లక్షలకే ఈ బైక్ను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ బైక్ ఫీచర్లను గమనిస్తే ఇందులో 249 సీసీ ఇంజన్ పొందుపరిచారు. ఇది 18.7 బిహెచ్పీ, 19ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో ముందు, వెనుక డిస్క్లను కలిగి ఉంటుంది. రిమోట్ ఇంజన్ కట్ ఆఫ్, జియో ఫెన్స్, రైడ్ రికార్డుల నిర్వహణ, గరిష్ట వేగం నియంత్రణ వంటి ఫీచర్లున్నాయి. బైక్కి సంబంధించిన అధికారిక డెలివరీలు జూలై మధ్యలో ప్రారంభమవుతాయి. మ్యాట్ బ్లూ కలర్ ధర రూ. 2.89 లక్షలు కాగా, మ్యాట్ డార్క్ గ్రే , మ్యాట్ బ్లాక్ ధరలు వరుసగా రూ. 2.99 లక్షలు , రూ. 3.09 లక్షలు (అన్నీ ఎక్స్-షోరూమ్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది. -
డుకాటీ కొత్త బైక్ : రూ.34.99 లక్షలు
హైదరాబాద్: సూపర్బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ సంస్థ డుకాటీ.. భారత్లో స్ట్రీట్ఫైటర్ వీ4 ఎస్పీ స్పోర్ట్ నేక్డ్ బైక్ను విడుదల చేసింది. ఈ బైక్ బుకింగ్లు , డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది. ట్రాక్షన్ అండ్ వీల్ కంట్ట్రోల్ తోపాటు పలు ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్స్తో 'వింటర్ టెస్ట్' లివరీ లుక్తో అద్భుతమైన డిజైన్తో దీన్ని లాంచ్ చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.34.99 లక్షలు. ఫీచర్ల విషయానికి వస్తే.. 1,103 సీసీ లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ఇందులో అందిస్తోంది. సింగిల్ సీట్, కార్బన్ హీల్ గార్డ్స్తో అడ్జస్టబుబుల్ రైడర్ ఫుట్ పెగ్స్, 3 రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ కార్నరింగ్ బాష్, ట్రాక్షన్ కంట్రోల్ ఈవో 2, స్లైడ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, పవర్ లాంచ్, క్విక్ షిఫ్ట్ అప్/డౌన్ వంటి హంగులు ఉన్నాయి. -
హల్చల్ చేస్తోన్న యమహా సరికొత్త బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యహహా మోటార్స్ భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్ యమహా ఎంటీ15 వీ2.0 బైక్ను లాంచ్ చేసింది. ఈ బైక్ను యమహా ఆర్15 వీ4 బైక్ ఆధారంగా రూపొందించారు. డిజైన్, ఫీచర్స్లో కొత్తగా..! 2022 యమహా MT15 వీ2.0 డిజైన్స్లో సరికొత్త లుక్స్తో రానుంది. 2022 MT-15 సియాన్ స్టార్మ్ , రేసింగ్ బ్లూ , ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్ అనే నాలుగు కలర్ అప్షన్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్తో సహా, కనుబొమ్మల ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో రానుంది. మస్కులర్ బాడీవర్క్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్-స్లంగ్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్తో 2022 యమహా MT15 వీ2.0 స్టైలింగ్స్లో హైలైట్గా నిలుస్తోంది. ఈ బైక్లో పలు స్పెక్ హార్డ్వేర్ అప్డేట్స్, కొత్త ఫ్రంట్ ఫోర్క్తో రానుంది. బ్రేకింగ్ సిస్టమ్లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ బదులుగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో రానుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యమహా Y-కనెక్ట్ యాప్ను మద్దతు ఇస్తుంది. ఈ బైక్లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, రెగ్యులర్ క్విక్-షిఫ్టర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే..! 2022 యమహా MT15 వీ2.0 బైక్ వీవీఏ టెక్నాలజీతో కూడిన 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ను పొందింది. ఈ బైక్ 10,000rpm వద్ద 18.4 PS శక్తిని, 7,500rpm వద్ద 14.1 Nm గరిష్ట టార్క్ను విడుదల చేయనుంది. స్లిప్పర్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ డ్యూక్ 125కు పోటీగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. MT15 కొత్త-తరం వెర్షన్ను రూ. 1.6 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్) లభించనుంది. చదవండి: మారుతి జోరులో టాటా పంచ్లు !? -
కొత్తగా హోండా ఆఫ్రికా ట్విన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఆధునీకరించిన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.16 లక్షలు. డ్యూ యల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ ధర రూ.17.55 లక్షలు ఉంది. 1,083 సీసీ ఇంజిన్తో ఇది తయారైంది. 2–చానెల్ ఏబీఎస్, హోండా సెలక్టేబుల్ టార్క్ కంట్రోల్, బ్లూటూ త్ కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 2017లో భారత్లో ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ను కంపెనీ పరిచయం చేసింది. -
దూసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ నూతన మోడల్ స్క్రామ్ 411ను భారత్లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో భాగంగా చెన్నై ఎక్స్షోరూంలో ధర రూ.2.03 లక్షల నుంచి ప్రారంభం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎల్ఎస్–410 ఇంజన్ ప్లాట్ఫామ్పై ఇది రూపుదిద్దుకుంది. 411 సీసీ ఇంజన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 6,500 ఆర్పీఎంతో 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్తో 4,000–4,500 ఆర్పీఎం ఉంది. ఇక ఈ బైక్లో ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తో డిస్క్ బ్రేక్స్ పొందుపరిచారు. యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లోనూ కొన్ని నెలల్లో ఈ మోడల్ను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
డుకాటీ నుంచి రూ.12.89 లక్షల బైక్.. చరిత్రకు నివాళి!
ముంబై: ఇటాలియన్ లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో పేరుతో కొత్త బైక్ విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.12.89 లక్షలుగా ఉంది. డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైకులో 86 హార్స్ పవర్ను ఉత్పత్తి చేసే 1077 సీసీ ఇంజిన్ ఉంది. ‘‘స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ దాని ఎయిర్–కూల్డ్ ఎల్– ట్విన్ ఇంజిన్ చరిత్రకు నివాళులు అర్పించేందుకు తయారయ్యింది. ఈ ఏడాది భారత మార్కెట్లో డుకాటీ మొదటి ఆవిష్కరణ ఇది’’ అని కంపెనీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్గా..!
ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ భారత మార్కెట్లలోకి మరో కొత్త బైక్ను లాంచ్ చేయనుంది. ఈ బైక్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో చవకైన బైక్గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన హిమాలయన్ మోడల్ అత్యంత ప్రచుర్యాన్ని పొందింది. హిమాలయన్ బైక్ కంటే తక్కువ ధరలో కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411ను మార్చి 15 న లాంచ్ చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 సంబంధించిన పలు వివరాలు ఈ ఏడాది ప్రారంభంలోనే లీక్ అయ్యాయి. ఈ బైక్ యోజ్దీ స్క్రాంబ్లర్తో పోటీ పడనుంది. డిజైన్ విషయానికి వస్తే..! న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంబ్లర్ ఆఫ్రోడ్ బైక్ హిమాలయన్ ఆధారంగా రూపొందించబడింది. రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 డ్యూయల్-పర్పస్ టైర్స్తో 19-అంగుళాల ఫ్రంట్ వీల్ను పొందనుంది. ఈ బైక్లో జెర్రీ క్యాన్ హోల్డర్స్, పొడవైన విండ్స్క్రీన్ తొలగించబడ్డాయి. ఇతర అప్గ్రేడ్లలో ట్రిప్డ్ నావిగేషన్ పాడ్తో కూడిన రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కాస్ట్ మెటల్-ఫినిష్డ్ హెడ్ల్యాంప్ కౌల్, స్ప్లిట్ సీట్లు, రివైజ్డ్ సైడ్ ప్యానెల్స్తో రానుంది. అల్యూమినియం సంప్ గార్డ్, అర్బన్ బ్యాడ్జ్ ప్లేట్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంబ్లర్లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ వరకు తగ్గింది. ఇంజన్ విషయానికి వస్తే..! రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ 24.3 bhp సామర్థ్యంతో , 32 Nm గరిష్ట టార్క్ను 411 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ అందించనుంది. ఈ బైక్లో 5-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. బైక్ సస్పెన్షన్ , బ్రేకింగ్ హార్డ్వేర్ను కూడా కలిగి ఉండనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 హిమాలయన్ బైక్ కంటే కొంత తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ ధర రూ.2 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధర రూ. 2.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..! -
కేటీఎమ్ నుంచి మరో కిర్రాక్ బైక్..!
ఆస్ట్రియన్ మోటార్సైకిల్ తయారీదారు కేటీఎం 2022 గాను కొత్త ‘KTM 890 Duke R’ బైక్ను ఆవిష్కరించింది. ఈ మిడిల్ వెయిట్ రోడ్స్టర్ కొత్త వేరియంట్లో స్టాండర్డ్ మోడల్కు అనేక స్టైలింగ్, మెకానికల్ అప్గ్రేడ్స్తో రానుంది. 890 డ్యూక్ ఆర్ భారత్లో లాంచ్ అయ్యే వివరాలు ఇంకా అందుబాటులో లేవు. స్టైలింగ్ అప్గ్రేడ్ లూక్స్తో..! న్యూ KTM 890 Duke R స్టాండర్డ్ 890 డ్యూక్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఈ బైక్లో రైడర్-ఓన్లీ సెటప్తో రానుంది. పిలియన్ సీటు వెనుక కౌల్ ద్వారా భర్తీ చేశారు. ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అసెంబ్లీ పూర్తిగా తొలగించారు. KTM 890 Duke R వేరియంట్ బైక్లో కూడా KTM RC16 GP రేసర్, 1290 సూపర్ డ్యూక్ R పై ఉపయోగించిన పెయింట్ను పోలి ఉండే కొత్త, అట్లాంటిక్ బ్లూ కలర్తో రానుంది. పెయింట్ బాడీవర్క్ అంతటా ఆరెంజ్ గ్రాఫిక్స్తో వచ్చింది. అన్ని KTM 'R' మోడల్స్ మాదిరిగానే KTM 890 Duke R కూడా, సిగ్నేచర్ ఆరెంజ్ ఫ్రేమ్, అల్లాయ్ వీల్స్ను అమర్చారు. ఇంజిన్ విషయానికి వస్తే..! KTM 890 Duke R అద్భుతమైన పనితీరుతో ఇంజిన్ రానుంది. 890 డ్యూక్ Rలో 889cc సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 121bhp గరిష్ట శక్తిని, 99Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో ప్రైమరీ స్లిప్పర్ క్లచ్ మెకానిజంను పొందుతుంది. మరిన్నీ ఫీచర్స్..! సిక్స్-యాక్సిస్ లీన్ యాంగిల్ సెన్సార్తో పనిచేసే ఎలక్ట్రానిక్ రైడర్లో ఏబీఎస్, కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. 890 డ్యూక్ R రెయిన్, స్ట్రీట్, స్పోర్ట్ మూడు రైడ్ మోడ్లతో స్టాండర్డ్గా వస్తుంది. సర్దుబాటు చేయగల ట్రాక్షన్ కంట్రోల్ స్లిప్, యాంటీ-వీలీ ఆన్/ఆఫ్, ఎక్స్ట్రా థ్రోటెల్ కంట్రోల్ సెట్టింగ్లతో రానుంది. ఇక బేస్ మోడల్ మాదిరిగానే, పూర్తి-LED లైటింగ్ను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఇది స్ప్లిట్-స్టైల్ LED హెడ్లైట్తో పాటు ముందు భాగంలో LED DRLలు, సొగసైన LED టర్న్ ఇండికేటర్లు, వెనుక-స్టాక్-మౌంటెడ్ LED టైల్లైట్ని కలిగి ఉంటుంది. కాక్పిట్ పరిసర కాంతిపై ఆధారపడిన అడాప్టివ్ ఇల్యూమినేషన్తో కూడిన రిచ్ TFT డిస్ప్లేతో రానుంది. చదవండి: కిలోమీటర్కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ బైక్..! -
సరికొత్తగా హోండా సీబీఆర్300ఆర్ బైక్..! ధర ఎంతంటే...?
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్లలోకి Honda CB300R బైక్ను బుధవారం రోజున మళ్లీ పరిచయం చేసింది. ఈ బైక్ ధర రూ. 2.77 లక్షలు(ఢిల్లీ, ఎక్స్షోరూమ్ ధర). 2022 Honda CB300R రెండు కలర్ వేరియంట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ స్టీల్ బ్లాక్తో రానుంది. అంతకుముందు హోండా లాంచ్ చేసిన సీబీ300ఆర్మాదిరిగానే కొన్ని అదనపు హాంగులతో రానుంది. ఈ బైక్ కేవలం హోండా బిగ్వింగ్ టాప్లైన్ అవుట్లెట్లలోనే అందుబాటులో ఉండనుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! 2022 CB300R బైక్ BS-VI వేరియంట్తో రానుంది. ఇంజిన్ విషయానకి వస్తే 286.01cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారును అమర్చారు. పవర్ , టార్క్ అవుట్పుట్లు ఎక్కడా రాజీపడకుండా 30.7hp పవర్ను, 27.5Nm గరిష్ట టార్క్ను 2022 CB300R ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్తో , స్లిప్, అసిస్ట్ క్లచ్తో జత చేయబడింది. 2022 Honda CB300R బైక్లో డిజైన్, స్టైలింగ్ పరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదు. నియో స్పోర్ట్స్ కేఫ్ స్ఫూర్తి సీబీ300ఆర్ను రూపొందించారు. చిన్న చిన్న మార్పులలో ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ గ్రిల్ క్రింద ఉన్న ష్రౌడ్పై మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో వచ్చాయి. ఎగ్జాస్ట్ పైప్(సైలెన్సర్)పై గోల్డెన్ ఫినిషింగ్ ఉంది. మిగిలిన భాగాలు 2019 మోడల్ బైక్లాగే ఉన్నాయి. 17-అంగుళాల వీల్స్తో, సస్పెన్షన్ సెటప్లో ముందువైపు 41ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్, వెనుకవైపు 7-దశల మోనోషాక్ కల్గి ఉంది. ముందు భాగంలో 296mm డిస్క్ ఉండగా, వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను మంచి సామర్థ్యంతో పనిచేస్తుంది. బైక్లో డ్యూయల్-ఛానల్ ABS(యాన్టీ బ్రేకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Skoda: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే...? -
అదిరే లుక్స్, హై రేసింగ్ పర్ఫార్మెన్స్తో నయా టీవీఎస్ అపాచీ లిమిటెడ్ ఎడిషన్ బైక్!
ప్రముఖ టూవీలర్ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ న్యూ రేస్ పర్ఫార్మెన్స్ (ఆర్పీ) సిరీస్ బైక్లను ప్రారంభించింది. ఈ సిరీస్లో భాగంగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ మొదటి బైక్గా నిలవనుంది. ఈ బైక్ను కొనుగోలుదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ లిమిటెడ్ ఎడిషన్ బైక్గా రానుంది. కేవలం 200 యూనిట్లను మాత్రమే టీవీఎస్ ఉత్పత్తి చేయనుంది. దీని ధర రూ. 1,45,000(ఎక్స్ షోరూమ్ ధర) టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ ఫీచర్స్..! ఈ బైక్లో అధునాతన 164.9 సీసీ సింగిల్-సిలిండర్ 4-వాల్వ్ ఇంజన్తో రానుంది. 10,000 ఆర్పీఎమ్ వద్ద 19 బీహెచ్పీ, 8,750 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ శక్తిని విడుదల చేయనుంది. ఈ బైక్లో కొత్త సిలిండర్ హెడ్, ట్విన్ ఎలక్ట్రోడ్ స్పార్క్ ప్లగ్తో రానుంది. రేసింగ్ పర్ఫెర్మెన్స్ కోసం హై-లిఫ్ట్, హై-డ్యూరేషన్ క్యామ్స్ , డ్యూయల్ స్ప్రింగ్ యాక్యుయేటర్లను అమర్చారు. అధిక కంప్రెషన్ రేషియో కోసం కొత్త డోమ్ పిస్టన్ పరిచయం చేసింది. ఈ బైక్లో 5-స్పీడ్ గేర్బాక్స్ను జత చేశారు. దీనిలో రేస్-ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, సర్దుబాటు చేయగల క్లచ్, బ్రేక్ లివర్లను కూడా కలిగి ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్లో రేసింగ్ డీకాల్స్, రెడ్ అల్లాయ్ వీల్స్ ,కొత్త సీట్ ప్యాటర్న్తో రానుంది. కొత్త హెడ్ల్యాంప్ అసెంబ్లీతో పాటు ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్స్ (FPL)తో పాటుగా లో,హైబీమ్తో ఏకకాలంలో పని చేయనుంది. చదవండి: టూవీలర్ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్..! -
బీఎస్ఏ మోటార్స్ నుంచి సరికొత్త బైక్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
బీఎస్ఏ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. హీరో సైకిల్స్ తరువాత బీఎస్ఏ సైకిల్స్ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణను పొందాయి. సైకిళ్లతో పాటుగా బైక్లను కూడా బీఎస్ఏ తయారుచేసేది. 1970లో బీఎస్ఏ తన ఉత్పత్తులను నిలిపివేయగా..2016లో మహీంద్రా గ్రూప్స్ బీఎస్ఏ మోటర్స్ను దక్కించుకుంది. రెట్రో బైక్ లవర్స్ కోసం ఇప్పుడు సరికొత్త బైక్తో బీఎస్ఏ మోటార్స్ ముందుకు రానుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ భాగస్వామ్యంతో తమ మొదటి కొత్త జెన్ మోటార్సైకిల్ను ఆవిష్కరించింది. కొత్త బీఎస్ఏ మోటార్సైకిల్ను యూకే బర్మింగ్హామ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటార్స్కు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.ఈ బైక్కు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650కు పోటీగా.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 గోల్డ్ స్టార్ 650 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ను కలిగిఉంటుంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650కు పోటీ ఇవ్వనుంది. 2022 బీఎస్ఏ గోల్డ్ స్టార్ ఒరిజినల్ గోల్డ్ స్టార్ బైక్ను పోలి ఉంది. రౌండ్ హెడ్ల్యాంప్, టియర్డ్రాప్ షేప్తో ఫ్యూయల్ ట్యాంక్, లార్జ్ ఎయిర్బాక్స్, ఎగ్జాస్ట్ పైప్, రియర్వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లతో కస్టమర్లకు ఇట్టే కట్టిపడేస్తుంది. And here’s a glimpse into its making… #BSAisBack @bsamotorcycles_ pic.twitter.com/Z2zns2tmt3 — anand mahindra (@anandmahindra) December 5, 2021 చదవండి: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
కళ్లు చెదిరే లుక్స్తో సుజుకీ నయా స్కూటీ లాంచ్..! ధర ఎంతంటే..?
చాలా ఊహాగానాల తరువాత ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ భారత మార్కెట్లలోకి సరికొత్త స్కూటీను లాంచ్ చేసింది. స్కూటీ వేరియంట్లలో ‘అవెనీస్’ పేరుతో కొత్త స్కూటీను సుజుకీ మోటార్సైకిల్ ఇండియా ఆవిష్కరించింది. యువతను, టెక్ సావీలను లక్ష్యంగా చేసుకొని ఈ స్కూటీను సుజుకీ తయారు చేసింది. ఈ కొత్త స్కూటీ వచ్చే నెల డిసెంబర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రేసింగ్ ఎడిషన్గా పరిచయం చేసిన అవెనీస్ మెటాలిక్ ట్రిటాన్ బ్లూ కలర్తో సహా ఐదు రంగుల వేరియంట్స్తో రానుంది. రేస్ ఎడిషన్ వేరియంట్లో సుజుకి రేసింగ్ గ్రాఫిక్స్ను అమర్చారు. రేస్ ఎడిషన్ సుజుకీ అవెనీస్ బేస్ వేరియంట్ ధర రూ. 86,700 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది. చదవండి: కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి జెన్ జీ...టెక్ సావీలే లక్ష్యంగా ఫీచర్స్..! జెన్జీ, టెక్సావీలను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్స్తో సుజుకీ అవెనీస్ సుజుకీ మోటార్సైకిల్ ఇండియా లాంచ్ చేసింది. ఈ స్కూటీలో ముఖ్యంగా అవెనీస్ కాలర్ ఐడీ, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, వాట్సాప్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్ప్లేను అందించనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్స్తో కనెక్ట్ చేయవచ్చును. సుజుకీ అవెనీస్ ఇంజిన్ విషయానికి వస్తే...ఎఫ్1 టెక్నాలజీతో 125సీసీ ఇంజిన్ అమర్చారు. 6750 ఆర్పీఎమ్ వద్ద 8.7 పీఎస్ పవర్ను డెలివరీ చేస్తోంది. 5500ఆర్పీఎమ్ వద్ద 10ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటీలో బాడీ మౌంటెడ్ ఎల్ఈడీ, భారీ స్టోరేజ్ స్పేస్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకీ అవెనిస్ కోసం కొత్తగా ఎక్స్టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్ను సుజుకి మోటార్సైకిల్ ఇండియా పరిచయం చేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా? -
యమహా ఆర్15 వీ3 బైక్ న్యూ వెర్షన్ లాంచ్..! ధర ఎంతంటే..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ యమహా మోటార్స్ కొత్త ఆర్15 వీ3 న్యూవెర్షన్ను సింగిల్ సీట్తో యూనిబాడీ పేరిట సరికొత్త బైక్ను లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 1.57 లక్షలకు (ఎక్స్షోరూం) అందుబాటులో ఉండనుంది. రేసింగ్ బ్లూ కలర్లో లభించే ఈ బైక్ స్టాండర్డ్ ఆర్15 వీ4 కంటే రూ.13000 తక్కువకే ఈ బైక్ను కొనుగోలుదారులకు యమహా అందించనుంది. ఆర్15 వీ3 వేరియంట్ 155సీసీ, 4స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ బైక్ 10000ఆర్పీఎమ్ వద్ద 18.6పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 8500 ఆర్పీఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్ అవుట్ పుట్ను అందిస్తోంది. యమహా ఆర్15 వీ3 బైకు 6 స్పీడ్ గేర్ బాక్స్ను జత చేశారు. చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్లో..! -
భారత్లో డుకాటీ హైపర్మోటార్డ్ 950
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్బైక్స్ తయారీ కంపెనీ డుకాటీ తాజాగా భారత్లో హైపర్మోటార్డ్ 950 మోడల్ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్షోరూంలో హైపర్మోటార్డ్ 950 ఆర్వీఈ రూ.12.99 లక్షలు, హైపర్మోటార్డ్ 950 ఎస్పీ రూ.16.24 లక్షలు ఉంది. ట్విన్ సిలిండర్ ఇంజన్, 114 హెచ్పీ పవర్, 14.5 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్, స్పోర్ట్, టూరింగ్ మోడ్స్తో రూపొందించింది. హూపర్మెటార్డ్ 950 బైక్ డెలివరీలు ప్రారంభం అయినట్టు డుకాటీ తెలిపింది. అంతర్జాతీయంగా విజయవంతం కావడంతో ఈ మోడల్ను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేసినట్టు వివరించింది. -
రెట్రో లుక్స్లో కవాసకి నుంచి అదిరిపోయే బైక్..!
2022 Kawasaki Z650rs Launched In India: ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం కవాసకి భారత మార్కెట్లలోకి సరికొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ను లాంచ్ చేసింది. రెట్రో లుక్స్తో కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ ప్రియులను ఇట్టే ఆకర్షించనుంది. ఈ బైక్ రెండు కలర్ వేరియంట్స్తో రానుంది. కాండీ ఎమరాల్డ్ గ్రీన్,మెటాలిక్ మూండస్ట్ గ్రే కలర్స్తో జెడ్650ఆర్ఎస్ లభించనుంది. చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా! కవాసకి జెడ్1 మోడల్ స్ఫూర్తితో ఈ బైక్ను కంపెనీ రూపొందించనట్లు తెలుస్తోంది. ఈ బైక్ ధర రూ. 6.65 లక్షలు. (ఎక్స్-షోరూమ్). న్యూ రెట్రో కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ తన ప్రత్యర్థి బైక్ కంపెనీ ట్రయంఫ్ ట్రైడెంట్ 660 కంటే మరింత సరసమైన ధరకే లభించనున్నట్లు తెలుస్తోంది. కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ విషయానికి వస్తే....నియో-రెట్రో డిజైన్ థీమ్ రౌండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ రీడౌట్తో కూడిన ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో రానుంది. స్లిమ్ పిన్స్ట్రైప్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్తో రెట్రో స్టైలింగ్ వచ్చేలా చేసింది. అంతేకాకుండా పొడవైన సింగిల్ సీటు రైడర్, పిలియన్(వెనుక కూర్చొన వారికి)లకు సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే...కవాసకి జెడ్650 బైక్ మాదిరిగానే 649సీసీ ట్విన్-సిలిండరన్ ఇంజిన్ను కల్గింది. 67బీహెచ్పీ సామర్థ్యంతో 8000 ఆర్పీఎమ్ను ఉత్పత్తి చేస్తోంది. 6700 ఆర్పీఎమ్ వద్ద 64ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయనుంది. బైక్ వెనుకవైపు ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ను ఏర్పాటుచేశారు. డ్యూయల్ ఛానల్ ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ను కల్గి ఉంది. కవాసకి జెడ్650తో పోలిస్తే, కవాసకి జెడ్650ఆర్ఎస్ 2022 వెర్షన్ దాదాపు రూ. 41,000 ఖరీదైనది. భారత్లో కవాసకి జెడ్650ఆర్ఎస్ 2022 వెర్షన్ బైక్స్ ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ నుంచి బైక్లను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: 2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు -
ట్రయంఫ్ కొత్త స్ట్రీట్ స్క్రాంబ్లర్
సూపర్బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ మోటార్సైకిల్స్ ఆధునీకరించిన స్ట్రీట్ స్క్రాంబ్లర్ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.9.35 లక్షలు. 65 పీఎస్ పవర్తో 900 సీసీ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ పొందుపరిచారు. రోడ్, రెయిన్, ఆఫ్–రోడ్ రైడింగ్ మోడ్స్లో రూపొందించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎల్సీడీ డిస్ప్లేతో అనలాగ్ స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచేబుల్ ఏబీఎస్, టార్క్ అసిస్ట్ క్లచ్, డిస్టింక్టివ్ ఎల్ఈడీ రేర్ లైట్, యూఎస్బీ చార్జర్, ఇమ్మొబిలైజర్ వంటి హంగులు ఉన్నాయి. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. వాహనం 223 కిలోల బరువు ఉంది. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. -
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్స్టర్...!
ప్రముఖ ఇటాలియన్ బైక్ల తయారీదారు డుకాటీ భారత మార్కెట్లలోకి నయా మాన్స్టర్ బైక్ మోడళ్లను లాంచ్ చేసింది. స్పోర్టీలుక్తో , తేలికగా, సులభంగా ప్రయాణించేలా రూపొందించిన డుకాటీ మాన్స్టర్ బైక్స్ ప్రియులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. డుకాటీ మాన్స్టర్, మాన్స్టర్ ప్లస్ అనే రెండు వేరియంట్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: జేమ్స్బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! డుకాటీ మాన్స్టర్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు, డుకాటీ మాన్స్టర్ ప్లస్ వేరియంట్ ధర రూ.11.24 లక్షలుగా ఉంది(ఎక్స్ షోరూమ్). న్యూ డుకాటి మాన్స్టర్ రెడ్, డార్క్ స్టీల్త్లో బ్లాక్ వీల్స్, ఏవియేటర్ గ్రేతో జీపీ రెడ్ వీల్స్తో అందుబాటులో ఉంది. ప్లస్ వెర్షన్ కూడా అదే రంగుల్లో లభిస్తుంది. అంతేకాకుండా డుకాటీ మాన్స్టర్ ఏరోడైనమిక్ విండ్షీల్డ్ తో రానుంది. ఎంబెడెడ్ రౌండ్ హెడ్ల్యాంప్, బైసన్ బ్యాక్ ఇన్స్పైర్డ్ చంకీ ఫ్యూయల్ ట్యాంక్, క్లీన్ టెయిల్ సెక్షన్ , సెంటర్ పొజిషన్డ్ ఇంజిన్ వంటి మాన్స్టర్ డిజైన్ ఎలిమెంట్లతో ఈ బైక్స్ను తయారుచేశారు. డుకాటీ న్యూ మాన్స్టర్ లైట్వేట్గా 166కేజీలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు వచ్చిన బైక్ కంటే 60 శాతం తక్కువ బరువులో చాసిస్ ఉందని డుకాటీ తెలిపింది. గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్తో బైక్ ఫ్రేమ్ను తయారుచేశారు. డెస్మోడ్రోమిక్ టెక్నాలజీతో కొత్త టెస్టాస్ట్రెట్టా 11 డిగ్రీల 937సీసీ ఎల్ ట్విన్ ఇంజిన్ను డుకాటీ మాన్స్టర్ అమర్చారు. 111 హెచ్పీ సామర్థ్యంతో 9,250 ఆర్పీఎమ్ వద్ద 93ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తిచేయనుంది. The New Monster arrives in 3 fun colours: The all-time classic Ducati Red The playful Aviator Grey And of course, the mysterious Dark Stealth. Now available in India with prices starting at INR 10,99,000 Lacs (Ex-Showroom India).#NewMonster #JustFun pic.twitter.com/dOadyWnGY5 — Ducati India (@Ducati_India) September 23, 2021 చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!