Nokia
-
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్వర్క్ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్వర్క్ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్టెల్కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే?
ఫిన్లాండ్కు చెందిన టెక్ కంపెనీ నోకియా ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కంపెనీ చైనాలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా యూరప్లో కూడా అదనంగా మరో 350 మందిని తొలగించింది. యూరప్లో ఉద్యోగాల కోతలను గురించి సంస్థ ప్రతినిధి ధృవీకరించినప్పటికీ.. చైనాలో ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావించలేదు.చైనా నోకియా కంపెనీలో 10,400 మంది ఉద్యోగులు ఉండగా.. ఐరోపాలో వీరి సంఖ్య 37,400గా ఉంది. ఖర్చులను తగ్గించి 2026 నాటికి సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లు లేదా రూ.7,300 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆదా చేయాలని నోకియా భావిస్తోంది.నోకియాకు కీలకమైన మార్కెట్లలో చైనా ఒకటి. అయితే.. హువావే, జెడ్టిఇ వంటి చైనా కంపెనీలను యుఎస్ నిషేధించడంతో, చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ వంటి వాటితో తమ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. 2019లో నోకియా నికర అమ్మకాలలో చైనా వాటా 27 శాతం కాగా.. ప్రస్తుతం ఇది 6 శాతానికి తగ్గింది.నోకియా ఉద్యోగుల తొలగింపు చేపట్టకముందే.. ఈ వారం ప్రారంభంలో మెటా సంస్థ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ల విభాగంలోని టీమ్లలో కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అయితే ఏ విభాగంలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారనేది కంపెనీ వెల్లడించలేదు. -
అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న నోకియా
ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణల కోసం నోకియా అతిపెద్ద గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం భారత్లోని చెన్నైలో రూ.450 కోట్ల పెట్టుబడికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు నోకియా, చెన్నై రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఫిన్లాండ్కు చెందిన నోకియా దేశంలో ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయలనే ఉద్దేశంతో రూ.450 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలిపింది. ఈ ల్యాబ్లో రానున్న రోజుల్లో 10జీ, 25జీ, 50జీ, 100 జీ(జీపొన్-గిగాబిట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్) నెట్వర్క్పై పరిశోధనలు చేస్తామని నోకియా ఆసియా పసిఫిక్ ఫిక్స్డ్ నెట్వర్క్ల హెడ్ విమల్ కుమార్ కోదండరామన్ తెలిపారు. భారత్తోపాటు అంతర్జాతీయంగా అడ్వాన్స్డ్ నెట్వర్క్ టెక్నాలజీ సేవలందించేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అతిపెద్ద ఫిక్స్డ్ నెట్వర్క్ల ల్యాబ్ చెన్నైలో ఏర్పాటు చేయడంవల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం.. -
సెకనుకు 1.2 జీబీ స్పీడ్.. నోకియా ఘనత
న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్లో భారతీ ఎయిర్టెల్తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్టెల్ వాణిజ్య నెట్వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి. -
వొడాఫోన్లో నోకియా, ఎరిక్సన్ వెండర్లకు 166 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్సన్కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది. -
'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ కంపెనీ సుమారు 25 సంవత్సరాల తరువాత మార్కెట్లో 'నోకియా 3210 4జీ' ఫోన్ లాంచ్ చేసింది. కాలంలో కలిసిపోయిందనుకున్న ఈ ఫోన్ మళ్ళీ కనిపించడంతో నోకియా ప్రియులు సంబరపడిపోతున్నారు.ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3210 4జీ ధర రూ. 3999. దీనిని ఈ కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్లో లేదా హెచ్ఎండీ వెబ్సైట్లో కొనుకోగలు చేయవచ్చు. ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. టీ107 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ కీబోర్డుతి వస్తుంది.ఈ కొత్త నోకియా 3210 4జీ ఫోనులో అందరికీ ఇష్టమైన 'స్నేక్' గేమ్ కూడా ఉంది. 64 ఎంబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 128 ఎంబీ స్టోరేజ్ పొందుతుంది. దీనిని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి SD కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ వంటి వాటి కోసం యాప్స్ కూడా ఉన్నట్లు సమాచారం.కెమెరా కోసం నోకియా 3210 4జీ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు 1450 mAh రినోవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్టుతో వస్తుంది.Here it is! As iconic as ever – Nokia 3210 4G! Relive the retro, now with a modern touch - YouTube, Scan & Pay with UPI, long battery life, Bluetooth, 4G connectivity, and more!Buy now - https://t.co/E7s4Mblyg4 #HMD #Nokia3210 #IconIsBack pic.twitter.com/0rs00bssDc— HMD India (@HMDdevicesIN) June 10, 2024 -
6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్వర్క్ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఉద్యోగుల తొలగింపు.. ప్రముఖ టెలికం కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా భారీ షాకిచ్చింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా పలు టెలికాం సంస్థలు 5జీ కార్యాకలాపాల్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్నంత డిమాండ్ నోకియా 5జీ పట్ల లేదు. దీంతో 5జీ మార్కెట్ లో నోకియా సత్తా చాటుతుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో నోకియా ఉద్యోగులకు ఉద్వాసన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మనీ, టెక్నాలజీ, లీగల్ స్టఫ్ ఇన్ఛార్జ్ల వంటి పలు కీలక విభాగాల్లో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్స్, క్లౌడ్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మూడు విభాగాలుగా విభజించనుంది. ప్రతి విభాగం భారత్లో నోకియా వ్యాపారాల్లో వివిధ విభాగాలపై దృష్టి సారించనుంది. -
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్పోస్ట్తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్సైడర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
Layoffs: నోకియా సంచలన నిర్ణయం..14వేల మందికి ఉద్వాసన!
కార్పొరేట్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం పేరిట ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా ఇతర రంగాలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేల మంది సిబ్బందికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. నోకియా కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏకంగా తన కంపెనీలో పనిచేస్తున్న 14 వేల మందిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర అమెరికాలో సంస్థ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో రానున్నరోజుల్లో కాస్ట్కటింగ్ పేరిట ఉద్యోగుల కోత విధించనుంది. ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది పని చేస్తున్నారు. -
భారత్లో నోకియా 6జీ ల్యాబ్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా భారత్లో తమ 6జీ ల్యాబ్ను నెలకొల్పింది. కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని వర్చువల్గా ప్రారంభించారు. భారత్ను నూతన ఆవిష్కరణల హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల సాధన దిశగా ఇది మరో ముందడుగని ఆయన తెలిపారు. సురక్షితమైన రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర విభాగాలకు ఉపయోగపడగలిగే 6జీ టెక్నాలజీ ఆధారిత నవకల్పనలపై ఈ ల్యాబ్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరులోని తమ గ్లోబల్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్లో నోకియా దీన్ని ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికే 6జీ టెక్నాలజీలో 200 పైచిలుకు పేటెంట్లు దక్కించుకుంది. -
పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్వేర్! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా..
90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్వేర్తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది నోకియా. నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్వేర్తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు. మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల నోకియా 130 స్పెసిఫికేషన్లు నోకియా 130 ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది. నోకియా 150 స్పెసిఫికేషన్లు ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు!
Nokia 110 4G/2G: రిలయన్స్ జియో బాటలోనే నోకియా కూడా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్ను తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ (UPI) పేమెంట్ ఆప్షన్ను ఇన్బిల్ట్గా ఇవ్వడం విశేషం. నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 110 2జీ (Nokia 110 2G) ఫీచర్ ఫోన్లకు సంబంధించిన 2023 మోడల్లు తాజాగా విడుదలయ్యాయి. వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదీ చదవండి: హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్! స్పెసిఫికేషన్స్ నోకియా 110 4G/2G ఫోన్ల 2023 మోడల్లను 2021 మోడల్తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త కొత్త రంగుల్లో నూతన ఫోన్లు ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నోకియా 110 4జీ ఫోన్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే, ఈ కొత్త మోడల్ల ఫోన్లలో ఇన్బిల్ట్ యూపీఐ పేమెంట్ ఫీచర్ ఇచ్చారు. యూజర్లు ఒక బటన్ను నొక్కడం ద్వారా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్ను విస్తరించుకోవచ్చు. నోకియా 110 4జీ ధర రూ.2,499, నోకియా 110 2జీ ఫోన్ ధర రూ.1,699లుగా ఉంది. వీటిని నోకియా రిటైల్ స్టోర్లలోనూ, నోకియా అధీకృత, భాగస్వామ్య వెబ్సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ 1.8″ QQVGA డిస్ప్లే QVGA రిజల్యూషన్తో కూడిన రియర్ కెమెరా 12 రోజుల స్టాండ్బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ) నానో ఆకృతిలో పాలికార్బోనేట్తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్ IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వైర్లెస్ FM రేడియో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ 94.5 గ్రాముల బరువు 50mm x 121.5mm x 14.4mm కొలతలు ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
త్వరలో భారీ కొనుగోళ్లు.. రూ.13 వేల కోట్ల రుణాల కోసం ముఖేష్ అంబానీ చర్చలు!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు 1.6 బిలియన్ల మేర రుణాల్ని సమీకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా నుంచి ఎక్విప్మెంట్ కొనుగోలు నిమిత్తం భారీ ఎత్తున లోన్ రూపంలో రిలయన్స్ నిధుల్ని సమకూర్చుకోనుంది. కొనుగోలు ఒప్పందం గడవు సమీపిస్తున్న తరుణంలో సిటీ గ్రూప్ ఐఎన్సీ, హెచ్ఎస్బీసీ హోల్డింగ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సంస్థల నుంచి ఈ మొత్తాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో ప్రతినిధులు పైన పేర్కొన్న సంస్థల అధినేతలతో చర్చించనున్నారని, ముఖేష్ అంబానీ 15 కాల పరిమితితో రుణాన్ని తీసుకోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి, ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. అయితే, ఫిన్ల్యాండ్కు చెందిన ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫిన్వెరా రిలయన్స్ తీసుకునే లోన్ మొత్తానికి గ్యారెంటీ కవర్కు ముందుకు వచ్చింది. గత ఏడాది అక్టోబర్లో ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా .. దేశీయ టెలికాం దిగ్గజం జియో 5జీ నెట్వర్క్ను అందించేందుకు కావాల్సిన పరికరాల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. జియో సైతం స్ప్రెక్టం కొనుగోలు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థగా చరిత్రకెక్కింది. కాగా, రిలయన్స్ సంస్థ రుణాల కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదికల్ని జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలు ఖండించాయి. నోకియా అధికార ప్రతినిధి,రిలయన్స్ సైతం ఇదే తరహాలో స్పందించాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా? -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ ) దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్టీవీ: కేవలం రూ. 5వేలకే) నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్ఫోన్లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోకియా సీ22 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ డిస్ప్లే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ 13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed. Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki — Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023 -
కేవలం రూ. 7,999కే నోకియా కొత్త మొబైల్ - పూర్తి వివరాలు
నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన సీ12 లైనప్లో మరో కొత్త 'సీ12 ప్లస్' మొబైల్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్లో సీ12, సీ12 ప్రో ఉన్నాయి. నోకియా నుంచి విడుదలైన ఈ కొత్త సీ12 ప్లస్ ధర రూ. 7,999. ఈ లేటెస్ట్ మొబైల్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సరసమైన ధర వద్ద విడుదలైన ఈ మొబైల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేట్స్ పొందింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్తో అడుగుపెట్టింది. ధర ప్రకటించినప్పటికీ సేల్ తేదీని నోకియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలో వెల్లడించే ఛాన్స్ అవకాశం ఉందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) నోకియా సీ12 ప్లస్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది 6.3 ఇంచెస్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో ఫ్రంట్ కెమెరా కోసం టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజిని పెంచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: Dharampal Gulati: వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..) కొత్త నోకియా సీ12 ప్లస్ మొబైల్ 4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ-పోర్టు, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. కెమెరా పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున వీడియో కాల్స్, సెల్ఫీ వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. -
నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్వర్క్ త్వరలో
న్యూఢిల్లీ: ఎంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. రాబోయే అంతరిక్ష యాత్రలో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ చెయ్యని సాహసంతో చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ రాబోయే నెలల్లో స్పేస్ఎక్స్ రాకెట్లో నెట్వర్క్ను ప్రారంభించాలని యోచిస్తోందని నోకియా ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో ఈ నెల ప్రారంభంలో బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో విలేకరులకు వెల్లడించారు. దీని ప్రకారం నోకియా ఈ ఏడాది చివర్లో చంద్రునిపై 4జీ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. దీన్ని నాసా ఆర్టెమిస్-1 మిషన్లో ఉపయోగించబడుతుందనీ, తద్వారా చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యమని తెలిపారు. సీఎన్బీసీ నివేదిక ప్రకారం ప్రస్తుతం SpaceX ఫాల్కన్ 9 రాకెట్లో నవంబర్లో ప్రారంభించనుందని, Intuitive Machines యొక్క Nova-C లూనార్ ల్యాండర్ మన సహజ ఉపగ్రహానికి సిస్టమ్ ఇతర పేలోడ్లను తీసుకువెళుతుంది, నోకియా 4జీ కమ్యూనికేషన్ సిస్టమ్ను చంద్రుని దక్షిణ ప్రాంతంలోని షాకిల్టన్ క్రేటర్పై దాని చివరి గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. భూసంబంధమైన నెట్వర్క్లు భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని చూపడం దీని లక్ష్యం.సంబంధించి 2020 అక్టోబర్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో నోకియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుందని సమాచారం. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) ఈ పరిశోధనలు హెచ్డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, టెలిమెట్రీ లేదా బయోమెట్రిక్స్ అవసరమయ్యే భవిష్యత్ మిషన్లకు సెల్యులార్ నెట్వర్క్లు ప్రారంభించే అధునాతన సామర్థ్యాలు అవసరం" అని నోకియా తన వెబ్ పేజీలో నాసా భాగస్వామ్యం గురించి వెల్లడించింది. మరోవైపు ఈ టెక్నాలజీలు చంద్రునిపై మంచును గుర్తించడంలో పరిశోధకులకు సహాయ పడతాయి. అలాగే భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటి వాటిని గుర్తిస్తే గ్రహం మీద మానవ జీవితాన్ని నిలబెట్టడంలో సహాయ పడుతుందని నాసా అంచనా. -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైన్ ఛానెల్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో ఆధునిక స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇలాంటి వాటినే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా ఇప్పుడు నోకియా కంపెనీ ఒక లేటెస్ట్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి నోకియా సీ99 స్మార్ట్ఫోన్ విడుదలకానుంది. బార్సిలోనాలో జరిగిన ఏండబ్ల్యుసి 2023 ఈవెంట్లో 'నోకియా సీ99' అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటివి ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే విషయం వెల్లడి కాలేదు. నోకియా సీ99 ధరలు కూడా కంపెనీ వెల్లడించలేదు, కానీ దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే, లేటెస్ట్ హై ఎండ్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) కొత్త నోకియా సీ99 స్మార్ట్ఫోన్లోని స్నాప్డ్రాగన్ చిప్సెట్ గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. ఈ సరికొత్త మొబైల్ గురించి తెలియాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది త్వరలో తెలుస్తుంది. -
Nokia C12: నోకియా మరో బడ్జెట్ ఫోన్ లాంచ్, ధర చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. సీ సిరీస్లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.3అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్ స్ట్రీమ్లైన్డ్ OS 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f — Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023 -
నోకియా కొత్త లోగో చూశారా? నెటిజన్ల రియాక్షన్స్ మాత్రం..!
సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా నోకియా (NOKIA) లోగో మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ లోగోతోపాటు బిజినెస్ వ్యూహాన్ని కూడా మార్చుతుండటం గమనార్హం. తద్వారా తన బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించాలని భావిస్తోంది. కొత్త లోగోతో కొత్త శకనాకి నాంది పలకాలని భావిస్తోంది. సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ తన ప్లాన్లను ప్రకటించారు. నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై నోకియా కేవలం స్మార్ట్ఫోన్ కంపెనీ మాత్రమే కాదు బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు. బిజినెస్-టు-బిజినెస్ ఇన్నోవేషన్లీడర్గా ఎదగనుందని తెలిపారు. దీని ప్రకారం నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్లతో NOKIA అనే పదాన్ని రూపొందించింది. (నోకియా అద్భుతమైన స్మార్ట్ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!) మరోవైపు నోకియా కొత్తలోగోపై సోషల్మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లోగోను బాగా ఇష్టపడుతోంటే, మరింకొందరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. పాతదే బావుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కనెక్టింగ్ పీపుల్ అంటూ విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్ లోగోను మార్చడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇటీవల రైట్ రిపేర్ లో భాగంగా కస్టమర్లు సొంతంగా రిపేర్ చేసుకునే జీ22ఫోన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. If you are eliminating vertical components from logo , then remove ‘I’ also. #Nokia pic.twitter.com/WclL5o0GZ6 — Anupam Biswas (@flyanupam) February 27, 2023 The new Nokia logo is mathematically correct. pic.twitter.com/uKu5O0kry8 — Arto Vartiainen (@artovartiainen) February 26, 2023 So disturbing #NokiaLogo #NokiaNewLogo The old one looked elegant and gorgeous. pic.twitter.com/ZYR6Ci3pU2 — Bernard D'sa (@bernarddsa) February 27, 2023 -
నోకియా అద్భుతమైన స్మార్ట్ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!
సాక్షి, ముంబై: నోకియా అద్భుతమైన ఫోన్ను పరిచయం చేసింది. రిపేరబుల్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ను విడుదల చేసింది.రీసైకిల్ చేసుకునేలా ప్లాస్టిక్ బ్యాక్ కవర్, బ్యాటరీ మార్చుకునే అవకాశంతో తీసుకొస్తోంది. ఐఫిక్స్ట్ భాగస్వామ్యంతో టూల్స్, రిపేర్ గైడ్తో సహా అందిస్తోంది. తద్వారా యూజర్ ఫోన్ వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్ ఛార్జింగ్ పోర్ట్ను రిపేర్ చేసుకోవచ్చు. డిస్ప్లే పాడైపోయినా, ఛార్జింగ్ పోర్ట్ వంగిపోయినా, లేదా బ్యాటరీ పాడైపోయినా, సరసమైన ధరల్లో సొంతంగా యూజర్లే మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. రిపేర్ గైడ్ సాయంతో ఇంట్లోనే మరమ్మతులు చేయడానికి రూపొందించిన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇది అని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ22 పేరుతో శనివారం బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్కు ముందు లాంచ్ చేసింది. జీ22లో ఆటో క్లీనప్ అని పిలువబడే ఆప్టిమైజేషన్ అసిస్టెంట్ను కూడా జోడించింది. నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ ప్రొఫెషనల్ రిపేర్ ఆప్షన్లతో పాటు ఫిక్సిట్ ద్వారా ఐదేళ్లపాటు "క్విక్ ఫిక్స్" రిపేర్ గైడ్స్, ఇతర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుతుందని HMD గ్లోబల్ ప్రొడక్షన్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ అన్నారు. ఇందులోని బిగ్ బ్యాటరీ లైఫ్ మూడు రోజులట. Get to know the #NokiaG22 in just 30 seconds 👇 🔗 https://t.co/GSmtdWysKO pic.twitter.com/25adVyFTpD — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 మార్చి 8నుంచి యూకే లోసేల్స్ మొదలు. నోకియా జీ 22 ధర సుమారు రూ.15 వేలు (179.19 డాలర్లు) నోకియా జీ 22 ఫీచర్లు 6.53 అంగుళాల స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 128జీబీ స్టోరేజ్ 50+2+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 5,050mAh క్విక్ఫిక్స్ రిపేరబుల్ బ్యాటరీ మరో రెండు ఫోన్లు కూడా ఒకటి కాదు రెండుకాదు మూడు అంటూ నోకియా జీ22, సీ32, సీ 2 ఫోన్లను ట్విటర్లో షేర్ చేసింది. HMD గ్లోబల్ పత్రికా ప్రకటన ప్రకారం నోకియా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. నోకియా సీ 32 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 50+2 ఎంపీ రియర్ కెమెరా 5,000mAh బ్యాటరీ10 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చార్కోల్, ఆటం గ్రీన్ , బీచ్ పింక్ కలర్స్లో లభ్యం 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర £129.99 వద్ద ప్రారంభం (సుమారు రూ.13 వేలు) నోకియా సీ22 6.5-అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 గో 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ 10W ఛార్జింగ్ సపోర్ట్ 2 జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర £109.99 (సుమారు రూ. 11 వేలు) Say hello to not one, not two, but three new devices 🤩 👉 Nokia G22 👉 Nokia C32 👉 Nokia C22 pic.twitter.com/z2TpCZJVvZ — Nokia Mobile (@NokiaMobile) February 25, 2023 -
రీసైకిల్ ప్లాస్టిక్ తో నోకియా ఫోన్లు తయారీ
-
నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్, ధర విని షాక్ అవ్వకండి!
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా సరికొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్, ప్రకటించింది. దీని ధర రూ. 48999. నోకియా అధికారిక వెబ్సైట్లో ఫిబ్రవరి 20 అందుబాటులో ఉంటుంది. నోకియా ఎక్స్ 30 4జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ Android 12, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం SM6375 స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీజీ స్టోరేజ్ 50+13ఎంపిడ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,200ఎంఏహెచ్ బ్యాటరీ లాంచ్ ఆఫర్లు నోకియా వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు ఉచిత నోకియా కంఫర్ట్ ఇయర్బడ్స్ విలువ రూ. 2,799 రూ. 2,999 33వాట్స్ ఛార్జర్ విలువ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 4000 తగ్గింపు -
నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ జీ60 5జీ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్కు సిద్ధం. 5జీ నెట్వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం. ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే నోకియా G60 5G స్నాప్డ్రాగన్ 695 5G SoC 120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 4500mAh బ్యాటరీ -
నోకియా ఫ్లిప్ ఫోన్, అతి తక్కువ ధరలో
సాక్షి,ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా క్లామ్షెల్ డిజైన్తో కొత్త ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్కం పప్రాసెసర్, ఎఫ్ఎం రేడియో, వాట్సాప్,వైఫై సపోర్ట్తో, ఎరుపు, నీలం రెండు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లలో అందుబాటులో ఉన్న నోకియా 2780 ఫ్లిప్ ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ధర విషయానికి వస్తే అమెరికాలో దీని ధర డాలర్లు. 89.99. ఇండియాలో సుమారు రూ. 7,400గా ఉండొచ్చని అంచనా. కాగా ఎంట్రీ-లెవల్ వినియోగదారులే లక్ష్యంగా బడ్జెట్ధరల్లో ఈ సిరీస్లో నోకియా 2660 ఫ్లిప్, నోకియా 2760లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోకియా 2780 ప్లిప్ స్పెసిఫికేషన్స్ 1.77 అంగుళాల TFT స్క్రీన్ 2.7అంగుళాల TFT స్క్రీన్ క్వాల్కం 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ T9 కీబోర్డ్ డిజైన్ 5 ఎంపీ రియర్ కెమెరా విత్ ఫిక్స్డ్ ఫోకస్, LED ఫ్లాష్ 4జీబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్ 1450 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీ -
నోకియా జీ60 5జీ: ఫ్రీ ఇయర్ బడ్స్, పరిచయ ఆఫర్ కూడా
సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్లకు పరిమిత మైన నోకియా తాజాగా 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. నోకియా జీ60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా జీ60 5జీ ధర రూ. 32,999గా నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్గా రూ. 29,999కే అందిస్తోంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్లో నవంబర్ 8 నుండి లభ్యం కానుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ 1080×2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ 50+5+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
నోకియాతో జియో బిగ్ డీల్..
-
5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవల విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా నోకియాతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతోపాటు ఎరిక్సన్ కంపెనీతో కూడా మరో ముఖ్యమైన డీల్ కుదుర్చుకుంది. ఈ కంపెనీల ద్వారా 5G RAN (రేడియో యాక్సెస్ నెట్వర్క్) పరికరాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా సోమవారం ఒకప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ముఖ్యంగా నోకియాతో మల్టీ-ఇయర్ డీల్ చేసుకుంది. నోకియా, జియో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు బహుళ-సంవత్సరాల ఒప్పందం కాబట్టి, భారతీయ మార్కెట్లో నోకియాకు ఇది భారీ విజయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తద్వారా సాధారణ వినియోగదారులకు కూడా 5జీ స్టాండ్లోన్ నెట్వర్క్ను అందించే దేశీయ తొలి టెల్కోగా జియో అవతరించనుంది. నోకియా డీల్పై రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. నోకియాతో తమ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన 5జీ నెట్వర్క్ని అందించే సంస్థగా తాము నిలవనున్నట్టు చెప్పారు. నోకియా ప్రెసిడెంట్, సీఈవో పెక్కా లండ్మార్క్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్తో లక్షలాది మంది ప్రీమియం 5 జీ సేవలు ఆస్వాదించనున్నారని తెలిపారు. ఎరిక్సన్తో డీల్ దేశీయంగా 5జీ స్టాండ్లోన్ నెట్వర్క్ నిమిత్తం నోకియా ప్రధాన పోటీదారు ఎరిక్సన్తో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-ఎరిక్సన్ మధ్య కుదిరిన ఈ తొలి డీల్ దేశంలో రేడియో యాక్సెస్ నెట్వర్క్నుమరింత విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. జియో 5జీ సేవలు, ‘డిజిటల్ ఇండియా' విజన్ సాధనలో ఈడీల్ ఒక పునాదిగా ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ విశ్వాసాన్ని ప్రకటించారు. -
ఒప్పో, వన్ప్లస్కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్ప్లస్కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్వర్క్లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్ప్లస్లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్ప్లస్ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్ప్లస్లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
నోకియా పోరాటం.. అదరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్ఫోన్..
ఒకప్పుడు ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్గా వెలుగు వెలిగిన నోకియా కాలానుగుణంగా ఫీచర్లను జోడించకుండా వెనుకబడి పోయింది. ఆ తర్వాత తన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుంచి మార్కెట్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ క్రమంలో అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఎన్ సిరీస్లో త్వరలో నోకియా మార్కెట్లోకి తేబోయే ఫోనుకు సంబంధించిన ఫీచర్లను చైనాకు చెందిన ప్రముఖ సంస్థ సీఎన్ఎమ్వో రిపోర్టు చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. 2006లో నోకియాలో సక్సెస్పుల్ మొబైల్గా ఎన్73 నిలిచింది. ఇందులో ఉపయోగించిన సింబియాన ఆపరేటింగ్ సిస్టమ్ సరికొత్త స్మార్ట్ఫోన్ అనుభూతిని అందిచింది. అయితే ఆండ్రాయిడ్ హవాలో మిగిలిన ఫోన్లలానే నోకియా శకం కూడా క్రమంగా కొడగట్టిపోయింది. అయితే త్వరలో లాంచ్ చేయబోయే ఫోన్ను ఎన్ 73 సిరీస్లోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఫీచర్లు - నోకియా రాబోయే ఫోనులో ఐదు కెమరాలను వినియోగించనున్నారు. ఇందులో ఒక కెమెరాకు 200 మెగా పిక్సెల్ సామర్థ్యం అందివ్వనున్నారు. దీనికి శామ్సంగ్ ఐసోసెల్ హెచ్పీ వన్ సెన్సార్లు వినియోగించనున్నారు. వెనుక వైపు ఉండే ఐదు కెమెరాల్లో రెండు కెమరాలకు శక్తివంతమైన సెన్సార్లు ఉంటాయి. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందిస్తున్నారు. - 2019లోనే నోకియా ఐదు కెమెరాల సెటప్తో ప్యూర్ వ్యూ అనే మోడల్ రిలీజ్ చేసినా.. అందులో సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడంతో ఆ మోడల్ పెద్దగా క్లిక్ కాలేదు. కానీ కెమెరాలకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో ఈ సారి ఆ కెమెరా సెటప్ను మరింత సమర్థంగా అప్గ్రేడ్ చేశారు. - డిస్ప్లేలో కర్వ్డ్ ఎడ్జ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇకనైనా ఇక రాబోయే ఫోన్ ఈ ప్లాట్ఫామ్పై పని చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ సంగతేంటి, ధర ఎంత ఉండవచ్చనే అంశాలను అతి త్వరలోనే అందిస్తామని సీఎన్ఎంవో పేర్కొంది. కనీసం ఈ ఫోనుతో అయినా నోకియా మార్కెట్లో తన ఉనికి చాటుకోవాలని ఆ బ్రాండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చదవండి: ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపరాఫర్! -
ప్రీమియం.. నోకియా ఎగ్జిట్..
-
నోకియా సంచలన నిర్ణయం..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్కు స్వస్తి పలికేందుకు నోకియా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ను నోకియా లాంచ్ చేసే ఆస్కారం లేదు. బడ్జెట్ ఫోన్లపై మొగ్గు..! నోకియా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను లేటుగా స్వీకరించినా..స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలోకి తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యింది. కాగా తాజాగా పలు దిగ్గజ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ ఉత్పత్తి నిలిపివేసేందుకు నోకియా సిద్దమైంది. వీటి బదులుగా బడ్జెట్ స్మార్ట్ఫోన్స్పై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఇటీవల బార్సిలోనాలో ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో బడ్జెట్ రేంజ్ Nokia C సిరీస్ ఫోన్స్ను ప్రకటించింది. దీంతో నోకియా నుంచి ప్రీమియం స్మార్ట్ఫోన్స్కు స్వస్తి పలకనున్నట్లుగా నిరూపితమైంది. హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... 800 డాలర్ల పైచిలుకు స్మార్ట్ఫోన్స్ తయారుచేయడం కష్టంతో కూడుకుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీటి సేల్స్ కూడా ఆశించిన మేర లేవని ఆడం వెల్లడించారు. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బడ్జెట్ రేంజ్లో స్మార్ట్ఫోన్స్ను తయారు చేస్తూ..5జీ సెగ్మెంట్లో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...! -
ఐఫోన్లకే కాదు..ఇకపై నోకియా స్మార్ట్ఫోన్స్పై కూడా..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నోకియా కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ తన ఉత్పత్తులకు అందించే యాపిల్కేర్+ తరహాలో స్మార్ట్ఫోన్స్పై ప్రోటక్షన్ ప్లాన్స్ను, వారంటీ ప్రొగ్రామ్ను నోకియా కూడా ప్రారంభించింది. దీంతో ఆయా నోకియా ఉత్పత్తులపై యూజర్లకు మరింత భద్రత లభించనుంది. మరింత భద్రంగా మీ స్మార్ట్ఫోన్స్..! నోకియా ఉత్పత్తులపై యాపిల్కేర్+ తరహాలో కొత్త ప్లాన్స్ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. అందుకోసం డివైజ్ మేనెజ్మెంట్ ప్లాట్ఫాం సర్విఫైతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నోకియా స్మార్ట్ఫోన్ యూజర్లకు వారంటీ పొడగింపు, స్క్రీన్ ప్రోటెక్షన్ లభించనున్నాయి. ఈ సెఫ్టీ ప్రణాళికలను భారత్, USలోని నోకియా ఫోన్ వినియోగదారుల కోసం ఈ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. . ధరలు ఇలా..! హెచ్ఎండీ గ్లోబర్ తీసుకొచ్చిన సరికొత్త ప్రోటెక్షన్ ప్లాన్ను స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన 30 రోజుల్లో ఈ ప్లాన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెరికాలో 12 నెలల పొడిగించిన వారంటీ ప్లాన్ ధర దాదాపు రూ. 750గా ఉండగా, భారత్లో రూ. 349 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్లాన్స్ నిర్ణీత సమయం వరకు వర్తించనున్నాయి. హెచ్ఎండీ ప్రతిపాదించిన ఈ ప్లాన్స్ను భారత్లో Servify వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా పొందవచ్చును. అయితే ఆయా హ్యాండ్సెట్ ప్రకారం ప్రొటక్షన్ ప్లాన్ల ధరలు ఉంటాయి. ఈ ప్రోటక్షన్ ప్లాన్లో భాగంగా నోకియా స్మార్ట్ఫోన్స్ ప్రమాదవశాత్తు కింద పడితే, లిక్విడ్ డ్యామేజ్ వారంటీ గడువు ముగిసిన తర్వాత ఏర్పడే బ్రేక్ డౌన్స్ వంటి వాటికి కవరేజీ వస్తోంది. వారికి మాత్రమే..! ఇటీవల కొనుగోలుచేసిన నోకియా స్మార్ట్ఫోన్స్పై మాత్రమే ఈ ప్రొటక్షన్ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. ఫోన్ కొనుగోలుచేసిన 30 రోజులలోపు ఈ ప్రొటక్షన్ ప్లాన్ను కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ మొత్తం ప్రక్రియకు 7 నుంచి 12 రోజుల సమయం పడుతుందని HMD పేర్కొంది. చదవండి: తక్కువ ధరలో వన్ప్లస్ నుంచి మరో సూపర్ స్మార్ట్ఫోన్..! ఫీచర్స్ లీక్..! -
సూపర్ ఫీచర్స్తో నోకియా లైట్ ఇయర్బడ్స్..! ధర ఎంతంటే..?
భారత మార్కెట్లలోకి నోకియా సరికొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, వైర్డ్ ఇయర్ఫోన్స్ను లాంచ్ చేసింది. నోకియా లైట్ BH-205 ఇయర్బడ్స్ IPX7 వాటర్ రేసిస్టెన్స్ రేటింగ్తో రానుంది. దీని ఛార్జింగ్ కేస్ పిల్ ఆకారపు డిజైన్ను కలిగి ఉంది. బ్యాటరీ స్థాయిలను చూపించడానికి ముందు భాగంలో నాలుగు LED లైట్లు ఉన్నాయి. ఇది 36 గంటల బ్యాటరీ బ్యాకప్తో రానుంది. నోకియా లైట్ ఇయర్బడ్స్ కేవలం క్లాసిక్ చార్కోల్, పోలార్సీ కలర్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ. 2,799గా నిర్ణయించారు. ఇక నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్ఫోన్ 3.5mm ఆడియో పోర్ట్తో పాత ఫోన్లకు ఉపయోగించవచ్చు. నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తాయి.దీని ధర రూ. 299. ఈ రెండు ఉత్పత్తులు నోకియా ఇండియా అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉండనున్నాయి. నోకియా లైట్ ఇయర్బడ్స్ (BH-205) ఫీచర్స్...! టూత్ 5.0 కనెక్టెవిటీ. ఇయర్బడ్లు 6mm ఆడియో డ్రైవ్ హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చదవండి: ఫ్లిప్కార్ట్లో మొబైల్ కొనేవారికి గుడ్న్యూస్..! డిస్కౌంట్స్తో పాటుగా ఇవి కూడా..! -
భారత్లోని తొలి టెలికాం సంస్థగా రికార్డు సృష్టించిన ఎయిర్టెల్..!
దేశవ్యాప్తంగా పలు దిగ్గజ టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి సంస్థలు 5జీ ట్రయల్స్ను ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 700MHz బ్యాండ్తో దేశంలో 5జీ ట్రయల్స్ టెస్ట్ను నిర్వహించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.5జీ ట్రయల్స్ టెస్ట్ను నోకియా భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టెస్ట్ను కోల్కత్తా నగర శివార్లలో నిర్వహించింది. ఈస్ట్రన్ ఇండియాలో నిర్వహించిన తొలి టెస్ట్ కూడా ఇదే. 700 MHz బ్యాండ్ సహాయంతో ఎయిర్టెల్, నోకియా కంపెనీలు రియల్టైమ్ పరిస్ధితుల్లో రెండు 3GPP ప్రామాణిక 5G ప్రాంతాల మధ్య 40 కి.మీల హై-స్పీడ్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కవరేజీని సాధించగలిగాయి. ఈ ట్రయల్స్లో భాగంగా ఎయిర్టెల్ నోకియాకు చెందిన 5G పోర్ట్ఫోలియో పరికరాలను వాడింది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ...5జీ టెక్నాలజీలో భాగంగా కంపెనీ భారత మొట్టమొదటి 700 MHz బ్యాండ్లో 5జీ డెమోను నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్టెల్ నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఎయిర్టెల్ ప్రత్యక్ష 4G నెట్వర్క్ సహాయంతో తొలి 5G టెక్నాలజీ అనుభవాన్ని ప్రదర్శించింది. చదవండి: అడిడాస్ సంచలనం..! ఫేస్బుక్తో పోటాపోటీగా మెటావర్స్ పై కసరత్తు -
టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..!
Nokia Plans To Launch Cloud Based Software Subscription Service For Telecom Companies: టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకొని నోకియా భారీ ఆలోచనతో ముందుకురానుంది. అనలిటిక్స్, సెక్యూరిటీ , డేటా మేనేజ్మెంట్ సర్వీస్ సాఫ్ట్వేర్ను అందించడం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నోకియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనేక సాంకేతిక సంస్థలు ఊహాజనిత, పునరావృత వ్యాపారాన్ని నిర్మించడానికి ముందస్తు లైసెన్సింగ్ నుంచి సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా కదులుతున్నాయి. దీంతో నోకియా సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: తగ్గేదె లే అంటున్న జియో! నోకియా రూపొందించిన పలు సాఫ్ట్వేర్ పోర్ట్ఫోలియోలను ఈ ఏడాది నుంచి సబ్స్క్రిప్షన్ బేస్లో అందిస్తుండగా...వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తిగా ఆయా సాఫ్ట్వేర్ పోర్ట్ఫోలియోలను వాణిజ్యపరంగా అందుబాటులో ఉంచాలని నోకియా భావిస్తోంది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సర్వీసులను నోకియా 2016లోనే సృష్టించినప్పటికీ...సబ్స్క్రిప్షన్ మోడల్పై కంపెనీ అంతగా మొగ్గుచూపలేదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ బన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ మోడల్ను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తోందని మార్క్ వెల్లడించారు. దీంతో పలు టెలికాం కంపెనీల వ్యయాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్ టెలికాం కంపెనీల డేటా, అనలిటిక్స్, సెక్యూరిటీ పరంగా నిర్వహణ మరింత సులభతం కానుంది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలతో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ వినియోగంపై నోకియా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2021-2025 కాలానికి 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 23,060 కోట్లు) ను నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: సెకండ్కు సుమారు 6 లక్షల 48 వేల సంపాదన..! -
మిలిటరీ-గ్రేడ్ రేంజ్లో నోకియా స్మార్ట్ఫోన్..! కొనుగోలుపై ఇయర్బడ్స్ ఉచితం..!
హెచ్ఎమ్డీ గ్లోబల్ భారత మార్కెట్లలోకి నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను అక్టోబర్ 18న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నోకియా ఎక్స్ ఆర్20 స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూలైలో భారత్ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్ఆర్20ను హెచ్ఎమ్డీ లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను అత్యంత టఫెస్ట్ స్మార్ట్ఫోన్గా అభివర్ణించింది. ఈ స్మార్ట్ఫోన్ ఐపీ68 రేటింగ్తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్ఆర్20 సొంతం. గ్రానైట్,అల్ట్రా బ్లూకలర్ వేరియంట్స్తో ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుదారులకు లభించనుంది. నోకియా ఎక్స్ఆర్20 6జీబీ+128 జీబీ ఇంటర్నల్ వేరియంట్ స్మార్ట్ఫోన్ ధర రూ. 46,990. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై నోకియా పవర్ బడ్స్ లైట్ ఇయర్బడ్స్ కొనుగోలుదారులకు ఉచితంగా లభించనున్నాయి. అంతేకాకుండా ఒక ఏడాదిపాటు స్క్రీన్ ప్రొటెక్షన్ను కూడా నోకియా అందిస్తోంది. నోకియా XR20 ఫీచర్స్ 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 48+13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4,630 mAh బ్యాటరీ 18 W వైర్డ్ ఛార్జింగ్ 5G సపోర్ట్ NavIC ఇండియన్ జీపీఎస్ సపోర్ట్ యూఎస్బీ టైప్-సి చార్జింగ్ చదవండి: క్లియర్ట్రిప్లో వాటాలను కొనుగోలుచేసిన అదానీ..! -
కొత్త మోడల్ కార్లలో టాటా సరికొత్త ఆవిష్కరణ
► కొత్త మోడల్ కార్ల తో టాటా దూసుకుపోతోంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కోసం మైక్రో ఎస్యూవీని రంగంలోకి దించింది. ఎస్యూవీల్లో టాప్ బ్రాండ్గా ఉన్న జీప్.. 7 సీటర్ను ఇండియన్ రోడ్లపైకి తెచ్చింది. ► ఇక చాన్నాళ్ల పాటు మొబైల్ రంగాన్ని ఏలిన నోకియా.. స్మార్ట్ ఫోన్లలో కొత్త వ్యూహంతో అడుగుపెట్టబోతుంది. ఫుల్ హెచ్డీ స్మార్ట్ఫోన్ను రూపొందించిన నోకియా బోలెడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ► పోలీస్ రోబో పేరుతో వచ్చిన గస్తీ రోబో.. త్వరలో భారతీయ కాలనీల్లో చూడవచ్చు. యాంటినాలు, ఎటువైపైనా కదిలే సౌకర్యం తో స్ట్రీట్ సర్వే చేపడతాయి ఈ రోబో లు. -
స్మార్ట్ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...!
Nokia C30 Jio Exclusive Offer: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నోకియా భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ ఫోన్ను రిలీజ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్ఫోన్ను గురువారం (అక్టోబర్ 21) రోజున లాంఛైంది. సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లలో నోకియా సీ-30 అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. నోకియా ఈ స్మార్ట్ఫోన్కు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వోఎస్ అప్డేట్స్ను కూడా అందించనుంది. చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్బుక్? కారణాలు ఏంటంటే.. నోకియా సీ30 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది. నోకియా సీ30 (3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 10999 కాగా, 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. గ్రీన్, వైట్ కలర్స్ వేరియంట్స్లో నోకియా సీ30 లభించనుంది. ఫోన్ కొనుగోలుపై జియో ఆఫర్..! ఈ స్మార్ట్ఫోన్ను రిలయన్స్ జియో భాగస్వామ్యంతో నోకియా కొనుగోలు చేయనుంది. మై జియో యాప్ లేదా జియో స్టోర్లలో నోకియా సీ30 కొనుగోలుపై 10 శాతం సుమారు రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ను జియో అందించనుంది. స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో ఆయా కొనుగోలుదారుడికి యూపీఐ రూపంలో రూ. 1000 తగ్గింపుతో పేమెంట్ అప్షన్ వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారుడు జియో నెట్వర్క్ను వాడినట్లైతే రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మింత్రా, ఫార్మ్ఈజీ, ఓయో, మేక్ మై ట్రిప్ల్లో సుమారు రూ. 4 వేల వరకు ఇతర బెనిఫిట్స్ను కూడా జియో అందిస్తోంది. నోకియా సీ-30 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 6.82 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే ఆక్టాకోర్ యునిసోక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13+2 ఎమ్పీ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 వాట్స్ ఛార్జింగ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ సపోర్ట్ చదవండి: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్న్యూస్ -
నోకియా నుంచి టఫెస్ట్ స్మార్ట్ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే..
Nokia XR20 Launch In India: హెచ్ఎమ్డీ గ్లోబల్ భారత మార్కెట్లలోకి త్వరలోనే నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల అక్టోబర్ 20 నుంచి ప్రీ బుకింగ్స్ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో భారత్ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్ఆర్20ను హెచ్ఎమ్డీ లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను అత్యంత టఫెస్ట్ స్మార్ట్ఫోన్గా అభివర్ణించింది. ఈ స్మార్ట్ఫోన్ ఐపీ68 రేటింగ్తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్ఆర్20 సొంతం. భారత మార్కెట్లలో నోకియా ఎక్స్ ఆర్20 స్మార్ట్ఫోన్ ధర 43 వేల నుంచి 50 వేల మధ్య ఉండనున్నుట్ల తెలుస్తోంది. చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు నోకియా XR20 ఫీచర్స్ (అంచనా) 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 48+13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4,630 mAh బ్యాటరీ 18 W వైర్డ్ ఛార్జింగ్ 5G సపోర్ట్ NavIC ఇండియన్ జీపీఎస్ సపోర్ట్ యూఎస్బీ టైప్-సి చార్జింగ్ Brace yourselves to meet the toughest device you'll ever see. Nokia XR20 pre-booking starts on 20th October.#NokiaXR20 #LoveTrustKeep pic.twitter.com/S4PFknERoX — Nokia Mobile India (@NokiamobileIN) October 15, 2021 చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..! -
నోకియా నుంచి నయా ల్యాప్టాప్, స్మార్ట్టీవీలు లాంచ్..! ధర ఎంతంటే...?
Nokia Launched New Laptop, Smart TV's: నోకియా భారత మార్కెట్లో విక్రయాలను మరింత పెంచేందుకుగాను సరికొత్త వ్యూహాలతో ముందుకువస్తోంది. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు తాజాగా నోకియా ప్యూర్బుక్ ఎస్ 14 ల్యాప్టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి మంగళవారం రోజున లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అక్టోబర్ 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నోకియా ప్యూర్బుక్ ఎస్ 14 విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తోంది. ఈ ల్యాప్టాప్లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ను అమర్చారు. కాగా నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేస్తాయి. 50-ఇంచ్, 55-ఇంచ్ డిస్ప్లే పరిమాణాలలో నోకియా స్మార్ట్టీవీలను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్టీవీలు ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, క్యూఎల్ఈడీ వేరింయట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ధర ఏంతంటే...? నోకియా ప్యూర్బుక్ ఎస్ 14 ల్యాప్టాప్ ధర రూ. 56, 990. నోకియా 50ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్టీవీ ధర రూ. 44,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 49, 999గా నోకియా నిర్ణయించింది. నోకియా 55ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్టీవీ ధర రూ. 49,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 54, 999గా నోకియా నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్ స్పీకర్స్తో పనిచేస్తాయి. 2జీబీ ర్యామ్+ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ స్మార్ట్టీవీలు లభిస్తాయి. నోకియా ప్యూర్బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్లు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బరువు 1.4 కిలోలు 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU డాల్బీ అట్మోస్ సపోర్ట్ 14-అంగుళాల ఫుల్-హెచ్డి ఐపిఎస్ డిస్ప్లే 16జీబీ ర్యామ్ + 512జీబీ NVMe ఎస్ఎస్డీ యూఎస్బీ టైప్-సి పోర్ట్, హెచ్డీఎమ్ఐ పోర్ట్ -
నోకియా 5జీ ఫోన్ వచ్చేసింది, అద్భుతమైన ఫీచర్లతో..
ఒకప్పుడు బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు 4జీ, 5జీ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ను శాసించేందుకు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవల బండకేసి బాదినా పగలని ఎక్స్ఆర్20ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నోకియా. ఇప్పుడు అఫార్డబుల్ ప్రైస్లో నోకియా జీ సిరీస్లో 5జీ ఫస్ట్ ఫోన్ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూకే మార్కెట్లో అందుబాటులో ఉండగా..మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. నోకియా జీ50 స్పెసిఫికేషన్లు నోకియా జీ50 ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్లో విడుదల కానుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,173.83x77.68x8.85 ఎంఎం, 6.82 అంగుళాల డిస్ప్లే, బ్రైట్నెస్ కోసం 450నిట్స్, 4 జీబీ ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480ఎస్ఓఎస్,48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 2మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్తో వస్తుంది. 64జీబీ ఇంట్రనల్ కెమెరా,512జీబీ వరకు మైక్రో ఎస్డీ కెమెరా,4జీ, 5జీ నెట్వర్క్లకు కనెక్టివిటీ ఆప్షన్, వైఫై 802.11ఏసీ,వీ5.0 బ్లూటూత్,జీపీఎస్-ఏజీపీఎస్ ట్రాకర్,ఎన్ఎఫ్సీ(Near-field communication),యూఎస్బీ, టైప్సీ పోర్ట్, సెన్సార్లను రిసీవ్ చేసుకునేందుకు యాంబీనెట్ లైట్, ఫోన్ ఆటో రొటేట్ కోసం జిరోస్కోప్ ఫీచర్లను యాడ్ చేసింది. ఫోన్ ధర నోకియా జీ50 4జీబీ ర్యామ్ 64 ఇంట్రనల్ స్ట్రోరేజ్తో వస్తున్న ఈ ఫోన్ ధర యూకే మార్కెట్లో రూ.20వేలల్లో లభ్యం కానుంది. మిడ్నైట్ సన్, బ్లూ ఓషన్ కలర్స్లో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ యూకే మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తుండగా.. మరోవైపు అఫార్డ్బుల్ ప్రైస్లో 4జీ మోడల్ ఫోన్లు నోకియా జీ10,నోకియా జీ20 ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చదవండి: జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్ -
జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్
ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లో బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు జియోకు షాకిస్తూ 'నోకియా సీ01'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. చిప్ కొరత కారణంగా వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో 4జీ స్మార్ట్ఫోన్ 'జియో నెక్ట్స్'ను దీపావళికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో జియోకి పోటీగా నోకియా బడ్జెట్ ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 'నోకియా సీ01' ఫీచర్స్ దివాళీ ఫెస్టివల్ సందర్భంగా విడుదల కానున్న ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ నోకియా సీ01లో ఆండ్రాయిడ్11(గో ఎడిషన్) వెర్షన్తో అందుబాటులోకి రానుంది. తక్కువ ర్యామ్, యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ వంటి లైట్ వెయిట్ యాప్స్ను వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. ఇకఘీ ఫోన్ 5.45 అంగుళాల హెచ్డీస్క్రీన్, హై డైనమిక్ రేంజ్లో ఎల్ఈడీ ఫ్లాష్ వచ్చేలా రెండు 5 మెగా ఫిక్సెల్ కెమెరాలు, ఆక్టాకోర్ 1.6జీహెచ్జెడ్ యునిసోక్ SC9863A ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందిస్తుండగా, మైక్రో ఎస్డీ కార్డ్ తో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్ పెడితే 3000 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీతో ఒక రోజు వినియోగించుకోవచ్చు. 'నోకియా సీ01' ధర, కలర్స్ జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా సీ01 ధర ఇండియాలో రూ.5,999 ఉండగా.. 10శాతం డిస్కౌంట్తో మై జియో యాప్లో ఈ ఫోన్ను రూ.5,399 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ బ్లూ,పర్పుల్ కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. -
ఫోన్ మింగిన ఘనుడు.. కడుపులోకి వెళ్లగానే..
ప్రిస్టినా: బాగా ఆకలి వేసిందో.. లేక మత్తులో ఉన్నాడో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్ను మింగేశాడు. అనంతరం దాన్ని అలానే కడుపులో ఉంచుకోవడంతో ప్రాణం మీదకు వచ్చేసరికి ఆస్పత్రి మెట్లెక్కాడు. కోసోవోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యూరప్లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్ను మింగేశాడు. ఫలితంగా అతని కడుపులో ఆ ఫోన్ ఇరుక్కుపోవడంతో బాధతో తల్లడిల్లిపోయి ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. అనంతరం లేటెస్ట్ టెక్నాలజీని వాడి, కడుపులోంచి ఫోన్ను బయటకు తీశారు. అతనికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించాము. అది కడుపులో వెళ్లిన అనంతరం మూడు భాగాలుగా విడిపోయి ఉందని, అన్నింటిని బాగానే బయటకు తీయగలిగామన్నారు. కాకపోతే బ్యాటరీని బయటకు తీసేటప్పుడే ఇబ్బంది ఎదురైందని, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది కడుపు లోపలే పేలిపోయేదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ మింగాడన్న విషమంపై సమాచారం తెలియలేదు. చదవండి: పబ్లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ -
నోకియా వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఎక్సేంజ్తో పాటు
హ్యాండ్సెట్ల రంగంలో తనదైన ముద్రవేసిన నోకియా.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. సామాన్యుల కోసం తక్కువ ధర, వన్ ఇయర్ రిప్లెస్ మెంట్ గ్యారెంటీతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా నోకియా సి20 పేరుతో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇటీవల బండకేసి బాదినా పగలని నోకియా ఎక్స్ఆర్20ని విడుదల చేసి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు నోకియా సి20తో స్మార్ట్ ఫోన్ లవర్స్ను ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ ఫోన్ రెండునెలల క్రితమే విడుదల కావాల్సి ఉండగా..అప్ గ్రేడ్ తో పాటు ఇతర కారణాల వల్ల భారత్లో విడుదలవ్వడం ఆలస్యమైంది. అయితే తాజాగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రెగ్యులర్ అప్డేట్లతో పాటు సాఫ్ట్వేర్లను క్లీన్ చేసున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు నోకియా సి 20 ప్లస్పై ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా ఇస్తుంది. అంటే మీరు కొన్న నోకియా ఫోన్ సంవత్సరంలోపు ఉపయోగంలో లేకపోతే కొత్త ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ సందర్భంగా సీ20 ప్లస్లో నోకియా సి 1 ప్లస్,నోకియా సి30, తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్ ఆర్ 20ను త్వరలో విడుదల చేయనుంది. నోకియా సి20 ప్లస్ ధర నోకియా సి20 ప్లస్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 8,999కే అందిస్తుండగా..3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 9,999కే దక్కించుకోవచ్చు.జియో ఎక్స్ క్లూజీవ్ ప్రోగ్రాంలో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ను పొందవచ్చు. కాకపోతే జియో సిమ్ కార్ట్ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో ఆఫర్తో ఫస్ట్ వేరియంట్ ధర రూ .8,099, సెకండ్ వేరియంట్ రూ. 8,999 సొంతం చేసుకోవచ్చు. జియోఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ కింద రూ .4,000 విలువైన ఆఫర్లు అందుబాటులోకి ఉండనున్నాయి. నోకియా సి 20 ప్లస్ స్పెసిఫికేషన్లు నోకియా సి 20 ప్లస్ 6.5-అంగుళాల హెచ్డి+ డిస్ప్లే,నాచ్ టాప్ 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 3జీబీ ర్యామ్తో ఆక్టా కోర్ యునిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్, 32జీబీ ఆన్బోర్డ్ మెమరీతో పాటు స్టోరేజీని పెంచుకుంనేందుకు ఎస్డీ మైక్రో కార్డ్లను యాడ్ చేసుకోవచ్చు.ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)ను రన్ చేస్తుంది. మీరు గూగుల్ నుండి జిమెయిల్, యూట్యూబ్,మ్యాప్స్ ను ఉపయోగించుకోచ్చు. ఫోన్ వెనుక భాగంగా 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను డిజైన్తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం, నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ రెండు సిమ్ కార్డ్ స్లాట్స్, ఎఫ్ఎం రేడియో, 4జీ VoLTE, వైఫై, బ్లూటూత్,3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్కు సపోర్ట్ చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వినియోగించుకునేలా 4950ఏఎంచ్ బ్యాటరీని అందిస్తున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు. -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్ను డిజైన్ చేసింది. ఈ మొబైల్కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్కు సపోర్ట్గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్ వెల్లడించింది. ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్ఎఫ్సీఎల్ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్ విధివిధానాలకు అనుగుణంగా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్డీసీసీఐ వెబినార్లో వెల్లడించారు. భారత్ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్ మాడ్యూల్స్ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుందన్నారు. చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం -
ప్రీమియం ఫీచర్లతో నోకియా 5జీ స్మార్ట్ఫోన్, ధర ఎంతంటే?
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా మొబైల్ ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ అందుబాటు ధరలో 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఎక్స్ 20 పేరుతో ప్రీమియం స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది . 5జీ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ను జోడించిన నోకియా ఎక్స్ 20 త్వరలో భారత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.దీంతోపాటు గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఒకటి రెండు కాదు ఆరు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్లలో భాగంగా వీటిని తీసుకురావడం విశేషం. నోకియా ఎక్స్ 20 ఫీచర్లు 6.67అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ 32 ఎంపీ సెల్ఫీకెమెరా 64 + 5+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా 6 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ 4470 ఎంఏహెచ్ బ్యాటరీ ఈయూ మార్కెట్లో దీని ధర సుమారు 31,000 రూపాయలు. మిడ్నైట్ సన్ నార్డిక్ బ్లూ రంగులలో వస్తుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో మేలో సేల్ ప్రారంభం. చదవండి : స్మార్ట్ఫోన్తో ఆక్సిజన్ లెవల్స్ ఇలా చెక్ చేసుకోండి నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా -
నోకియా సంచలన నిర్ణయం..
హెల్సింకి: వైర్లెస్ నెట్వర్క్ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమనార్హం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు చేసేందుకై వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఈ సంఖ్యను 80–85 వేలకు పరిమితం చేయనుంది. తద్వారా 2023 నాటికి రూ.5,200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది. -
భారీగా ఉద్యోగాల కోతను విధించనున్న నోకియా
ఫిన్ల్యాండ్: ఫిన్నిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగా 600 మిలియన్ యూరోల (715 మిలియన్ డాలర్లు) ఖర్చును తగ్గించేలా 2023 నాటికి 11 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా వచ్చిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ నేతృత్వంలోని నోకియా తన విస్తృత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాబోయే రెండేళ్ళలో మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఉద్యోగ కోతలు ఉంటాయని తెలపింది.. ప్రణాళికాపరంగానే ఉద్యోగుల కోతలు రానున్న 18-24 నెలల వ్యవధిలో 80,000-85,000 ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నోకియాలో సుమారు 90,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ 5జి పరికరాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంలో తన పోటీదారులైన ఎరిక్సన్, హువాయ్లతో జరిగిన రేసులో నోకియా కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాక గత ఏడాది లో జరిగిన ముఖ్యమైన వెరిజోన్ ఒప్పందాన్ని కోల్పోయి చైనాలోకి అడుగుపెట్టలేకపోయింది.గత ఏడాది ఆగస్టులో లండ్మార్క్ అధికారంలోకి వచ్చిన తరువాత, మాజీ సిఈఓ రాజీవ్ సూరి"ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్" వ్యూహాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో మరింత కేంద్రీకృత విధానాన్ని తీసుకొచ్చాడు. ఆల్కాటెల్-లూసెంట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్రాన్స్లో 1,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో సహా, 2018 లో వ్యయ కోతలో భాగంగా విధించిన ఉద్యోగుల తొలగింపులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. -
భారత్లో మూడు నెలల్లో 5జీ సిద్ధం
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ను మూడు నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలపరమైన సమస్యలు.. అడ్డంకులుగా ఉంటున్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఇన్ఫ్రా ఇంకా సిద్ధంగా లేనందున.. కొన్ని ప్రాంతాలకు మాత్రమే 5జీ నెట్వర్క్ను పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ సత్వరం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్ (మార్కెటింగ్) అమిత్ మార్వా తెలిపారు. ‘5జీ అనేది ఆపరేటర్లు సొమ్ము చేసుకునేందుకు మరో మార్గంగా భావించరాదు. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. భారత్లో 5జీ తయారు చేస్తున్నాం. హార్డ్వేర్ సిద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్లో 5జీ నెట్వర్క్లను వినియోగంలోకి తేవడం మొదలుపెట్టొచ్చు‘ అని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలకు భారీ వ్యయాలు.. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాలంటే భారత్లో చాలా వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని టెలికం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సందీప్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడ రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అటు చైనాలో చూస్తే కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు స్థానిక కంపెనీలకు దాదాపు 200 బిలియన్ డాలర్ల దాకా ప్రభుత్వమే సమకూరుస్తోందని ఆయన వివరించారు. మరోవైపు, భారత్ టెక్నాలజీలను పూర్తి స్థాయిలో రూపొందించే పరిస్థితి లేదని, మిగతా వారి నుంచి కూడా మద్దతు తీసుకోవాల్సిన ఉంటోందని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో అరవింద్ బాలి తెలిపారు. -
నోకియా 5.4 సేల్ షురూ : బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియాకు చెందిన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ తొలి సేల్ బుధవారం షురూ కానుంది. హెచ్ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో మొదలు కానుంది. నోకియా 5.4 బేస్ వేరియంట్కు రూ .13,999 గా ఉంటుంది. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీ, క్వాడ్ కెమెరాతోపాటు ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వన్ ఆధారితంగా దీన్ని తీసుకొచ్చింది. నోకియా 5.4 ధర, ఆఫర్లు నోకియా 5.4 స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. పోలార్ నైట్, డస్క్ కలర్స్లో లభ్యం. ఫ్లిప్కార్ట్ , నోకియా ఆన్లైన్ స్టోర్లో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ద్వారా చేసిన కొనుగోళ్లపై 5 శాతం తగ్గింపు లభ్యం. జియో కస్టమర్లకు ఏకంగా రూ .4,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జిపై రూ .2,000 తక్షణ క్యాష్బ్యాక్, ఇతర భాగస్వాముల నుండి రూ .2,000 విలువైన వోచర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త, పాత జియో చందాదారులకు కూడా వర్తిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ .15,499 నోకియా 5.4 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48 + 2+ 5 + 2 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ విషయంలో ప్రపంచంలో మనమే టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ లేకుండా రోజు గడవడం కష్టమే. అంతలా ఈ ఉపకరణం జీవితంతో ముడిపడింది. భారత్లో సగటున ఒక్కో యూజర్ 4.48 గంటలు స్మార్ట్ఫోన్ వాడుతున్నారట. ఈ స్థాయి వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా తెలిపింది. స్మార్ట్ఫోన్ వినియోగం గతేడాది నాలుగు రెట్లు పెరిగింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ప్రకారం.. మొబైల్లో సగటు 3జీ/4జీ డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది. ఇది అయిదేళ్లలో 17 రెట్లు అధికమై 2020లో 13.5 జీబీకి ఎగసింది. వార్షిక వృద్ధి రేటు 76 శాతముంది. డేటాలో 54 శాతం యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46 శాతం ఫిట్నెస్, ఫిన్టెక్, ఎడ్యుటెక్, ఈటైలింగ్కు వినియోగం అవుతోంది. 5జీ సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది. 5జీ అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని అంచనా వేస్తోంది. మొబైల్ డేటాలో రెండవ స్థానం.. మొబైల్స్లో ఇంటర్నెట్ వాడకంలో ఫిన్లాండ్ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. అయిదేళ్లలో 63 రెట్ల డేటా వృద్ధి జరిగింది. ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్తో పోటీపడలేదని నోకియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. మొబైల్ నెట్వర్క్స్లో 2015 డిసెంబరులో భారత్లో 164 పెటాబైట్స్ డేటా వినియోగం అయింది. 2020 డిసెంబరుకు ఇది 10,000 పెటాబైట్స్ స్థాయికి వచ్చి చేరింది. ఒక పెటా బైట్ 10 లక్షల జీబీకి సమానం. ఇక మొత్తం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో.. ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 2019లో 15 శాతంలోపు ఉన్నాయి. 2025 నాటికి ఇది 48 శాతానికి చేరనుంది. 10 కోట్ల మంది 4జీ మొబైల్స్ ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 2జీ లేదా 3జీ సేవలను వినియోగిస్తున్నారు. అధికంగా షార్ట్ వీడియోలే.. షార్ట్ వీడియోలను ప్రతి నెల సగటున 18 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వీక్షిస్తున్నారు. 2016తో పోలిస్తే ఈ సంఖ్య 9 రెట్లు పెరిగింది. ఒక నెలలో 110 బిలియన్ నిముషాలు ఈ షార్ట్ వీడియోలు చూసేందుకు గడిపారు. 2025 నాటికి ఇది నాలుగు రెట్లు అధికం కానుందని అంచనా. షార్ట్ వీడియోల కంటెంట్ అధికంగా ఉండడంతోపాటు యువత వీటివైపే మొగ్గు చూపుతున్నారు. 4జీ డేటా యూజర్లు 70.2 కోట్లున్నారు. డేటా ట్రాఫిక్ నాలుగేళ్లలో 60 రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఇదే అధికం. డేటా ట్రాఫిక్లో 4జీ వాటా 99 శాతం, 3జీ ఒక శాతం ఉంది. దేశవ్యాప్తంగా 4జీ డివైస్లు 60.7 కోట్లు. మొత్తం మొబైల్స్లో 4జీ వాటా 77 శాతం. అలాగే 5జీ స్మార్ట్ఫోన్లు 20 లక్షలున్నాయి. 2.2 కోట్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) ఏటా 37 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఎఫ్టీటీహెచ్ ద్వారా 40 లక్షల గృహాలు, కార్యాలయాలు కనెక్ట్ అయ్యాయి. స్మార్ట్ డివైసెస్ విస్తృతం కావడంతో డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. -
నోకియా నుంచి మరో రెండు బడ్జెట్ మొబైల్స్
మొబైల్ మార్కెట్ లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నోకియా నేడు నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్ని భారత్ లో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం మరో విశేషం. నోకియా 5.4 స్మార్ట్ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తాయి. ఫిబ్రవరి 17న నోకియా 5.4 మొబైల్ ఫస్ట్ సేల్ కి రానుంది. అలాగే నోకియా 3.4ని ఫిబ్రవరి 20న కొనవచ్చు. నోకియా 5.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ, 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: చార్కోల్, డస్క్, ఎఫ్జార్డ్ ధర: రూ.13,999(4జీబీ, 64జీబీ) రూ.15,499(6జీబీ, 64జీబీ) నోకియా 3.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 460 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: డస్క్, పోలార్ నైట్ ధర: రూ.11,999 -
నోకియా 5.4 మొబైల్ ఫీచర్స్ టీజ్ చేసిన ఫ్లిప్కార్ట్
నోకియా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నోకియా 5.4 స్మార్ట్ఫోన్ ను కంపెనీ టీజ్ చేసింది. విడుదలకు ముందే ఫ్లిప్కార్ట్ నోకియా 5.4 కోసం ప్రత్యేకంగా ఒక ల్యాండింగ్ పేజీని సృష్టించింది. ఇందులో దీనికి సంబంధించిన ఫీచర్లను కూడా టీజ్ చేశారు. నోకియా 5.3 వారసుడిగా నోకియా 5.4ను తీసుకొస్తున్నారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్ను అందించారు. నోకియా 5.4లో ఓజో ఆడియో సపోర్ట్తో పాటు 128జీబీ వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంది. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది. నోకియా 5.4 ఫీచర్స్(అంచనా): డిస్ప్లే: 6.39-అంగుళాల హెచ్డి ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్(10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ర్యామ్: 4జీబీ, 6జీబీ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: డస్క్, పోలార్ నైట్ ధర: రూ.15 వేలు చదవండి: వాట్సాప్ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం లీకైన వన్ప్లస్ 9ప్రో ఫోటోలు -
2021లో రాబోయే బెస్ట్ 10 స్మార్ట్ఫోన్స్
2020 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా మొబైల్ పరిశ్రమ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది. అందుకే 2021లో చాలా వరకు కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ వినియోగదారులు కూడా 2021లో రాబోయే కొత్త ఉత్పత్తుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 13 వంటి హై-ప్రొఫైల్ హ్యాండ్సెట్ల నుంచి ఎల్జి రోలబుల్ వంటి మొబైల్స్ కూడా రానున్నాయి. ఈ ఏడాదిలో మొబైల్ సంస్థలు తీసుకురాబోయే కొన్ని ఆసక్తికరమైన 10 స్మార్ట్ఫోన్స్ మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్) శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ కొత్త ఏడాదిలో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్స్ ముందు రానున్నట్లు తెలుస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ లో గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా వంటి మోడల్స్ తీసుకు రానున్నట్లు సమాచారం. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్స్ ను జనవరి 14న మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ప్రాంతాన్ని బట్టి దీనిలో స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్(యుఎస్లో) లేదా ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తీసుకురానున్నారు. ఐఫోన్ 13 సిరీస్ ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ కోసం శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ కంటే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు మొబైల్ యూజర్లు. కానీ ఈ ఫోన్ మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. వన్ప్లస్ 9 సిరీస్ వన్ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి లేదా ఏప్రిల్ లో నెలలో తీసుకురానున్నట్లు సమాచారం. వన్ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ లో స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ను తీసుకొనిరావచ్చు. దీనిలో 48మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 48మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 శామ్సంగ్ భవిష్యత్ లో తీసుకురాబోయే మొబైల్ ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3కి ఎక్కువ బజ్ ఏర్పడుతుంది. శామ్సంగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్క్రీన్లో కెమెరాను తీసుకురానున్నట్లు సమాచారం. ఎల్జీ రోలబుల్ ఎల్జీ రోలబుల్ మొబైల్ మార్కెట్ లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పేటెంట్ ప్రకారం ఎడమ, కుడి స్క్రీన్ అంచులను డ్రాగ్ చేసుకోవచ్చని తెలుస్తుంది. లీక్ ప్రకారం ఇది 6.8 అంగుళాల నుండి 7.4 అంగుళాల వరకు విస్తరించవచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 3 సిరీస్ ఒప్పో కూడా శామ్సంగ్ లేదా వన్ప్లస్ లాగా ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దింట్లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 3 సిరీస్ మొబైల్ ఫోన్లు తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనిని మొదటి త్రైమాసికంలో తీసుకురానున్నట్లు సమాచారం. నోకియా 10 నోకియా 10 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. రోజురోజుకి దీని పేరు మారిపోతుంది. మొదట దీనిని నోకియా 9.1 పేరుతో తీసుకురావాలని భావించారు. కానీ తరువాత నోకియా 9.2, 9.3 వంటి పేర్లను మార్చుతూ పోయింది. ఇప్పుడు 2021లో నోకియా 10 పేరుతో తీసుకురానున్నట్లు సమాచారం. దింట్లో కూడా స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 3 ఐఫోన్ 13 సిరీస్ తో పాటు 2021లో ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 3 మొబైల్ ని తీసుకురానున్నట్లు సమాచారం. దింట్లో ఆపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇది పెద్ద 5.5 లేదా 6.1-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సోనీ ఎక్స్పీరియా 1 III సోనీ ఎక్స్పీరియా 1 III పేరుతో ఒక మొబైల్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. ఈ మొబైల్ 5.5-అంగుళాల స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 21 సిరీస్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 21 సిరీస్ మొబైల్ తీసుకొస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 తీసుకొస్తున్నారు కాబట్టి దీనిని నిలిపివేయవచ్చు అని సమాచారం. దీని యొక్క సేల్స్ కూడా పడిపోయినట్లు ఇటీవల సమాచారం వచ్చింది. -
విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు
సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్ టీవీలు, ఏసీలు ల్యాప్టాప్ల కోసం ఫ్లిప్కార్ట్లో భాగస్వామ్యాన్ని ఇటీవల ప్రకటించిన నోకియా తాజాగా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. త్వరలో రిఫ్రిజరేటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు లాంటి వంటి ఉపకరణాలను మార్కెట్లో ప్రారంభించనుంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్స్ హెడ్ విపుల్ మెహ్రోత్రా ధృవీకరించారు. మైక్రోసాఫ్ట్ నుండి బయటపడిన తరువాత, నోకియా మరింత విస్తరిస్తోంది. తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లైసెన్సులతో రీబ్రాండ్ అవుతూ పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే నోకియా స్మార్ట్ఫోన్లు మొదలు, నోకియా టెలివిజన్లు, నోకియా స్ట్రీమింగ్ పరికరాలు, నోకియా ల్యాప్టాప్లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్లను, డిష్ వాషర్ల వరకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫ్లిప్కార్ట్తో నోకియా భాగస్వామ్యంపై మెహ్రోత్రా మాట్లాడుతూ, దేశంలో, ఫ్లిప్కార్ట్ మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీని గత సంవత్సరం విడుదల చేసిందనీ, ఆ తర్వాత ఆరు నెలల క్రితం మీడియా స్ట్రీమర్లు, గత రెండు నెలల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించినట్టు తెలిపారు. అంతేకాదు ఇటీవలి పండుగ సీజన్ అమ్మకాలలో, నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్కార్ట్లో అత్యధికంగా అమ్ముడైన ఐదు టీవీలలో ఒకటని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ఇంకా వాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, స్మార్ట్ లైట్లు, స్మార్ట్ ప్లగ్స్ వంటి స్మార్ట్ ఉపకరణాలను కూడా తీసుకొస్తామన్నారు. -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
మార్కెట్ లోకి నోకియా ఏసీలు..
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ 'నోకియా'తో కలిసి 'మేడిన్ ఇండియా' నోకియా ఎయిర్ కండీషనర్స్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నోకియా బ్రాండ్ తో రాబోతున్న ఏసీలు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందులో స్వచ్ఛమైన గాలి కోసం 6-ఇన్ -1 ఫిల్టర్లు, యాంటీమైక్రోబయల్ అయానైజర్ ఇన్ బిల్డ్ గా రానున్నట్లు పేర్కొంది. ఇందులో ఇంటెలిజెంట్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్, 4-ఇన్ -1 అడ్జస్ట్బుల్ ఇన్వర్టర్ మోడ్ కూడా ఉంది. నోకియా ఏసీలో స్మార్ట్ డయాగ్నోసిస్, షెడ్యూలింగ్ ప్రోగ్రామ్, కస్టమైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, యాంటీ-కరోసివ్ బ్లూ ఫిన్ టెక్నాలజీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న రాగితో తయారు చేసిన ఇంటర్నల్స్, టర్బో క్రాస్ ఫ్యాన్ ఫ్లో, డ్యూయల్ రోటరీ కంప్రెసర్, ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వైఫై కనెక్టెడ్ స్మార్ట్ క్లైమాట్ కంట్రోల్ ఫీచర్లతో నోకియా ఏసీలను ఆపరేట్ చేసుకునే విధంగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లతో కూడా ఈ ఏసీలను ఆపరేట్ చేయొచ్చని నోకియా తెలిపింది. డిసెంబర్ 29,2020 నుంచి ఫ్లిప్కార్ట్లో 30,999 రూపాయల నుంచి నోకియా ఏసీలు విక్రయించనున్నారు. -
14వేలకే నోకియా 5.4 మొబైల్
హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ రానుంది. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో ఈ ఫోన్లు లభించనున్నాయి. నోకియా 5.4ను ఈ నెలాఖరులో(డిసెంబర్ 2020) కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియాలో 699 ఏఈడీ లేదా 190 డాలర్లు(సుమారు 14,000) ప్రారంభ ధరలో తీసుకురానున్నారు. ఇదే ధరలో మిగతా ప్రపంచ వ్యాప్తంగా 2021 జనవరి ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) నోకియా 5.4 ఫీచర్స్: పేరు: నోకియా 5.4 డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్ ఢీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ర్యామ్: 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రధాన కెమెరా: 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా సెల్ఫీ కెమెరా: 16ఎంపీ(f2.0) కనెక్టివిటీ: నానో సిమ్, జిఎస్ఎమ్/ఎల్టిఇ, బ్లూటూత్ ® 4.2, జిపిఎస్/ఎజిపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్సి బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, 10వాట్ ఛార్జర్ ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్™ 10( ఆండ్రాయిడ్ 11 సపోర్ట్) బరువు: 181 గ్రా. కలర్స్: పోలార్ నైట్, డస్క్ -
బడ్జెట్ లో నోకియా సీ1 ప్లస్ మొబైల్
నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. దింట్లో 4జీ కనెక్టివిటీ కూడా అందించారు. యూరోప్ లో దీని ధర 69 యూరోలు(సుమారు 6,200). ఇది ఎరుపు, నీలం రంగులలో లభించనుంది.(చదవండి: డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11) నోకియా సీ1 ప్లస్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్)పై నడుస్తున్న నోకియా సీ1 ప్లస్ స్మార్ట్ఫోన్ 5.45-అంగుళాల హెచ్డి స్క్రీన్ను కలిగి ఉంది. ఇది 18:9 డిస్ప్లే రేషియోతో వస్తుంది. నోకియా C1 ప్లస్ స్మార్ట్ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128జీబీ స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. నోకియా సి 1 ప్లస్ లో సెల్ఫీ, వీడియోల కోసం ముందు, వెనుక భాగంలో 5మెగాపిక్సల్ ఒకే కెమెరాను అందించారు. 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తున్న నోకియా సి1 ప్లస్ లో 4జీ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను కలిగి ఉంది. 5వాట్ చార్జింగ్కి ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ (జి-సెన్సార్)ను అందిస్తుంది. ఇందులో ఎఫ్ఎం రేడియోను కూడా అందించారు. -
మళ్లీ 11 ఏళ్ళకి నోకియా ల్యాప్టాప్
భారతదేశంలో ప్యూర్బుక్ సిరీస్లో భాగంగా నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14ని మొట్టమొదటి నోకియా ల్యాప్టాప్గా తీసుకొస్తునట్లు ఫ్లిప్కార్ట్లో అప్డేట్ వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్బుక్ సిరీస్ను భారత్లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్సైట్లోని జాబితాలో కొన్ని నోకియా ల్యాప్టాప్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మొదటగా బయటకు వచ్చాయి. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్) నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14 ఫీచర్స్ నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14 వేరియంట్ లో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అందించనున్నారు. మైక్రోసైట్ ప్రకారం డాల్బీ విజన్ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క బరువు 1.1 కిలోగ్రాములు. నోకియా ల్యాప్టాప్ చిత్రంలో యుఎస్బి 3.0 మరియు హెచ్డిఎంఐ పోర్ట్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14ను ఎప్పుడు తీసుకొస్తున్నారో ఫ్లిప్కార్ట్ వెల్లడించలేదు. నోకియా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్సైట్లో లిస్టింగ్ చేసిన ప్రకారం మొత్తం 9 మోడళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో 5 మోడళ్లను i5 ప్రాసెసర్ సపోర్ట్ తీసుకొస్తుండగా, మిగతా నాల్గింటిని i3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇవి పదో తరం ఇంటెల్ ప్రాసెసర్లు అయ్యే అవకాశం ఉంది. కొత్త ల్యాప్టాప్లు నోకియా బ్రాండింగ్ను కలిగి ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ చేత తయారుచేసినట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉండనున్నాయి. -
నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్
హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ రానుంది. నోకియా 5.4 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం చివరిలో బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం.(చదవండి: ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్) నోకియా 5.4 ఫీచర్స్ దీనిలో 6.4 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను అందించనున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. నోకియా 5.3 మాదిరిగానే నోకియా 5.4లో 13 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో రానుంది. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే ఈ మొబైల్ గూగుల్ ఎఆర్ కి కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ రెండు ఆస్ట్రేలియన్ రిటైల్ వెబ్ సైట్లలో కనిపించింది. దాని ప్రకారం 350 ఆస్ట్రేలియన్ డాలర్లుగా(సుమారు రూ.19,000) ఉండనుంది. -
రూ. 13,000లలో నోకియా లేటెస్ట్ ఫోన్
ముంబై, సాక్షి: ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ను ఎంపిక చేసిన కొన్ని యూరోపియన్ దేశాలలో సెప్టెంబర్లోనే నోకియా విజయవంతంగా ప్రవేశపెట్టింది. యూకేలో 3.4 నోకియా ఫోన్ ధర 130 పౌండ్లుకాగా.. దేశీయంగా సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. నోకియా స్మార్ట్ ఫోన్లలో 2.4 మోడల్, 5.3 మోడళ్ల ధరలు రూ. 10,400- రూ. 12,999 మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల మధ్యలో తాజా ఫోన్ 3.4 ధర ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!) ఇవీ ఫీచర్స్ నోకియా దేశీ వెబ్సైట్ వివరాల ప్రకారం నోకియా 3.4 మోడల్ మూడు కలర్స్లో లభ్యంకానుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 406 ఎస్వోసీ ప్రాసెసర్తో విడుదల కానుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ వరకూ అంతర్గత మెమరీను అందించనుంది. మైక్రో ఎస్డీకార్డ్ ద్వారా 512 జీబీ వరకూ మెమరీను పెంచుకునే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్ 10తో వెలువడనున్న ఈ స్మార్ట్ఫోన్కు రెండేళ్ల వరకూ అప్డేట్స్ లభించనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్కాగా.. యూఎస్బీ టైప్-సీ పోర్ట్తో చార్జింగ్ చేయవచ్చు. చదవండి: (హెల్మెట్ వాయిస్ కమాండ్స్తో ఇక బైకులు!) బిగ్ డిస్ప్లే నోకియా 3.4 ఫోన్ హెచ్డీ డిస్ప్లే కలిగిన 6.39 అంగుళాల తెరతో వెలువడనుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమరాలు ఉంటాయి. 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్తో వీటిని ఏర్పాటు చేసింది. సెల్ఫీలు తీసుకునేందుకు అనుగణంగా ముందుభాగంలో 8 ఎంపీ హొల్పంచ్ కటౌట్ కెమెరాను ఎడమవైపు కార్నర్లో ఫిక్స్ చేసింది. ఏఐ ఇమేజింగ్, పోర్ట్రయిట్ మోడ్, నైట్ మోడ్ తదితర పలు ఫీచర్లను అంతర్గతంగా ఏర్పాటు చేసిన కెమెరా యాప్ ద్వారా యూజర్లు వినయోగించుకోవచ్చు. నోకియా 3.4 స్మార్ట్ఫోన్ 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీలతోపాటు ఎఫ్ఎం రేడియో ఫీచర్లను సైతం కలిగి ఉంది. -
నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్
ఒకప్పుడు ఫీచర్ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్టాప్లు రానున్నాయి. గతంలో మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్టాప్లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్టాప్ నోకియా బుక్లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్టాప్లను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా బ్రాండ్తో హెచ్ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్టాప్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్లో గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దింతో మన దేశంలో తిరిగి అధికారికంగా ల్యాప్టాప్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) టిప్స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ల్యాప్టాప్లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలో రానున్నాయి. ఈ మోడళ్లు వచ్చేసి NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S. ఈ ల్యాప్టాప్లకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టు BIS వెబ్సైట్లో కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచాన్ని నోకియా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని నోకియామోబ్ వెబ్సైట్ తెలిపింది. ఇందులో ఐ5 ప్రాసెసర్తో ఐదు ల్యాప్టాప్ మోడళ్లను, i3 చిప్సెట్తో నాలుగు మోడళ్లను రూపొందించనట్లు అంచనా. ఈ పేర్లలో యుఎల్కు ముందు 10వ సంఖ్య ఉన్నందున ఈ ల్యాప్టాప్లు విండోస్ 10తో నడవనున్నాయి. మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన ఎన్ కేలు- నోకియా బ్రాండ్ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన ఐ5, ఐ3లు ప్రాసెసర్ను సూచిస్తున్నాయి. బిఐఎస్ వెబ్సైట్లోని లిస్టింగ్ ప్రకారం నోకియా ల్యాప్టాప్లను చైనా కంపెనీ అయిన టోంగ్ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసింది. నోకియా ఈ ల్యాప్టాప్లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన చేయలేదు. -
నోకియా 9.3 ప్యూర్వ్యూ లాంచ్ మళ్లీ వాయిదా
నోకియా 9.3 ప్యూర్ వ్యూ లాంచ్ మరోసారి వాయిదా పడింది. నోకియా యొక్క కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 2021 ప్రథమార్ధంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. నోకియా 9.3 ప్యూర్ వ్యూను ఎప్పుడు లాంచ్ చేస్తారో సరైన సమాధానాన్ని తెలపలేదు. రాబోయే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ ని ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లో తీసుకురానున్నట్లు సమాచారం. అందుకే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. (చదవండి: 3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్) నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్పెసిఫికేషన్లు ఎక్కువ శాతం విడుదల కాలేదు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉండనుంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లో హెచ్ఎండి గ్లోబల్ రాబోయే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్ డిసెంబర్లో లాంచ్ కానుంది. కాబట్టి ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ను అందించే బదులు స్నాప్ డ్రాగన్ 875ను అందిస్తే లేటెస్ట్ ప్రాసెసర్ తరహాలో ఉండే అవకాశం ఉంది. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీ స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్తో ఫోన్ల తయారీని జనవరిలో ప్రారంభించనున్నాయి. ఈ ఫోన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్, సాఫైర్ గ్లాస్ డిస్ ప్లేతో వస్తుందని కంపెనీ పేర్కొంది. 2021 ద్వితీయార్ధంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే దీని లాంచ్ మాత్రం అప్నట్నుంచి వాయిదా పడుతూనే ఉంది. -
నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్
ఇకపై చందమామపై మొబైల్ ఫోన్ వాడొచ్చు. అది కూడా 4జీ, 5జీ నెట్వర్స్తో.. నమ్మడానికి కాస్తా అనుమానంగా ఉన్నా ఇదే నిజం. చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామపై 4G సెల్యూలర్ నెట్ వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదట జాబిల్లిపై 4జీ/ఎల్నెటీఈ నెట్వర్స్ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా తన కాంటాక్ట్ అవార్డు ప్రకటనలో పేర్కొంది. చదవండి: బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా? To the moon! 🌕 We are excited to have been named by @NASA as a key partner to advance “Tipping Point” technologies for the moon, to help pave the way towards sustainable human presence on the lunar surface. So, what technology can you expect to see? (1/6) pic.twitter.com/wDNwloyHdP — Bell Labs (@BellLabs) October 15, 2020 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. అప్పటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. Our pioneering innovations will be used to build and deploy the first wireless network on the moon, starting with #4G/LTE technologies and evolving to #5G. (2/6) — Bell Labs (@BellLabs) October 15, 2020 నోకియా పరిశోధక విభాగం బెల్ ల్యాబ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్లెస్ ఆపరేషన్తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్వర్క్ను తీసుకోస్తోంది. ఈ నెట్వర్క్ కాంపాక్ట్ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను వినియోగించుకోవచ్చు. -
చంద్రుడిపై 4జీ, నోకియా-నాసా ప్లాన్
వాషింగ్టన్: జాబిలిపై నివాసం ఏర్పరుచుకోవడానికి కొన్ని దశాబ్ధాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయోగాల ద్వారా చంద్రుపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం మానవ నివాస యోగ్యంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై కొన్ని పనులు కూడా ప్రారంభించడానికి నాసా ఇప్పటి నుంచే ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా చంద్రునిపై 4జీ సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం నాసా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియాకు సహాయాన్ని అందిస్తోంది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించడానికి నోకియా చేపట్టిన ప్రాజెక్ట్కు నిధులు అందించనున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్ను తయారు చేయడానికి, దానిని నిర్వహించడానికి ఉపయోపడే సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే వీటిలో ఎక్కువ డబ్బును ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. ఇక అనుకున్నట్లు చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు. చదవండి: అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు -
నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు
సాక్షి, ముంబై: బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియాకొత్తగా ఆరు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తోంది. 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను సరసమైన ధరలలో విక్రయిస్తుంది. అక్టోబర్ 16నుండి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేసినట్టు నోకియా ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీల ధరలు 32 అంగుళాల టీవీ రూ .12,999 హెచ్డీ రెడీ 43 అంగుళాల టీవీ ధర రూ .22,999 ఫుల్ హెచ్డీ వేరియంట్ ధర రూ. 28,999 50 అంగుళాల టీవీ ధర రూ. 33,999 55 అంగుళాల ధర 39,999 రూపాయలు 65 అంగుళాల టీవీ ధర 59,999 రూపాయలు నోకియా బ్రాండ్ ఫ్లిప్కార్ట్ ద్వారా పూర్తిగా కొత్త స్మార్ట్ టీవీ శ్రేణికి విస్తరించడం తమ విజయానికి నిదర్శమని నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా తెలిపారు. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసినప్పటినుంచి తమ టీవీలకు స్పందన బావుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. పండుగ సీజన్ షాపింగ్ను ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు అందుబాటులో ధరల్లో నోకియా సహకారంతో వైవిధ్యమైన స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ అయ్యర్ అన్నారు. నోకియా స్మార్ట్ టీవీలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా స్పాటిఫై ఆఫర్లతో కలిసి లభిస్తాయి. ఈ నోకియా టీవీలు ఒన్కియో సౌండ్ ద్వారా ట్యూన్, సౌండ్బార్తో అమర్చబడి 6డీ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. ఆరు కొత్త నోకియా టీవీలు ఆండ్రాయిడ్ 9.0, క్వాడ్-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. -
నోకియా 5.3 విక్రయాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఇటీవల నోకియా ఆవిష్కరించిన బడ్జెట్ ఫోన్ ‘‘నోకియా 5.3’’ అమ్మకాలు సెప్టెంబర్ 1న ప్రారంభమైనట్లు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైస్ చైర్మన్ సన్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎఐతో శక్తివంతమైన క్వాడ్ కెమెరాను అందిచడంతో పాటు, స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్పై పనిచేసే తొలి నోకియా ఫోన్ ఇది. ఈ పండుగ సీజన్లో నోకియా అభిమానులు దీన్ని సొంతం చేసుకునేందుకు సుముఖత చూపుతారని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు. అమెజాన్, నోకియా.కామ్/ఫోన్ వెబ్సైట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ రూ.13,999గానూ, 6జీబీ ర్యామ్/ 64జీబీ వేరియంట్ ధర రూ.15,499గానూ ఉన్నాయి. జియో సబ్స్క్రైబర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4వేల విలువైన ప్రయోజనాలను రూ.349 ప్లాన్లపై పొందగలరు. అలాగే రూ.2వేల క్యాష్ బ్యాంక్, రూ.2వేల విలువైన వోచర్లను జియో అందిస్తుంది. (నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్ఫోన్లు) -
నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో నాలుగు కొత్త నోకియా స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, రెండు ఫీచర్ ఫోన్లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది. నోకియా 5.3 ఫీచర్లు 6.55-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 5.3 స్నాప్డ్రాగన్ 665 చిప్సెట్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ధర 4 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్కు రూ .13,999 6 జీబీ ర్యామ్ మోడల్కు రూ .15,499. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లు రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2,000 రూపాయల క్యాష్బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్లు ఉన్నాయి. నోకియా సీ 3 ఫీచర్లు 5.99అంగుళాల డిస్ప్లే 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమరీ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో 3040 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. 2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర 7,499 రూపాయలు 3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు ఒక సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ అందిస్తోంది. -
మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310
హైదరాబాద్: హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ తాజాగా నోకియా5310 ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్ప్రెస్ మ్యూజిక్ పేరుతో వచ్చిన ఫీచర్ ఫోన్ను మరింత అప్గ్రేడ్ చేసి అందిస్తున్నామని హెచ్ఎమ్డీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ. 3,399 అని తెలిపారు. ఈ ఫోన్లో ఇన్బిల్ట్ ఎమ్పీ 3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, వెనక వైపు ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన వీజీఏ కెమెరా. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 16 ఎమ్బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ, 1,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. ఈ నెల 23 నుంచి నోకియా ఇండియా ఆన్లైన్, అమెజాన్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 23 నుంచి రిటైల్ స్టోర్స్లో లభ్యం కానున్నది. -
నోకియా ఫీచర్ ఫోన్ : సరికొత్తగా నేడే
సాక్షి, ముంబై: ప్రముఖమొబైల్ తయారీ దారు నోకియా మరోసారి తన క్లాసిక్ ఫీచర్ ఫోన్తో వినియోగదారును ఆకర్షించనుంది. నోకియా 5310 (2020) ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా సరికొత్తగా నేడు (మంగళవారం) లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న కొత్త నోకియా 5310 ధర తెలియాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫీచర్లపై అంచనాలు: కొత్త నోకియా 5310 ఫీచర్ ఫోన్ 2007 వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. 2.4అంగుళాల స్క్రీన్ , డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ ర్యామ్, 32 జీబీ దాకా ఎక్స్ పాండబుల్ మెమరీ, వీజీఏ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
నోకియా మరో అద్భుతమైన స్మార్ట్టీవీ
సాక్షి, ముంబై : నోకియా సరికొత్త స్మార్ట్టీవీని నిన్న (గురువారం) భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ బిల్ట్ క్రోమ్కాస్ట్తో 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా జూన్ 8, మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక బ్లాక్ కలర్ ఆప్షన్లో లభ్యం. భారతీయ మార్కెట్లో కంపెనీ ప్రారంభించిన రెండవ స్మార్ట్టీవీ ఇది. దీని ధర రూ .31,999 గా ఉంచింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారితం. వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ, యూఎస్బీ, ఈథర్నెట్, 24 వాట్ల బాట్ ఫైరింగ్ స్పీకర్స్ (జేబీఎల్), డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ ప్రధాన ఆకర్షణగా వున్నాయి. ఏఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్, స్మార్ట్ టీవీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్కు సపోర్టు కూడా ఉంది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్) ఆఫర్ల విషయానికొస్తే, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ.1,500, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆరు నెలలు ఉచితంగా అందిస్తుంది. (ఫ్లిప్కార్ట్కు భారీ ఎదురుదెబ్బ) నోకియా 43 అంగుళాల స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ డిస్ప్లే 3840 × 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ డాల్బీ విజన్, ఎంఈఎంసీ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్ 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్ 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ చదవండి : అమెజాన్ డీల్ : ఎయిర్టెల్ క్లారిటీ -
ఎయిర్టెల్తో నోకియా రూ. 7,500 కోట్ల డీల్
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం ఫిన్లాండ్కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,500 కోట్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది సర్వీస్ ఏరియాల్లో ఎయిర్టెల్ కోసం నోకియా 5జీ రెడీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుత అవసరాల కోసం 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్ స్టేషన్లను నోకియా ఏర్పాటు చేస్తుంది. స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసుకోవడానికి అనువుగా ఇవి ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్టెల్ నెట్వర్క్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని, అలాగే భవిష్యత్లో 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికం సంస్థల సమాఖ్య జీఎస్ఎంఏ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం మార్కెట్గా భారత్ ఉంది. 2025 నాటికి 8.8 కోట్ల దాకా 5జీ కనెక్షన్లు ఉంటాయని అంచనా. చదవండి: యాక్సిస్ బ్యాంక్ నష్టాలు రూ.1,388 కోట్లు