Osmania hospital
-
30 ఏళ్ల కల సాకారమవుతోంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి పట్టుదలతో 30 ఏళ్ల కల సాకారమవుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉస్మానియా ఆస్పతి భవన నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆస్పత్రి నమూనా ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి.. అంతర్జాతీయ బ్రాండ్అనంతరం గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. వివిధ రకాల కేసులు కోర్టుల్లో ఉండటం వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. అఫ్జల్గంజ్ ఉస్మానియా ఆస్పత్రి అంటే ఒక అంతర్జాతీయ బ్రాండ్..ప్రజల ఆరోగ్యానికి భరోసా, అటువంటి ఆస్పత్రిని ఈ ప్రాంతానికి దగ్గర్లోనే నిర్మించాలని గోషామహల్ గ్రౌండ్ను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా 22 ఎకరాల్లో ఉందని, కొత్త భవన సముదాయానికి 26.32 ఎకరాలు కేటాయించామని, మరో 11 ఎకరాలు గ్రౌండ్ కోసం విడిచిపెట్టామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, రెసిడెన్స్, ఆడిటోరియం, అకాడమీ అని ఐదు భాగాలుగా విభజించామన్నారు.రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేసి 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉస్మానియా సంబంధిత 9 ఆస్పత్రులు, మరో 8 కొత్త డిపార్ట్మెంట్లు కలిపి మొత్తం 40 విభాగాలు ఇక్కడ పనిచేస్తాయని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ వ్యయం రూ.2,700 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వైపులా విశాలమైన రహదారులు నిర్మిస్తామని, చిరు వ్యాపారులకు నష్టం లేకుండా అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాటసారులకు ఇబ్బందులు లేకుండా స్కై వాక్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవల కోసం హెలీప్యాడ్ను నిర్మించనున్నామన్నారు. ఈ శాసనసభలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారని, వారందరికీ ఈ ఆస్పత్రిపై ఆరాటం ఉందన్నారు. -
ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ
-
గోషామహల్ లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై పునరాలోచన చేయాలన్న పురుషోత్తం
-
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మా'నయా' ఆస్పత్రి
-
సకల హంగులతో ఉస్మానయా
సాక్షి, హైదరాబాద్: కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి భవనానికి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ లెవల్ పార్కింగ్ మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్పేషంట్, అవుట్ పేషంట్ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యంతోపాటు లాండ్ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది. సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్ స్టేషన్, పోలీసు అవుట్ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, గరŠల్స్ హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ బొంగు రమేష్ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.వ్యతిరేకిస్తున్న స్థానికులు!నిజానికి పురాతన భవనం కూల్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుత ప్రాంగణంలోనే మరో కొత్త భవనం నిర్మించేందుకు అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కులీకుతుబ్షా భవనం నుంచి ధోబీఘాట్ వరకు 8 ఎకరాల విస్త్రీర్ణం అందుబాటులో ఉందని, ఇక్కడ రెండు భారీ టవర్లు నిర్మించవచ్చని అంటున్నారు. ఇందుకు భిన్నంగా చుట్టూ ప్లైవుడ్ గోదాములు, ఇరుకైన రోడ్లతో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంలో ఉస్మానియా కొత్త భవనం నిర్మించడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు.ఇక్కడ ఆస్పత్రి నిర్మాణాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టుకు ప్రభుత్వం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 104 ఎకరాలు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో కోర్టు రాజేంద్రనగర్కు తరలి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు మూసీపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఈ రెండు వైపులా ఉన్న ఈ రెండు చారిత్రక భవనాలను అనుసంధానించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. -
గోషామహల్కు ఉస్మానియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. గోషామహల్లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉన్న దాదాపు 32 ఎకరాల్లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని, ఇందుకు గాను వెంటనే ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులపై తొలిసారిగా మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్పీడ్ ప్రణాళికలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంతో పాటు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లకు తగినట్టుగా కొత్త ఆస్పత్రి‘రాబోయే 50 సంవత్సరాల అవసరాలను అంచనా వేసి దానికనుగుణంగా కొత్త ఆసుపత్రి డిజైన్ను రూపొందించాలి. ఆసుపత్రి నలుదిశలా రోడ్లు ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలి. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలి. కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు మాత్రమే ప్రధానం కాదు. ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండాలి. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అందుబాటులోకి రావాలి. ఇందుకు గాను అనుభవజు్ఞలైన ఆర్కిటెక్ట్లతో డిజైన్లు తయారు చేయించాలి. గోషామహల్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేసినందుకు గాను పోలీసు విభాగానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి. పేట్లబురుజులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీల చుట్టూ ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. గోషామహల్లోని పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్సును అక్కడకు తరలించేలా చూడాలి. రాష్ట్రంలో కొత్త ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. 15 నర్సింగ్ కళాశాలల భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలి. కళాశాలలను తాత్కాలికంగా అద్దె భవనాల్లో నిర్వహించాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా హెరిటేజ్ కట్టడాలు గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎస్హెచ్జీలకు కొత్త భవనాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు భవనాలు లేని 22 జిల్లాల్లో కొత్త భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి జిల్లా సమాఖ్యకు ఎకరం భూమి కేటాయించేందుకు అంగీకరించిన సీఎం.. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని, మహిళా శక్తి సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను అక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ తరహాలో వివిధ రకాల ఉత్పత్తులను అక్కడ అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
ఏదయా.. ఉస్మా‘నయా’
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణంతో పాటు ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పేద రోగుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినదించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే సచివాలయ నిర్మాణం ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. పాతబస్తీలోని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒవైసీ సోదరులు ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అయిదు రోజుల పాటు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు పల్లం ప్రవీణ్, బొంగు రమేష్, అజ్మీరా రంగా, లాలూ నాయక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. – అఫ్జల్గంజ్ -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
రవీందర్కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన గవర్నర్ తమిళసై (ఫొటోలు)
-
మా మంచి పనులు ఎందుకు కన్పించవు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధిలాగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్ కోఠి లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం. భవన నిర్మాణంపై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కేసీఆరే. 2015 జూలైలో సీఎం ఆసుపత్రిని సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారు. అయితే ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అందువల్ల అది ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు, పురావస్తు శాఖ డైరెక్టర్తో ప్రభుత్వం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కోర్టుకు ఇదే విషయం చెప్పింది. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. అది రాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న మంచి పనులు గవర్నర్కి కని పించవా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాం.. అది గవర్నర్కి కనిపించదు. ‘‘మంచి కనబడదు.. మంచి వినబడదు.. మంచి చూడం’’అన్నట్టుగా గవర్నర్ తీరు ఉంది..’అని హరీశ్రావు విమర్శించారు. చెడు మాత్రమే చూస్తామంటే ఎలా? ‘గవర్నర్ తీరులో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైద్యురాలిగా గవర్నర్ వైద్య ఆరోగ్యశాఖ కష్టాన్ని గుర్తించడం లేదు. 2014తో పోల్చితే పరిస్థితి మారింది. నీతి ఆయోగ్ నివేదికలో వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నిమ్స్లో పడకల సంఖ్యను 1,500కు పెంచాం. కొత్తగా 2,000 పడకలతో విస్తరిస్తున్నాం. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను తగ్గించాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం. దేశంలో 100 శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. కంటి వెలుగు చాలా బాగా చేశాం. ఇవేవీ గవర్నర్ గుర్తించరు. ప్రశంసించడానికి మనసు రాదు. అభినందిస్తూ కనీసం ఒక ట్వీట్ కూడా చేయరు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దవాఖానకు అనే స్థాయికి చేర్చాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచాం. గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారు. బస్తీ దవాఖానాలను కూడా నీతి అయోగ్ ప్రశంసించింది. ఇవేమీ గవర్నర్కు ఎందుకు కనిపించండలేదు? ఎందుకు అభినందించరు? ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్గానైనా గవర్నర్ అభినందించాలి కదా? వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అలా కాకుండా చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం అన్నట్టుగా వ్యవహరించడం గవర్నర్కు తగదు. బీజేపీలా రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం..’అని హరీశ్రావు పేర్కొన్నారు. -
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో పారా మెడికల్ స్టాఫ్ ఆందోళన
-
సీజే ఉజ్జల్ భుయాన్: చలించి... మానవత్వాన్ని చాటి...
చార్మినార్(హైదరాబాద్): రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రాంతం అది. రెండు నెలలుగా ఓ మతిస్థిమతం లేని వ్యక్తి ఆ ప్రాంతంలోని రోడ్డుపై తిండిలేక దీనావస్థకు చేరాడు. నడలేని స్థితిలో ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అతన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మదీనా సర్కిల్ ఫుట్పాత్పై గురువారం అతన్ని చూసి చలించిపోయారు. చింపిరి తల, మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాదికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్దన్రెడ్డిని సీజే ఆదేశించారు. స్పందించిన గోవర్దన్రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కె.మురళీమోహన్ను కోరారు. అలాగే ఇదే విషయంపై సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యారా సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురళీమోహన్తో పాటు మీర్చౌక్ పోలీసులు అక్కడికి వచ్చి అతనికి కొత్త దుస్తులు వేసి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్గా గుర్తింపు... అతన్ని ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన గనెగోని శ్రీనివాస్గా గుర్తించారు. అవివాహితుడైన అతనికి ప్రవీణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు సోదరులున్నారన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ప్రవీణ్ జీఎస్ఐ కార్యాలయంలో పని చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఒక పేపర్పై రాసి చూపించాడు. కుటుంబ తగాదాల కారణంగా తాను ఇంటి నుంచి వచ్చేసి 2 నెలలుగా మదీనా సెంటర్ వద్ద ఉన్నానని పేర్కొన్నాడు. -
మళ్లీ ‘కు.ని.’ కలకలం.. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఘటన?
సాక్షి, హైదరాబాద్/దూద్బౌలి/షాద్నగర్రూరల్: పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ ప్రసవానంతరం తీవ్ర అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో బంధువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిందంటూ గురువారం అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మహిళకు సిజేరియన్ మాత్రమే జరిగిందని, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయలేదని ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రెండురోజులు ఆరోగ్యంగానే.. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్నగర్ మొగలిగిద్ద గ్రామానికి చెందిన సురేందర్ భార్య అలివేలు (26) ఈ నెల 4వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. శిశువు కాళ్లు అడ్డం తిరిగి ఉండటంతో వై ద్యులు సిజేరియన్ ఆపరే షన్ నిర్వహించగా మగ శిశు వుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2 రోజులు ఆరోగ్యంగానే ఉన్న అలివేలుకు జ్వరం వచ్చి తగ్గింది. 7వ తేదీన తిరిగి జ్వరం, వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గు రి కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందింది. అయితే పేట్లబురుజు ఆసు పత్రిలో సిబ్బంది.. ప్రసవానంతరం అలివేలుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు భర్త సంతకాలు తీసుకోవడంతో, ఆ ఆపరేషన్ వల్ల నే ఆమె మరణించిందంటూ బంధువులు ఆ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. కు.ని ఆపరేషన్ జరగలేదు: ఆసుపత్రి సూపరింటెండెంట్ అలివేలుకు వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి తెలిపారు. ప్రసవానంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, అలివేలుకు కు.ని శస్త్రచికిత్స చేయలేదని స్పష్టం చేశారు. అయితే రెండురోజుల తర్వాత అనారోగ్యానికి గురైందని, ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. అలివేలుకు కోవిడ్ పరీక్ష కూడా నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే రోజు 40 ప్రసవాలు కాగా.. అందులో 16 ఆపరేషన్లు జరిగినట్లు ఆమె తెలిపారు. అలివేలు మృతికి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అయి ఉండవచ్చునని ఉస్మానియా వైద్యులు పేర్కొన్నారు. మహిళ మృతి కలకలం సృష్టించడంతో గురువారం డీఎంఈ రమేశ్రెడ్డి ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. కు.ని ఆపరేషన్ కారణం కాదు ఆ మహిళ డెలివరీ కోసం ఆసుపత్రిలో జేరింది. సిజేరియన్ సెక్షన్లో వైద్యులు ఆపరేషన్ చేశారు. అంతే తప్ప ఆమెకు కు.ని ఆపరేషన్ చేయలేదు. అయితే రెండవరోజు కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. – డా.కె.రమేశ్రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు -
Hyderabad: ఉస్మానియా.. ఆస్పత్రికి పనికిరాదు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉంది. ఇప్పడున్న పరిస్థితుల్లో ఆస్పత్రి కొనసాగింపునకు పనికిరాదు. పునరుద్ధరణ, మరమ్మతులు చేస్తే భవన జీవితకాలం కొన్నేళ్లు పెంచొచ్చు. ఆ తర్వాత ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. వారసత్వ భవన జాబితాలో ఉన్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆక్సిజన్ పైప్లైన్లు, గ్యాస్ లైన్లు, ఏసీలు, వాటర్ పైప్లైన్ల లాంటివి ఏర్పాటు చేస్తే దాని భవన ధృడత్వం మరింత దెబ్బతింటుంది’.. ఇదీ ఉస్మానియా ఆస్పత్రి భవన ధృడత్వంపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక. కాగా, ఉస్మానియా ఆసుపత్రిని అదే భవనంలో కొనసాగించాలని కొందరు.. ఆ భవనంలో వద్దని మరికొందరు కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్లు) దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలు, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్లతో కమిటీ వేసింది. వరంగల్ ఎన్ఐటీ నిపుణుల సాయంతో ఆస్పత్రి భవనాన్ని గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కమిటీలో అందరూ స్టేట్ ఆఫీషియల్స్ ఉండటంతో హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కెయాలజీ ఆఫ్ ఇండియా ఎస్ఈ, స్టెడ్రంట్ టెక్నోకక్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్లకు కమిటీలో స్థానం కల్పించింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. నివేదిక అధ్యయనానికి గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం.. నివేదిక ప్రతులను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ అందజేయాలని సూచించింది. దానిపై అధ్యయనం చేసి.. ఆగస్టు 25కు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. -
8 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి.. పురిటి నొప్పులతో తల్లడిల్లి.. కూతురికి జన్మనిచ్చిన ఆ తల్లి.. చావుబతుకుల్లో ఉన్న పేగుబంధానికి తన కాలేయాన్ని దానం చేసి మరోసారి ఆమె పునర్జన్మనిచ్చింది. ఉస్మానియా, నిలోఫర్ వైద్యుల బృందం ఎనిమిది నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే నాలుగోది కాగా దేశంలోనే మొదటిదని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రేమలత అంగన్వాడీ వర్కర్. భర్త నారాయణ కూలీ పనులు చేస్తుంటారు. వీరిది మేనరికపు వివాహం. గతంలో ఈ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించింది. వీరి రెండో కూతురు ఎనిమిది నెలల చిన్నారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్, చిన్నారికి కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. తల్లి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేకరించి గత నెల 17న దాదాపు 18 గంటల పాటు శ్రమించి చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. సాధారణంగా మేనరికపు పెళ్లి, అనువంశికంగా ఇలాంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయని వైద్యులు తెలిపారు. మంత్రి హరీశ్రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సహకారంతోనే చిన్నారికి కాలేయ మార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు. బిడ్డ కోసం కాలేయ దానం చేసిన తల్లి ప్రేమలతను వైద్యులు సన్మానించారు. (క్లిక్: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ..) -
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన.. వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
-
ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. చాదర్ఘాట్లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
మా అనుమతి లేకుండా కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: తమ అనుమతి లేకుండా ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని పురాతన భవనాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవనాల పటిష్టతపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఐఐటీ హైదరాబాద్ విభాగం డైరెక్టర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) హైదరాబాద్ విభాగం అధిపతి లేదా ఆయన సూచించిన అధికారిని కూడా కమిటీలో సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో చారిత్రక పురాతన హెరిటేజ్ కట్టడాలను కూల్చివేయకుండా ఆదేశించాలని కొందరు, పురాతన భవనాలను కూల్చి నూతన భవనాలను నిర్మించేలా ఆదేశించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
థర్డ్వేవ్ వచ్చినా కట్టడి చేద్దాం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలని, దీనిపై రోజువారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, థర్డ్వేవ్ సన్నద్ధతపై మంగళవారం బీఆర్కే భవన్లో హరీశ్రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. థర్డ్వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27,996 పడకలకుగాను 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తయిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో ఔషధాల నిల్వలను కచ్చితంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా.. అఫ్జల్గంజ్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఆధునిక సౌకర్యా లతో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్రావు చెప్పారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్, సీటీ స్కాన్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, ఫరూఖ్ హుసేన్లతో కలసి ప్రారంభించారు. తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో సిబ్బంది కొరత, ఏఏ పరికరాలు కావాలనే విషయమై ఉన్నతాధికారులతో చర్చించా రు. ఉస్మానియాతోపాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులను అభివృద్ధి చేసి ఆరోగ్య తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు హరీశ్రావు చెప్పారు. గాంధీ ఆసుపత్రితోపాటు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మరో నాలుగు క్యాథ్ల్యాబ్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ఉస్మానియా ఆసుపత్రికి ఎన్ఏబీహెచ్ (జాతీయ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల గుర్తింపు మండలి) గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తున్నాం. దీనివల్ల ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు అందుతాయి. దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మార్చురీ నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం’ అని హరీశ్రావు చెప్పారు. గోవాతోపాటు ఇతర దేశాల్లోని అత్యాధునిక మార్చురీలను సందర్శించి అక్కడి పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను ఆదేశించారు. -
ఆందోళనలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది
-
Hyderabad: ఖరీదైన కాస్మొటిక్ సర్జరీ ఇక ఉస్మానియాలో కూడా..
సాక్షి, అఫ్జల్గంజ్(హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన కాస్మొటిక్ సర్జరీని ఉస్మానియా వైద్యులు ఉచితంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినికి కుడివైపు రొమ్ము పెరగకపోవడంతో ఆగస్టులో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. అమ్మాయికి వైద్యులు ఓపీ ద్వారా చికిత్స అందించి మళ్లీ రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఈ నెల మొదటి తేదీన ఆస్పత్రికి రాగా అదేరోజు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి నేతృత్వంలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, డాక్టర్ అశ్వన్ కిషోర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ మధులిక, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ పావని, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఆనంద్ బృందం దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి ఆగ్మెంటేషన్ మమోప్లాస్టీ శస్త్ర చికిత్సను సిలికాన్ ఇన్ప్లాంట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ను అమర్చి పూర్తి చేశామన్నారు. శస్త్ర చికిత్స జరిగి పదిహేను రోజులు గడిచిందని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్ర చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఉస్మానియాలో అన్నో అభివృద్ది పనులు జరుగుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చదవండి: రాజు మృతి: సింగరేణి ఊపిరి పీల్చుకుంది -
ఆసుపత్రిని కూల్చవద్దంటూ నిరసన చేపట్టిన వామపక్షాలు
-
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కిన్ బ్యాంక్: కాలిన చోట చర్మం వేస్తారు
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!
సాక్షి, అఫ్జల్గంజ్: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది. వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్పై ఉన్న పేషంట్కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్కు తరలిస్తామని తెలిపారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
కొత్తగా నిర్మిస్తారా.. పునర్నిర్మిస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నాలుగు వారాల్లో ఒక వైఖరి వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అయితే వారసత్వ కట్టడాలు కూల్చవద్దనే వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మించాలన్న పిల్స్పై గురువారం హైకోర్టు విచారణ చేసింది. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దన్న పిల్స్ను పరిశీలించి ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలన్ని కలిపి విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. -
‘పేషెంట్ చనిపోయారనేది అవాస్తవం’
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగి చనిపోయారనేది అవాస్తవమని ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుష్మా అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఓ రోగి చనిపోయారని, దీంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వమనేసరికి ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఆస్పత్రిపై దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా కష్ట సమయంలో ఎంతో శ్రమిస్తున్న వైద్యులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎంతో మంది పేద రోగులు ఆస్పత్రికి వస్తున్నారని, ఇలాంటి సమయంలో తప్పుడు ప్రచారం చేసి వారిని అయోమయంలో పడేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ వాహనం ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: ప్రమాదవశాత్తు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ వి షాద ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మంగళహాట్ గుఫ్పా నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ వృత్తిరీత్యా మెకానిక్. ఆయన భార్య రేణుక. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు హర్షవర్ధన్ బుధవారం మధ్యాహ్నం షాపు వద్ద భోజనం తిని ప్లేటు కడుగుతున్నాడు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం టైర్లల్లో గాలి నింపించేందుకు వచ్చింది. అందులో డ్రైవర్ భగవంత్రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్ ఉన్నాడు. వాహనాన్ని వెనక్కు తీసే క్రమంలో డ్రైవర్ బాలుడిపైకి ఎక్కించేశాడు. అక్కడి వారు కేకలు వేయడంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపేశాడు. స్థానికుల సాయంతో వాహనాన్ని పైకి ఎత్తి బాలుడిని తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్/అఫ్జల్గంజ్: తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ రవీంద్రభారతి రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి కూతవేటు దూరంలోని రవీంద్రభారతి సమీపంలో ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీదకు వచ్చిన వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాగులు అనే ఆ వ్యక్తి ఒంటిపై మంటల్ని ఆర్పారు. ఆ వెంటనే అతడిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 63 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్కు చెందిన బైకెలి నాగులు (55) చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పాల్గొనడమే కాకుండా ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నాడు. చాలా కాలం కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. నాగులు కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్కుమార్ ఇద్దరూ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఈసీఐఎల్ పరిధిలోని బండ్లగూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. నాగులు బంజారాహిల్స్ రోడ్నం–2లోని ఎంవీ టవర్స్లో వాచ్మన్గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కాగా, అతను గురువారం ఉదయం ఓ బాటిల్లో పెట్రోల్ పోయించుకొని రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా.. అది ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వమే తన కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకోవాలని నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇదిలా ఉండగా నాగులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అతడి శరీరం దాదాపు 62 శాతం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయని, తెలంగాణ కోసం తన ప్రాణం కూడా ఇస్తానని అనేవాడని నాగులు భార్య స్వరూప తెలిపింది. పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ఉస్మానియాలో గాలిన గాయాలతో ఉన్నాడని చెప్పగానే తట్టుకోలేక పోయానని స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తకు మంచి చికిత్స అందించాలని కోరింది. తన భర్త తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని తరచూ బాధ పడేవాడని, తమ కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మంత్రి ఈటల వాకబు.. అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారని, నాగులుకు మెరుగైన చికిత్స అందించాలని తనకు సూచించారని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. -
చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు నిర్మించాలి
సాక్షి, హైదరాబాద్: ‘హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, ఆర్ట్స్ కళాశాల, ట్యాంక్బండ్ లాంటి నిర్మాణాలను చూసినప్పుడల్లా నిజాం గుర్తుకొస్తారు. నిజాం పాలన అంతమై 70 ఏళ్లు గడిచినా ఆ కట్టడాలను ఇప్పటికీ తల్చుకుంటాం. ఇలాంటి పది కాలాల పాటు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలి’అని హైకోర్టు సూచించింది. ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణాలను చేపట్టాలా? లేదా? ఆ భవనాన్ని అలాగే ఉంచి ఖాళీ స్థలంలో నూతన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించాలా? అన్నది లోతుగా విచారించి తేల్చాల్సిన అంశమని స్పష్టం చేసింది. ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్ భవనాన్ని కాపాడాలని కొందరు, కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యా లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఆస్పత్రి ఆవరణకు సంబంధించిన గూగుల్ మ్యాప్, భవనాల సైట్ ప్లాన్ను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమర్పించారు. ఈ మ్యాప్లను పరిశీలిస్తే ఆస్పత్రి భవన సముదాయంలో ఖాళీ స్థలాలు ఏమీ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. 26 ఎకరాల్లో ఆస్పత్రి విస్తరించి ఉందని, అయితే ప్రభుత్వం మా త్రం 16.2 ఎకరాల్లో మాత్రమే ఉందని ఎలా చెబుతుందో అర్థం కావడం లేదని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి అభ్యంతరం వ్య క్తం చేశారు. 2013లో ప్రభుత్వం నియమిం చిన క్షేత్రా డెవలపర్స్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మ్యాప్లు, సైట్మ్యాప్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని ఏజీకి ధర్మాసనం సూచించింది. 6 ఏళ్ల నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాలో వెంటనే నూతన భవనాల నిర్మాణం చేపట్టేలా ఆదేశించాలంటూ ఓ పిటిషనర్ తర ఫున న్యాయవాది సందీప్రెడ్డి హైకోర్టుకు నివే దించారు. ఈ మేరకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘తాజ్మహాల్ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పో లీసు ట్విన్ టవర్స్ను ఆరేళ్ల నుంచి నిర్మిస్తు న్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికిప్పుడు నూతన భవనాల నిర్మాణం ప్రారంభించినా కనీసం పూర్తి కావడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. కొత్త నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలన్న దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. కేసులను భౌతికంగా విచారించేందుకు కోర్టు సిద్ధంగా ఉన్నా న్యాయవాదులు హాజరు కావడానికి జంకుతున్నారు. భౌతిక కోర్టులు ప్రారంభించాలని కోరిన న్యాయవాదులే ఇప్పుడు మరో 4 వారాలపాటు ఆన్లైన్లోనే కేసులను విచారించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భౌతికంగా ఈ కేసును విచారించాల్సిన అవసరముంది’ అని పేర్కొంటూ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. -
రోగులకు ఆ..‘పరేషాన్’
చేవెళ్లకు చెందిన సత్యనారాయణ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు రాడ్డు అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కాలులోని రాడ్డును తీసివేస్తామని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్గా మార్చడంతో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నీ వాయిదా వేసినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రాడ్డు తొలగింపు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. బాలాపూర్కు చెందిన రవీందర్రెడ్డి కొంతకాలంగా తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్తో సతమతమవుతున్నాడు. చికిత్స కోసం నిమ్స్ వైద్యులను సంప్రదించగా ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, సంబంధిత విభాగం వైద్యులు క్వారంటైన్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన అనేక మంది బాధితులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది రోగులు వచ్చేవారు. రోజుకు సగటున 250 సర్జరీలు జరిగేవి. ఇటీవల ప్రభుత్వం ఈ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్గా మార్చడంతో సాధారణ రోగులకు చికిత్సలు అందడం లేదు. గాంధీ, కింగ్కోఠి, జిల్లా ఆస్పత్రుల్లో మేజర్, మైనర్ సర్జరీలు చేయించుకుని ఫాలో అప్ చికిత్సలు, మందుల కోసం వచ్చే రోగులు ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారు. నిమ్స్ సహా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, ఆపరేషన్ థియేటర్ల కొరత ఉంది. అక్కడ అత్యవసర చికిత్సలు మినహా ఎలక్టివ్ చికిత్సలు చేయకపోవడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోవిడ్.. క్వారంటైన్ సెలవులు ఉస్మానియా ఆస్పత్రిలోని పాత భవనంలోకి ఇటీవల వర్షపునీరు చేరడంతో అక్కడి పడకలను ఖాళీ చేసి, కులీకుతుబ్షా, ఓపీ బ్లాక్లకు తరలించారు. ఆస్పత్రికి వస్తున్న అనేకమంది అసింప్టమేటిక్ కోవిడ్తో బాధపడుతున్నారు. వీరిని ముట్టుకోవడంతో వైద్యులు, టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇలా 212 మంది వైద్యులకు కోవిడ్ సోకింది. వైద్యుల్లో 60 శాతం మంది వి«ధుల్లో ఉంటే.. 40 శాతం మంది క్వారంటైన్ సెలవుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటుండగా... మరికొంత మంది తాత్కాలికంగా మందులపై నెట్టుకొస్తున్నారు. పాతభవనం ఖాళీ చేయడంతో ఆపరేషన్ థియేటర్ల సమస్య తలెత్తింది. పాతభవనంలోని రోగులకు ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసినప్పటికీ పోస్టు ఆపరేటివ్ వార్డులకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం, ఉన్న ఆపరేషన్ థియేటర్లు ఇతర చికిత్సలతో బిజీగా మారడంతో అత్యధిక రోగులకు చికిత్సలు అందడంలేదు. -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం
అఫ్జల్గంజ్: సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం పడింది. ఇన్నాళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాత భవనంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పుడేం జరుగుతుందోననే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు పాత భవనంలోకి నీరు చేరడంతో రోగులు,సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పాతభవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి పరిపాలనా విభాగం అధికారులు భవనాన్ని ఖాళీ చేసి సోమవారం తాళం వేశారు. పాత భవనంలోని పలు వార్డులను కులీకుతుబ్షా భవనంలోకి సర్దుబాటు చేశారు. పాతభవనంలోనే ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనికి మార్చారు. వెంటనే నూతన భవనం నిర్మించాలి.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం వేయడంతో ఇక్కడి రోగులను ఇతర భవనాల్లోని వార్డుల్లోకి సర్దుబాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచాల కొరత ఏర్పడుతుండడంతో అవస్థలు పడుతుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని కోరారు. -
ఉస్మానియాలో హెరిటేజ్ భవనాలున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెరిటేజ్ భవనాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనం ప్రమాదకరంగా ఉందని, దాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి రోగులను నూతన భవనంలోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జారీ చేసిన మెమోను ధర్మాసనానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ సమర్పించారు. కొన్ని భవనాలు మాత్రమే హెరిటేజ్ భవనాల కేటగిరీ కిందకి వస్తాయని వాటిని వదిలేసి గతేడాది ఆగస్టు నుంచి ఇతర భవనాలకు మరమ్మతులు (రెనోవేషన్) చేస్తున్నామని తెలిపారు. 2019 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ప్రత్యేక బృందం సందర్శించి నివేదిక ఇచ్చిందని, దాన్ని ధర్మాసనం పరిశీలన కోసం సమర్పించామని వెల్లడించారు. ‘హెరిటేజ్ భవనం కూల్చరాదని ఒకరు, ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ భవనమా.. కాదా? ఎంత భాగం హెరిటేజ్ కేటగిరీ కిందకు వస్తుంది? ఇవేవీ తెలియజేయకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తాం. ప్రస్తుతం అక్కడ చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించండి’ అని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం మూసివేత
-
ఉస్మానియా పాత భవనానికి సీల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్ వేయాలన్నారు. ఓల్డ్ బ్లాక్లోని డిపార్ట్మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. (కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి) కాగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పేషెంట్లు, వైద్యులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు) -
వెంటిలేటర్పై ఆస్పత్రి
-
ఉస్మానియాలో రిపోర్టుల తారుమారు!
బషీరాబాద్: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చిం దని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయా డు. అనుమానం వచ్చి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్గా తెలిం ది. ఈ ఘటన హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ విద్యావాలంటీర్. ఈ నెల 3న అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతడికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. ఈ నెల 7న రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రిపోర్టులో ఫోన్ నంబర్, ఇంటి పేరు తప్పు గా ఉండటంతో అనుమానం వచ్చి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నెగెటివ్గా తేలింది. అతడికి కరోనా లేదని, నిమోనియా తో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలి పారు. ఇదే విషయమై ఉస్మానియా వైద్యులను కుటుంబసభ్యులు నిలదీయగా పొరపాటున తారుమారయ్యాయని చెప్పి చేతులు దులుపుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, సమయానికి చికిత్స అందక ఆరోగ్యం క్షీణించిందని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని, రూ.11 లక్షలు ఖర్చయిందని, ఇంకా రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. దాతలు తమను ఆదుకోవాలని కోరారు. -
ఉస్మానియాలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి రోగులను మురుగు ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ శిథిలమవడంతో వర్షపునీరు వెళ్లే మార్గంలేక అంతర్గత రోడ్లపైనే పొంగిపొర్లుతోంది. సెక్యూరిటీ ఆఫీసు సమీపం నుంచి పాతభవనంలోకి నీరు చేరుతోంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం గురువారం ఆస్పత్రికి చేరుకుని తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది. వార్డులోకి చేరిన నీటిని పాతభవనం డోమ్ గేట్ ద్వారా బయటికి ఎత్తిపోసింది. తడిసిన పడకలు, పీపీఈ కిట్బాక్స్లను ఆరబెట్టింది. అయితే, డ్రైనేజీ లైన్లను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మళ్లీ వర్షం వస్తే వార్డుల్లోకి వరదనీరు చేరే ప్రమాదముందని పాతభవనంలోని రోగులు, వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నవారందరినీ గురువారం ఫస్ట్ఫ్లోర్కు తరలించారు. కానీ, ఆయావార్డులను శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంగణంలో ఉన్న మరో భవనం(కులీకుతుబ్ షా) ఐదో అంతస్తులోకి కూడా వర్షపునీరు లీక్ అవుతోంది. దీంతో ఆ వార్డులో ఉన్న డయాలసిస్ యంత్రాలపై నీరుపడి పాడైపోయాయి. ఈ భవనంపై అదనపు అంతస్థు నిర్మిస్తుండటం, నిర్మాణ సమయంలో స్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడటంవల్ల వర్షపునీరు కిందికి ఇంకుతున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. -
వాన నీటిలోనే ఉస్మానియా ఆసుపత్రి
-
ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుడు మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. నేరేడ్మెట్ సాయినగర్కు చెందిన గొల్ల శ్రీధర్ శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీధర్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలో తనకు శ్వాస ఆడటం లేదని, ఆక్సిజన్ పెట్టమని చెప్పినప్పటికీ ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబ సభ్యులకు వివరించినట్లు ఒక ఆడియో బయటికి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్లే శ్రీధర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేద ని, ఆ పేరుతో ఉన్న యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి మృతుల జాబితాలో కూడా లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు. -
ఉస్మానియాలో నిర్వాకం.. బతికుండగానే
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రులు వరుస శవ పంచాయితీలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకమొకటి బయటపడింది. బతికున్న మహిళ చనిపోయినట్టుగా ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఇటీవల ఉస్మానియాలో చేరారు. వారిలో ఒకరు కరోనాతో, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా బాధితురాలు మృతి చెందింది. అయితే, శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నతన తల్లి ఎలా చనిపోయిందని బాధితురాలి కూతరు నిలదీసింది. తప్పుడు సమాచారం ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. (చదవండి: గాంధీలో మరో శవ పంచాయితీ) (వేములవాడలో గ్యాంగ్వార్ను తలపించే ఘటన) -
మందుల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మాస్పత్రులు దగా పడుతున్నాయి. రోగుల అవసరాలతో సంబంధం లేని, గడువు సమీపించిన నాసిరకం మందులు కొనుగోలు చేయడం, తీరా అవి ఎక్స్ఫైరీ అయినట్లు పేర్కొని గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం ఇటీవల పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఖరీదైన మందుల సంగతేమో గానీ, బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు మందుల చీటీ పట్టుకుని ప్రైవేటు ఫార్మసీలను ఆశ్రƬంచాల్సిన దుస్థితి తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల మందులకు భారీగా బడ్జెట్కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులతో కొనుగోలు చేసినా.. రోగుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేక పోతున్నారు. ఫలితంగా ఇన్పేషెంట్లతో పాటు అవుట్ పేషెంట్లకు మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కొరతపై ఉస్మానియా ఆస్పత్రి అధికారులు ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు లేఖ రాయడం గమనార్హం. మందుల సరఫరా బంద్ ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2 వేల మంది రోగులు వస్తుండగా, ఇన్పేషెంట్ వార్డుల్లో వేయి మందికి పైగా చికిత్స పొందుతుంటారు. చిన్న, పెద్దా కలిపి ఇక్కడ రోజుకు 150–200 చికిత్సలు జరుగుతుంటాయి. సర్జకల్ డిస్పోజల్స్, సర్జికల్ బ్లేడ్స్, గ్లౌజులు సహా ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ ఫిలిమ్స్ సహా హెచ్ఐవీ రాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు డిసైక్లోఫెనిక్ సోడియం 50 ఎంజీ, ఎల్పీఎం 4 ఎంజీ, అజింత్రో, స్టెరిలేన్ వాటర్ ఫర్ ఇంజక్షన్ 10 ఎంఎల్, టెటనస్ టాక్సెడ్, ల్యాక్టోసెల్ సొల్యూషన్, యాసిడ్ కార్బల్ 100 ఎంజీ, లైసోల్ 500ఎంజీ, పారసిటమాల్ 100 ఎంజీ, సోడియం హైడ్రోక్లోరైడ్, కెటమిన్ 50ఎంజీ, డోపమిన్ 200 ఎంజీ, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్ సహా మొత్తం 120 రకాల మందులకు ఇరువై రోజుల క్రితమే టీఎస్ఎంఐడీసీకి ఇండెంట్ పంపారు. కానీ ఇప్పటి దాకా ఆయా మందులు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది మధుమేహులు వస్తుంటారు. టీఎస్ఎంఐడీసీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో వారంతా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక్కో ఇంజక్షన్కు రూ.150 వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని కొనుగోలు చేసే శక్తి లేక మధుమేహులు తరచూ ఆందోళనకు దిగుతుండటం గమనార్హం. ఇలా ఒక్క ఉస్మానియాలోనే కాదు గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవసరాలకు భిన్నంగా కొనుగోళ్లు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఆస్పత్రులు, రోగుల అవసరాలతో సంబంధం లేకుండా ఇతర మందులు కొనుగోలు చేస్తుండడం, వినియోగం లేక ఏళ్ల తరబడి స్టోర్స్లోనే మగ్గిపోతుండడం, తీరా గడువు ముగియడంతో గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. సర్జరీలు చేసే ఆస్పత్రులకు సరఫరా చేసే ‘ట్రమడాల్’ వంటి పెయిన్ కిల్లర్ మందులను అవసరం లేకపోయినా ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయడం తెలిసిందే. ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ తర్వాత పారసిటమాల్కు బదులు పిల్లలకు ట్రమడాల్ ఇవ్వడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం, ఆ సంస్థపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే మందుల సరఫరా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం మందుల కోసం కేటాయించిన బడ్జెట్లో 80 శాతం నిధులు టీఎస్ఎంఐడీసికి, 20 శాతం నిధులు ఆస్పత్రికి కేటాయిస్తుంది. ఇలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఏటా రూ.30 కోట్లకు పైగా కేటాయిస్తుంది. టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయని మందులను ఆస్పత్రి వైద్యులే 20 శాతం వాటా నుంచి కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీజన్లో రోజు వారి సగటు ఓపీ మూడు వేలకుపైగా నమోదైంది. అంచనాలకు మించి రోగులు రావడంతో మందుల కొరత తీవ్రమైంది. ఆరోగ్యశ్రీ, నిధులతో కొన్ని రకాల మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ రోగుల పూర్తిస్థాయి అవసరాలు తీర్చలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్ మేనేజ్మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందులను సాధారణ రోగులకు సర్ధుబాటు చేయాల్సి వస్తోందని ఆయా ఆస్పత్రుల అధికారులు వాపోతున్నారు. -
సురేష్ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు. -
ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు. -
ఉస్మానియా..యమ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఇన్పేషంట్లు చికిత్స పొందే పాతభవనంలోని పలు వార్డులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడిపడుతుండగా, తాజాగా గురువారం తెల్లవారుజామున ఓపీ భవనంలోని జనరల్ సర్జరీ విభాగం ఇన్పేషంట్ వార్డులో సీలింగ్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పైన ఉన్న సీలింగ్ ఒక్కసారిగా కూలి కిందపడటంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారికి సహాయంగా ఉన్న బంధువులు, చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రోగులను వెంటనే మరో వార్డుకు తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
నిలబడి నిలబడి ప్రాణం పోతోంది
సిటీకి జ్వరమొచ్చింది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో జనంఅల్లాడుతున్నారు. విషజ్వరాల ప్రభావం తీవ్రమవడంతో రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. నగరంలోని గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రులకు సోమవారం వేల సంఖ్యలో రోగులు వచ్చారు. రోగుల సంఖ్యకు తగిన వసతులు లేక నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ వద్ద చాంతాడంతలైను ఉండడంతో చాలా మంది అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిల్చొని నీరసించిపోయారు. గాంధీలోనూ గంటలతరబడి రోగులు వేచిఉండడం కన్పించింది. గాంధీఆస్పత్రి : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి సోమవారం రోగులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా చిట్టీ కౌంటర్లు పెంపు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఓపీ చిట్టీలు, వైద్యసేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. వీల్ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులోలేక దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కుటుంబీకులే రోగులకు ఎత్తుకుని వైద్యసేవల కోసం తీసుకువెళ్లారు. సోమవారం రికార్డు స్థాయిలో ఓపీ రోగుల సంఖ్య నమోదైంది. సాధారణ రోజుల్లో గాంధీ ఓపీలో 3000 నుంచి 3500 మంది చికిత్సకువస్తుండగా సోమవారం మాత్రం 4వేల మంది చికిత్స కోసం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇన్పేషెంట్ విభాగంలో ఆరోగ్యశ్రీ రోగులు 30శాతం పెరిగినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. ఉస్మానియాలో.. అఫ్జల్గంజ్ : ఉస్మానియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. దాదాపు 1600మంది చికిత్స కోసం వచ్చారు. రోగుల సౌకర్యార్థం అన్ని విభాగాల్లోని వైద్యులను అత్యవసర సేవలకు వినియోగించామని సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం ఓపీ సహా ఐపీ విభాగాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓపీ సహా ఫార్మసీలో రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేకపోవడంతో మందులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలే జ్వరం ఆపై గంటల తరబడి క్యూలైన్లో నిల బడాల్సి వచ్చింది. సాధారణంగా రోజుకు సగటున వెయ్యి నుంచి 1200 మంది రోగులు వస్తుండగా సోమవారం ఈ సంఖ్య రెండు వేలు దాటింది. -
ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అఫ్జల్గంజ్: ప్రమాదవశాత్తు సేప్టీ పిన్మింగిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించిన సంఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అనూష దంపతుల కుమారుడు (8 నెలలు) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ సేఫ్టీ పిన్ మింగాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఎక్స్రే తీసిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు బాలుడిని నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రెఫర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఎమర్జెన్సీ విభాగానికి రాగా, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ రమేష్ నేతృత్వంలో 15 నిమిషాల్లోనే ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీ పిన్ను బయటికి తీశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... ఎండోస్కోపి ద్వారా ఫారిన్ బాడీ స్కాన్చేసి తీయడం పెద్దవారిలో సహజమే అయినా 8 నెలల పసికందుకు ఎండోస్కోపి ద్వారా ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీపిన్ తీసివేయడం క్లిష్టమైన, అరుదైన విషయమన్నారు. చికిత్స నిర్వహించిన డాక్టర్ రమేష్, సహకరించిన ఇతర డాక్టర్లను ఆయన అభినందించారు. తమ బిడ్డను కాపాడిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
జనం గుండెల్లో.. హిస్స్..
సాక్షి, హైదరాబాద్: చీమలు పెట్టన పుట్టలో పాములు దూరినట్లు... పాముల పుట్టల ప్రాంతాల్లో జనావాసాలు వెలుస్తున్నాయి. నగరంలో జనాభా పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా సిటీలో కలిసిపోతున్నాయి. శివారు ప్రాంతాలను ఆక్రమించి చెట్టూపుట్టా అంటూ లేకుండా వెంచర్లు, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్ల మధ్యకు వచ్చి బుస కొడుతున్నాయి. దీంతో పాము కాటు బాధితులు పెరిగిపోతున్నారు. చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఉస్మానియాలో 92 కేసులు, గాంధీలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు మరో యాభై మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పాము కాటు కేసులు పెరగడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని వైద్యులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పాముల పుట్టల్లోకి జనావాసాలు... నగరం శివారు ప్రాంతాలకు కూడా విస్తరించింది. రోజుకో కొత్త వెంచర్ ఏర్పడటంతో పాటు నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిటీకి దూరంగా ఉన్న కాలనీల్లో వీధిలైట్లు లేవు. ఉన్నవాటిలో చాలా వెలగడం లేదు. చాలా చోట్ల ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండటం, అవి చెట్ల పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మాణ సమయంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వాల్సి వచ్చినప్పుడు పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. అక్కడ పని చేసేందుకు వచ్చిన కార్మికులు బయట నిద్రించేటప్పుడో, రాత్రిపూట మలమూత్ర విసర్జనకు వెళ్లినప్పుడో కాటేస్తున్నాయి. వైద్యులు అందుబాటులో లేక... నగరం నాలుగు వైపులా 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను అంబులెన్స్లో తీసుకుని సిటీ రోడ్లపై రద్దీని దాటుకుని ఆస్పత్రులకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాతపడుతున్నారు. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మలక్పేట్లో ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అయితే వాటిలో వైద్య పరికరాలు, మందులు, తక్షణ సేవలు అందించే వైద్యులు లేకపోవడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఆందోళన వద్దు.. పాముకాటుకు గురైన వెంటనే కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గట్టిగా కట్టాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. 10 నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు. ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. – డాక్టర్ శ్రవణ్కుమార్, జనరల్ ఫిజీషియన్, ఉస్మానియా ఆస్పత్రి -
ఆరోగ్య ప్రదాయినికి ఆయుష్షు!
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యం చెడిపోయి పోతాయనుకున్న ప్రాణాలు సైతం ఆ ఆస్పత్రికి వెళితే నిలిచిపోతాయని రోగుల నమ్మకం. ఎన్నో ప్రయోగాలు, మరెన్నో అద్భుతాలకు వేదిక.. లక్షలాది మంది రోగుల ఆరోగ్య ప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి. చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తరచు పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేయించారు. దాన్ని కూల్చివేసి అక్కడ రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం 2014లోనే సంకల్పించింది. ప్రతిపక్షాలు, చరిత్రకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పాత భవనాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆర్కియాలజీ విభాగానికి పంపింది. ఈ భవనానికి మెరుగులు దిద్దడంవల్ల మరో 25 ఏళ్ల వరకు ఆ కట్టడానికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు పాత భవనాన్ని ఆధునికీకరిస్తూనే.. మరోవైపు ఇదే ప్రాంగణంలో కొత్తగా మరో నాలుగు బ్లాకులు నిర్మించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా దెబ్బతిన్న రూఫ్టాప్ను సరిచేయడం, గోడలపై మొలిచిన చెట్లను తొలగించడం, గోడల పగుళ్లును బాగుచేయడం, వాటర్ ఫ్రూఫింగ్ చేసి లీకేజీలను అరికట్టడంతో పాటు, డ్రైనేజీ లైన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్డలను పూర్తిగా పునరుద్ధరించడం వంటివి చేపడతారు. తద్వారా ఈ భవనాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రక నేపథ్యం ఇదీ.. గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలిసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం నసీరుద్దౌలా బ్రిటిష్ తరహా వైద్యం చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్య గ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించగా ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్గంజ్ ఆస్పత్రి’గా వైద్య సేవలు ప్రారంభించింది. అప్పటి వరకు కంటోన్మెంట్లోని బ్రిటిష్ సైనికులకు మాత్రమే అందిన విదేశీ వైద్యం ఈ ఆస్పత్రి ప్రారంభంతో ఇక్కడి సామాన్యులకు కూడా చేరువైంది. కానీ ఆ ఆస్పత్రి 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న విషాదమిది. తర్వాత కొంత కాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అఫ్జల్గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి.. ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో సుమారు 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. రూ.50 వేల ఖర్చుతో నిర్మాణం ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి 1918లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీక్, రోమన్, శైలిలో దీన్ని కట్టారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించి కట్టారు. ఆరోజుల్లో ఈ భవన నిర్మాణానికి రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో 110 అడుగుల ఎత్తయిన విశాలమైన డోమ్లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. చార్మినార్లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా నిర్మించారు. ప్రపంచంలోతొలి ‘క్లోరోఫామ్’ చికిత్స ఇక్కడే ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలుఆవిష్కరణలకు వేదిక. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారి క్లోరోఫామ్ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. ఎంతో మంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆస్పత్రి అభివృద్ధి చెందింది. డాక్టర్ ఎడ్వర్డ్ లారీ, డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించా రు. 1846లోనే డాక్టర్ విలియం మెక్లిన్ నేతృత్వంలో నిజామ్స్ మెడికల్ స్కూల్ వైద్య విద్యాబోధన ప్రారంభమైంది. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కథ ఇదీ.. నిర్మాణానికి ప్రతిపాదన 1918 నిర్మాణం పూర్తయింది 1925 విస్తీర్ణం 27 ఎకరాలు నిర్మాణ ఖర్చు రూ.50 వేలు నిర్మాణ శైలి ఇండో,పర్షియన్తొలిరోజుల్లో పడకలు 450 ప్రస్తుత పడకలు 1100 ఓపీ రోజుకు (సగటున) 2000 నుంచి 2500 మంది ఇన్ పేషెంట్ల సంఖ్య 200–300 మైనర్ ఆపరేషన్లు(రోజుకు) 120–135 మేజర్ ఆపరేషన్లు 30–35 మొత్తం విభాగాలు 33 సూపర్ స్పెషాలిటీ విభాగాలు 7 -
ఏళ్లుగా లేరంట.. ఇవ్వలేరంట..!
ఆరేళ్ల తర్వాత ఓయూ స్నాతకోత్సవంజరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవం ఇది. 2014లోటీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కుఓయూ గౌవర డాక్టరేట్ ఇవ్వాలనిప్రతిపాదించగా... విద్యార్థి సంఘాలువ్యతిరేకించడంతో విరమించుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక మహోన్నతమైన విజ్ఞానభూమి. బోధన, పరిశోధనే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వవిద్యాలయం. వేల ఏళ్ల మానవ ప్రస్థానాన్ని, చరిత్ర గమనాన్ని అధ్యయనం చేస్తూ పరిశోధిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో ఒక తరం నుంచి మరో తరానికి విజ్ఞాన వారధిగా నిలిచిన ఈ యూనివర్సిటీ... విద్య, బోధన, పరిశోధన మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడంలో, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించిన ఎంతోమంది అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్లను అందజేసి సముచితంగా గౌరవించింది. తన కీర్తి ప్రతిష్ఠలను విశ్వవిఖ్యాతం చేసుకుంది. అయితే ఇదంతా గత వైభవమే. గడిచిన 18 ఏళ్లుగా ఒక్క గౌరవ డాక్టరేట్ను కూడా ఇవ్వలేదు. ఇంచుమించు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మరెంతో మంది తమ ప్రతిభా పాటవాలతోపరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. చరిత్ర, సైన్స్, కళలు, సాహిత్యం, సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు, రాజకీయ రంగాల్లో గొప్ప కృషి చేసిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడమంటే ఆ వ్యక్తులను సమున్నతంగా గౌరవించడమే కాకుండా... ఉస్మానియా విశ్వవిద్యాలయం తనను తాను గౌరవించుకున్నట్లవుతుంది. కానీ ఈ 18 ఏళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం గమనార్హం. ఆనాటి వెలుగులేవీ? ఆరేళ్ల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 17న వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఆరేళ్లలో పరిశోధనలు పూర్తి చేసిన ఎంతోమంది విద్యార్థులు పట్టాలందుకోనున్నారు. సుమారు 2,800 మందికి పైగా విద్యార్ధులు పీహెచ్డీలు పూర్తి చేశారు. వారిలో ఇప్పటికే 1,800 మంది పట్టాలు పొందారు. మరో 1,096 మందికి ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పట్టాలందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇప్పటి వరకు సుమారు 680 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన 270 మంది టాప్మోస్ట్ విద్యార్థులు గోల్డ్మెడల్స్ను అందుకోనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అలాంటి స్నాతకోత్సవ సంరంభంలో యూనివర్సిటీ హోదాను, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేసే గౌరవ డాక్టరేట్లు మాత్రం లేవు. ఎందుకిలా? గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. 2001 నుంచి దశాబ్దానికి పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. సమాజంలో ఒక బలమైన ఆందోళన కొనసాగుతున్న సమయంలో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులను గుర్తించి అవార్డులను అందజేయడం అసాధ్యంగా మారింది. 2014లో కేసీఆర్కు ఇవ్వాలనుకున్నప్పటికీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ఇవ్వడంలో యూనివర్సిటీ పాలకమండలిలో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. మరోవైపు రాజకీయ పార్టీల ప్రభావం కారణంగా ఎంపికపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకున్నా అందరికీ, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన నేతల ఎంపిక కూడా కష్టంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానుభావులకు, ఎంతోమంది వైజ్ఞానిక రంగ ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం ద్వారా ఇతర యూనివర్సిటీల కంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో వైవిధ్యాన్ని కనబరిచింది. అదేస్థాయి వ్యక్తులను ఎంపిక చేయడంలో ఈ 18 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదు. ఎందరో మహానువుభావులు... నిజానికి వర్సిటీ ఆరంభం నుంచే గొప్ప సంస్కృతిని చాటుకుంది. మేధావులను, ఆయా రంగాల్లో అపారమైన సేవలందజేసిన వారిని గుర్తించి డాక్టరేట్లతో గౌరవించింది. అలా 1917లోనే అప్పటి అరబిక్ ప్రొఫెసర్, ఆరో నిజాం రాజు మహబూబ్అలీకి ఎంతో ప్రియమైన వ్యక్తి అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్కు తొలి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో, బెంగాల్, లక్నో కళాశాలల్లోనూ అధ్యాపకులుగా పని చేశారు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం డైరెక్టర్గా విధులు నిర్వహించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు 1938 ఫిబ్రవరి 28న గౌరవ డాక్టరేట్ అందజేసింది. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్’ అవార్డును అందుకున్న తొలి సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్. అదే సంవత్సరం ప్రముఖ కవి ఇక్బాల్కు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. బికనూర్ ప్రభువు మహారాజ్ ఆదిరాజ్కు కూడా గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఆ తర్వాత ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల చీఫ్ ఇంజినీర్ అయిన నవాబ్ అలీజంగ్కు 1949 మార్చి 19న ‘డాక్టరేట్ ఆఫ్ సైన్స్’ విభాగంలో అందజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు 1953లో గౌరవ డాక్టరేట్ అందజేసే అరుదైన అవకాశం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. ఈ అపూర్వ ఘట్టంతో ఓయూ కీర్తిప్రతిష్టలు మరింత రెపరెపలాడాయి. అప్పటికే 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందజేసి సముచితంగా గౌరవించింది. బెల్ లెబోరేటరీస్ అధినేత, వైజ్ఞానిక రంగ నిపుణులు అయిన డాక్టర్ అరుణ్ నేత్రావలికి 2001 ఆగస్టు 8న గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న 47వ వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. 2014లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ విద్యార్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రముఖులు వీరే... 1. నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ – 1917 2. నవాబ్ సర్ అమీన్జంగ్ బహదూర్ – 1918 3. నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ – 1923 4. మహరాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ – 1938 5. సర్ తేజ్ బహదూర్ సిప్రూ – 1938 6. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ – 1938 7. సర్ మహ్మద్ ఇక్బాల్ – 1938 8. మహరాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభువు –1939 9. ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ – 1939 10. ప్రిన్స్ మోజం జాహ్ బహదూర్ – 1940 11. నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్ –1943 12. సి.రాజగోపాలాచారి – 1944 13. దివాన్ బహదూర్ సర్ రామస్వామి మొదలియార్ – 1945 14. సర్ జాన్ సర్ గేంట్ – 1947 15. పండిత్ జవహర్లాల్ నెహ్రూ – 1947 16. మేజర్ జనరల్ చౌదరి – 1949 17. బాబు రాజేంద్రప్రసాద్ – 1951 18. టింగ్ సి–లిన్ – 1951 19. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1953 20. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ – 1953 21. ఎంకే వెల్లోడి – 1953 22. కేఎం మున్షీ – 1954 23. వీకే కృష్ణమీనన్ – 1956 24. బూర్గుల రామకృష్ణరావు – 1956 25. ఆలియార్ జంగ్ – 1956 26. షేక్ అహ్మద్ యామనీ – 1975 27. డాక్టర్ జర్హర్ట్ హెర్డ్ బెర్గ్ – 1976 28. ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ – 1977 29. డాక్టర్ కలియంపూడి రాధాకృష్ణ – 1977 30. తాలాహ్ ఈ దైని తరాజీ – 1979 31. యాసర్ హరాఫత్ – 1982 32. డాక్టర్ వై.నాయుడమ్మ – 1982 33. ప్రొఫెసర్ రాంజోషి – 1982 34. జి.పార్థసారథి – 1982 35. డాక్టర్ జహీర్ అహ్మద్ – 1982 36. జస్టిస్ మహ్మద్ బౌడ్జౌయ్ – 1985 37. జస్టిస్ నాగేందర్సింగ్ – 1986 38. జస్టిస్ ని ఝంగ్యూ – 1986 39. ఆర్.వెంకట్రామన్ – 1986 40. ప్రొఫెసర్ సీఎస్ఆర్ రావు – 1986 41. జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి – 1986 42. డాక్టర్ రాజా రామన్న – 1990 43. బీపీఆర్ విఠల్ – 1993 44. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి – 1993 45. డాక్టర్ లక్ష్మీ ఎం.సింగ్వీ – 1994 46. డాక్టర్ మన్మోహన్సింగ్ – 1996 47. డాక్టర్ అరుణ్ నేత్రావలి – 2001 -
ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి..
ఏదైనా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారా..? అయితే మీ వెంట కచ్చితంగా ఓ ఫ్యాన్ కూడా తీసుకువెళ్లండి.. లేకపోతే అక్కడ మీరు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎందుకంటే నగరంలో పేరుమోసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదు.. మీరు ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే.. మరో రోగంతో బయటకు రావాల్సి వస్తుంది. మన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరు దారుణంగా ఉంది..! సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతుంటే.. ప్రభుత్వాసుపత్రులలో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడంతో రోగులు చుక్కలు చూస్తున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పని చేయకుండా పోయిన ఏసీలు, ఫ్యాన్లను ఎప్పటికప్పుడు రిపేర్లు నిర్వహించి అందుబాటులోకి తీసుకురావాల్సిన వైద్యాధికారులు ఇవేవీ పట్టించుకోక పోవడంతో రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కట్లు, కుట్లకు ఇన్ఫెక్షన్ల బెడద.. ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని పాత భవనం సహా కులీకుతుబ్షా భవనం, ఓపీ భవనాలు ఉన్నాయి. ఇక్కడ అధికారికంగా 1168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ఓపీకి రోజుకు సగటున 2500 మంది వస్తుండగా, మరో 1400 మంది ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే ఒకటి, రెండో అంతస్థులను ఖాళీ చేయించి, ఆయా పడకలను గ్రౌండ్ఫ్లోర్లోనే సర్దుబాటు చేశారు. విశాలమైన ప్రదేశంలో ఉండాల్సిన పడకలు ఇరుకుగా.. కనీసం గాలి వెలుతురు కూడా సోకని ప్రదేశంలో ఉండిపోయాయి. అసలే ఉక్కపోత ఆ పై వార్డుల్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గాయాలకు కట్టిన కట్లకు, సిజేరియన్ ప్రసవాలు, ఇతర సర్జరీల సమయంలో వేసిన కుట్లు వద్ద ఉక్కపోతతో చెమట పొక్కులు వస్తున్నాయి. దురద పెట్టడంతో వాటిని గిల్లుతుంటారు. సర్జరీ తర్వాత నాలుగైదు రోజుల్లో మానాల్సిన కుట్లు, ఇతర గాయాలు ఉక్కపోత, చెమట పొక్కులతో దురద రావడం, వాటిని గిల్లడం వల్ల వారం పది రోజులైనా మానడం లేదు. అంతేకాదు ఇన్ఫెక్షన్ల బారీ నుంచి రోగులను కాపాడేందుకు మోతాదుకు మించి యాంటిబయోటిక్స్ వాడాల్సి వస్తోంది. పరోక్షంగా రోగుల ఆరోగ్యం మరింత దెబ్బతినడాకి కారణమవుతోంది. కంప్యూటర్లు, వైద్యపరికరాలకు ముప్పు ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆసుపత్రిలో అధికారికంగా 1012 పడకలు ఉండగా, అనధికారికంగా రెండువేల పడకలు కొనసాగుతున్నాయి. అత్యవసర విభాగం సహా ఇంటెన్సీవ్కేర్ యూనిట్లలోనూ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులే కాదు ఆయా విభాగాల్లోన్ని కంప్యూటర్లు, వైద్యపరికరాలు వేడిమికి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 2400 వైద్యపరికరాలు ఉండగా, ప్రస్తుతం వీటిలో 525 వైద్యపరికరాలతో పాటు అనేక కంప్యూటర్లు పని చేయడం లేదు. పోస్ట్ ఆపరేటీవ్, గైనకాలజీ, పీడీయాట్రిక్ విభాగాల్లోని రోగులు ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి, నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం సహా సుల్తాన్బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని రోగులు సైతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి, వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆసుపత్రి యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నగదు తీసుకునే నిమ్స్లోనూ అంతే.. ఉస్మానియా, గాంధీ ఇతర ధర్మాస్పత్రులతో పోలిస్తే నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) కొంత భిన్నమైంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఆస్పత్రి ఇది. ఇక్కడ ఉచిత సేవలు ఉండవు. డబ్బు చెల్లించే రోగులకు మాత్రమే ఇక్కడ సేవలు అందుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే వైద్య ఖర్చులు కొంత తక్కువగా ఉండటమే కాదు మెరుగైన వైద్యం అందు తుందనే ఆశతో రోగులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ జనరల్ వార్డులతో పాటు పేయింగ్ రూమ్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఏసీ రూమ్లు కూడా ఉన్నాయి. నగదు చెల్లించినప్పటికీ గదుల్లో ఏసీలు పని చేయడం లేదు. షేరింగ్ రూముల్లోనూ ఫ్యాన్లు తిరగడం లేదు. ఆసుత్రిలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. వసతులు మాత్రం మెరుగుపడటం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంతే.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, ఫీవర్, సరోజినిదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతి ఆసుపత్రి సహా సుల్తాన్ బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోనే కాదు.. రోగులు నగదు చెల్లించి చికిత్సలు పొందే నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) లోనూ నిర్వహణ లోపం వల్ల సగానికి పైగా ఫ్యాన్లు, ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగులు ఉక్కపోతకు చెమట, దురద, ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తడమే కాదు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్యపరికరాలు, కంప్యూటర్లు పాడైపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘నకిలీలు’
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో వైద్యులకు పట్టుబడడంతో దందా వెలుగు చూసింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో హల్చల్ చేసి వైద్యులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఒక్క ఈ ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. ఆస్పత్రిలో 240 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో 28 మంది లాంగ్లివ్లో ఉన్నారు. కొంతమందికి ఉద్యోగంతో పాటు ప్రైవేటు మందుల దుకాణాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉండడం.. మరికొంత మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు విధులకు హాజరుకాకపోగా వారి స్థానంలో ఇతరులకు తక్కువ మొత్తంలో నెలసరి వేతనాలు చెల్లించి ఆస్పత్రులకు పంపుతున్నారు. వీరిలో చాలా మందికి వైద్యంపై కనీస అవగాహన లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు అసలు ఆస్పత్రికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేసి, అకౌంట్లలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఇందుకు సహకరించిన హెల్త్ ఇన్స్పెక్టర్లకు భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నట్లు తెలిసింది. ఒకరి పేరుతో మరొకరు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం, సుల్తాన్బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, కింగ్కోఠి, మలక్పేట్, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు సహా మరో వందకు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30వేల మంది పని చేస్తున్నారు. పేషెంట్కేర్ ప్రొవైడర్స్ సహా శానిటేషన్ సెక్యురిటీ విభాగాల్లో మరో 10వేలకు పైగా సిబ్బంది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ ఏర్పాటు చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిని ఇట్టే గుర్తించడంతో పాటు వేతనాల చెల్లింపును నిలిపివేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రతిపాదికన పనిచేస్తూ నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులకు సీనియర్ ఆర్ఎంఓలు రోస్టర్, డ్యూటీలు వేసి, వారి హాజరును పర్యవేక్షిస్తుండగా... నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరును హెల్త్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. వీరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ విధులకు గైర్హాజరైన వారిని సైతం హాజరైనట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే ఉండరు... ప్రతిష్టాత్మక నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం నిలోఫర్లో ఉద్యోగుల విధి నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. నిత్యం వెయ్యి మంది చిన్నారులు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో 18 మంది ఆర్ఎంఓలు ఉన్నప్పటికీ.. ముగ్గురు మినహా మిగిలిన వారంతా వేళకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 10:30గంటల తర్వాత ఆస్పత్రికి రావడం, మధ్యాహ్నం 2గంటల తర్వాత వెళ్లడం వీరి పని. ఇక నైట్డ్యూటీలోనూ రెగ్యులర్ ఉద్యోగులు కన్పించడం లేదు. కీలకమైన విభాగాల్లోనూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందే దర్శనమిస్తున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు రోస్టర్ విధానంతో పాటు డ్యూటీలు వేయాల్సిన బాధ్యతతో పాటు రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరు నమోదు బాధ్యత హెల్త్ ఇన్స్పెక్టర్లపై ఉంది. కానీ ఇక్కడి హెల్త్ ఇన్స్పెక్టర్లు రాత్రి విధులకు గైర్హాజరవుతున్నారు. వారి స్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పని చేయిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. నవజాత శిశువులు చికిత్స పొందే కీలకమైన ఈ ఆస్పత్రితో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు కొనసాగు తోంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. -
ఇక ఈవినింగ్ ఓపీ సేవలు
సుల్తాన్బజార్: పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో పేద ప్రజలు, ఉద్యోగులకు ఓపీ సేవలను అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రి పాలక వర్గం సిద్ధమవుతోంది. గతంలో ఆసుపత్రిలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పేరుతో ఈహెచ్ఎస్ క్లినిక్ను ఓపీ బ్లాక్లో ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పలు విభాగాల వైద్యులు వైద్య సేవలు అందించేవారు. కాగా ఈ ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రి పాలక వర్గం ఈసారి ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా వైద్య సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈవినింగ్ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. నిత్యం రద్దీ పెరగడంతోనే.. ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులతో పాటు రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఈవినింగ్ క్లినిక్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిత్యం దవాఖానాలోని ఓపీలో నిత్యం సేవలు అందిస్తున్న ఆసుపత్రి పాలక వర్గం.. ఇక ముందు సాయంత్రం సమయాల్లో కూడా వైద్య సేవ అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్ క్లినిక్లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటు ఉండి సేవల అందిస్తారు. గతంలో ఈహెచ్ఎస్ కొనసాగిన గదులలోనే తిరిగి ఈవినింగ్ క్లినిక్ను ప్రారంభించేందుకు పాలక వర్గం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. -
బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు విధించారు. నిమ్స్ ఆసుపత్రిలోనూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. ఇష్టారాజ్యంగా ఎవరుపడితే వారు ఆసుపత్రుల్లో ని రోగుల వార్డుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుం టున్నారు. పాసులున్న వారు మాత్రమే నిర్ణీత వేళ ల్లో వెళ్లొచ్చేలా నిబంధనలు కట్టుదిట్టం చేశారు. బోధనాసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల (జూడా)పై రోగుల బంధువులు తరచూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ ఆంక్షలున్నా పూర్తిస్థాయి లో అమలు కావట్లేదని, ఇకపై కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. జూడాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ పోస్టర్లు అంటించాలని నిర్ణయించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం.. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆస్పత్రులకు రోజూ దాదాపు 20 వేల మంది చొప్పున వస్తుంటారు. దీంతో వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారుతోంది. మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం గగనం గా మారుతోంది. పేదలు కావడంతో రాత్రిళ్లు కూడా ఆరు బయట లేదా రోగుల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. బోధనాసుపత్రుల వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు తక్కువ ధరకే భోజనం అం దిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఉచితంగా టిఫిన్, భోజనం అందజేస్తున్నాయి. దీంతో రోగుల సహా యకులు ఎక్కువ మంది వస్తూ ఇక్కడే ఉండిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. భారీగా రోగుల బంధువులు, స్నేహితులు గుమిగూడుతుండటం తో ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. రోగుల వద్దకు ఒక సహాయకుడే వెళ్లాల్సి ఉండ గా, గేట్ల వద్ద ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకుని లోపలికి పంపుతున్నారన్న విమర్శలున్నా యి. ఆసుపత్రిలో రోగుల బంధువులు, సహాయకులతోనే నిండిపోతున్నాయి. డబ్బులు తీసుకుని లోపలికి పంపే వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. ఒక్కోసారి రోగి చనిపోతే బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. దీంతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో నిర్మితమైన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే దశలో ఉందని, దీని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్కు చెందిన హెల్త్కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్కుమార్ దీన్ని దాఖలు చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఆసుపత్రి భవనం వైద్యులు, నర్సులు, సిబ్బంది, రోగులకు ప్రమాదకరంగా మారిందని పిటిషనర్ తెలిపారు. ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడుతున్నాయని, గతంలో కూడా పలువురు గాయపడ్డారని వివరించారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రస్తుత అవసరాలకు అనుగుణం లేదన్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఈ ఆసుపత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పాయని ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రిని సందర్శించి, కొత్త భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు. -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
హైదరాబాద్: గన్ఫౌండ్రీ డివిజన్లోని ఫతే మైదాన్ క్లబ్కు ఎదురుగా ఉన్న ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. ఎనిమిదంతస్తుల భవనంలో ఐదవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని 5, 6, 7 అంత స్తులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తికి స్వల్ప గాయాల య్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని పోలీసులు కాపాడారు. ప్రముఖ ఉర్దూ దినపత్రిక అధినేత ఖాన్ లతీఫ్ ఖాన్కు చెందిన ఈ భవనంలో అన్నీ వాణిజ్య సముదాయాలే ఉన్నాయి. ఇదే భవనం నుంచి ఉర్దూ దినపత్రిక మున్సిఫ్ను నడుపుతున్నారు. బుధవారం భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక అబిడ్స్ ఠాణా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ నెట్వర్క్ ద్వారా మంటలను ఆర్పేందుకు యత్నించగా ఫలించలేదు. ఆక్సిజన్ సిలిండర్లు తెరుచుకోకపోవడంతో మంటలు మరిన్ని అంతస్తులకు వ్యాపించాయి. మొత్తం 14 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా మంటలు రావడంతో.. భవనంలో కార్పొరేట్ స్థాయి కార్యాలయాలు, సెల్ఫోన్ షోరూమ్స్, కంటి అద్దాల దుకాణాలు, వస్త్ర దుకాణాలు, సెల్ఫోన్ల కంపెనీలతోపాటు కాల్సెంట ర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనంలో ఐదవ అంతస్తులో అడ్వాంటేజ్ వన్ కాల్సెంటర్ ఉంది. ఈ కార్యాలయంలో బుధవారం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు, పొగ వ్యాపించడంతో భయపడిన ఉద్యోగులు కిందకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన ఒకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏసీలో వచ్చిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. యాజమాన్యానికి నోటీసులు.. భవనంలోని 5, 6, 7 అంతస్తులను సీజ్ చేశామని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ తెలిపారు. భవనానికి ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనట్టుగా ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతి పత్రాలు, భద్రత, ఫైర్ ఎన్ఓసీ, చేపట్టిన భద్రతా చర్యలపై గురువారం ఉదయంలోగా వివరణ సమర్పించాలని భవన యాజమాన్యానికి నోటీసులు అందించామన్నారు. భవనంలో అమర్చిన ఫైర్ నెట్వర్క్ పనిచేయకపోవడం వల్లే భారీ ఆస్తినష్టం వాటిల్లిందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ఈ మార్గంలో ట్రాఫిక్కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఐడియాతో పాటు మరికొన్ని నెట్వర్క్లు కొన్ని గంటల పాటు పనిచేయలేదు. రాత్రి 7.30 తర్వాత వీటి సేవలను పునరుద్ధరించారు. -
ఉస్మానియాలో ఇంటర్న్షిప్ రగడ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ల జారీ వివాదాస్పదంగా మారింది. అడిగినంత ముట్టజెప్పితే చాలు డ్యూటీలకు రాకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై కొంతమంది విద్యార్థులు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ పరిధిలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న జూనియర్ వైద్యులతో పాటు చైనా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉస్మానియాలో 200 మంది, గాంధీలో 200 మంది అభ్యర్థులు ఇంటర్న్షిప్ చేస్తుంటారు. ఉస్మానియాలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, క్యాజువాలిటీ విభాగాల్లో 200 మంది హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. వైద్య చికిత్సపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రెండు నెలలు మెడిసిన్, రెండు నెలలు జనరల్ సర్జరీ, ఒక నెల పీడియాట్రిక్, 15 రోజులు ఈఎన్టీ, మరో పదిహేను రోజులు కంటి ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లో సీట్లు పొందిన అభ్యర్థుల్లో వంద మంది ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకున్న వారు ఉంటే మరో వంద మంది ఇతర కాలేజీల్లో చదువుకున్నవారుంటారు. అయితే వీరిపై సరైన నిఘా లేకపోవడంతో వీరిలో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. కానీ వారికి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రిలో పని చేస్తున్న కొంత మంది క్లర్కులు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ను వివరణ కోరగా సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆయా విభాగాధిపతుల నుంచి వివరణ కూడా కోరినట్లు నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
ఉస్మానియాలో అరుదైన శస్త్ర చికిత్సలు
అఫ్జల్గంజ్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలాజి హెచ్వోడి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం వివరాలు వెల్లడిచారు. మహబూబ్నగర్ జిల్లా, షాద్నగర్కు చెందిన తేజస్విని (11 నెలలు) ఆడుకుంటుండగా బటన్ బ్యాటరీ నోట్లో పెట్టుకుని మింగేసింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన పాప తల్లి సరస్వతి చిన్నారని వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గ్యాస్ట్రోఎంట్రాలాజి వైద్యులు గంటపాటు శ్రమించి ప్రత్యేక చికిత్స ద్వారా గొంతులో ఇరుక్కున్న బ్యాటరీని ఎండోస్కోపిక్ రిమువల్ బాటరి ఇన్ ద్వారా తొలగించారు. అలాగే నగరంలోని ఆసిఫ్నగర్కు చెందిన అలిజ (4) ఈ నెల 3న రూ.2 నాణెంతో ఆడుకుంటూ నోటిలో పెట్టుకొని మింగింది. దీనిని గమనించిన ఆమె తండ్రి మహ్మద్ ఇంతియాజు బాలికను కింగ్కోఠిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు పరీక్షలు చేసి ఎండోస్కోపిక్ రిమువల్ ఇన్ టూ రూపీస్ చికిత్స చేసి రెండు నాణేన్ని బయటికి తీశారు. వైద్య బృందంలో హెచ్వోడి రమేష్తో పాటు ఇతర వైద్యులు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు. వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ అభినందించారు. -
స్వైన్ఫ్లూ కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 20 మంది మృతిచెందారు. అధికారులు మాత్రం 12 మందే మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే స్వైన్ఫ్లూతో 10 మంది మరణించినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రారంభం కావడంతో స్వైన్ఫ్లూ మరింత విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ఎన్నికల సమయం కావడంతో కిందిస్థాయి వైద్య సిబ్బందిని కూడా ఉపయోగించుకోవడంతో గ్రామాలు మొదలు కార్పొరేషన్ల వరకు అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ తొలిసారి అన్ని జిల్లాల్లో స్వైన్ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ నియంత్రణను పర్యవేక్షించేందుకు నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు.. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కోరంటి ఫీవర్ ఆసుపత్రులతో పాటు 30 జిల్లాల్లోని 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 467 పడకలను సిద్ధం చేశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను నారాయణగూడ ఐపీఎంతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన కిట్స్ను అందుబాటులో ఉంచారు. స్వైన్ ఫ్లూ సోకిన వారి కోసం లక్ష డోసుల వసల్టావీర్ టాబ్లెట్లు, సిరప్ సిద్ధంగా ఉంచామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో హెచ్1 ఎన్1 వైరస్ వ్యాపించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బందికి అవసరమైన మాస్కులు, టీకాలు, ఇతర ఔషధాలు సిద్ధం చేశామని చెప్పారు. స్వైన్ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన రోగులకు తక్షణం పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్సకు గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వివరించారు. -
మృత్యు ఘంటికలు మోగిస్తోన్న స్వైన్ఫ్లూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వైరస్.. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గురువారం ఒక్కరోజే ఇద్దరు మహిళలు స్వైన్ ఫ్లూతో మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం మరో 20 మం దికిపైగా బాధితులు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 140కి పైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. వీటిలో వందకుపైగా గ్రేటర్లోనే నమోదయ్యాయి. ప్రస్తుత ఫ్లూ బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. గాంధీలో వెంటిలేటర్ల కొరత.. గాంధీ నోడల్ కేంద్రానికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో 10 వెంటిలేటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పటికే వీటిని రోగులకు అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర విభాగాల్లోని వెంటిలేటర్లు వినియోగించుకోవచ్చని భావించినా.. ఆయా వార్డుల్లోని రోగులకే వెంటిలేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని స్వైన్ ఫ్లూ నోడల్ కేంద్రంగా ప్రకటించినప్పటికీ.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పాలనా యంత్రాంగం కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది ఫ్లూ పాజిటివ్ బాధితులు ఆస్పత్రిలో చేరగా, వీరిలో నలుగురు మృతి చెందారు. మేడ్చల్ మహిళ మృతి.. గాంధీ ఆస్పత్రిలో వారం రోజుల్లో 10 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఈ నెల 8న గాంధీలో చేరిన మేడ్చల్ జిల్లా బండ్లగూడకు చెందిన మహిళ (56) స్వైన్ ఫ్లూతో గురువారం మృతి చెందింది. ప్రస్తుతం మరో 14 మంది ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో సిద్దిపేట మహిళ(55), వనపర్తి మహిళ(50), బాన్సువాడ పురుషుడు(60), కుత్బుల్లాపూర్ మహిళ(55), భువనగిరి పురుషుడు(45), కాచిగూడ గర్భిణి(29), మహేశ్వరం పురుషుడు(45), మహబూబ్నగర్ మహిళ(54), ముషీరాబాద్ మహిళ(32), విద్యానగర్ మహిళ(32)లు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బాధితులందరికీ వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేస్తున్నారు. ఉస్మానియాలో గర్భిణి మృతి.. ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 15 మంది చేరగా, వీరిలో ముగ్గురికి ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో సనత్నగర్కు చెందిన లతీఫ్(57) అక్టోబర్ రెండున మృతి చెందగా, తాజాగా గురువారం ఉదయం తలాబ్కట్టకు చెందిన గర్భిణి (27) మృతి చెందింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ బాధితులు చనిపోయిన తర్వాతే స్వైన్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2 పాజిటివ్ కేసులు, మరో 10 అనుమానాస్పద కేసులకు చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో గ్రేటర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్పత్రి స్వైన్ ఫ్లూ డిజాస్టర్ వార్డు ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 10 పడకలు ఉండగా, ఒక వెంటిలేటర్ అందుబాటులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఏఎంసీ వార్డులోని వెంటిలేటర్లను వినియోగిస్తామని తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే... - సాధారణ ఫ్లూ, స్వైన్ ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. - నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ. - సాధారణ ఫ్లూ, స్వైన్ ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. - బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. 3 రోజులు కంటే ఎక్కువగా ఈ లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. - ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శ్రీధర్, స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి,ఉస్మానియా ఆస్పత్రి -
చెట్టు కింద డాక్టర్
పాడుబడి, పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. శిథిల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కొన్నాళ్లుగా వైద్యులు కోరుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో గురువారం చెట్ల కిందే రోగులకు సేవలు అందించారు. సాక్షి, సిటీబ్యూరో: కొత్త భవన నిర్మాణం కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఇప్పటికే గత కొంత కాలంగా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపిన వైద్యులు తాజాగా భవనం నుంచి బయటికి వచ్చి బయటి రోగులకు చెట్లకిందే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు రోజుకో ప్రాంతంలో పెచ్చులూడి పడుతున్నాయి. ఇప్పటికే పలువురు రోగులు గాయాలపాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆస్పత్రి పాతభవనం దుస్థితి..ఎదరవుతున్న ఇబ్బందులపై వైద్యాధికారులు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చివరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. రోగులకే కాదు వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని పాత భవనంలో చికిత్సలు అందించలేమని స్పష్టం చేస్తూ గురు వారం ఓపీ ప్రధాన ద్వారం బయటే చెట్ల కింద రోగులకు సేవలు అందించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఔట్పేషెంట్ విభాగంలో ఓపీ టోకెన్లు జారీ చేసే కంప్యూటర్ మెరాయించడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
బీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఉస్మానియా ఆస్పత్రికి ‘బీ అలర్ట్’ అంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టౌన్ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేయగా, ఇంజినీరింగ్ విభాగం రెండు రోజుల క్రితం నిర్మాణాన్ని పరిశీలించింది. రెండు మూడు రోజుల్లో ఆ విభాగం కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు భవనం పైకప్పు పెచ్చులూడడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందాల్సినపరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ కూడా తమకేం సంబంధం లేదని నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక వైద్యాధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండడంతో... ఇప్పట్లో కొత్త భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై ఆయా విభాగాల అధిపతులతో చర్చింది ఓ నిర్ణయం తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ భావించారు. ఈ మేరకు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నాలుగేళ్లయినా... నిర్వహణ లోపంతో పాతభవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో... అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి నాలుగు ఎకరాల్లో ఏడు అంతస్తుల కొత్త భవనం నిర్మించాలని భావించారు. ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్కుమార్రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. ఓ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు. ఇప్పట్లో మోక్షం లేనట్లే... పాతభవనంలో రోగులకు చికిత్సలు ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించడంతో ఏడాది క్రితం రెండో అంతస్తులోని రోగులను ఖాళీ చేయించింది. వీరికి ప్రత్యామ్నాయంగా కింగ్కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగుల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో అది కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇదే సమయంలో వైద్యులు, సిబ్బంది జేఏసీగా ఏర్పడి సుమారు 100 రోజులు నిరసన వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, వైద్యుల ఆందోళనలకు స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. కనీసం కొత్త భవనాల నమూనాలు కూడా ఆమోదం పొందలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండటంతో కొత్త భవనానికి ఇప్పట్లో మోక్షం లభించే అవకాశం కూడా లేకపోవడంతో వైద్యులతో పాటు రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మందు కొట్టాడా..లేదా?
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’తనిఖీల్లో విచిత్రం చోటుచేసుకుంది. శ్వాస పరీక్ష యంత్రంతో ఓ యువకుడిని పరీక్షించగా మద్యం తాగినట్లు రీడింగ్ వచ్చింది. అదే యువకుడు శాంతిభద్రతల విభాగం పోలీసుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. అతడు మద్యం తాగలేదంటూ వైద్యులు తేల్చారు. వైద్యులు రక్తపరీక్షలు చేయలేదని, ఈ వ్యవహారాన్ని అభియోగపత్రాల్లో కోర్టుకు సమర్పిస్తామని సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రాజు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది వారాంతం నేపథ్యంలో సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడలోని ఐనాక్స్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి 9.05 గంటల ప్రాంతంలో ఇన్నోవాలో వచ్చిన హాజిపుర వాసి సయ్యద్ జహిరుద్దీన్ ఖాద్రీని (21) ఆపి శ్వాసపరీక్ష యంత్రంతో తనిఖీ చేశారు. దీంతో యంత్రం రీడింగ్లో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 43గా చూపింది. నిబంధనల ప్రకారం 35కంటే ఎక్కువ వస్తే అది ఉల్లంఘన కావడంతో ట్రాఫిక్ పోలీసులు జహీరుద్దీన్పై కేసు నమోదు చేశారు. అయితే తాను మద్యం తాగలేదంటూ వాదించిన ఆయన మరోసారి పరీక్ష చేయమన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం అలా చేయడం కుదరదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో జహీరుద్దీన్ నేరుగా సుల్తాన్బజార్ శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని ఆశ్రయించి ట్రాఫిక్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. దీంతో విధుల్లో ఉన్న ఎస్సై ఓ కానిస్టేబుల్ను ఇచ్చి జహీరుద్దీన్ను రాత్రి 11.35 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్స్ అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న వైద్యులు జహీరుద్దీన్ నడక, కళ్ళు, మాటతీరు పరిశీలిం చడం ద్వారా మద్యం తాగలేదంటూ నివేదిక ఇచ్చారు. పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని జహీరుద్దీన్ ఆరోపిం చారు. దీనిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రాజు ’సాక్షి’తో మాట్లాడుతూ, ‘జహీరుద్దీన్కు నిబంధన ప్రకారమే పరీక్షలు నిర్వహించాం. మావద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తాం. అభ్యంతరాలు ఉంటే కోర్టులో చాలెంజ్ చేయవచ్చు. వైద్యులు రక్తపరీక్షలు చేయాల్సి ఉండగా ఉస్మానియాలో అలా జరగలేదు’అని అన్నారు. -
ఐసీయూలో ఉస్మానియా
లక్షలాది మందికి ఆరోగ్యప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా మారింది. ఎన్నో ప్రయోగాలకు, వైద్య అద్భుతాలకు వేదికైన ఈ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పైకప్పు గురువారం మళ్లీ పెచ్చులూడింది. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు కూలడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాది మందిచికిత్స పొందుతున్న ఈ భవనంలో వైద్యం అందించడం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పెడచెవిన పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో ఎన్నో సార్లు నిధులు కేటాయించినా భవన నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు పడగకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్స చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టగా ఐదో నిజాం అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. అలా 1866 నాటికి అప్జల్గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఆధునిక వైద్యం సామాన్యులకూ చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో మూసీ వరదల్లో నేలమట్టమైంది. అయితే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అప్జల్గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఆధునిర భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి చేసుకుంది. గొప్పగొప్ప వైద్యులుసేవలందించిన ఆస్పత్రి 1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇండో పర్షియన్ శైలికి రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేసి ఈ భవనాన్ని నిర్మించగా 1925లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు. ప్రతిపాదించి పదేళ్లైనా.. నిర్వహణ లేక పాతభవనం శిథిలమైంది. ఇది రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్కుమార్రెడ్డి రూ.50 కోట్లు కేటాయించి భవన నిర్మాణానికి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చి పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కు తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. అక్కడన్నారు..ఇక్కడన్నారు.. ప్రమాదకరంగా మారిన పాతభవనంలోని రోగుల కోసం ఏడాది క్రితం కింగ్కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్ల వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులను తరలింపు ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు వేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడే నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. పలు సూచనలు చేసిన ‘ఇంటాక్’.. ♦ చారిత్ర పాతభవనం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని 2014లో దీన్ని పరిశీలించిన ఇంటాక్ ప్రతనిధులు తెలిపారు. కనీస మరమతులకు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, పూర్తిస్థాయిలో మరమతులకు రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రకటించారు. ♦ ఉస్మానియా ప్రాంగణం 26.5 ఎకరాలు ఉంది. ఇందులో పాత భవనం 2.5 ఎకరాలు మాత్రమే విస్తరించి ఉంది. రోగుల అవసరాల దృష్ట్యా కొత్త భవనం కట్టాలనుకుంటే పాత భవనాన్ని అలాగే ఉంచి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనం కట్టవచ్చు. ♦ హెరిటేజ్ భవనానికి ఎటూ వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఎత్తయిన భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది. ప్రజావసరాల దష్ట్యా ఇలాంటి అభ్యంతరాలపై హెరిటేజ్ నుంచి మినహాయింపు పొందవచ్చు. మూడు నెలలైనా.. కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల వరుసగా 90 రోజుల పాటు ఆందోళన చేశాం. ఆరోగ్యశాఖ మంత్రి జేఏసీ నేతలతో చర్చించి, 15 రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు నెలలైనా ప్లానింగ్ కాపీ కూడా ఆమోదముద్ర పొందలేదు. ప్రాణాలకు కనీస రక్షణ లేని ఈ భవనంలో వైద్యం అందించలేం. – డాక్టర్ పాండునాయక్, చైర్మన్,ఉస్మానియా వైద్యుల జేఏసీ -
మళ్లీ కూలింది..
చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు అనంతయ్య(60). షాద్నగర్ తొండపల్లికి చెందిన ఈయనకు 20 రోజుల క్రితం బైక్ ఢీకొట్టింది. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనం లోని ఆర్థోపెడిక్ వార్డులో ఇటీవల ఇన్పేషంట్గా చేరాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి ఆయనపై పడింది. ఆయన్ను వెంటనే ఐసీయూకు తరలించారు. అదేవార్డులోని రోగులంతా భయంతో బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. నెలలోనే 3సార్లు పెచ్చులూడి పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, హైదరాబాద్: లక్షలాది రోగుల ఆరోగ్యప్రదాయిని అయిన ఉస్మానియా ఆస్పత్రి నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో పైకప్పు గురువారం ఉదయం మళ్లీ పెచ్చులూడి పడింది. అసలే వర్షాకాలం.. ఆపై పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపు తున్నారు. భవనం నిర్మించి సుమారు వందేళ్లు కావొస్తుం డటం, ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ నెల 19న 12 ఫీట్ల ఎత్తున్న దోబీఘాట్ గోడ కూలగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నెల 13న ఓపీ భవన ప్రధాన ద్వారం ఫోర్టికో పైకప్పు కూలింది. భారీ శబ్దం రావడంతో ఓపీలోని రోగులు భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. నెల క్రితం పాత భవనం రెండో అంతస్తులో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఇప్పటికే ఈ విభాగాన్ని ఖాళీ చేయడంతో పెద్ద ప్రమాదం త ప్పింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే పాత భవనం రెండో అంతస్తును ఖాళీ చేయించాం. అందులోని 240 పడకల ను ఫస్ట్, గ్రౌండ్ ఫ్లోర్లో సర్దుబాటు చేశాం. పాత భవనం దుస్థితిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వర్షానికి స్లాబ్లు, గోడల నాని బలహీనంగా తయారయ్యాయి. - డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి -
మళ్లీ కూలిన ‘ఉస్మానియా’ పైకప్పు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు మళ్లీ కుప్పకూలింది. వందల మంది చికిత్స పొందుతున్న ఈ భవనంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులూడి కింద పడటంతో భారీ శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అసలే వర్షాకాలం..ఆపై రోజుకో చోట పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు ఆందోళేన చెందుతున్నారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులకు ఇది సురక్షితం కాదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. దీంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి.. 2009లో రూ.5 కోట్లు మం జూరు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్కుమార్రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనం స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలుసహా పురావస్తు శాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. -
ఉస్మానియాలో గుట్కా, సిగరెట్లపై నిషేధం
అఫ్జల్గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ నాగేందర్ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటి మేనేజర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
కాటేస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నే సమయంలో పుట్టలు, ఏపుగా పెరిగిన గడ్డి నుంచి పాములు బయటికి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి 149 పాము కేసులు వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం గమనార్హం. పాము కాటుతో పాటు ఇతర విషపు పురుగులు కుట్టి ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్ వీనం మందుతో పాటు వెంటిలేటర్ సపోర్ట్, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. పాము కాటును గుర్తించి, ఆస్పత్రికి తరలింపులో తీవ్రజాప్యం జరుగుతుండటంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు. మూడు గంటలు మించితే ప్రాణాపాయమే.. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్లు ఓ అంచనా. మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 250 జాతుల పాములంటే వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కనిపించే పాముల్లో 5 జాతులు మాత్రం అత్యంత విషపూరితమైని. ఇవి కాటేసిన మూడు గంటల్లో మనిషి చనిపోతాడు. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాటువేసిన పాము విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విషపూరితమైందని.. మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా గుర్తించాలి. విషపూరిత సర్పం కాటువేస్తే గాయమైన ప్రాంతం నుంచి విషం శరీరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి ఇతర శరీర భాగాలు, మెదడుకు రక్తం ద్వారా చేరుకుంటుంది. పాము విషం అన్ని శరీర భాగాలకు చేరడానికి మూడు గంటలు పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపై అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తమని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ఎంఎల్ నుంచి 2 ఎంఎల్ వరకు మాత్రమే. అలాగే కేవలం రూ.5 నుంచి రూ.10 విలువుండే నాజా 200 అనే 5ఎంఎల్ హోమియోపతి ఔషధం ఇంట్లో ఉంచుకోవాలి. దీనిని పాము కాటుకు గురైన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి మూడుసార్లు వేస్తే త్వరగా కోలుకుంటాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. -
సర్జరీల్లో ఘనాపాఠి!
ధనార్జనే ధ్యేయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవృత్తిని దైవంగా భావించి పేదల పాలిట వైద్య నారాయణుడిగా మారారు ఆయన. తండ్రి చూపిన సేవా మార్గంలో పయనిస్తూ వేలాది శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఆయన. ప్రభుత్వ దవాఖానాలపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వర్తిస్తూ.. గడిచిన ఆరున్నరేళ్లలో 13,139 శస్త్ర చికిత్సలు చేశారు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్లాస్టిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్. అఫ్జల్గంజ్ : నాగప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం. తండ్రి కృష్ణమూర్తి చీఫ్ ఇంజినీర్. తల్లి పుష్పలత. వీరి కుటుంబం హైదరబాద్లో స్థిరపడింది. కృష్ణమూర్తి దంపతులకు నాగప్రసాద్, శ్రీనివాస్ ఇద్దరు కుమారులు. నాగప్రసాద్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. నాగప్రసాద్ 1994లో సూపర్ స్పెషలిటీ (ప్లాస్టిక్ సర్జన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1997లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. 2004లో అసోసియేట్ ప్రొఫెసర్గా, 2009లో ప్రొఫెసర్గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మూడేళ్లు పని చేసి 300 శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం బదిలీపై నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. 2012 నుంచి ఇప్పటివరకు 13,139 శస్త్ర చికిత్సలు చేశారు. ప్రతి ఏటా వెయ్యికిపైగా శస్త్ర చికిత్సలు చేసి పేదోల పాలిట ప్రాణదాతగా నిలుస్తురు. ఉస్మానియాలోనూ కార్పొరేట్ వైద్యం.. పేదోలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కార్పొరేట్ స్థాయిలో ఉస్మానియా ఆస్పత్రిలోనూ వైద్యం అందుతోంది. పేదవాళ్లు డబ్బులు వృథా చేసుకోకుండా ఉస్మానియాలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేసుకోవాలి. – డాక్టర్ నాగప్రసాద్ -
పెళ్లి విషయమై వాగ్వివాదం
శంషాబాద్: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం తో పోలీసులను ఆశ్రయించడానికి బయలుదేరిన ఓ జంట మార్గమధ్యలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొయినాబాద్ మండలం ఎల్కగూడకి చెందిన జోషి(21) అదే మండలం చిల్కూరుకు చెందిన నయోమి(22) ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నయోమికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో వెంటనే పెళ్లి చేసుకుందామని జోషిపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో శనివారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మార్గమధ్యలో జోషి మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని నయోమితో చెప్పాడు. ఈ విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అసహనంతో జోషి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో నయోమి కూడా అతడిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరికీ మంటలంటుకున్నాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పోలీసుల దిగ్బంధనంలో ఉస్మానియా ఆస్పత్రి!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు అనూహ్యంగా శనివారం సాయంత్రం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఏకంగా 100 మంది ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రిని దిగ్బంధనం చేశారు. ఆస్పత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ ఆకస్మిక కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆస్పత్రిలోని రోగులు, వారి సహాయకుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇన్సూరెన్స్ బ్రోకర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని రోగులను మాయమాటలతో మోసం చేసే దళారులనూ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను మోసం చేస్తున్న బోకర్ల బాగోతం కార్డాన్ సెర్చ్లో బహిర్గతం అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి. -
ఉస్మానియాలో ఆకస్మిక తనిఖీలు : లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఆయన కు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూపర్డెంట్కు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులను మీరు ఏ సమస్యల వలన ఆసుపత్రికి వచ్చారు, మీకు వైద్యం సరిగ్గా అందుతందా లేదా అని మంత్రి అడుగగా దానికి వారు భాగనే ఉందని సమాదానం ఇచ్చారు. రోగులకు ఐసీయు లోని వివిధ విభాగాలను పరిశీలిచి, తాగు నీరు, డోర్స్, వెంటిలేటర్లు, లిఫ్ట్, ఆక్సిజన్ వంటి అంశాలను పరిశీలించారు. లిఫ్ట్ మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మంత్రి వెంట ఉస్మానియా సూపర్డెంట్ నాగేందర్ ఆర్ఎంఓలు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం కోసం ఉస్మానియాకు.. మహిళపై దారుణం!
సాక్షి, హైదరాబాద్ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రి పంపించడంతో.. కీచకులు బాధితురాలిపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త తనను కొట్టాడంతో ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైద్యం కోసం బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ తనపై వార్డ్బాయ్ నాగరాజు, హోంగార్డ్ ఒమర్ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వైద్యం అందక రోగి మృతి
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 17 రోజు ల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన శనివారం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని కార్వాన్కు చెందిన కోరని బాగ్యలక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త చి న్నా ఆమెను లంగర్హౌజ్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీం తో ఆమెను ఈ నెల 3న ఉస్మానియాకు తరలించగా, 5న అడ్మిట్ చేసుకున్నారు. బాగ్యలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ‘బలహీనంగా ఉంది. అడ్మిట్ వద్దు. సమయానికి తినిపించండి. బాగవుతుంది. మందు బిళ్లలు వేయడం మరవద్దు’అని చెప్పి పంపించారు. -
పాత భవనంలో పనిచేయలేం..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పనిచేయలేమంటూ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్య, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వైద్యులు, ఉద్యోగులు తొలిరోజు సోమవారం ఉదయం గంటపాటు ఔట్పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేశారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయని వైద్యులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ సేవలందించలేమని స్పష్టం చేశా రు. రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని, వెంటనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రభు త్వం హామీ వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నిరసన లో పాల్గొనడంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోగులు ఇబ్బందిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం నిర్వహణాలోపంతో శిథిలావస్థకు చేరుకుంది. వైద్యచికిత్సలకు ఈ భవ నం సురక్షితం కాదని, వెంటనే ఖాళీ చేయాలని పదేళ్ల క్రితమే ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఉస్మానియా వైద్యాధికారుల్లో కదలిక
సాక్షి, హైదరాబాద్: సిబ్బంది పనితీరుపై మరింత దృష్టి సారించాలని ఉస్మానియా ఆస్పత్రి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది రాకపోకలు, రోగులపట్ల అనుసరిస్తున్న తీరు, వార్డుల్లోని సేవలు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకు రావాలని యోచిస్తున్నారు. అత్యవసర విభాగంలో అర్ధరాత్రి సేవలు నిలిచిపోయిన ఘటనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ స్పందించారు. సోమవారం క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(సీఎంవో), డ్యూటీ ఆర్ఎంవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఈ విభాగంలో మెరుగైన సేవలు అందించేందుకు మెడిసిన్, సర్జరీల నుంచి ఒక్కో పీజీని కేటాయించేందుకు అంగీకరించారు. ఆర్ఎంవోలతో రోజూ మధ్యాహ్నం సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని, సూపరింటెండెంట్ స్థాయిలో సాధ్యంకాకపోతే డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఔట్పేషెంట్ విభాగానికి రోజుకు సగటున 2,500 మంది రోగులు వస్తున్నారు. ఇన్పేషెంట్ వార్డుల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులకు సరిపడ సంఖ్యలో వైద్యులున్నా అత్యవసర పరిస్థితుల్లో ఎవరూ అందుబాటులో ఉండటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వల్ల డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కా హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ అటెండెన్స్ను వినియోగించుకోవడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా వార్డులపై నిఘా పెంచాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఇకపై మరింత కఠిన నిర్ణయాలు నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. రోగులందరికీ సేవలు అందేవిధంగా చూస్తాం. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు, ఆర్ఎంవోలు, సిబ్బంది సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా