survey
-
తాజా కాదు.. ఈజీ ఫుడ్డుకే జై
సాక్షి, హైదరాబాద్: అధిక పోషకాలుండే తాజా ఆహార పదార్థాల కంటే సులభంగా అందుబాటులో ఉండే నిలువ ఉండే ఆహారంపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆహారానికి చేస్తున్న ఖర్చులో.. ప్రాసెస్డ్ ఆహారానికి సంబంధించిన వ్యయమే ఎక్కువగా ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు 24.44 శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే– 2023–24’ స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు 20.93 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంత ప్రజలు 27.95 శాతం ఖర్చు పెడుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ... వినియోగం మాత్రం వేగంగా పెరుగుతూ వస్తోంది. ఆధునిక జీవనశైలికిఅనుగుణంగా.. ఆధునిక జీవనశైలికి అనుగుణంగాఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు,విద్యార్థులు వారి రోజువారీ కార్యకలాపాల్లో బిజీ ఉంటూ వెంటనే అందుబాటులో ఉండే (అత్యవసర ఆహారం) నిల్వ ఉండే, శుద్ధి చేసి భద్రపర్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగాఉండకపోవడం, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా ఉపయోగించే రసాయనాల కారణంగా అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్డ్రింక్లు, చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు.పాలు, పండ్లను మించి ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ వినియోగ వ్యయ సర్వేలో ఆహారంపై చేసే ఖర్చును ఏడు కేటగిరీల్లో లెక్కించారు. తృణధాన్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు తదితర ఈ ఏడు కేటగిరీల్లోనూ ప్రాసెస్డ్ ఆహారం, బేవరేజెస్ (పానీయాలు) ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాహారాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా ప్రాసెస్డ్ ఆహారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, కూరగాయలకు ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఇక్కడ ఈ సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా, తాజా సరుకుల లభ్యత కష్టంగా ఉండడంతో వీటి వినియోగానికి ప్రాధాన్యత తగ్గుతోంది. మరోవైపు హోటళ్లు, కర్రీ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూరగాయల కొనుగోలుపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రాల్లో తమిళనాడు టాప్ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో (పట్టణ ప్రాంతం) తమిళనాడు (34.30 శాతం) మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ, కర్ణాటక, అసోం, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. గ్రామీణ ప్రాంత కేటగిరీలోనూతమిళనాడు (29.89 శాతం)ముందుండగా.. అసోం, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్, ఒడిశా, గుజరాత్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో జాతీయ సగటును మించి.. రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆహారం కోసం చేస్తున్న వ్యయంలో ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే 27.23 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 2.79 శాతం అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మొత్తం ఆహారంలో ప్రాసెస్డ్ ఆహారంపై 20.84 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 33.63 శాతంతో దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశ సగటుతో పోలిస్తే మన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతంలో ఆందోళనకర స్థాయిలో ఉండడం గమనార్హం. -
ఓబీసీల కలను నిజం చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారి వివరాలను కూడా సేకరించనుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో కలిసి భట్టి మీడియాకు వెల్లడించారు.బిల్లుకు పూర్తి చట్టబద్ధత కోసం చర్యలు‘రాష్ట్రంలోని బీసీలు, ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, తదితర రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా..దశాబ్దాల ఓబీసీల కలను నిజం చేసే దిశలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసి పార్లమెంట్కు పంపిస్తాం. ఆ తర్వాత కలసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుంది. ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను కలిసి ఈ బిల్లుకు పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపడతాం. పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను, శక్తులను ఏకం చేస్తాం..’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.మూడు పద్ధతుల్లో వివరాల నమోదు‘ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. అలాంటి వారు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు తమ వివరాలు, సమాచారం నమోదు చేసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో అంటే.. టోల్ ఫ్రీ నంబర్ (ఇంకా ప్రకటించలేదు)కు ఫోన్ చేసి, మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారుల వద్ద, ఆన్లైన్లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి కోరితే అధికారులు వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వంటి వారు గతంలో ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు అలాంటి వారందరి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నాం..’ అని భట్టి వివరించారు. బీసీల ప్రయోజనాల కోసం భారం మోసేందుకు సిద్ధం‘ఇప్పటికే ఏడాదికి పైగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు ఆలస్యమైతే మరింత ఇబ్బంది అవుతుంది కదా..’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో ‘కులగణనలో రాష్ట్రంలో బీసీలు 56 శాతమున్నట్టుగా తేలిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం మరో 2, 3 నెలలు ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని భట్టి బదులిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తి శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే జరిగిందని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి సర్వే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జాజులసమగ్ర ఇంటింటి కులగణన సర్వేను మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బీసీలు, ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయాలని నిర్ణయించడం శుభ పరిణామమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే (telangana census survey)నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ విజ్ఞప్తులపై భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుంది. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నాం.సర్వేలో పాల్గొనే వాళ్ళు టోల్ ఫ్రీ, మండల కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు..కేసీఆర్ (kcr), కేటీఆర్ లాంటి వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభాలో వీళ్ళు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేస్తాం.అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి..కేంద్రానికి పంపుతాం. త్వరలోనే తెలంగాణ నుంచి బృందంగా వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ పెద్దలను కలుస్తాం. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు కలిసివచ్చే రాజకీయ పార్టీలను తీసుకెళ్తాం. దశాబ్దాల బీసీ కల త్వరలోనే నెరవేర్చబోతున్నాం. ఓబీసీల లక్ష్యాలను సాధించడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు ప్రకటన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తుందని ఆశిస్తున్నాం. మా పార్టీ ఎంపీలే కాదు...అన్ని పార్టీల ఎంపీలను కలుపుకోని వెళ్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 👉చదవండి : రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన! -
తూర్పుతీరంలోకి.. కొత్త చేపలొచ్చాయ్!
విశేష మత్స్యసంపదకు పేరు గాంచిన ఏపీలోని తూర్పుతీరానికి ఇప్పుడు కొత్త చేపలొచ్చాయ్. సుమారు 11 రకాల కొత్త చేపల జాతులు తాజా సర్వేలో బయటపడినట్టు సమాచారం. దేశంలోనే అతి పెద్ద సర్వేగా జెడ్ఎస్ఐ (జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) దీన్ని నిర్వహించింది. సుమారు నాలుగేళ్లపాటు చేసిన పరిశోధనల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జెడ్ఎస్ఐ తన అధ్యయనంలో వెల్లడించింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురంకొత్త చేపల జాతులు ఏపీలో కొన్ని చేపల రకాలకు భారీ డిమాండ్ ఉంది. పులస, వంజరం, కచ్చిడి వంటివి ప్రసిద్ధి. ఇక చిన్న చిన్న గుర్తింపులేని చేపల జాతులు చాలానే ఉన్నాయి. తాజాగా... జెడ్ఎస్ఐ సర్వేలో 11 రకాల ప్రముఖ చేపల జాతులు తూర్పుతీర సముద్రగర్భంలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇందులో ఎంటోమాక్రోడస్ థాలసినన్ అనే రీఫ్ ఫిష్ను తొలిసారి కనుగొన్నారు. గతంలో ఈ చేప జపాన్, ఫ్రెంచ్ పాలినేషియా, ఆ్రస్టేలియా, శ్రీలంక, పాపువా న్యూగినియా, ఫిలిప్పీన్స్, న్యూ కాలెడోనియా, మడగాస్కర్లకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు దీని ఉనికిని ఆంధ్రప్రదేశ్లోనూ కనుగొనడం విశేషం.విశాఖ తీరంలో ‘వేల్’ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన వేల్ షార్క్ విశాఖలోని సంతపల్లి రాక్స్ దగ్గర కనిపించినట్టు జెడ్ఎస్ఐ వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన ఈ జాతులు అరుదుగా కనిపిస్తాయని పేర్కొంది. ఈ మొత్తం అధ్యయనంలో విస్తృతమైన జీవవైవిధ్యాన్ని పరిశీలించినప్పుడు 91 జాతులు, 33 కుటుంబాలకు చెందిన జీవరాశులను గుర్తించినట్టు పరిశోధనలో తెలిసింది. అంతేకాదు బ్రాచ్యురాన్ పీతలు కూడా ఉన్నట్టు బయటపడింది. ఈ పీతల జాతులు అరుదుగా ఉన్నాయని, ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఈ అధ్యయనం వల్ల ఇలా అంతరించి పోతున్న జాతులను కాపాడుకునే వీలుంటుందని సర్వే తేల్చింది. తాజాగా గుర్తించిన చేపల జాతులు క్యాన్సర్ వ్యతిరేక ట్యూమర్ (కణితులు)లు నియంత్రించడం, యాంటీ వైరల్ లక్షణాలతో కూడిన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయని పేర్కొంది.లోతుగా సర్వేసముద్ర ఉపరితలం నుంచి 8 మీటర్ల నుంచి 24 మీటర్ల లోతులో ఈ అధ్యయనం చేసినట్టు జెడ్ఎస్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతానికి మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, దీనినుంచి సముద్రజాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తేల్చారు. చాలా జాతులు సముద్ర ఉష్ణోగ్రతలు, ఆమ్లీకరణ, రసాయన కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్టు తేల్చారు. ఏపీ తీరం వెంబడి ప్రధానంగా తిమింగలం, సొరచేపల కోసం వెదుకులాట ఎక్కువగా ఉన్నట్టు కూడా కనుగొన్నారు. -
తయారీ ఆహరంపైనే మక్కువ ఎక్కువ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు తయారీ ఆహారం (ప్రాసెస్డ్ ఫుడ్)పైనే మక్కువ చూపుతున్నారు. వీటిపైనే అత్యధిక వ్యయం చేస్తున్నారు. ఈ విషయాన్ని 2023–24 గృహ వినియోగ సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఆహార వ్యయంలో 20.93 శాతం ప్రాసెస్ చేసిన ఆహారంపై వ్యయం చేస్తుంటే.. పట్టణ వాసులు ప్రాసెస్ ఆహారంపై 27.95 శాతం వ్యయం చేస్తున్నారు. ఏపీలోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 20.07 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.72 శాతం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వినియోగిస్తున్నారు. గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో పాల ఉత్పత్తులపై గరిష్టంగా వినియోగిస్తున్నారు. కేరళలోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో గుడ్లు, చేపలు, మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్టాప్లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్టాప్ పక్కనబెడితే స్మార్ట్ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల్యాణం క‘మనీ’యం
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఇప్పుడీ రెండూ బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లి ఖర్చులు తడిసి మోపెడై చుక్కలు తాకుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లని, డెస్టినేషన్ వెడ్డింగ్లని ఎవరూ, ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య జరిగిన కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ఏకంగా రూ.5,000 కోట్లు ఖర్చయిందని అంచనా. బడా వ్యాపారవేత్తల పెళ్లిళ్ల భారీ ఖర్చుల విషయాన్ని అలా ఉంచితే.. మామూలు జనం కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సగటు వివాహ ఖర్చు ఏకంగా రూ.32 లక్షలు దాటిపోయింది.దేశంలో వివాహ వేడుకల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. జీవితకాల జ్ఞాపకం కోసం ఖర్చుకు వెనుకాడొద్దనే ధోరణి పెరుగుతోంది. దీంతో సగటు వివాహ వేడుకల ఖర్చు 2023లో రూ.28 లక్షలుగా ఉంటే.. గతేడాది 14 శాతం పెరిగి రూ.32 లక్షల నుంచి రూ.35 లక్షలకు చేరినట్టు వెడ్డింగ్ టెక్నాలజీ ప్లాట్ఫాం వెడ్డింగ్ వైర్ ఇండియా నివేదిక చెబుతోంది. దీని ప్రకారం.. 2022–2024 మధ్య కాలంలో పెళ్లి ఖర్చు ఏకంగా 28 శాతం పెరిగింది.2023–24లో వివాహ వేడుకల పరిశ్రమ సుమారు రూ.10.9 లక్షల కోట్లు దాటిపోయినట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు అతిథుల విషయంలోనూ పెళ్లివారి ధోరణి మారుతోంది. భారీగా 300 మందికిపైగా అతిథులతో జరుపుకొనే వివాహాల సంఖ్య గతేడాది 16 శాతం పెరిగింది. అదే సమయంలో తక్కువ మందితో 100 మందిలోపు అతిథులతో జరుపుకొనే పెళ్లిళ్లు 27 శాతం పెరిగాయి. మొత్తమ్మీద పెళ్లిళ్లకు సగటున గెస్ట్ లిస్ట్ 119గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.కొత్త డెస్టినేషన్లపై మక్కువ..లగ్జరీ విషయంలో రాజీ పడకుండా, మరీ ఎక్కువ మందితో గందరగోళం తలెత్తకుండా కాస్తంత ప్రైవసీ కోరుకుంటున్నవారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో దేశీయంగా కొత్త డెస్టినేషన్లు తెరపైకి వస్తున్నాయి. హడావుడిగా ఉండే సాధారణ వెడ్డింగ్ స్పాట్లతో పోలిస్తే ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతాల వైపు మొగ్గుచూపే వారు పెరుగుతున్నారు. సాధారణంగా జైపూర్, గోవా, ఉదయ్పూర్ వంటి ప్రాంతాల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని కొత్త ప్రాంతాలూ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తెరపైకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని నైనిటాల్, డెహ్రాడూన్.. కేరళలోని వయనాడ్ వంటి ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది.కొత్త కాన్సెప్టులతో.. ఖర్చు తగ్గించుకునేలా.. భారీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడమే కాదు.. ఖర్చును బాగా తగ్గించుకోవాలనుకునే వారూ ఉంటున్నారు. దీంతో వీక్ డే వెడ్డింగ్లనే కాన్సెప్టులూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆదివారాలు, సెలవు రోజులైతే పొలోమంటూ అందరూ వచ్చేసి, ఖర్చులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఆఫీసులు ఉండే రోజుల్లో పెళ్లిళ్లను ఫిక్స్ చేసుకుంటున్నారు కొందరు. ఇందుకోసం సోమవారం, మంగళవారాలు పాపులర్ చాయిస్గా ఉంటున్నాయి. వీకెండ్ వెడ్డింగ్లతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చులో అయిపోతున్నాయి.నవంబర్ టు మార్చ్.. కోటి పెళ్లిళ్లు..సీజన్లపరంగా చూస్తే శీతాకాలంలో పెళ్లికి మొగ్గు చూపే వారు ఎక్కువగా ఉంటున్నారు. మంచి ముహుర్తాలు ఉండటంతో నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిపై ఆసక్తి ఉంటోంది. 2024లో జరిగిన పెళ్లిళ్లలో 18.5 శాతం ఒక్క నవంబర్లోనే జరిగాయి. మొత్తమ్మీద నవంబర్–మార్చి మధ్య ఏటా కోటిపైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఆలిండియా ట్రేడర్ల సమాఖ్య గణాంకాల ప్రకారం.. 2023లో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలున్న 23 రోజుల్లో ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అలాంటిది గతేడాది నవంబర్–డిసెంబర్ వెడ్డింగ్ సీజన్లో 35లక్షల పెళ్లిళ్లు జరిగిన నేపథ్యంలో.. రెండు నెలల వ్యవధిలోనే ఇంతకుమించి బిజినెస్ జరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.స్టాక్ మార్కెట్లో పెళ్లి సందడి..వివాహాల సంబంధ థీమ్తో లాభపడే స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెడ్డింగ్ ప్లానింగ్, కేటరింగ్, ఫొటోగ్రఫీ, జ్యుయలరీ.. ఇలా పెళ్లిళ్లకు సంబంధించి వివిధ రకాల సర్వీసులు అందించే కంపెనీల షేర్లలోనూ సందర్భానుసారం పెట్టుబడులు పెట్టి లాభాలు గడించవచ్చని పేర్కొంటున్నారు. వేదాంత ఫ్యాషన్స్, కల్యాణ్ జ్యువెలర్స్, ఇండియన్ హోటల్స్, టైటాన్ తదితర స్టాక్స్ ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నారు.ఆహారం తర్వాత పెళ్లిళ్ల ఖర్చే ఎక్కువ..దేశంలో ఫుడ్–గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల పరిశ్రమ విలువే అత్యధికమని జెఫరీస్ అధ్యయనంలో తేలింది. ఆ వ్యయాల విలువను చూస్తే...పరిశ్రమ విలువ (రూ.లక్షల కోట్లలో)ఫుడ్–గ్రోసరీ 56.9పెళ్లిళ్లు 10.9వస్త్రాలు, యాక్సెసరీస్ 7జ్యువెలరీ 6.5ఫర్నీచర్, హోం 3.5కన్సూమర్ పరికరాలు 3.2మొబైల్ ఫోన్లు 2.7హెల్త్, బ్యూటీ కేర్ 2.7ఫుట్ వేర్ 0.9 -
ప్రతి ఇద్దరిలో ఒకరు ఏఐ యూజర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణాల్లోనే అనేక రకాల పనులు చేసిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫ్లాట్ఫామ్ల వాడకం కూడా వేగం పెరుగుతోంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్ఫామ్ను వాడుతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్తకొత్త ఏఐ ఫ్లాట్ఫామ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. చాట్జీపీటీ, గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్ జెమిని, మెటాకు చెందిన లామా 3.. ఇలా అనేక రకాల ఏఐ ఫ్లాట్ఫామ్ల వాడకంపై గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 92 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. డీప్సీక్ ఏఐ ప్లాట్ఫామ్కు త్వరలో మారాలనుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది తెలిపారు. అయితే ఏఐ ఫ్లాట్ఫామ్లు వాడి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది చెప్పగా.. 28 శాతం మంది కచ్చితమైన సమాచారమని అంగీకరించారు. ఏఐ ప్లాట్ఫామ్లను వాడబోమని.. కానీ గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లను వాడతామని 40 శాతం మంది తెలిపారు. ఏమీ చెప్పలేమని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
లెక్క తప్పలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ ఎక్కడా లెక్క తప్పలేదని, అన్ని సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ప్రస్తుత కులగణనలో లభించిన సమాచారం ఆధారంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె గాందీభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడిన సీతక్క కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. మేక వన్నె పులిలా బీసీ, ఎస్సీల హక్కులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేశారని, అదంతా కేవలం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు కులగణన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆలె నరేంద్ర, ఈటల రాజేందర్ లాంటి బలమైన బీసీ నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టారన్నారు. తమ సర్వేను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు జరిగిన కులగణన ఎందుకు బయటపెట్టలేదో కేసీఆర్ను ప్రశ్నించలేదని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం, ఇన్చార్జ్ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, ప్రతి మూడు నెలలకోసారి ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని సీతక్క చెప్పారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఆయన సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. అధికారులను వెళ్లి కలవండి మంత్రితో ముఖాముఖిలో భాగంగా తమకు వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు చేరవేస్తామని, వాటి పరిష్కారానికి ప్రజలు స్థానిక అధికారులను సంప్రదించాలని సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్రామాల రోడ్లు, హోంగార్డు ఉద్యోగాలు, పంట రుణాల మాఫీ, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల ఏర్పాటు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ధరణి తదితర అంశాలపై ప్రజలు మంత్రి సీతక్కకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ.ఫహీం, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ నేత అల్లం భాస్కర్ పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్కు పూడిక సమస్య
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న బృహత్తర శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక సమస్య భవిష్యత్తులో పెద్ద అవరోధం కానుంది. ఈ జలాశయాన్ని 1978లో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. తరువాత 1996లో ‘ఏపీఈఆర్ఎల్’చేపట్టిన సర్వేలో.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి 2024 వరకు.. అదే నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికారులు చూపుతూ వచ్చారు. తరువాత కొన్ని నెలల క్రితం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ జలాశయం నీటి నిల్వ 1,091 అడుగులు, 80.5 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో.. ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏటా వచ్చి చేరుతున్న పూడిక.. అధికారులు చెబుతున్న లెక్కల కంటే ఎక్కువ ఉంటుందని, జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం చెబుతున్న లెక్కల కంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కేవలం 70 టీఎంసీలు ఉంటుందని వాదనలున్నాయి. అధికారులు ప్రకటించిన 80.5 టీఎంసీలపై అనేక అనుమానాలున్నాయి. కాగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ.. ఆయకట్టు అలాగే ఉంటోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయకట్టుకు సాగునీరు అందించడమనేది గగనమే అని అర్థమవుతోంది. మూడేళ్లుగా జలాశయంలోకి 70 టీఎంసీల మేర నీరు చేరగానే.. వరద గేట్ల ద్వారా గోదావరి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్ట్ జలాశయంలో పూడిక తీసివేతకు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పూడిక తొలగించకపోతే భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టుగానే మిగిలిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. -
కుటుంబానికే ఓటు!
ముంబై: వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలు.. వారంలో 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు దానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, జోకులు, కామెంట్లు, వాదనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాలుపంచుకున్న 78 శాతం మంది ఉద్యోగులు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండీడ్ ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ ఉద్యోగుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు వచి్చంది. దాదాపు ఐదుగురిలో నలుగురు (78 శాతం) 2025లో కెరీర్లో పురోగతి కంటే జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో గడిపేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు తక్కువ ఒత్తిడిని కోరుకుంటున్నారు. మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యత కావాలంటున్నారు. జాబ్ మార్కెట్పై సానుకూలం.. భారతీయ ఉద్యోగులు జాబ్ మార్కెట్ గురించి ఆశాజనకంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమలలో అవకాశాల విస్తరణపై 55 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇందుకు అనువుగా తమనితాము మలుచుకుంటున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాంతానికైనా వెళ్లి పనిచేసేందుకూ రెడీ అంటున్నారు. ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ.. సురక్షిత ఉద్యోగం, న్యాయమైన వేతనం, ప్రత్యేకతను చూపే ప్రయోజనాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఇండీడ్ ఆ్రస్టేలియా, ఇండియా, సింగపూర్ మార్కెటింగ్ డైరెక్టర్ రేచల్ టౌన్స్లీ తెలిపారు. 2024 డిసెంబర్–2025 జనవరి మధ్య చేపట్టిన ఈ సర్వేలో ఉద్యోగ వేటలో ఉన్న 2,507 మంది భారతీయులతో సహా సింగపూర్, జపాన్, ఆ్రస్టేలియాకు చెందిన 6,126 మంది పాలుపంచుకున్నారు. నైపుణ్యాల ఆధారంగానే.. అధునాతన సాంకేతికతలను స్వీకరించేందుకూ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని నివేదిక వివరించింది. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత కూడిన రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని 55 శాతం మంది ఆశాభావంతో ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజొల్యూషన్, డేటా లిటరసీ, ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ వంటివి 2025లో కెరీర్ పురోగతికి ఉపయోగపడే నైపుణ్యాలుగా భావిస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ–ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలు ఉంటాయని 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. ఈ ధోరణి సాంకేతికత, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగాల కోసం పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు తగ్గట్టుగా అనుకూలత, ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించగల అభ్యర్థులకు కంపెనీలు ఎక్కువగా విలువ ఇస్తున్నాయి. ప్రతిభావంతులకే గుర్తింపు, తదుపరి దశలకు వెళ్తారన్న భావన ఉద్యోగుల్లో ఉంది’ అని నివేదిక వివరించింది. -
పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నట్లు గ్రాంట్ థార్టన్ భారత్(Grant Thornton Bharat) ఇటీవల నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సర్వేలో వెల్లడించింది. 500 మందికి పైగా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన వివరాలతో ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.తక్కువ పన్ను రేట్లు: ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం మంది ప్రతివాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అధిక మినహాయింపు పరిమితులు: 25 శాతం పన్ను చెల్లింపుదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి అధిక మినహాయింపులు ఆశిస్తున్నారు.కొత్త పన్ను విధానం: 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ, 63 శాతం మంది ఇప్పటికీ పాత విధానంలో ప్రోత్సాహకాలను పెంచాలని కోరుతున్నారు.నష్టాలు పూడ్చడానికి అనుమతి: కొత్త పన్ను విధానం ప్రకారం ఇంటి ఆస్తి నష్టాలను పూడ్చడానికి అనుమతించాలని 53 శాతం మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎయిర్పోర్ట్లో రూ.10కే టీ, రూ20కే సమోసా!చెల్లింపుదారుల మనోభావాలువ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ డిస్పోజబుల్ ఆదాయాన్ని(టాక్స్లు చెల్లించిన తర్వాత ఖర్చు చేయడానికి అనువైన డబ్బు) పెంచుకోవడానికి వ్యక్తిగత పన్ను విషయంలో ఉపశమనం పొందాలని చూస్తున్నారు. తక్కువ పన్ను రేట్లు, అధిక మినహాయింపు పరిమితులు కోరుతున్నట్లు సర్వేలోని అంశాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటే ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడుతుందని ప్రతివాదులు నమ్ముతున్నారు. -
విశ్వాసంలోఒక మెట్టు కిందికి..
అధిక ఆదాయం దేశాల్లోనే..భారత్ ప్రధాన కేంద్రంగా ఇతర దేశాలు కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలపట్ల ప్రజల విశ్వాసంలో మన దేశం 13వ స్థానానికి పరిమితమైంది. ఈ విషయంలో కెనడా టాప్లో నిలిచింది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థల పట్ల అధిక ఆదాయ దేశాల్లో సగటున 61 శాతం, అల్పాదాయ దేశాల్లో సగటున 48 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అల్పాదాయ దేశాల్లో వ్యాపార సంస్థల పట్ల ప్రజలు తటస్థంగా ఉన్నారు. ఎన్జీవోలు, ప్రభుత్వం, మీడియా విషయంలో భరోసా లేదని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న జనాభాలో భారతీయ సంస్థల పట్ల విశ్వాసం 65 శాతం ఉంటే, అధిక ఆదాయ వ్యక్తుల విషయంలో ఇది 80 శాతంగా ఉంది. చాలా దేశాల్లో ఎన్నికలు లేదా ప్రభుత్వ మార్పుల ప్రభావం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. ఏదైనా వార్త విషయంలో విశ్వసనీయ సమాచారమా లేదా మోసగిస్తున్నారా అన్నది తేల్చుకోలేకపోతున్నట్టు 63 శాతం మంది చెప్పారు. ఈ అభిప్రాయాన్ని థాయ్లాండ్లో 75 శాతం మంది, భారత్లో 72 శాతం మంది వ్యక్తంచేశారు. -
10 కిలోమీటర్లు.. 32 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: రద్దీ వేళల్లో హైదరాబాద్ రోడ్లపై ఓ వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే.. సరాసరిన 32 నిమిషాలు పడుతోంది. అంతర్జాతీయ సంస్థ టామ్టామ్ ఈ విషయం ప్రకటించింది. ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ (14వ ఎడిషన్) పేరుతో సోమవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఆయా నగరాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా, హైదరాబాద్కు జాతీయస్థాయిలో నాలుగో ర్యాంక్, అంతర్జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్ దక్కింది. 62 దేశాలో సర్వే ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలి యా ఖండాల్లోని 62 దేశాల్లో టామ్టామ్ సంస్థ సర్వే చేపట్టింది. వీటిలో ఉన్న నగరాలను 3 కేటగిరీలుగా విభజించింది.» 80 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటిని మెగా సిటీలు, 80 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని లార్జ్ సిటీ, 8 లక్షలు అంత కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని స్మాల్ సిటీలుగా విభజించి సర్వే చేపట్టింది. » ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల నుంచి సమాచారం సేకరించిన టామ్టామ్ దాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషించింది. ఆయా నగరాల జనాభా, అక్కడ ఉన్న వాహనాల సంఖ్య, రోడ్ల శాతం, ట్రాఫిక్ సిబ్బంది తదితరాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించింది. అప్పుడు.. ఇప్పుడూ అంతే.. టామ్టామ్ సంస్థ సర్వే ప్రకారం హైదరాబాద్లో రద్దీ వేళల్లో 10 కి.మీ ప్రయాణించడానికి 32 నిమిషాల సమయం పడుతోంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలోనూ ఇదే నమోదైంది. ఏ డాది కాలంలో పెరిగిన వాహనాలకు తగ్గట్టు ప్రభుత్వ విభాగాలు అభివృద్ధి చర్యలు తీసుకోని కారణంగానే ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఆసియాలో ఉన్న ఇతర నగరాల్లోనూ ఈ సమయం పెద్దగా తగ్గడం, పెరగడం నమోదు కాలేదు. ట్రాఫిక్ రద్దీ, రోజూ గంటల తరబడి రోడ్లపై గడపటం వల్ల ప్రతి ఒక్కరూ విలువైన పని గంటల్ని నష్టపోతున్నారని టామ్టామ్ తేల్చింది. -
ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ.. జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉద్యోగులకు సగటున 9.4 శాతం పెంపు (హైక్) ఉండే అవకాశం ఉంటుందని, HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.2020లో ఉద్యోగుల వేతనాలు 8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 9.4 శాతం పెరగనున్నట్లు అంచనా. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న పరిశ్రమలతో విస్తరించి ఉన్న భారతదేశంలోని 1,550 కంటే ఎక్కువ కంపెనీలను సర్వే చేసి.. జీతాల పెంపు గురించి మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే ప్రస్తావించింది.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, ప్రభుత్వం నేతృత్వంలోని 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కారణంగా ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో జీతాలు 8.8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగవచ్చు. ఆ తరువాత స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు జీతాలు 8 శాతం నుంచి 9.7 శాతం వరకు పెరగవచ్చు.జీతాలను మాత్రమే కాకుండా.. ఈ ఏడాది 37 శాతం సంస్థలు విభిన్న రంగాలలో.. ఉద్యోగులను కూడా పెంచుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుమారు 11.9 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ సంవత్సరం కొన్ని సంస్థలు ప్రతిభను ఆకర్షించడానికి, టర్నోవర్ను తగ్గించడానికి.. శ్రామికశక్తి డిమాండ్లను పరిష్కరించేందుకు కావలసిన ప్రయత్నాలను చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఆ తరువాత కొంతమంది ఉద్యాగాలను పొందినప్పటికీ.. ఇప్పుడు కూడా కొన్ని దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది చాలామంది ఫ్రెషర్స్ ఉద్యోగాలను పొందనున్నారు.టీసీఎస్లో 40వేల ఉద్యోగాలుటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) 'మిలింద్ లక్కడ్' తెలిపారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. -
’అతివ’కు హైదరాబాద్ భేష్
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత, నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలతో పాటు ఇతర ప్రామాణిక అంశాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ 5 నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 120 నగరాల్లో అవతార్ గ్రూప్ చేపట్టిన సర్వేలో 2024 సంవత్సరానికి హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా.. ఈ టాప్ 5 (బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె) నగరాల్లో 3 దక్షిణాది నుంచే ఉండటం విశేషం. ఇందులో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. అవతార్ గ్రూప్ నిర్వహించిన ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా–2024’ (టీసీడబ్ల్యూఐ) ఇండెక్స్ సర్వేను బుధవారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేశ్ వెల్లడించారు. ఈ ఇండెక్స్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ), వరల్డ్ బ్యాంక్, క్రైమ్ రికార్డ్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వంటి వివిధ డేటా వనరుల ఆధారంగా తయారు చేశారు. మౌలిక సదుపాయాలు, టెక్ జాబ్స్ భేష్... 120 నగరాల్లో సర్వే చేపట్టగా, మౌలిక సదుపాయాల కల్పనలో 8.01 పాయింట్లతో హైదరాబాద్ అత్యధిక స్కోర్ను సాధించింది. మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రయాణ సౌకర్యాలలోనూ ఆదర్శ నగరంగా నిలిచింది. ముఖ్యంగా మహిళ భద్రత కోసం షీ టీమ్స్, మెట్రో రైలు ప్రధానాంశాలుగా నిలిచాయి. టెక్నాలజీ రంగంలో మహిళలు అత్యధిక ఉద్యోగాలు పొందిన నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. భద్రతలో 6.95 పాయింట్ల తో 2వ స్థానంలో ఉంది. నైపు ణ్యం, ఉపాధిలో 6.95 పాయింట్లతో 5వ స్థానంలో నిలువగా... ఈ వరుసలో ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ ముందంజలో ఉన్నా యి. మొత్తంగా మహిళలకు అత్యుత్తమ నగరాల్లో దక్షణాది రాష్ట్రాలు భేష్ అనిపించుకున్నాయి. హక్కులు, సమానత్వం అందాలిఅవతార్ గ్రూప్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహిళలకు రక్షణ, ఆరోగ్యం, వారు చేసే ఉద్యోగాల్లో సురక్షిత వాతావరణం, జీవన నాణ్యత తదితర అంశాలు ప్రధానమైనవి. 2047 వరకు వికసిత్ భారత్గా నిర్మించుకోవడంలో మహిళల హక్కులు, సమానత్వం కీలకం. – డాక్టర్ సౌందర్య రాజేశ్, అవతార్ గ్రూప్ అధ్యక్షురాలు -
మనోళ్లకు బీపీ, షుగర్ ఎక్కువే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో హైపర్ టెన్షన్ (రక్తపోటు), డయాబెటీస్ మెల్లిటస్ (మధుమేహం) కేసులు ఎక్కువే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరి–ఆగస్టు మధ్య చేపట్టిన ఇంటింటి సర్వేలో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ కేసులు పెరుగుతున్నట్టుగా స్పష్టమైంది. గతంలో చేసిన అధ్యయనంలో వెల్లడైన వివిధ అంశాలను బలపరిచేలా తాజాగా విడుదల చేసిన ‘సెకండ్ రౌండ్ స్క్రీనింగ్, డయాగ్నసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్/డయాబెటీస్ మెల్లిటస్, తెలంగాణ స్టేట్’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత ప్రదేశాల్లోనూ బీపీ, షుగర్ కేసులు వెలుగులోకి రావడం.. సర్వే నిర్వహించిన వారిని ఆశ్చర్యచకితులను చేసింది. తమకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉందని తెలియకుండానే తమ రోజువారీ జీవితాలను గడుపుతున్న వారిలో అవగాహన కల్పింపంచి, ఆయా అనారోగ్యాలకు తగిన చికిత్స అందించేందుకు ఉద్దేశించి ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి అలవాట్ల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు, తేడాలు గుర్తించేందుకు దీనిని ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ అనారోగ్య సమస్యలు పెరిగి హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడు రక్తపోటు, మధుమేహం బయటపడుతుండడంతో, అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. సర్వే చేసింది ఇలా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 ఏళ్లు, ఆపైబడిన టార్గెట్ జనాభాకు సంబంధించి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా అంశాల్లో నిర్దేశిత జనాభా శాతానికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యయనం చేశారు. మొత్తంగా చూస్తే...30 ఏళ్లకు పైబడిన టార్గెట్ పాపులేషన్కు సంబంధించి 33 జిల్లాల్లోని 1,68,86,372 మందిని పరీక్షల కోసం గుర్తించారు. ఈ టార్గెట్ జనాభాలోని 1,50,28,690 మందిని (89 శాతం) స్క్రీనింగ్ చేశారు. వీరిలో ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 26 శాతం మందిని అంటే 43,90,457 మందిని పరీక్షించగా 19,31,994 మందికి (అంచనా వేసిన వారిలో 44 శాతం) హైపర్టెన్షన్ కలిగి ఉన్నట్టుగా తేలింది. అదేవిధంగా ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 13శాతం మందిని అంటే 21,95,228 మందిని పరీక్షించగా 10,17,253 మందికి (అంచనా వేసిన వారిలో 46 శాతం) డయాబెటీస్ మెల్లిటస్ కలిగి ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను పరిశీలించినప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన పరీక్షలకు అనుగుణంగా... వారిలో 46 శాతం మంది షుగర్తో, 44 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్టుగా స్పష్టమైంది. ఈ సమాచారానికి అనుగుణంగా చూస్తే...రాష్ట్రంలో మొత్తంగా 10,17, 253 మంది మధుమేహంతో, 19,31,994 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టుగా డయాగ్నైజ్ అ య్యింది. హైపర్ టెన్షన్, షుగర్లకు సంబంధించి వివిధ జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలించినపుడు...రెండింటిలోనూ టాప్–5గా నిలిచిన జిల్లాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. -
ఖర్చుల్లో తగ్గేది లేదంటున్న ఆంధ్రులు
ఖర్చుల విషయంలో ఆంధ్రులు తగ్గేదే లేదంటున్నారు. ఏపీలో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నెలవారీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. 2022–23 ఆరి్థక ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలోగ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ 2023–24లో నెలవారీ తలసరి వినియోగం వ్యయం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 9.38 శాతం, పట్టణాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 5.89 శాతం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలో 2023–24లో గ్రామీణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.457, పట్టణ ప్రాంతాల్లో రూ.400 పెరిగింది. గృహ వినియోగ వ్యయ సర్వే 022–23–24ను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం 2023–24లో జాతీయ స్థాయిలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.6,996 ఉండగా.. ఏపీలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.7,182గా నమోదైంది. జాతీయ స్థాయి గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.4,122 ఉండగా.. ఏపీలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.5,327గా నమోదైంది. – సాక్షి, అమరావతిఆహారేతర వస్తువులపైనే ఖర్చుఅన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆహారేతర వస్తువుల వినియోగంపైనే ఎక్కువ వ్యయం చేస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఆహారేతర వస్తువుల వినియోగంపైనే వ్యయం చేశారు. రవాణా, దుస్తులు, పరుపులు, పాదరక్షలు, ఇతర వస్తువులు, వినోదం, మన్నికైన వస్తువులు ఆహారేతర వ్యయంలో ప్రధాన వ్యయ వాటాను కలిగి ఉన్నాయి.పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయంలో ఇంటి అద్దె దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది. ప్రధానంగా పానీయాలు, రిఫ్రెష్మెంట్లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో వ్యయం కొనసాగుతోంది. ఆ తరువాత పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఆహార వ్యయంలో ప్రధానంగా ఉన్నాయి. 2022–23తో పోలిస్తే జాతీ య స్థాయిలో 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో నెల వారీ తలసరి వినియోగ వ్యయం 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం వ్యత్యాసం మరింత తగ్గింది. 2022–23లో 71 శాతం ఉండగా 2023–24లో 70 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన వినియోగం పెరుగుదలను సూచిస్తోంది. -
ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే మంత్రుల పనితీరుపై సర్వేకు ఉపక్రమించిన టీడీపీ కూటమి సర్కారు తాజాగా ఎమ్మెల్యేల పని తీరుపై కూడా ఆరా తీస్తోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) ద్వారా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆర్నెళ్లలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటూ వాకబు చేస్తున్నారు. బాగుంటే ఒకటి.. ఫరవాలేదు అయితే రెండు.. బాగోలేకుంటే మూడు నొక్కాలని సూచిస్తూ సమాచారం సేకరిస్తున్నారు. గతంలో ఇదంతా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకే పరిమితం కాగా తాజాగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా సాగుతుండటం గమనార్హం. ఈ ఫోన్ కాల్స్ అన్నీ మంగళగిరి కేంద్రంగా టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేకు పరిమితం కాకుండా తమపై టీడీపీ పెత్తనం ఏమిటంటూ జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. కూటమి నేతలను కట్టడి చేసేందుకేనా...! ఎమ్మెల్యేల పనితీరుపై మదింపు పేరుతో జరుగుతున్న ఈ సర్వే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకేననే ప్రచారం జరుగుతోంది. ‘మా పనితీరును మా అధినేతలు గమనిస్తుంటారు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే వారు చెప్పాలి. అంతేగానీ జాతీయ పార్టీ అయిన మాపై ప్రాంతీయ పార్టీ అధినేత ఎలా సర్వే చేస్తారు? మాపై టీడీపీ పెత్తనం ఏమిటి?’ అని బీజేపీకి చెందిన కొందరు నేతలు రుసరుసలాడుతున్నారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంపై రగిలి పోతున్నట్లు తెలుస్తోంది. జైన్ ఇన్ఫ్రా నంబర్లతో... రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల పనితీరుపై వివిధ నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ మంగళగిరికి చెందిన జైన్ ఇన్ఫ్రా పేరుతో ఉండగా ఆ చిరునామాతో వివరాలు అందుబాటులో లేవు. 86453 సిరీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ట్రూ కాలర్లో పరిశీలిస్తే... జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ (టీడీపీ ఆఫీస్) మంగళగిరి అని కనిపిస్తోంది. నారా లోకేష్ కార్యాలయం నుంచే ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంటున్నారు. లోకేష్ కార్యాలయం కేంద్రంగానే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని, ఈ సర్వే కూడా ఆయన టీమ్ నిర్వహిస్తోందని చెబుతున్నారు. -
సాగు భూమికే రైతుభరోసా
సాక్షి, హైదరాబాద్: పంటలు సాగుచేసిన భూమికే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం శాటిలైట్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ డేటాను వినియోగించనున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లవారీగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణంతోపాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ డేటాతో పొందవచ్చని చెప్పారు. ఇదే విషయాన్ని ఈ నెల 26వ తేదీన ‘సాగు రైతుకే భరోసా’శీర్షికతో ప్రచురితమైన కథనంలో ‘సాక్షి’వెల్లడించింది. ఈ సంక్రాంతి నుంచి ‘రైతుభరోసా’ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే వివిధ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమావేశమయ్యారు. రిమోట్ సెన్సింగ్ డేటానే కీలకం సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నమోదుచేస్తామని మంత్రి వెల్లడించారు. పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగుభూమి, పంటల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సాగు భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు. ఈ వివరాలను రైతుభరోసా పథకంతోపాటు, పంటల బీమా పథకానికి కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు. పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫాన్ల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు. నమూనా సర్వే కింద రెండు మండలాల్లో పంటలు, గ్రామాల వారీగా సాగైన వివరాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సాగుకు అనువుగా లేని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలను సోకే చీడపీడలను ఆరంభంలోనే గుర్తించే విధంగా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్ను వివరించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు, కేబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. -
శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.45 ఏళ్లలో కొండలా పూడికకృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలేశ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్గా మారుతుందని నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ సమగ్ర స్వరూపంతొలిసారి రిజర్వాయర్ను నింపింది: 1976గరిష్ట నీటిమట్టం 885 అడుగులుక్యాచ్మెంట్ ఏరియా: 60,350 చ.కి.మీ.గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. -
పింఛన్.. తుంచెన్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య తగ్గిపోతోంది. గత ఆర్నెళ్లలో ఏకంగా 1.57 లక్షల పింఛన్లకు కోత పెట్టిన కూటమి సర్కారు మరో 3 లక్షల పెన్షన్ల తొలగింపుపై గురి పెట్టినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పైలెట్ సర్వే పేరుతో 10,958 మందిని తనిఖీ చేసి 563 మందిపై.. అంటే దాదాపు 5శాతం మందిపై అనర్హులుగా ముద్ర వేసింది. అంటే రాష్ట్రంలోని మొత్తం పెన్షన్లను తనిఖీ చేసి అందులో 5శాతం.. అంటే దాదాపు 3 లక్షలకుపైగా పింఛన్లపై అనర్హత ముద్ర వేసి తొలగించబోతున్నట్లు అర్ధమౌతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. అంటే దాదాపు 6 లక్షల మంది పెన్షన్లను తొలగించే దిశగా సర్కారు సన్నద్ధమైనట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో 65.49 లక్షల మందికి ఫించన్లు ఇవ్వగా ఈ డిసెంబర్ నాటికి 63.92 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేసి వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసి కక్ష పూరితంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం పింఛన్లకు ఎడాపెడా కోతలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేత పేరుతో గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై గురి పెట్టింది. సంబంధిత సచివాలయంతో అసలు సంబంధమే లేని ఉద్యోగులను లబ్ధిదారుల ఇళ్లకు పంపి తనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కొత్తవి మంజూరు కాకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. దినదిన గండంగా.. గత ఐదేళ్లూ నిశ్చింతగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే టంచన్గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్దిదారులు ఇప్పుడు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారిని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనర్హత నోటీసుల పేరుతో కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. అనర్హుల పేరిట మరో విడత పింఛను నోటీసులు జారీ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలకు మెమో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ఆర్నెళ్లలో పింఛన్లు 1,57,162 తగ్గిపోయాయి. ఎడాపెడా కోతలు విధిస్తూ ఫైలెట్ సర్వే, స్పెషల్ డ్రెవ్ అంటూ రకరకాల కార్యక్రమాలకు ప్రభుత్వం తెర తీసింది. రాజకీయంగా గిట్టని వారి పింఛన్లను లబ్దిదారులకు తెలియకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 63,92,702 మందికి పింఛన్ల డబ్బులు విడుదలైనా అందులో ఐదారు లక్షల పెన్షన్లకు కోత పెట్టే యోచన ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అనర్హులంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం వారం క్రితం అన్ని జిల్లాలో ఒక్కో గ్రామ / వార్డు సచివాలయాన్ని ఎంపిక చేసుకొని మొత్తం 10,958 మంది లబ్దిదారుల పింఛన్లను తనిఖీ చేసి 563 మంది అనర్హులుగా ఉన్నారని గుర్తించింది. అంటే ఐదు శాతం పైగానేనన్న మాట. 11 వేల మందిని తనిఖీ చేసి 5శాతం మందిని అనర్హులుగా తేల్చారంటే మొత్తం 65.49 లక్షల మందిని తనిఖీ చేస్తే...అందులో 5శాతం అంటే... దాదాపు 3 లక్షల మందికి పైగా అనర్హులుగా తేల్చబోతున్నారని పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగులు టార్గెట్గా.. దివ్యాంగ పింఛన్ల లబ్దిదారులకు సైతం కూటమి ప్రభుత్వం ఎడాపెడా నోటీసులు జారీ చేస్తోంది. అధికారంలో వచ్చిన నెల తిరగక ముందే జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్ లబ్దిదారులకు పలు నిబంధనలతో నోటీసులు ఇచి్చంది. దీర్ఘకాలం క్రితం శరీర వైఫల్య సర్టిఫికెట్లు పొంది ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న వారిని సైతం 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెటు అధికారులకు అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు “సదరం’లో పేర్లు నమోదు చేసుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది 15 రోజుల్లో ఆన్లైన్లో రీ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని అర్హత నిరూపించుకోవాలని మానవత్వం లేకుండా నోటీసులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సుదూర ప్రాంతాలకు బదిలీ.. నెల నెలా పింఛన్లు కావాలంటే మా వద్దకు రావాల్సిందే..! అధికార పార్టీలో చేరాల్సిందే! ఎవరికి చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉండదు!! ఇదీ పచ్చ నేతల బెదిరింపులు! ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన పింఛన్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చాలు.. సుదూర ప్రాంతాలకు పెన్షన్లు బదిలీ చేస్తున్నారు. పింఛన్ల కోసం అంతదూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లలేక లబ్దిదారులు ఆశలు వదులుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో బాపట్ల జిల్లాలో పలువురు వృద్ధుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బదిలీ చేశారు. పండుటాకులని కూడా చూడకుండా కూటమి సర్కారు దారుణంగా వ్యవహరించింది.563 మందికే కాదు.. మిగిలిన వారికీ నోటీసులు పైలెట్ సర్వేలో గుర్తించిన 563 మంది లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేయాలని సెర్ప్ సీఈవో తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే సెర్ప్ కార్యాలయం నుంచి అధికారులకు పంపిన ఫోన్ సందేశాల్లో మాత్రం ఫైలెట్ సర్వే నిర్వహించిన సచివాలయాలతో పాటు ఇతర గ్రామ, వార్డు సచివాలయాలలోనూ అనర్హులుగా పేర్కొంటూ ఎంపీడీవో లాగిన్లో ఉన్నవారికి కూడా నోటీసులు జారీ చేయాలని సమాచారం ఇచ్చారు. ఎవరైనా నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తే వారి పింఛన్లను ఎంపీడీవోలు అప్పటికప్పుడే హోల్డ్ (తాత్కాలికంగా నిలుపుదల) చేయాలని సెర్ప్ సీఈవో ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్లో సంభాల్లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అతి పెద్ద ఐస్బర్గ్... మళ్లీ కదిలింది!
ఏ23ఏ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్. తాజా కొలతల ప్రకారం దాని విస్తీర్ణం 3,672 చదరపు కిలోమీటర్లు! చూపు తిప్పుకోనివ్వని ఆర్చిలు, అందమైన గుహలతో పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది 1986లో ఫిల్క్నర్ రోన్ మంచుఫలకం నుంచి విడివడింది. కొన్నాళ్లపాటు కాస్త దూరం కదిలాక అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్ర ఉపరితలంపై సెటిలైపోయింది. 30 ఏళ్లపాటు అక్కడే స్తబ్ధుగా ఉండిపోయింది. అందులోని అందమైన గుహలను, దాని పొడవునా ఏర్పడే రకరకాల ఆకృతుల మంచు ఆర్చిలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పర్యాటకులు పోటెత్తుతుంటారు. అలాంటి ఏ23ఏ 2020లో స్వల్పంగా కరిగిపోవడంతో మళ్లీ కదలడం మొదలు పెట్టింది. అంటార్కిటికాలోని టైలర్ కాలమ్లో ఉపరితలానికి తాకడంతో కొద్ది నెలలుగా అక్కడే నిలిచిపోయింది. మంచు కరుగుతుండటంతో కొద్ది రోజులుగా అది మళ్లీ కదలడం మొదలుపెట్టినట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) బృందం వెల్లడించింది. ‘‘ఏ23ఏ ఐస్బర్గ్ సముద్ర ప్రవాహాల తాకిడికి క్రమంగా వెచ్చని జలాలవైపు సాగుతోంది. సౌత్ జార్జియాలోని మారుమూల దీవుల గుండా వెళ్తూ క్రమక్రమంగా కరిగి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగవుతుంది’’అని ప్రకటించింది. దాంతో సైంటిస్టులందరి దృష్టీ దానిమీదే కేంద్రీకృతమైందిప్పుడు. ఏ23ఏను సైంటిస్టులు 1986లో తొలిసారిగా గమనించారు. అప్పట్లో అది 3,900 చ.కి.మీ. పై చిలుకు విస్తీర్ణంతో ఉండేది. నాటినుంచీ చాలాకాలం పాటు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్గా నిలుస్తూ వచ్చింది. మధ్యలో దానికంటే పెద్ద పరిమాణంలో ఏ68 (2017లో), ఏ76 (2021లో) వంటివి పుట్టుకొచ్చినా అవన్నీ చూస్తుండగానే కరిగి చిన్నవైపోయాయి. ఏ23ఏ దర్జా మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాజా కదలికల పుణ్యమా అని అది ఇక మూణ్నాళ్ల ముచ్చటేనంటున్నారు సైంటిస్టులు. అయితే అది కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం వంటి ముప్పు ఉండకపోవచ్చని వాళ్లు చెబుతున్నారు. ఏ23ఏ కరుగుదలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణమని వాపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
ఉద్యోగాలను మించి.. కెరీర్పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్ప్రెన్యూర్స్గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
మన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యమెంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) జరగనుంది. దీనికో సం రాష్ట్రంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్ళను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారు. ప్రతి మూడేళ్ళకోసారి ఈ పరీక్ష జరుగుతుంది. 2021లో జరిగిన న్యాస్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అయిదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు స్కోర్ కంటే కూడా రాష్ట్ర విద్యార్థుల స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించా రు. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. న్యాస్ను ప్ర తిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలుగా పరీక్షపై పాఠశాలల ప్రధానోపాధ్యా యులు దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఇప్పటికే మూడుసార్లు మోడల్ పరీక్షలు నిర్వహించారు. తాజా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. ఫరాఖ్కు నిర్వహణ బాధ్యతలు న్యాస్ పరీక్షను 2021 వరకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహించింది. ఈసారి నుంచి రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 పేరుతో ఎన్సీఈఆర్టీలోని స్వ తంత్ర సంస్థ ఫరాఖ్ (పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్) నిర్వహిస్తోంది. గ తంలో 3, 5, 8, 10 తరగతులకు న్యాస్ పరీక్ష ఉండేది. ఈసారి 3, 6, 9 తరగతులకు ఆ క్లాసు ల్లోని ప్రమాణాల మేర పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి 50 శాతం, ప్రైవేటు స్కూళ్ళ నుంచి మరో 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,500 పాఠశాలల నుంచి లక్ష మందిని పరీక్షకు ఎంపిక చేశారు. ఈసారి క్రిటికల్ థింకింగ్ కూడా.. న్యాస్ పరీక్ష విధానంలో ఈసారి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. ఈసారి అదనంగా విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)కు సంబంధించిన నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలు, భవిష్యత్లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. మల్టిపుల్ చాయిస్గా ఉండే ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మూడో తరగతికి 45 ప్రశ్నలు, గంటన్నర సమయం, ఆరో తరగతికి 51 ప్రశ్నలు, గంటన్నర, 9వ తరగతికి 60 ప్రశ్నలకు రెండు గంటల సమయం ఉంటుంది. మొత్తం మీద న్యాస్ పరీక్ష కఠినంగా ఉండే అవకాశం ఉందని టీచ ర్లు చెబుతున్నారు. ప్రశ్నలను అనేక విధాలుగా ఇస్తున్నారని, సెంట్రల్ సిలబస్తో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యార్థులు ఏ మేరకు జవాబిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు. -
పెళ్లి ఖర్చు పెరిగిపోతోంది
సాక్షి, అమరావతి: పెళ్లి అంటే ఓ పెద్ద వేడుక. రెండు కుటుంబాల మధ్య బలపడే బంధం. బంధు మిత్రుల సందడి, విందు, వినోదాలతో సాగే పెద్ద తంతు. దానికి తగ్గట్టే ఖర్చూ ఉంటుంది. నిరు పేదల నుంచి బిలియనీర్ల వరకు ఎవరికి తగ్గ రేంజ్లో వారు పెళ్లి వేడుక జరిపిస్తారు. గతంలో ఇళ్లలోనో, ప్రార్ధన మందిరాల్లోనో పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లలో భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నాయి. ఫొటోలు, వీడియోలు.. వీటికీ పెద్దపీటే. డెస్టినేషన్ వెడ్డింగ్లు మరో రకం. ఇలా రాన్రాను పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగిపోతోంది.పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులో భారతీయులు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. భారత దేశంలో వివాహాల ఖర్చు ఏటికేడాది భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్మీగుడ్ తెలిపింది. దేశంలో ఈ ఏడాది సగటున ఒక్కొక్క వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక సర్వే నివేదికలో వెల్లడించింది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఈ సగటు వ్యయం రూ.51.1 లక్షలుగా ఉందని తెలిపింది. 2022లో సగటు వివాహ ఖర్చు రూ.25 లక్షలుగా ఉండగా, 2023లో రూ.28 లక్షలకు చేరి, ఇప్పుడు మరింత ప్రియమైందని పేర్కొంది. ఈ ఏడాది ఆతిథ్యం, విందు ఖర్చు భారీగా పెరగడమే వివాహ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ప్రతి ఐదు వివాహాల్లో ఒక పెళ్లి ఖర్చు రూ.50 లక్షలకు పైనే ఉంటోందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం 3,500 మంది జంటలపై ఈ సర్వే నిర్వహించగా అందులో తొమ్మిది శాతం మంది పెళ్లి కోసం కోటి రూపాయల పైనే ఖర్చు చేసినట్లు తెలిపారు. 40 శాతం మంది వారి వివాహ ఖర్చు రూ.15 లక్షల లోపే అని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. పెళ్లి కోసం డబ్బు దాచుకుంటున్న వారే ఎక్కువ పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి తల్లిదండ్రులు తగినంత పొదుపుతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెడ్మీగుడ్ సర్వేలో వెల్లడయ్యింది. 82 శాతం మంది వారి పిల్లల వివాహన్ని సొంతంగా దాచుకున్న నిధులు లేదా స్నేహితుల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. 12 శాతం మంది మాత్రమే పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటున్నారు. మరో 6 శాతం మంది పిల్లల పెళ్లిళ్ల కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. మిలీనియల్స్, జనరేషన్ జెడ్కు చెందిన వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వెడ్మీగుడ్ సహ వ్యవస్థాపకుడు మెహక్ సాగర్ షహానీ పేర్కొన్నారు. పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయాలకు అనుగుణంగా కాక్టెయిల్స్, గేమింగ్స్ , రెస్టారెంట్ ఏర్పాట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడం కోసం వీరు సోషల్ మీడియా మేనేజర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.వీటివల్ల సరికొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయని మోహక్ సాగర్ పేర్కొన్నారు. ఏటా నవంబర్ – డిసెంబర్ నెలల్లోనే అత్యధిక వివాహాలు జరుగుతాయని, ఈ ఏడాది ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ఈ రెండు నెలల్లో వివాహల కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా.పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తున్నవారి శాతంరూ. కోటి పైన 9%రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి 9%రూ.25 నుంచి రూ. 50 లక్షలు 23%రూ.15 నుంచి రూ. 25 లక్షలు 19%రూ.15 లక్షల లోపు 40%డబ్బు సమీకరణ ఇలా..సొంతం లేదా కుటుంబ పొదుపు 82%రుణాలు 12%ఆస్తులు అమ్మకం 6%సగటు వివాహ ఖర్చుఏడాది సగటు వ్యయం 2022 రూ.25 లక్షలు 2023 రూ.28లక్షలు 2024 రూ.36.5 లక్షలు -
డిజిటల్ అక్షరాస్యత..వెనుకబాటులో యువత!
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశ యువత వెనుకబడుతోంది. డిజిటల్ అక్షరాస్యతలో 15–29 ఏళ్ల మధ్య వయస్కుల్లో కేవలం మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే ఇంటర్నెట్ను సమర్ధంగా శోధిస్తున్నారు. ఇందులో ఈ–మెయిల్ పంపడం, పరిశీలించడం, ఆన్లైన్ లావాదేవీలకే పరిమితమవుతున్నారు. ఇది గణనీయమైన డిజిటల్ వెనుకంజను సూచిస్తోందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) తమ సమగ్ర వార్షిక మాడ్యులర్ 2022–23 (సీఏఎంఎస్) సర్వే స్పష్టం చేసింది. ఇంటర్నెట్ శోధన నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, అమరావతిస్వీయ అధ్యయనానికి ఇంటర్నెట్ విద్యార్థుల స్వీయ అధ్యయనానికి ఇంటర్నెట్ ఎంతగానో దోహదపడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యా వెబ్సైట్లు, పరిశోధన పత్రాలు, ఆన్లైన్ లైబ్రరీల ద్వారా ప్రపంచ సమాచారాన్ని సేకరించుకునే విధానం విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. సంప్రదాయ అభ్యాసానికి అనుబంధంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణుల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తోందని పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్, డిజిటల్ స్కిల్స్లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు జాబ్ మార్కెట్లో ప్రాధాన్యం పెరుగుతోందని చెబుతున్నారు. గోవా ముందంజ.. మేఘాలయ వెనుకంజ దేశంలోని విద్యార్థుల్లో డిజిటల్ సామర్థ్యాల లేమిని సర్వే నొక్కి చెప్పింది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేసింది. పట్టణ ప్రాంతంలోని పురుషులు డిజిటల్ ప్రావీణ్యంలో అగ్రగామిగా ఉండగా, గ్రామీణ మహిళలు చాలా వెనుకంజలో ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం 15–24 వయసు్కల్లో 26.8శాతం, 15–29 వయస్కుల్లో 28.5 శాతం, 15 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మాత్రమే ఆన్లైన్లో సమాచారాన్ని సమర్థంగా శోధించగలుగుతున్నారు. 15–29 వయసు్కల్లో స్త్రీలు కేవలం 14.5 శాతం మాత్రమే ఇంటర్నెట్లో శోధన, ఈ–మెయిల్, ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యతలో గోవా, కేరళ మెరుగ్గా ఉంటే మేఘాలయ, త్రిపుర అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాయి. ఇంటర్నెట్ శోధన, ఈ–మెయిల్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించగల 15–29 వయసు కలిగిన విద్యార్థుల జాతీయ సగటు 28.5శాతం ఉంది. ఈ పనులు చేయడంలో 65.7 శాతంతో గోవా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 53.4 శాతంతో కేరళ, 48 శాతంతో తమిళనాడు, 47.2శాతంతో తెలంగాణ, 32.5 శాతంతో ఏపీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 16శాతం మాత్రమే ఉండటం గమనార్హం. -
112 ఏళ్లకు రైల్వే లైన్ సర్వే పూర్తి.. సాకారమైతే చైనా, నేపాల్ చెంతకు..
పితోర్గఢ్(ఉత్తరాఖండ్): బ్రిటీష్ హయాంలో 112 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక రైల్వే లైన్ సర్వే ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉత్తరాఖండ్లోని తనక్పూర్-బాగేశ్వర్ రైలు మార్గానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఈ సర్వే ప్రకారం 170 కి.మీ పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49 వేల కోట్లు ఖర్చుకానుంది. ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే భారతీయ రైల్వే అటు చైనా ఇటు నేపాల్ సరిహద్దులను చేరుకోగలుగుతుంది. ఉత్తరాఖండ్లోని కుమావోన్లోని నాలుగు పర్వతప్రాంత జిల్లాలు తనక్పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం దశాబ్దాలుగా కలలు కంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో తొలిసారిగా ఈ రైలు మార్గం కోసం రూపకల్పన చేసింది. ఈ రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు మ్తొతం ఏడు సర్వేలు జరిగాయి. రెండేళ్లపాటు సాగిన సర్వేలో తుది నివేదికను స్కై లై ఇంజినీరింగ్ డిజైనింగ్ సంస్థ తాజాగా రైల్వేశాఖకు అందజేసింది.ఈ తుది సర్వే ప్రకారం తనక్పూర్- బాగేశ్వర్ మధ్య రైలు మార్గం ఏర్పడితే మొత్తం 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్లు 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మార్గంలో నిర్మించాల్సి ఉంటుంది. అలాగే ఈ రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. దీనిలో 27 హెక్టార్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది.తనక్పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్గా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్లో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్పూర్ నుండి పంచేశ్వర్ వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అల్మోరా, పితోర్గఢ్, చంపావత్ , బాగేశ్వర్ జిల్లాలకు ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.అంతే కాదు పర్వతప్రాంతాలకు వెళ్లే మార్గం సులభతరం కావడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. చైనా, నేపాల్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ రైలు మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ మార్గంపై తుది సర్వే నివేదికను అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైలు మార్గాన్ని ఎప్పుడు నిర్మిస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెన -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే బృందం సర్వే చేసేందుకు ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ సర్వేను అడ్డుకునేందుకు వెయ్యికి మందికి పైగా స్థానికులు ప్రయత్నించారు. పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పంటించారు. అయితే, స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు మరణించారు. 30మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పిల్లల తిండి కోసం... పస్తులుంటున్న కెనడియన్లు
ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట. సాల్వేషన్ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... → కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు → సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు → కెనడాలో ఫుడ్ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. → దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి. → చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది → డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు → అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు. చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది– జాన్ ముర్రే, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి -
తుదిదశకు ‘సమగ్ర’ సర్వే
సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే తుది దశకు చేరింది. జనగామ, ములుగు జిల్లాల్లో గురువారం నాటికి సర్వే ప్రక్రియ నూరుశాతం పూర్తయింది. నల్లగొండ జిల్లాలో 99.7 శాతం పూర్తి కాగా, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల్, మహబూబ్నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నారాయణ్ పేట్, జయశంకర్ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో 90 శాతానికి పైబడి సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. హనుమకొండ జిల్లా (75.7%), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (71.2%) చివరి వరుసలో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 80 శాతానికిపైగా పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 10 లక్షల ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంది. మొత్తంగా 25,05,517 నివాసాలను గుర్తించగా, ఇప్పటివరకు 15,17,410 నివాసాల్లో సర్వే పూర్తయి, 60.60 శాతం లక్ష్యసాధన జరిగినట్లు అధికారులు తెలిపారు. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా?
తెలంగాణలో కులగణన మొదలైంది. విజయవంతం అవుతుందా లేదా అన్న అనుమానాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండూ దీనిపై పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఈ జోష్లోనే రాహుల్గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసురుతూ ‘‘ఇక కాచుకోండి’’ అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను కూడా బద్ధలు కొడతామని రాహుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేవన్నది కాంగ్రెస్ భావన. రాజకీయ కోణం ఉండనే ఉంది. కులగణన వల్ల బలహీన వర్గాల వారికి మరింత లబ్ధి చేకూరుతుందని, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని కాంగ్రెస్ ఆలోచన. ఇవన్నీ వినేందుకు బాగానే ఉన్నా సర్వే పూర్తి కావాలంటే మాత్రం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నది మాత్రం నిజం. ఇప్పటికే బీహార్లో కులగణన చేశారు.అయితే ఇది న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా ఒక చట్టం చేయకుండా కులగణన చేయడం వల్ల దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్నది ప్రశ్న. సర్వేలో అందే వివరాలు సమగ్రంగా ఉంటాయా? వాస్తవాలేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడంవల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఒకదాన్ని నిర్వహించారు. ఒకే రోజు రాష్ట్రమంతటా చేపట్టే ఈ సర్వేలో అందరూ కచ్చితంగా పాల్గొనాలని చెప్పడంతో అప్పట్లో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. దూర ప్రాంతాల్లోని వారు వేలకు వేలు ఖర్చుపెట్టుకుని సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు ఏమయ్యాయి అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు సర్వే చేశారు? అందిన సమాచారాన్ని ఎలా వాడారో ఎవరికీ చెప్పలేదు. దీంతో అదంతా వృథా ప్రయాసే అన్న అభిప్రాయం ఏర్పడింది.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకుగాను.. ఆయా పథకాలను కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమం కింద కోరారు. ఇందుకో అధికశాతం మంది క్యూల్లో నిలవాల్సి వచ్చింది. దరఖాస్తులు పెట్టుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు. దీని ప్రభావం కాస్తా ప్రస్తుతం జరుగుతున్న కులగణనపై పడుతోంది. ముందు అప్పటి సమాచారం సంగతేమిటో తెల్చమని కొందరు సర్వే అధికారులను నిలదీస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు.అసలు కుల గణన దేనికి? మా ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, మా రుణాలు తదితర వివరాలతో ఏమి చేస్తారు? అంటూ పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్యుమరేటర్లు పై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని వివరిస్తున్నా ప్రజలకు సంతృప్తి కలగడం లేదు. అందుకే ఒక ఎన్యుమరేటర్.. ‘‘ఏమో సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండి’’ అంటే.. ‘‘అయితే ఆయన్నే సర్వేకు రమ్మనండి’’ అని ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సర్వేలో భాగంగా బ్యాంకు ఖాతాల వివరాలు అడగడం వివాదాస్పదమైంది. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ అదేరకంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఇంటి స్థలం జాగా, ఆదాయ వనరులు మొదలైన వాటి గురించి సుమారు 75 పాయింట్లపై ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికి జవాబు చెప్పడానికి చాలా టైమ్ పడుతుంది.నిజానికి ఏ సర్వే అయినా సింపుల్ గా ఉండాలి. తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం రాబట్టేలా చేయగలిగితే ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వ్యక్తిగత ఆదాయ, ఆస్తి వివరాలు అడగడం ఆరంభించారో, అప్పుడే అనుమానాలు ప్రబలుతాయి. ఉదాహరణకు ఒక ఇంటి వద్దకు వచ్చి ఆ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంటుందని అడగగానే ఆ ఇంటి యజమానికి సందేహాలు వస్తాయి.ప్రభుత్వం ఏమైనా పన్నులు పెంచడానికి ఈ ప్రశ్న వేస్తోందా, వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆపడానికా? అన్న భావన కలుగుతుంది. నిజానికి పట్టణాలు,నగరాలు, గ్రామ పంచాయతీలు ఎక్కడైనా స్థానిక సంస్థలలో ఇళ్లు, విస్తీర్ణం తదితర వివరాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే పన్నులు కడుతుంటారు. ఒక వేళ స్థలం యజమాని మారినా, ఆ వివరాలు కూడా నమోదు అవుతాయి. అలాంటప్పుడు ఈ తరహా వివరాలు స్థానిక సంస్థల నుంచి తెలుసుకోవచ్చు కదా! ఇళ్ల యజమానులు సర్వేలో నిజాలు చెబితే ఓకే. కాని వారికి ఉండే సంశయాలతో వాస్తవాలు చెప్పకపోతే ఏమి అవుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది. చట్టబద్దత లేకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. కేవలం ఎవరు ఏ కులం అన్నది తెలుసుకోవడమే లక్ష్యమైతే ఇన్ని పాయింట్లతో సమగ్ర సర్వే అవసరమా? అని కొందరు అడుతున్నారు.నిజమే! ప్రభుత్వాల వద్ద ప్రజలందరి సమాచారం ఉంటే, దానిని విశ్లేషించుకుని, వివిధ స్కీములు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల వారిగా జాబితా ఉంటే రిజర్వేషన్ ల విషయంలో నిర్దిష్ట విధానం అవలంబించడానికి వీలు అవుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వీటి ఆధారంగా ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించే అవకాశం పెరుగుతుంది. కాని కేవలం కులాల ఆధారంగానే రాజకీయాలు అన్నిసార్లు నడవవన్న విషయాన్ని కూడా విస్మరించలేం. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల నేతలే ఎందుకు రాజకీయంగా అధిక శాతం పదవులు పొందుతున్నారు? కులాల సర్వేతోనే పరిస్థితి మారుతుందా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం.ఆయా నియోజకవర్గాలలో కులాల బలబలాలను కూడా చూసుకునే టిక్కెట్లు ఇవ్వడం ఇప్పటికే జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కాదనలేం. ఆదాయ వివరాలు ఉంటే దానికి తగ్గట్లుగా పేదలను ఆర్ధికాభివృద్ది చేయవచ్చు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా పేదలతో పాటు దిగువ మధ్య తరగతివారు వివిధ ప్రభుత్వ స్కీముల కింద ప్రయోజనం పొందుతుంటారు. తమ ఆదాయం నిర్దిష్ట పరిమితికన్నా కాస్త ఎక్కువగా ఉన్నా వాటిని తొలగిస్తారేమో అన్న భయం వారిలో ఉంటుంది. దానిని ఎలా పొగొడతారో తెలియదు. ఆదాయ పన్ను శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద ప్రజల ఆదాయ వివరాలు దొరుకుతాయి. వాటిని తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారం సేకరిస్తుంది. అలాగే బీసీ జనాభాను కూడా గుర్తించవచ్చు. రాజకీయ, ఉపాధి అవకాశాలలో బీసీలకు రిజర్వేషన్ లు పెంచుతామంటూ రాజకీయ పార్టీలు హడావుడి చేయడం, కమిషన్లు వేయడం, చివరికి అవన్ని ఉత్తుత్తిగానే మిగిలి పోవడం చూస్తూనే ఉన్నాం. =అసలు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కులగణన సర్వేలు చేయగలుగుతాయా? రిజర్వేషన్లు యాభై శాతం దాటి పెంచాలని సంకల్పించినా కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు కదా! రాజకీయ పార్టీలకు ఈ అంశంలో ఉన్న చిత్తశుద్ది ఎంత అన్నది కూడా వస్తుంది.ఒకపక్క బలహీన వర్గాలు అంత శాతం ఉన్నారు.. ఇంత శాతం ఉన్నారని చెబుతారు. కాని అధికార పంపిణీలో మాత్రం ఏ వర్గం ఆధిపత్యంతో ఉంటుందో, దానికే అధిక వాటా లభిస్తోంది. అంతెందుకు యాభై శాతం మించి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతోందని రాహుల్ గాందీ మొదలు రేవంత్ రెడ్డి వరకు అంటున్నారు కదా! కాని సీఎం పదవి వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే ఇచ్చింది? మల్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకు పరిమితం చేశారు?ఇక్కడే కాదు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. రేవంత్కు సీఎంపదవి రావడాన్ని తప్పుపట్టడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసి పదవి సంపాదించుకున్నారు. కాని కులాల పంచాయతీ పెట్టినప్పుడే ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుంటాయి. సమాజంలో ఎంత కాదన్నా ఆధిపత్య కులాల, వర్గాల పెత్తనం ఇంకా పోలేదు. కులాల ప్రాతిపదికన అన్నీ జరిగిపోవు. అలా అని కులాలను విస్మరించాలని ఎవరూ చెప్పరు. వీటన్నిటికి మూల కారణం ఎక్కడ వస్తోంది? రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటాయి.అర్హతలతో నిమిత్తం లేకుండా హామీలు ఇచ్చి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టడం ఆరంభిస్తారు.దానిపై ప్రజలలో మండుతుంది. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సూపర్ సిక్స్ అని, గ్యారంటీలు అని ఎన్నికల మానిఫెస్టోలలో పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు రూ.నెలకు 2500 చొప్పున ఇస్తామని చెబితే, ఏపీలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ఏపీలో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవే కాదు. వందల కొద్ది హామీలను గుప్పించారు.తీరా ఎన్నికయ్యాక వాటిని ఎలా అమలు చేయలో తెలియక, ఆర్థిక వనరులు ఎక్కడనుంచి వస్తాయో అర్థం కాక, నేతలు తల పట్టుకుని కూర్చుంటున్నారు. అక్కడ నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలా,డైవర్షన్ రాజకీయాలు ఎలా చేయాలా అన్నదానిపై దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కుల గణన అనండి, సమగ్ర కుటుంబ సర్వే అనండి.. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికే అయితే స్వాగతించాల్సిందే. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు గేమ్ ఆడుతుంటే ప్రజలు హర్షించరు. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి చిత్తశుద్దితో చేస్తే తప్ప, ఒక్క తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో చేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది సందేహమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే గ్రేటర్లో పరిధిలో అయోమయంగా మారింది. ఇంటింటికీ వెళ్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న యక్ష ప్రశ్నలతో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ‘ఈ సర్వేకో దండం.. మేం చేయలేం సార్’ అంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లను కనీసం గేట్లు కూడా తీయనియ్యలేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇంకొందరు కుక్కల్ని కూడా ఉసిగొల్పుతున్నారని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందించిన దరఖాస్తులకే ఇప్పటి వరకు దిక్కులేదు.. అప్పుడు రెండు రోజులపాటు పడిగాపులు కాసి ఇచి్చనా, వాటితో మాకెలాంటి ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు ఈ సర్వేలో మీకెందుకు వివరాలివ్వాలంటూ ముఖం మీదే కుండబద్దలు కొడుతున్నారు. స్టిక్కర్లతోనే చుక్కలు కనిపిస్తున్నాయి.. వాస్తవానికి నగరంలో సర్వే నామమాత్రంగానే ప్రారంభమైంది. శుక్రవారం నాటికి పూర్తి కావాల్సిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమం పూర్తికానందున శనివారం కూడా ఆ పనిలోనే ఉన్నారు. స్టిక్కర్లు అంటించేటప్పుడే కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ.. చాలామంది తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం లేదు. పేర్లు చెప్పేందుకు కూడా పలువురు యక్ష ప్రశ్నలు వేస్తున్నా రు. అసలు ఈ సర్వేతో తమకేంటి లాభం? అంటూ విసురుతున్న ప్రశ్నలతో ఎన్యూమరేటర్లుగా వ్యవహరిస్తున్న ఆశావర్కర్లు తెల్లబోతున్నారు. ఆర్థిక పరిస్థితి వంటివి తెలుస్తుంది సార్ అంటే.. మా ఆర్థిక పరిస్థితి నీకెందుకు చెప్పాలి? నువ్వేం చేస్తావ్ ? అంటున్నారని.. ఫారాలు నింపాక పై అధికారులకిస్తాం అంటే.. వారేం చేస్తారు ? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు. స్టిక్కర్ల నాడే పరిస్థితి ఇలా ఉంటే.. అసలు సర్వే ఎలా చేయాలని వాపోతున్నారు. ఎన్యుమరేటర్లుగా వ్యవహరిస్తున్న టీచర్లు మాత్రం వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వారిని తృప్తిపరచలేకపోతున్నామన్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితిని తట్టుకోలేక కాబోలు చాలా ప్రాంతాల్లో స్టిక్కర్లను చడీచప్పుడు కాకుండా ఇంటి బయట గోడలకు అంటించి పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటించకుండానే గేటు బయట నుంచే ఇంటి ఆవరణలోకి విసిరి వేశారు.సీఎంపై తిట్ల దండకం.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డినే తిడుతున్నారని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో విధుల్లో ఉన్న ఓ మహిళా ఎన్యుమరేటర్ పేర్కొన్నారు. సీఎంను తిడుతున్న వారిలో మహిళలు, వృద్ధులు సైతం ఉన్నారని ఆమె ఆన్నారు. ఆరు గ్యారంటీల్లో సబ్సిడీ గ్యాస్, ఇళ్లు, పెన్షన్లు, మహిళలకు రూ.2500 ఏవీ రావడం లేదని, ఇప్పుడు మీకు మా వివరాలు చెబితే ఉన్న రేషన్ కార్డు కూడా పోతుందేమోనని అంటున్నవారూ ఉన్నారని మరో ఎన్యుమరేటర్ తనకెదురైన అనుభవాన్ని వివరించారు. వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు అడగొద్దని తిప్పి పంపిస్తున్నవారూ ఉన్నారు. చెరువుల్లో ఉన్నాయని ఇళ్లు కూలుస్తున్నారని హైడ్రాను ప్రస్తావిస్తూ.. తమ ఇంటి వివరాలిస్తే మా ఇల్లు కూడా కూలుస్తారేమోననే భయాన్ని వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారని ఎన్యుమరేటర్లు అంటున్నారు. కోడ్లు నింపడానికి ఎంతో సమయం.. ఒక్కో ఇంటికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోందని చెబుతున్నారు. సమాధానాల్ని సంబంధిత కోడ్తో సూచించాల్సి ఉన్నందున అన్నీ అర్థం చేసుకొని భర్తీ చేసేందుకు సమయం పడుతోందంటున్నారు. చాలామంది వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండగా, కొందరు మాత్రం తమ జంతువుల వివరాలు సైతం చెబుతున్నారు. ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులతోనూ స్టిక్కర్లు అంటిస్తున్నట్లు తెలిసింది. -
సమగ్ర కుటుంబ సర్వే: ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి ఓనర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. శనివారం సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్లో ఎన్యుమరేటర్లపై ఓ ఇంటి యజమాని కుక్కలను వదిలారు.ఈ ఘటన బంజారాహిల్స్ ఆరోరా కాలనీలో చోటుచేసుకుంది. సర్వే పేరుతో తమ టైం వేస్ట్ చేస్తున్నారని ఎన్యుమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు సెక్యూరీటీ కావాలని ఎన్యుమరేటర్లు కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే.. నవంబర్ 6న ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు. -
అది ఫేక్ సర్వే: తాజా పోల్పై మండిపడ్డ ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్ సర్వేను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ తనకంటే లీడింగ్లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్ అని కొట్టిపారేశారు.అయోవా రాష్ట్రంలో కమలాహారిస్కు 47 శాతం, ట్రంప్నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్ నాట్ డౌన్’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్లో అయోవాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి: అబార్షన్ మా హక్కు -
దేశంలో కుటుంబ సగటు పరిమాణం 4.3
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గుతోంది. 2016–17తో పోల్చితే 2021–22లో గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గినట్లు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడించింది. 2016–17లో గ్రామీణ భారతంలో 4.5 ఉండగా 2021–22లో 4.3 ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల పరిమాణం, కుటుంబ పెద్ద విద్యార్హతలపై నిర్వహించిన సర్వేను నాబార్డు విడుదల చేసింది. 2021–22లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాల సగటు పరిమాణం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0గా ఉండగా వ్యవసాయ కుటుంబాల్లో 4.5గా ఉంది. రాష్ట్రాల మధ్య గృహ పరిమాణాలలో వైవిధ్యాలను సూచిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కుటుంబానికి సగటున నలుగురు కంటే తక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరిగింది. ఏపీలో 2016–17లో 3.5 ఉండగా 2021–22లో 3.7గా ఉంది. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులుగా ఉండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం ఉన్నట్లు సర్వే తెలిపింది. -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
బంగారమంటే అంత నమ్మకం!
ధగధగమంటూ కాంతులీనే బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు?.. ప్రతిఒక్కరికీ పసిడిపైన మక్కువే. మరి ఆ బంగారాన్ని ఎవరు, ఎలా చూస్తున్నారన్నదే ఆసక్తికరం. ఇదే అంశంపైనే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ విశేషాలను ఈ కథనంలో మీకందిస్తున్నాం..మనీవ్యూ సర్వే ప్రకారం, 3,000 మంది ప్రతివాదులలో 85 శాతం మంది బంగారాన్ని సంపద పరిరక్షణకు విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. అద్భుతంగా పెరుగుతన్న దాని విలువ, చారిత్రికంగా ఉన్న విశిష్టత వినియోగదారుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయి.ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సున్నవారు పదవీ విరమణ, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను నిర్మించడానికి వారి సాధారణ ఆర్థిక వ్యూహంలో భాగంగా భౌతిక, డిజిటల్ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.70 శాతం మంది భారతీయులు అంటే 10 మందిలో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వారి పొదుపు అలవాట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో బంగారంపై ఉన్న ఆసక్తి డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువగా నడిపిస్తోంది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలే ఎక్కువ..సర్వే డేటా ప్రకారం.. 35 ఏళ్లలోపు వారిలో 75 శాతం మంది భౌతిక బంగారం కంటే కూడా డిజిటల్ బంగారాన్ని ఇష్టపడుతున్నారు. దానికి లిక్విడిటీ, సౌలభ్యం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతానికి పైగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాక్షిక మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకునే దిశగా అత్యంత లాభదాయకమైన లక్షణాలలో ఒకటి అని నమ్ముతున్నారు. -
జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు
సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్ –జెడ్’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్చాట్ షోస్ చెబుతున్నాయి. ఖర్చు చేయడంలో మిలీనియల్స్ జనరేషన్ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్–జెడ్ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్–జెడ్దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్–జెడ్ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. స్నాక్స్ నుంచి సెడాన్ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్–జెడ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్ ‘జెడ్’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.విహారయాత్రలకే పెద్దపీట జెడ్–జనరేషన్ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్ –లైఫ్స్టైల్ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.సింపుల్గా ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్∙ఫుడ్ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. ఏమిటీ జనరేషన్లు..అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ –జెడ్గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్ చాట్ షో సంస్థలు జనరేషన్–జెడ్ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి. -
దూసుకొస్తున్న ట్రంప్.. తాజా సర్వేలో సంచలనం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు మరో పది రోజులే సమయముందనగా న్యూయార్క్ టైమ్స్, సియెనా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే శుక్రవారం(అక్టోబర్ 25) ఆసక్తికర విషయం వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హారిస్ పట్ల ప్రజలు సమానంగా మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఇద్దరికీ సరిగ్గా చెరో 48 శాతం పాపులర్ ఓట్ రానుందని తేలినట్లు ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో హారిస్కు 49 పాపులర్ ఓట్ అనుకూలంగా ఉండగా ట్రంప్కు 46 శాతం మంది మదతిచ్చారు. అయితే క్రమంగా ట్రంప్ పుంజుకొని హారిస్ రేసులో సమాన స్థాయికి రావడం గమనార్హం. ఏది ఏమైనా నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది తేలనుంది.ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం.. అందరికీ అర్థమయ్యే రీతిలో -
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
రైతే 'రాజు'
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది. అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో.. ఆంధ్రప్రదేశ్లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది. నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది. సర్వేలో తీసుకున్న అంశాలివీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది. ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. -
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్లు మేక్మైట్రిప్, క్లియర్ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్ఫామ్ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్లో 65 శాతం మంది, జెన్ ఎక్స్లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
ఖర్చులు పెరుగుతున్నాయి!
సాక్షి, అమరావతి: దేశంలో జనాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు పెట్టే ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ఎన్ఎస్ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడించింది. రోజు రోజుకీ కొత్త కొత్త అలవాట్లకు ఆకర్షించబడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటిల్లపాది తిండి సహా పిల్లల చదువులు, దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలు, కారు, మోటర్ సైకిల్ వాహనాలు, వైద్య ఖర్చులు.. ఇలా ఒక్కో కుటుంబం ప్రతి నెలా పెట్టే మొత్తం ఖర్చులో గ్రామాల్లో అయితే 7.6 శాతం మేర ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త ఖర్చులకే వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ తరహా ఖర్చులు సరాసరి 8.6 శాతం మేర ఉంటున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల వారీగా వినియోగ ఖర్చులపై నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదికను ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,723 గ్రామాల్లో 1,55,014 కుటుంబాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో 6,115 మున్సిపల్ వార్డుల్లో 1,06,732 కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లు కేంద్రం ఆ నివేదికలో వివరించింది.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే మొత్తం ఖర్చులో 2009–10లో కేవలం 3.5 శాతం మాత్రమే ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులకు వినియోగించిన పరిస్థితి ఉండగా.. 2022–23 నాటికి ఆ తరహా ఖర్చులు రెట్టింపు స్థాయికి పెరిగి 7.6 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ 2009–10లో 5.6 శాతంగా ఉన్న ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులు 2022–23 నాటికి 8.6 శాతానికి పెరిగాయి.దేశ సగటు కంటే ఏపీలో వినియోగ స్థాయి ఎక్కువ.. సర్వే నివేదిక ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,871 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ. 6,782 చొప్పున ఖర్చు పెడుతున్నారు. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సగటు సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే ఖర్చులు దేశ సగటుతో పోల్చితే దేశమంతటా పట్టణ ప్రాంత వ్యక్తుల సరాసరి వినియోగ స్థాయిలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగ స్థాయి సగం మేర ఉండగా... మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాస్త దగ్గరగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ స్థాయి ఉండడం గమనార్హం. దేశమంతటా గ్రామీణ ప్రాంత వ్యక్తుల 30 రోజుల వినియోగస్థాయి కంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగస్థాయి రూ.1,098 అదనంగా ఉండగా, అదే పట్టణ ప్రాంతాల్లో దేశ సగటు, రాష్ట్ర సగటు వ్యత్యాసం కేవలం రూ. 324గా ఉంది. » దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల వినియోగస్థాయిలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా మన రాష్ట్రం గ్రామీణ ప్రజల వినియోగస్థాయి అధికంగా ఉంది. » ఆంధ్రప్రదేశ్లో ఒక్కో వ్యక్తి 30 రోజుల సరాసరి తమ మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో 44.13 శాతం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 38.58 చొప్పున రకరకాల తిండి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు. » రాష్ట్రంలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి 7.83 శాతం , పట్టణ ప్రాంతాల్లో 8.37 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువే..దేశమంతటా పట్టణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి తిండి అవసరాలకు 39.17 శాతం, తిండేతర అవసరాలకు 60.83 శాతం ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తిండి అవసరాలకు 46.38 శాతం , తిండేతర అవసరాలకు 53.62 శాతం ఖర్చు పెడుతున్నారు.దేశమంతటా ఒక్కో వ్యక్తి సరాసరి 30 రోజుల్లో పెట్టే మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో రూ.285 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.383 చొప్పున కొత్తగా పుట్టుకొచ్చే అలవాట్లకే ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ఒక్కో వ్యక్తి సరాసరిన 30 రోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో తిండి, సంబంధిత ఖర్చులకు రూ. 2,529 చొప్పున, ఇతర అవసరాలకు రూ.3,929 చొప్పున మొత్తం రూ. 6,458 ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి సరాసరిన తిండి సంబంధిత అవసరాలకు రూ.1,749 చొప్పున, ఇతర అవసరాలకు రూ.2,023 చొప్పున ఒక్కొక్కరు మొత్తం రూ. 3,773 ఖర్చు పెడుతున్నారు. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
నెటిజన్లలో మన ‘సిటి’జన్లు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పట్టణ యువతలో 93.7 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో పురుషులు, మహిళలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ విషయాలు జూలై–2022 నుంచి జూన్–2023 వరకు నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్రధానంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ, యువకులు ఇంటర్నెట్ వినియోగంపై రాష్ట్రాల వారీగా సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... ఆంధ్రప్రదేశ్లో 91.1 శాతం మంది వాడుతున్నారు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య పురుషులకు సంబంధించి దేశంలో సగటున 89.1 శాతం మంది, మన రాష్ట్రంలో 94.6 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. దేశంలో సగటున మహిళలు 80.0 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... రాష్ట్రంలో 87.3 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు సర్వే స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో దేశ సగటుకన్నా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 75.6 శాతం, బిహార్లో 76.4 శాతం, ఒడిశాలో 80.6 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
దేశ సగటును మించి రాష్ట్రంలో వేతన జీవులు
దేశ సగటు కన్నా మన రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లేబర్ ఫోర్స్ సర్వే–2023–24’లో వెల్లడైంది. దేశంలో సగటు వేతన పురుషులు 24.9 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్లో 25.4 శాతం ఉన్నారు. దేశంలో సగటు వేతన మహిళలు 15.9 శాతం కాగా, రాష్ట్రంలో 17.3 శాతం ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా వేతన మహిళలు 70.2 శాతం ఉండగా, పురుషులు 53.0 శాతమే ఉండటం విశేషం. గోవాలో వేతన మహిళలు 61.3 శాతం ఉండగా, పురుషులు 51.7 శాతం ఉన్నారు. కేరళలో వేతన మహిళలు 41.2 శాతం ఉండగా, పురుషులు 31.3 శాతమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిహార్లో వేతన మహిళలు 4.8 శాతమే ఉన్నారు. ఛత్తీగఢ్లో 9.7 శాతం, జార్ఖండ్లో 7.3 శాతం, మధ్యప్రదేశ్లో 6.6 శాతం, ఒడిశాలో 8.8 శాతం, రాజస్థాన్లో 8.5 శాతం, ఉత్తరప్రదేశ్లో 6.6 శాతమే వేతన మహిళలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి ఆధారం: లేబర్ ఫోర్స్ సర్వే–2023–24 -
‘ఫిట్లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?
వచ్చే ఏడాది ఏ ఉద్యోగుల జేబులు నిండుతాయి.. ఏ రంగంలో జీతాలు ఎక్కువగా పెరుగుతాయి? దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2025 ఏడాదిలో జీతాలు ఎంత మేర పెరుగుతాయన్న దానిపై ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే నిర్వహించింది.30వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2024-25 మొదటి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 40కి పైగా పరిశ్రమల నుండి 1,176 కంపెనీల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. దీని ప్రకారం 2025లో అన్ని రంగాల్లో సగటు వేతన పెంపు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఏడాది వాస్తవిక పెంపు 9.3 శాతంగా ఉంది.డబుల్ డిజిట్ ఈ రంగాలదే..ఇంజనీరింగ్, తయారీ, రిటైల్ పరిశ్రమలు 2025లో అత్యధికంగా 10 శాతానికి పైగా వేతనాలు పెంచుతాయని అంచనా వేశారు. 9.9 శాతంతో తర్వాత స్థానంలో ఆర్థిక సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ సెక్టార్కు ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభమైనప్పటికీ వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, టెక్నాలజీ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు 9.9 శాతం, 9.3 శాతం వేతనాల పెంపును ఆశిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ రంగ సంస్థలు 8.1 శాతమే ఇంక్రిమెంట్ను అందించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అధ్యయనం రెండో దశలో భాగంగా వచ్చే డిసెంబర్, జనవరిలో డేటాను సేకరించి 2025 ప్రారంభంలో వెల్లడించనున్నారు. -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్జోన్లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్హౌస్లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్నగర్ రింగ్రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్ -
ఇది ప్రకృతి వైపరీత్యం
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్ఆర్ఎస్సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్ఆర్ఎస్సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
Health: మాయ ‘తెర’కు పరిమితులు..
‘చిన్నీ.... పడుకో...’‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్రూమ్లో ఫోన్లు, ట్యాబ్లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. -
సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో భూసేకరణ
-
98 శాతం యాప్లు మోసపూరితాలే!.. సర్వేలో కీలక విషయాలు
డిజిటల్ యుగంలో కొత్త యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇందులో చాలావరకు మోసపూరితమైన యాప్స్ ఉన్నట్లు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ఓ నివేదికలో విడుదల చేసింది. భారతదేశంలోని 53 టాప్ యాప్లలో 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.ఏఎస్సీఐ 53 యాప్ల నుంచి 12,000 స్క్రీన్లను విశ్లేషించిం ఒక్కో యాప్కు సగటున 2.7 మోసపూరిత నమూనాలు ఉన్నాయని సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందులో ప్రైవసీ, ఇంటర్ఫేస్, డ్రిప్ ప్రైసింగ్ వంటి 12 విభిన్న మోసపూరిత నమూనాలు ఉన్నట్లు నివేదికలో బయటపడ్డాయి.పలు మోసపూరిత యాప్లను ఇప్పటికే 21 బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో హెల్త్ -టెక్, ట్రావెల్ బుకింగ్, ఈ కామర్స్, స్ట్రీమింగ్ సర్వీస్లు, గేమింగ్ సెక్టార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కొన్ని షాపింగ్ యాప్స్ తక్కువ ధర, తప్పుడు విషయాలను వెల్లడిస్తూ.. యూజర్ల డేటాను గ్రహిస్తున్నాయి లేదా గోప్యతకు హాని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మోసపూరిత యాప్స్ ఉద్దేశపూరితంగానే ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఎస్సీఐ నివేదికలో వెల్లడించింది. యాప్లు మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సర్వేలో స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ హయాంలో పరిమితంగానే ఏపీ అప్పులు: SBI
-
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్కు కొత్త రైల్వే లైన్ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
ముంబై.. చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. హాంకాంగ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ ఏంజిల్స్ (యూఎస్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెర్సర్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానంలో ఉన్నాయి. -
ఆఖరి మజిలీలో ఆర్థిక అభద్రత
సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఆర్థిక అభద్రతతో పండుటాకులు విలవిల్లాడుతున్నాయి. దేశంలో సగానికిపైగా వృద్ధుల్లో ఈ సమస్య ప్రబలంగా ఉంది. ఈ విషయం ఇటీవల హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఏజింగ్ ఇన్ ఇండియా’ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 20 టైర్ 1, 2 నగరాల్లో 60 నుంచి 80 ఏళ్లు పైబడిన 5,169 మంది వృద్ధులు, 1,333 మంది సంరక్షకులను సర్వే చేశారు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని టైర్ 1 చెన్నై, బెంగళూరు, టైర్ 2 సేలం, హుబ్లీ నగరాలను సర్వే కోసం ఎంపిక చేశారు. కాగా, సేకరించిన అభిప్రాయాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రతి ముగ్గురిలో ఒకరు గత సంవత్సర కాలంలో ఎటువంటి ఆదాయం పొందలేదని గుర్తించారు. 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతా భావంతో జీవిస్తున్నట్లు నిర్ధారించారు. 29 శాతం మంది వృద్ధాప్య పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, సామాజిక భద్రతా పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు. అభద్రతాభావం మహిళల్లోనే అధికం తమ ప్రస్తుత రాబడి, పెట్టుబడులు, పొదుపు పరిగణనలోకి తీసుకుని 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతతో ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 90 శాతం, తమిళనాడులో 38 శాతం మంది అభద్రతా భావాన్ని వ్యక్తపరిచారు. 15 శాతం మంది వృద్ధులు నేటికీ పనిచేస్తున్నారు. వీరిలో 85 శాతం మంది అక్షరాస్యులుగా ఉన్నారు. 48 శాతం బీపీ.. 43 శాతం షుగర్ సమస్యలు 68శాతం మంది వృద్ధులు తమ సాధారణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. 10శాతం మంది మాత్రం తమ ఆరోగ్యం బాగోలేదన్నారు. మొత్తంగా పరిశీలిస్తే 48 శాతం మంది బీపీ, 43 శాతం మంది షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. 35 శాతం మంది ఎముకలు, కీళ్లకు సంబంధించిన అర్థరైటీస్ వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు.19 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నాయి. అదే 80 ఏళ్లు పైబడిన వారిలో అయితే 62 శాతం మంది బీపీ, 54 శాతం మందిలో షుగర్ సమస్యతో ఉన్నట్టు తేలింది. 60 ఏళ్లు పైబడిన వారిలో 54 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారు. 79 శాతం మంది రెగ్యులర్ చెకప్లు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్గా లేరు.400సీట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్స్కేప్లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.లింక్డ్ఇన్ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్ లైఫ్లో టాప్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్తో పాటు కస్టమర్ సర్వీస్ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్ స్కిల్, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్ షూటింగ్ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. (Image Source : LinkedIn Learning) -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగుండలేదు!
సాక్షి, అమరావతి: బ్రాడ్బ్యాండ్, ఫైబర్, డిజిటల్ సబ్స్క్రైబ్ లైన్ (డీఎస్ఎల్) సేవలపై దేశవ్యాప్తంగా సగానికిపైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ బ్రాడ్బ్యాండ్, డీఎస్ఎల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల నుంచి సేవలు పొందుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 319 కంటే ఎక్కువ జిల్లాల్లో 33 వేల మంది వినియోగదారుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలను సేకరించారు. సర్వేలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మహిళలు పాల్గొన్నారు. ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా సర్వే నిర్వహించారు. కాగా, తమ కనెక్షన్లో ప్రతి నెలా మూడు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టు 56 శాతం మంది వెల్లడించారు. వీటి పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్నాయని 53 శాతం మంది తెలిపారు. స్పీడ్ సరిపోవడం లేదుతాము ఎంచుకున్న ప్లాన్కు, ఇంటర్నెట్ స్పీడ్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ప్రొవైడర్లు ముందుగా వాగ్దానం చేసిన దానికంటే తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాయని 66 శాతం మంది వెల్లడించారు. ఇంటర్నెట్ స్పీడ్ అంశంపై 8,430 మంది నుంచి అభిప్రాయాలను సేకరించగా.. తాము చెల్లిస్తున్న దానికంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందని 33 శాతం మంది తెలిపారు.21 శాతం మంది ఎలాంటి సమస్యలు ఉండటం లేదన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా మీకు ఇంటర్నెట్ సరఫరా కొనసాగుతోందా? అని 8,430 మందిని సర్వేలో ఆరా తీయగా.. 25 శాతం మంది నెలలో ఒకటి, రెండుసార్లు అవాంతరాలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. మరో 19 శాతం మంది 3నుంచి 5సార్లు, 21 శాతం మంది 5–10 సార్లు, 16 శాతం మంది 10కి పైగా అవాంతరాలను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మిగిలిన 19 శాతం మంది మాత్రం తమకు ఎటువంటి అవాంతరాలు ఎదురవడం లేదని స్పష్టం చేశారు. తక్షణ స్పందన ఉండటం లేదుఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు ఫిర్యాదులు చేసిన సమయంలో సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తక్షణ స్పందన ఉండటం లేదని ఎక్కువ మంది తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు ఫిర్యాదులు నివృత్తి చేసే అంశంపై 7,885 మంది నుంచి సర్వీస్లో వివరాలు సేకరించారు. కాగా, 38 శాతం మంది 24 గంటల్లోపు తమ ఫిర్యాదులు నివృత్తి అవుతున్నట్టు వివరించారు. 30 శాతం మంది 1 నుంచి 3 రోజులు, 5 శాతం మంది 4–7 రోజులు, 11 శాతం మంది 7 రోజులకు పైగా సమయం పడుతోందన్నారు. 8 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. -
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు. -
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్హౌస్ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్ ఉద్యోగులు పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్ తాజాగా చేసిన జాతీయ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తాము గడిచిన మూడు నెలల్లో తిండికి కూడా కష్టాలు పడినట్లు నివేదించారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.సియాటిల్కు చెందిన వాల్మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్. యూఎస్ వేర్హౌసింగ్ పరిశ్రమ వర్క్ఫోర్స్లో అమెజాన్ 29 శాతం వాటాను కలిగి ఉందని పరిశోధకుల అంచనా. అమెజాన్ వేర్హౌస్లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నుంచి స్పందనలను క్రోడీకరించి నివేదికను విడుదల చేసింది. -
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఫ్యాన్ గాలి ప్రచండం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్.. వేదికగా ఒకటే చర్చ.. ‘ఈసారీ వైఎస్సార్సీపీనే వస్తుంది.. జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలన్నీ పక్కాగా లెక్కలేసి చెబుతున్నాయి. సైంటిఫిక్ పారామీటర్స్తో సర్వే చేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాయి. పత్రికలకు సంపాదకులుగా పని చేసిన వాళ్లు, సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. కచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు అలాగున్నాయి కాబట్టి’ అంటూ ఊరూరా జనం చెబుతున్నారు. ‘మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే మా బతుకులు మారతాయని మా నమ్మకం. మేమంతా జగన్ బాటలోనే నడుస్తాం. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యం. జగన్ అంటే విశ్వాసం.. చంద్రబాబు అంటే మోసం..’ అని నిన్న సిద్ధం సభల్లో.. ఇప్పుడు బస్సు యాత్రలో అశేష ప్రజానీకం తేల్చి చెబుతున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక ప్రజా సంకల్ప పాదయాత్రలో.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొలి ఏడాదే 95 శాతం.. మొత్తమ్మీద 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. లంచాలకు తావు లేకుండా.. వివక్షకు చోటు లేకుండా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 87 శాతం కుటంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్డీబీటీ ద్వారా పేదలకు రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి కలిగింది. దేశ చరిత్రలో ఈ స్థాయిలో పేదలకు మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దనే ప్రజలకు అందిస్తున్నారు. వైద్య, విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. వీటన్నింటి వల్ల సుపరిపాలనతో నవచరిత్ర లిఖించిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది. 58% మహిళల ఓట్లు జగన్కే ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50% కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ సాధికారతకు జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పార్థ దాస్ సెఫాలజిస్ట్, చాణక్య కన్సల్టెన్సీ జగన్పై విశ్వసనీయతే విజయానికి సోపానం ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు సీఎం జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పద్మజా జోషి, సీనియర్ న్యూస్ ఎడిటర్, టైమ్స్నౌ అప్రతిహతంగా బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం కడలిలా తరలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సీఎం జగన్ను చూసేందుకు యువతీ యువకులతో కలిసి చంటి బిడ్డలను చంకనేసుకుని మహిళలు పోటీపడుతూ బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. మండుటెండైనా.. అర్ధ రాత్రయినా సీఎం వైఎస్ జగన్ను దగ్గరి నుంచి చూసేందుకు.. కరచాలనం చేసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. మేలు చేశాం.. ఓటేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా ‘మీ పాలన వల్ల మాకు మంచి జరిగింది.. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అంటూ ప్రజలు సీఎం వైఎస్ జగన్కు భరోసా ఇస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటి అరుదైన ఘట్టాలను తానెన్నడూ చూడలేదని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ జత కలిశాక, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం ముఖం చాటేస్తుండటం.. నాడు సిద్ధం సభలు.. నేడు బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరో చారిత్రక విజయం ఖాయం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు, చాణక్య, బీపీఎస్, జన్మత్ పోల్స్, లోక్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, మ్యాట్రిజ్ వంటి పొలిటికల్ కన్సల్టెన్సీలు అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్–మ్యాట్రిజ్, డెక్కన్ 24/7 వంటి జాతీయ మీడియా సంస్థలు.. చాణక్య, మ్యాట్రిజ్ నుంచి జన్మత్ పోల్స్ వరకూ పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన డజనుకు పైగా సర్వేల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించాయి. దాంతో జనసేన–బీజేపీతో చంద్రబాబు జట్టుకట్టారు. మూడు పార్టీల జెండాలు జత కలిసినా వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు కూటమి నిలబడలేదన్నది సర్వేల్లో వెల్లడైంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూ వస్తోందని సర్వేలు వెల్లడించాయి. సుమారు 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు నిర్వహించిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి. -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
కిచెన్కు టాటా.. హోటళ్ల బాట..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలికాలంలో కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. జీవన శైలి మారుతోంది. భా ర్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీ నితో మన దేశంలోని కుటుంబాలు ఇళ్లలో వంట గదికి టాటా చెప్తున్నారని.. హోటళ్ల బాట పడుతు న్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకంతోపాటు వివిధ వెరైటీల ఆహారం తినాలన్న కోరిక దీనికి కారణమని వెల్లడైంది. ప్రాసెస్డ్ ఆ హారం వినియోగం భారీగా పెరిగినట్టు తేలింది. వీధివీధినా వెలసిన రెస్టారెంట్లు, హోటళ్లు, విస్తృతంగా అందుబాటులోకి ఫుడ్ డెలివరీ యాప్లు, నిమిషాల్లో సరుకులు తెచ్చిచ్చే గ్రోసరీ యాప్లు.. దీనికి మరింత ఊతమిస్తున్నట్టు వెల్లడైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంఓఎస్పీఐ), ఐసీఐసీఐ సెక్యూరి టీస్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యా యి. ఆ నివేదికల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. ♦ అంతకుముందటి పదేళ్లతో పోల్చితే 2022–23 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లోని అధిక ఆదాయ వర్గాల వారు ప్యాకేజ్డ్ ఫుడ్, డైనింగ్ ఔట్, పుడ్ డెలివరీ సరీ్వసెస్ కోసమే తమ ఫుడ్ బడ్జెట్లో 50శాతానికిపైగా ఖర్చు చేశారు. గతంలో ఇది 41.2 శాతమే. ♦ మధ్యతరగతి కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై చేస్తున్న ఖర్చు 16శాతం నుంచి 25 శాతానికి (గత పదేళ్లలో) పెరిగింది. ♦ అధికాదాయ కుటుంబాలకు సంబంధించి చూస్తే.. ‘స్టేపుల్ ఫుడ్ (ముడి ఆహార పదార్థాల)’పై వ్యయం తగ్గుతోందని.. క్రమంగా వారి ఇళ్లలో వంట గదులకు పనిలేకుండా పోతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. ♦ 2022–23లో అధికాదాయ కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ వ్యయం ఏకంగా రూ.971గా ఉంది. అదే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల్లో తలసరి ఫుడ్ డెలివరీ ఖర్చు రూ.60గా ఉంది. ♦ గత పదేళ్లతో పోల్చితే ఇంట్లో వంట చేసుకోవడం తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, డెలివరీ యాప్ల ద్వారా తెప్పించుకోవడం బాగా పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ♦ గత పదేళ్లలో పోల్చితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగించే అధికాదాయ కస్టమర్లు రెండింతలు పెరిగారు. అదే మధ్య తరగతి కస్టమర్లు మూడింతలు పెరిగారు. ♦ అధికాదాయ వర్గాల వారు.. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సేంద్రియ ఆహారం, పానీయాల వంటి వాటి వినియోగం పెంచారు. మిగతా వర్గాల వారూ వాటివైపు ఆకర్షితులవుతున్నారు. ♦ డ్రైఫ్రూట్స్పై చేస్తున్న కుటుంబ వ్యయం పట్టణ ప్రాంతాల్లో 1.3శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2శాతంగా ఉంది. ♦ పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం పెరిగినా.. ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై ఖర్చు తగ్గి.. ధాన్యాలు (సెరీల్స్), కోడిగుడ్లు, చేప, మాంసం, వంటనూనె వంటి వాటి వినియోగం గతంలోని స్ధాయిలోనే ఉండిపోయింది. -
ల్యాబ్ తయారీ మాంసం తింటారా?
‘మీరు ల్యాబ్లో తయారు చేసిన మాంసం తింటారా?’ కన్జూమర్ ఇన్సైట్స్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ఇటీవల వివిధ దేశాల ప్రజల్ని అడిగిన వెరైటీ ప్రశ్న ఇది. మామూలు మాంసాన్ని లొట్టలేసుకొని ఆరగించే నాన్వెజ్ ప్రియులకు ఈ ప్రశ్న పెద్దగా రుచించనట్లుంది!! అందుకే చాలా తక్కువ మంది నుంచే సానుకూల స్పందన వచ్చింది. కానీ ఇందులోనూ భారతీయులే కొంత పాజిటివ్గా స్పందించడం విశేషం. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు... అంటే అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్ మాంసం తినేందుకు సై అనగా ఫ్రాన్స్లో మాత్రం అతితక్కువగా కేవలం 9 శాతం మందే దీన్ని ట్రై చేస్తామన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ల్యాబ్ తయారీ మాంసం విక్రయాలకు అనుమతిచ్చిన రెండు దేశాల్లో ఒకటైన అమెరికాలోనూ (మరో దేశం సింగపూర్) దీన్ని తినడంపై పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 16 శాతం మంది అమెరికన్లే ఇందుకు రెడీ అన్నారు. ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి 2 వేల నుంచి 10 వేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు. ఎలా తయారు చేస్తారు? కల్టివేటెడ్ లేదా కల్చర్డ్ మీట్గా పేర్కొనే ఈ మాంసం తయారీ కోసం ముందుగా జంతువుల నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ను బయాప్సీ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ‘పోషక స్నానం’ చేయిస్తారు. అంటే కణ విభజన జరిగి అవి కొంత మేర రెట్టింపయ్యేందుకు వీలుగా పోషకాలతో కూడిన ద్రవంలో ముంచుతారు. అనంతరం అవి కణజాలం (టిష్యూ)గా వృద్ధి చెందేందుకు బయోరియాక్టర్లోకి చేరుస్తారు. జంతు ప్రేమికుల కోసం లేదా జంతు వధ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ల్యాబ్ తయారీ మాంసం సూత్రప్రాయంగా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.