third Test
-
కంగారూలు కసితీరా...
బ్రిస్బేన్లో తొలి రోజు వరుణుడు విజృంభిస్తే... రెండో రోజు ఆ్రస్టేలియా బ్యాటర్లు వీర విహారం చేశారు. ట్రావిస్ హెడ్ టీమిండియాపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మరో సెంచరీతో విరుచుకుపడగా... స్టీవ్ స్మిత్ సాధికారిక సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు సాధించింది. భారత మేటి పేసర్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... అతనికి సహచర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దాంతో ఆ్రస్టేలియా మ్యాచ్పై పట్టు సాధించే అవకాశాన్ని సృష్టించుకుంది. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న ఈ పోరులో భారత బ్యాటర్ల ఆటతీరుపైనే టీమిండియా ఆశలు ఆధారపడి ఉన్నాయి.బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా జట్టు అదరగొట్టింది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో విజృంభించిన ఆ్రస్టేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారత్తో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగే ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 152; 18 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ భారీ శతకంతో విజృంభించగా... చాన్నాళ్లుగా ఫామ్లో లేని మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో రాణించాడు. వీరిద్దరి అసమాన ప్రదర్శన ముందు... బుమ్రా (5/72) ఒంటరి పోరాటం చిన్నబోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో రెండో రోజు ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవరాల్గా రెండో రోజు 377 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆసీస్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. తొలి సెషన్ మనదే... వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో రోజు ఆటలో మొదట మన బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రాకు వికెట్ సమరి్పంచుకోకూడదు అనే సంకల్పంతో ముందుకు సాగిన ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (54 బంతుల్లో 21), నాథన్ మెక్స్వీనీ (49 బంతుల్లో 9) చివరకు అతడి బౌలింగ్లోనే వెనుదిరిగారు. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన బుమ్రా... వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్కు పంపాడు. దీంతో ఆ్రస్టేలియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు మెరుగైన ఆరంభమే లభించినట్లు అనిపించింది. లబుషేన్ (55 బంతుల్లో 12)తో పాటు ఆరంభంలో స్మిత్ అతి జాగ్రత్తకు పోవడంతో భారత బౌలర్లదే పైచేయి అయింది. గంటకు పైగా క్రీజులో గడిపినా... ఒక్క షాట్ ఆడలేకపోయిన లబుషేన్ చివరకు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 75/3తో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్పై టీమిండియా పట్టు సాధించడం ఖాయమే అనే అంచనాలకు వస్తున్న తరుణంలో... స్మిత్తో కలిసి హెడ్ వీరోచితంగా పోరాడాడు. మొత్తానికి తొలి సెషన్ ముగిసేసరికి ఆసీస్ 104/3తో నిలిచింది. 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు మూడో సెషన్ ఆరంభలోనూ స్మిత్, హెడ్ జోరు సాగింది. నాలుగో వికెట్కు 241 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. టెస్టు ఫార్మాట్లో 25 ఇన్నింగ్స్ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్... మూడంకెల స్కోరు చేసిన వెంటనే పెవిలియన్ చేరగా... పేస్ ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్స్టంప్ లైన్లో బుమ్రా వేసిన బంతికి మార్ష్ స్లిప్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అదే ఓవర్లో హెడ్ కూడా ఔటయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించిన ట్రవిస్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇకనైనా ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడుతుందని ఆశిస్తే... వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దాన్ని అడ్డుకున్నాడు. కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (20)తో కలిసి ధాటిగా ఆడుతూ కీలక పరుగులు జోడించాడు. గాయం కారణంగా కాసేపు మైదానానికి దూరమైన సిరాజ్... ఆఖరికి ఒక వికెట్ పడగొట్టగా... కేరీతో పాటు మిషెల్ స్టార్క్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. తదుపరి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య ఈ మ్యాచ్లో ఇప్పటికే ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (బ్యాటింగ్) 45; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 33; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 405. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385. బౌలింగ్: బుమ్రా 25–7–72–5; సిరాజ్ 22.2–4–97–1; ఆకాశ్దీప్ సింగ్ 24.4–5–78–0; నితీశ్ కుమార్ రెడ్డి 13–1–65–1; రవీంద్ర జడేజా 16–2–76–0.భారీ భాగస్వామ్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా గేర్ మార్చింది. అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఆసీస్ ప్లేయర్లు... ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా... టీమిండియాపై మెరుగైన ప్రదర్శన చేస్తూ... మన బౌలింగ్కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ అలరించాడు. రెండో సెషన్లో కెపె్టన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ జోడీకి పరోక్షంగా సహకరించాయి. హెడ్ క్రీజులో కుదురుకునే సమయంలో ఫీల్డింగ్ మొహరింపు అనుకూలంగా ఉండటంతో అతడు సునాయాసంగా పరుగులు రాబట్టగలిగాడు. షార్ట్బాల్ను సరిగ్గా ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా బౌలింగ్ సాగకపోగా... అడపాదడపా జరిగిన ప్రయాత్నాల్లో రోహిత్ థర్డ్ మ్యాన్ను మొహరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా బౌలింగ్లో ఆచితూచి ఆడిన హెడ్ ఆ తర్వాత దూసుకెళ్లాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. టచ్లోకి వచ్చాక రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి బౌలింగ్ను లక్ష్యంగా చేసుకుంటూ హెడ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయించేందుకు ప్రధాన పేసర్లను తప్పించడంతో ఆసీస్ జోడీ స్వేచ్ఛగా ముందుకు సాగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన స్మిత్... లయ అందుకున్నాక ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. ఆకాశ్దీప్ బౌలింగ్లో ఇబ్బంది పడినట్లు కనిపించిన స్మిత్... మిగిలిన వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సెషన్లో ఆసీస్ జట్టు వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది. 1 అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై అత్యధిక సెంచరీలు (15) చేసిన ప్లేయర్గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ మాజీ కెపె్టన్ పాంటింగ్ (14) పేరిట ఉన్న ఈ రికార్డును స్మిత్ అధిగమించాడు. జో రూట్ (13) మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై వన్డేల్లో 5 శతకాలు బాదిన స్మిత్, టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఇక భారత్, ఆ్రస్టేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక (10) సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సచిన్ (11) అగ్రస్థానంలో ఉన్నాడు. 1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్పై 12 శతకాలు నమోదు చేసిన స్మిత్కు భారత్పై ఇది పదో సెంచరీ.2 టెస్టుల్లో ఆ్రస్టేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స్మిత్ (33) రెండో స్థానానికి చేరాడు. బ్రిస్బేన్ మ్యాచ్లో శతకంతో స్మిత్... స్టీవ్ వా (32)ను దాటేశాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 టెస్టు మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం బుమ్రాకిది 12వ సారి. భారత పేసర్లలో కపిల్దేవ్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.10 ఆసియా ఆవలి పిచ్లపై బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది పదోసారి. ఈ జాబితాలో కపిల్దేవ్ (9)ను అధిగమించి బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. -
ఆధిక్యంలోకి వెళతారా!
బ్రిస్బేన్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య నేటి నుంచి బ్రిస్బేన్లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమఉజ్జీలుగా ఉండగా... పేస్కు స్వర్గధామమైన బ్రిస్బేన్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కీలకంగా మారింది. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... టీమిండియాకు పరాజయం తప్పకపోగా... ఈ మ్యాచ్లో వాటిని అధిగమించి విజయం సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ... ఆఫ్స్టంప్ అవతల పడుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి నుంచి సాధికారిక ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మ తిరిగి ఓపెనింగ్ చేయడం ఖాయమే. మరోవైపు గత మ్యాచ్లో విజయంతో ఆ్రస్టేలియా ఆత్మవిశ్వాసంతో ఉన్నా... స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా పేలవ ఫామ్ ఆసీస్ను ఇబ్బంది పెడుతోంది. ఒత్తిడిలో రోహిత్, కోహ్లి కెరీర్లో దాదాపు చివరి ఆ్రస్టేలియా పర్యటనలో ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లి ఒత్తిడిలో కనిపిస్తున్నారు. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్... అడిలైడ్లో మిడిలార్డర్లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏకైక స్పిన్నర్గా అశ్విన్, సుందర్, జడేజా మధ్య పోటీ ఉన్నా... గతంలో ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక మూడో పేసర్గా హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్దీప్ సింగ్కు అవకాశం దక్కవచ్చు. ఆత్మవిశ్వాసంలో ఆ్రస్టేలియా.. సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా అదే జోరులో సిరీస్లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లో ఘోర పరాజయం ఎదురైనా... అడిలైడ్లో హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో కంగారూలు గాడిన పడ్డారు. అయితే స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మెక్స్వీనీ, మిషెల్ మార్‡్ష, అలెక్స్ కేరీ రాణించాల్సిన అవసరముంది. లబుషేన్ గత మ్యాచ్లో అర్ధశతకంతో ఆకట్టుకున్నా... పూర్తి నియంత్రణతో కనిపించలేదు. బౌలింగ్లో మాత్రం ఆసీస్కు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్/అశ్విన్, ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, మెక్స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్‡్ష, కారీ, స్టార్క్, లయన్, హాజల్వుడ్. పిచ్, వాతావరణం బ్రిస్బేన్ పిచ్ పేస్, బౌన్స్కు సహకరించనుంది. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు ఉదయం వర్షం కురిసే అవకాశముంది. -
IND vs AUS 3rd Test: ఫుల్ ప్రాక్టీస్...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్ చేరుకున్న రోహిత్ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్లో నిమగ్నమైంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్లో ‘పింక్ బాల్’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్లో రోహిత్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్లో మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి విఫలమైన కెపె్టన్ రోహిత్ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేశారు.పచ్చికతో కూడిన గబ్బా పిచ్... పేస్కు, బౌన్స్కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్ ఓపెనర్గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్ సుదీర్ఘంగా సంభాషిoచాడు. ఆకాశ్కు అవకాశం దక్కేనా! నెట్స్లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్ ఆకాశ్దీప్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రెండో మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్లో ఆకాశ్ బౌలింగ్ చూస్తుంటే హర్షిత్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టు జరగనున్న పిచ్ హర్షిత్ బౌలింగ్ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్కు అవసరమైన ఫిట్నెస్ అతడు ఇంకా సాధించలేదు. ‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి. జైస్వాల్ బస్ మిస్.. రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్ నుంచి బ్రిస్బేన్కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్ణీత సమయానికి టీమ్ బస్ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జైస్వాల్ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్పోర్ట్కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్ అక్కడికి రాకపోవడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్ నుంచి బయలుదేరగా... జైస్వాల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్ను విమానాశ్రయానికి చేర్చారు. -
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్లో చెమటోడ్చుతున్న భారత ప్లేయర్లు
అడిలైడ్: రెండో టెస్టులో ఆ్రస్టేలియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు తిరిగి గాడిన పడటంపై దృష్టి పెట్టింది. భారత్, ఆ్రస్టేలియా మధ్యఅడిలైడ్ వేదికగా ‘గులాబీ బంతి’తో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా... మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ‘అదనపు సమయాన్ని హోటల్ రూమ్స్లో కాకుండా... మైదానంలో గడపండి’ అని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్న మాటల ప్రభావమో, లేక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలనే తపనో కానీ మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు.‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం బుధవారం బ్రిస్బేన్ బయలుదేరనున్న టీమిండియా... మంగళవారం అడిలైడ్లో కఠోర సాధన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మూడో టెస్టు కోసం సాధన మొదలైంది’ అని రాసుకొచ్చింది. గత 12 టెస్టు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ... పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా... పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి తన ఆఫ్స్టంప్ బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ డిఫెన్స్పై దృష్టి సారించగా... పంత్ భారీ షాట్లు సాధన చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు. హర్షిత్ రాణా, ఆకాశ్దీప్, యశ్ దయాళ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు త్రో డౌన్ స్పెషలిస్ట్ల బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్తో పాటు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్కు దూరంగా ఉన్నారు. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 7 టెస్టులు జరిగాయి. ఒక మ్యాచ్లో భారత్ నెగ్గగా... ఐదు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది, మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
రసవత్తర స్థితిలో...
ఆఖరి మూడో టెస్టును స్పిన్నే దున్నేస్తోంది. రెండో రోజు 15 వికెట్లు కూలాయి. ఇంతలా గింగిర్లు తిరుగుతున్న పిచ్పై రిషభ్ పంత్ టెస్టులో టి20 ఆట ఆడేశాడు. దీంతో తొలి సెషన్లో ఆతిథ్య జట్టు వేగంగా పరుగులు సాధించింది. రెండో సెషన్లో ఎజాజ్ స్పిన్ భారత్ను చుట్టేసింది. అయితే మూడో సెషన్లో మన స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్లు చెలరేగడంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. నామమాత్రమైన ఆఖరి వికెట్ మిగిలుంది. ఇలాంటి కఠిన పిచ్పై ఇది కూడా చిన్న లక్ష్యమేమీ కాదు కాబట్టి మూడో రోజూ హోరాహోరీ పోరు ఖాయం. ముంబై: చివరి టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. అటో... ఇటో... ఎవరివైపో కానీ ఈ మ్యాచ్ అయితే మూడు రోజుల్లో ముగియడం ఖాయమైంది. ప్రత్యర్థి స్పిన్కు ఎదురీదితే భారత్ 1–2తో సిరీస్లో పరువు నిలుపుకుంటుంది. ఉచ్చులో పడితే మాత్రం సొంతగడ్డపై వైట్వాష్ అవుతుంది. రెండో రోజు ఆటలో మాత్రం భారత బ్యాటర్లే కాస్త పైచేయి సాధించారని చెప్పొచ్చు. 6 వికెట్లు సమర్పించుకున్న టీమిండియా క్రితం రోజు స్కోరుకు 177 పరుగులు జత చేసింది. శుబ్మన్ గిల్ (146 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అదరగొట్టారు. ఎజాజ్ పటేల్కు 5 వికెట్లు దక్కాయి. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 28 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్ 171 పరుగులు చేసింది. విల్ యంగ్ (100 బంతుల్లో 51; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. పంత్ ధనాధన్ ఫిఫ్టీ తొలి సెషన్లో భారత బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్మన్ నిలకడగా ఆడటంతో కివీస్ బౌలర్ల ఆటలు సాగలేదు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ చాప్మన్ లాంగాన్లో గిల్ ఇచ్చిన క్యాచ్ను, లాంగాఫ్లో పంత్ క్యాచ్ను మ్యాట్ హెన్రీ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకొన్న బ్యాటర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. శనివారం 86/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ఆలౌటైంది.పంత్, గిల్ కివీస్ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రిషభ్ టి20 ఫార్మాటల్లే చెలరేగిపోయాడు. ఎజాజ్ పటేల్, ఫిలిప్స్ బౌలింగ్లో చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 29వ ఓవర్లోనే భారత్ స్కోరు 150 పరుగులను దాటింది. మరుసటి ఓవర్లోనే ఇద్దరి ఫిఫ్టీలు పూర్తయ్యాయి.30వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన గిల్ 66 బంతుల్లో, నాలుగో బంతికి పరుగు తీసిన రిషభ్ 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఇష్ సోధి... పంత్ను ఎల్బీగా అవుట్ చేయడంతో ఐదో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా (14) క్రీజులోకి రాగా, టీమిండియా లంచ్ విరామానికి 195/5 స్కోరు చేసింది. అప్పటికి ఇంకా ఆతిథ్య జట్టు 40 పరుగులు వెనుకబడే ఉంది. ఎజాజ్ దెబ్బ రెండో సెషన్లో ఎజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలం మొదలవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 200 దాటగానే జడేజాను ఫిలిప్స్ అవుట్ చేయగా, స్వల్ప వ్యవధిలో ఎజాజ్... సర్ఫరాజ్ (0), గిల్, అశ్విన్ (6)ల వికెట్లను పడగొట్టడంతో గిల్ 10 పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... భారత్ భారీ ఆధిక్యం సాధించలేకపోయింది.ఆకాశ్దీప్ (0) రనౌట్ కావడంతో టీ విరామానికి ముందే భారత్ 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే వికెట్ పూర్తిగా స్పిన్కు అనువుగా మారిపోవడంతో భారత సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్–జడేజా కివీస్ రెండో ఇన్నింగ్స్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు.మిచెల్ (21; 1 ఫోర్, 1 సిక్స్), ఫిలిప్స్ (26; 1 ఫోర్, 3 సిక్స్లు)ల అండతో యంగ్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 171 పరుగుల వద్ద హెన్రీ (10)ని జడేజా బౌల్డ్ చేయడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ముందంజలో ఉంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 90; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 0; కోహ్లి రనౌట్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 60; జడేజా (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 14; సర్ఫరాజ్ (సి) బ్లన్డెల్ (బి) ఎజాజ్ 0; సుందర్ నాటౌట్ 38; అశ్విన్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 6; ఆకాశ్దీప్ రనౌట్ 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (59.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84, 5–180, 6–203, 7–204, 8–227, 9–247, 10–263. బౌలింగ్: మ్యాట్ హెన్రీ 8–1–26–1, విలియమ్ ఓ రూర్కే 2–1–5–0, ఎజాజ్ పటేల్ 21.4–3– 103–5, గ్లెన్ ఫిలిప్స్ 20–0–84–1, రచిన్ రవీంద్ర 1–0–8–0, ఇష్ సోధి 7–0–36–1. న్యూజిలాండ్ రెండోఇన్నింగ్స్: లాథమ్ (బి) ఆకాశ్దీప్ 1; కాన్వే (సి) గిల్ (బి) సుందర్ 22; యంగ్ (సి అండ్ బి) అశ్విన్ 51; రచిన్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 4; మిచెల్ (సి) అశ్విన్ (బి) జడేజా 21; బ్లన్డెల్ (బి) జడేజా 4; ఫిలిప్స్ (బి) అశ్విన్ 26; ఇష్ సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 17; మొత్తం (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–44, 4–94, 5–100, 6–131, 7–148, 8–150, 9–171. బౌలింగ్: ఆకాశ్దీప్ 5–0–10–1, వాషింగ్టన్ సుందర్ 10–0–30–1, అశ్విన్ 16–0–63–3, జడేజా 12.3–2–52–4. -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్లోనూ క్లీన్స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్లో భారత్పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్స్వీప్గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పేస్ పిచ్ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్పై కూడా తడబడింది. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్లో ముందుండి ఇన్నింగ్స్ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్లో ఉండగా... శుబ్మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్పైనే కాకుండా బ్యాటింగ్లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్తో టి20 సిరీస్లకు ఎంపికైనా... హర్షిత్కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్ల ఫస్ట్క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్తో సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
సిరీస్ నీదా నాదా!
రావల్పిండి: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి నిర్ణయాత్మక మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గగా... గురువారం నుంచి రావల్పిండిలో మూడో టెస్టు మొదలవుతుంది. పరుగుల వరద పారిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు... స్పిన్కు అనుకూలించిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టు మరోసారి స్పిన్ పిచ్నే సిద్ధం చేసింది. స్లో బౌలర్లకు సహకరించే విధంగా పొడి వికెట్ను తయారు చేసిన పాకిస్తాన్ గత నాలుగు రోజులుగా పిచ్ను ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేసింది. రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు నోమాన్ అలీ, సాజిద్ ఖాన్ ఇద్దరే చెలరేగి ఇంగ్లండ్ను రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆలౌట్ చేసి 20 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో... మరోసారి స్పిన్ బలంతోనే పాకిస్తాన్ ఫలితం రాబట్టాలని చూస్తోంది. తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే అవకాశం ఉండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి... వారి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్ రాత మారింది. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న కమ్రాన్ గులామ్పై అంచనాలు పెరిగిపోగా..కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, రిజ్వాన్ కలిసి కట్టుగా కదం తొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ అదనపు స్పిన్నర్గా లెగ్స్పిన్నర్ రేహాన్ అహ్మద్ను బరిలోకి దించనుంది. తొలి టెస్టులో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్తో పాటు జో రూట్, ఓలీ పోప్, బెన్ డకెట్, జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. -
ఆడింది ఏడు టెస్ట్లే.. దిగ్గజ ఆటగాడి సరసన చోటు
టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం మార్మోగిపోతుంది. క్రికెట్కు సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరిగినా ఇతగాడి పేరే వినిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారిస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న యశస్వి.. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో డబుల్ సెంచరీతో విరుచుకుపడి భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆరాధ్య ఆటగాడిగా మారిపోయాడు. ఈ డబుల్తో యశస్వి క్రేజ్ ఒక్కసారిగా తారా స్థాయికి చేరింది. భారత క్రికెట్ సర్కిల్స్లో ఇతను ఓవర్నైట్ హీరో అయిపోయాడు. అతడు ఆడింది ఏడు టెస్ట్ మ్యాచ్లే అయినా.. 100 టెస్ట్ల అనంతరం లభించే పేరును సంపాదించాడు. రాజ్కోట్ టెస్ట్లో డబుల్ సెంచరీతో చాలా రికార్డులను బద్దలు కొట్టిన యశస్వి.. రెండు భారీ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్కోట్ టెస్ట్కు ముందు జరిగిన విశాఖ టెస్ట్లోనూ డబుల్ సెంచరీ చేసిన యశస్వి.. దిగ్గజ ఆటగాడు, తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లి సరసన చేరాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లి తర్వాత వరుస టెస్ట్ల్లో డబుల్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వినూ మన్కడ్, విరాట్ కోహ్లి తర్వాత ఒకే సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రాజ్కోట్ టెస్ట్ డబుల్తో యశస్వి సాధించిన మరిన్ని రికార్డులు.. ►టెస్టుల్లో ఇంగ్లండ్పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి భారత బ్యాటర్గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ►అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సులు కొట్టిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ రికార్డును యశస్వి సమం చేశాడు. మూడో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో జైశ్వాల్ ఏకంగా 12 సిక్స్లు బాదాడు. 1996లో జింబాబ్వేపై వసీం అక్రమ్ కూడా 12 సిక్స్లు కొట్టాడు. ►భారత్ తరపున ఒక ఇన్నింగ్స్లో 10కిపైగా సిక్స్లు బాదిన మొదటి బ్యాటర్గా జైశ్వాల్ నిలిచాడు. ►టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్గా జైస్వాల్ రికార్డులకెక్కాడు. ►సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ► ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు (545) సాధించిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా రికార్డు. ఇదిలా ఉంటే, రాజ్కోట్ టెస్ట్లో టీమిండియా 434 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి అజేయ డబుల్ సెంచరీతో (214 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించాడు. దీనికి ముందు టెస్ట్లోనూ యశస్వి డబుల్తో చెలరేగాడు. వైజాగ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 209 పరుగులు చేశాడు. రాజ్కోట్ టెస్ట్లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
434 పరుగుల తేడాతో...
విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం... బౌలింగ్లో జడేజా మాయాజాలం... వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రాజ్కోట్: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్ ‘బజ్బాల్’ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్ యాదవ్ (2/19), అశ్విన్ (1/19) స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. యశస్వి ‘డబుల్’... ఓవర్నైట్ బ్యాటర్లు శుబ్మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కుల్దీప్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 55 పరుగులు జోడించారు. గిల్ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్ (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్స్లు) తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్కు 172 జోడించడం విశేషం. స్పిన్ ఉచ్చులో పడి... కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్ బజ్బాల్ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్ పిచ్పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్ మాయాజాలంలో పోప్ (3), బెయిర్స్టో (4), రూట్ (7) తేలిగ్గానే పడిపోయారు. జట్టు స్కోరు 50 వద్దే రూట్తో పాటు స్టోక్స్ (15), రేహాన్ అహ్మద్ (0) అవుటయ్యారు. మార్క్ వుడ్ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడంతో ఇంగ్లండ్ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్ కూడా తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319; భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్ (రనౌట్) 4; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 3; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 15; ఫోక్స్ (సి) జురేల్ (బి) జడేజా 16; రేహన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 0; హార్ట్లీ (బి) అశ్విన్ 16; వుడ్ (సి) జైస్వాల్ (బి) జడేజా 33; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్: బుమ్రా 8–1– 18–1, సిరాజ్ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్ 8–2–19–2, అశ్విన్ 6–3–19–1. 3 వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ వరుసలో వినోద్ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 9 స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల సంఖ్య. అనిల్ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు. 12 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా అక్రమ్ (12 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ సమం చేశాడు. 28 రాజ్కోట్ టెస్టులో భారత్ సిక్స్ల సంఖ్య. ఒకే టెస్టులో అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది. 48 ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్లు. ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్ 47 సిక్స్లు కొట్టింది. -
ఆండర్సన్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సెంచరీ అనంతరం నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 187 పరుగుల వద్ద ఉన్న యశస్వి.. వెటరన్ పేసర్ ఆండర్సన్పై కనికరం లేకుండా విచుకుపడ్డాడు. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత గేర్ మార్చిన అతను.. ఇన్నింగ్స్ 85వ ఓవర్లో ఆండర్సన్కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది 180ల్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 సౌరవ్ గంగూలీ తర్వాత మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో 500 పరుగులు దాటిన రెండో భారతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. 2007లో స్వదేశంలో పాక్తో జరిగిన టెస్ట్ సిరీస్లో గంగూలీ 534 పరుగులు సాధించాడు. ఓ ఇన్నింగ్స్లో, ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ఇన్నింగ్స్లో యశస్వి ఇప్పటివరకు 10 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో అతను 20 సిక్సర్లు కొట్టాడు. యశస్వికి ముందు టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ (19) పేరిట ఉండేది. ఆండర్సన్ బౌలింగ్లో ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన ఐదో భారత ప్లేయర్గా (2002 తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు ధోని (రెండు సార్లు), హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వికి (194) జతగా సర్ఫరాజ్ ఖాన్ (38) క్రీజ్లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 378/4గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 504 పరుగుల లీడ్లో ఉంది. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు
టీమిండియాకు గుడ్ న్యూస్. తల్లి అనారోగ్య సమస్య కారణంగా మ్యాచ్ మధ్యలోనే చెన్నైకి వెళ్లిపోయిన రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరనున్నాడు. యాష్ ఇవాళ (ఫిబ్రవరి 18) లంచ్ విరామం సమయానికంతా జట్టుతో జతకడతాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా, తల్లిని చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరిన అశ్విన్కు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం తమకెంతో ముఖ్యమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 383 పరుగుల లీడ్లో ఉంది. ఇవాల్టి ఆటలో కుల్దీప్ తప్పిదం కారణంగా శుభ్మన్ గిల్ (91) అనవసరంగా రనౌటయ్యాడు. గాయం కారణంగా నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి ఇవాళ తిరిగి క్రీజ్లోకి వచ్చాడు. ప్రస్తుతం యశస్వి (114), కుల్దీప్ (27) క్రీజ్లో ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) భారత్ సెకెండ్ ఇన్నింగ్స్: 257/3 (యశస్వి 115 నాటౌట్) -
IND VS ENG 3rd Test Day 4: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్లో హార్ట్లీ పెవిలియన్కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సిరాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్లోకి వచ్చాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 192/2గా ఉంది. శుభ్మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
డకెట్ ధనాధన్...
35 ఓవర్లలో 5.91 రన్రేట్తో 207 పరుగులు. పిచ్ను, ప్రత్యర్థిని లక్ష్య పెట్టకుండా ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ తమ ‘బజ్బాల్’ మంత్రాన్ని చూపించింది. ఫలితంగా 445 పరుగుల భారీ స్కోరు కూడా భారత్కు సురక్షితం కాదనిపిస్తోంది. భారత గడ్డపై ఒక విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లో ఒకటిగా నిలిచిపోయే శతకంతో ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగాడు. దాంతో రెండు రోజుల ఆట తర్వాత రాజ్కోట్ టెస్టు సమంగా నిలిచింది. అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం శుక్రవారం ఆటలో గుర్తుంచుకోదగ్గ మరో హైలైట్. మూడో రోజు ఇంగ్లండ్ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారన్నదే ఆసక్తికరం. రాజ్కోట్: భారత్తో మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 326/5తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురేల్ (46), అశ్విన్ (37) ఎనిమిదో వికెట్కు 77 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. కీలక భాగస్వామ్యం... రెండో రోజు ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించగానే ఒకే స్కోరు వద్ద కుల్దీప్ (4), జడేజా (112) వెనుదిరిగారు. ఈ దశలో అశ్విన్, జురేల్ భాగస్వామ్యం భారత్ను 400 పరుగులు దాటించింది. అశ్విన్ జాగ్రత్తగా ఆడగా, అరంగేట్ర ఆటగాడు జురేల్ కొన్ని దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్లో అతను అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం తర్వాత చివర్లో బుమ్రా (28 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని విలువైన పరుగులు జోడించాడు. శుక్రవారం 44.5 ఓవర్లు ఆడిన భారత్ మరో 119 పరుగులు జత చేసింది. దూకుడే దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో డకెట్ కాస్త తడబడ్డాడు. కానీ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో ధాటిని మొదలు పెట్టిన అతను ఏ బౌలర్నూ వదలకుండా చివరి వరకు దూకుడు కొనసాగించాడు. సెంచరీ వరకు కూడా ఒక్క తప్పుడు షాట్ లేకుండా అతని ఇన్నింగ్స్ అద్భుతమైన స్ట్రోక్లతో దూసుకెళ్లింది. టీ తర్వాత తొలి ఓవర్నుంచి స్పిన్నర్ కుల్దీప్తో బౌలింగ్ వేయించిన ప్రణాళిక ఫలించలేదు. కుల్దీప్ తొలి 4 ఓవర్లలో డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్లతో 7 ఫోర్లు బాదడం విశేషం. సిరాజ్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 39 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్లో దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితమైన క్రాలీ (15)ని అవుట్ చేసి ఎట్టకేలకు అశ్విన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత వచ్చి న ఒలీ పోప్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఇంగ్లండ్ జోరును కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టి 90ల్లోకి చేరుకున్న డకెట్... సిరాజ్ ఓవర్లో బౌండరీతో 88 బంతుల్లోనే కెరీర్లో మూడో శతకాన్ని అందుకున్నాడు. చివరకు సిరాజ్ చక్కటి బంతికి పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదు పరుగులు పెనాల్టీ... భారత బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా పిచ్పై పరుగెత్తడంతో అంపైర్లు చర్య తీసుకున్నారు. తొలి రోజు ఆటలో జడేజాను ఈ విషయంపై అంపైర్లు హెచ్చరించగా... రెండో రోజు అశ్విన్ కూడా అలాగే చేయడంతో భారత ఇన్నింగ్స్ 102వ ఓవర్లో 5 పరుగులు పెనాల్టిగా విధించారు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5/0తో మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (సి) అండ్ (బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురేల్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రేహన్ 37; బుమ్రా (ఎల్బీ) (బి) వుడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 9; మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314, 6–331, 7–331, 8–408, 9–415, 10–445. బౌలింగ్: అండర్సన్ 25–7–61–1, వుడ్ 27.5–2– 114–4, హార్ట్లీ 40–7–109–1, రూట్ 16–3– 70–1, రేహన్ 22–2–85–2. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాసీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–89, 2–182. బౌలింగ్: బుమ్రా 8–0–34–0, సిరాజ్ 10–1–54–1, కుల్దీప్ యాదవ్ 6–1–42–0, అశ్విన్ 7–0–37–1, జడేజా 4–0–33–0. అశ్విన్ @ 500 ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తన 98వ టెస్టులో ఈ ఘనత సాధించిన అశ్విన్... ఓవరాల్గా 9వ ఆటగాడిగా, అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో భారత బౌలర్గా నిలిచాడు. మ్యాచ్లు, బంతుల పరంగా చూస్తే... అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్ను చేరిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2011లో విండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకు ఇన్నింగ్స్లో 4 వికెట్లు 24 సార్లు... ఇన్నింగ్స్లో 5 వికెట్లు 34 సార్లు... మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు 8 సార్లు తీశాడు. టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ రాజ్కోట్ టెస్టులో అనూహ్య పరిణామం సంభవించింది. తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అశ్విన్ మూడో టెస్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్కు దక్కగా.. పోప్ను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
శతక్కొట్టిన డకెట్.. భారత్కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
రాజ్కోట్ టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు జీవం పోశాడు. డకెట్తో పాటు జో రూట్ (9) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్కు దక్కగా.. పోప్ను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఓవర్నైట్ స్కోర్ 326/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 119 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్, సెంచరీ హీరో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 112 పరుగుల వద్ద ఔట్ కాగా.. మరో ఓవర్నైట్ ఆటగాడు కుల్దీప్ తన స్కోర్ మరో 3 పరుగులు జోడించి 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇవాళ క్రీజ్లో వచ్చిన అరంగేట్ర బ్యాటర్ దృవ్ జురెల్ 46 పరుగులు, అశ్విన్ 37, బుమ్రా 26 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆఖర్లో బుమ్రా బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆటలో జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
శతకాలతో శుభారంభం
బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్పై టాస్ గెలిచిన భారత్ ఒక దశలో 33/3 స్కోరు వద్ద నిలిచింది. ఈ స్థితిలో రోహిత్, జడేజా 204 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే గురువారం ఆటలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు మాత్రం సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఎట్టకేలకు భావోద్వేగాల నడుమ భారత క్రికెటర్గా అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగినట్లుగా చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీని అందుకున్నాడు. జోరు మీదున్న దశలో దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగినా...తానేంటో అతను నిరూపించుకున్నాడు. ఇక మిగిలిన ఐదు వికెట్లతో రెండో రోజు భారత్ ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. రాజ్కోట్: ఇంగ్లండ్తో మూడో టెస్టులో భారత్కు శుభారంభం లభించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (196 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్లు), రవీంద్ర జడేజా (212 బంతుల్లో 110 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించగా... సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్కు 3 వికెట్లు దక్కాయి. ద్విశతక భాగస్వామ్యం... అండర్సన్ వేసిన మ్యాచ్ తొలి బంతిని యశస్వి (10) ఫోర్గా మలచడంలో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే వుడ్ జోరులో భారత్ రెండు పరుగుల తేడాతో యశస్వి, గిల్ (0) వికెట్లు కోల్పోయింది. హార్ట్లీ బంతిని ఆడలేక రజత్ పటిదార్ (5) కూడా సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో సర్ఫరాజ్ వస్తే ఒత్తిడిలో మరో వికెట్ పోయేదేమో! కానీ జట్టు వ్యూహాత్మకంగా కుడి, ఎడమ కాంబినేషన్ కోసం ఐదో స్థానంలో జడేజాను పంపించడం అద్భుతంగా పని చేసింది. రోహిత్, జడేజా కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. 29 పరుగుల వద్ద స్లిప్లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ లంచ్కు ముందు 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరామం తర్వాత పూర్తిగా భారత్ హవా సాగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోహిత్, జడేజా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. 97 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో భారత్ 27 ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఈ జోడీని విడదీయలేక ఇంగ్లండ్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ సిరీస్లో ఒక్క వికెట్ కూడా పడని తొలి సెషన్ ఇదే కావడం విశేషం. టీ తర్వాత తొలి ఓవర్లోనే రోహిత్ 157 బంతుల్లో తన కెరీర్లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పార్ట్నర్íÙప్ 200 పరుగులు దాటాక ఎట్టకేలకు ఇంగ్లండ్కు వికెట్ దక్కింది. షార్ట్ బంతులకు వరుసగా పరుగులు రాబట్టిన రోహిత్ చివరకు అదే షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. సర్ఫరాజ్ రనౌట్... కొత్త ఆటగాడు సర్ఫరాజ్, జడేజా భాగస్వామ్యం జట్టును నడిపించింది. ముఖ్యంగా తన కెరీర్ తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. సర్ఫరాజ్ క్రీజ్లోకి వచ్చినప్పుడు జడేజా స్కోరు 84 కాగా... సర్ఫరాజ్ వెనుదిరిగే సమయానికి 99 మాత్రమే! 77 పరుగుల ఈ ఐదో వికెట్ భాగస్వామ్యంలో జడేజా 15 పరుగులు చేయగా, సర్ఫరాజ్ 62 పరుగులు చేశాడంటేనే అతని జోరు అర్థమవుతుంది. 93 పరుగుల వద్ద హార్ట్లీ బంతి జడేజా ప్యాడ్ను ముందుగా తగిలినా... ఇంగ్లండ్ బలంగా అప్పీల్ చేయలేదు. రీప్లేలో అతను అవుటయ్యేవాడని తేలింది! ధాటిగా ఆడిన సర్ఫరాజ్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయ లోపం అతని ఆటను ముగించింది. జడేజా 99 వద్ద అండర్సన్ బౌలింగ్లో సింగిల్ కోసం ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడు. అప్పటికే ముందుకు వెళ్లిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోగా వుడ్ డైరెక్ట్ హిట్ వికెట్లను తాకింది. తర్వాతి బంతికే సింగిల్తో జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తయింది. భావోద్వేగ క్షణాలు... రాజ్కోట్ టెస్టు ద్వారా ఇద్దరు ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. సర్ఫరాజ్కు అనిల్ కుంబ్లే, జురేల్కు దినేశ్ కార్తీక్ టెస్టు క్యాప్లు అందించారు. రెండేళ్ల వ్యవధిలో 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల తర్వాత అవకాశం లభించిన వికెట్ కీపర్ జురేల్తో పోలిస్తే సర్ఫరాజ్ ప్రస్థానం భావోద్వేగభరితమైంది. అందుకే మ్యాచ్కు ముందు మైదానంలో అలాంటి దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల ఫస్ట్క్లాస్ కెరీర్లో దేశవాళీలో 70 సగటుతో భారీగా పరుగులు సాధించిన సర్ఫరాజ్ భారత్ తరఫున ఆడేందుకు ఎంతో కాలంగా ఎదురు చూశాడు. పలుమార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అందుకే అరంగేట్రం ఖాయమైన క్షణాన కోచ్, మెంటార్ అయిన తండ్రి నౌషాద్ ఖాన్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చిన్నప్పటినుంచి అన్నీ తానే అయి సర్ఫరాజ్ను క్రికెటర్గా తీర్చిదిద్దిన ఆయన టెస్టు క్యాప్ను ముద్దాడి తన కొడుకును హత్తుకున్నాడు. సర్ఫరాజ్ అర్ధసెంచరీ పూర్తయినప్పుడు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. జడేజా కూడా ఆట ముగిసిన తర్వాత రనౌట్లో తనదే తప్పంటూ బాధపడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 5; జడేజా (బ్యాటింగ్) 110; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (86 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314. బౌలింగ్: అండర్సన్ 19–5–51–0, వుడ్ 17–2–69–3, హార్ట్లీ 23–3–81–1, రూట్ 13–1–68–0, రేహన్ 14–0–53–0. -
రోహిత్, జడ్డూ శతకాలు.. మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న సర్ఫరాజ్
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్దశతకం తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు, రెండో టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0) నిరాశపరిచారు. మరో యువ ఆటగాడు రజత్ పాటిదార్ (5) అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ (1) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ల్టీ ఓ వికెట్ పడగొట్టగా.. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హిట్మ్యాన్ షో.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. హిట్మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. రోహిత్ చాలాకాలం తర్వాత టెస్ట్ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికిది 11వ టెస్ట్ సెంచరీ. హిట్మ్యాన్ దాదాపు ఏడాది తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేశాడు. రోహిత్ ఈ సెంచరీతో భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారధిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్మ్యాన్ 36 ఏళ్ల 291 రోజుల వయసులో సెంచరీ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ .. ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లోనే మెరుపు అర్దశతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 7 ఫోర్లు, సిక్సర్ బాదాడు. దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్కు దేశవాలీ క్రికెట్లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్ తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్లోనే నిజం చేశాడు. సర్ఫరాజ్ క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీ.. జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మతో జతకట్టిన జడ్డూ.. కెరీర్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. జడ్డూ బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. జడ్డూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించాడు. పాపం సర్ఫరాజ్.. అరంగేట్రం మ్యాచ్లోనే ఏ బెదురు లేకుండా యదేచ్చగా షాట్లు ఆడుతూ మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్ను పిలిచి రనౌట్ చేయించాడు. సర్ఫరాజ్ను అనవసరంగా ఔట్ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. కోపంతో ఊగిపోయిన హిట్మ్యాన్.. జడేజా కారణంగా సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా రనౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. క్యాప్ను నేలకేసి కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. రోహిత్ కోపపడిన విధానాన్ని చూస్తే అతనికి సర్ఫరాజ్పై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం అర్దమవుతుంది. -
భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్
తొమ్మిది రోజులు...భారత్, ఇంగ్లండ్ రెండో, మూడో టెస్టు మ్యాచ్ల మధ్య విరామం! చూస్తుంటే ఒక సిరీస్ 1–1తో ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా మూడు టెస్టుల సిరీస్ మొదలవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో కొత్త ఉత్సాహంతో, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు ఇది పనికొచ్చింది. ఇప్పుడు సిరీస్లో ఆధిక్యం ప్రదర్శించేందుకు మరో పోరుకు రంగం సిద్ధమైంది. విరామం తర్వాత పైచేయి ఎవరిదనేది ఆసక్తికరం. రాజ్కోట్: టెస్టు సిరీస్లో 1–1తో సమంగా ఉన్న స్థితిలో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లేందుకు భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. నేటినుంచి జరిగే మూడో టెస్టులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా...రెండో టెస్టులో భారత్కు భారీ విజయం దక్కింది. అయితే గత పర్యటనతో పోలిస్తే ఇంగ్లండ్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా...భారత్ కోణంలో చూస్తే అనూహ్యంగా గట్టి పోటీ ఎదురైంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజ్కోట్ మైదానాన్ని ‘నిరంజన్ షా స్టేడియం’గా బీసీసీఐ పేరు పెట్టింది. సర్ఫరాజ్ అరంగేట్రం! రెండో టెస్టుతో పోలిస్తే భారత తుది జట్టులో మార్పులు ఖాయమయ్యాయి. గాయంతో వైజాగ్ టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వస్తున్నాడు. తన సొంత మైదానంలో అతడు చెలరేగిపోతే ఇంగ్లండ్కు కష్టాలు తప్పవు. అయ్యర్పై వేటు పడటంతో అతని స్థానంలో బ్యాటర్గా సర్ఫరాజ్ ఖాన్కు తొలి అవకాశం దక్కవచ్చు. వికెట్ కీపర్గా ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ను తప్పించి ధ్రువ్ జురేల్ను ఎంపిక చేయవచ్చని కూడా తెలుస్తోంది. అయితే జురేల్ను ఆడిస్తారా లేక భరత్కు చివరి చాన్స్ ఇస్తారా చూడాలి. మిడిలార్డర్లో అనుభవలేమి కనిపిస్తుండటంతో బ్యాటింగ్ భారం ప్రధానంగా టాప్–3పైనే ఉంది. గత మ్యాచ్లో జైస్వాల్ తానేంటో నిరూపించుకోగా, గిల్ కూడా కీలక సెంచరీ సాధించాడు. రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పుడైనా ఆడాల్సి ఉంది. బౌలింగ్లో అశ్విన్, కుల్దీప్లను ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. బుమ్రా స్థాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముకేశ్ స్థానంలో సిరాజ్ వస్తాడు. ఇద్దరు పేసర్లతో... తొలి రెండు టెస్టుల్లో ఒకే ఒక పేసర్కే పరిమితమైన ఇంగ్లండ్ ఈ సారి వ్యూహం మార్చింది. రెండో పేసర్గా అండర్సన్తో పాటు వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్లలో హార్ట్లీ ఇప్పటికే సత్తా చాటగా, రేహన్ పర్వాలేదనిపించాడు. వుడ్ రాకతో ఆఫ్స్పిన్నర్ బషీర్పై వేటు పడింది. అయితే రూట్ ఆఫ్ స్పిన్ జట్టుకు అదనపు బలంగా మారింది కాబట్టి సమస్య ఉండకపోవచ్చు. ఓడినా, గెలిచినా ఆ జట్టు బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండకపోవచ్చు. ఓపెనర్లు క్రాలీ, డకెట్లతో పాటు పాటు పోప్ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇంకా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడని రూట్, బెయిర్స్టో రాణించాల్సి ఉంది. స్టోక్స్ బ్యాటింగ్లో ఎలా చెలరేగుతాడో చూడాలి. అతని నాయకత్వ ప్రతిభకు కూడా ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. పిచ్, వాతావరణం ఎప్పటిలాగే ఈ పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. పరుగుల వరదకు అవకాశం ఉంది. అయితే జడేజా చెప్పినదాన్ని బట్టి చూస్తే మ్యాచ్ సాగిన కొద్దీ పగుళ్లు ఏర్పడి స్పిన్ను అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. మంచి వాతావరణం, వర్షసూచన లేదు. జట్ల వివరాలు భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, జడేజా, భరత్/ జురేల్, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, రేహన్, హార్ట్లీ, వుడ్, అండర్సన్. 100 500 700 ఈ టెస్టులో పలు ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఇది చిరస్మరణీయ మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్లో ఇది 100వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 16వ ఇంగ్లండ్ ఆటగాడిగా స్టోక్స్ నిలుస్తాడు. మరో వికెట్ తీస్తే భారత స్పిన్నర్ అశ్విన్ 500 వికెట్ల ఘనతను అందుకుంటాడు. ఈ మైలురాయిని చేరిన 9వ ఆటగాడిగా నిలుస్తాడు. మరో 5 వికెట్లు తీస్తే అండర్సన్ 700 వికెట్ల ఘనతను అందుకుంటాడు. 2024 టి20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరిస్తాడు. బోర్డు కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్కోట్ టెస్ట్తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
సర్ఫరాజ్, జురెల్ అరంగేట్రం!
రాజ్కోట్: కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం... కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం... యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లకు వరంగా మారనుంది. మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వారి ప్రాక్టీస్ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్ అయ్యర్ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్గా లేకపోవడంతో అతనూ రాజ్కోట్ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్లకు రాచబాటను పరిచింది. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వరుసగా విఫలమవడం కీపర్ జురెల్కు కలిసి రానుంది. గత మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్తోపాటు సర్ఫరాజ్, జురెల్ మిడిలార్డర్లో బరిలోకి దిగుతారు. ఫామ్లో ఉన్న శుబ్మన్ గిల్ ప్రాక్టీస్ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్కు దూరంగా ఉన్నాడు. అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆల్రౌండర్ జడేజా స్పిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రాక్టీసే ఎక్కువ చేశాడు. పేసర్లు బుమ్రా, ఆకాశ్దీప్లు బౌలింగ్లో శ్రమించారు. భారత్, ఇంగ్లండ్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
రూట్ ఒక్కడు ఒకవైపు.. టీమిండియా అంతా ఒకవైపు..!
ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు ముందు టీమిండియాను ఓ అంశం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. వివిధ కారణంగా చేత సీనియర్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్లో అనుభవలేమి కొట్టొచినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల చేత 100కు పైగా టెస్ట్లు ఆడిన విరాట్ కోహ్లి, ఫిట్నెస్ సమస్య కారణంగా కేఎల్ రాహుల్, గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ మూడో టెస్ట్కు దూరమయ్యారు. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లు దూరం కావడంతో భారత బ్యాటింగ్ లైనప్ గతంలో ఎన్నడూ లేనంత ఢీలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఒక్కడు ఆడినన్ని టెస్ట్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంతా కలిపి కూడా ఆడలేదు. రూట్ ఇప్పటివరకు 137 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. భారత బ్యాటర్లంతా కలిపి అతను ఆడిన మ్యాచ్ల్లో 75 శాతం కూడా ఆడలేదు. భారత బ్యాటింగ్ లైనప్ అంతా కలిపి ఇప్పటివరకు కేవలం 92 టెస్ట్లు మాత్రమే ఆడారు. Experience of Indian batters in the 3rd Test vs England: Rohit - 56 Tests. Jaiswal - 6 Tests. Gill - 22 Tests. Patidar - 1 Test. Bharat - 7 Tests. Sarfaraz - Yet to make the debut. Padikkal - Yet to make the debut. Jurel - Yet to make the debut. pic.twitter.com/lcx0HXc0Nw — Johns. (@CricCrazyJohns) February 12, 2024 ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే కనీసం 50 టెస్ట్లు ఆడిన అనుభవం ఉంది. రోహిత్ తర్వాత శుభ్మన్ గిల్ అత్యధికంగా 22 మ్యాచ్లు ఆడాడు. జట్టులో నెక్స్ సీనియర్ కేఎస్ భరత్. అతడికి ఏడు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఆతర్వాత యశిస్వి జైస్వాల్ 6, రజత్ పాటిదార్ ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. దృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ స్థానంలో ఎంపికైన రజత్ పాటిదార్ ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉంది. రవీంద్ర జడేజా 69, అశ్విన్ 97 టెస్ట్లు ఆడినప్పటికీ వీరిద్దరిని స్పెషలిస్ట్ బ్యాటర్లుగా పరిగణిలేము. ఈ పరిస్థితుల్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. -
టీమిండియాకు మరో భారీ షాక్
ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో విఫలమయ్యాడని సమాచారం. దీంతో రాహుల్ మూడో టెస్ట్కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. మరోవైపు రాహుల్తో పాటు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడని సమాచారం. రాహుల్కు ప్రత్యామ్నాయంగా అతని కర్ణాటక సహచరుడు దేవ్దత్ పడిక్కల్ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 92.67 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. ఇప్పటికే వివిధ కారణాల చేత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమీ సేవలు కోల్పోయిన టీమిండియాకు రాహుల్ గైర్హాజరీ మరింత ఇబ్బందికరంగా పరిగణించబడుతుంది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రాహుల్ రెండో టెస్ట్ కూడా ఆడలేదు. వారం తర్వాత రాహుల్కు మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారని సమాచారం. సీనియర్లంతా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతుండటంతో టీమిండియా అభిమానులు కలవరపడుతున్నారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్, భారత్ చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నారు. మూడో టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే,ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు భారత జట్టును రెండ్రోజుల కింద ప్రకటించారు. జట్టును ప్రకటించే సమయంలోనే ఆటగాళ్లంతా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుందని సెలెక్టర్లు చెప్పారు. గాయాల కారణంగా రెండో టెస్ట్కు దూరమైన రాహుల్, జడేజాను దృష్టిలో ఉంచుకునే సెలెక్టర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. -
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్రౌండర్
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్ట్లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది. అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్లో జమాల్ (0) ఇంకా క్రీజ్లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్రౌండర్ పాక్ సంచలన ఆల్రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్ను సాధించారు. స్కోర్ వివరాలు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61) ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69) పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్వుడ్ 4/9) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్ మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్లను నెగ్గి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
టీమిండియాతో పోటీపడిన పాక్.. భారత్ 0/6.. పాక్ 9/6
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్ దాదాపుగా ఇలాంటి సీన్నే మరోసారి రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో పాక్ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (88), ఏడో నంబర్ ఆటగాడు అఘా సల్మాన్ (53), తొమ్మిదో నంబర్ ప్లేయర్ ఆమిర్ జమాల్ (82) అర్ధసెంచరీలు చేసి పాక్ను ఆదుకున్నారు. అనంతరం ఆమిర్ జమాల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్లో పాక్కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఈ మ్యాచ్ను కాపాడుకోవడం చాలా కష్టం. సెకెండ్ ఇన్నింగ్స్లో హాజిల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-9-4) పాక్ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను గెలిచిన ఆసీస్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆసీస్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. -
ఆసీస్తో మూడో టెస్ట్.. పాక్ లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం
సిడ్నీ వేదికగా ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్కు ఫైటింగ్ టోటల్ను అందించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Ashes 3rd Test Day 4 Highlight Pics: ఆసీస్పై ఇంగ్లండ్ గెలుపు (ఫొటోలు)
-
యాషెస్ సిరీస్ అంటే మార్ష్కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!
యాషెస్ సిరీస్-2023లో భాగంగా లీడ్స్ వేదికగా నిన్న (జులై 6) మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్ష్ సూపర్ సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్ వచ్చీ రాగానే సెంచరీతో విరుచుకుపడి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 118 బంతులను ఎదుర్కొన్న మార్ష్.. 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో మార్ష్ మినహా మిగతావారెవ్వరూ కనీస పరుగులు కూడా చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్ (39), స్టీవ్ స్మిత్ (22), లబూషేన్ (21), ఉస్మాన్ ఖ్వాజా (13), టాడ్ మర్ఫీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిల్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ ఇన్నింగ్స్ను మార్క్ వుడ్ (5/34) నిలువునా కూల్చాడు. మార్క్ వుడ్ సైతం దాదాపు ఏడాది తర్వాత టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (3/73), స్టువర్ట్ బ్రాడ్ (2/58) సహకరించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ను పాట్ కమిన్స్ (2/28), మార్ష్ (1/9) దెబ్బకొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. రూట్ (19), బెయిర్స్టో (1) క్రీజ్లో ఉన్నారు. యాషెస్ సిరీస్ అంటే మార్ష్కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..! దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్కు యాషెస్ సిరీస్ అంటే పూనకం వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో అతనికి మంచి రికార్డు ఉంది. యాషెస్లో అతను ఆడిన చివరి 7 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 3 సెంచరీలు (118, 24, 17, 101, 29*, 9, 181) చేశాడు. 33 టెస్ట్ల కెరీర్లో తాను సాధించిన 3 శతకాలు యాషెస్లో సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్లో సెంచరీతో కదం తొక్కిన మార్ష్.. బౌలింగ్లోనూ సత్తా చాటాడు. తొలి రోజు తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమై జాక్ క్రాలే (33) వికెట్ పడగొట్టాడు. -
‘లయన్’ పంజా
మన స్పిన్ కోటలో ప్రత్యర్థి బాగా పాగా వేసింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా పాచిక పారుతుంటే... ఆతిథ్య వేదికపై భారత్ వణుకుతోంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్కంటే కాస్త ఎక్కువ స్కోరు చేసిందేమో కానీ... నాథన్ లయన్ (23.3–1–64–8) గర్జనకు తలవంచింది. వికెట్లు రాలిన తీరుతో భారత శిబిరం బిక్కమొహమేసింది. 76 పరుగుల అత్యల్ప లక్ష్యం ఆసీస్ ముందుండగా... మూడో రోజు తొలి సెషన్లోనే మూడో టెస్టు ముగిసే అవకాశముంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టూ 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇండోర్: ఈ సిరీస్లో స్పిన్తో గెలిచిన భారత్ ఇప్పుడదే స్పిన్కు ఉక్కిరిబిక్కిరవుతోంది. తిప్పేసే చోటే (పిచ్) బొక్కబోర్లా పడుతోంది. ఒక ఇన్నింగ్స్ అంటే ఏమో అనుకోవచ్చు... రెండు ఇన్నింగ్స్ల్లోనూ మన పిచ్పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో టీమిండియా పరాజయం అంచున నిలిచింది. మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసేందుకు సిద్ధమైంది. వికెట్ల పతనంలో రెండో రోజు (16 వికెట్లు) మొదటి రోజు (14)ను మించింది. మూడో రోజు పర్యాటక ఆ్రస్టేలియా ముందు కేవలం 76 పరుగుల లక్ష్యమే ముందుండగా... స్పిన్ బంతులు బొంగరంలా తిరుగుతున్న పిచ్పై భారత్లో ఏ మూలనో ఆశలు రేపుతోంది. 75 పరుగుల్లోపే 10 వికెట్లు తీస్తే మాత్రం ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కాదు పిచ్నే ‘టర్నింగ్’ విన్నర్ అవుతుంది. రెండో రోజు ఆటలో ముందుగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 76.3 ఓవర్లలో 197 పరుగుల వద్ద ముగిసింది. పర్యాటక జట్టుకు 88 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య భారత్ 60.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. 11 పరుగులు... 6 వికెట్లు... ఓవర్నైట్ స్కోరు 156/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా ఉదయం గంటకుపైగా బాగానే ఆడింది. హ్యాండ్స్కాంబ్ (19; 1 ఫోర్), కామెరాన్ గ్రీన్ (21; 2 ఫోర్లు) జోడీ 17 ఓవర్లపాటు భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంది. ఐదో వికెట్కు 40 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటేలా కనిపించింది. అయితే 186 పరుగుల వద్ద హ్యాండ్స్కాంబ్, మరుసటి ఓవర్లో గ్రీన్ అవుట్ కాగానే ఆసీస్ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయింది. 200 స్కోరుకు ముందే 197 పరుగుల వద్దే ఆలౌటైంది. పేస్తో ఉమేశ్ (3/12), స్పిన్తో అశ్విన్ (3/44) రె చ్చిపోయారు. ఆరు వికెట్లను వీరిద్దరు పంచుకొని ప్రత్యర్థిని పడగొట్టేశారు. లయన్ గర్జన ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేయడంతో ఇక జాగ్రత్తగా ఆడితే ఈ మ్యాచ్లో భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. కానీ భారత్ రెండో ఇన్నింగ్స్పై లయన్ గర్జనకు చక్కని ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆ్రస్టేలియానే పైచేయి సాధించింది. ఓపెనర్లు రోహిత్ (33 బంతుల్లో 12), శుబ్మన్ (15 బంతుల్లో 5)లకు ఒక్క బౌండరీ అయిన కొట్టే అవకాశం ఇవ్వకుండా లయన్ ఇద్దరి పని పట్టాడు. కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) వచ్చి ఫోర్లు కొడుతున్నాడులే అనే ఆనందాన్ని కునెమన్ దూరం చేశాడు. 54 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పెవిలియన్లో కూర్చున్నాయి. ప్రధాన వికెట్లే లయన్ ఉచ్చులో పడినా... పుజారా (142 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ ఉన్నంత సేపూ జట్టు ధీమాగానే ఉంది. స్టార్క్ బౌలింగ్లో ఖాజా కళ్లు చెదిరే క్యాచ్కు అయ్యర్ ఆట ముగియగా జట్టు పతనం మొదలైంది. శ్రీకర్ భరత్ (3) మళ్లీ నిరాశపరచగా... స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్కు పుజారా ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అశ్విన్ (16; 2 ఫోర్లు), అక్షర్ (15 నాటౌట్; 1 సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. లయన్ 8, స్టార్క్, కునెమన్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 109; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఖాజా (సి) గిల్ (బి) జడేజా 60; లబుషేన్ (బి) జడేజా 31; స్మిత్ (సి) భరత్ (బి) జడేజా 26; హ్యాండ్స్కాంబ్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 19; గ్రీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 21; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 3; స్టార్క్ (బి) ఉమేశ్ 1; లయన్ (బి) అశ్విన్ 5; మర్ఫీ (బి) ఉమేశ్ 0; కునెమన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 22; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146, 5–186, 6–188, 7– 192, 8–196, 9–197, 10–197. బౌలింగ్: అశ్విన్ 20.3–4–44–3, జడేజా 32–8–78–4, అక్షర్ 13– 1–33–0, ఉమేశ్ 5–0–12–3, సిరాజ్ 6–1– 13–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 12; గిల్ (బి) లయన్ 5; పుజారా (సి) స్మిత్ (బి) లయన్ 59; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్ 13; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 7; అయ్యర్ (సి) ఖాజా (బి) స్టార్క్ 26; భరత్ (బి) లయన్ 3; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 16; అక్షర్ (నాటౌట్) 15; ఉమేశ్ (సి) గ్రీన్ (బి) లయన్ 0; సిరాజ్ (బి) లయన్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (60.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–15, 2–32, 3–54, 4–78, 5–113, 6–118, 7–140, 8–155, 9–155, 10–163. బౌలింగ్: స్టార్క్ 7–1–14–1, కునెమన్ 16–2–60–1, నాథన్ లయన్ 23.3–1–64–8, మర్ఫీ 14–6–18–0. -
రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించిన మిచెల్ స్టార్క్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి రోజు భారత్ 109 పరుగులకే ఆలౌట్ కాగా.. 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే చాపచుట్టేసింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే గిల్ (5), రోహిత్ శర్మ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసిన భారత్.. ఇంకా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 51 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (15), కోహ్లి (1) క్రీజ్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్ సందర్భంగా టీవీల్లో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆట పట్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఉన్న కమిట్మెంట్ను సూచించాయి. తొలి ఓవర్లో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతున్నా, ప్యాంట్కు తుడుచుకుని బౌలింగ్ను కొనసాగించాడు. 2022 డిసెంబర్ నుంచి స్టార్క్ను ఈ గాయం వేధిస్తూనే ఉంది. నాటి నుంచి పలు మార్లు ఈ గాయం కారణంగా స్టార్క్ జట్టుకు దూరంగా ఉన్నాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో స్టార్క్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి స్పిన్నర్లకు బంతిని అందించాడు. స్టార్క్కు తగిలిన గాయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో హంగామా చేస్తున్నారు. రక్తం కారుతున్నా, ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్ చేస్తున్నాడు.. ఆసీస్ ఆటగాళ్ల కమిట్మెంట్పై ఎప్పుడూ డౌట్ పడకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా కొందరు టీమిండియా హార్డ్ కోర్ అభిమానులు దవడ విరిగినప్పుడు అనిల్ కుంబ్లే బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఆ పాటి రెండు రక్తం చుక్కలకే కమిట్మెంట్ అంటే, దీన్ని ఏమనాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కకు పెట్టి అభిమానులు ఈ విషయంలో వాదనలకు దిగుతున్నారు. -
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్
BGT 2023: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. అందివచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్లో (13 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు) అత్యంత కీలకమైన పరుగులను మెరుపు వేగంతో సాధించిన ఉమేశ్.. ఆ తర్వాత బౌలింగ్లో మరింతగా రెచ్చిపోయి స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ను తక్కువ స్కోర్కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. రెండో రోజు తొలి సెషన్లో డ్రింక్స్ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్.. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్ను, మర్ఫీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ను క్లీన్బౌల్డ్ చేశాక ఉమేశ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. స్టార్క్ వికెట్తో ఉమేశ్ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి. తొలి రోజు ఆటలో కూడా ఉమేశ్ ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ల్లో ఉమేశ్.. యువరాజ్ సింగ్ (22), రవిశాస్త్రి (22)లను అధిగమించి, కోహ్లి సిక్సర్ల రికార్డును (24) సమం చేశాడు. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్.. కోహ్లితో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. ఊహించని విధంగా భారత తుది జట్టులోకి వచ్చి రికార్డులు కొల్లగొట్టడంతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉమేశ్.. ఏ పరిస్థితుల్లో ఇలా రాణించాడో తెలిస్తే అతన్ని వ్యతిరేకించే వారు సైతం ప్రశంసించక మానరు. ఉమేశ్ ఫిబ్రవరి 23న తన తండ్రిని కోల్పోయాడు. పుట్టెడు దుఖంలో ఉండి కూడా అతడు రాణించిన తీరు నిజంగా అభినందనీయం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జట్టుకు ఉపయోగపడాలన్న అతని కమిట్మెంట్కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. తండ్రిని కోల్పోయి కనీసం దినవారాలు కూడా గడవకముందే దేశం కోసం అతను సర్వశక్తులు ఒడ్డి పాటుపడుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఉమేశ్.. ఈ టెస్ట్లో మున్ముందు మరింత కీలకంగా మారి టీమిండియాను గెలిపించాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా.. క్రైస్ట్చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్గా ఏడాది కాలం పాటు క్రికెట్కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్తో మూడో టెస్ట్కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
IND VS AUS: ముగిసిన రెండో రోజు ఆట.. 163 పరుగులకు టీమిండియా ఆలౌట్
Ind Vs Aus 3rd Test Indore 2nd Day Updates: ముగిసిన రెండో రోజు ఆట 163 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా కంటే కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించగలిగింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ మథ్యూ కుహ్నెమన్కు ఒకటి, పేసర్ స్టార్క్కు ఒక వికెట్ దక్కాయి. టీమిండియా బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 57: టీమిండియా స్కోరు: 155-9. కేవలం 67 పరుగుల ఆధిక్యం 56.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా లియోన్ బౌలింగ్లో ఉమేశ్ యాదవ్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్గా వెనుదిరిగాడు. 56.3: ఎనిమిదో వికెట్ డౌన్ లియోన్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పుజారా (59) అవుట్. 54: టీమిండియా స్కోరు: 145/7 48.1: అశ్విన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా నాథన్ లియోన్ బౌలింగ్లో అశ్విన్(16) బౌల్డ్ అయ్యాడు. 40.1: ఆరో వికెట్ కోల్పోయిన భారత్ నాథన్ లియోన్ బౌలింగ్లో శ్రీకర్ భరత్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.స్కోరు- 118/6 (40.1). పుజారా (46), అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 37.2: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. పుజారా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 115-5(38) జడేజా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు తడబడుతున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కన్పించిన ఆల్రౌండర్ జడేజా.. లయోన్ బౌలింగ్లో ఎల్బీబ్ల్యూగా వెనుదిరిగాడు. 36 బంతులో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పుజారా 36(76) ఉన్నారు. విరాట్ కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. క్రీజ్లో కుదురుకుని టీమిండియాను గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లి మరోసారి విఫలమై పెవిలియన్కు చేరాడు. కుహ్నేమన్ మరోసారి కోహ్లిని (13) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కోహ్లి ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 54/3గా ఉంది. పుజారా (20), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 34 పరుగులు వెనుకపడి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్ 32 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్లో రోహిత్ శర్మ (12) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు టీమిండియా ఇంకా 56 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (11), కోహ్లి క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ క్లీన్ బౌల్డ్ లంచ్ విరామం తర్వాత లయోన్ వేసిన తొలి ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది, లయోన్ బౌలింగ్లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 13/0 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 197 పరుగులకే ఆలౌటైన ఆసీస్ 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆసీస్ కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్, ఉమేశ్ చెరి సగం పంచుకున్నారు. వీరిద్దరు ఆసీస్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇవాళ ఆసీస్ కోల్పోయిన 5 వికెట్లలో ఉమేశ్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీని ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 196 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వారెవ్వా ఉమేశ్.. స్పిన్ పిచ్పై ప్రతాపం చూపిస్తున్నావు..! డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్కోంబ్ను అశ్విన్ పెవిలియన్కు పంపగా.. గ్రీన్, స్టార్క్లను ఉమేశ్ ఔట్ చేశాడు. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై ఉమేశ్ నిప్పులు చెరుగుతూ వికెట్లు పడగొడుతున్నాడు. గ్రీన్ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఉమేశ్.. స్టార్క్ను క్లీన్బౌల్డ్ చేశాడు. 74 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 196/7. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ రెండో రోజు చాలా సమయం వరకు నిలకడగా ఆడిన ఆసీస్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. తొలు హ్యాండ్స్కోంబ్ను యాష్ బోల్తా కొట్టించగా.. మరుసటి ఓవర్లో ఉమేశ్ యాదవ్.. గ్రీన్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 72 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 188/6గా ఉంది. అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట మొదలయ్యాక చాలా సేపు నిలకడగా ఆడిన హ్యాండ్స్కోంబ్ను (19) ఎట్టకేలకు అశ్విన్ పెవిలియన్కు పంపాడు. 71వ ఓవర్లో షార్ట్ లెగ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి హ్యాండ్స్కోంబ్ వెనుదిరిగాడు. 71 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 186/5గా ఉంది. గ్రీన్ (19), అలెక్స్ క్యారీ (0) క్రీజ్లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న గ్రీన్, హ్యాండ్స్కోంబ్ ఓవర్నైట్ స్కోర్ 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. హ్యాండ్స్కోంబ్ (16), గ్రీన్ (17) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. క్రీజ్లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. 66 ఓవర్లు ముగిసే ఆసీస్ స్కోర్ 177/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 68 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం.. రవీంద్రుడి మాయాజాలం కొనసాగేనా..? ఓవర్నైట్ స్కోర్ 156/4 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ , నాథన్ లియోన్, మార్క్ కుహ్నేమన్ -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్లకు పిచ్లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన ఉమేశ్ యాదవ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన ఉమేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను సద్వినియోగం చేసుకున్న అవకాశం బ్యాట్తో అనుకుంటే పొరపాటే. ఉమేశ్.. మూడో టెస్ట్ తొలి రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది తన బ్యాటింగ్ నైపుణ్యంతో. ఈ మ్యాచ్లో పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఉమేశ్.. 13 బంతుల్లో 2 సిక్సర్లు, బౌండరీ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఉమేశ్.. ఓ విషయంలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 24 సిక్సర్లు బాదగా.. ఈ మ్యాచ్లో కొట్టిన 2 సిక్సర్లు కలుపుకుని ఉమేశ్ కూడా తన కెరీర్లో అన్నే సిక్సర్లు బాదాడు. విరాట్ సిక్సర్ల రికార్డును సమం చేసే క్రమంలో ఉమేశ్.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (22 సిక్సర్లు), భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (22)ల రికార్డులను అధిగమించాడు. ఓవరాల్గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉండగా.. ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (68), కపిల్ దేవ్ (61) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఉమేశ్, విరాట్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
విరాట్ కోహ్లికి ఏమైంది.. ఎందుకిలా సడన్గా ఊగిపోయాడు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 48.5 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (3), గ్రీన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ఇదిలా ఉంటే, ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉన్నట్లుండి ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. 109 పరుగులకే చాపచుట్టేసిందన్న బాధలో టీమిండియా, అభిమానులు ఉంటే కోహ్లి ఇలా చేయడం ఏంటని అంతుచిక్కక ఫ్యాన్స్ జట్టు పీక్కుంటున్నారు. కోహ్లి అసందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లి ఏంటి ఇలా చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోహ్లికి ఏమైనా పిచ్చా.. అసందర్భంగా ఇలా డ్యాన్స్లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో సంబంధం లేనట్లు కోహ్లి ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే, కోహ్లి డ్యాన్స్ చేయడానికి కారణాలు లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. కోహ్లి డ్యాన్స్ చేసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే అప్పటిదాకా బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించని పిచ్.. ఆసీస్ బ్యాటర్లకు తోడ్పాటునందించడం చూసి కోహ్లి అసహనంతో డ్యాన్స్ చేసినట్లు సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. కోహ్లి పిచ్పై అసహనం వ్యక్తం చేస్తూ.. పాపులర్ హిందీ సాంగ్ అయిన బత్తమీజ్ దిల్.. బత్తమీజ్ దిల్ను బత్తమీజ్ పిచ్.. బత్తమీజ్ పిచ్ అంటూ పాడుకుంటాడు. -
లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక చతికిలపడింది. కంగారూ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (53) అజేయమైన హాఫ్సెంచరీతో బ్యాటింగ్ను కొనసాగిస్తుండగా.. స్టీవ్ స్మిత్ ఇప్పుడే క్రీజ్లోకి వచ్చాడు. ఆసీస్ కోల్పోయిన రెండు వికెట్లు రవీంద్ర జడేజా ఖాతాలోకే వెళ్లాయి. జడ్డూ.. ట్రవిస్ హెడ్ (9)ను ఎల్బీగా, లబూషేన్ (31)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలిసారి తప్పించుకున్నా, రెండోసారి అదే తరహాలో.. లబూషేన్ను జడేజా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే క్లీన్బౌల్డ్ చేసినప్పటికీ.. ఆ బంతిని అంపైర్లు నోబాల్గా ప్రకటించడంతో లబూషేన్ బ్రతికిపోయాడు. అయితే ఇన్నింగ్స్ 35వ ఓవర్లో మాత్రం లబూషేన్ను ఏ తప్పిదం కాపాడలేకపోయింది. నో బాల్ బంతికి ఎలా క్లీన్బౌల్డ్ అయ్యాడో ఈసారి కూడా అదే రీతిలో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు 8 సార్లు లైన్ దాటిన జడేజా.. సాధారణంగా స్పిన్నర్లు క్రీజ్ బయటకు వచ్చి నో బాల్స్ వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఈ సిరీస్ జడ్డూ ఇప్పటివరకు ఏకంగా 8 నో బాల్స్ సంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇందులో జడ్డూ రెండుసార్లు వికెట్ పడగొట్టినా, నో బాల్ పుణ్యమా అని ప్రత్యిర్ధికి లైఫ్ లభించింది. ఈ మ్యాచ్లో లబూషేన్ జడ్డూ తప్పిదం కారణంగా తప్పించుకోగా, తొలి టెస్ట్లో స్టీవ్ స్మిత్ జడ్డూ చేసిన ఇదే తప్పిదం కారణంగా బతికిపోయాడు. -
BGT 2023: ఆసీస్తో మూడో టెస్ట్.. పలు రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ పలు రికార్డులపై కన్నేశారు. మూడో టెస్ట్లో కోహ్లి మరో 77 పరుగులు చేస్తే.. సొంతగడ్డపై 4000 పరుగులు పూర్తి చేసిన ఐదో భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కుతాడు. కోహ్లికి ముందు సచిన్ (7216), ద్రవిడ్ (5598), గవాస్కర్ (5067), సెహ్వాగ్ (4656) స్వదేశంలో 4000 పరుగుల మైలురాయిని క్రాస్ చేశారు. ఈ రికార్డుతో పాటు కోహ్లి మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. మూడో టెస్ట్లో కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్లు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 299 క్యాచ్లు అందుకున్న కోహ్లి.. ద్రవిడ్ (334) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతరర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా అత్యధిక క్యాచ్లు అందుకున్న ఘనత మహేళ జయవర్ధనే (440) పేరిట నమోదై ఉంది. రోహిత్ శర్మ విషయానికొస్తే.. ఆసీస్తో మూడో టెస్ట్లో హిట్మ్యాన్ మరో 57 పరుగులు చేస్తే స్వదేశంలో టెస్ట్ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు స్వదేశంలో 22 టెస్ట్లు ఆడిన కోహ్లి.. 71.96 సగటున 8 సెంచరీలు (ఓ డబుల్ సెంచరీ), 6 హాఫ్ సెంచరీల సాయంతో 1943 పరుగులు చేశాడు. స్వదేశంలో సర్ డాన్ బ్రాడ్మన్ (98.22) తర్వాత అత్యధిక సగటు హిట్మ్యాన్దే కావడం మరో విశేషం. స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. ఆసీస్ తాత్కాలిక సారధి భారత్తో జరిగే మూడో టెస్ట్లో సెంచరీ చేస్తే.. స్టీవ్ వా, అలెన్ బోర్డర్ రికార్డులను బద్దలు కొడతాడు. స్టీవ్ స్మిత్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్లు ఆసీస్ కెప్టెన్లుగా తలో 15 సెంచరీలు బాదారు. మూడో టెస్ట్లో స్మిత్ శతక్కొడితే వా, బోర్డర్లను అధిగమిస్తాడు. ఆసీస్ కెప్టెన్గా అత్యధిక సెంచరీల రికార్డు రికీ పాంటింగ్ (19) పేరిట ఉంది. -
రూట్, స్మిత్ అదరగొడుతున్నారు.. కేన్ మామ లైన్లోకి వచ్చాడు, కోహ్లి పరిస్థితి ఏంటి..?
BGT 2023 IND VS AUS 3rd Test: ప్రస్తుత క్రికెట్ జనరేషన్లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఫాబ్ ఫోర్ బ్యాటర్లుగా కీర్తించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిది అన్ని విషయాల్లో పైచేయి అన్న విషయంతో (కొద్ది రోజుల ముందు వరకు) దాదాపు అందరూ ఏకీభవించేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. కోహ్లిని ఏ విషయంలో గొప్ప అని చెప్పుకోవాలో టీమిండియా ఫ్యాన్స్కు అర్ధం కావట్లేదు. టెక్నిక్, పరుగులు, సెంచరీలు, రికార్డులు ఇలా చెప్పుకుంటు పోతే దాదాపు అన్ని విషయాల్లో సహచరులతో పోలిస్తే కోహ్లి వెనకపడి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రూట్, స్మిత్, విలియమ్సన్తో పోలిస్తే కాస్త పర్వాలేదనిపించినా.. టెస్ట్ల్లో మాత్రం కోహ్లి ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. 2021 ఆరంభంలో కోహ్లి ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లలో అందరికంటే అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్గా ఉండేవాడు. నాటికి కోహ్లి 27 సెంచరీలు చేసి ఉంటే, స్మిత్ 26, విలియమ్సన్ 24, రూట్ 17 సెంచరీలు మాత్రమే చేశారు. అదే 2023 ఫిబ్రవరి వచ్చే సరికి కోహ్లి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అదే 27 సెంచరీల మార్కు వద్ద మిగిలిపోగా.. స్మిత్ 30, రూట్ 29, విలియమ్సన్ 26 సెంచరీల మార్కును అందుకున్నారు. వీరిలో రూట్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 12 సెంచరీలు బాదగా.. స్మిత్ మధ్యమధ్యలో మూడంకెల ఫిగర్ అందుకున్నాడు. వీరితో పోలిస్తే విలియమ్సన్, కోహ్లి పరిస్థితి దారుణంగా ఉంది. విలియమ్సన్ లేటుగా అయిన రెండేళ్ల తర్వాత.. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో సెంచరీ చేయగా.. 2021 జనవరిలో చివరి టెస్ట్ సెంచరీ చేసిన కోహ్లి దాదాపు మూడేళ్లైపోయినా ఇప్పటివరకు శతక్కొట్టలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెంచరీలు చేసిన కోహ్లి టెస్ట్ల్లో మాత్రం ఈ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఇదే కొనసాగితే.. విలియమ్సన్ కోహ్లిని దాటిపోయి టెస్ట్ల్లో కేవలం 9 సెంచరీలు మాత్రమే కలిగిన బాబర్ ఆజమ్ కూడా కోహ్లిని అధిగమించే ప్రమాదం ఉంది. ఓవరాల్గా చూస్తే.. సెంచరీల విషయంలో ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో కోహ్లి 74 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రూట్ 45, స్మిత్ 42, విలియమ్సన్ 39 సెంచరీలు చేశారు. టెస్ట్ల్లో కోహ్లి మూడేళ్ల సెంచరీ దాహానికి తెరదించి, ఆసీస్తో జరిగే మూడో టెస్ట్లో శతక్కొట్టాలని ఆశిద్దాం -
ఆసీస్తో మూడో టెస్ట్.. శ్రీకర్ భరత్కు ప్రమోషన్
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం సర్వం సిద్ధమైంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. 4 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 0-2తో వెనుకపడిన ఆసీస్ను గాయాల బెడద, సారధి అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వేధిస్తుంటే, తుది జట్టు కూర్పు విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు (డ్రా) సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. ఈ మ్యాచ్ను కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పిచ్ విషయానికొస్తే.. మూడో టెస్ట్కు వేదిక అయిన ఇండోర్లోని హోల్కర్ పిచ్ ఎర్ర మట్టితో తయారు చేసిందిగా తెలుస్తోంది. సహజంగా రెడ్ సాయిల్ పిచ్లు పేసర్లకు సహకరిస్తాయి. ఈ పిచ్లపై బౌన్స్ అధికంగా లభించే అవకాశముండటంతో ఆయా జట్లు అదనపు పేసర్కు అవకాశం కల్పిస్తుంటాయి. ఈ క్రమంలో మూడో టెస్ట్లో భారత్, ఆసీస్లు కూడా అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్కు సహకరించిన తొలి రెండు టెస్ట్ల్లో ఇరు జట్లు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగగా.. ఈ టెస్ట్ మ్యాచ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఇరు జట్లు బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. టీమిండియా యాజమాన్యాన్ని కేఎల్ రాహుల్ ఫామ్ లేమి సమస్య ప్రధానంగా వేధిస్తుంది. గత 10 ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి కూడా పాతిక పరుగుల మార్కు దాటని రాహుల్ను తుది జట్టు నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఎంపిక జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. పిచ్ ఎలాగూ పేస్కు సహకరించే అవకాశం ఉండటంతో రాహుల్ను తప్పించి అతని స్థానంలో అదనపు పేసర్కు (ఉమేశ్ యాదవ్ లేదా జయదేవ్ ఉనద్కత్) అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం కేఎల్ రాహుల్కు మద్దతుగా నిలుస్తూ, అతనికి మరో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్ను తప్పిస్తే.. రోహిత్ శర్మతో పాటు శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్ను ప్రారంభించవచ్చు. ఇక ఆసీస్ తుది జట్టు విషయానికొస్తే.. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ సారధ్య బాధ్యతలు మోయనున్నాడు. గాయాలు ఇతరత్రా కారణాల చేత జోష్ హాజిల్వుడ్, డేవిడ్ వార్నర్, ఆస్టన్ అగర్ స్వదేశానికి బయలుదేరగా.. కెమరూన్ గ్రీన్ రేపటి మ్యాచ్కు పూర్తి ఫిట్నెస్ సాధించాడని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ విషయంలో మాత్రం టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రేపటి మ్యాచ్లో స్టార్క్ ఆడతాడా లేదా అన్న విషయం సందిగ్ధంగా మారింది. వార్నర్ స్థానంలో మ్యాట్ రెన్షా, కమిన్స్ స్థానంలో గ్రీన్ ఆడటం లాంఛనమే కాగా.. స్పిన్నర్ కన్హేమన్ స్థానంలో స్టార్క్ ఆడతాడా లేదా స్కాట్ బోలండ్, లాన్స్ మోరిస్లలో ఒకరికి అవకాశం ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రీకర్ భరత్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్/జయదేవ్ ఉనద్కత్ ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): మ్యాట్ రెన్షా, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్, మిచెల్ స్టార్క్/స్కాట్ బోలండ్/లాన్స్ మోరిస్ -
BGT 2023: ఇంటిబాట పట్టిన మరో ఆసీస్ ప్లేయర్.. ఈసారి ఆల్రౌండర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ మ్యాచ్కు (మార్చి 1 నుంచి ప్రారంభం) ముందు ఆసీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిబాట పడుతున్నారు. అసలే 0-2 తేడాతో సిరీస్లో వెనుకపడిన ఆసీస్కు.. ఈ విషయం మరింత ఇబ్బందికరంగా మారింది. గాయాల కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్ మొత్తం నుంచే నిష్క్రమించగా, వ్యక్తిగత కారణాల చేత కెప్టెన్ కమిన్స్ పాక్షికంగా లీవ్ తీసుకున్నాడు. తాజాగా మరో ఆటగాడు స్వదేశంలో జరిగే దేశవాలీ టోర్నీల్లో ఆడేందుకు జట్టును వీడాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ ఆస్టన్ అగర్.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ, మార్ష్ కప్ ఫైనల్ ఆడేందుకు స్వదేశానికి బయల్దేరాడు. తొలి రెండు టెస్ట్ల్లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కని అగర్ను ఆసీస్ యాజమాన్యమే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. జట్టులో స్పిన్నర్లు అధికంగా ఉండటంతో అగర్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్లు తెలుస్తోంది. నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ రాణిస్తుండటంతో అగర్కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమని భావించి ఆసీస్ మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రెండో టెస్ట్కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ తిరిగి జట్టులో చేరాడు. స్వెప్సన్ గైర్హాజరీలో రెండో టెస్ట్లో మాథ్యూ కుహ్నేమన్ ఆడాడు. అరంగేట్రం టెస్ట్లోనే కోహ్లి వికెట్ తీసిన కుహ్నేమన్ కూడా పర్వాలేదనిపించాడు. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలుగుతుండటంతో సిరీస్పై ఆశలు వదులుకున్న ఆసీస్కు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. ఫిట్నెస్ సమస్య కారణంగా తొలి రెండు టెస్ట్ల్లో ఆడని పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ మూడో టెస్ట్కు అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా తొలి రెండు టెస్ట్లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సన్నద్ధతపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే.. గాయాలు, ఆటగాళ్ల పేలవ ఫామ్ తదితర సమస్యల కారణంగా ఆసీస్ సిరీస్పై ఆశలు వదులుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 4 మ్యాచ్ల ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోవడమే ప్రస్తుతం ఆసీస్ ముందున్న లక్ష్యమని అర్ధమవుతుంది. -
BGT 2023: ఆసీస్తో చివరి రెండు టెస్ట్లకు భారత జట్టు ప్రకటన
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత-ఆస్ట్రేలియా జట్లు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్లో 2 మ్యాచ్లు పూర్తి కాగా రెండిటిలో టీమిండియానే గెలుపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి కొనసాగుతోంది. గతంలో మొదటి రెండు టెస్ట్లకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు ఇవాళ (ఫిబ్రవరి 19) మూడు, నాలుగు టెస్ట్లతో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి రెండు టెస్ట్లకు ప్రకటించిన జట్టునే యధాతథంగా కొనసాగించారు. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు జరుగనుండగా.. నాలుగో మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది. ఆసీస్తో మూడు, నాలుగు టెస్ట్లకు టీమిండియా.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ -
ధర్మశాల టెస్టు వైజాగ్లో?
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్పై పచ్చికను కొత్తగా పరిచారు. పిచ్ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను బోర్డు పరిశీలిస్తోంది. -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్కు బ్యాకప్గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్తో పాటు సిరీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. కమిన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియాలో అతన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. నాలుగో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనప్పటికీ.. కేవలం ఒక్క ఓవర్ పాటు ఖ్వాజాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు కదా అని ఆసీస్ ఓపెనర్పై జాలిపడుతున్నారు. 2004లో నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా కమిన్స్ లాగే.. సహచరుడు సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదంతాన్ని నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఇవాళ (జనవరి 7) కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. నాలుగో రోజు 59 ఓవర్లు (ఎటువంటి అంతరాయం కలగకపోతే), ఆఖరి రోజు 98 ఓవర్ల ఆట సాధ్యపడితే ఫలితం (సౌతాఫ్రికాను 2 సార్లు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది) తప్పక వస్తుందన్న అంచనాతో కమిన్స్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్ట్లో ఆసీస్ బౌలర్లు 137.3 ఓవర్లలో సఫారీలను 2 సార్లు ఆలౌట్ చేశారు. ఈ ధీమాతోనే కమిన్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్), స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు టీ విరామం సమయానికి (31 ఓవర్లు) 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
డాన్ బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో శతకొట్టిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్లో ఉండగా.. స్టీవ్ వా (32) రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్.. మాథ్యూ హేడెన్తో (30) సమంగా మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్తో పాటు మార్నస్ లబూషేన్కు మాత్రమే ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న లబూషేన్ 33 మ్యాచ్ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్ శతకం సాధించిన మ్యాచ్లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో మూడో సెషన్ డ్రింక్స్ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (195) తన కెరీర్ తొలి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్ హెడ్ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్ రెన్షా (5) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్ వార్నర్ (10), లబూషేన్ (79) ఔటయ్యారు. సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్లో తలపడతాయి. -
శతకాల మోత మోగించిన ఆసీస్ ప్లేయర్లు.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు
AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. రెండో రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖ్వాజా (335 బంతుల్లో 172 నాటౌట్) కెరీర్లో 13 శతకం బాది డబుల్ సెంచరీ దిశగా సాగుతుండగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 30 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట కేవలం 47 ఓవర్లు మాత్రమే సాగగా.. ఇవాల్టి (జనవరి 5) ఆట షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది. టీ విరామం సమయానికి ఖ్వాజాకు జతగా ట్రావిస్ హెడ్ (17) క్రీజ్లో ఉన్నాడు. అచొచ్చిన సిడ్నీ గ్రౌండ్లో ఖ్వాజా (ఈ గ్రౌండ్లో ఇదివరకే 3 సెంచరీలు బాదాడు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. సఫారీ బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఖ్వాజా తన టెస్ట్ కెరీర్లో నాలుగోసారి 150 మార్కును క్రాస్ చేయగా.. స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్.. తొలి టెస్ట్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో టెస్ట్లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్లో తలపడతాయి. -
మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్
AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారితో సహా కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. లబూషేన్ ఎందుకు లైటర్ అడుతున్నాడో తెలియక ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వారు కూడా కాసేపు తలలు గీకున్నారు. కామెంటేటర్ ఇష గుహ అయితే లబూషేన్ సిగరెట్ కాల్చాలని అనుకుంటున్నాడేమో అంటూ సహచరులతో డిస్కస్ చేశారు. మొత్తానికి లబూషేన్ చేసిన ఈ సంజ్ఞ తొలి రోజు ఆటకు హైలైట్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో షికార్లు చేస్తుంది. అసలు లబూషేన్ సిగరెట్ లైటర్ ఎందుకు అడిగాడంటే..? అప్పటికే చాలాసేపుగా హెల్మెట్తో సమస్యను ఎదుర్కొంటూ పలుసార్లు తీస్తూ, వేసుకున్న లబూషేన్.. దాన్ని రిపేర్ చేసేందుకు గాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్కు మెసేజ్ చేశాడు. లబూషేన్ సైగ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అతనెందుకు లైటర్ అడుతున్నాడో అర్ధం కాలేదు. అయితే కాసేపటి తర్వాత విషయాన్ని గ్రహించి వారు లైటర్ను తీసుకెళ్లి లబూషేన్ సమస్యను పరిష్కరించారు. సిబ్బంది లైటర్తో లబూషేన్ హెల్మెట్ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశారు. Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV — cricket.com.au (@cricketcomau) January 4, 2023 ఇదిలా ఉంటే, వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ (0) క్రీజ్లో ఉన్నారు. వార్నర్, లబూషేన్ల వికెట్లు అన్రిచ్ నోర్జే ఖాతాలో పడ్డాయి. కాగా, 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్ల సిరీస్లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్లోని తొలి రెండు టెస్ట్లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
PAK VS ENG 3rd Test: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బౌలర్
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల 126 రోజుల వయసున్న రెహాన్.. రెండో ఇన్నింగ్స్లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. Rehan Ahmed becomes the youngest debutant to claim a five-for in Men’s Tests 💪#WTC23 | 📝 https://t.co/y5SkcqY16s pic.twitter.com/LoDZE7Yimd — ICC (@ICC) December 19, 2022 గతంలో ఈ రికార్డు ఆసీస్ టెస్ట్ జట్టు సారధి పాట్ కమిన్స్ పేరిట ఉండేది. కమిన్స్ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్ల్లో (అరంగేట్రం మ్యాచ్) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్లో రెహాన్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉండేది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. రెహాన్ తండ్రి నయీమ్ అహ్మద్ పాకిస్తాన్లో జన్మించి, ఇంగ్లండ్కు వలస వెళ్లాడు. రెహాన్, అతని సోదరులు ఫర్హాన్, రహీమ్లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి రెండు టెస్ట్లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్లోనూ విజయం సాధించి పాకిస్తాన్ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. రెహాన్ ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. -
పాక్ను దెబ్బేసిన ఇంగ్లండ్ యువ స్పిన్నర్.. క్లీన్ స్వీప్ దిశగా బాబర్ సేన
PAK VS ENG 3rd Test Day 3: కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి రెండు టెస్ట్లు నెగ్గిన ఇంగ్లండ్.. మరో 55 పరుగులు చేస్తే మూడో టెస్ట్లోనూ విజయం సాధించి పాకిస్తాన్ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. మూడో రోజు ఆటలో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఆతిధ్య దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రెహాన్ (5/48) ధాటికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధి ముందు167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయానికి అతి సమీపంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంగా తెలుస్తోంది. రెహాన్తో పాటు జాక్ లీచ్ (3/72), జో రూట్ (1/31), మార్క్ వుడ్ (1/25) రాణించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే చాపచుట్టేసింది. పాక్ రెండో ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (54), సౌద్ షకీల్ (53) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు జాక్ క్రాలే (41), బెన్ డకెట్ (50 నాటౌట్) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 87 పరుగులు జోడించిన అనంతరం క్రాలేను అబ్రార్ అహ్మద్ పెవిలియన్కు పంపాడు. అనంతరం నైట్ వాచ్మెన్గా వచ్చిన రెహాన్ అహ్మద్ (10)ను కూడా అబ్రార్ అహ్మదే ఔట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డకెట్కు జతగా స్టోక్స్ (10) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 354 పరుగులు చేసి 50 పరుగుల కీలక ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. పాక్ తొలి ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో (తొలి ఇన్నింగ్స్) జాక్ లీచ్ 4, రెహాన్ అహ్మద్ 2, రాబిన్సన్, మార్క్ వుడ్, రూట్ తలో వికెట్ పడగొట్టగా.. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు, మహ్మద్ వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
PAK VS ENG: బ్రూక్ సెంచరీ.. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మూడో టెస్ట్
కరాచీ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 7/1 ఓవర్నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ (150 బంతుల్లో 111; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటై, కీలకమైన 50 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. పాక్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 29 పరుగులు వెనుకపడి ఉంది. అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) క్రీజ్లో ఉన్నారు. మ్యాచ్లో ఇంకా 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం రావడం ఖాయమని స్పష్టమవుతుంది. తొలి రోజు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్ను అమలు చేసి తొలి రెండు టెస్ట్ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. పాకిస్తాన్ ఎంతకు ఆలౌటైందంటే..?
PAK VS ENG 3rd Test Day 1: కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి పాకిస్తాన్ తొలి రోజే ఆలౌటైంది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్ షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వాలేదనిపించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8), మహ్మద్ రిజ్వాన్ (19), సౌద్ షకీల్ (23), ఫహీమ్ అష్రాఫ్ (4), నౌమాన్ అలీ (20), అబ్రర్ అహ్మద్ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్ చేసి పెవిలియన్కు పంపాడు. బెన్ డకెట్ (4), ఓలీ పోప్ (3) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ పాకిస్తాన్ స్కోర్కు ఇంకా 297 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్ను అమలు చేసి తొలి రెండు టెస్ట్ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అరుదైన రికార్డు
Rehan Ahmed: పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో అరంగేట్రం చేయడం ద్వారా ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్.. 18 ఏళ్ల 126 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెహాన్కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉంది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. కౌంటీల్లో లీసెస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహాన్.. గత కౌంటీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ఇంగ్లండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రెహాన్.. ఇంగ్లండ్ తరఫున ఇదివరకే టీ20 అరంగేట్రం చేశాడు. 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇంగ్లండ్తో ఇవాళ (డిసెంబర్ 17) ప్రారంభమైన మూడో టెస్ట్ల్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వలేదనిపించారు. బాబర్ ఆజమ్ (43), సౌద్ షకీల్ (18) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ తలో వికెట్ పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు రెహాన్ అహ్మద్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
రజత్ పాటిదార్ అజేయ శతకం.. కివీస్ ముందు భారీ టార్గెట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్ పాటిదార్ (135 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా కివీస్కు 406 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్ (రచిన్ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మ్యాచ్ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో పాటిదార్, రుతురాజ్, పంచల్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్ 2, సోలియా, కెప్టెన్ టామ్ బ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ఆటగాళ్లు చాప్మన్ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ 2, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 4, జో వాకర్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. ఒకే రోజు 17 వికెట్లు
లండన్: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన మూడో టెస్టులో ఒక్క మూడో రోజు ఆటలోనే 17 వికెట్లు కూలాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 36.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. జాన్సెన్ (30; 4 ఫోర్లు), జొండో (23; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడారు. మిగిలిన వారిని రాబిన్సన్ (5/49), స్టువర్ట్ బ్రాడ్ (4/41) జంటగా పడగొట్టేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 33.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఒలీ పోప్ (67; 13 ఫోర్లు) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. జాన్సెన్ 4, రబడ 2 వికెట్లు తీశాడు. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు క్వీన్ ఎలిజబెత్–2 మృతికి సంతాప సూచకంగా ఆటను రద్దు చేశారు. మూడో రోజు ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాణికి నివాళులు అర్పించాకే ఆట మొదలైంది. -
మరోసారి రెచ్చిపోయిన బెయిర్స్టో.. కివీస్ను ఊడ్చేసిన ఇంగ్లండ్
లీడ్స్: న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిధ్య ఇంగ్లండ్ 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. హెడింగ్లే వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 183/3 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఓలీ పోప్ (82) వికెట్ను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జో రూట్ (86 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బెయిర్స్టో (44 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, సిక్సర్లు) మరోసారి చెలరేగి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ విధ్వంసకర శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన బెయిర్స్టో రెండో ఇన్నింగ్స్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్కు అపురూప విజయాన్ని అందించాడు. అంతకుముందు రెండో టెస్ట్లోనూ బెయిర్స్టో ఇదే తరహాలో రెచ్చిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. మొత్తంగా ఈ సిరీస్లో 2 ధనాధన్ శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదిన బెయిర్స్టో ఇంగ్లండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సైతం రెచ్చిపోయాడు. తొలి టెస్ట్లో అజేయమైన శతకంతో (115) జట్టును గెలిపించిన రూట్.. రెండో టెస్ట్లో (176) భారీ శతకం నమోదు చేశాడు. తాజాగా మూడో టెస్ట్లోనూ రూట్ చివరిదాకా క్రీజ్లో నిలబడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ స్కోర్ వివరాలు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 329 (డారిల్ మిచెల్ 109) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 360 (బెయిర్స్టో 162) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 326 (టామ్ బ్లండెల్ 88) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 296/3 (54.2 ఓవర్లలో) చదవండి: ENG vs NZ: వారెవ్వా రూట్! రివర్స్ స్కూప్ షాట్! వీడియో వైరల్! -
ఐదేసిన జాక్ లీచ్.. ఇంగ్లండ్ టార్గెట్ 296
హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ రసకందాయంగా మారింది. 168/5 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ రెండో ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్ ఇంగ్లండ్కు 296 పరుగుల ఊరించే టార్గెట్ను నిర్ధేశించింది. కివీస్ బ్యాటర్లలో టామ్ లాథమ్ (76), డారిల్ మిచెల్ (56), టామ్ బ్లండెల్ (88 నాటౌట్) అర్ధశతకాలు సాధించగా.. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, మ్యాటీ పాట్స్ 3, జేమీ ఓవర్టన్, జో రూట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లోనూ ఐదేసిన లీచ్.. తాజా ప్రదర్శనతో 10 వికెట్ల ఘనతను నమోదు చేశాడు. అంతకుముందు డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్.. బెయిర్స్టో (157 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 162 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో 360 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక, 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్న ఇంగ్లండ్ గత మ్యాచ్ తరహాలోనే వేగంగా పరుగులు సాధించి న్యూజిలాండ్పై వరుసగా మూడో టెస్ట్ విజయాన్ని సాధించాలని భావిస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి నాలుగో రోజు ఆఖరి సెషన్లో వీలైనన్ని పరుగులు సాధించాలని అనుకుంటారు. రెండో టెస్ట్లో బెయిర్స్టో (136), స్టోక్స్ (75 నాటౌట్) ఇదే ఫార్ములాను అప్లై చేసి సక్సస్ అయ్యారు. చదవండి: ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్గా నిర్ధారణ -
ENG VS NZ 3rd Test: బెన్ స్టోక్స్ ఖాతాలో మరో రికార్డు
Ben Stokes: న్యూజిలాండ్తో జరుగతున్న మూడు టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ల్లో 100 సిక్సర్లు, 100కు పైగా వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం స్టోక్స్ ఖాతాలో 100 సిక్సర్లు (151 ఇన్నింగ్స్లు), 177 టెస్ట్ వికెట్లు (81 మ్యాచ్ల్లో) ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) సిక్సర్ బాదడం ద్వారా టెస్ట్ల్లో సిక్సర్ల సెంచరీని అందుకున్న స్టోక్స్.. 3.29 ఎకానమీతో 177 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య హెడింగ్లే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు రెండో సెషన్ సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (50), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 360 పరుగులు స్కోర్ చేసి 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడో రోజు ఆటను 264/6 స్కోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 96 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. జేమీ ఓవర్టన్ (136 బంతుల్లో 97; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని మూడు పరుగుల తేడాతో చేజార్చుకోగా.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో బెయిర్ స్టో (161), స్టువర్ట్ బ్రాడ్ (42) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, టిమ్ సౌతీ 3, బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
తిప్పేసిన లియోన్.. పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్
3 టెస్ట్ల సిరీస్లో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 235 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఖరి టెస్ట్లో115 పరుగుల తేడాతో ఓటమిపాలై, 0-1 తేడాతో సిరీస్ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాక్ గడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల (24 ఏళ్లు) చరిత్రను తిరగరాసింది. 1998/99లో మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు చివరిసారిగా పాక్ గడ్డపై సిరీస్ విజయం (1-0) సాధించింది. ఈ పర్యటనలోని తొలి రెండు టెస్ట్లు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, 351 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు ఆటను 73/0 ఓవర్నైట్ స్కోర్తో ప్రారంభించిన పాక్.. ఓ దశలో చారిత్రక విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ (5/83), పాట్ కమిన్స్ (3/23) పాక్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (55), ఇమామ్ ఉల్ హక్ (70) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించగా, మిగతా వారంతా దారుణంగా నిరుత్సాహపరిచారు. ఈ మ్యాచ్లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికవగా, సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 391 ఆలౌట్ (ఉస్మాన్ ఖ్వాజా 91, స్టీవ్ స్మిత్ 59, గ్రీన్ 79, అలెక్స్ క్యారీ 67, షాహీన్ అఫ్రిది 4/79, నసీమ్ షా (4/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 268 ఆలౌట్ (షఫీక్ 81, అజహర్ అలీ 78, బాబర్ ఆజమ్ 67, పాట్ కమిన్స్ 5/56, స్టార్క్ (4/33)) ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్ 227/3 డిక్లేర్డ్ (ఉస్మాన్ ఖ్వాజా 104 నాటౌట్, వార్నర్ 51) పాకిస్థాన్ సెకెండ్ ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (ఇమామ్ ఉల్ హాక్ 70, బాబర్ ఆజమ్ 55, నాథన్ లియోన్ (5/83), కమిన్స్ (3/23)) చదవండి: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు -
నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..!
కేప్టౌన్ టెస్ట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ వివాదంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, కేఎల్ రాహుల్లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 60 పరుగుల వద్ద ఎల్గర్ను ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్గా ప్రకటించడం, ఆ వెంటనే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని నాటౌట్గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి అండ్ కో(అశ్విన్, కేఎల్ రాహుల్).. దక్షిణాఫ్రికా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్ట్ సిరీస్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బహిరంగంగా ఆరోపించడంతో పాటు స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ గెలవాలనుకుంటే సరైన పద్ధతులు ఎంచుకుంటే బెటర్ అని అశ్విన్ అనగా, మా పదకొండు మందిని ఔట్ చేసేందుకు దేశమంతా కలిసి ఆడుతున్నట్టుందని రాహుల్ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంగా కోహ్లి.. అందరూ చూస్తుండగా స్టంప్ మైక్ దగ్గరకు వచ్చి.. కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. థర్డ్ అంపైర్ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లి అండ్ కో పై ఓ మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సీరియస్గా తీసుకోకపోవడంతో కోహ్లి అతని సహచరులు నిషేధం ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోహ్లి అండ్ కో ను ఐసీసీ మందలించినట్లు తెలుస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. -
పుజారా పర్వాలేదు.. రహానేకైతే మరో అవకాశం ఇవ్వను..!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో దారుణంగా విఫలమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. పేలవ ఫామ్లో ఉన్న రహానే తప్పనిసరిగా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. కేప్టౌన్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన రహానేకు తానైతే మరో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో రహానే చివరిసారిగా రాణించడం చూసామని, గతేడాది అతనాడిన 15 మ్యాచ్ల్లో 20.25 సగటున కేవలం 547 పరుగులు మాత్రమే చేశాడని, ఇక అతను తిరిగి ఫామ్లోకి వస్తాడన్న ఆశలు తనకు లేవని అన్నాడు. రహానేతో పోలిస్తే పుజారా కాస్త బెటర్ అని, అతనికైతే మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని అభిప్రాయడ్డాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్ల సిరీస్లో రహానే 6 ఇన్నింగ్స్ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి, 3 టెస్ట్ల సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు.. -
Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు..
Virat Kohli On Purane Future: దక్షిణాఫ్రితో టెస్ట్ సిరీస్లో దారుణంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. మూడో టెస్ట్లో ఓటమి అనంతరం 'పురానే(పుజారా, రహానే)'ల భవిష్యత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత సారధి బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పురానే భవిష్యత్తుని నిర్ణయించడం తన పని కాదని, జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వారి విషయంలో నా జోక్యం ఏంటని విలేకరులను ఎదురు ప్రశ్నించాడు. సెలక్టర్లు వారిద్దరిని జట్టులో ఎంపిక చేస్తే మాత్రం మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని బదులిచ్చాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరమని పురానేలకు పరోక్షంగా తన మద్దతు తెలిపాడు. కాగా, గతేడాది కాలంగా పుజారా, రహానేలు వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లో వీరి ప్రదర్శన మరింత దిగజారింది. మూడు టెస్ట్ల ఈ సిరీస్లో రహానే 6 ఇన్నింగ్స్ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్ట్రాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. Opponents drops Rahane's catch, Pujara drops opponents catch but our management drops neither of them. — Heisenberg ☢ (@internetumpire) January 14, 2022 సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అన్నీ రంగాల్లో అద్భుతంగా రాణించి హాట్ ఫేవరెట్ అయిన టీమిండియాకు ఊహించని షాకిచ్చింది. మరోవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ మాత్రం ఆశించిన మేరకు రాణించలేక చతికిలబడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమై, సిరీస్ కోల్పోవడానికి పరోక్ష కారణమైంది. కేఎల్ రాహుల్, పంత్ మినహా ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు. సీనియర్ ఆటగాళ్లైన పుజారా, రహానేలు కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఈ సిరీస్లోనే ఎదుర్కొన్నారు. Rahane and Pujara are the major reason for India's loss. — Rahul(Astrologer)Contact for 100% wrong prediction (@rahulpassi) January 14, 2022 పేలవ ఫామ్లో ఉన్న 'పురానే'కు వరుస అవకాశాలు ఇచ్చిన టీమిండియా యాజమాన్యం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఈ ఇద్దరు బ్యాటింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ దారుణంగా నిరాశపరిచారు. కీలక సమయాల్లో సులువైన క్యాచ్లను జారవిడిచి జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టారు. దీంతో సోషల్మీడియా వేదికగా అభిమానులు వీరిపై విరుచుకుపడుతున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోవడానికి వీరే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. #INDvSA High time Rahane and Pujara should be dropped off permanently from the test team squad! Dey got ample amount of chances to prove themselves! Gill, Hanuman Vihari, Shreyas Iyer we have dem waiting since forever! Its high tym now! — Angel Anki 🇮🇳 (@angel_ank1) January 14, 2022 'పురానే'కు వరుస అవకావాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కోవాలని.. పుజారా, రహానేల కథ ముగిసిందని.. శ్రేయస్ అయ్యర్, విహారి, శుభ్మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కేప్టౌన్ టెస్ట్లో రహానే రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 43,9 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్లో రాణించకపోగా మ్యాచ్ కీలక సమయాల్లో సులువైన క్యాచ్లు జారవిడిచారు. చదవండి: లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి -
లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి
Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్లో పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్లు వదిలేయడం ద్వారా మ్యాచ్పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు. ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్ క్యాచ్ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్ కీలక ఇన్నింగ్స్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 223, రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్లు గెలిచి సిరీస్ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..?
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. బాల్ ట్రాకింగ్లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్గా తేల్చాడు. ఈ సంబంధిత అధికారులతో పాటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. కోహ్లితో పాటు అశ్విన్, కేఎల్ రాహుల్ సైతం మైక్ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంపైర్ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ అనంతరం కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ''కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. పీటర్సన్ ఔటయ్యే సమయానికి స్కోర్ 155/3గా ఉంది. క్రీజ్లో వాన్ డెర్ డస్సెన్(18), బావుమా ఉన్నారు. దక్షిణాఫ్రికా.. తమ లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు? -
పంత్ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు బద్దలు
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ అద్భుతం చేశాడు. వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన మొట్టమొదటి భారత, ఆసియా వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. 2010లో ధోని చేసిన 90 పరుగులే ఇక్కడ అత్యధికం కాగా, తాజాగా పంత్ దాన్ని అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్లో 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్.. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తద్వారా టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను ఉంచగలిగింది. కెరీర్లో మూడో సెంచరీ సాధించిన పంత్.. అన్నింటినీ పేసర్లకు అనుకూలించే పిచ్లపైనే సాధించడం విశేషం. 2018లో ఇంగ్లండ్లో (114), అదే ఏడాది ఆస్ట్రేలియాలో (159), తాజాగా దక్షిణాఫ్రికాపై పంత్ శతకాలు బాదాడు. పంత్కు ముందు సాహా(వెస్టిండీస్లో 104 పరుగులు), అజయ్ రాత్రా(వెస్టిండీస్లో 115 నాటౌట్), విజయ్ మంజ్రేకర్(వెస్టిండీస్లో 118) మాత్రమే ఆసియా ఖండం బయట శతాకలు సాధించిన భారత వికెట్ కీపర్లుగా రికార్డుల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..! -
దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్లో టీమిండియా సరికొత్త రికార్డు
Most Batsmen Out Caught In A Test Series: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా సరికొత్త సృష్టించింది. కనీసం మూడు టెస్ట్ల సిరీస్లో అత్యధిక క్యాచ్ ఔట్లు అయిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్లో రబాడ బౌలింగ్లో ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి రహానే(1) వెనుదిరగడంతో ఈ రికార్డు భారత్ ఖాతాలోకి చేరింది. ప్రస్తుత సిరీస్లో ఇప్పటివరకు 49 మంది భారత బ్యాటర్లు క్యాచ్ ఔటై వెనుదిరిగారు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. 2009/10 న్యూజిలాండ్తో సిరీస్లో 48 పాక్ ఆటగాళ్లు క్యాచ్ ఔట్ల రూపంలో వెనుదిరిగారు. కాగా, 2006/07లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో సైతం 47 మంది భారత ఆటగాళ్లు క్యాచ్ ఔట్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు కట్టడి చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(16), రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 73 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్లో ఇంగ్లండ్ కెప్టెన్ అరంగేట్రం!.. అయితే.. -
IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి
కేప్టౌన్: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి టెస్ట్ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. అదేంటీ.. కోహ్లి కొత్తగా సెంచరీ సాధించడమేంటీ అని అనుకుంటున్నారా..? అయితే, కోహ్లి ఈ సారి సెంచరీ మార్కును అందకుంది బ్యాటింగ్లో కాదు. అతను సెంచరీ పూర్తి చేసింది ఫీల్డింగ్లో. Virat Kohli completes 1️⃣0️⃣0️⃣ catches in Test cricket 🙌 He is the sixth Indian fielder, who isn't a wicket-keeper, to get to the milestone in Tests. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/g7eoPK0wnB — ICC (@ICC) January 12, 2022 దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్లో షమీ బౌలింగ్లో టెంబా బవుమా క్యాచ్ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్ల్లో 100 క్యాచ్లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్ ద్రవిడ్(164 టెస్ట్ల్లో 210 క్యాచ్లు), వీవీఎస్ లక్ష్మణ్(134 మ్యాచ్ల్లో 135), సచిన్ టెండూల్కర్(200 మ్యాచ్ల్లో 115), సునీల్ గవాస్కర్(125 మ్యాచ్ల్లో 108), అజహారుద్దీన్(99 టెస్ట్ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్గా(వికెట్కీపర్ కాకుండా) నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి కెరీర్లో 99వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో కోహ్లి సెకెండ్ స్లిప్లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో బవుమా(28) పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్లో పీటర్సన్(61), వెర్రిన్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఉమేశ్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్ సాధించాడు. అంతకుముందు తొలి రోజు భారత్ 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA ODI Series: వన్డే సిరీస్కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IND Vs SA: కోహ్లి ఈగోను పక్కకు పెట్టాడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gautam Gambhir Hails Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 79 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైన కోహ్లిపై విమర్శనాస్త్రాలు సంధించే గంభీర్.. తొలిసారిగా కోహ్లిని ఉద్దేశించి పాజిటివ్గా మాట్లడాడు. కేప్టౌన్ టెస్ట్లో కోహ్లి.. తన ఈగోను బ్యాగ్లో పెట్టి బ్యాటింగ్ చేశాడని, ఆ కారణంగానే కీలక ఇన్నింగ్స్ ఆడగలిగాడని పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అహాన్ని పక్కకు పెట్టాలని కోహ్లి తన సహచరులకు సూచించేవాడని, తాజా ఇన్నింగ్స్లో కోహ్లి ఆ ఫార్ములాను పక్కాగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో సఫారీ పేసర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో బ్యాటింగ్ చేసిన కోహ్లి.. జట్టుకు గౌవరప్రదమైన స్కోర్ అందించాడని ప్రశంసించాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎంతో ఓర్పుతో 201 బంతులను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడని ఆకాశానికెత్తాడు. చాలా కాలం తర్వాత కోహ్లి.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఆడిన ఈ క్లాసీ ఇన్నింగ్స్ శతకంతో సమానమని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కోహ్లి రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీలు తొలి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేయగా.. క్రీజ్లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. చదవండి: ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే! -
శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..!
Vamika First Birth Day: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 223 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. కెప్టెన్ కోహ్లి(201 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) ఓంటరి పోరాటం చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండేళ్లకుపైగా శతక దాహంతో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్లో ఎలాగైనా సెంచరీ మార్క్ను అందుకుంటాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే, వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ను నిర్మించినప్పటికీ, మరో ఎండ్లో వరుసగా వికెట్లు పడుతుండడంతో ఒత్తిడికి లోనై 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. కాగా, తన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన ఈ రోజున సెంచరీ మార్కును అందుకోవాలని కోహ్లి సైతం ఎంతో పట్టుదలగా కనిపించాడు. అయితే, రబాడ అద్భుతమైన బంతితో కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత జీవితంలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. తన గారాల పట్టి వామిక ఇవాళ మొదటి పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కూతురికి శతకం సాధించి స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని కోహ్లి భావించాడు. అయితే, అతని ఆశలు అడియాశలు అయ్యాయి. చాలా కాలంగా ఊరిస్తున్న సెంచరీ మైలరాయి కోసం కోహ్లి మరో ఇన్నింగ్స్ వరకు వేచి చూడాల్సి ఉంది. కాగా, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు గతేడాది జనవరి 11న వామిక జన్మించిన సంగతి తెలిసిందే. వామిక ఫోటోను సైతం కోహ్లి దంపతులు ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలీనివ్వకపోవడం విశేషం. చదవండి: 'తగ్గేదేలే' డైలాగ్తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ -
IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా సారధి విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో జట్టు కోచ్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను వెనక్కునెట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 11 టెస్ట్ల్లో 624 పరుగులు చేయగా, ప్రస్తుత ఇన్నింగ్స్లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ద్రవిడ్ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (15 మ్యాచ్ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్లు ఆడిన కోహ్లి.. 50కి పైగా సగటుతో 626* పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్(15), కేఎల్ రాహుల్(12) ఔట్ కాగా.. కోహ్లి(15), పుజారా(26) క్రీజ్లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. జట్టు సభ్యుడికి కరోనా -
ఏడో ర్యాంక్లో ఉన్న టీమిండియాను నంబర్ వన్గా నిలబెట్టాను.. విరాట్ కోహ్లి
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి విరాట్ కోహ్లి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా ఏడో స్థానంలో ఉండేదని, దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాని, అలాంటి పరిస్థితుల్లో నుంచి టీమిండియాను నంబర్ వన్గా నిలబెట్టానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్ల్లో టీమిండియాను నంబర్ వన్ చేయాలనే టార్గెట్తో పని చేశానని, అందుకు ఫలితంగానే టీమిండియా నేటికీ అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న ఆఖరి టెస్ట్కు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేసిన కోహ్లి.. తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. ఇదే సందర్భంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై మాట్లాడుతూ.. రెండో టెస్ట్లో వికెట్లు తీసేందుకు రాహుల్ అన్ని వ్యూహాలను అమలు చేశాడని, కానీ దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడి మ్యాచ్ను లాగేసుకుందని తెలిపాడు. జట్టును నడిపించడంలో ఎవరి స్టైల్ వారికి ఉంటుందని, రాహుల్ కూడా తన స్టైల్లోనే జట్టును నడిపించాడని వివరించాడు. గంటకు పైగా సాగిన ప్రెస్మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కోహ్లి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, రేపటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్లో గాయపడిన సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ, విహారి ప్లేస్లో విరాట్ కోహ్లి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. టీమిండియా తుది జట్టు (అంచనా): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చదవండి: Virat Kohli: పంత్ గుణపాఠాలు నేర్చుకుంటాడు.... ఇక రహానే, పుజారా.. -
ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్
IND Vs SA 3rd Test: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 11) నుంచి ప్రారంభంకానున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. టెస్ట్ కెరీర్ను ఎక్కడ మొదలుపెట్టానో నాలుగేళ్ల తర్వాత అక్కడే ఉన్నానంటూ తన టెస్ట్ అరంగేట్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2018 జనవరిలో ఇదే వేదికపై టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. నాలుగేళ్ల కాలంలో ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగానూ పరిణితి చెందానని, తిరిగి కేప్టౌన్కు రావడం మధుర స్మృతులను నెమరువేసుకున్నట్లు ఉందని భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశాడు. Cape Town, January 2018 - is where it all began for me in Test cricket. Four years on, I’ve grown as a player and a person and to return to this ground brings back special memories. 😊 pic.twitter.com/pxRPNnqwBH— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 9, 2022 విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్లో తొలి మ్యాచ్ ద్వారా బుమ్రా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్ల ఆ సిరీస్లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 25 టెస్ట్లు ఆడిన బుమ్రా.. 23.24 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, 3 టెస్ట్ల ప్రస్తుత సిరీస్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే నిర్ణయాత్మక మ్యాచ్లో ఇరు జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? -
IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు శుభవార్త..
కేప్టౌన్: టీమిండియా అభిమానులకు శుభవార్త. మూడో టెస్ట్కు కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఈ మేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఆదివారం కోహ్లి నెట్స్లో పాల్గొనడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. కోహ్లి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. నెట్స్లో కోహ్లి చాలా సేపు ప్రాక్టీస్ చేయడం చూస్తే.. అతని గాయం పూర్తిగా మానినట్లు తెలుస్తోంది. It's GO time here in Cape Town 👏 👏#TeamIndia all set and prepping for the series decider 👍 👍#SAvIND pic.twitter.com/RgPSPkNdk1 — BCCI (@BCCI) January 9, 2022 కీలక మ్యాచ్ సమయానికి కోహ్లి కోలుకోవడంతో అతని అభిమానులు సహా టీమిండియా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, వెన్ను నొప్పి కారణంగా కోహ్లి రెండో టెస్ట్కు దూరమైన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా మూడు టెస్ట్ల సిరీస్లో చెరో గెలుపుతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. జనవరి 11 నుంచి సిరీస్లో చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..?
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, మూడో టెస్ట్కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో భర్తీ చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ స్థానానికి ఇషాంత్, మరో పేసర్ ఉమేశ్ యాదవ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. 100 టెస్ట్ల అనుభవం ఉందన్న కారణంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ కోహ్లి.. ఇషాంత్వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆఖరి టెస్ట్కు వేదిక అయిన కేప్టౌన్లో పిచ్ బౌన్స్కు సహకరించనుండడంతో అక్కడ ఇషాంత్ ఉపయోగకరంగా మారతాడని ద్రవిడ్ భావిస్తున్నాడట. బౌన్సీ పిచ్పై ఇషాంత్ హైట్ను కూడా పరిగణలోకి తీసుకుని ఆఖరి టెస్ట్ తుది జట్టులో అతన్ని ఆడించాలని ద్రవిడ్ ఫిక్స్ అయ్యాడట. 105 టెస్ట్ల్లో 311 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. తన చివరి టెస్ట్ను గతేడాది డిసెంబర్లో ఆడాడు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన ఆ మ్యాచ్లో అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఫలితంగా అతను దక్షిణాఫ్రికా సిరీస్లో డ్రెసింగ్ రూమ్కే పరిమితమ్యాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్ల ప్రస్తుత సిరీస్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్గా నిలిచే మూడో టెస్ట్లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా, రెండో టెస్ట్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఎల్గర్ సేన సైతం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జనవరి 11 నుంచి ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: IPL 2022: ఈ ఏడాది కూడా విదేశాల్లోనే..? -
జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..?
Virat Kohli To Celebrate Daughter First Birthday And 100th Test On Jan 11, 2022: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి వచ్చే ఏడాది(2022) జనవరి 11వ తేదీ ప్రత్యేకమైన రోజు కానుంది. ఆ రోజు కోహ్లి, అనుష్క దంపతుల గారాలపట్టి వామిక మొదటి జన్మదినం కావడంతో పాటు కెరీర్లో కోహ్లికి వందో టెస్ట్ కావడం విశేషం. క్రికెట్ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చిరకాలం గుర్తుండిపోయే ఆ రోజు కోసం కోహ్లి సహా అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 26న తొలి టెస్టు ఆడనున్న భారత్.. రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు కెరీర్లో 97 టెస్ట్లు ఆడిని ఈ రన్ మెషీన్.. మరో మూడు మ్యాచ్లు ఆడితే తన కెరీర్లో మరో అరుదైన మైలరాయిని చేరుకుంటాడు.విరాట్ తన టెస్ట్ కెరీర్లో 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వారం రోజుటు వాయిదా పడిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ వాయిదా పడగా.. టెస్ట్, వన్డే సిరీస్లు యధావిధిగా జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లి తన ముద్దుల తనయ వామికకు సంబంధించిన ఫోటో కాని వీడియో కాని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడంతో.. ఆ రోజు కోహ్లి ఖచ్చితంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. చదవండి: అందుకే విరాట్ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్ అనేది: పాక్ మాజీ సారధి -
అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్
లీడ్స్: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్లో అతిధ్య ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ సారధి జో రూట్ తమ బౌలర్లను ఆకాశానికెత్తాడు. ఈ విజయం కచ్చితంగా బౌలర్లదేనని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, వరుస మెయిడిన్లతో టీమిండియా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారని అన్నాడు. వికెట్లు తీసే అవకాశం కోసం ఎదురు చూసామని, అదును చూసి కనికరం లేకుండా విరుచుకుపడ్డామని పేర్కొన్నాడు. నాలుగో రోజు కొత్త బంతితో తమ బౌలర్లు చెలరేగుతారని ముందే ఊహించామని తెలిపాడు. తొలి రోజు అండర్సన్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై పైచేయి సాధించేలా చేశాడని, అతనికి రాబిన్సన్ మద్దతు తోడవ్వడంతో ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీసామని అన్నాడు. లేటు వయసులో అండర్సన్ యువ బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్' అని అభివర్ణిస్తారని కొనియాడాడు. ఇక బ్యాటింగ్లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హమీద్తో పాటు డేవిడ్ మలన్పై కూడా రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన హోమ్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందని రూట్ పేర్కొన్నాడు. కాగా, లీడ్స్లో విజయంతో ఐదు టెస్ట్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: క్రీడలను అలవాటుగా మార్చుకోండి.. సచిన్ సందేశం -
మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే.. అప్పుడు, ఇప్పుడు అండర్సనే
లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన.. మూడేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టు చేతిలో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. 2018 లార్ట్స్ టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్లో మళ్లీ అంతటి ఘోర పరాభవాన్ని రుచి చూసింది. నాడు తొమ్మిది వికెట్ల ప్రదర్శనతో టీమిండియా పతనాన్ని శాసించిన అండర్సనే.. మరోసారి భారత జట్టు పాలిట సింహస్వప్నం అయ్యాడు. ఈ మ్యాచ్లో ఆండర్సన్ నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 78 పరుగులకే చాపచుట్టేయడానికి ప్రధాన కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఆండర్సన్ ఆదిలోనే కేఎల్ రాహుల్, కోహ్లి, పుజారా వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. కాగా, 215/2 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిధ్య జట్టు భారత ఆధిక్యాన్ని 1-1కి తగ్గించి సిరీస్ను సమం చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 432 పరుగులు చేసింది. ఓలి రాబిన్సన్(5/65), క్రెయిగ్ ఒవర్టన్(3/47) రెండో ఇన్నింగ్స్లో టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కలిపి మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: ఆండర్సన్ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి.. -
ఆండర్సన్ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి..
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. రహానే బ్యాటింగ్ చేస్తుండగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న పంత్.. తనకేదీ పట్టదన్నట్లుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ (షాడో బ్యాటింగ్) చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అండర్సన్ బంతిని సంధించాక పంత్ అప్పటికప్పుడు అప్రమత్తమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసి రహానే క్రీజు నుంచి ఎందుకు పక్కకు తప్పుకోలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచే ఆండర్సన్ను ఎదుర్కొనేందుకు పంత్ సిద్ధమయ్యాడంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. Pant non-striker shadow batting #ENGvIND pic.twitter.com/hYGoBKg3zh — Cat Jones (@Cricketbatcat) August 28, 2021 కాగా, ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్లో ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో పంత్ రెండుసార్లు రాబిన్సన్కే దొరికిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గత కొన్ని మ్యాచ్లుగా వరుసగా విఫలమవుతూ టీమిండియా చోటును మళ్లీ ప్రశ్నార్ధకంగా మార్చుకునేలా ఉన్నాడు. ప్రస్తుత సిరీస్లో పంత్ ఐదు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: పిచ్ బాగానే ఉంది.. మేమే పొరపాట్లు చేశాం: టీమిండియా కెప్టెన్ -
పిచ్ బాగానే ఉంది.. మేమే పొరపాట్లు చేశాం: టీమిండియా కెప్టెన్
హెడింగ్లే: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 215/2 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిధ్య జట్టు భారత ఆధిక్యాన్ని 1-1కి తగ్గించి సిరీస్ను సమం చేసింది. కాగా, మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట కోహ్లి మాట్లాడుతూ.. ఇంగ్లండ్ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తున్నప్పటికీ వారు క్రమశిక్షణ కలిగి బౌలింగ్ చేశారని కొనియాడాడు. నాలుగో రోజు ఆటలో మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉన్నప్పటికీ, తాము సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నామని పేర్కొన్నాడు. ఇంగ్లండ్కు భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడం మాపై ఒత్తిడి పెంచిందని, నాలుగో రోజు తమ ఇన్నింగ్స్ కుప్పకూలడానికి ఇదే ప్రధాన కారణమని అన్నాడు. టాపార్డర్ నిలకడలేమి టీమిండియా కొంపముంచిందని, లోయర్ మిడిలార్డర్ రాణించాలంటే టపార్డర్ గట్టి పునాది వేయాలని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ కోల్పోయినందుకు ఎవరినీ నిందించదలచుకోలేదని, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి రూట్ సేన గెలుపునకు నిజమైన అర్హులని తెలిపాడు. ఇక అదనపు స్పిన్నర్ ఆడించాలన్నది పిచ్పై ఆధారపడి ఉంటుందని, ఈ మ్యాచ్ వరకు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం కరెక్టేనని పేర్కొన్నాడు. అశ్విన్ను తుది జట్టులో ఆడించే అంశంపై నాలుగో టెస్ట్కు ముందు పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. మొత్తంగా పిచ్ సహకరించినా పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్ కారణంగా మ్యాచ్ను చేజార్చుకున్నామని, తదుపరి మ్యాచ్లో తమ పొరపాట్లను బేరీజు వేసుకుని వాటిని అధిగమిస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా రికార్డు -
మూడో టెస్టు : ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి ఫొటోలు
-
చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా రికార్డు
లీడ్స్: భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్లో అజింక్య రహానే వికెట్ పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ వెటరన్ పేసర జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో(ఇంగ్లండ్ గడ్డపై) 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా అతను రికార్డుల్లోకెక్కాడు. ఆండర్సన్కు ముందు ఇంగ్లండ్లో ఏ ఇతర బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ జాబితాలో ఆండర్సన్ తర్వాతి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్(341 వికెట్లు), ఫ్రెడ్ ట్రూమన్(229 వికెట్లు) ఉన్నారు. ఇక, ఓవరాల్ సొంత గడ్డపై 400 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆండర్సన్(400), అనిల్ కుంబ్లే(350), స్టువర్ట్ బ్రాడ్(341),షేన్ వార్న్(319) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత్తో జరిగిన మూడో టెస్ట్లో ఆండర్సన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్వుడ్పై నమోదై ఉంది. అండర్వుడ్ భారత్కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు. కాగా, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-1తో సిరీస్ను సమం చేసింది. 215/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఏ దశలోనూ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్సన్(5/65), ఒవర్టన్(3/47) ధాటికి భారత్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కలిపి మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి -
టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఆతిధ్య జట్టు చేతిలో ఇన్నింగ్స్ 76 పరగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఓవర్నైట్ స్కోర్ 215/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ తొలి సెషన్లోనే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి టీమిండియా ఓవర్నైట్ స్కోర్కు మరో 63 పరుగులు జోడించి 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్(5/65), ఒవర్టన్(3/47) టీమిండియా పతనాన్ని శాసించారు. ఆండర్సన్, మొయిన్ అలీకి తలో వికెట్ దక్కింది. కాగా, ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో టెస్ట్లో భారత్ గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, మూడో టెస్ట్లో ఆతిధ్య జట్టు గెలుపొందడంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. ఇన్నింగ్స్ ఓటమి దిశగా టీమిండియా.. తొమ్మిదో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ ఓటమికి టీమిండియా మరో వికెట్ దూరంలో ఉంది. ఒవర్టన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి జడేజా(30) తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 278/9. ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించుకోవాలంటే మరో 76 పరుగులు చేయాల్సి ఉంది. రాబిన్సన్కు ఐదు వికెట్లు.. ఇషాంత్(2) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ ఖాతాలో మరో వికెట్ పడింది. వికెట్కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఇషాంత్(2) వెనుదిరిగాడు. ఈ వికెట్తో రాబిన్సన్ ఒకే ఇన్నింగ్సలో 5వికెట్ల ఘనతను రెండోసారి సాధించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 257/8. ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే భారత్ మరో 97 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో జడేజా, బుమ్రా ఉన్నారు. టీమిండియాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా లేదు.. షమీ(6) ఔట్ మూడు టెస్ట్లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పేలా లేదు. నాలుగో రోజు తొలి సెషన్లో వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్న భారత ఆటగాళ్లు కనీసం ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకుందాం అన్న ధ్యాస లేకుండా వికెట్లు సమర్పించుకుంటున్నారు. 239 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్ మరో 15 పరుగులు జోడించి 254 పరుగుల వద్ద ఏడో వికెట్(షమీ)ను కోల్పోయింది. షమీ(6) ని మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే టీమిండియా మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. రాబిన్సన్ విజృంభణ.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా, పంత్(1) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా ఆటగాళ్లను కుదురుకోనివ్వట్లేదు. నాలుగో రోజు ఆటలో తొలుత పుజారాను ఔట్ చేసిన రాబిన్సన్.. ఆతర్వాత కోహ్లిని, తాజాగా పంత్ను పెవిలియన్కు పంపి టీమిండియా ఓటమికి బాటలు వేస్తున్నాడు. రాబిన్సన్(4/58) ధాటికి భారత్ 239 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో జడేజా, షమీ ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 115 పరుగులు చేయాల్సి ఉంది. ఓటమి బాట పట్టిన టీమిండియా.. వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) ఔట్ నాలుగో రోజు తొలి సెషన్లోనే టీమిండియా ఖేల్ ఖతం అయ్యేలా కనిపిస్తుంది. ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే పుజారా(91) వెనుదిరగగా, తాజాగా వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) పెవిలియన్ బాట పట్టారు. దీంతో టీమిండియా 239 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపు ఖరారు చేసుకుంది. కోహ్లి రాబిన్సన్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, రహానేను ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. క్రీజ్లో పంత్(1), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 115 పరుగులు వెనుకబడే ఉంది. అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ టీమిండియా అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పుజారా(91) తన ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే రాబిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు చిక్కాడు. దీంతో టీమిండియా మూడో వికెట్ను కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. క్రీజ్లోకి రహానే వచ్చాడు. లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లో పుజారా, కోహ్లి ఓపికగా ఆడగలిగితే టీమిండియాదే పైచేయి అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ రోజు ఆటలో మనోళ్లు నిలబడతారా..? లేక చేతులెత్తేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. చదవండి: అంపైర్ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు -
వివాదంలో చిక్కుకున్న పంత్.. మందలించి వదిలిపెట్టిన అంపైర్లు
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిబంధనలు అతిక్రమించాడు. అలా జరగడం తొలిసారి కావడంతో అంపైర్లు అతన్ని మందలించి వదిలి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధనలకు విరుద్దంగా పంత్.. తన కీపింగ్ గ్లోవ్స్కు టేప్ చుట్టుకుని వివాదంలో చిక్కుకున్నాడు. ఇది గుర్తించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పంత్ను మందలిస్తూ.. కెప్టెన్ కోహ్లి సమక్షంలో టేప్ను తొలగించారు. మూడో రోజు ఆట చివరి సెషన్ ప్రారంభానికి ముందు ఇది జరిగింది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్మీడియా వ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. పంత్ చీటింగ్కు పాల్పడ్డాడంటూ ఇంగ్లండ్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. చదవండి: ఇంకా రెండు మ్యాచ్లున్నాయ్! దిగులెందుకు.. కాగా, ఎంసీసీ 27.2.1 నిబంధన ప్రకారం వికెట్ కీపింగ్ గ్లోవ్స్కు టేప్ వేయకూడదు. ముఖ్యంగా చూపుడు వేలు, బొటన వేలు మినహాయించి ఇతర వేళ్ల మధ్య వెబ్బింగ్(టేప్ చుట్టడం) చేయకూడదు. అలా చేస్తే కీపర్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ పంత్ తన గ్లోవ్స్కు టేప్ చుట్టుకోవడంతో అంపైర్ అలెక్స్ వార్ఫ్.. అతన్ని మందలించి నిబంధనలకు విరుద్దమని చెప్పాడు. ఇదిలా ఉంటే, పంత్ వెబ్బింగ్ ఘటన గుర్తించక ముందు( ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 94 ఓవర్లో) ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్(70) కీపర్ క్యాచ్గా ఔటయ్యాడు. దీంతో మలాన్ను నాటౌట్గా పరిగణించి వెనక్కి రప్పించాలని కామెంటేటర్ డేవిడ్ లాయడ్ డిమాండ్ చేశాడు. పంత్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడు కాబట్టి అంపైర్లు జోక్యం చేసుకుని మలాన్ను నాటౌట్గా ప్రకటించాలని కోరాడు. కాగా, 423/8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 432 పరగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ ఒవర్టన్(32) తన ఓవర్నైట్ స్కోర్కు మరో 8 పరుగులు జోడించి షమీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోగా.. మరో ఓవర్నైట్ బ్యాట్స్మన్ ఓలీ రాబిన్సన్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రూట్ సేనకు 354 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కపడటి వార్తలు అందేసరికి కేఎల్ రాహుల్(8) వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..! -
మూడో రోజు ముగిసిన ఆట..139 పరుగుల వెనుకంజలో భారత్..!
మూడో రోజు ముగిసిన ఆట..139 పరుగుల వెనుకంజలో భారత్..! ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకు ఆలౌట్ అవ్వగా..బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు 354 పరుగుల భారీ లీడ్ను భారత జట్టు ముందుంచింది. రెండో ఇన్నింగ్స్ను స్టార్ట్చేసిన టీమిండియాకు రాహుల్ రూపంలో షాక్ తగిలింది. కేవలం 8 పరుగుల వద్ద రాహుల్ ఔటయ్యాడు. తరువాత వన్డౌన్లో వచ్చిన పుజారా, రోహిత్ ద్వయం 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేయగా..రోహిత్ శర్మ అర్థ సెంచరీ ముగించుకున్నాక 59 పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. తరువాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, పూజారా ఇంగ్లండ్ బ్యాటింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోంటు పరుగులను రాబట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో పూజారా(91 పరుగులు, 15 ఫోర్లు), విరాట్ కోహ్లీ (45 పరుగులు, 6ఫోర్లు) ఉన్నారు. భారత్ ఇంకా 139 పరుగుల వెనుకబడి ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోర్-215/2, ఇంగ్లండ్ బౌలింగ్లో రాబిన్సన్, ఓవర్టన్ చెరో వికెటును తీశారు. ఇంకా రెండురోజుల ఆట మిగిలి ఉంది. నిలకడగా ఆడుతున్న పుజారా(81), కోహ్లి(32) టీమిండియా నయా వాల్ పుజారా(81; 14 ఫోర్లు) చాలా రోజు తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. అతనికి మరో ఎండ్లో కెప్టెన్ కోహ్లి(33; 5 ఫోర్లు) కూడా సహకరిస్తుండడంతో టీమిండియా ప్రత్యర్ధి ఆధిక్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. 73 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 164 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పుజారా హాఫ్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 123/2 గత 11 ఇన్నింగ్స్లుగా కనీసం అర్ధసెంచరీ కూడ సాధించకుండా వరుసగా విపలమవుతున్న పుజారా ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సంయమనంగా బ్యాటింగ్ చేస్తూ.. ఇంగ్లండ్ లీడ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. 52 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 123/2. క్రీజ్లో పుజారాకు తోడుగా కోహ్లి(1) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఇంకా 228 పరుగులు వెనుకపడి ఉంది. టీమిండియాకు షాక్.. రాబిన్సన్కు దొరికిపోయిన హిట్మ్యాన్(59) భారీ స్కోర్ దిశగా సాగుతున్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ(59; 7 ఫోర్లు, సిక్స్)ను రాబిన్సన్ బోల్తా కొట్టించాడు. వికెట్లకు స్ట్రయిట్గా వస్తున్న బంతిని డిఫెన్స్ ఆడబోయి రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు పెద్ద షాక్ తగిలినంత పనైంది. 48 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 116/2. క్రీజ్లో పుజారా(44), కోహ్లి(0) ఉన్నారు. టీమిండియా ప్రసుతం మరో 238 పరుగులు వెనుకపడి ఉంది. రోహిత్ శర్మ ఫిఫ్టి.. నిలకడగా ఆడుతున్న పుజారా(34) టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(52; 6 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దృడ సంకల్పంతో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్.. భారీ ఇన్నింగ్స్ ఆడి ఎలాగైనా టీమిండియాను గట్టెక్కించాలని భావిస్తున్నాడు. అతనికి మరో ఎండ్ నుంచి పుజారా(36; 7 ఫోర్లు) రూపంలో చక్కటి సహకారం లభిస్తుంది. 42 ఓవర్ల తర్వాత టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 253 పరుగులు వెనుకపడి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(8) ఔట్ 354 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 34 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్(8)..ఒవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు. సెకెండ్ స్లిప్లో బెయిర్స్టో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రాహుల్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. ప్రస్తుతం టీమిండియా మరో 320 పరుగులు వెనుపడి ఉంది. ప్రస్తుతం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. క్రీజ్లో రోహిత్ శర్మ(25) ఉన్నాడు. ఇంగ్లండ్ 432 ఆలౌట్.. 354 పరుగుల ఆధిక్యంలో ఆతిధ్య జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బుమ్రా.. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ రాబిన్సన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 432 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్కు 354 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, జడేజా, బుమ్రాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఒవర్టన్(32) ఔట్ మూడో రోజు ఆట తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో విరుచుకుపడిన ఒవర్టన్(32; 6 ఫోర్లు) ఓవర్నైట్ స్కోర్కు మరో 8 పరుగులు మాత్రమే జోడించి షమీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 132 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 353 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్లో రాబిన్సన్(0), ఆండర్సన్(0) ఉన్నారు. లీడ్స్: ఓవర్నైట్ స్కోర్ 423/8తో ఇంగ్లండ్ జట్టు మూడో రోజు ఆటను ఆరంభించింది. క్రీజులో క్రెయిగ్ ఒవర్టన్(24), ఓలీ రాబిన్సన్ (0) ఉన్నారు. ఇంగ్లండ్ బ్యాట్మెన్లు తొలి రోజునుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మధ్యమధ్యలో వికెట్లు తీయడం మినహా భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ 345 పరుగుల ఆధ్యిక్యంలో కొనసాగుతుంది. కాగా, టీమిండియా తొల ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ రూట్(121) అద్భుత శతకంతో చెలరేగగా, బర్న్స్(61), హమీద్(66), మలాన్(70) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
రెండో రోజు ముగిసిన ఆట.. భారత్పై 345 పరుగుల ఆధ్యిక్యంలో ఇంగ్లండ్
లీడ్స్లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 423 పరుగులను చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రెగ్ ఒవర్టన్ 24 నాటౌట్, ఓల్లీ రాబిన్సన్ (0) నాటౌట్గా ఉన్నారు. భారత బౌలర్లు రెండో రోజు ప్రారంభం నుంచి వికెట్లు దక్కలేదు. ఇంగ్లండ్ బ్యాట్మెన్స్ భారత బౌలర్లపై తొలి రోజునుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. చివరి సెషన్ తప్ప మిగతా సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారత్పై 345 పరుగుల ఆధ్యిక్యంలో ఇంగ్లండ్ కొనసాగుతుంది. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ(8) ఔట్ రూట్(121)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్ కొరకరాని కొయ్యలా మారిన రూట్(121; 14 ఫోర్లు)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పటికే చేయాల్సిన నష్టం అంతా చేసేసని ఇంగ్లండ్ కెప్టెన్.. ఆరో వికెట్గా వెనుదిరిగాడు. క్రీజ్లో మొయిన్ అలీ(8), సామ్ కర్రన్ ఉన్నారు. 118 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 383/6. షమీ విజృంభణ.. 10 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు రూట్ శతక్కొట్టాక ఇంగ్లండ్ జట్టు వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్108 ఓవర్లో 350/3 స్కోర్ వద్ద షమీ బెయిర్స్టో(29; 4 ఫోర్లు, సిక్స్)ను బోల్తా కొట్టించగా, సరిగ్గా పది పరుగుల వ్యవధిలో బట్లర్(7; ఫోర్)ను కూడా పెవిలియన్కు పంపాడు. 112 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 360/5. క్రీజ్లో రూట్(105), మొయిన్ అలీ(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 282 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శతక్కొట్టిన రూట్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సిరీస్లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో 22వ శతకాన్ని బాదేశాడు. 96 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్లో బౌండరీ బాది రూట్ సెంచరీ సాధించాడు. 103.2 తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 329/3. క్రీజ్లో రూట్కు తోడుగా బెయిర్ స్టో(15) ఉన్నాడు. కాగా, రూట్కు ఈ శతకం కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఈ సెంచరీ ద్వారా అతను పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు(6) సాధించిన ఆటగాడిగా మైకేల్ వాన్(1997లో 6 సెంచరీలు), డెన్నిస్ క్రాంప్టన్(1947లో 6 శతకాలు)ల సరసన నిలిచాడు. అలాగే భారత్పై అత్యధిక సెంచరీలు(8) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(70) ఔట్ టీమిండియాకు ఎట్టకేలకు మరో బ్రేక్ లభించింది. టీ విరామానికి ముందు డేవిడ్ మలాన్(70; 11 ఫోర్లు)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ బౌలింగ్లో వికెట్కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి మలాన్ వెనుదిరిగాడు. 94 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 298/3. ప్రస్తుతం ఆ జట్టు 220 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్.. రూట్(70*), మలాన్(64*) అర్ధసెంచరీలు తొలి సెషన్లో రెండు వికెట్లు పడగొట్టి, ఆతిధ్య జట్టుకు పగ్గాలు వేసేలా కనిపించిన టీమిండియా.. ఆ తర్వాత వికెట్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వెనుదిరిగాక క్రీజ్లోకి వచ్చిన మలాన్(64; 10 ఫోర్లు), జో రూట్(70; 8 ఫోర్లు)లు పసలేని టీమిండియా బౌలింగ్పై పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. ముఖ్యంగా రూట్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. ఫలితంగా 90 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 282/2గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 204 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హసీబ్ హమీద్(68) బౌల్డ్ ఓవర్నైట్ స్కోర్ 120/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్లోనే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత 135 పరుగుల వద్ద బర్న్స్(61)ను షమీ పెవిలియన్కు పంపగా, 159 పరుగుల వద్ద హసీబ్ హమీద్(68; 12 ఫోర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్లో డేవిడ్ మలాన్(18), జో రూట్(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 81 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎట్టకేలకు తొలి వికెట్.. షమీకి చిక్కిన బర్న్స్ (61) ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. ఆ జట్టు ఓపెనర్, బర్త్డే బాయ్ రోరీ బర్న్స్(61; 6 ఫోర్లు, సిక్స్) షమీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 50 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 135/1. క్రీజ్లో హసీబ్ హమీద్(66), డేవిడ్ మలాన్(0) ఉన్నారు. 120/0 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 15 పరుగులు జోడించి బర్న్స్ వికెట్ను కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 78 పరుగలకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. చదవండి: నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్లోనూ ప్రత్యక్ష ప్రసారం -
ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్పై బంతితో దాడి
లీడ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఇంగ్లండ్ అభిమానులు భారత ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతుండడం విస్మయానికి గురి చేస్తుంది. రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్పై వాటర్ బాటిల్ మూతలను విసిరిన ఘటన మరువక ముందే.. మూడో టెస్టు తొలి రోజు సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంగ్లండ్ అభిమాని బంతిని విసిరాడు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతిని తిరిగి వారి వైపే విసరాలని సిరాజ్కు సైగ చేశాడు. ఈ విషయాన్ని టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. Mohammed Siraj signalling to the crowd “1-0” after being asked the score.#ENGvIND pic.twitter.com/Eel8Yoz5Vz — Neelabh (@CricNeelabh) August 25, 2021 కాగా, సిరాజ్పై బంతితో దాడి చేసిన ఆ ఇంగ్లండ్ అభిమాని అంతటితో ఆగకుండా ఇండియా స్కోర్ ఎంత అంటూ సిరాజ్ను గేలి చేసే ప్రయత్నం చేశారు. అయితే, సిరాజ్ ఆ వ్యక్తికి 1-0 అని సైగ చేస్తూ.. అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ప్రస్తుత సిరీస్లో టీమిండియా ఆధిక్యాన్ని సూచిస్తూ సిరాజ్ చేసిన సంజ్ఞలతో ఆ ఇంగ్లండ్ అభిమానికి రివర్స్ పంచ్ పడినట్లైంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: ENG Vs IND: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు -
India vs England: అద్భుతంనుంచి అగాధానికి...
లార్డ్స్ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్మన్ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్ తొలి రోజును ఘనంగా ముగించింది. లీడ్స్: తొలి రోజు భారత్ బ్యాటింగ్ను చూస్తే... లార్డ్స్లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్ స్కోరర్ కాగా, అండర్సన్ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), హమీద్ (60 బ్యాటింగ్; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో బంతి నుంచి ఆలౌట్ దాకా... సిరీస్లో ఆధిక్యం... జట్టులో ఆత్మవిశ్వాసం... ఇంకేం మూడో టెస్టులోనూ పైచేయి సాధించేయొచ్చులే అన్న ధీమా ఐదో బంతికే డీలా పడింది. తొలి ఓవర్ వేసిన అండర్సన్ ఐదో బంతికే రాహుల్ (0)ను డకౌట్ చేశాడు. మళ్లీ తనే ఐదో ఓవర్లో చతేశ్వర్ పుజారా (1), కొంత విరామం తర్వాత 11వ ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని పెవిలియన్ చేర్చాడు. లంచ్ విరామానికి ముందు రాబిన్సన్ బౌలింగ్లో రహానే కూడా బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. 56/4 స్కోరు వద్ద లంచ్బ్రేక్కు వెళ్లింది. 67/5.... 67/9 జరిగిందేదో జరిగింది! రెండో సెషన్లో భారత్ చక్కబడదా! పైగా హిట్మ్యాన్ రోహిత్ ఉండనే ఉన్నాడు. అని సరిపెట్టుకున్న స్థైర్యం చెల్లాచెదురయ్యేందుకు... భారత్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. లంచ్ అయిన వెంటనే రిషభ్ పంత్ (2) అవుటయ్యాడు. 36 ఓవర్లలో భారత్ స్కోరు 67/5. ఇంగ్లీష్ పేస్ తుఫాను ఇంకా ముగిసిపోలేదు. ఓవర్టన్ (37వ ఓవర్), స్యామ్ కరన్ (38వ ఓవర్) ఇద్దరు ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లను పడేశారు. దెబ్బకు 67/9...‘సున్నా’ పరుగుల వ్యవధిలో 12 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిపోయిన ఆఖరి వికెట్ లాంఛనాన్ని ఓవర్టనే సిరాజ్ను అవుట్ చేయడం ద్వారా పూర్తి చేశాడు. లంచ్ తర్వాత 14.5 ఓవర్లు ఆడిన భారత్ 22 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను సమర్పించుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) రాబిన్సన్ (బి) ఓవర్టన్ 19; రాహుల్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; పుజార (సి) బట్లర్ (బి) అండర్సన్ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) అండర్సన్ 7; రహానే (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 18; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2; జడేజా (ఎల్బీ) (బి) కరన్ 4; షమీ (సి) బర్న్స్ (బి) ఓవర్టన్ 0; ఇషాంత్ నాటౌట్ 8; బుమ్రా (ఎల్బీ) (బి) కరన్ 0; సిరాజ్ (సి) రూట్ (బి) ఓవర్టన్ 3; ఎక్స్ట్రాలు 16; మొత్తం (40.4 ఓవర్లలో ఆలౌట్) 78. వికెట్ల పతనం: 1–1, 2–4, 3–21, 4–56, 5–58, 6–67, 7–67, 8–67, 9–67, 10–78. బౌలింగ్: అండర్సన్ 8–5–6–3, రాబిన్సన్ 10–3–16–2, స్యామ్ కరన్ 10–2–27–2, మొయిన్ అలీ 2–0–4–0, ఓవర్టన్ 10.4–5–14–3. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ బ్యాటింగ్ 52; హమీద్ బ్యాటింగ్ 60; ఎక్స్ట్రాలు 8; మొత్తం (42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 120. బౌలింగ్: ఇషాంత్ 7–0–26–0, బుమ్రా 12–5–19–0, షమీ 11–2–39–0, సిరాజ్ 7–1–26–0, జడేజా 5–3–6–0. -
Virat Kohli: కోహ్లి ఫిఫ్టి కొట్టాడు.. ఎలానో చూడండి..
లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీడ్స్ వేదికగా బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 78 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (7) మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆండర్సన్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్కి ఆవల వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్ట్ల్లో కోహ్లిని అత్యధిక సార్లు(7) ఔట్ చేసిన బౌలర్గా ఆండర్సన్ రికార్డు నెలకొల్పాడు. Half-century for Virat Kohli… That’s 50 consecutive international innings without a century for the Indian skipper.#ENGvIND — Nic Savage (@nic_savage1) August 25, 2021 ఇదిలా ఉంటే, కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను చివరిసారిగా 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై (డే/నైట్ టెస్ట్) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అడపాదడపా అర్ధశతకాలు చేశాడు. ఇప్పటి వరకూ టెస్ట్లు, వన్డేల్లో కలిపి 70 శతకాలు సాధించిన కోహ్లి.. ఇంగ్లండ్ సిరీస్లోనైనా 71వ శతకాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ఈ రన్ మెషీన్.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు. We think @jimmy9 enjoyed this one! 💥 Scorecard/Videos: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/3zGBCmJlhQ — England Cricket (@englandcricket) August 25, 2021 కాగా, నేటి ఇన్నింగ్స్తో కోహ్లి శతక్కొట్టక 50 ఇన్నింగ్స్లు పూర్తి అయ్యాయి. మూడు ఫార్మాట్లలో కలిపి గడిచిన 50 ఇన్నింగ్స్లలో అతను మూడంకెల స్కోర్ను చేరుకోలేకపోయాడు. ఇందులో 18 టెస్ట్ ఇన్నింగ్స్లు, 15 వన్డే ఇన్నింగ్స్లు, 17 టీ20 ఇన్నింగ్స్లు ఉన్నాయి. దీంతో మూడో టెస్టుతో కోహ్లి హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీ 71 సెంచరీ చేయడం ఓ కలగా మిగిలిపోనుంది.. అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. People waiting for Kohli's 71st century will remain a dream 😭😭 — Surendra Reddy☮️ (@Indiranandhan) August 25, 2021 Le Anushka:#INDvENG #Kohli pic.twitter.com/rK9WVT1hQ7 — Rahul Chauhan (@_NeverOnside) August 25, 2021 చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. -
అరుదైన రికార్డును సమం చేసిన ఇంగ్లండ్ వికెట్కీపర్..
లీడ్స్: టీమిండియాతో జరగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఓ ఇన్నింగ్స్ తొలి ఐదు వికెట్లలో భాగస్వామి(క్యాచ్ లేదా స్టంపింగ్) అయిన రెండో వికెట్కీపర్గా ఆసీస్ మాజీ వికెట్కీపర్ బ్రాడ్ హడిన్ సరసన నిలిచాడు. హడిన్ 2014-15 గబ్బా టెస్ట్లో టీమిండియాపై ఈ ఘనత సాధించాడు. ఈ టెస్ట్లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 58 పరగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ పేసర్లు ఆండర్సన్(3), ఒలీ రాబిన్సన్(2) నిప్పులు చెరిగే బంతులతో భారత టాపార్డర్ను కుప్పకూల్చారు. వీరిద్దరు పడగొట్టిన 5 వికెట్లలో బట్లర్ కీలకపాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, పంత్ల క్యాచ్లను అందుకుని టీమిండియా పతనానికి పరోక్ష కారకుడిగా నిలిచాడు. కాగా, కడపటి వార్తలు అందేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ కనీసం మూడంకెల స్కోర్ను కూడా చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్, సామ్ కర్రన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. భారత ఇన్నింగ్స్లో రోహిత్(19), రహానే(18) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. -
వికెట్ నష్టపోకుండా టీమిండియా స్కోర్ను దాటేసిన ఇంగ్లండ్
వికెట్ నష్టపోకుండా టీమిండియా స్కోర్ను దాటేసిన ఇంగ్లండ్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. బౌలింగ్లో కూడా అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే చేతులెత్తేసిన భారత్.. 31 ఓవర్ల అనంతరం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ల సమయోచితమైన బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. రోరి బర్న్స్(38), హసీబ్ హమీద్(32) భారత బౌలర్లకు చిక్కకుండా చుక్కలు చూపిస్తూ వికెట్ నష్టపోకుండా ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇంగ్లండ్ పేసర్ల విశ్వరూపం.. 78 పరుగులకే చాప చుట్టేసిన టీమిండియా కొందరు ఆటగాళ్ల అత్యుత్సాహం మరోసారి టీమిండియా కొంపముంచింది. రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టినందుకు భారత్ తగిన మూల్యమే చెల్లించుకుంది. మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో కసిగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్మెన్లు చేతులెత్తేసారు. భారత ఆటగాళ్లు పోటీ పడి మరీ పెవిలియన్కు కూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే చాపచుట్టేసింది. ఓవర్టన్ బౌలింగ్లో సిరాజ్(3) ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ సమాప్తమైంది. భారత ఇన్నింగ్స్లో రోహిత్(19), రహానే(18) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్, సామ్ కర్రన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్ పేసర్ల విశ్వరూపం.. 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్ తొలుత ఆండర్సన్(3), రాబిన్సన్(2).. ఆ తర్వాత ఓవర్టన్(2), సామ్ కర్రన్(2)లు టీమిండియా భరతం పట్టారు. ఈ నలుగురు ఇంగ్లండ్ పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 58 పరగులకే సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రెయిగ్ ఓవర్టన్.. వరుస బంతుల్లో రోహిత్ శర్మ(19), షమీ(0)లను ఔట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్ సమాప్తికి ముహూర్తం ఖరారు చేయగా, ఆ తరువాతి ఓవర్లో సామ్ కర్రన్ కూడా వరుస బంతుల్లో జడేజా(4), బుమ్రా(0)లను ఎల్బీడబ్ల్యూ చేసి భారత ఇన్నింగ్స్ ను దాదాపుగా సమాప్తం చేశాడు. ఓవర్టన్, కర్రన్ ద్వయం ఆరు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి.. టీమిండియా ఆశలను సమాధి చేశారు. క్రీజ్లో ఇషాంత్ శర్మ, సిరాజ్ ఉన్నారు. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా..పంత్(2) ఔట్ ఇంగ్లండ్ పేసర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. తొలుత ఆండర్సన్ త్వరతగతిన మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాట్స్మెన్ల భరతం పట్టగా, తాజాగా రాబిన్సన్ టీమిండియా ప్లేయర్స్కు చుక్కలు చూపిస్తున్నాడు. లంచ్ విరామానికి ముందు రహానేను బోల్తా కొట్టించిన రాబిన్సన్.. లంచ్ తర్వాత పంత్(2) పనిపట్టాడు. మొదటి నాలుగు వికెట్ల తరహాలోనే పంత్ కూడా వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వికెట్కీపర్ జోస్ బట్లర్ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఇన్నింగ్స్ తొలి 5 వికెట్లలో భాగస్వామి(క్యాచ్ లేదా స్టంపింగ్) అయిన రెండో వికెట్కీపర్గా ఆసీస్ మాజీ వికెట్కీపర్ బ్రాడ్ హడిన్ సరసన నిలిచాడు. హడిన్ 2014-15 గబ్బా టెస్ట్లో టీమిండియాపై ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేసర్ల ధాటికి టీమిండియా 58 పరగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజ్లో రోహిత్(15), జడేజా(0) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రహానే(18) ఔట్ లంచ్ విరామానికి ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించిన రహానే(18; 3 ఫోర్లు)ను ఒలీ రాబిన్సన్ బోల్తా కొట్టించాడు. మొదటి మూడు వికెట్ల తరహాలోనే రహానే కూడా వికెట్ కీపర్ బట్లర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంచ్ విరామం సమాయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించి ఎదురీదుతోంది. రోహిత్ శర్మ(15; ఫోర్) పట్టుదలగా ఆడుతున్నాడు. నిప్పులు చెరుగుతున్న ఆండర్సన్.. కోహ్లి వికెట్ కూడా అతని ఖాతాలోకే ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ధాటికి టీమిండియా బెంబేలెత్తిపోతుంది. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతుల ధాటిని తట్టుకోలేక టీమిండియా బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరుగా చేతులెత్తేస్తున్నారు. తొలి ఐదు ఓవర్లలోనే కేఎల్ రాహుల్(0), పుజారా(1)లను పెవిలియన్కు పంపిన ఆండర్సన్.. 11వ ఓవర్లో టీమిండియా కెప్టెన్ కోహ్లి(7)కి కూడా షాకిచ్చాడు. విశేషమేమిటంటే వీరి ముగ్గరిని ఆండర్సన్ ఒకే తరహాలో ఔట్ చేశాడు. వీరంతా వికెట్కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్లో రోహిత్(4), రహానే ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న ఆండర్సన్.. 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా రెండో టెస్ట్లో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లున్నాడు. తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపి టీమిండియాకు షాకిచ్చిన ఆండర్సన్.. మరో మూడు ఓవర్లు తిరక్కుండానే పుజారా(1)ను సైతం పెవిలియన్కు పంపి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు. రాహుల్ తరహాలోనే పుజారా కూడా వికెట్కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చే ఔటయ్యాడు. ఆండర్సన్.. నిప్పులు చెరిగే బంతులను సంధిస్తూ.. టీమిండియా బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తున్నాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 19 పరగులు చేసింది. రోహిత్(4), కోహ్లి(7) ఆచితూచి ఆడుతున్నారు. తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ డకౌట్ టీమిండియాకు టాస్ గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలువలేదు. తొలి ఓవర్లోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. రెండో టెస్ట్ శతకవీరుడు కేఎల్ రాహుల్ను ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఆండర్సన్ పెవిలియన్కు పంపాడు. ఇన్నింగ్స్ ఐదో బంతికే వికెట్కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్(0) వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్కు జతగా క్రీజ్లోకి పుజారా వచ్చాడు. లీడ్స్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండో టెస్ట్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగగా, ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్ సిబ్లే స్థానంలో డేవిడ్ మలాన్ జట్టులోకి రాగా, గాయపడిన మార్క్ వుడ్ ప్లేస్లో క్రెయిగ్ ఒవర్టన్ బరిలో నిలిచాడు. ఈ టెస్ట్లో టీమిండియా సైతం ఓ మార్పుతో బరిలోకి దిగుతుందని భావించినప్పటికీ కోహ్లి మాత్రం లార్డ్స్ టెస్ట్లో ఆడిన జట్టుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్ట్ల్లో అంతగా ప్రభావం చూపని రవీంద్ర జడేజాను పక్కకు పెట్టి అశ్విన్ను ఆడిస్తారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. అయితే, కోహ్లి.. జడేజాపై నమ్మకం ఉంచడంతో అశ్విన్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించడంతో 5 టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ. ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఒవర్టన్, జేమ్స్ అండర్సన్. -
లార్డ్స్ టెస్ట్ మాకో గుణపాఠం.. ఇకపై వివాదాల జోలికి వెళ్లం: రూట్
లీడ్స్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని విమర్శల పాలైన ఇంగ్లండ్ జట్టు.. తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్కు ముందు మీడియాతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆ జట్టు సారధి జో రూట్ మాటల్లో అది స్పష్టమైంది. లీడ్స్ టెస్ట్లో తమ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై రూట్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ తమకు మంచి గుణపాఠం నేర్పిందని, ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లకుండా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తామని అన్నాడు. స్లెడ్జింగ్కు కానీ వ్యక్తిగత విమర్శల జోలికి కానీ వెళ్లకుండా తమ సహజసిద్ధమైన ఆటను నిజాయితీగా ఆడతామని పేర్కొన్నాడు. కెప్టెన్గా విఫలమైయ్యాడని తనపై వస్తున్న విమర్శలపై రూట్ స్పందిస్తూ.. సందర్భానుసారంగా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో తాను విఫలమయ్యానని, కెప్టెన్సీ విషయంలో తాన ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్ ఓటమి నుంచి ఇప్పటికే తేరుకున్నామని, తదుపరి మ్యాచ్ల్లో తప్పక పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మూడో టెస్ట్లో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు. డామ్ సిబ్లీ స్థానంలో డేవిడ్ మలాన్, గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో సకిబ్ మహమూద్ జట్టులోకి వస్తారని వెల్లడించాడు. మూడో మార్పుపై ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా, టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 151 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డ్రా చేసుకునే మ్యాచ్ను ఇంగ్లండ్ చేజేతులారా పోగొట్టుకుంది. ఇంగ్లీష్ ప్లేయర్లు పంతాలకు పోయి మూల్యం చెల్లించుకున్నారు. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. చదవండి: ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్కే ఫ్యాన్స్ -
అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం..
లండన్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్లో మరో 5 వికెట్లు తీస్తే.. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్గా రికార్డు నెలకొల్పనున్నాడు. 2018లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటి వరకూ 22 టెస్ట్ల్లో 22.62 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా ఆరు సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం కపిల్ దేవ్ టాప్లో ఉన్నాడు. కపిల్.. 25 టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ను అందుకోగా, ఇప్పుడు ఆ రికార్డుపై బుమ్రా కన్నేశాడు. లీడ్స్ టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 23 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి బౌలర్గా కపిల్ రికార్డును తిరగరాయనున్నాడు. ఇదిలా ఉంటే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమాన్ పేరిట నమోదై ఉంది. జార్జ్.. కేవలం 16 టెస్ట్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో పాక్ స్పిన్నర్ యాసిర్ షా(17 టెస్ట్ల్లో) రెండో స్థానంలో ఉండగా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(18 టెస్ట్ల్లో) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో 5 టెస్ట్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. మూడో టెస్ట్లోనూ విజయఢంకా మోగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లీడ్స్కు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు -
పుజారాను తప్పించి సూర్యకుమార్కు అవకాశం ఇవ్వండి..
ముంబై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హెడింగ్లే వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియాలో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ డిమాండ్ చేశాడు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా నయా వాల్ పుజారాను తప్పించి, డాషింగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన పుజారా స్థానంలో సూర్యకుమార్ను తుది జట్టులో ఆడిస్తే భారత విజయావకావాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డాడు. పుజారా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ భారత టాప్ ఆర్డర్పై ఒత్తిడి తెస్తున్నాడని, అతని స్థానంలో వేగంగా పరుగులు చేయగల సూర్యను ఆడిస్తే టపార్డర్పై భారం తగ్గుతుందని పేర్కొన్నాడు. పుజారా సహా రహానే కూడా ప్రస్తుతం ఫామ్ లేమితో సతమవుతున్నారని, ఆడిన మ్యాచ్ల్లో కూడా నిదానంగా పరుగులు చేస్తూ జట్టుకు నిరుపయోగంగా మారారని విమర్శించాడు. పుజారా, రహానే క్లాస్ ప్లేయర్లే అయ్యిండొచ్చు కానీ, సూర్యకుమార్ ఓ మ్యాచ్ విన్నర్ అని ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ వేగంగా పరుగులు సాధించడంతో పాటు మిడిలార్డర్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగల సమర్ధుడని కితాబునిచ్చాడు. అందుకే పుజారా, రహానేల్లో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇంగ్లండ్లోని భారత్ జట్టుతో చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి మరీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లను ఇంగ్లండ్కి పిలిపించాడు. అయితే, లార్డ్స్ టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దాంతో పృథ్వీ షా మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అయితే పుజారా స్లో ఇన్నింగ్స్లపై గుర్రుగా ఉన్న టీమిండియా మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్కి టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చదవండి: ఫవాద్ ఆలామ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్ -
మూడో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..!
లండన్: టీమిండియాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లీష్ పేసర్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్ట్కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. అయితే మార్క్ వుడ్ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును తాజాగా వుడ్కు తగిలిన గాయం మరింత కలవరపెడుతోంది. భారత్తో ఐదు టెస్ట్ల సిరీస్లో రెండు టెస్ట్ల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..! -
మూడో టెస్టుకు మలాన్
లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ మూడో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్ సిబ్లీని 15 మంది సభ్యుల జట్టునుంచి తప్పించి డేవిడ్ మలాన్ను ఎంపిక చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడిన మలాన్... తాజా సీజన్లో ఒకే ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడి 199 పరుగులు చేశాడు. అయితే ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నంబర్వన్ స్థానంలో ఉన్న మలాన్ దూకుడైన బ్యాటింగ్ శైలి తమ జట్టుకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఇంగ్లండ్ అతడిని టెస్టులోకి ఎంచుకునే సాహసం చేసింది. ఆగస్టు 25నుంచి లీడ్స్తో మూడో టెస్టు జరుగుతుంది. రెండో స్థానానికి రూట్ దుబాయ్: భారత్తో జరుగుతున్న సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (893 రేటింగ్ పాయింట్లు) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రూట్... రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్టీవ్ స్మిత్ (891), లబ్షేన్ (878)లను వెనక్కి తోసి అగ్ర స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన(901) టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. టాప్–10లో భారత్నుంచి కోహ్లి, రోహిత్, పంత్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్ (848 పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, జస్ప్రీత్ బుమ్రా 9నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా కూడా ఒక స్థానం దిగజారి 3వ ర్యాంక్కు చేరుకోగా, అశ్విన్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఇషాంత్ శర్మ శతకం
సుమారు 13 సంవత్సరాల క్రితం... 19 ఏళ్ల కుర్రాడొకడు పేస్కు స్వర్గధామంలాంటి పెర్త్ పిచ్పై ప్రపంచ టాప్ బ్యాట్స్మన్ రికీ పాంటింగ్ను గడగడలాడించాడు. ఏడు ఓవర్ల స్పెల్లో దాదాపు ప్రతీ బంతికి పాంటింగ్ తడబడ్డాడు. ఎంతో మంది దిగ్గజ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆసీస్ కెప్టెన్, కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ఆ పేసర్ బంతులను ఎలా ఆడాలో అర్థం కాని గందరగోళంలో పడి చివరకు స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే క్రికెట్ వ్యాఖ్యాతలంతా ఈ మ్యాచ్ లేదా సిరీస్ ఫలితం ఏమైనా కానీ... ఈ అద్భుత స్పెల్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆ పేసర్ కెరీర్లో ఎంతో ఎదుగుతాడని వ్యాఖ్యానించారు. నిజంగా అదే జరిగింది. ఆ స్పెల్ వేసిన ఇషాంత్ శర్మ స్థాయిని అమాంతం పెంచేసింది. ఆపై ఎన్నో ఆటుపోట్లను తట్టుకొన్న అతను భారత్ తరఫున అగ్రశ్రేణి బౌలర్గా ఎదిగాడు. తనతో పోటీ పడిన ఎందరికో సాధ్యంకాని రీతిలో 100 టెస్టుల మైలురాయిని ఇంగ్లండ్తో బుధవారం అహ్మదాబాద్లో మొదలయ్యే మూడో టెస్టులో చేరుకోబోతున్నాడు. సాక్షి క్రీడా విభాగం: ఇషాంత్ శర్మ 2011లో మొదటిసారి తన కెరీర్ లక్ష్యాల్లో 100 టెస్టులు ఆడటం ఒకటని చెప్పుకున్నాడు. అప్పటికి అతను ఇంకా 40 టెస్టులు కూడా పూర్తి చేసుకోలేదు. ఆపై వరుస గాయాలు, ఫామ్ కోల్పోవడం, కొత్త పేస్ బౌలర్ల రాక... ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినాసరే మరో దశాబ్ద కాలపు కెరీర్ను కొనసాగించగలగడం ఒక ఫాస్ట్ బౌలర్ కోణంలో చూస్తే సాధారణ విషయం కాదు. తన మార్గదర్శి జహీర్ ఖాన్ 92 టెస్టులతో ఆగిపోయిన చోట... ఇషాంత్ మాత్రం అతడిని దాటి వంద వరకు రాగలిగాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, హై ఆర్మ్ యాక్షన్, అసలైన ఫాస్ట్ బౌలర్ లక్షణాలతో కెరీర్ ప్రారంభించిన ‘లంబూ’ భారత జట్టు సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్గా నిలవడం అంటేనే ఇషాంత్ ఘనత ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ఘనారంభం... తన రెండో టెస్టు మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇషాంత్ కెరీర్ జోరుగానే ప్రారంభమైంది. ‘పెర్త్–పాంటింగ్’ మెరుపు బౌలింగ్ తర్వాత ధోని టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన తొలి మ్యాచ్లోనే అతను మరోసారి ఐదు వికెట్లు తీసి కెప్టెన్ ఫేవరెట్గా మారాడు. ఆపై కొద్ది రోజులకే స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో కూడా 15 వికెట్లతో సత్తా చాటాడు. అయితే జట్టులో రెండో ప్రధాన పేసర్గా జహీర్తో కూడా జట్టుకు కీలక విజయాలు అందిస్తున్న సమయంలో ఇషాంత్ బౌలింగ్ లయ తప్పింది. అప్పటి వరకు అతని బలమైన పేస్ బలహీనతగా మారిపోయింది. దాదాపు 150కు పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నుంచి 130ల్లోకి పడిపోయాడు. ఫలితంగా ప్రత్యర్థుల దృష్టిలో సాధారణ బౌలర్గా మారిపోవడంతో ఒకవైపు వికెట్లు రాకపోగా, మరోవైపు సాధారణ బౌలర్ తరహాలో టెస్టుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్న పరిస్థితి. ముఖ్యంగా 2012 ఆస్ట్రేలియా పర్యటన అతని కెరీర్లో చేదు జ్ఞాపకంగా మిగిపోయింది. నాలుగు టెస్టుల్లో కలిపి ఐదంటే ఐదే వికెట్లు తీసి గత సిరీస్లో హీరోగా మారిన చోట జీరోలా కనిపించాడు. ఏదోలా 50 టెస్టులు పూర్తి చేసుకున్నా... కనీసం 50 టెస్టులు ఆడిన బౌలర్లలో అందరికంటే చెత్త బౌలింగ్ సగటు ఇషాంత్దే కనిపించింది. మళ్లీ సత్తా చాటి... కెరీర్ ప్రమాదంలో పడిన దశలో ఇషాంత్ దానిని చక్కదిద్దుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ముఖ్యంగా తనను ఇబ్బంది పెడుతున్న ఫిట్నెస్ సమస్యపై దృష్టి పెట్టాడు. పైగా పరిమిత ఓవర్లకు దాదాపుగా గుడ్బై చెప్పి పూర్తిగా ఎరుపు బంతిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సహజంగానే ఫలితాలు వచ్చాయి. 2014 న్యూజిలాండ్ పర్యటన అతడికి మేలిమలుపు. రెండు టెస్టుల్లోనే 15 వికెట్లు తీసిన ఇషాంత్ బౌలింగ్లో పదును పెరిగిందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్పై 74 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన ప్రదర్శన అతని కెరీర్లో హైలైట్గా నిలిచింది. అతని బౌలింగ్ వల్లే ఈ సిరీస్లో భారత్ తన ఏకైక టెస్టును గెలవగలిగింది. ఆ తర్వాత ఇషాంత్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కీలక సమయాల్లో కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది. ఇప్పుడున్న తరహాలో టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు వైఫల్యాలు వచ్చినా... సీనియర్ హోదాలో ఇషాంత్ అనేక టెస్టులు ఆడగలిగాడు. మరింత మెరుగవుతూ... గత కొన్నేళ్లలో ఇషాంత్ కెరీర్ గణాంకాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ససెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడినప్పుడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ ఇచ్చిన సూచనలు ఇషాంత్ ఆటను రాటుదేల్చాయి. 2018 నుంచి చూస్తే కమిన్స్, అండర్సన్లకంటే మెరుగ్గా ఇషాంత్ సగటు అద్భుత రీతిలో 19.34 మాత్రమే ఉందంటే అతను ఎంతగా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. సుదీర్ఘ కెరీర్లో పలు ప్రతికూలతలు అధిగమించి కృషి, పట్టుదల, సంకల్పంతో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన ఇషాంత్ శర్మ వంద టెస్టులు ఆడటం పేసర్లకు స్ఫూర్తినిచ్చే, గర్వపడే క్షణం అనడంలో సందేహం లేదు. -
అశ్విన్, విహారి వీరోచిత ప్రదర్శన
భారత జట్టు మ్యాచ్ గెలవలేదు... కానీ గెలిచినంత ఆనందాన్ని పంచింది... ఐదు రోజులు ఆడిన తర్వాత స్కోరు బోర్డు చూస్తే ‘డ్రా’గానే కనిపించవచ్చు... కానీ ఆట ఆఖర్లో కనిపించిన ఉత్కంఠ, ఉద్వేగాలు అక్షరాల రూపంలో రాయలేనివి... ఇక ఈ మ్యాచ్ను కాపాడుకోవడం కష్టం అనిపించిన క్షణం నుంచి ఇద్దరు ఆటగాళ్లు చూపించిన పట్టుదల, తెగువ నభూతో... సరిగ్గా నిలబడేందుకు కూడా ఇబ్బంది పడుతున్న బ్యాట్స్మన్ ఒకవైపు... పరుగు సంగతి దేవుడెరుగు, నడవడమే కష్టంగా అనిపించిన బ్యాట్స్మన్ మరోవైపు... తమలో ఒకరు వెనుదిరిగినా పెవిలియన్లో కట్టుతో కూర్చున్న ఆటగాడి నుంచి ఏమీ ఆశించలేని పరిస్థితిలో వారిద్దరు ఏకంగా 42.4 ఓవర్ల పాటు (256 బంతులు) పోరాడారు. జట్టును ఓటమి నుంచి రక్షించి సగర్వంగా నిలబడ్డారు. సెంచరీలు సాధించకపోయినా సరే... సిడ్నీ మైదానం ఎప్పటికీ మరచిపోలేని విధంగా హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్లు తమ పేర్లతో ప్రత్యేక ముద్ర వేశారు. ఐదు వికెట్లు తీసిన తర్వాత గెలుపు సంబరాలు ఎంతో దూరంలో లేవని భావించిన ఆసీస్ కలలు ఈ ఇద్దరి పోరాటం ముందు భ్రమలుగా తేలిపోయాయి. అందుబాటులో ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ఉపయోగించినా ఫలితం దక్కక ఆతిథ్య జట్టు ‘డ్రా’తో బిక్క మొహం వేసింది. సిరీస్ విజేతను తేల్చే తుది సమరం కోసం బ్రిస్బేన్ బయల్దేరడానికి ముందు ఏ జట్టు ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోందో కొత్తగా చెప్పాలా! సిడ్నీ: అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కీలక సమరంలో ఓటమిని తప్పించుకుంది. ఆస్ట్రేలియాతో సోమవారం మూడో టెస్టును ‘డ్రా’గా ముగించిన టీమిండియా సిరీస్లో 1–1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్లో నిలిచి ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన స్టీవ్ స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. పంత్ మెరుపులు... ఐదో రోజు ఆట రెండో ఓవర్లోనే భారత్కు షాక్ తగిలింది. లయన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన కెప్టెన్ రహానే (18 బంతుల్లో 4) షార్ట్లెగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ప్రమోట్ అయి ఐదో స్థానంలో బరిలోకి దిగిన రిషభ్ పంత్ తన సహజ ధోరణిలో చెలరేగిపోయాడు. మరోవైపు పుజారా పట్టుదలగా నిలబడి వికెట్ కాపాడే ప్రయత్నం చేయడంతో పంత్కు ధాటిగా ఆడే అవకాశం కలిగింది. ముఖ్యంగా లయన్ బౌలింగ్లో అతను ఎదురుదాడి చేసిన తీరు ఆకట్టుకుంది. ఒక ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన పంత్... అతని తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.కొంత విరామం తర్వాత లయన్ బౌలింగ్లోనే వరుసగా లాంగాఫ్, లాంగాన్ మీదుగా రెండు భారీ సిక్సర్లు బాది 64 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా కొన్ని చక్కటి ఫోర్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్లో పుజారా రెండో హాఫ్ సెంచరీని (170 బంతుల్లో) అందుకున్నాడు. అనంతరం తొమ్మిది బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టిన పంత్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే చివరకు లయన్దే పైచేయి అయింది. అతని బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ గల్లీలో కమిన్స్కు చిక్కాడు. మరో ఎండ్లో కమిన్స్ కొత్త బంతిని వరుసగా మూడుసార్లు బౌండరీకి తరలించిన పుజారా... హాజల్వుడ్ వేసిన చక్కటి బంతికి క్లీన్బౌల్డయ్యాడు. ఈ దశలో జట్టు ప్రమాదంలో పడినట్లు కనిపించినా... అశ్విన్, విహారి అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. \స్మిత్ ఏమిటిలా? డ్రింక్స్ విరామ సమయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా స్మిత్ చేసిన చర్య చర్చకు దారి తీసింది. పంత్ క్రీజ్ నుంచి పక్కకు వెళ్లిన సమయంలో క్రీజ్పైకి వచ్చిన స్మిత్...షాడో ప్రాక్టీస్ చేస్తూ ఆపైతన కాలితో బ్యాట్స్మన్ గార్డ్ మార్క్ను చెరిపేస్తున్న వీడియో బయట పడింది. తర్వాత పంత్ వచ్చి మళ్లీ మార్క్ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇది కావాలని పంత్ ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నమా, లేక రొటీన్గా నిబంధనలకు లోబడి అతను అలా చేశాడా అనేది అర్థం కాలేదు. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత లేదు కానీ కొందరు మాజీలు అతని చర్యను విమర్శించారు. మోసగాడు ఎప్పటికీ మోసగాడే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. విహారి ఇన్నింగ్స్ సెంచరీతో సమానం. అతను గర్వపడే ప్రదర్శన ఇది. నాకు బ్యాటింగ్లో అచ్చొచ్చిన సిడ్నీ మైదానంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. కమిన్స్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇద్దరం గాయాలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏకాగ్రత కోల్పోరాదని గట్టిగా అనుకున్నాం. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. –అశ్విన్ టెస్టు మ్యాచ్ చివరి రోజు బ్యాటింగ్ చేసి ఇలా జట్టును కాపాడటం ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. గెలిచి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. ఆట ముగిసిన తర్వాత కూడా మా ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు. –విహారి ‘మ్యాచ్ ‘డ్రా’నే అయినా మేం ఆడిన పరిస్థితులను బట్టి చూస్తే ఇది మాకు విజయంతో సమానం. ఫలితం గురించి ఆలోచించకుండా మేం చివరి వరకు పోరాడాలని భావించాం. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. విహారి, అశ్విన్ చూపిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. వెస్టిండీస్లో చేసిన సెంచరీకంటే విహారి ఈ ఇన్నింగ్సే అత్యుత్తమం. కఠిన పరిస్థితుల్లో గాయంతో అతను చూపిన పట్టుదల నిజంగా ఎంతో ప్రత్యేకం. పంత్ కూడా చాలా బాగా ఆడాడు. లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసమే అతడిని ముందుగా పంపాం. వీరిద్దరు ఉన్నంత వరకు విజయంపై దృష్టి పెట్టాం. ఆ తర్వాతే ‘డ్రా’ గురించి ఆలోచించాం. చివరి ఐదు–ఆరు ఓవర్లలో మాత్రం ఒక్కో బంతిని లెక్క పెడుతూ వచ్చాం. –రహానే, భారత కెప్టెన్ ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. గత రెండు మ్యాచ్లతో పోలిస్తే ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా ఫలితం దక్కలేదు. –పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; గిల్ (సి) పైన్ (బి) హాజల్వుడ్ 31; పుజారా (బి) కమిన్స్ 77; రహానే (సి) వేడ్ (బి) లయన్ 4; పంత్ (సి) కమిన్స్ (బి) లయన్ 97; విహారి (నాటౌట్) 23; అశ్విన్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 11, మొత్తం (131 ఓవర్లలో 5 వికెట్లకు) 334 వికెట్ల పతనం: 1–71, 2–92, 3–102, 4–250, 5–272. బౌలింగ్: స్టార్క్ 22–6–66–0, హాజల్వుడ్ 26–12–39–2, కమిన్స్ 26–6–72–1, లయన్ 46–17–114–2, గ్రీన్ 7–0–31–0, లబ్షేన్ 4–2–9–0. -
మరో ‘మంకీ’ వివాదం– సిరాజ్, బుమ్రాలను దూషించిన ప్రేక్షకులు
మూడో టెస్టు సందర్భంగా అనూహ్య వివాదం చోటు చేసుకుంది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇద్దరు భారత క్రికెటర్లు బుమ్రా, సిరాజ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ అభిమాని ఒకరు సిరాజ్ను ‘మంకీ’గా సంబోధించినట్లు తెలిసింది. 2007–08 సిరీస్లో ఇదే మైదానంలో జరిగిన ‘మంకీ గేట్’ ఉదంతాన్ని ఇది గుర్తు చేసింది. దీనిపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సెక్యూరిటీ అధికారులు, అంపైర్లతో భారత బృందం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. -
సిడ్నీ టెస్టులో భారత్ తడబాటు
ఆస్ట్రేలియా చేతిలో మూడో టెస్టులో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ప్రత్యర్థికంటే మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరుకు బాటలు వేసుకున్న టీమిండియా బ్యాట్స్మెన్ వైఫల్యంతో కుప్పకూలింది. ఆసీస్ పేస్ త్రయం పదునైన బౌలింగ్ను ఎదుర్కోలేక మన ఆటగాళ్లు చేతులెత్తేసి భారీ ఆధిక్యం సమర్పించుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 197 పరుగులకు పెంచుకుంది. ఆదివారం కనీసం రెండు సెషన్లలో మరిన్ని పరుగులు జోడించి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కఠినంగా మారిపోయే చోట మనోళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ముందంజ వేసే లక్ష్యంతో ఉన్న ఆస్ట్రేలియా అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. భారత్తో మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబ్షేన్ (47 బ్యాటింగ్), స్మిత్ (29 బ్యాటింగ్) క్రీజ్లో ఉండగా... ఓవరాల్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. 35 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (13), పకోవ్స్కీ (10)లను భారత్ అవుట్ చేసినా... లబ్షేన్, స్మిత్ మూడో వికెట్కు అజేయంగా 68 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (176 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్ కమిన్స్కు 4 వికెట్లు దక్కాయి. విహారి విఫలం... భారీ స్కోరు సాధించే ఆశలతో మూడో రోజు ఆటలో బరిలోకి దిగిన భారత్కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే కమిన్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కెప్టెన్ రహానే (22) వెనుదిరిగాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ (67 బంతుల్లో 36; 4 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. 14 పరుగుల వద్ద అతని అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్ కోరగా, ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చింది. అయితే కమిన్స్ బౌలింగ్లో గాయమైన తర్వాత ఏకాగ్రత చెదిరిన పంత్, మరో పది బంతులకే స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్కోరు వద్ద భారత్ పుజారా వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు భారత వికెట్లు తీసేందుకు ఆసీస్కు ఎక్కువ సమయం పట్టలేదు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా... మరో ఎండ్లో రవీంద్ర జడేజా (37 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో ఒంటరి పోరాటం చేయడంతో ప్రత్యర్థి ఆధిక్యం వంద పరుగుల లోపు పరిమితమైంది. మూడు రనౌట్లు... భారత జట్టు పతనంలో రనౌట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్మెన్ రనౌట్గా వెనుదిరిగారు. 37 బంతుల్లో 4 పరుగులే చేయగలిగిన విహారి ఒత్తిడిలో అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి వెనుదిరగాల్సి వచ్చింది. లయన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి మిడాఫ్ దిశగా షాట్ ఆడిన అతను అదే ఊపులో సింగిల్ పూర్తి చేసేందుకు ఉపక్రమించాడు. అయితే హాజల్వుడ్ విసిరిన డైరెక్ట్ త్రో వికెట్లను కూల్చింది. తర్వాతి వంతు అశ్విన్ది. గ్రీన్ బౌలింగ్లో జడేజా షాట్ ఆడి సింగిల్ కోసం పిలవగా... కాస్త అలసత్వంతో పరుగెత్తిన అశ్విన్ (10) అవతలి ఎండ్కు చేరలేక పెవిలియన్ బాట పట్టాడు. బుమ్రాతోనూ ఇలాగే జరిగింది. స్టార్క్ బౌలింగ్లో జడేజా షాట్ ఆడి స్ట్రయికింగ్ కాపాడుకునేందుకు లేని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే లబ్షేన్ విసిరిన త్రో నాన్స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లను పడగొట్టడంతో బుమ్రా ఆట ముగిసింది. 2008లో మొహాలీ టెస్టు (ఇంగ్లండ్తో) తర్వాత ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్ కావడం ఇదే తొలిసారి. జడేజా, పంత్లకు గాయాలు భారత జట్టును గాయాల బెడద వీడట్లేదు. కొత్తగా ఈ జాబితాలో జడేజా, పంత్ చేరారు. కమిన్స్ బౌలింగ్లో పంత్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా... బంతి అతని ఎడమ మోచేతిని బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన అతను స్వల్ప చికిత్స అనంతరం ఆటను కొనసాగించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. గాయం తీవ్రత తక్కువే కావడం ఊరట కలిగించగా... ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో అతనికి బదులు సాహా కీపింగ్ చేశాడు. అవసరమైతే పంత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడు. ఇన్నింగ్స్ చివర్లో స్టార్క్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కొనే క్రమంలో జడేజా ఎడమ చేతి బొటన వేలుకు బలమైన దెబ్బ తగిలింది. విలవిల్లాడిన జడేజాకు కూడా చికిత్స చేసిన తర్వాత స్కానింగ్కు పంపారు. జడేజా గాయం మాత్రం భారత్కు నష్టం కలిగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... అతని వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. జడేజా గ్లవ్ తొడిగి బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. అన్నింటికి మించి అది అతని బౌలింగ్ చేయి కావడంతో ఈ మ్యాచ్తో పాటు చివరి టెస్టులో కూడా జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 29 ఓవర్లు ఆడినా జడేజా బౌలింగ్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి అండ్ బి) హాజల్వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 50; రహానే (బి) కమిన్స్ 22; విహారి (రనౌట్) 4; పంత్ (సి) వార్నర్ (బి) హాజల్వుడ్ 36; జడేజా (నాటౌట్) 28; అశ్విన్ (రనౌట్) 10; సైనీ (సి) వేడ్ (బి) స్టార్క్ 3; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ (సి) పైన్ (బి) కమిన్స్ 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 244 వికెట్ల పతనం: 1–70, 2–85, 3–117, 4–142, 5–195, 6–195, 7–206, 8–210, 9–216, 10–244. బౌలింగ్: స్టార్క్ 19–7–61–1, హాజల్వుడ్ 21–10–43–2, కమిన్స్ 21.4–10–29–4, లయన్ 31–8–87–0, లబ్షేన్ 3–0–11–0, గ్రీన్ 5–2–11–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; పకోవ్స్కీ (సి) (సబ్) సాహా (బి) సిరాజ్ 10; లబ్షేన్ (బ్యాటింగ్) 47; స్మిత్ (బ్యాటింగ్) 29; ఎక్స్ట్రాలు 4; మొత్తం (29 ఓవర్లలో 2 వికెట్లకు) 103 వికెట్ల పతనం: 1–16, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–26–0, సిరాజ్ 8–2–20–1, సైనీ 7–1–28–0, అశ్విన్ 6–0–28–1. ► పుజారా అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. పుజారా కెరీర్లో ఇదే నెమ్మదైన అర్ధ సెంచరీ. 2018లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్బర్గ్లో జరిగిన టెస్టులో పుజారా173 బంతులు ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. ► అశ్విన్ బౌలింగ్లోవార్నర్ అవుటవ్వడం ఇది పదోసారి. వార్నర్ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ది రెండో స్థానం. స్టువర్ట్ బ్రాడ్ (10 సార్లు) తొలి స్థానంలో... అండర్సన్ (8 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. -
ఆ చేతికి తిరుగు లేదు!
ఆల్రౌండర్గా తానేమిటో మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్న రవీంద్ర జడేజా శుక్రవారం మరోసారి తన ‘మూడో కన్ను’ తెరిచాడు. ఆసీస్ పటిష్ట స్థితిలో రోజును ప్రారంభించిన తర్వాత 4 వికెట్లతో సత్తా చాటిన అతను ఇన్నింగ్స్ చివరి బంతికీ తన ముద్ర చూపించాడు. బుమ్రా బంతిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన స్మిత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే జడేజా మెరుపు వేగం ముందు అది సాధ్యం కాలేదు. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి 25 గజాల దూరం పరుగెత్తుకొచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకొని 35 గజాల దూరంలో ఒకే ఒక స్టంప్ కనిపిస్తుండగా... జడేజా డైరెక్ట్ త్రోను వికెట్లను గిరాటేసి స్మిత్ను రనౌట్ చేసిన తీరు అద్భుతం. మరే ఫీల్డర్ ఉన్నా ఇది సాధ్యం కాకపోయేదనేది వాస్తవం. జట్టులో జడేజా ఉండటం వల్ల వచ్చే అదనపు విలువ ఏమిటో అతని ఈ ఫీల్డింగ్ ప్రదర్శన చూపించింది. ‘ఈ రనౌట్ను నేను మళ్లీ మళ్లీ చూసుకొని సంతోషిస్తాను. ఇది నా అత్యుత్తమ ప్రదర్శన. 30 గజాల సర్కిల్ బయటి నుంచి ఇలాంటి ఫలితం రాబట్టడం ఎంతో గొప్ప విషయం. మూడు, నాలుగు వికెట్ల తీసిన ప్రదర్శనతో పోలిస్తే ఇది ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది’ అని జడేజా వ్యాఖ్యానించాడు. -
మనదే పైచేయి...
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రెండో రోజు భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (101 బంతుల్లో 50; 8 ఫోర్లు), రోహిత్ శర్మ (26) తొలి వికెట్కు 70 పరుగులు జోడించి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (9 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. భారత్ మరో 242 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 166/2తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్షేన్ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. జడేజా జోరు... భారీ స్కోరు లక్ష్యంగా రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా స్మిత్ మినహా మిగతా వారంతా పరుగులు చేయడానికి ఇబ్బంది పడి ఒత్తిడిలో వికెట్లు చేజార్చుకున్నారు. శుక్రవారం 11 ఓవర్ల ఆట తర్వాత వానతో స్వల్ప విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న లబ్షేన్ను చక్కటి బంతితో అవుట్ చేసి జడేజా 100 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్లోనే ముందుకొచ్చి ఆడబోయి వేడ్ (13) వెనుదిరిగాడు. ఈ దశలో వర్షం కారణంగా మళ్లీ 23 నిమిషాలు ఆట సాగలేదు. అనంతరం కొత్త బంతితో బుమ్రా చెలరేగిపోయాడు. గ్రీన్ (0)ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న అతను... కెప్టెన్ పైన్ (1) స్టంప్స్ను ఎగరగొట్టాడు. కమిన్స్ (0) కూడా పెవిలియన్ చేరడంతో ఆసీస్ కష్టాలు పెరిగాయి. ఈ దశలో మిషెల్ స్టార్క్ (30 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడి స్మిత్కు సహకరించాడు. అయితే స్టార్క్ను షార్ట్ బంతితో సైనీ అవుట్ చేసిన తర్వాత ఆసీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రోహిత్ వర్సెస్ లయన్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగిన రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్స్పిన్నర్ లయన్తో అతని పోరు ఆసక్తికరంగా సాగింది. లయన్ తొలి ఆరు ఓవర్లను పూర్తిగా రోహిత్ ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఈ 42 బంతుల్లో ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించగా... 4 మెయిడిన్ ఓవర్లు వేసిన లయన్ 14 పరుగులు ఇచ్చాడు. లయన్ రెండో ఓవర్లోనే ముందుకు దూసుకొచ్చి లాంగాన్ మీదుగా రోహిత్ భారీ సిక్సర్ కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై రోహిత్కు 100వ సిక్సర్ కావడం విశేషం. అదే ఓవర్లో రోహిత్ మరో ఫోర్ కూడా కొట్టాడు. రోహిత్ స్కోరు 24 వద్ద అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో లయన్లో ఆనందం కనిపించింది. అయితే రివ్యూలో అది నాటౌట్గా తేలింది. చివరకు హాజల్వుడ్ బౌలింగ్లో అతనికే సునాయాస క్యాచ్ ఇచ్చి భారత ఓపెనర్ వెనుదిరిగాడు. శుక్రవారం 30వ పుట్టిన రోజు జరుపుకున్న హాజల్వుడ్కు ఇది 300వ అంతర్జాతీయ వికెట్. గిల్ వర్సెస్ కమిన్స్ తన తొలి టెస్టులోనే చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్న శుబ్మన్ గిల్ దానిని ఇక్కడా కొనసాగించాడు. ముఖ్యంగా వరల్డ్ నంబర్వన్ బౌలర్ కమిన్స్ను అతను సమర్థంగా ఎదుర్కొన్న తీరు అభినందనీయం. కమిన్స్ తొలి 7 ఓవర్లను గిల్ ఒక్కడే ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్లో పడిన షార్ట్ బంతిని చివరి క్షణంలో పాయింట్ దిశగా ఆడి అతను బౌండరీగా మలచిన షాట్ ఇన్నింగ్స్కే ఆకర్షణగా నిలిచింది. స్టార్క్, లయన్ బౌలింగ్లలో కూడా గిల్ చూడచక్కటి ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో 100 బంతుల్లో అతను తన కెరీర్ తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్లోనే గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇద్దరూ ఓపిగ్గా... శుభారంభం తర్వాత 15 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఆత్మ రక్షణలో పడింది. మరో వికెట్ చేజార్చుకుంటే జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో పుజారా, రహానే చాలా జాగ్రత్తగా ఆడారు. పరుగులు తీయడంకంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా 12.5 ఓవర్లలో వీరిద్దరు 11 పరుగులు మాత్రమే జోడించగలిగారు! ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్ను కొనసాగిస్తూ ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం కూడా దీనికి కారణం. స్మిత్ సూపర్...! ‘స్టీవ్ స్మిత్కు నేను కోచింగ్ ఇవ్వడం ఏమిటి... తనకు తానే అతను కోచింగ్ ఇచ్చుకుంటాడు. అదే అన్నింటికంటే బాగా పని చేస్తుంది చూడండి’... సిడ్నీ టెస్టు ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి స్మిత్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతను సాధించిన పరుగులు, రికార్డులు దానిని చూపిస్తాయి. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో ఒక్కసారిగా అతనిపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లో అతను అవుటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. అయితే గొప్ప ఆటగాళ్లు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరని స్మిత్ తన ఇన్నింగ్స్తో నిరూపించాడు. మొదటి రోజున ఆత్మవిశ్వాసంతో ఆడి 31 పరుగులతో ముగించిన అతను... శుక్రవారం బుమ్రా బౌలింగ్లో చూడచక్కటి కవర్ డ్రైవ్ బౌండరీతో మొదలు పెట్టాడు. ఆకట్టుకునే డ్రైవ్లు, తనదైన ట్రేడ్మార్క్ ఫ్లిక్ షాట్లతో చకచకా దూసుకుపోయాడు. భారత్ కొత్త బంతి తీసుకునే సమయానికి 142 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 7 బంతులను మాత్రమే అవీ ఆఫ్ స్టంప్కు దూరంగా వెళుతున్న వాటినే వదిలేశాడంటే అతను ఎంత సాధికారికంగా ఆడాడో చెప్పవచ్చు. సైనీ బౌలింగ్లో స్క్వేర్ లెగ్ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో 201 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో ఇది 27వ శతకం కాగా, భారత్పై ఎనిమిదోది. సెంచరీ మార్క్ చేరగానే అతను భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. గాల్లోకి బ్యాట్కు పంచ్లు విసురుతూ సింహనాదం చేయడం చూస్తే అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అర్థమవుతుంది. సెంచరీ తర్వాతా స్మిత్ జోరు చూస్తే అతడిని అవుట్ చేయడం ఇక ఏ భారత బౌలర్ వల్ల కాదనిపించింది. చివరకు అదే జరిగినట్లు రనౌట్తో మాత్రమే అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 106 పరుగులు చేస్తే అందులో స్మిత్ చేసినవే 71 పరుగులు ఉండటం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్స్కీ (ఎల్బీ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్షేన్ (సి) రహానే (బి) జడేజా 91; స్మిత్ (రనౌట్) 131; వేడ్ (సి) బుమ్రా (బి) జడేజా 13; గ్రీన్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; పైన్ (బి) బుమ్రా 1; కమిన్స్ (బి) జడేజా 0; స్టార్క్ (సి) గిల్ (బి) సైనీ 24; లయన్ (ఎల్బీ) (బి) జడేజా 0; హాజల్వుడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 338 వికెట్ల పతనం: 1–6, 2–106, 3–206, 4–232, 5–249, 6–255, 7–278, 8–310, 9–315, 10–338. బౌలింగ్: బుమ్రా 25.4–7–66–2, సిరాజ్ 25–4–67–1, అశ్విన్ 24–1–74–0, సైనీ 13–0–65–2, జడేజా 18–3–62–4. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) హాజల్వుడ్ 26; గిల్ (సి) గ్రీన్ (బి) కమిన్స్ 50; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 96 వికెట్ల పతనం: 1–70, 2–85. బౌలింగ్: స్టార్క్ 7–4–19–0, హాజల్వుడ్ 10–5–23–1, కమిన్స్ 12–6–19–1, లయన్ 16–7–35–0 -
తొలిరోజు చేజారింది..
వర్షం...విల్ పకోవ్స్కీ... వికెట్ కీపర్ వైఫల్యం...సంక్షిప్తంగా సిడ్నీ టెస్టు తొలి రోజు ఆట ఇది! గత రెండు టెస్టులకు భిన్నంగా ఆస్ట్రేలియా ఈ సారి కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడగా... మన బౌలింగ్ వైఫల్యం, పంత్ క్యాచ్లు వదిలేయడం వెరసి ప్రత్యర్థిదే పైచేయిగా మారింది. వాన కారణంగా 55 ఓవర్లకే పరిమితమైన ఆటను రెండు అర్ధ సెంచరీలు ప్లస్ ఒక శతక భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టు సంతృప్తిగా ముగించింది. ఇదే జోరుతో రెండో రోజు ఆ జట్టు భారీ స్కోరుపై దృష్టి పెట్టింది. అన్నింటికి మించి సొంత మైదానంలో స్మిత్ ఫామ్లోకి రావడం ఇప్పుడు భారత్ను కాస్త ఆందోళన పెట్టే అంశం. సిడ్నీ: మూడో టెస్టులో కూడా భారత్కు శుభారంభం దక్కినా... రెండు క్యాచ్లు నేలపాలు కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పుంజుకునేందుకు అవకాశం దక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్స్కీ (62; 4 ఫోర్లు), మార్నస్ లబ్షేన్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న లబ్షేన్, స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు) కలిసి మూడో వికెట్కు అభేద్యంగా 60 పరుగులు జోడించారు. వార్నర్ విఫలం గాయంనుంచి కోలుకున్న వార్నర్ను ఆడించడం ద్వారా ప్రత్యర్థిపై అదనపు ఒత్తిడిని పెంచాలనుకున్న వ్యూహం ఆసీస్కు బెడిసికొట్టింది. టెస్టు ఆడే స్థాయి ఫిట్నెస్ లేకపోయినా బరిలోకి దిగిన డాషింగ్ బ్యాట్స్మన్ వార్నర్ (5)ను సిరాజ్ తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్ 4వ) పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్పై నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నేరుగా స్లిప్లో ఉన్న పుజారా చేతుల్లో పడింది. తర్వాత లబ్షేన్ వచ్చాడు. ఆ వెంటే వాన కూడా వచ్చింది. విరామం తర్వాత తిరిగి మొదలైన ఆట ఆస్ట్రేలియాకే అనుకూలంగా సాగింది. ఇటు లబ్షేన్ కుదురుగా ఆడుతుండగా... అటు పంత్ పుణ్యమా అని రెండు లైఫ్లు పొందిన ఓపెనర్ పకోవ్స్కీ అర్ధ సెంచరీతో రాణించాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఎట్టకేలకు పకోవ్స్కీని సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబ్షేన్ అర్ధసెంచరీ స్టీవ్ స్మిత్ వచ్చాక ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. గత మ్యాచ్ల వైఫల్యాల దృష్ట్యా ఈ మ్యాచ్లో అతను పట్టుదలగా ఆడాడు. భారత బౌలర్లు సంధించిన వైవిధ్యమైన బంతులను చక్కగానే ఆకళింపు చేసుకొని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లో తడబాటును అధిగమించి క్రీజులో పాతుకుపోయాడు. లబ్షేన్ కూడా స్మిత్ అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి సెషన్లో ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ రహానే చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. లబ్షేన్ కూడా ఫోర్లతో అదరగొట్టాడు. ఆట నిలిచే సమయానికి వీరిద్దరు అభేధ్యమైన మూడో వికెట్కు 60 పరుగులు జోడించారు. వానొచ్చే... ఆట ఆగే! మ్యాచ్ టైమ్కే మొదలైంది కానీ... కాసేపటికే ముసిరిన వానతో టైమ్ అంతా గడిచిపోయింది. షెడ్యూలు ప్రకారం ఉదయం 10.30 గంటలకు (స్థానిక కాలమానం) ఆట ఆరంభమైంది. ఇంకేం ఆటకు ఢోకా లేదనుకునేంత లోపే పిడుగులా వచ్చి పడింది వాన. ఎనిమిదో ఓవర్లో కురిసిన వాన తొలి సెషన్పై నీళ్లు చల్లింది. తెరిపినివ్వలేకపోవడంతో ఆ వానలోనే లంచ్బ్రేక్ ముగిసింది. ఇక రెండో సెషన్ను అయినా వరుణుడు కరుణిస్తాడేమో అనుకుంటే అంత తేలిగ్గా చినుకులు ఆగలేదు. ఆట మొదలవలేదు. చాలాసేపటికి తెరిపినివ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం) పునఃప్రారంభమైంది. ఓ విధంగా చెప్పాలంటే ఉదయం 11.05 నిమిషాలకు మొదలైన 8వ ఓవర్ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు ముగిసిందన్నమాట. మళ్లీ సరిగ్గా టీ బ్రేక్ సమయంలో చినుకులు కురిసినా నిమిషాల వ్యవధిలోనే ఆగడంతో ఆట కోసం మళ్లీ నిరీక్షించాల్సిన పని లేకపోయింది. పంత్ పదేపదే... వృద్ధిమాన్ సాహా టెస్టుల్లో మంచి వికెట్ కీపర్. సంప్రదాయ ఫార్మాట్లో వికెట్ల వెనుక అతని చురుకుదనం అందరికీ తెలుసు. అయితే బ్యాటింగ్లో సాహాకంటే మెరుగంటూ పంత్కు తుది జట్టులో చోటు లభిస్తోంది. బలమైన ప్రత్యర్థి, కీలకమైన మ్యాచ్లో అప్రమత్తంగా ఉండాల్సిన రిషభ్ పంత్ మూడు ఓవర్ల వ్యవధిలోనే రెండు క్యాచ్ల్ని చేజార్చడం తొలి రోజు భారత్కు సమస్యగా మారింది. 22వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా... పకోవ్స్కీ 26 పరుగుల వద్దే ఉన్నాడు. మెలికలు తిరిగిన ఆఖరి బంతి అతని బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచింది. సునాయాసమైన ఈ క్యాచ్ను పంత్ నేలపాలు చేశాడు. దీంతో అశ్విన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మళ్లీ 25వ ఓవర్ సిరాజ్ వేయగా.. పకోవ్స్కీ గ్లౌజ్ను తాకుతూ వెళ్లిన బంతిని క్యాచ్ అందుకునేందుకు రెండు సార్లు డైవ్చేసి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికీ అతని స్కోరు 32 పరుగులే!.. ఇలా లైఫ్ పొందిన పకోవ్స్కీ ఎట్టకేలకు అర్ధసెంచరీ పూర్తి చేసుకుని అరంగేట్రంలో మెరుగైన ప్రదర్శన కనబరిచి అందరి చేతా అభినందనలు అందుకుంటున్నాడు. నవదీప్ సైనీ బౌలింగ్లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ► భారత్ తరఫున టెస్టుల్లో ఆడిన 299వ ఆటగాడిగా నవదీప్ సైనీ నిలిచాడు. పేసర్ బుమ్రా చేతుల మీదుగా అతను ‘టెస్టు క్యాప్’ను అందుకున్నాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్స్కీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్షేన్ బ్యాటింగ్ 67; స్మిత్ బ్యాటింగ్ 31; ఎక్స్ట్రాలు 1; మొత్తం (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–106. బౌలింగ్: బుమ్రా 14–3–30–0, సిరాజ్ 14–3–46–1, అశ్విన్17–1–56–0, నవ్దీప్ సైనీ 7–0–32–1, జడేజా 3–2–2–0. -
‘సమం’ నుంచి మరో సమరానికి...
అడిలైడ్ టెస్టు ఫలితం తర్వాత భారత జట్టు 0–4కు సిద్ధపడాల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలువురు మాజీ క్రికెటర్లు రెండో మ్యాచ్ తర్వాత మళ్లీ మాట్లాడే సాహసం చేయలేకపోయారు. ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా సాధించిన విజయం అలాంటిది మరి. ఇప్పుడు ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచిన దశలో కొత్త సమరానికి రంగం సిద్ధం కాగా... ప్రత్యర్థితో పోలిస్తే భారత జట్టులోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. మెల్బోర్న్ స్ఫూర్తిని కొనసాగిస్తూ మూడో టెస్టులోనూ గెలవగలిగితే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ సగర్వంగా నిలబెట్టుకోగలుగుతుంది. సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... సిడ్నీలో సీన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. సిడ్నీ: టెస్టు సిరీస్లో పైచేయి సాధించే క్రమంలో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు పోరుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్లో ముందంజ వేస్తుంది. భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే చివరి టెస్టులో ఓడినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలదు. పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా... బలాబలాల్లో ఆతిథ్య జట్టుతో పోలిస్తే రహానే బృందానిదే కాస్త పైచేయిగా ఉంది. ఓపెనర్గా రోహిత్... గత రెండు మ్యాచ్లలాగే ఈసారి కూడా భారత్ తమ తుది జట్టును ఒకరోజు ముందే ప్రకటించింది. గాయం వివాదం... ఫిట్నెస్ పరీక్ష... కఠిన క్వారంటైన్ను దాటి వచ్చిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే స్థానం లభించింది. రోహిత్ కోసం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్పై వేటు పడింది. ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి మయాంక్ 31 పరుగులే చేశాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానంపై కూడా ప్రమాద ఘంటిక మోగినా... రోహిత్ ఓపెనింగ్ చేయాలని మేనేజ్మెంట్ భావించడంతో మయాంక్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. గత ఏడాది ఓపెనర్గా మారిన అనంతరం రోహిత్ ఐదు టెస్టుల్లో మూడు సెంచరీలతో చెలరేగినా... అవన్నీ స్వదేశంలో ఆడినవే. విదేశాల్లో ఇంతవరకు ఓపెనింగ్ చేయని రోహిత్ ఎలా ఆడతాడన్నది చూడాలి. ప్రధాన బ్యాట్స్మన్ పుజారా నుంచి కూడా ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. రహానే బ్యాటింగ్లో కీలకం కానుండగా, విహారికి తన కెరీర్ కాపాడుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు. బౌలింగ్లో 2014 తర్వాత ఇంత తక్కువ అనుభవం ఉన్న పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. బుమ్రా 16 టెస్టులు, సిరాజ్ ఒకే ఒక టెస్టు ఆడగా, నవదీప్ సైనీకి తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో బుమ్రాపై మరింత బాధ్యత పెరిగింది. అయితే స్పిన్నర్ అశ్విన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. జడేజా కూడా తన స్పిన్ పదును చూపిస్తే ఆసీస్ బ్యాట్స్మెన్కు తిప్పలు తప్పవు. పకోవ్స్కీ అరంగేట్రం... గాయంతో తొలి రెండు టెస్టు మ్యాచ్లకు దూరమైన డేవిడ్ వార్నర్ రాకతో ఆసీస్ బలం పెరిగింది. అతను 100 శాతం ఫిట్గా లేకపోయినా ఆడించే ప్రయత్నం చేయడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీతనను చూపిస్తోంది. వార్నర్కు తోడుగా కొత్త కుర్రాడు విల్ పకోవ్స్కీ ఓపెనర్గా రావడం దాదాపుగా ఖాయం. ఈ కొత్త జోడి అందించే ఓపెనింగ్పైనే ఆసీస్ ఇన్నింగ్స్ పురోగతి ఆధారపడి ఉంది. అన్నింటికి మంచి ఆస్ట్రేలియాను ఆందోళనపరుస్తున్న అంశం టాప్ బ్యాట్స్మన్ స్మిత్ ఫామ్. రెండు మ్యాచ్లలోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు సొంత మైదానం సిడ్నీలోనైనా స్మిత్ చెలరేగి జట్టును నడిపించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పింక్ టెస్టు మ్యాచ్... అడిలైడ్ టెస్టు ‘పింక్ బాల్’ టెస్టు కాగా... ఇప్పుడు సిడ్నీలో జరగబోయేది పింక్ టెస్టు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించి ప్రచారంలో భాగంగా మైదానంలో పలు చోట్ల గులాబీ రంగును ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్తో మృతి చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ భార్య జేన్ స్మారకార్థం సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా పరిగణిస్తారు. ఆసీస్ ఆటగాళ్లు తొలి రోజు గులాబీ క్యాప్లు ధరించి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ ద్వారా సేకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని గ్లెన్ మెక్గ్రాత్కు చెందిన జేన్ మెక్గ్రాత్ ఫౌండేషన్కు అందజేస్తారు. పురుషుల టెస్టు మ్యాచ్కు తొలి మహిళా అంపైర్ పురుషుల టెస్టు మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించనున్న తొలి మహిళా అంపైర్గా క్లెయిర్ పొలొసాక్ (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందనుంది. సిడ్నీ టెస్టులో ఆమె ఫీల్డ్ అంపైర్గా కాకుండా... ఫోర్త్ అంపైర్గా వ్యవహరించనుంది. న్యూసౌత్ వేల్స్కు చెందిన 32 ఏళ్ల క్లెయిర్ 2019లో నమీబియా–ఒమన్ పురుషుల జట్ల మధ్య జరిగిన ఐసీసీ డివిజన్–2 వన్డే లీగ్ మ్యాచ్లో ఆన్ ఫీల్డ్ అంపైర్గా పనిచేసింది. పిచ్, వాతావరణం గత కొద్ది రోజులుగా నగరంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్కు కూడా కొంత అంతరాయం కలగవచ్చు. గతంలో స్పిన్నర్లకు బాగా అనుకూలించిన సిడ్నీ పిచ్ ఇప్పుడు మారింది. కొంత బౌన్స్ ఉంది. పచ్చికను కూడా ఉంచారు కాబట్టి ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు సాధించవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్స్కీ, స్మిత్, లబ్షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్. ► భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మొత్తం 12 టెస్టులు జరిగాయి. భారత్కు ఒక్క టెస్టులోనే విజయం (1978లో) దక్కింది. టీమిండియా మిగతా ఐదు టెస్టుల్లో ఓడిపోయి, ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► మరో 97 పరుగులు చేస్తే పుజారా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ► 400 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు లయన్కు కావాల్సిన వికెట్లు -
హమ్మయ్య! అందరికీ నెగెటివ్
మెల్బోర్న్: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్–19 పరీక్షల నుంచి నెగెటివ్గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్’ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్గానే వచ్చాయి’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్, నవ్దీప్ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్ దాటి బయటకొచ్చి రెస్టారెంట్ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. 25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు. ఎలా‘గబ్బా’! భారత ఆటగాళ్ల రెస్టారెంట్ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్ బేట్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
సిడ్నీ టెస్టుకు డేవిడ్ వార్నర్ రెడీ
పేలవ బ్యాటింగ్తో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కాస్త ఊరట! గజ్జల్లో గాయంతో ఆటకు దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో వార్నర్కు చోటు దక్కింది. అతనితో పాటు విల్ పకోవ్స్కీ, సీన్ అబాట్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరంతా గురువారం సాయంత్రం ఆసీస్ జట్టుతో చేరి సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్ మొదలు పెడతారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్ జో బర్న్స్పై వేటు పడింది. మూడో టెస్టు వేదికగా సిడ్నీ ఖరారు అయినా... సిడ్నీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షల కారణంగా భారత్, ఆసీస్ జట్లు వెంటనే అక్కడికి వెళ్లడం లేదు. జనవరి 4 వరకు ఆటగాళ్లంతా మెల్బోర్న్లో ఉండి ప్రాక్టీస్ కొనసాగిస్తారని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ వెల్లడించారు. -
స్మిత్ లేని ఆస్ట్రేలియా
లీడ్స్: తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలతో ఆస్ట్రేలియా జట్టును గెలిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ దెబ్బ అతడిని ఆటకు దూరం చేసింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫామ్లో లేని మిగిలిన ఆటగాళ్లను చుట్టేసి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడో యాషెస్ టెస్టుకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ పూర్తిగా గతి తప్పడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోంది. ఇక బౌలింగ్లో గత మ్యాచ్లో భీకరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించిన ఆర్చర్ ఈసారి అదే తరహాలో చెలరేగిపోతే ఆసీస్కు కష్టాలు తప్పవు. -
మూడో టెస్టుకు స్మిత్ దూరం
లండన్: తొలి టెస్టులో గెలిచి, రెండో టెస్టును ‘డ్రా’గా ముగించి యాషెస్ సిరీస్లో పై చేయిగా ఉన్న ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్... గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ వేసిన షార్ట్బాల్ స్మిత్ మెడకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు మైదానాన్ని వీడిన అతడు గంటలోపే తిరిగొచ్చి ఇన్నింగ్స్ కొనసాగించాడు. కానీ, మరుసటి రోజు తలనొప్పి, మగతగా ఉండటంతో మైదానంలోకి దిగలేదు. దీంతో ఆసీస్ కాంకషన్ సబ్ స్టిట్యూట్గా మార్నస్ లబషేన్ను ఆడించింది. ‘స్మిత్ మంగళవారం జట్టు ప్రాక్టీస్లో పాల్గొనలేదు. అతడు హెడింగ్లీలో జరిగే మూడో టెస్టులో ఆడడని కోచ్ లాంగర్ ధ్రువీకరించాడు’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. పూర్తిగా కోలుకోకపోవడం, మ్యాచ్కు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో స్మిత్ను ఆడించకపోవడమే ఉత్తమమని భావించినట్లు సమాచారం. ప్రస్తుత యాషెస్లో రెండు జట్ల మధ్య తేడా స్మిత్. మిగతా బ్యాట్స్మెన్ విఫలమై నా రెండు సెంచరీలు, 92 పరుగుల ఇన్నింగ్స్తో ఆసీస్కు అతడు కీలకంగా మారాడు. -
ఇంగ్లండ్ గెలిచింది
గ్రాస్ ఐలెట్: తొలి రెండు టెస్టుల్లో దారుణ పరాజయాలతో వెస్టిండీస్కు సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్... మూడో టెస్టులో 232 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పరువు దక్కించుకుంది. 485 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్లో 69.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రోస్టన్ ఛేజ్ (191 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ అండర్సన్ (3/27) ప్రత్యర్థి టాపార్డర్ను కూల్చగా, స్పిన్నర్ మొయిన్ అలీ (3/99) చివరి వరుస బ్యాట్స్మెన్ పనిపట్టాడు. స్టోక్స్ (2/30)కు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో విండీస్ను దెబ్బకొట్టిన మార్క్ వుడ్ (5/41)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. సిరీస్లో 18 వికెట్లు పడగొట్టిన కరీబియన్ పేసర్ కీమర్ రోచ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. సస్పెన్షన్ కారణంగా మూడో టెస్టుకు దూరమైన విండీస్ రెగ్యులర్ కెప్టెన్ హోల్డర్ సిరీస్ ట్రోఫీని అందుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 20న జరుగనుంది. గాబ్రియెల్పై నాలుగు వన్డేల సస్పెన్షన్ మూడో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ను ఉద్దేశిస్తూ నోరుజారిన వెస్టిండీస్ పేసర్ షనన్ గాబ్రియెల్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం నాలుగు వన్డేల సస్పెన్షన్ వేటు వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.13 ఆర్టికల్ ఉల్లంఘనకు గాను గాబ్రియెల్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెడుతూ, మూడు డీ మెరిట్ పాయింట్లు విధించింది. గత 24 నెలల్లో గాబ్రియెల్ డీ మెరిట్ పాయింట్లు ఎదుర్కోవడం ఇది మూడోసారి. మైదానంలో దురుసు ప్రవర్తనతో 2017 ఏప్రిల్లో పాకిస్తాన్తో టెస్టులో రెండు, గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్తో టెస్టులో మూడు డీ మెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో చేరాయి. -
ఇంగ్లండ్కు ఆధిక్యం
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్కు టెస్టు సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ మూడో టెస్టును సొంతం చేసుకునే ప్రయత్నంలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్కు 123 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. క్యాంప్బెల్ (63 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్), డౌరిచ్ (56 బంతుల్లో 38; 6 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. పేసర్ మార్క్ వుడ్ (5/41) కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగగా... స్పిన్నర్ మొయిన్ అలీ 4 వికెట్లతో ప్రత్యర్థిని కూల్చాడు. అనంతరం ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో కడపటి వార్తలందే సరికి 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. జెన్నింగ్స్ (23), బర్న్స్ (10), డెన్లీ (69) ఔట్ కాగా... రూట్ (26 బ్యాటింగ్), బట్లర్ (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 283 పరుగులు ముందంజలో ఉంది. -
ఇంగ్లండ్ 277 ఆలౌట్
సెయింట్ లూసియా: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి ఇప్పటికే వెస్టిండీస్కు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు కష్టాలు మూడో టెస్టులోనూ కొనసాగుతున్నాయి. ఒకదశలో 232/4తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ రెండో రోజు తొలి సెషన్లో తడబడింది. విండీస్ పేసర్ కీమర్ రోచ్ (4/48) ధాటికి ఇంగ్లండ్ చివరి ఆరు వికెట్లను 45 పరుగుల తేడాలో కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో 101.5 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (127 బంతుల్లో 67; 9 ఫోర్లు), బెన్ స్టోక్స్ (175 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఐదో వికెట్కు 125 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. -
అజహర్, అసద్ సెంచరీలు
అబుదాబి: మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజహర్ అలీ (134; 12 ఫోర్లు), అసద్ షఫీఖ్ (104; 14 ఫోర్లు) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా న్యూజిలాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులు చేసి 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 139/3తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ను అజహర్, అసద్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో ఓ దశలో పాకిస్తాన్ 286/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో విలియమ్ సోమెర్విల్లె (4/75), ఎజాజ్ పటేల్ (2/100) చెలరేగడంతో పాక్ 62 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. విలియమ్సన్ (14 బ్యాటింగ్) సోమెర్విల్లె (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
పాకిస్తాన్ 139/3
అబుదాబి: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి మూడో టెస్టులో తడబడిన పాకిస్తాన్ను మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజహర్ అలీ (62 బ్యాటింగ్; 4 ఫోర్లు) నిలబెట్టాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 17 పరుగులకే ఓపెనర్లు హఫీజ్ (0), ఇమాముల్ హఖ్ (9)ల వికెట్లను కోల్పోయిన పాక్ను అజహర్... హారిస్ సొహైల్ (34; 2 ఫోర్లు), అసద్ షఫీఖ్ (26 బ్యాటింగ్)లతో కలిసి ఆదుకున్నాడు. 229/7 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 274 పరుగుల వద్ద ఆలౌటైంది. పాక్ ఓపెనర్ హఫీజ్ ఈ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. -
గెలుపు అంచున భారత్
భారత్ అద్భుత విజయం కోసం మరో రోజు నిరీక్షణ తప్పదు. అసాధారణ పోరాట పటిమ కనబర్చిన ఇంగ్లండ్... ఓటమికి చేరువై కూడా పట్టుదలగా నిలబడింది. ఫలితంగా 9 వికెట్ల వద్ద ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగించింది. మూడు అదనపు ఓవర్ల సమయంలో టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఆఖరి వికెట్ దక్కలేదు. బుధవారం వాతావరణం కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నా ఒక చక్కటి బంతి మ్యాచ్ చివరి రోజు భారత్కు గెలుపు అందించవచ్చు. తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు... ఇక మన విజయానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే బట్లర్, స్టోక్స్ అద్భుత భాగస్వామ్యం ఇంగ్లండ్ను నడిపించింది. వీరిద్దరు ఏకంగా 57.2 ఓవర్ల పాటు ఆడటంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. అయితే అప్పుడొచ్చాడు జస్ప్రీత్ బుమ్రా... కెరీర్లో తొలి సెంచరీ సాధించి ఊపు మీదున్న బట్లర్ను ఔట్ చేసి గెలుపు గేట్లు తెరిచాడు. అదే జోరులో అతను మరో మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ సీన్ మారిపోయింది. నాటింగ్హామ్: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు చేరింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు బాగా చేరువైనా... ఆదిల్ రషీద్ (55 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు, ఒక సిక్స్) పట్టుదలగా ఆడటంతో మరో రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (176 బంతుల్లో 106; 21 ఫోర్లు) శతకంతో చెలరేగగా... బెన్ స్టోక్స్ (187 బంతుల్లో 62; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 169 పరుగులు జోడించారు. జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్లు పట్టాడు. ఐదు పరుగుల... ఐదు బంతుల తేడాతో... ఓవర్నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. మంగళవారం మొదటి ఓవర్లోనే జెన్నింగ్స్ను (13) ఔట్ చేసిన ఇషాంత్, తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో కుక్ (17)ను పెవిలియన్కు పంపించాడు. జట్టును ఆదుకోవడంలో కెప్టెన్ రూట్ (13), ఒలివర్ పోప్ (16) విఫలమయ్యారు. ఐదు బంతుల తేడాలో ముందుగా రూట్ను బుమ్రా ఔట్ చేయగా, షమీ బౌలింగ్లో మూడో స్లిప్లో కోహ్లి అద్భుత క్యాచ్కు పోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే వ్యక్తిగత స్కోరు 1 వద్ద బుమ్రా బౌలింగ్లో బట్లర్ ఇచ్చిన క్యాచ్ను పంత్ వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. కీలక భాగస్వామ్యం... తొలి సెషన్లో దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకున్న స్టోక్స్, బట్లర్ లంచ్ తర్వాత కూడా అదే పట్టుదల కనబర్చారు. పరిస్థితికి తగినట్లుగా జాగ్రత్తగా ఆడుతూ, ఎలాంటి తప్పుడు షాట్లకు ప్రయత్నించకుండా సంయమనంతో క్రీజ్లో నిలిచారు. భారత పేసర్లు చక్కగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం దక్కలేదు. కొన్నిసార్లు ఇంగ్లండ్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్లో ఒకసారి, షమీ బౌలింగ్లో మరోసారి ఎల్బీడబ్ల్యూ అప్పీల్లు బలంగా కనిపించినా... రివ్యూలలో స్టోక్స్ బతికిపోయాడు. మరోవైపు 93 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లండ్ రెండో సెషన్ను విజయవంతంగా ముగించగలిగింది. టీ తర్వాత కూడా వీరిద్దరూ తమ జోరు కొనసాగిస్తూ మరింత స్వేచ్ఛగా ఆడారు. షమీ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బట్లర్... ఈ క్రమంలో 152 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొత్త బంతితో... భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత మూడో ఓవర్లోనే వికెట్ లభించింది. వికెట్ కోసం సుదీర్ఘ సమయం సాగిన నిరీక్షణకు బుమ్రా తెరదించాడు. అతడి బంతిని ఆడకుండా బట్లర్ చేతులెత్తేయగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్గా ప్రకటించినా బట్లర్ రివ్యూ కోరాడు. అయితే లాభం లేకపోయింది. అద్భుతంగా వేసిన తర్వాతి బంతితో బెయిర్స్టో (0)ను క్లీన్బౌల్డ్ చేసిన బుమ్రా... తర్వాతి ఓవర్లోనే వోక్స్ (4)ను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికి రషీద్ను కూడా బుమ్రా ఔట్ చేసినా అది ‘నోబాల్’గా తేలింది. ఈ దశలో దూకుడుగా ఆడిన రషీద్, బ్రాడ్ జోడీ తొమ్మిదో వికెట్కు 50 పరుగులు జోడించింది. ఎట్టకేలకు బ్రాడ్ను ఔట్ చేసి బుమ్రా ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రషీద్ బలంగా నిలబడటంతో భారత్ నిరాశగా పెవిలియన్ చేరింది. -
మూడో టెస్టులో గెలుపుపై భారత్ గురి
-
మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్
-
కోహ్లి సెంచరీ మిస్..రాణించిన రహానే
నాటింగ్హామ్: ఈ టెస్టు సిరీస్లో మొదటిసారి భారత్ బ్యాటింగ్లో సత్తాచాటింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (152 బంతుల్లో 97; 11 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానే ( 131 బంతుల్లో 81; 12 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో తొలిరోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీశాడు. మూడో టెస్టులో భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. దినేశ్ కార్తీక్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు తొలిసారి అవకాశమివ్వగా, కుల్దీప్ స్థానంలో ఫిట్నెస్ సంతరించుకున్న బుమ్రా, మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ మృతికి సంతాప సూచకంగా భారత ఆటగాళ్లంతా తొలిరోజు ఆటలో నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. 77 ఏళ్ల వాడేకర్ అనారోగ్య కారణాలతో ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ మెరుగైంది కానీ... ఈ మ్యాచ్లోనూ భారత కెప్టెన్ కోహ్లి టాస్ ఓడాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్ (65 బంతుల్లో 35; 7 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (53 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఈ టెస్టు సిరీస్లోనే మెరుగైన ఆరంభాన్నిచ్చారు. సాధికారికంగా ఆడుతూ ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్, క్రిస్ బ్రాడ్, స్టోక్స్లపై పైచేయి కనబరిచారు. ఈ ముగ్గురి బౌలింగ్ను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొన్నారు. వోక్స్పై కూడా పట్టు సాధించే ప్రయత్నం చేశారు. అతను వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాహుల్ 2 బౌం డరీలు బాదాడు. జట్టు స్కోరు 50 దాటింది. ఎట్టకేలకు వోక్స్ తన మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 19) సఫలమయ్యాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న ధావన్ను ఔట్ చేశాడు. దీంతో తొలివికెట్కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కాసేపటికే వోక్స్ మరో ఓపెనర్ రాహుల్ను ఎల్బీగా వెనక్కి పంపాడు. భారత ఓపెనర్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (14) కూడా వోక్స్ బౌలింగ్లోనే నిష్క్రమించాడు. దీంతో 22 పరుగుల వ్యవధిలో భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయింది. కోహ్లి, రహానే క్రీజులోకి రాగా... భారత్ 82/3 స్కోరు వద్ద లంచ్ విరామానికెళ్లింది. రాణించిన రహానే, కోహ్లి స్వల్ప వ్యవధిలో మూడు టాపార్డర్ వికెట్లను దక్కించుకున్న వోక్స్ ఇక భారత్ కథ ముగించొచ్చని భావించాడు. కానీ రహానే, కోహ్లి ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఇంగ్లండ్ శిబిరం కుదేలైంది. రెండో సెషన్లో ఈ జోడి ప్రత్యర్థి బౌలింగ్ను చక్కగా ఎదుర్కొంది. దీంతో మరో వికెట్ చేజారకుండా భారత్ 100, 150 పరుగుల్ని అధిగమించింది. ఈ క్రమంలో మొదట విరాట్ కోహ్లి 74 బంతుల్లో 6 బౌండరీల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ వెంటనే రహానే కూడా 76 బంతుల్లో 7 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు వికెట్ కోసం ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన ఈ జోడీని విడగొట్టలేకపోయాడు. రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్ 107 పరుగులు చేసింది. 189/3 స్కోరు వద్ద ఈ సెషన్ ముగిసింది. నెర్వస్ నైంటీస్లో కోహ్లి... రెండో సెషన్లో శక్తికిమించి శ్రమించినా వికెట్ పడగొట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లను మూడో సెషన్ మురిపించింది. క్రీజులో నిలదొక్కుకొని సెంచరీ దిశగా పయనిస్తున్న రహానే, కోహ్లి వికెట్లను చేజిక్కించుకుంది. ఆట మొదలైన కాసేపటికే జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. రహానే కాస్త వేగం పెంచగా, కోహ్లి బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పరుగుల రాక సులభమైంది. అయితే ఇన్నింగ్స్ 67వ ఓవర్ వేసిన బ్రాడ్... రహానే ఆట ముగించాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళుతున్న బంతిని రహానే కట్ చేయాలని భావించాడు. కానీ అతని బ్యాట్ అంచును తాకుతూ వెళ్లిన బంతి ఫస్ట్ స్లిప్లో వేగంగా దూసుకొచ్చింది. కుక్ రెప్పపాటు వ్యవధిలోనే స్పందించి ఒంటిచేత్తో క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 159 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్కు జతయ్యాడు. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో కోహ్లి... స్పిన్నర్ రషీద్ చేతికి చిక్కాడు. దీంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. తొలి టెస్టు ఆడుతున్న రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సర్తో అలరించాడు. భారత సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు సిక్సర్తో ఖాతా తెరవలేదు. ఇప్పుడీ ఘనత రిషభ్ సొంతమైంది. పంత్ (32 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), పాండ్యాలిద్దరు నింపాదిగా ఆడారు. జట్టు స్కోరు 300 పరుగులు దాటాక పాండ్యా (18)ను అండర్సన్ ఔట్చేయడంతో తొలి రోజు ఆటకు తెరపడింది. -
‘ఆఖరి’ అవకాశం
ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చినా, తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయింది. అయితే జొహన్నెస్బర్గ్లో జరిగిన చివరి టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు టీమిండియాకు కావాల్సింది సరిగ్గా అదే స్ఫూర్తి! ఇంగ్లండ్ గడ్డపై ఎన్నో అంచనాలతో, సిరీస్ గెలుపుపై ఆశతో భారత్ అడుగు పెట్టింది. కానీ ఒక్కసారిగా అంతా ప్రతికూలంగా మారిపోయి రెండు టెస్టులు చేజారాయి. నాలుగేళ్ల క్రితంనాటి పరాభవం పునరావృతం కాకుండా ఉండాలంటే మూడో టెస్టులో మన జట్టు రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. బౌలింగ్లో మెరుగ్గానే కనిపిస్తున్నా... ఆత్మవిశ్వాసం లోపించిన బ్యాటింగ్తో కోహ్లి సేన ఎంతగా రాణిస్తుందనేది ఆసక్తికరం. నాటింగ్హామ్: టెస్టు సిరీస్ గెలిచే ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధమైంది. నేటి నుంచి ఇక్కడి ట్రెంట్బ్రిడ్జ్ మైదానంలో జరిగే మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇప్పటికే 0–2తో వెనుకబడి ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించినా సిరీస్ గెలిచే అవకాశం మాత్రం కోల్పోతుంది. మరోవైపు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్ మరో గెలుపుపై దృష్టి పెట్టింది. తర్వాతి టెస్టులతో ప్రమేయం లేకుండా ఇక్కడే సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇంగ్లండ్ అనూహ్య మార్పుతో తుది జట్టును ప్రకటించింది. న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంతో జట్టుతో చేరిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ ఆడనున్నాడు. మళ్లీ మార్పులతోనే... కోహ్లి ఇప్పటి వరకు 37 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించగా వరుసగా ఏ రెండు టెస్టుల్లోనూ అదే తుది జట్టును కొనసాగించలేదు. ఇప్పుడు 38వ టెస్టులో కూడా అదే జరగనుంది. గాయంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయమైంది. గత మ్యాచ్లో కుల్దీప్ను ఆడించడాన్ని పొరపాటుగా అంగీకరించిన టీమ్ మేనేజ్మెంట్ మరో ఆలోచనకు తావు లేకుండా అతని స్థానంలో బుమ్రాను తీసుకోనుంది. ముగ్గురు ఓపెనర్లలో ఏ ఇద్దరినైనా కొనసాగించక తప్పదు. కోహ్లి వెన్నునొప్పి నుంచి కోలుకొని బరిలోకి దిగుతుండటం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. భారత్ అదనపు బ్యాట్స్మన్ను తీసుకుంటుందా చూడాలి. అలా అయితే హార్దిక్ పాండ్యా స్థానంలో కరుణ్ నాయర్కు అవకాశం దక్కవచ్చు. మరో మార్పు కూడా దాదాపు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్ అరంగేట్రం చేయనున్నాడు. -
నెట్స్లో శ్రమించిన కోహ్లి
నాటింగ్హామ్: మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించే పరిణామం. రెండో టెస్టు సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్ విరాట్ కోహ్లి... పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో ఫిజియోల పర్యవేక్షణలో గురువారం నెట్స్లో అతడు తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. స్లిప్ ఫీల్డింగ్కు వెళ్లి క్యాచ్లు పట్టాడు. ‘కోహ్లి ఫిట్నెస్ మెరుగైంది. నెట్స్లో సౌకర్యంగా కదిలాడు. మ్యాచ్ సమయానికి మరింతగా సంసిద్ధమవుతాడు’ అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పిచ్లు బ్యాట్స్మెన్కు క్లిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడే అసలైన ఆట బయటకు వస్తుందని రవిశాస్త్రి అన్నాడు. ఆఫ్స్టంప్ను చూసుకుంటూ, ఆడలేని బంతులను వదిలేస్తూ, చెత్త బంతుల కోసం వేచి చూడాలని సూచించాడు. రహానే ఫామ్ గురించి ప్రస్తావించగా... రెండు జట్ల బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యమే కీలక పాత్ర పోషిస్తుందని, ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేమని స్పష్టం చేశాడు. లార్డ్స్ టెస్టులో రెండో స్పిన్నర్గా కుల్దీప్ను ఆడించడం పొరపాటేనని... మరో పేసర్ అయితే ఉపయోగకరంగా ఉండేదని శాస్త్రి అంగీకరించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లి స్పిన్ తిరుగుతుందని భావించి కుల్దీప్ను తీసుకున్నట్లు వివరించాడు. ఓటమి అనంతరం... ‘గతంలోనూ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి గెలిచినందున మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు’ అని మాత్రమే ఆటగాళ్లకు సూచించినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు... కోహ్లి గాయం నుంచి కోలుకుంటే మరింత విజృంభించి ఆడతాడని ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ తమ జట్టు సభ్యులకు హెచ్చరికతో కూడిన సూచన చేశాడు. -
చివరి టెస్టుకు వర్షం అంతరాయం
జొహన్నెస్బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు నాలుగో రోజు ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వర్షం పడిన నేపథ్యంలో ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభించినట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు పిచ్ ప్రమాదకరంగా మారడమూ ఆటకు అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో మొదలైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పిచ్ గురించి అంపైర్లతో చర్చించాడు. అంపైర్లు శనివారం రెండోసారి పిచ్ను పరిశీలించాక మ్యాచ్ కొనసాగించారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి సఫారీలు వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. ఎల్గర్(11), హషీం ఆమ్లా(2) నాటౌట్ నిలిచారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా మరో 224 పరుగుల వెనుకంజలో ఉంది. -
విజయం ఎవరిదో..?
-
విజయం ఎవరిదో..?
జోహెన్నెస్బర్గ్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇరు జట్లకు విజయావకాశాలు సమంగా ఉండటంతో శనివారం నాలుగో రోజు ఆట కీలకం కానుంది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(2 బ్యాటింగ్), డీన్ ఎల్గర్( 11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్ మర్క్రామ్(4) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. రేపటి ఆటలో భారత జట్టు బౌలింగ్పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతున్న నేపథ్యంలో సఫారీలకు లక్ష్యాన్ని ఛేదించడం కష్టమనే చెప్పాలి. మరి దీన్ని టీమిండియా ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి. ముందుగానే నిలిచిన మ్యాచ్.. మూడో రోజు కొనసాగడానికి సమయం ఉండగానే మ్యాచ్ను ముందుగా నిలిపివేశారు. సఫారీల ఇన్నింగ్స్లో భాగంగా బూమ్రా వేసిన తొమ్మిదో ఓవర్ మూడో బంతి అనూహ్యంగా దూసుకొచ్చి ఎల్గర్ ముఖానికి తగిలింది. దీంతో పిచ్ క్రమేపీ మరింత ప్రమాదకరంగా మారుతుందని భావించిన ఫీల్డ్ అంపైర్లు.. రిఫరీతో చర్చించిన తరువాత మ్యాచ్ను నిలిపేశారు. ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్ను 16 ఓవర్లు మిగిలుండగానే ముగించారు. అంతకుముందు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌట్ కావడంతో పోరాడే లక్ష్యాన్ని సఫారీల ముందుంచింది. శుక్రవారం 49/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా.. మరో 198 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో కేఎల్ రాహుల్(16), చతేశ్వర పుజారా(1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరి నిరాశపరిచారు. ఆ క్రమంలో ఓవర్నైట్ ఆటగాడు మురళీ విజయ్కు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాల్గో వికెట్కు 43 పరుగులు జోడించిన తర్వాత విజయ్(25;127 బంతుల్లో 1 ఫోర్) అవుటయ్యాడు. అటు తరువాత కోహ్లి-రహానేల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. కాగా, రబడా బౌలింగ్లో కోహ్లి(41) బౌల్డ్ కావడంతో 134 పరుగుల వద్ద భారత్ జట్టు ఐదో వికెట్ను నష్టపోయింది. వెంటనే హార్దిక్ పాండ్యా(4) కూడా నిష్క్రమించడంతో భారత జట్టు రెండొందల పరుగులు చేయడం కష్టంగా అనిపించింది. రహానే-భువన్వేశ్వర్ భాగస్వామ్యం.. ఆ తరుణంలో రహానే -భువనేశ్వర్ కుమార్ల జోడి 55 పరుగుల్ని జత చేయడంతో భారత్ తేరుకుంది. అయితే రహానే(48) హాఫ్ సెంచరీకి దగ్గరగా ఏడో వికెట్గా పెవిలియన్ చేరాడు. దాంతో భువీకి జత కలిసిన మొహ్మద్ షమీ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, 1 ఫోర్తో 27 పరుగులు సాధించి విలువైన భాగస్యామ్యాన్ని జత చేశాడు.ఇక తొమ్మిదో వికెట్గా భువీ(33;76 బంతుల్లో 2 ఫోర్లు) అవుట్ కాగా, చివరి వికెట్గా బూమ్రా(4) పెవిలియన్ చేరడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాంత్ శర్మ(7 నాటౌట్) అజేయంగా క్రీజ్లో మిగిలాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ తలో మూడు వికెట్లు సాధించగా, ఎన్గిడికి వికెట్ దక్కింది. -
187 పరుగులకు భారత్ ఆలౌట్
-
187 పరుగులకు భారత్ ఆలౌట్
జొహన్నెస్బర్గ్ : వేదిక మారినా.. జట్టులో మార్పులు చేసినా అదే ఆట..అదే తీరు..! దక్షిణాఫ్రికా ఫేస్ బలగానికి మరోసారి భారత్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. కెప్టెన్ కోహ్లి, పుజారాల అర్ధసెంచరీలు మినహా భారత్ బ్యాట్స్మెన్ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. దీంతో భారత్ కేవలం187 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు లోకేష్ రాహుల్(0), మురళీవిజయ్(8)లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులో వచ్చిన పుజారా, కోహ్లిలు నిలకడగా రాణించారు. ఆచితూచి ఆడుతూ.. సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పుజారా అయితే తొలి పరుగుకు ఏకంగా 54 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లి సైతం సఫారీ బౌలర్ల వేగవంతమైన బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటు వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే రబాడ వేసిన 20.1వ బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను మిడాఫ్లో ఉన్న ఫిలాండర్ సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఈ లైఫ్ను అందిపుచ్చుకున్న కోహ్లి(54, 101 బంతుల్లో 9 ఫోర్లతో) కెరీర్లో 16 హాఫ్ సెంచరీ సాధించాడు. ఆవెంటనే లుంగిసాని బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్ మొత్తానికి ఈ పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. నిరాశ పరిచిన రహానే తొలి రెండు టెస్టు మ్యాచుల్లో అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వకపోవడంపై కెప్టెన్ కోహ్లి సీనియర్ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో అవకాశం కల్పించగా రహానే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మోర్కెల్ వేసిన 51.4 ఓవర్లో రహానే(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పార్దీవ్ పటేల్ పుజారా ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. కోహ్లి బాటలో పుజారా.. కోహ్లిలానే హాఫ్ సెంచరీ అనంతరం పుజారా పెవిలియన్కు చేరాడు. తనదైన బ్యాటింగ్ శైలితో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష నిలిచిన పుజారా 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో కెరీర్లో 17 అర్ధసెంచరీ సాధించాడు. ఆ వెంటనే ఫెహ్లుక్వాయో వేసిన 61.3వ బంతికి ఔటయ్యాడు. ఆఫ్సైడ్ వచ్చిన బంతి పుజారా బ్యాట్ అంచుకు తగిలి కీపర్ డికాక్ చేతుల్లో పడింది. అర్ధశతకం సాధించడానికి పుజారా నాలుగు గంటల సమయం తీసుకోవడం విశేషం. ఆ వెంటనే భారత్ పార్దీవ్పటేల్(2), హార్దిక్ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. పర్వాలేదనిపించిన భువనేశ్వర్ అనంతరం క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్(30) పర్వాలేదనిపించాడు. అందివచ్చిన బంతులను బౌండరీలకు తరలిస్తూ జట్టు స్కోర్ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఇతర టేయిలండర్ల నుంచి సాయం అందలేదు. దీంతో భారత్ 187 పరుగులు చేయగలిగింది. మహ్మద్ షమీ 8 పరుగులు చేయగా.. ఇషాంత్ డకౌట్ అయ్యాడు. చివర్లో భువీ అవుటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా(0) నాటౌట్గా నిలిచాడు. సఫారీ బౌలింగ్లో రబడా మూడు వికెట్లు తీయగా.. మోర్కెల్, ఫిలాండర్, ఫెహ్లుక్వాయోలకు తలో రెండు వికెట్లు తీశారు. లుంగిసానికి ఒక వికెట్ దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ సఫారీ ఓపెనర్ ఆడిన్ మార్క్రమ్(2) పెవిలియన్కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రబడాతో డీన్ ఇల్గర్(4) మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 6 పరుగులు చేసింది. ffff -
భారత్ వికెట్లు టప..టపా
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది. పుజారా(50), పార్దీవ్పటేల్(2), హార్దిక్ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. తొలుత కెప్టెన్ కోహ్లి తరహాలోనే టీమిండియా నయావాల్ చతేశ్వర పుజారా హాఫ్ సెంచరీ అనంతరం ఆండిల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్(2) సైతం మోర్కెల్ బౌలింగ్లో క్యాచ్ అవుటయ్యాడు. ఆవెంటనే క్రీజులో వచ్చిన ఆల్రౌండర్ పాండ్యా ఆండిల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డికాక్ చిక్కాడు. 144 పరుగుల వద్దే భారత్ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో భారత్ 144 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో భువనేశ్వర్(4), మహ్మద్ షమీ(0) ఉన్నారు. అంతకు ముందు పుజారా 178 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక కెప్టెన్ కోహ్లి(54) వికెట్ అనంతరం భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడల్లా కుప్ప కూలింది. -
బ్యాట్స్మెన్ బాగా ఆడాలి
ఇప్పుడిక మూడో టెస్టు వంతు. వాండరర్స్ దక్షిణాఫ్రికాలోనే వేగవంతమైన, బౌన్స్ అధికంగా ఉండే పిచ్. విదేశీ జట్లకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు కూడా లభించదు. గత మ్యాచ్లో కోహ్లి సెంచరీ స్ఫూర్తితోనైనా భారత బ్యాటింగ్ బల పడాలి. ఈ మ్యాచ్లోనైనా బ్యాట్స్మెన్ బాధ్యతగా ఆడి భారీగా పరుగులు సాధించాలి. ఈ సిరీస్లో అయిదుగురు బ్యాట్స్మెన్ సిద్ధాంతం నడవదని తేలిపోయింది. ఆతిథ్య జట్టు తమ ఏకైక స్పిన్నర్ కేశవ్ మహరాజ్ను తప్పించి అయిదుగురు పేసర్లను ఆడించే యోచన చేస్తే... భారత్ కూడా అశ్విన్ను పక్కన పెట్టాలి. అప్పుడు హార్దిక్ సహా అయిదుగురు పేసర్లు తుది జట్టులో ఉంటారు. కష్టమే అయినా... రహానేను తీసుకుని కేఎల్ రాహుల్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించాలి. సెంచూరియన్లో మాదిరిగా ఇక్కడా టర్న్ కనిపిస్తే అది కొంతైనా ప్రభావం చూపుతుంది. నైపుణ్యానికి కొదవలేని ఈ జట్టు దేశం కోసం ఆడుతున్న సందర్భంలో మైదానంలో దానిని పూర్తిగా ప్రదర్శించింది. ఫీల్డింగ్ ప్రమాణాలు ఏమంత బాగోలేకున్నా బౌలర్లు విశేషంగా రాణించి అవకాశాలు కల్పించారు. రెండు టెస్టుల్లోనూ ప్రొటీస్ చివరి వరుస బ్యాట్స్మెన్ జోడించిన పరుగులు అంతిమంగా తేడా చూపించాయి. ఏదేమైనా పరువు దక్కించుకునేందుకు భారత్కు ఇది చివరి అవకాశం. -
పరువు కోసం...
గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఏ భారత జట్టుకూ సాధ్యం కాని రికార్డును ప్రస్తుత టీమ్ సృష్టిస్తుందని ఈ టూర్కు బయల్దేరే ముందు కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. అయితే... ఇప్పుడు అది నిజంగానే నిజం కాకూడదని సగటు భారత క్రికెట్ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే 1992 నుంచి ఆరు సార్లు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఏ భారత జట్టు కూడా క్లీన్స్వీప్కు గురి కాలేదు. కనీసం ఒక మ్యాచ్ గెలవడం లేదా ఒకటైనా డ్రా చేసుకోగలిగింది. ఇప్పుడు సిరీస్లో అన్ని మ్యాచ్లు ఓడే ప్రమాదం ముందు నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన టీమిండియా మూడో టెస్టులో కోలుకోగలుగుతుందా... ప్రత్యర్థికి పోటీనిచ్చి పరువు కాపాడుకుంటుందా అనేది చూడాలి. జొహన్నెస్బర్గ్: ప్రతిష్టాత్మక వాండరర్స్ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడిన భారత్ ఒకటి గెలిచి మూడు ‘డ్రా’ చేసుకోగా ఒక్కటి కూడా ఓడలేదు. టి20 ప్రపంచ కప్ గెలిచింది కూడా ఈ మైదానంలోనే. ఇలా అచ్చొచ్చిన వేదికపై తమ అదృష్టాన్ని మార్చుకునేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకొని దక్షిణాఫ్రికా అమిత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, నంబర్వన్ టీమ్ హోదాలో పరువు కాపాడుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే పేస్, బౌన్స్ కలగలిసిన పచ్చిక వికెట్ భారత్ కోసం ఎదురు చూస్తోంది. సిరీస్ ఫలితం తేలిపోయినా సరే ఇరు జట్లు ఈ మ్యాచ్ను కీలకంగానే భావిస్తుండటం ఆసక్తికరం. రహానే ఖాయం... తొలి రెండు టెస్టుల్లో పరాజయం తర్వాత తుది జట్టు కూర్పు గురించి తగిన రీతిలో వివరణ ఇచ్చుకోలేక భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో అజింక్య రహానేను తీసుకోవడం ఖరారైనట్లే. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే ఎవరి స్థానంలో వీరిని ఎంచుకోవాలనేది కూడా భారత్కు సమస్యగా మారింది. రోహిత్ శర్మను తప్పించేటట్లు కనిపిస్తున్నా... అతనికి మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా టీమ్ మేనేజ్మెంట్కు ఉంది. భువీని ఎవరి స్థానంలో ఎంచుకోవాలో కూడా సందిగ్ధత కనిపిస్తోంది. షమీ, బుమ్రా గత మ్యాచ్లో బాగా ఆడగా... ఇక్కడి బౌన్సీ పిచ్పై ఇషాంత్ అవసరమూ ఉంది. మీడియా సమావేశంలో కోహ్లి చూచాయగా చెప్పినట్లు ఐదుగురు పేసర్ల వ్యూహాన్ని కూడా అనుసరించవచ్చు. కెప్టెన్ చివరి వరకు దానికి కట్టుబడి ఉంటే ఏకైక స్పిన్నర్ అశ్విన్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. అయితే తుది జట్టులోకి ఎవరు వచ్చినా ఈ మ్యాచ్లో పరువు నిలవాలంటే భారత బ్యాటింగ్పైనే భారం ఉంది. పిచ్ బౌలింగ్కు బాగా అనుకూలించే అవకాశం ఉండగా...దానిని తాము కూడా వాడుకోగలగమని మన బౌలర్లు ఇప్పటికే నిరూపించారు. కాబట్టి బ్యాట్స్మెన్ శ్రమిస్తే మన రాత మారుతుంది. సిరీస్లో కోహ్లి సెంచరీ తప్ప ప్రధాన బ్యాట్స్మెన్ కనీసం అర్ధసెంచరీ కూడా చేయలేదు. ఆ 153ని పక్కన పెడితే రెండు టెస్టుల్లో కలిపి భారత టాప్–6 బ్యాట్స్మెన్ సగటు 14.08 మాత్రమే కావడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తుంది. కాబట్టి బ్యాటింగ్లో సమష్టితత్వమే వాండరర్స్లో మనకు విజయావకాశం కల్పించవచ్చు. మార్పులు లేకుండానే... దక్షిణాఫ్రికా జట్టు కూడా పేస్ బౌలర్ల ప్రదర్శనతోనే ఇప్పటికే సిరీస్ గెలుచుకోగలిగింది తప్ప టీమ్ బ్యాటింగ్ ఇంకా నాసిరకంగానే ఉంది. రెండు మ్యాచుల్లోనూ డివిలియర్స్ కీలక ఇన్నింగ్స్లలో ఆ జట్టు కోలుకోగలిగింది. మిగతావారి బ్యాటింగ్ మొత్తం వైఫల్యం కిందే లెక్క. భారత్ను పేస్ ఉచ్చులో బిగించే ప్రయత్నంలో ఆ జట్టు ఆటగాళ్లు కూడా దానిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఓపెనర్లలో నిలకడ లేకపోగా, ఆమ్లా కూడా స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నాడు. కెప్టెన్ డు ప్లెసిస్ ఆట కూడా అంతంత మాత్రమే. ఇలాంటి స్థితిలో ఆ జట్టు కూడా క్లీన్స్వీప్ చేయాలంటే బ్యాట్స్మెన్ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో మాత్రం తిరుగులేకుండా నలుగురు పేసర్లు జట్టు భారం మోస్తున్నారు. పిచ్ను బట్టి చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే స్పిన్నర్ మహరాజ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫెలుక్వాయో రావచ్చు. 2015లో భారత గడ్డపై 0–3తో ఓడిన దక్షిణాఫ్రికా... సరిగ్గా లెక్క సరి చేయాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ పోరులో కూడా హోరాహోరీ తప్పదు. పిచ్, వాతావరణం పిచ్పై కనిపిస్తున్న పచ్చిక మరో మాటకు తావు లేకుండా ఇది పేస్, బౌన్సీ వికెట్ అని చెబుతోంది. బ్యాట్స్మెన్కు కూడా ఈ వికెట్ పరీక్ష పెట్టనుంది. కొద్ది సేపు కుదురుకోగలిగితే ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. టాస్ కూడా కీలకం. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్ష సూచన ఉంది. ఈ వాతావరణం కూడా పిచ్పై ప్రభావం చూపించవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: విజయ్, రాహుల్/ ధావన్, పుజారా, కోహ్లి, రహానే, పాండ్యా/రోహిత్, పార్థివ్, ఇషాంత్, భువనేశ్వర్, షమీ, బుమ్రా. దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), ఎల్గర్, మార్క్రమ్, ఆమ్లా, డివిలియర్స్, డి కాక్, మహరాజ్/ ఫెలుక్వాయో, ఫిలాండర్, రబడ, మోర్కెల్, ఇన్గిడి. -
'తొమ్మిదో' విజయంపై గురి!
దాదాపు రెండున్నరేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై టెస్టుల్లో విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు జైత్రయాత్ర మొదలైంది. అప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఎనిమిది సిరీస్ విజయాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది. 2015 లంక సిరీస్ నుంచి మొత్తం 29 మ్యాచ్లు ఆడితే 21 గెలిచి, 2 మాత్రమే ఓడింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు వేటలో భారత్ చివరి టెస్టును నెగ్గాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్ ప్రకారం అదే జరిగితే ఆస్ట్రేలియా తర్వాత వరుసగా తొమ్మిది సిరీస్లు గెలిచిన జట్టుగా ఘనత సాధిస్తుంది. తొలి టెస్టులో అదృష్టవశాత్తూ పరాజయం నుంచి బయటపడి, నాగ్పూర్లో చిత్తుగా ఓడిన చండిమాల్ బృందం ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నుంచీ దక్షిణాఫ్రికా పేరునే జపిస్తూ వచ్చిన భారత జట్టు సఫారీ పర్యటనకు వెళ్లే ముందు చివరి సారి తమ అస్త్రశస్త్రాలను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. కీలకమైన దక్షిణాఫ్రికా టూర్కు ముందు భారత జట్టు తమ ఆఖరి టెస్టు ఆడనుంది. నేటి నుంచి ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే చివరిదైన మూడో టెస్టులో భారత్, శ్రీలంక తలపడతాయి. రెండో టెస్టులో విజయంతో సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం అయితే లేదు. అయితే ఈ మ్యాచ్లోనూ నెగ్గి 2–0తో ఆధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పేలవమైన ఆటతో గత మ్యాచ్లో తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద పరాభవాన్ని మూటగట్టుకున్న లంక ఇక్కడైనా తమ రాత మార్చుకోవాలని భావిస్తోంది. బలాబలాలపరంగా చూస్తే నిస్సందేహంగా భారత్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ఎవరు అవుట్? భారత తుది జట్టులో స్థానం కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. రెండో టెస్టులో జట్టులో లేని శిఖర్ ధావన్ ఇప్పుడు తిరిగొచ్చాడు. అయితే గత మ్యాచ్లో విజయ్ సెంచరీతో చెలరేగగా, తొలి టెస్టులో రాహుల్, ధావన్ రాణించారు. ఈ ముగ్గురిలో విజయ్ జట్టులో ఉండటం ఖాయం కాగా... మరో ఓపెనర్గా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరం. అవసరమైతే నాగ్పూర్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మను కూడా పక్కన పెట్టి రాహుల్ను మిడిలార్డర్లో ఆడించాలనే ప్రత్యామ్నాయం కూడా టీమ్ మేనేజ్మెంట్ ముందుంది. కోహ్లి, పుజారా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అయితే ప్రధాన ఆటగాళ్లలో అందరూ సత్తా చాటగా... సిరీస్లో ఇప్పటి వరకు రహానే మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. వరుసగా 4, 0, 2 పరుగులు సాధించిన రహానే తన స్థాయిలో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్కు ముందు అతని ఆత్మవిశ్వాసం పెరగాలంటే అది తప్పనిసరి. బౌలింగ్ విషయంలో భారత్కు ఎలాంటి సమస్యలు లేవు. స్పిన్లో అశ్విన్, జడేజా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేశ్తో పాటు మరో పేసర్ స్థానం కోసం షమీ, ఇషాంత్ శర్మ మధ్య పోటీ ఉంది. అయితే సొంతగడ్డపై ఆడేందుకు ఇషాంత్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సందకన్కు చోటు? ఈ టూర్లో శ్రీలంకను బ్యాటింగ్ వైఫల్యమే తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రెండు టెస్టుల్లో కలిపి ఆ జట్టు తరఫున ఒక బ్యాట్స్మన్ చేసిన అత్యధిక స్కోరు 67 మాత్రమే! భారీ స్కోర్లు చేయకుండా టెస్టుల్లో విజయం గురించి ఆలోచించడం కూడా అత్యాశే అవుతుంది. దురదృష్టవశాత్తూ లంక ఆటగాళ్లంతా మ్యాచ్ను మెరుగ్గా ఆరంభించడమో లేక అక్కడక్కడా మెరుపులతో ఆకట్టుకున్నారు తప్ప ఒక పూర్తి స్థాయి టెస్టు ఇన్నింగ్స్ వారిలో ఎవరి నుంచీ రాలేదు. కరుణరత్నే, సమరవిక్రమ ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యమే జట్టుకు కీలకం కానుంది. తిరిమన్నె స్థానంలో ధనంజయ డి సిల్వా రావడం ఖాయమైంది. ‘ఒక్క మ్యాచ్ అయినా బాగా ఆడు ప్లీజ్’ అన్నట్లుగా సీనియర్ సహచరుడు మాథ్యూస్కు కెప్టెన్ చండిమాల్ వరుసగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాడు. ఇక్కడైనా మాథ్యూస్ తన పాత ఆటను ప్రదర్శిస్తే లంక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చండిమాల్, డిక్వెలా మెరుగ్గా ఆడుతుండటం సానుకూలాంశం. ఆ జట్టు తాజా పరిస్థితి నేపథ్యంలో అదనపు బ్యాట్స్మన్గా రోషన్ సిల్వాను తీసుకుంటుందా లేక ఐదుగురు బౌలర్లతో ఆడుతుందా చూడాలి. మరోవైపు గాయంతో మ్యాచ్కు దూరమైన హెరాత్ స్థానంలో చైనామన్ బౌలర్ లక్షణ్ సందకన్ టీమ్లోకి రానున్నాడు. ఇటీవల పల్లెకెలె టెస్టులో భారత బ్యాట్స్మెన్ను కొంత ఇబ్బంది పెట్టిన అతనిపై లంక ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్/ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్/షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్వెలా, రోషన్ సిల్వా/విశ్వ ఫెర్నాండో, పెరీరా, సందకన్, లక్మల్, గమగే. పిచ్, వాతావరణం పిచ్పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కానీ అది మరీ ప్రమాదకరంగా ఏమీ లేదు. సాధారణ వికెట్. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షంతో ఇబ్బంది లేదు కానీ తొందరగా వెలుతురు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. 30 ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత జట్టు 30 ఏళ్లుగా టెస్టు ఓడిపోలేదు. ఆఖరిసారిగా 1987లో విండీస్ చేతిలో పరాజయం పాలైంది. అప్పటి నుంచి జరిగిన 11 టెస్టుల్లో భారత్ 10 గెలవగా, ఒకటి ‘డ్రా’గా ముగిసింది. -
మూడో టెస్టుకు రంగన హెరాత్ దూరం
పేలవ ప్రదర్శనతో కష్టాల్లో ఉన్న శ్రీలంక జట్టుకు మరో దెబ్బ తగిలింది. భారత జట్టుతో డిసెంబర్ 2న న్యూఢిల్లీలో మొదలయ్యే మూడో టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా హెరాత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని, గురువారం అతను స్వదేశానికి బయలుదేరుతాడని శ్రీలంక బోర్డు తెలిపింది. హెరాత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండెర్సేను ఎంపిక చేశారు. వాండెర్సే ఇప్పటివరకు 11 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్లు ఆడాడు. టెస్టు జట్టులో అతనికి తొలిసారి స్థానం లభించింది. -
ఇంగ్లండ్దే సిరీస్
మూడో టెస్టులో విండీస్పై విజయం లార్డ్స్: జేమ్స్ అండర్సన్ ఇన్నింగ్స్లో తన కెరీర్ ఉత్తమ బౌలింగ్ (7/42) గణాంకాలతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ను ఆతిథ్య జట్టు 2–1తో దక్కించుకుంది. శనివారం మూడో రోజు విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 65.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు ఆటలో టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న అండర్సన్ మూడో రోజు మరింత జోరును కనబరచడంతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. హోప్ (62), పావెల్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 28 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. స్టోన్మన్ (40 నాటౌట్), వెస్టీ›్ల (44 నాటౌట్) రాణించారు. -
సిరీస్ క్లీన్స్వీప్ ఇక ఖాయమే!
-
క్లీన్స్వీప్ ఇక ఖాయమే!
►మూడో టెస్టులోనూ భారత్ జోరు ►హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ ►శ్రీలంకకు ఫాలోఆన్ ►భారత్ తొలి ఇన్నింగ్స్ 487 సిరీస్లో తొలిసారి మెరుగ్గా ఆడుతున్నట్టు కనిపించిన శ్రీలంక రెండో రోజే చేతులెత్తేసింది. టి20 తరహాలో చెలరేగిన హార్దిక్ పాండ్యా వీరోచిత సెంచరీతో భారత్కు భారీ స్కోరును అందించగా... ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ (4/40) స్పిన్ మ్యాజిక్తో లంకనుచుట్టేశాడు.ప్రస్తుతం మరో 333 పరుగులు వెనకబడిన దశలో లంక పోరాడుతుందా? లేక మూడో రోజే వైట్వాష్కు గురవుతుందా? అనేది వేచి చూడాలి. పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేయడం ఇక లాంఛనమే అనుకోవాలి. కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న యువ బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్యా (96 బంతుల్లో 108; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) లంక స్పిన్నర్లపై విరుచుకుపడి తన తొలి శతకాన్ని అందుకున్నాడు. దీంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 122.3 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక తమ తొలి ఇన్నింగ్స్లో 37.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్కు 352 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ దశలో ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన లంక ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు మరో 333 పరుగులు చేయాల్సి ఉంది.ఆకాశమే హద్దుగా: రెండో రోజు భారత్ ఆటలో హార్దిక్ పాండ్యా టెయిలెండర్లను అండగా చేసుకుని వీరవిహారం చేశాడు. లంచ్ సెషన్లోపే సెంచరీ చేశాడు. 329/6 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ సాహా (16) రూపంలో త్వరగానే వికెట్ కోల్పోయింది. అయితే కుల్దీప్తో(26; 2 ఫోర్లు) కలిసి పాండ్యా ఎనిమిదో వికెట్కు 62 పరుగులు జత చేశాడు. తన తొలి అర్ధ సెంచరీని 61 బంతు ల్లో చేసిన పాండ్యా... ఆ తర్వాత 25 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి తొలి సెంచరీని అందుకున్నాడు. పుష్ప కుమార వేసిన ఇన్నింగ్స్ 116వ ఓవర్లో పాండ్యా వరుసగా 2 ఫోర్లు, 3 సిక్స్లు కొట్టి 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. చివర్లో ఉమేశ్తో కలిసి 26 బంతుల్లోనే 50 పరుగులు జత చేసిన పాండ్యా... సందకన్ బౌలింగ్లో అవుటయ్యాడు. టప టపా వికెట్లు: తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన లంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. చండిమాల్ (48; 6 ఫోర్లు), డిక్వెలా (29; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.ఓపెనర్లను షమీ పెవిలియన్కు చేర్చగా... కుల్దీప్, అశ్విన్ స్పిన్ ఉచ్చులో మిగతా వారు విలవిల్లాడారు. -
తడబడిన భారత మిడిల్ ఆర్డర్
-
ఆరంభం అదిరినా!
► తడబడిన భారత మిడిల్ ఆర్డర్ ► తొలి ఇన్నింగ్స్ 329/6 ► ధావన్ శతకం ► రాహుల్ అర్ధ సెంచరీ ► రాణించిన లంక బౌలర్లు విదేశీ గడ్డపై తొలిసారిగా మూడు టెస్టుల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తున్న భారత్కు ఈ సిరీస్లో తొలిసారిగా శ్రీలంక బౌలర్ల నుంచి ఇబ్బంది ఎదురైంది. తొలి సెషన్లో భారత్ చెలరేగినా... తర్వాతి రెండు సెషన్లలో శ్రీలంక బౌలర్లు పైచేయి సాధించారు. శిఖర్ ధావన్, రాహుల్ తొలి వికెట్కు 188 పరుగులు జత చేయడంతో.. ఇక మరోసారి భారీ స్కోరు ఖాయమే అనిపించింది. ఓపెనర్లు పెవిలియన్కు చేరాక సీన్ రివర్స్ అయ్యింది. మిడిల్ ఆర్డర్ తడబాటుతో భారత్ 141 పరుగుల తేడాలో ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో 600 పైచిలుకు స్కోరు చేసిన భారత్ ఈసారి 400 పరుగులు దాటే విషయం టెయిలెండర్ల చేతుల్లో ఆధారపడి ఉంది. పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో ఎప్పటిలాగే తొలి రోజు భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు) సిరీస్లో రెండో శతకంతో చెలరేగడంతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో టీమిండియా 400 పరుగులు కూడా సులువుగా దాటేస్తుందేమో అనిపించినా... అనూహ్యంగా శ్రీలంక బౌలర్లు విజృంభించారు. దీంతో ఫామ్లో ఉన్న మిడిలార్డర్ కూడా పూర్తిగా తడబడింది. ఫలితంగా శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (84 బంతుల్లో 42; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... క్రీజులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (38 బంతుల్లో 13 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (1 బ్యాటింగ్) ఉన్నారు. పుష్పకుమారకు మూడు, సందకన్కు రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా స్థానంలో ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ భారత తుది జట్టులోకి వచ్చాడు. సెషన్–1 ఓపెనర్ల జోరు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు శిఖర్ ధావన్, రాహుల్ జోడి అద్భుత ఆరంభాన్ని అందించింది. పిచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో ఈ జోడి యథేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించింది. ఆరో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు బాదగా, ధావన్ మరో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్ను మిడ్ ఆన్లో పుష్పకుమార జారవిడిచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ వన్డే తరహాలో చెలరేగిన వీరిద్దరు 107 బంతుల్లోనే జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. అటు చక్కటి ఫోర్తో రాహుల్ 67 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో కూడా అతను వరుసగా రెండు ఫోర్లు బాది పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. ఓవర్లు: 27, పరుగులు: 134, వికెట్లు: 0 సెషన్–2 ధావన్ శతకం లంచ్ అనంతరం కూడా శిఖర్, రాహుల్ దూకుడును కొనసాగించారు. అయితే 39 ఓవర్ల అనంతరం ఎడంచేతి వాటం స్పిన్నర్ పుష్పకుమారను బరిలోకి దింపిన లంక ఫలితం పొందింది. వరుసగా ఏడోసారి కూడా తన హాఫ్ సెంచరీని శతకంగా మలచకుండా రాహుల్ మిడ్ ఆన్లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే తన జోరును కొనసాగించిన ధావన్ మాత్రం 107 బంతుల్లో సిరీస్లో రెండో శతకాన్ని అందుకున్నాడు. కానీ కొద్దిసేపటికే పుష్పకుమార... ధావన్ వికెట్ కూడా తీసి లంక శిబిరంలో డబుల్ సంతోషాన్ని నింపాడు. పుజారా (8) కూడా త్వరగానే అవుట్ కావడంతో కోహ్లి, రహానే జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా టీ బ్రేక్కు వెళ్లారు. ఓవర్లు: 29, పరుగులు: 101, వికెట్లు: 3 సెషన్–3 తడబాటు ఆఖరి సెషన్లో లంక బౌలర్ల హవా సాగింది. స్పిన్నర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. రహానే (17) వికెట్ను కూడా పుష్పకుమార తీయడంతో భారత్ 264 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, అశ్విన్ (75 బంతుల్లో 31; 1 ఫోర్) జోడి లంక బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంది. 12 ఓవర్లు ఆడిన ఈ జోడి ఒక్క బౌండరీ కూడా నమోదు చేయలేకపోయింది. చివరికి 79వ ఓవర్లో స్పిన్నర్ సందకన్కు కోహ్లి దొరికిపోయాడు. మరో రెండు ఓవర్లలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా అశ్విన్ కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫెర్నాండో బౌలింగ్లో అవుట్ కావడంతో జట్టు ఆరో వికెట్ను కోల్పోయింది. ఓవర్లు: 34, పరుగులు: 94, వికెట్లు: 3 గతంలో నా ఆట గాడి తప్పినప్పుడు పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడేవాణ్ని. కానీ ఇప్పుడలా కాకుండా నా సహజ శైలినే నమ్ముకుంటున్నాను. అదే ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. రాహుల్, నేను బాగా ఆడాం. అయితే దూకుడుగా వెళుతున్నప్పుడు అదే తరహాలోనే అవుట్ కూడా అవుతుంటాం. చివరి రెండు సెషన్లలో వికెట్లను కోల్పోవడం సాధారణమే. స్పిన్నర్లు పుష్పకుమార, సందకన్ నిలకడగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినా తొలి రోజు మేం సాధించిన 329 పరుగులు మరీ తక్కువేమీ కాదు. అయితే ఈ పిచ్పై భారీ స్కోరు కోసం పరుగులు చేయడం కష్టమే. – భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ⇒ వరుసగా ఏడు టెస్టుల్లో అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా, ఓవరాల్గా ఆరో క్రికెటర్గా కేఎల్.రాహుల్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఎవర్టన్ వీక్స్, ఆండీ ఫ్లవర్, చందర్పాల్, సంగక్కర, క్రిస్ రోజర్స్ ఇలా చేశారు. ⇒ మూడు టెస్టుల సిరీస్లో వరుసగా 3 సార్లు తొలి ఇన్నింగ్స్లో తొలి రోజే 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. ⇒ కోహ్లి కెప్టెన్సీలో భారత్ వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో కనీసం ఒక మార్పుతో బరిలోకి దిగింది. ⇒ శ్రీలంక గడ్డపై టెస్టుల్లో తొలి వికెట్కు అత్యధిక పరుగుల (188) భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా ధావన్, రాహుల్ గుర్తింపు. ⇒ శిఖర్ ధావన్ టెస్టుల్లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. ఇందులో ఐదు విదేశీ గడ్డపైనే వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) చండిమాల్ (బి) పుష్పకుమార 119; రాహుల్ (సి) కరుణరత్నే (బి) పుష్పకుమార 85; పుజారా (సి) మాథ్యూస్ (బి) సందకన్ 8; కోహ్లి (సి) కరుణరత్నే (బి) సందకన్ 42; రహానే (బి) పుష్పకుమార 17; అశ్విన్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 31; సాహా బ్యాటింగ్ 13; పాండ్యా బ్యాటింగ్ 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో ఆరు వికెట్లకు) 329. వికెట్ల పతనం: 1–188, 2–219, 3–229, 4–264, 5–296, 6–322. బౌలింగ్: ఫెర్నాండో 19–2–68–1; లాహిరు కుమార 15–1–67–0; కరుణరత్నే 5–0–23–0; పెరీరా 8–1–36–0; సందకన్ 25–2–84–2; పుష్పకుమార 18–2–40–3. -
'85 ఏళ్ల రికార్డు'పై విరాట్ సేన గురి!
పల్లెకెలె: ఇప్పటికే శ్రీలంకతో టెస్టు సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డుపై దృష్టి సారించింది. మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. చివరిదైన మూడో టెస్టును భారత జట్టు గెలిచిన పక్షంలో.. విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్స్వీప్ చేసిన తొలి భారత క్రికెట్ జట్టుగా విరాట్ సేన నిలుస్తోంది. భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు ప్రయాణంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును విరాట్ సేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ ఘనతను సాధించేందుకు భారత జట్టు కసరత్తులు చేస్తోంది. రేపు(శనివారం) ఉదయం గం.10.00ని.లకు పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ -శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంచితే, గత రెండు టెస్టు మ్యాచ్ ల్లో భారత జట్టు ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 304 పరుగుల తేడాతో విజయం సాధించగా, కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-1తో గెలిచింది. రిజర్వ్ బెంచ్ పరీక్ష! ఇప్పటికే సిరీస్ ను గెలిచిన పక్షంలో ఫైనల్ మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ ను పరీక్షించాలని భారత జట్టు యోచిస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ కారణంగా రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో స్సిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు జతగా కుల్దీప్ స్పిన్ విభాగాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరొకవైపు భువనేశ్వర్ కుమార్ కూడా ఆడే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో భువనేశ్వర్ ను జట్టులో తీసుకోవచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో కొనసాగిస్తే మాత్రం కుల్దీప్ కు చోటు కష్టం. ఇక్కడ స్పెషలిస్టు సీమర్ ను ఆడించేందుకు కోహ్లి మొగ్గుచూపుతున్నాడు. జట్లు అంచనా: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: దినేష్ చండీమాల్(కెప్టెన్), దిముత్ కరుణరత్నే,ఉపుల్ తరంగా, కుశాల్ మెండిస్, మాథ్యూస్, నిరోషాన్ డిక్ వెల్లా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, దిల్రువాన్ పెరీరా, రంగనా హెరాత్, మలిందా పుష్పకుమార, నువాన్ ప్రదీప్ -
కష్టాల్లో దక్షిణాఫ్రికా
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కష్టాల్లో పడింది. 492 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఎల్గర్ (72 బ్యాటింగ్), బవుమా (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి మరో 375 పరుగులు అవసరంకాగా... చేతిలో ఆరు వికెట్లు మిగిలి ఉన్నాయి. సోమవారం మ్యాచ్కు ఆఖరి రోజు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 74/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 79.5 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులవద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. -
ఓటమి దిశగా విండీస్
రొసియూ (డొమినికా): పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట చివరి రోజు ఆదివారం కడపటి వార్తలు అందే సమయానికి 59 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అంతకుముందు పాక్ తమ రెండో ఇన్నింగ్స్ను ఎనిమిది వికెట్లకు 174 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. -
వెస్టిండీస్ 140/3
రోసెవూ: పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం కడపటి వార్తలందేసరికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (32), షై హోప్ (26) క్రీజ్లో ఉన్నారు. పావెల్ (31), బ్రాత్వైట్ (29), హెట్మైర్ (17) అవుటయ్యారు. పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా ఈ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. మూడు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. -
పాకిస్తాన్ 75/1
రొసియూ (డొమినికా): వెస్టిండీస్తో బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందేసరికి తొలి ఇన్నింగ్స్లో 28 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. మసూద్ (9) అవుటవ్వగా... అజహర్ అలీ (38 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బాబర్ ఆజమ్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
న్యూజిలాండ్తో మూడో టెస్టు ‘డ్రా’
దక్షిణాఫ్రికాదే సిరీస్ ఆఖరి రోజు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. డుప్లెసిస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు 1–0తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య డ్యూనెడిన్లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’కాగా... వెల్లింగ్టన్లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టెస్టు సిరీస్కు ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 3–2తో సొంతం చేసుకుంది. -
కష్టాల్లో దక్షిణాఫ్రికా
హామిల్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఎదురీదుతోంది. 175 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డు ప్లెసిస్ (15 బ్యాటింగ్), డి కాక్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 321/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 489 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (176; 16 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
విలియమ్సన్ సెంచరీ
హామిల్టన్: కేన్ విలియమ్సన్ (216 బంతుల్లో 148 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్ భారీస్కోరు దిశగా పయనిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 67/0తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు లాథమ్ (50; 10 ఫోర్లు), రావల్ (88; 10 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ఈ క్రమంలో విలియమ్సన్ తన టెస్టు కెరీర్లో 17వ సెంచరీ పూర్తిచేశాడు. తద్వారా కివీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మార్టిన్ క్రో (17) సెంచరీల రికార్డును సమం చేశాడు. సఫారీ బౌలర్లలో రబడా, మోర్కెల్ చెరో 2 వికెట్లు తీశారు. -
డ్రాగానే ముగిసింది..
-
డ్రాగానే ముగిసింది..
రాంచీ:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటన ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది. ప్రధానంగా హ్యాండ్ స్కాంబ్(68 నాటౌట్; 194 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(53;197 బంతుల్లో 7 ఫోర్లు)లు బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ను డ్రా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ 124 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం. అంతకుముందు 23/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ స్కోరు 59 పరుగుల వద్ద రెన్ షా(15) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆసీస్ మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(21) అవుటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 30 ఓవర్ తొలి బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా సంధించిన బంతి గింగిరాలు తిరుగుతూ వచ్చి స్మిత్ వికెట్లను ఎగరేసుకుపోయింది. ఆ తరుణంలో షాన్ మార్ష్-హ్యాండ్ స్కాంబ్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. సుమారు రెండు సెషన్లు హ్యాండ్ స్కాంబ్-షాన్ మార్ష్లు భారత్ బౌలింగ్ కు అడ్డంగా నిలబడ్డారు. ఒకవైపు స్పిన్ బౌలింగ్ వారిని ఇబ్బంది పెడుతున్నా మొక్కువోని దీక్షతో పోరాటం సాగించారు. ఈ క్రమంలోనే తొలుత హ్యాండ్ స్కాంబ్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత షాన్ మార్ష్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే మ్యాచ్ ఇంకా పది ఓవర్లలో ముగుస్తుందనగా షాన్ మార్ష్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో మ్యాక్స్ వెల్(2)ను అశ్విన్ అవుట్ చేశాడు. కాగా, అప్పటికే ఫలితం పై ఆశలు వదులుకున్న భారత్ కేవలం కట్టుదిట్టంగా మాత్రమే బౌలింగ్ చేసింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి హ్యాండ్ స్కాంబ్ కు జతగా వేడ్(9 నాటౌట్) క్రీజ్ లో నిలిచాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుతం ఇరు జట్లు తలో టెస్టు గెలిచి సిరీస్ లో 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్ లో చివరిదైన నాల్గో టెస్టు మార్చి 25వ తేదీన ధర్మశాలలో ఆరంభం కానుంది. -
ఆసీస్.. అతి జాగ్రత్తగా!
రాంచీ:మూడో టెస్టు నాల్గో రోజు ఆట చివరి సెషన్లో రెండు వికెట్లు, ఆపై ఐదో రోజు తొలి సెషన్లో మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా అతి జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళుతోంది. కచ్చితమైన ఆటతో భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరి రోజు టీ విరామానికి నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆసీస్ ఆటగాళ్లు హ్యాండ్ స్కాంబ్(44 బ్యాటింగ్;115 బంతుల్లో), షాన్ మార్ష్(38 బ్యాటింగ్; 127 బంతుల్లో) లు క్రీజ్ లో నిలబడి భారత్ కు పరీక్షగా నిలిచారు. వీరిద్దరూ కలిసి దాదాపు 40.0 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ తిరిగి పుంజుకుంది. అంతకుముందు 23/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ స్కోరు 59 పరుగుల వద్ద రెన్ షా(15) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆసీస్ మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(21) అవుటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 30 ఓవర్ తొలి బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా సంధించిన బంతి గింగిరాలు తిరుగుతూ వచ్చి స్మిత్ వికెట్లను ఎగరేసుకుపోయింది. దాంతో ఆసీస్ స్కోరు 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో షాన్ మార్ష్-హ్యాండ్ స్కాంబ్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ కు వికెట్ దక్కింది. -
అదొక ఛాలెంజ్: ఆసీస్ కోచ్
రాంచీ: భారత్ తో మూడో టెస్టు చివరిరోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడటం తమకు అసలు సిసలైన ఛాలెంజ్ అని ఆసీస్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ స్పష్టం చేశాడు. నాల్గో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీసిన జడేజాపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. తమ ఆటగాళ్లు ఇద్దరూ మంచి బంతులకే పెవిలియన్ చేరారని పేర్కొన్న లీమన్.. ఈ తరహా ఘటనలు క్రికెట్ గేమ్లో సహజమన్నాడు. ఆఖరి రోజు ఆటలో తాము కచ్చితంగా భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మాకు ఛాలెంజ్. ప్రధానంగా జడేజాను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. అతను సంధించిన రెండు అద్భుతమైన బంతులకు రెండు వికెట్లను కోల్పోయాం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ను జడేజా అవుట్ చేసిన తీరు అమోఘం. జడేజాపై మా ఫోకస్ పెట్టాం. మా వికెట్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మా పది వికెట్లను తీసి గెలుపొందడం భారత్ కు కఠినమైన సవాల్'అని లీమన్ తెలిపాడు. -
ఇషాంత్ కు చిర్రెత్తుకొచ్చింది!