Amazon India
-
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్ను విమర్శించారు. గతంలో బెజోస్కు చెందిన వాషింగ్టన్ పోస్ట్లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్కు సంబంధించి అమెజాన్కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్మస్క్ ఇప్పటికే ట్రంప్నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
అమెజాన్ బెంగళూరు హెడ్క్వార్టర్స్ తరలింపు
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా అద్దెకు తీసుకునే సంస్థ దొరకడం కష్టమే.అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభమై 2026 ఏప్రిల్లో ముగుస్తుంది.🚨 Amazon India is moving its headquarters from WTC building in Bengaluru near to the city's airport to save costs. pic.twitter.com/WItCV9suYP— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2024 -
ఆఫీస్కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్సీఎస్ పోర్టల్లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' పేర్కొన్నారు.ప్రాజెక్ట్ ఆశ్రయ్అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంఅమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది. -
ఈ ఏడాది చివరి నాటికి రూ.1.08 లక్షల కోట్లు!.. అమెజాన్ డైరెక్టర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ (అమెజాన్ ఇండియా ఎగుమతుల కార్యక్రమం) ఎగుమతులు ఈ ఏడాది చివరికి మొత్తంగా 13 బిలియన్ డాలర్లకు (రూ.1.08 లక్షల కోట్లు) చేరుకుంటాయని సంస్థ డైరెక్టర్ భూపేన్ వకంకర్ తెలిపారు. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నట్టు చెప్పారు. 2015లో అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్లో తయారైన 40 కోట్లకుపైగా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందించినట్టు వకంకర్ తెలిపారు. 2015 నుంచి 2023 మధ్య అమెజాన్ 8 బిలియన్ డాలర్ల ఎగుమతులే నమోదు చేయగా, కేవలం ఏడాది వ్యవధిలోనే (2023–24) 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వివరించారు. గడిచిన 12 నెలల్లో 50వేల కొత్త విక్రేతలను ఇందులో చేర్చుకున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం విక్రేతల సంఖ్య 1.5 లక్షలకు చేరుకున్నట్టు వెల్లడించారు. దేశీ విక్రేతలు అంతర్జాతీయ బ్రాండ్ల సృష్టికి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ వీలు కల్పిస్తోంది. సౌందర్య ఉత్పత్తుల ఎగుమతులు 2023లో 40 శాతం వృద్ధిని చూడగా, వస్త్రాలు, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యధిక వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ భారత విక్రేతలకు ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా ఉన్నట్టు అమెజాన్ విడుదల చేసిన ‘ది ఎక్స్పోర్ట్స్ డైజెస్ట్ 2024’ నివేదిక వెల్లడించింది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు డెలివరీ
ఏదైనా వస్తువులను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్సైట్లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.Thank you Amazon for delivering my order after 2 years. The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024 -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
టార్గెట్ ఫినిష్ చేస్తేనే వాష్రూమ్, వాటర్ బ్రేక్.. ప్రతిజ్ఞ చేయించారు
హర్యానాలోని మనేసర్లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు గిడ్డంగులలో వారానికి ఐదు రోజులు, రోజుకు 10 గంటలు పని చేసి నెలకు రూ.10088 సంపాదిస్తున్నట్లు ఓ యువకుడు వెల్లడించారు. షిఫ్ట్ సమయంలో సమయం వృధా చేయకూడదని, సీనియర్లు వాష్రూమ్లను కూడా చెక్ చేస్తుంటారని పేర్కొన్నారు.లంచ్ లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిముషాలు విరామం లేకుండా పనిచేయాలని. రోజుకు నాలుగు ట్రక్కులకంటే ఎక్కువ దించలేము. అయినా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారు. అనుకున్న టార్గెట్ (పని) పూర్తి చేసేవరకు నీరు తాగడానికి లేదా వాష్రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని మా చేత ప్రతిజ్ఞ చేయించారని చెప్పారు.పనిచేసే మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన రూమ్ లేదని, ఒకవేలా వాష్రూమ్ లేదా లాకర్ రూమ్లో ఉండాల్సి వస్తుంది. ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని వాపోయారు.దీనిపైన అమెజాన్ ఇండియా అధికారులు స్పందిస్తూ.. ఈ రకమైన రూల్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఒకవేలా మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆరాతీస్తామని చెప్పారు. కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి రూల్స్ పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. -
రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్..
అమెజాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 1.2 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించారు. ఈ మేరకు 7, 8 తేదీల్లోనే 1.19 కోట్ల షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు తెలిసింది. ఇంతటితో బెజోస్ షేర్ల అమ్మకాలు అయిపోయినట్లు కాదని సమాచారం. మొత్తంగా 8.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదనగా తెలిసింది. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది నవంబర్లోనే వెల్లడించారు. తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో విక్రయించినట్లు బెజోస్ వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్ను విక్రయించినా.. ఇంకా ఆయన 11.8 శాతం వాటా కలిగి ఉంటారని అంచనా. తన నివాసాన్ని సియాటెల్ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్లో బెజోస్ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్ డాలర్లతో ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్ డాలర్ల ‘బెజోస్ డే వన్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల నిర్ణయం ఆ సమయంలో మెకెంజీ స్కాట్కి అమెజాన్లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు(రూ.2.9లక్షల కోట్లు). దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
20వేల ఉత్పత్తులతో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్.. ఎక్కడో తెలుసా..
దిల్లీలో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వచ్ఛత స్టోర్లో వాక్యూమ్ క్లీనర్లు, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైయర్లు, మాప్లు, చీపుర్లతో సహా దాదాపు 20,000 క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు అమెజాన్ ఇండియా కన్జూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా’ అనే ప్రభుత్వ విజన్కు మద్దతివ్వడంపట్ల ఆనందంగా ఉందన్నారు. అమెజాన్ ఎప్పుడూ ‘స్మార్ట్ క్లీనింగ్, అందరికీ పారిశుధ్యం అందించడం, పూర్తి పరిశుభ్రత, పర్యావరణ రక్షణ’కు కట్టుబడి ఉందని తెలిపారు. దేశ పారిశుధ్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన సూచనలు చేయాలని కోరారు. అన్ని దేశాలతో సత్సంబంధాలకి తమ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రేవంత్రెడ్డి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాం«దీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ రాష్ట్రంగా ఆవిర్భావం తాము ప్రకటించి అమలు చేస్తోన్న ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు సీఎంతో అమెజాన్ బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. రాష్ట్రంలో అమెజాన్ సంస్థ పెట్టిన పెట్టుబడులు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ ప్రణాళికల వంటి అంశాలను ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు పాల్గొన్నారు. -
అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే!
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ మొదలపోతోంది. నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ బ్యూటీ సేల్ 26 వరకు ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద 50 నుంచి 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కే-బ్యూటీ నుంచి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్ జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, బ్యూటీ బ్రాండ్ల వంటి ఉత్పత్తులు, సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు. అసలే శీతాకాలం పైగా వివాహాల సీజన్.. కొందరు చర్మ రక్షణ కోసం మరి కొందరు ఫంక్షన్స్లో ప్రత్యేకంగా కనిపించడం కోసం అనేక సౌదర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి అమెజాన్ ద బ్యూటీ సేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో మీద మంచి డీల్స్, ఫ్రీ గిఫ్ట్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బై మోర్, సేవ్ ఆఫర్స్ కింద కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 PM డీల్స్, సబ్స్క్రైబ్ అండ్ సేవ్తో 10% వరకు ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ షాపింగ్, ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుంచి ఉత్పత్తి అనుకూలత వంటి వాటికి కంపెనీ అందిస్తుంది. మేబిలైన్, లోరియల్ ప్రొఫెషనల్, బయోటిక్, కామా ఆయుర్వేద, స్విస్ బ్యూటీ, లాక్మే, రినీ కాస్మెటిక్స్, మైగ్లామ్, కలర్ బార్ కాస్మటిక్స్, పౌలాస్ ఛాయిస్.. ఇంకా ఎన్నో 300 కంటే ఎక్కువ బ్రాండ్స్పై ఉత్తేజభరితమైన 8000 కంటే ఎక్కువ డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ద బ్యూటీ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జెబా ఖాన్' మాట్లాడుతూ.. ఇప్పటికే ది బ్యూటీ సేల్ మొదటి రెండు ఎడిషన్లకు కస్టమర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మూడవ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. చర్మ సంరక్షణ, మేకప్ వంటి లగ్జరీ ఉత్పత్తులతో అందాన్ని మరింత పెంచుకోవడంలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అందం మీద ద్రుష్టి పెట్టే ప్రతి ఒకరికి ఇది సరైన చోటు అని వెల్లడించారు. -
Amazon: వందల ఉద్యోగులపై వేటు.. ఇప్పటికే 27వేల మంది ఔట్.. కారణం ఇదేనా
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దానికితోడు పెరుగుతున్న సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలపై వేటు పడుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం ప్రకటించింది. లేఆఫ్స్కు సంబంధించి ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపింది. వాణిజ్య ప్రాధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాంతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు ఆయన నిరాకరించినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. లేఆఫ్స్పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలెక్సా వాయిస్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ కంపెనీలు ప్రస్తుతం ఏఐ టూల్స్పై ఆధారపడడం పెరుగుతోంది. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ సైతం కొన్ని నెలలుగా ఏఐని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్లో అలెక్సాలో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెజాన్ సంస్థ గతేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయిన ఈ సినిమా ఎక్కువ నిడివి కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు నిడివి తగ్గించడంతో సినిమాపై ప్రేక్షకులు అభిప్రాయం మారింది. దీంతో తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్ఖేర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ వీకెండ్లో మరోసారి తమ అభిమాన హీరో సినిమాను ఇంట్లో ఉండి మరోసారి చూడొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటలో ఉంది. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. -
పండుగ సీజన్లో అమెజాన్ జోష్.. 13 ఏళ్లలో ఇదే బెస్ట్!
కోల్కత: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండుగల సీజన్తో జోష్ మీద ఉంది. దేశంలో తన 13 సంవత్సరాల కార్యకలాపాలలో ప్రస్తుత సీజన్ అత్యుత్తమంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రతి విభాగంలోనూ ఇదే అత్యుత్తమ సంవత్సరమని అమెజాన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్, లార్జ్ అప్లయాన్సెస్ డైరెక్టర్ నిశాంత్ సర్దానా తెలిపారు. ‘కోవిడ్ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే డిమాండ్లో పునరుద్ధరణను సూచించే గ్రామీణ కొనుగోళ్లలో అమెజాన్ ఎలాంటి మందగమనాన్ని చూడలేదు. 80 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి, నాల్గవ తరగతి మార్కెట్ల నుంచి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు బలమైన వృద్ధిని కనబరిచాయి. పండుగల సీజన్ కోసం దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించాం’ అని వివరించారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీల వ్యాపారం 18–20 శాతం వృద్ధితో రూ.90,000 కోట్లు నమోదు చేయవచ్చని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేస్తోంది. -
‘రహస్య అల్గారిథమ్’ ద్వారా రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్.. ఎలాగంటే..
దిగ్గజ ఆన్లైన్ ఈకార్ట్ ప్లాట్ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. అమెజాన్ ఆన్లైన్ సూపర్స్టోర్ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది. కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్లు, హాలిడే షాపింగ్ సీజన్లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే.. అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
శాట్కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్
Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్ నుంచి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనుమతి కోరింది. వన్వెబ్, జియో శాటిలైట్, ఎలాన్మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్లింక్ వంటి ప్రాజెక్ట్లకోవలోకి అమెజాన్ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్లింక్ జీఎంపీసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్వెబ్ ఈ జీఎంపీసీఎస్ లైసెన్స్ను పొందాయి. భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్లకు వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్ నుంచి బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు. అయితే కంపెనీలు ఇన్స్పేస్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. -
అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్తోపాటు జాబ్స్..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. (Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్బస్లో భారీగా ఉద్యోగాలు) అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు. ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్వర్క్లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్వర్క్ పరిధిలోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు. -
ఈ-కామర్స్కు భారత్ ‘అమెజాన్’:ఇక్కడి మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. డిజిటైజేషన్, ఆర్థిక వృద్ధి, మొబైల్, ఇంటర్నెట్ విస్తృతి, యువత కారణంగా ఊపందుకున్న భారత ఈ-కామర్స్ ఆకర్షణీయంగా ఉందని అమెజాన్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ తెలిపారు. ఇక్కడ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కాలపరిమితి అంశంలో చాలా స్పష్టత ఉందన్నారు. కంపెనీ తన 2025 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉందని చెప్పారు. అమెజాన్ ఇటీవలే భారత్లో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సంస్థకు ఇక్కడి మార్కెట్లో 10 కోట్ల పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికీ పరిమితమని, దేశంలో ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో పదేళ్ల వరకు ఈ-కామర్స్ రంగంలో విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉత్తేజకర మార్కెట్గా..: ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చాలా ఉత్తేజకర మార్కెట్గా భారత్ కొనసాగుతోందని మనీష్ తెలిపారు. కాబట్టి అంతర్జాతీయంగా ఇక్కడి విపణిపై అమెజాన్ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ‘భారత మార్కెట్ చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంతటి వ్యాపార అవకాశాలున్న మార్కెట్లు ఎక్కువగా లేవు. ఈ-కామర్స్ విస్తృతి తక్కువగా ఉండడంతో పోటీ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. విస్తృతి 90 శాతానికి చేరినప్పుడు పోటీ గురించి ఆందోళన చెందాలి. కస్టమర్ అంచనాలను ఎలా అందుకోవాలో తొలి 10 ఏళ్లు మాకు నేర్పించాయి. మార్కెట్ చాలా నూతనంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. దీర్ఘకాలంలో మా అమ్మకందారులకు, కస్టమర్లకు ఇది మంచిదని భావిస్తున్నాను’ అని అన్నారు. భారత ఈ-కామర్స్ మార్కెట్ 2022లో 83 బిలియన్ డాలర్లు నమోదైంది. 2026 నాటికి ఇది 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎఫ్ఐఎస్ 2023 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
Amazon Great Freedom Festival sale 2023 ఆన్లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్టాప్లు , వైర్లెస్ ఇయర్బడ్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్టాప్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. -
సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ను ఉపయోగించి ఆన్లైన్లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపింది. రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి? ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.2,000 నోటు ఉపసంహరణ మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు. చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే? -
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్లో 27 శాతం డిస్కౌంట్తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో -
అమెజాన్ పేపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది. (చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో, అతి తక్కువ ధరలో! ) -
‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ లేఆఫ్స్ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు పోతున్నాయని తెలిసిన సిబ్బంది కార్యాలయాల క్యాబిన్లలో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తాజాగా అమెజాన్లో ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసిన ఓం ప్రకాశ్ శర్మ ఉద్యోగం పోవడంతో తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని నెటిజన్లతో పంచుకున్నారు. లింక్డ్ఇన్ పోస్ట్లో అమెజాన్ మాజీ ఉద్యోగి, సీనియర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఓంప్రకాష్ శర్మ లేఆఫ్స్పై స్పందించారు.‘2022 నా జీవితంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న సంవత్సరం. ఐసీయూలో రెండు, మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత మా నాన్నని కోల్పోయాను. ఆ కారణంగా నాలుగు నెలలు పాటు ఆఫీస్ వర్క్ చేయలేదు. ఈ ఏడాది జనవరి 11న అమెజాన్ తొలగించిన ఉద్యోగుల్లో నేను ప్రభావితమయ్యాను’ అని పేర్కొన్నారు. అమెజాన్లో ఉద్యోగం చేసిన ఐదేళ్లు ప్రొఫెషనల్ కెరియర్లోనే అత్యంత అద్భుతమైన సమయం. సహచర ఉద్యోగులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాధించాను. అయితే, వారి సపోర్ట్కు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు మీ సహాయం అవసరం. దయచేసి నాకు సరైన అవకాశం కల్పించేలా చూడండి అని శర్మ లింక్డ్ఇన్లో రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి👉 ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
అమెజాన్ ఉద్యోగాల కోత, ‘ఆఫీస్లో వెక్కివెక్కి ఏడుస్తున్న ఉద్యోగులు’!
కొద్ది రోజుల క్రితం సీఈవో ఆండీ జెస్సీ ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగుల్లో 18000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిలో భారత్కు చెందిన 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలగింపులతో అమెజాన్ ఇండియా కార్యాలయాల్లో చీకటి వాతావారణం నెలకొంది. పింక్ స్లిప్లు అందుకున్న ఉద్యోగులు ఆఫీస్లోనే బోరున విలపిస్తున్నట్లు వారి సహచర ఉద్యోగులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రొఫెషనల్ యాప్ గ్రేప్వైన్లో అమెజాన్లో పనిచేస్తున్న ఉద్యోగి మారుపేరుతో సంస్థలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఓ పోస్ట్ చేశారు. అందులో సదరు ఉద్యోగి.. నా టీమ్లో 75శాతం మంది ఫైర్ అయ్యారు. మిగిలిన 25శాతం మంది పనిచేసేలా వారిని మోటివేట్ చేయలేను. ఎందుకంటే క్యాబిన్లోనే ఉద్యోగం నుంచి పోతుంది. కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయని ఏడుస్తున్నారని అందులో పేర్కొన్నారు. అమెజాన్ ఇండియా ఉద్యోగులు ఎక్కడి వారంటే అమెజాన్ ఇండియాలో ఉద్యోగుల తొలగింపులు బెంగళూరు, గుర్గావ్ కేంద్రంగా అమెజాన్లో పనిచేస్తున్న పలు విభాగాలకు చెందిన పనిచేసే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. -
అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ!
మీరు తక్కువ బడ్జెట్లో ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. కేవలం 7వేల రూపాయలకు ఎల్ఈడీ స్మార్ట్టీవీని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో ఫీచర్లు పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గుతున్నాయి. గతంలో ఎల్ఈడీ స్మార్ట్టీవీ 32 ఇంచెస్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్ టీవీ రూ. 10వేలు లోపే దొరుకుతోంది. తాజాగా అమెజాన్ రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్ టీవీ తన కస్టమర్లకు అందిస్తోంది. అమెజాన్ అదిరిపోయే ఆఫర్ VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర చూస్తే బడ్జెట్లోనే దొరుకుతోంది. ఎలా అంటే కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999 ఉండగా, అమెజాన్ వెబ్సైట్లో 48% డిస్కౌంట్ను లభ్యమవుతోంది. ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్పుట్ ఉంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్టలతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్లు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్కు అమెజాన్ బంపరాఫర్! -
అమెజాన్లో ఏం జరుగుతోంది? భారత్లో మరో బిజినెస్ మూసివేత!
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్కు స్వస్తి పలికినట్లు సమాచారం. అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్ అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్లో ఆ ప్లాట్ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
‘టీవీలు, ఫ్రిజ్లు కొనకండి.. ప్రమాదం ముందుంది’.. జెఫ్ బెజోస్ షాకింగ్ వ్యాఖ్యలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని, మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని ప్రజలు అందుకు తగ్గట్టు సన్నద్ధంగా ఉండాలని ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు. ఇకపై డబ్బులు దాచుకోవాలన్న బెజోస్, టీవీ ,ఫ్రీజ్, కారు కొనాలనే ఆలోచన ఉంటే వాటిని దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు నగదుని మీ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా కనిపించడం లేదు. దీని ప్రభావమే అనేక రంగాలలో ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు చెప్పారు. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులు తమ వద్ద నగదు నిల్వ ఉంచుకొని.. కొత్త వస్తువుల కొనుగోలు నిలిపి వేయాలని సూచించారు.కాగా, బెజోస్ తన సంపదలో సింహ భాగం సమాజ సేవకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ విలువ $123.9 బిలియన్ డాలర్లు ఉన్నాయి. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కింద రూ.50వేల వరకు రుణాలు! -
భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్పైనే ఎక్కువ ప్రభావం!
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక మాంద్యం ముప్పు ఉన్న నేపథ్యంలో ఇటీవల దిగ్గజ సంస్థలు సైతం భారీగా లేఆఫ్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తమ సిబ్బంది సంఖ్యను భారీగానే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపుల ప్రభావం ఇతర దేశాల కంటే భారత్లో ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు బిజినెస్ పత్రికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అమెజాన్ ప్రభావం భారత్పై పడనుంది! భారత్లో ఈ టెక్ దిగ్గజం ఇ-కామర్స్, వెబ్ సేవలు, వీడియో స్ట్రీమింగ్తో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఎకానమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ (Facebook)తో పాటు పలు దిగ్గజ సంస్ధలు సైతం తమ సిబ్బందిని భారీగానే తగ్గించుకుంటున్నాయి. అయితే ఇతర సంస్థలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండవచ్చుని పేర్కొంది. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలతో సహా, అమెజాన్ సంస్థకు భారతదేశంలో 1.1 మిలియన్లకు( 11 లక్షల సిబ్బంది) పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుత లేఆఫ్ల కారణంగా వారిపై ఈ ప్రభావం పడనుందని వెల్లడించింది. ఈ తొలగింపులు ఇంజినీరింగ్తో సహా అనేక రంగాలలో జరిగినట్లు తెలుస్తోంది. భారత్లో కంపెనీకి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోని కో-వర్కింగ్ స్పేస్ల నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెటా గత వారం 11,000 ఉద్యోగాలను తగ్గించినట్లు ప్రకటించింది. ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ తమ సిబ్బందిని సగానికి తగ్గించింది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
టీవీఎస్తో జతకట్టిన అమెజాన్ ఇండియా.. 2025 నాటికి అదే టార్గెట్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను బలోపేతం చేయడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ అమెజాన్ ఇండియాతో చేతులు కలిపింది. వివిధ అమెజాన్ నెట్వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో ఈవీ(EV) వినియోగ కేసులను పరిశీలించడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి. పారిస్ ఒప్పందానికి ప్రకారం 2040 నాటికి జీరో కార్బన్ను సాధించాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్ ఈ ప్రయత్నాలను చేస్తోంది. అందుకోసం 2025 నాటికి 10,000 ఈవీలను డెలివర్ చేసే దిశగా అమెజాన్ ఇండియా ప్లాన్ చేస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎనిమిది త్రైమాసికాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రీ-వీలర్ల వాహనాల పూర్తి పోర్ట్ఫోలియోను మార్కెట్లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా భారత్లోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది. -
అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫినాలే డేస్’ సేల్
కొనుగోలు దారులకు ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగియడంతో ..‘ఫినాలే డేస్’ పేరుతో మరో ఎగ్జైటింగ్ సేల్ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా కొనుగోలు దారుల కోసం ‘ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్’ పేరుతో ఫినాలే డేస్ సేల్ను ప్రారంభించింది. అక్టోబర్ 17నుంచి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు జరిగే సేల్లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ట్యాప్స్, టీవీలు, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్తో పాటు పలు రకాల ఉత్పత్తులపై ఢీల్స్, ఆఫర్స్ను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నో, ఐక్యూ, మైక్రోసాఫ్ట్, ప్యాంపర్స్, షావోమీ స్మార్ట్ ఫోన్స్, టీవీ, పీ అండ్ జీ ప్రొడక్ట్లపై స్పెషల్ ఆఫర్లను పొందవచ్చు. రివార్డ్ పాయింట్లు అమెజాన్ ఫినాలే డేస్ సేల్లో ఐసీఐసీఐ, సిటీ, కొటాక్, రూపే క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించే కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, షాపింగ్ బడ్జెట్ను బట్టి బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే లేటర్ వంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జీరోకాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. డైమండ్స్ ధమాకా అక్టోబర్ 15 నుంచి కస్టమర్లకు డైమండ్ ధమాకా ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కస్టమర్లు 750 డైమండ్స్ని రీడీమ్ చేయడం ద్వారా రూ. 1500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, రూ. 150 క్యాష్బ్యాక్ డైమండ్స్ ధమాకా ఆఫర్ను పొందవచ్చు. రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ షాపింగ్పై 1000 డైమండ్లను రీడమ్ చేయడం ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్లు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఎగ్జిస్టింగ్ ఆఫర్లు,డైమండ్స్ను సంపాదించేందుకు డైమండ్స్ పేజీని సందర్శించండి గాడ్జెట్లను అప్గ్రేడ్ చేసుకోండి దివాళీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొనుగోలు దారులకు మొబైల్స్, యాక్సెసరీస్పై 40 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. వన్ ప్లస్, షావోమీ, శాంసంగ్, ఐక్యూ, రియల్ మీ, యాపిల్, టెక్నో తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.5219 కొనుగోలుతో రూ. 499 విలువైన ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. ప్రారంభ ధర రూ.10799తో 5జీ ఫోన్ కొనుగోళ్లపై ఇతర ఆఫర్లను దక్కించుకోవచ్చు. రూ. 17990తో ప్రారంభమయ్యే ల్యాప్టాప్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, రూ.999తో ప్రారంభమయ్యే స్మార్ట్వాచ్లపై 75 శాతం డిస్కౌంట్, రూ. 6999తో ప్రారంభమయ్యే టాబ్లెట్లపై 60 శాతం డిస్కౌంట్ , డీఎస్ఎల్ఆర్లో 70శాతం వరకు తగ్గింపుతో కెమెరాలు, రూ.4999 ప్రారంభ ధరతో మిర్రర్ లెస్, యాక్షన్ & డ్యాష్ కెమెరా యాక్సెస్లపై డిస్కౌంట్, ప్రారంభ ధర రూ.5199 లభించే హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ (టీవీలు, ప్రొజెక్టర్ల)పై 60 శాతం డిస్కౌంట్లు, రూ.10499 తో ప్రారంభమయ్యే సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలైన వన్ ప్లస్, మి, శాంసంగ్, ఎల్జీ, సోనీలపై ప్రత్యేక మైన ఆఫర్లు ఈ సేల్ ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి పండుగ రోజుల్లో ఇంటిని అందంగా అలకరించేందుకు ఇష్ట పడుతుంటాం. అలాంటి వారి కోసం అమెజాన్ సంస్థ యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ@హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్ఫ్లై, మిల్టన్, సోలిమో వంటి బ్రాండ్లకు చెందిన హోమ్, కిచెన్ & అవుట్డోర్ ప్రొడక్ట్లపై 70శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. బెడ్రూమ్ రీడెకరేషన్/అప్గ్రేడ్ కోసం, 350K+ ఎంపిక చేసిన ఫర్నిచర్ & పరుపులపై 85% వరకు తగ్గింపు, ఫర్నీచర్, టాప్ బ్రాండ్ల నుండి బాత్ & కిచెన్ ఫిట్టింగ్లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. స్టైలిష్గా తయారవ్వండి 4.5 లక్షల స్టైల్స్పై డీల్లతో అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్లపై 50శాతం నుంచి 80 శాతం తగ్గింపు, బిబా, డబ్ల్యూ ఫర్ ఉమెన్, మ్యాక్స్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్ లాంటి మరెన్నో ప్రసిద్ధ బ్రాండలకు చెందిన పురుషులు, మహిళల ఫ్యాషన్ ఉత్పత్తులపై 50శాతం నుండి 80శాతం వరకు తగ్గింపు! లగ్జరీ బ్యూటీ, పెర్ఫ్యూమ్లపై 60శాతం డిస్కౌంట్, మేకప్..గ్రూమింగ్ ప్రొడక్ట్లపై 70శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇవి కాకుండా ప్రీమియం దుస్తులు, గడియారాలు, హ్యాండ్బ్యాగ్లు 60శాతం తగ్గింపు, ది డిజైనర్ బోటిక్ నుంచి 80శాతం వరకు అమెజాన్ సేల్లో పొందవచ్చు. స్పెషల్ ఆఫర్ మీకోసమే అమెజాన్ బిజినెస్ కస్టమర్లు జీఎస్టీ ఇన్ వాయిస్తో 28శాతం అదనంగా, 40శాతం ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.ఇప్పటికే అమెజాన్.ఇన్ వంటి ఆఫర్లతో పాటు డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్, బిజినెస్ ఎక్స్క్లూజివ్ ద్వారా బిజినెస్ కస్టమర్లు 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ www.amazon.in/business లో జీఎస్టీ నెంబర్ లేదా పాన్కార్డుతో లాగిన్ అవ్వండి. లబ్ధి పొందండి. (అడ్వర్టోరియల్) -
అమెజాన్ మైండ్బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్!
పండగలు వస్తే విద్యాసంస్థలు సెలవులు ఇచ్చినట్లే కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. దసరా అయ్యిందో లేదో వెనకే దీపావళి సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో దీపావళి సేల్ ప్రారంభించనుంది. ఈ సారి పండుగకి మీ ఇంటికి అవసరమయ్యే గ్యాడ్జెట్లు లేదా మీ ప్రియమైన బెస్టీలకు విలువైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా! అయితే దీనికి సమాధానం తమ వద్ద ఉందని ఆమెజాన్ ఇండియా అంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్లో కొనుగోలుదారులు కొన్ని గాడ్జెట్లపై అదనపు డిస్కౌంట్లతో తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. RGB LED ల్యాంప్ కలర్తో వస్తుంది. Odzeni Crystal Rose Diamond Led Lamp: ఇది ₹1,299 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీని అసలు ధర ₹3,599 ఉండగా ప్రస్తుతం Amazonలో 64% తగ్గింపుతో కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. USB ఛార్జింగ్తో వస్తోంది. ఒక ఛార్జ్తో 8 గంటల వరకు పని చేస్తుంది. ఈ ల్యాంప్ మూడింతల బ్రైట్నెస్ లైటింగ్ అందిస్తుంది. సరేగామా కార్వాన్ మినీ హిందీ 2.0- మ్యూజిక్ ప్లేయర్ ఈ ప్రాడెక్ట్ అసలు ధరపై 19% తగ్గింపు తర్వాత, Saregama Carvan Mini Hindi 2.0- Music Player ప్రస్తుతం కొనసాగుతున్న Amazon సేల్లో ₹1,499కే లభిస్తోంది. మ్యూజిక్ ప్లేయర్ 351 ఎవర్ గ్రీన్ హిందీ పాటలతో ప్రీలోడ్ చేసి ఉంటుంది. మీ పర్సనల్ సాంగ్స్ కలెక్షన్ కోసం USB బ్లూటూత్ మోడ్లను కలిగి ఉంది. వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ (OnePlus Smart Band): OnePlus స్మార్ట్ బ్యాండ్ 100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం ఉంది. స్మార్ట్ బ్యాండ్ 1.1-అంగుళాల స్క్రీన్ తో స్టైలిష్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అమెజాన్లో ₹1,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. Echo Dot (4th Gen, Blue) combo : Wipro 9W LED smart color bulb నాలుగు రేట్ల బ్రైట్నెస్ కాంతిని అందిస్తుంది. విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్తో ఎకో డాట్ (4వ జనరేషన్, బ్లూ) కాంబో.. విప్రో బల్బ్ కాంబోతో కూడిన ఈ Amazon Echo Dot (4వ జనరేషన్) Amazonలో రూ. 2,499కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
5G సేవలు వచ్చేశాయ్.. మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసా!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలు ఉపయోగించాలంటే వినియోగదారుల ఫోన్ 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్గా ఉంటోంది. ఒకవేళ మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జీ అనేది కనిపించకపోతే, మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జీని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో 5G స్మార్ట్ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022లో 5జీ స్మార్ట్ఫోన్లకు డిస్కౌంట్లు, ఆఫర్స్ ఇస్తూ చవకైన ధరలకే సేల్ నిర్వహిస్తోంది. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) Redmi 11 Prime 5G .. 4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 గా ఉంది. దసరా సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో ఇది తగ్గింపుతో రూ. 12,999 వస్తోంది. దీంతో పాటు అదనంగా, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ 12,150 కే లభిస్తోంది. ఈఎంఐ( EMI) ఆఫర్ కూడా ఉందండోయ్, నెలకు రూ.621తో ఈ ఫోన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. Amazon Pay ఆధారంగా అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. రియల్మి నార్జో 50 5జీ (Realme Narzo 50 5G) రియల్మి నుంచి వచ్చిన మరో 5జి స్మార్ట్ ఫోన్లలో రియల్ మి నార్జో 50 5Gనే చవకైన ఫోన్ అని చెప్పాలి. మార్కెట్లోకి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999 గా ఉంది. ఇదే ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 12,249 గా లభిస్తోంది. వీటితో మీ వద్ద పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈఎంఐ చెల్లింపులో ఫోన్ ని కొనుగోలు చేస్తే.. రూ 750 కే ఈ ఫోన్ లభిస్తుంది. ఐకూ z6 లైట్ 5G (iQoo Z6 Lite 5G) iQoo Z6 Lite 5G బేస్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా భారీగానే ఇస్తున్నారు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు రూ. ఫ్లాట్-రేట్పై అదనపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం13 5G (Samsung Galaxy M13 5G) Samsung Galaxy M13 5G ప్రస్తుతం అమెజాన్లో దీని ధర రూ.11,999. ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లకి ప్రత్యేక డిస్కౌంట్లు లభించనుంది. చదవండి: 5G Network FAQs In Telugu: 5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే! -
అమెజాన్: వారి కోసం నాలుగు గంటల్లో డెలివరీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ –కామర్స్ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు ఆకర్షనీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వీటితో పాటు కస్టమర్ల సర్వీసు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అందిస్తుంది. తాజాగా ప్రైమ్ కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ సభ్యులు దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. ఆర్డర్ ఇచ్చిన రోజే ఉత్పత్తులను డెలివరీ చేసే విధానాన్ని కంపెనీ 2017 నుంచి అమలు చేస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
వారికి అమెజాన్ పండుగ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ‘అమెజాన్ ఇండియా’ ముఖ్యమైన పండుగల ముందు విక్రేతలకు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. తన ప్లాట్ఫామ్పై విక్రయాలు నిర్వహించినందుకు చెల్లించాల్సిన ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. కొత్త వెండర్లకు ఇది వర్తించనుంది. అమెజాన్ ప్లాట్ఫామ్లో విక్రయించే ప్రతీ ఉత్పత్తి విలువలో (కొనుగోలు దారు చెల్లించే) నిర్ణీత శాతం మేర ఫీజుగా వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొత్త అమ్మకందారులు ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ ప్రయాణాన్ని వెంటనే ఆరంభించేందుకు వీలుగా.. అమెజాన్.ఇన్పై ఆగస్ట్ 28 నుంచి అక్టోబర్ 26 మధ్య నమోదు చేసుకుని.. తదుపరి 90 రోజుల్లోపు అమ్మకాలు మొదలు పెట్టడం ద్వారా అమ్మకం ఫీజులో 50 శాతం రాయితీ పొందొచ్చు’’అని అమెజాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్తకులు ప్రస్తుత పండుగల డిమాండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘భారత్ వ్యాప్తంగా మాకు మిలియన్ విక్రేతలు ఉన్నారు. పండుగల సీజన్లో వారంతా తమ ఉత్పత్తులను వినియోగదారుల ముందు ప్రదర్శించే అవకాశం మా వేదిక ద్వారా ఉంటుంది’’అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ వివేక్ సోమారెడ్డి వెల్లడించారు. అమెజాన్కు దేశవ్యాప్తంగా 60 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 1850 వరకు స్టేషన్లు (సొంతంగా, భాగస్వాముల ద్వారా) ఉన్నాయి. -
శ్రీకృష్ణ జన్మాష్టమి: బాయ్కాట్ అమెజాన్ దుమారం
సాక్షి, బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (PM Kisan eKYC deadline extended: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు) పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది. (వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్ఝున్వాలా స్పందన వైరల్) జన్మాష్టమికి 20 శాతం సేల్ అంటూ కొన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టింది అమెజాన్. వెబ్సైట్లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్ను విక్రయించడంపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హిందూ దేవతలపై అభ్యంతరంగా ,అనుచితంగా వ్యవహరించడం ఆనక లెంపలేసుకోవడం అమెజాన్కు ఇది కొత్తేమీ కాదు. ఇది చదవండి: లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే! #Boycott_Amazon#Boycott_ExoticIndia ‼️‼️amazonIN & exoticindiaart selling obscene paintings of hindu gods and again & again hurting hindu sentiments!! 👉Hindus are you still want to use this app⁉️⁉️ pic.twitter.com/5xPp1UVTdq — Snehal Patil (@SnehalPatil4SP) August 19, 2022 Press Release Members of @HinduJagrutiOrg submitted a memorandum to the Police Inspector, Subramanya Nagar Benguluru, requesting action against @amazonIN for selling obscene painting of Lord Krishna with Radha on their website.#Boycott_Amazon #Boycott_ExoticIndia pic.twitter.com/E5ASG6PLSH — HJS Karnataka (@HJSKarnataka) August 19, 2022 Hindu unity triumphs! Amazon & Exotic India Art quietly withdraw obscene painting of ShriKrishna & Radhaji. But this is not enough. Both Amazon & Exotic India must tender unconditional apology & pledge not to hurt sentiments of Hindus again.#Boycott_Amazon#Boycott_ExoticIndia pic.twitter.com/tvWbuAetcg — Yamanu Naikodi (@Yamanu76669807) August 19, 2022 We won't allow anyone to hurt Hindu sentiments Neither Bollywood nor Corporates Time and again Amazon providing its platform to sell things which hurt Hindu sentiment#Boycott_Amazon for insulting gods 👇@RadharamnDas#Boycott_ExoticIndia#Janmashtami #harekrishna . pic.twitter.com/u5wX3cyrQ3 — Saffron Swamy (@SaffronSwamy) August 19, 2022 -
రెడీగా ఉండండి.. అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే!
OnePlus 10T 5G Launch: వన్ప్లస్ మొబైల్ లవర్స్కి గుడ్ న్యూస్. ఈ సంస్ధ మార్కెట్లోకి త్వరలో తీసుకురానున్న వన్ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) విడుదల తేదీ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో వన్ప్లస్ 10Tని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం ఈ స్టైలిష్ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుందని తన ల్యాండింగ్ పేజ్లో వెల్లడించింది. ఈ ఫోన్కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని చూస్తే.. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 360 డిగ్రీ యాంటినా సిస్టమ్ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్లో వన్ప్లస్ సరికొత్త ఆక్సిజన్ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది. భారత్: OnePlus 10T ధర (అంచనా) నివేదిక ప్రకారం OnePlus 10T 5G ధర CNY3,000 (చైనా యువాన్లు) (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500), CNY 4,000 (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400) మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999(భారత్లో) ఉంటుందని సమాచారం. ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఇంకా ఈ స్మార్ట్ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. OnePlus 10T ఫీచర్లు (అంచనా) అమెజాన్ లిస్టింగ్ పేజ్ ద్వారా వన్ప్లస్ 10టీ 5జీకి చెందిన ప్రాసెసర్ వివరాలు బయటికి వచ్చాయి. ♦ OnePlus 10T: Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ఫీచర్తో రానుంది. ♦ హ్యాండ్సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ♦ పూర్తి-HD+ రిజల్యూషన్తో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే ♦ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ♦ 50W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్ ♦ 16GB LPDDR5 RAMతో పాటు 512GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్ ♦ కలర్స్: బ్లాక్, గ్రీన్ చదవండి: Vedanta Share Price: లాభాల్లో షేర్ మార్కెట్.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్! -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్లో పలు స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ►అమెజాన్ ప్రైమ్ డే సేల్లో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఐక్యూ స్మార్ట్ఫోన్లైన 5జీ ఐక్యూఓఓ జెడ్6, 5జీ ఐక్యూఓఓ నియో6, ఐక్యూఓఓ జెడ్6 ప్రోలపై రూ.10వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ ధర రూ.14,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై అదనంగా కూపన్ బెన్ఫిట్స్, ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పలు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను దక్కించుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీ స్టోరేజ్ ఫోన్ను 19శాతం డిస్కౌంట్తో రూ.16,999కే పొందవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ప్రో లెజియన్ స్కై 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ పై 14శాతం డిస్కౌంట్తో ధర రూ.23999కే కొనుగోలు చేయోచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్పై రూ.3వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ►అదే విధంగా ఐక్యూఓఓ నియో6..6జీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్పై 14శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5వేల డిస్కౌంట్తో రూ.29,900కే పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్పై రూ.3000 డిస్కౌంట్, రూ.11,950 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఐక్యూఓఓతో పాటు ఇంకా ఐక్యూఓఓతో పాటు అదనంగా రెడ్మీ 9సిరీస్, రెడ్మీ నోట్ 10 సిరీస్లోని రెడ్మీ నోట్ 10టీ, నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ గెలాక్సీ ఎం52లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. -
అమెజాన్ ద్వారా దేశంలో ఇంత మంది ఉపాధి పొందుతున్నారా?!
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ దాదాపు 5 బిలియన్ డాలర్ల ఎగుమతులకు తోడ్పాటు అందించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.6 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చినట్లు వివరించింది. ఇప్పటి దాకా 40 లక్షల లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) డిజిటైజ్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న సంస్థల డిజిటైజేషన్కూ తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి 2020 జనవరిలో నిర్వహించిన తొలి అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో 2025 నాటికి 1 కోటి పైగా ఎంఎస్ఎంఈలను డిజిటలీకరించాలని, 10 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2021లో టెక్నాలజీ ఆవిష్కరణలపై పనిచేసే ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు వెంచర్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇది ఇప్పటికే ’మైగ్లామ్’, ’ఎం1ఎక్సేంజ్’, ’స్మాల్ కేస్’ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఎంఎస్ఎంఈల డిజిటలీకరణ, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల ద్వారా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాల కల్పనకు సహాయం అందించగలుగుతున్నామని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (భారత్లో వినియోగదారుల వ్యాపార విభాగం) మనీష్ తివారి తెలిపారు. చదవండి: ఏపీజే ఎడ్యుకేషన్తో ఏడబ్ల్యూఎస్ జట్టు -
రిలయన్స్ ఇలాంటి రహాస్య పనులు తగవు.. పబ్లిక్ నోటీస్ జారీ చేసిన అమెజాన్
Amazon Issued Public Notice On Reliance Deal: రెండేళ్లుగా నలుగుతున్న ఫ్యూచర్ అమెజాన్ రిలయన్స్ డీల్ వివాదం మరో మలుపు తీసుకుంది. రేపోమాపు ముగింపుకు వస్తుందని అంతా భావిస్తుండగా అమెజాన్ ట్విస్ట్ ఇచ్చింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా ముందుకు సాగితే కుదరదంటూ అమెజాన్ బహిరంగంగా తేల్చి చెప్పింది. బిగ్బజార్, ఫాంటాలూన్స్ పేరుతో భారీ రిటైల్ నెట్వర్క్ను కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు నెలకొల్పింది. ఈ క్రమంలో ఫ్యూచర్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి మైనర్ వాటాలను అమెజాన్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ గ్రూపు మొత్తాన్ని రిలయన్స్కి 3.4 బిలియన్ డాలర్లకు అమ్మేస్తూ డీల్ చేసుకున్నారు. తమ అభిప్రాయానలు పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ను రిలయన్స్ ఎలా టేకోవర్ చేస్తుందంటూ అమెజాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టు విచారిస్తోంది. అయితే ఫ్యూచర్ ఆధీనంలో దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ స్టోర్లను క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది రిలయన్స్ సంస్థ. ఫ్యూచర్ గ్రూపు స్టోర్లను రీబ్రాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. చదవండి: రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఫ్యూచర్, రిలయన్స్ను రహ్యసంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయంటూ అమెజాన్ పబ్లిక్ నోటీస్ పేరుతో ప్రకటన జారీ చేసింది. కోర్టు విచారణలో ఉండగా చట్ట విరుద్ధంగా రహస్య పద్దతుల్లో ఫ్యూచర్, రిలయన్స్ డీల్ చేస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. వ్యాపార దిగ్గజ కంపెనీల మధ్య పోరు కావడంతో ఫ్యూచర్ వివాదం దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా అమెజాన్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్పై రియలన్స్, ఫ్యూచర్ గ్రూపుల నుంచి ఇంకా స్పందన రాలేదు. చదవండి: ఫ్యూచర్కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్! -
అమెజాన్ బంపరాఫర్..! టీవీ, స్మార్ట్ఫోన్స్పై 55 శాతం మేర తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్టీవీ, స్మార్ట్ఫోన్స్ను హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్పై 70 శాతం మేర, వైర్లెస్ హెడ్ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్ఫోన్స్పై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును. ► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్సెట్ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును. ► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది. ► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది. ► Redmi 9A Sport స్మార్ట్ఫోన్పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్ఫోన్పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది. ► Tecno Spark 8 Pro స్మార్ట్ఫోన్పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్ఫోన్పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది . అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు. ► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి. ► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
ఫ్యూచర్కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్పై ఆధిపత్యం కోసం దిగ్గజ కంపెనీల మధ్య సాగుతున్న పోరు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఫ్యూచర్ రిటైల్కు చెందిన 950 స్టోర్స్కి సంబంధించిన సబ్–లీజును రద్దు చేయాలని రిలయన్స్ రిటైల్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్కు నోటీసులు జారీ చేసింది. రుణభారంతో కుంగుతున్న ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు గురువారం ఈ వివరాలను స్టాక్ ఎక్ఛేంజీలకు తెలియజేశాయి. వీటిలో 835 ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ఉండగా, 112 ఫ్యూచర్ లైఫ్స్టయిల్ స్టోర్స్ ఉన్నాయని వివరించింది. ‘రిలయన్స్ సంస్థల నుంచి సబ్–లీజుకు తీసుకున్న ప్రాపర్టీలకు సంబంధించి రద్దు నోటీసులు అందాయి. వీటిలో 342 భారీ ఫార్మాట్ స్టోర్స్ (బిగ్ బజార్, ఫ్యాషన్ఎట్బిగ్బజార్ మొదలైనవి), 493 చిన్న ఫార్మాట్ స్టోర్స్ (ఈజీడే, హెరిటేజ్ స్టోర్స్ వంటివి) ఉన్నాయి‘ అని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. మరోవైపు, 34 ’సెంట్రల్’ స్టోర్లు, 78 ’బ్రాండ్ ఫ్యాక్టరీ’ అవుట్లెట్ల సబ్–లీజు రద్దు నోటీసులు తమకు వచ్చినట్లు ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ వివరించింది. కంపెనీ రిటైల్ ఆదాయాల్లో వీటి వాటా దాదాపు 55–65 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. యథాతథ స్థితిని కొనసాగించేందుకు, వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రిలయన్స్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్లోని రెండు సంస్థలూ తెలిపాయి. గత నెలలోనే టేకోవర్.. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. ఇక, ఫ్యూచర్ గ్రూప్నకు 1,700 పైచిలుకు అవుట్లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్కు సబ్–లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల రిలయన్స్ ఆ అవుట్లెట్స్ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సబ్–లీజులను రద్దు చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అలెక్సా:"ఏం చేద్దామంటావ్ మరి!? నువ్వు గమ్మత్తుగా మాట్లాడుతున్నావ్!!
అలెక్సా పాత తెలుగు పాటలు కావాలి? అలెక్సా ఈరోజు వాతావరణం ఎలా ఉంది? అలెక్సా ఈరోజు వార్తలేంటీ? అంటూ చాలా మంది అడుగుతుంటారు. ఇలా మనజీవితాల్లో పర్సనల్ అసిస్టెంట్గా మారిన అలెక్సా వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయులు 2020తో పోలిస్తే 2021 అలెక్సాను వినియోగించే వారిసంఖ్య 68శాతం పెరగ్గా అందుల్లో 50శాతం మంది కస్టమర్లు నాన్ - మెట్రోనగరాలకు చెందిన వారేనని తెలుస్తోంది. ఇక అమెజాన్ఇండియా మనదేశంలో అలెక్సా 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.ఈ సందర్భంగా తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గురించి అమెజాన్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆసక్తికరంగా, మనదేశంలో గతేడాది మార్చి-ఏప్రిల్ కోవిడ్ సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చినప్పుడు యూజర్లు కోవిడ్ గురించి మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ అంట "ఏం చేద్దామంటావ్ మరి!? అలెక్సా అంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో పాటు ఆరోగ్యం,వెల్ నెస్ సంబంధిత అంశాల గురించి ప్రతిరోజూ 11,500 ప్రశ్నలు అడిగారు. అమెజాన్ ప్రకారం, క్రీడలు, సినిమా డైలాగ్లు, పదాల నిర్వచనాలు, కఠినమైన గణిత సమస్యలు, వాతావరణం, తాజా స్టాక్ మార్కెట్ అప్డేట్లకు సంబంధించి అలెక్సా రోజువారీ 1.7 లక్షల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. భారతీయ కస్టమర్లు ప్రతిరోజూ 21.6 లక్షల కంటే ఎక్కువ పాటలను ప్లే చేసారు, పిల్లలు, భక్తి, ప్రాంతీయ భాష వంటి జానర్లు టాప్ 20 పాటల్లో ప్రముఖంగా ఉన్నాయి. అలెక్సా ప్రతిరోజు స్మార్ట్ గృహోపకరణాలను నియంత్రించడం కోసం 2.6 లక్షలకు పైగా అభ్యర్థనలకు ప్రతిస్పందించింది. షావోమీ,వన్ ప్లస్, హింద్వేర్, ఆటోమ్ బెర్గ్ వంటి బ్రాండ్ల నుండి కొత్త ఉత్పత్తులతో అలెక్సా స్మార్ట్ హోమ్ ఎంపిక సంవత్సరానికి 72 శాతం పెరిగింది. కస్టమర్లు తమ రోజులను అలెక్సాతో ప్రారంభించడం ముగించడాన్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ "అలెక్సా, గుడ్ మార్నింగ్ "అలెక్సా, గుడ్ నైట్" అని 11,520 సార్లు విష్ చేస్తున్నారు. అలెక్సా వినియోగదారు ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ లోపాలను 25 శాతం తగ్గించిందని అమెజాన్ పేర్కొంది. -
అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బంపరాఫర్ను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్షిప్పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించనుంది. ఈ ఆఫర్ కేవలం 18-24 ఏళ్లలోపు యువకులకు వర్తించనుంది. దాంతోపాటుగా వారు పాత కస్టమర్లై ఉండాలి. యువతే లక్ష్యంగా..! గత ఏడాది ప్రైమ్ సేవల ధరలను పెంచుతూ అమెజాన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యువతను లక్ష్యంగా చేసుకొని ప్రైమ్ మెంబర్షిప్పై రెఫరల్స్ ప్రోగ్రామ్ను అమెజాన్ ప్రారంభించింది. ఈ ‘యూత్ ఆఫర్’ రెఫరల్స్ ప్రోగ్రాంలో భాగంగా సదరు యూజరు ప్రైమ్లో చేరినట్లయితే సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు రానుంది. ► యూత్ ఆఫర్లో భాగంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ నెలవారీ రూ. 179 సభ్యత్వంపై రూ. 90 క్యాష్బ్యాక్తో పాటు మరో రూ. 18 క్యాష్బ్యాక్ను రిఫరల్ రివార్డ్గా ఆయా యూజర్ పొందవచ్చు. ► త్రైమాసిక సభ్యత్వంపై రూ. 479 సభ్యత్వంపై రూ. 230 క్యాష్బ్యాక్తో పాటు మరో రూ. 46 క్యాష్బ్యాక్ను రిఫరల్ రివార్డ్గా ఆయా యూజర్ పొందవచ్చు. ► వార్షిక సభ్యత్వంపై రూ. 1,499పై ఆయా యూజర్ రూ. 750 క్యాష్బ్యాక్తో పాటుగా మరో వ్యక్తికి రెఫరల్ చేసినందుకుగాను మరో రూ. 150 క్యాష్బ్యాక్ను అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ అందిస్తోన్న యూత్ ఆఫర్ను సదరు వ్యక్తి ఆయా యూజర్కు రెఫరల్ చేయడంతో 50 శాతం తగ్గింపును పొందవచ్చును. సదరు యూజర్ ఖచ్చితంగా తన వయసును నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సెల్ఫీ, తదితర వయసు ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాష్బ్యాక్ ‘అమెజాన్ పే’లో క్రెడిట్ అవుతుంది. చదవండి: భారత మార్కెట్లలోకి మరో రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్..! ధర ఎంతంటే..? చదవండి: ‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..! -
హైదరాబాద్లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు
ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతోంది. అమెరికా వెలుపల ఆ సంస్థ తొలి క్యాంపస్ని హైదరాబాద్లోనే నిర్మిస్తోంది. 2015లో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అమెజాన్ సంస్థ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మిస్తున్న క్యాంపస్లో ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించింది. 18 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన ఈ భవనంలో 15 వేల మంది ఉద్యోగులు పని చేసే వీలుంది. ఇక్కడున్న క్యాంటీన్లో ఒకేసారి 2700ల మంది భోజనం చేయవచ్చు. ఈ భవనంలో 49 హైస్పీడ్ లిఫ్టులు ఉన్నాయి. థీమ్ బేస్డ్గా ప్రతీ ఫ్లోర్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ భవనంలో ఉన్న సౌకర్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మీరు ఓసారి అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్ని చూడండి. #Hyderabad Amazon's 282-feet tall building can house more than 15,000 employees This new Amazon campus is its first owned office building pic.twitter.com/OBOPbemUVB — Akshayy (@AkshayKtrs) January 16, 2022 చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర -
త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్ రిప్లేస్మెంట్, మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్ బెనిషిట్స్ను పొందవచ్చును. ఈ సేల్ ముగిసిన వెంటనే అమెజాన్ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్లు తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్లో అమెజాన్ అందిస్తోన్న పలు ఆఫర్స్..! ► Mi 11X స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ఫోన్ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ► Redmi 9A స్మార్ట్ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా రానుంది. ► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్ఫోన్ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు. ► OnePlus 9R స్మార్ట్ఫోన్ రూ. 33,999, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ 36,999 మరియు వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ రూ. 54,999 కు రానుంది. ► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్ఫోన్ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. ► Realme Narzo 50A, Samsung Galaxy M52 5G, OnePlus Nord 2 5G స్మార్ట్ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూపన్స్ను అమెజాన్ అందిస్తోంది. ► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్తో రూ. 32,999కు రానుంది. ► Sony 50-inch 4K UHD Google స్మార్ట్టీవీ 30 శాతం డిస్కౌంట్తో రూ. 77, 990కు లభించనుంది. ► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కంపెనీను కైవసం చేసుకున్న అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి చెందిన కాటమరాన్ వెంచర్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్సీస్ను పూర్తిగా అమెజాన్ సొంతం చేసుకుంది. క్లౌడ్టైల్లోని కాటమరాన్ వెంచర్ వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి కోరింది. కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను కొనుగోలు చేసినట్లు అమెజాన్ బుధవారం రోజున ప్రకటించింది. క్లౌడ్టైల్ కంపెనీలో అంతకుముందు అమెజాన్ 24 శాతం మేర, కాటరామన్ 76 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఇప్పుడు కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను అమెజాన్ ఇండియా కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఇటీవల క్లౌడ్టైల్ ఇండియా మే 2022 కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఇరు సంస్థలు ఇకపై జాయింట్ వెంచర్గా కొనసాగబోవని అప్పట్లో ప్రకటించాయి. నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే ఇక ప్రియోన్ పూర్తిగా అమెజాన్ చేతిలోకి వెళ్లనుంది. యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్..! -
భారత్లో అమెజాన్ సరికొత్త మైలురాయి..! 100 నుంచి ఏకంగా 10 లక్షల వరకు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో సరికొత్త మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 10 లక్షల మంది విక్రయదారులు అమెజాన్లో ఆన్బోర్ట్ ఐన్నట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 100 నుంచి మొదలు..! 2013లో అమెజాన్ ఇండియా కేవలం 100 మంది విక్రయదారులను ఆన్బోర్డ్ చేసుకోగా..ప్రస్తుతం ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. Amazon.inలో 90 శాతం కంటే ఎక్కువ మంది విక్రేతలు చిన్న, మధ్యస్థ స్థానిక వ్యాపారాలను కల్గి ఉన్నారు. వీరు టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చారు. 2020 జనవరి నుంచి 4.5 లక్షలకు పైగా కొత్త విక్రేతలు అమెజాన్లో చేరారని కంపెనీ పేర్కొంది. చదవండి: సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన 63 మిలియన్ల ఎమ్ఎస్ఎమ్ఈలతో... భారత్లోని పలు ఎమ్ఎస్ఎమ్ఈలపై అమెజాన్ ఇండియా దృష్టిసారించింది. సుమారు 63 మిలియన్ల మధ్యస్థ,చిన్న సూక్ష్మ పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను అమెజాన్ నెలకొల్పింది. స్థానిక రిటైలర్లకు వారి వ్యాపారాల అభివృద్ధికి అమెజాన్ ఎంతగానో సహయం అందించిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు. చదవండి: ఏసర్ ల్యాప్ట్యాప్స్పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రేట్లు పెరిగాయ్
Amazon Prime membership costlier: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలను సవరించింది. పెంచిన ధరలను నేటి నుంచి (డిసెంబర్ 14) భారత్లో అమలు చేయనుంది. దీంతో యూజర్లకు భారం తప్పదు. సవరించిన ప్రైమ్ మెంబర్షిప్ ధరలు భారత్లో ఇవాళ్లి(డిసెంబర్ 14, 2021 మంగళవారం) నుంచే అమలులోకి వచ్చాయి. అర్ధరాత్రి నుంచే సవరించిన ప్యాకేజీని చూపిస్తోంది అమెజాన్. గతంలో నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి(38శాతం) పెంచింది. మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.459కి(39శాతం) పెరిగింది. వార్షిక సబ్ స్క్రిప్షన్ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి(50 శాతం) పెరిగింది. ఛార్జీల మోత నుంచి ఉపశమనం కోసం డిసెంబర్ 13 కంటే ముందుగానే ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్(కొత్త యూజర్ల కోసం), రెన్యువల్ చేసుకోవాలంటూ సూచించిన విషయం తెలిసిందే. ‘లాస్ట్ ఛాన్స్ టూ జాయిన్ ప్రైమ్’ పేరుతో ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు ఆఫర్లతో ఎంపిక చేసిన యూజర్లకు తక్కువ ధరలకే ప్యాకేజీ అందించే అవకాశం లేకపోలేదు. అమెజాన్ ప్రైమ్ ప్యాకేజీలతో విస్తృతమైన సేవలు(షాపింగ్, ఫాస్టెస్ట్ డెలివరీ, ఓటీటీ, మ్యూజిక్,..ఇలా) అందిస్తున్నందున.. పెరుగుతున్న భారం నేపథ్యంలోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది అమెజాన్. అమెజాన్ ఐదేళ్ల కిందట భారత్లో అడుగుపెట్టగా.. మధ్యలో మంత్లీ ప్యాక్ను తేవడం, ధరలను సవరించడం ఓసారి చేసింది కూడా. ఇక ట్రేడ్ విషయంలో ఫ్లిప్కార్ట్తో, ఓటీటీలో నెట్ఫ్లిక్స్తో ఈమధ్యకాలంలో గట్టిపోటీ ఎదురవుతోంది. చదవండి: Amazon AWS Outage: కొద్దిగంటలు నిలిచిపోయిన అమెజాన్ సర్వీసులు -
దేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఇవే!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏషియన్ పెయింట్స్, టాటా టీలు టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ కేటగిరీల్లో 2021లో భారతదేశంలో "అత్యంత పాపులర్" బ్రాండ్లుగా నిలిచాయి. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కాంటార్ తాజాగా "బ్రాండ్ జెడ్ ఇండియా" పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కన్సల్టింగ్ సంస్థ కాంటార్ మూడు(టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ) కేటగిరీలలో దేశంలోని మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ పేర్లను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ కేటగిరీలో టాప్ స్థానంలో అమెజాన్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో, యూట్యూబ్, గూగుల్, స్వీగ్గి, ఫ్లిప్ కార్ట్ నిలిచాయి. ఇక ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో టాటా టీ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో తాజ్ మహల్, సర్ఫ్ ఎక్సెల్, మ్యాగీ, పారాచూట్, బ్రిటానియా ఉన్నాయి. నాన్-ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో ఏషియన్ పెయింట్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో జియో, శామ్ సంగ్, ఎంఆర్ఎఫ్, టాటా హౌసింగ్, ఎయిర్ టెల్ ఉన్నాయి. 2020-21లో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా కోసం కాంటూర్ 418 కంపెనీల డేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రతి సందర్భంలో, 30 కేటగిరీల్లో బ్రాండ్ పర్సెప్షన్, బ్రాండ్ ఈక్విటీ మెట్రిక్స్ విశ్లేషించారు. ఈ సర్వేలో దేశం మొత్తంగా 12,000 మంది పాల్గొన్నారు. (చదవండి: కీలక రంగాల్లో దేశం కంటే మెరుగ్గా తెలంగాణ) -
స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై అమెజాన్ బంపర్ ఆఫర్..! ఏకంగా 40 శాతం...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ను ప్రకటించింది. ‘ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ ’పేరుతో పలు స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ సేల్లో భాగంగా షావోమీ, శాంసంగ్, వన్ప్లస్తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లపై, మొబైల్ ఉపకరణాలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్ నవంబర్ 24 నుంచి ప్రారంభమై నవంబర్ 28తో ముగియనుంది. చదవండి: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..! ‘ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్’లో పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్స్లో కొన్ని...! ►షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ: 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 26,999 ఉండగా ఈ సేల్లో భాగంగా రూ. 19999కే కొనుగోలుదారులకు లభించనుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 39,990 ఉండగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్లో భాగంగా రూ. 38, 740కు రానుంది. ►వన్ప్లస్ 9ప్రో: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 54,999 లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ కూపన్ను కూడా పొందవచ్చును. ►ఐక్యూ జెడ్5 5జీ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 20,615కే కొనుగోలుదారులకు లభించనుంది. ►ఐక్యూ జెడ్3 5జీ: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 17,865 కే లభించనుంది. ►షావోమీ ఎమ్ఐ 11ఎక్స్ 5జీ: ఎక్స్చేంజ్ ఆఫర్, ఎస్బీఐ కార్డుతో ఈ స్మార్ట్ఫోన్ రూ. 21,749 కే రానుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎమ్12: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ లిస్ట్లో ఈ స్మార్ట్ఫోన్ రూ. 10,349కు కొనుగోలుదారులకు లభించనుంది. చదవండి: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో? -
నెట్ప్లిక్స్ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..!
స్క్వీడ్ గేమ్తో మరింత పాపులర్ అయిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వరల్డ్ వైడ్గా మరింత పాపులర్ అయ్యింది. కానీ నెట్ ఫ్లిక్స్లో నచ్చిన సినిమానో, లేదంటే వెబ్ సిరీస్ను వీక్షించాలంటే ఇతర ఓటీటీల కంటే కాస్త ఎక్కువగానే ప్రిమియం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది నెట్ ఫ్లిక్స్ను ఫ్రీగా వినియోగించుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్, వెబ్ సైట్లను ఆశ్రయిస్తుంటారు. అదే సమయంలో వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై తెలిపింది. ఒరిజినల్ నెట్ ఫ్లిక్స్లో అకౌంట్ ప్రిమియం చెల్లించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాస్పర్ స్కై నిపుణులు పలు సూచనలిచ్చారు. నెట్ఫ్లిక్స్తో పాటు ఇతర ఓటీటీ ఫ్లాట్ఫామ్లను ఫ్రీగా వీక్షించే విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని క్యాస్పర్ స్కై హెచ్చరించింది. థర్డ్ యాప్స్ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లిస్తే ఓటీటీ ఫ్లాట్ ఫామ్లను వినియోగించే అవకాశం ఉంది. ఆ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్లో ప్రిమియం చెల్లిస్తున్నప్పుడు సైబర్ నేరస్తులు తెలివిగా బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేస్తారని క్యాస్పర్ స్కై రిపోర్ట్ను విడుదల చేసింది. నకిలీ 'సైన్ అప్'లతో అప్రమత్తం మీరు నెట్ ఫ్లిక్స్ను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే నకిలీ సైన్ అప్ల విషయంలో జాగ్రత్త వహించాలి. నెట్ఫ్లిక్స్ ప్రీమియం పొందేందుకు మీ ఇమెయిల్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాల్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ నేరస్తులు ఒరిజనల్గా ఉండే ఫేక్ నెట్ ఫ్లిక్స్ అకౌంట్ను క్రియేట్ చేస్తారు. మీరు వాటిలో లాగిన్ అయితే అంతే సంగతులు..మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ మాయం అవుతుంది. అందుకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్లలో లాగిన్ అయ్యే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సైన్ అప్ కోసం వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అందులో అక్షర దోషాలు కనిపిస్తాయి. అలా అక్షర దోషాలుంటే అవి ఫేక్ అకౌంట్లుగా భావించాలని క్యాస్పర్ స్కై తన నివేదికలో పేర్కొంది. మీ వ్యక్తిగత సమాచారం అప్డేట్తో.. స్కామర్లు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా డబ్బుల్ని కాజేసేందుకు మీ ప్రీమియం వివరాల్ని అప్ డేట్ చేయాలని కోరుతూ మెయిల్స్ పంపుతారు. మీ వివరాల్ని అప్డేట్ చేయకపోతే మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తారు. ఆ ఈమెయిల్స్ను మీరు యాక్సెస్ చేశారా? అంతే సంగతులు కొత్తగా వచ్చే సినిమా టీజర్లు, సాంగ్స్ ఓటీటీ యూజర్లను ఆకర్షించేందుకు సైబర్ కేటుగాళ్లు ఇటీవలి కాలంలో బాగా పాపులరైన సినిమాలు, వెబ్ సిరీస్లతో వెబ్సైట్ను తయారు చేస్తారు. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సినిమాల్ని, ప్రోమోలు, టీజర్లు ఆ వెబ్ సైట్లలో ఉండడంతో వాటిని ఓపెన్ చేసి తక్కువ ప్రీమియం పేరుతో ఊరిస్తుంటారు. అవన్నీ ఫేక్ వెబ్సైట్లు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మన పర్సనల్ డీటెయిల్స్తో పాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మాయం అవుతుంది. మరి ఎలా జాగ్రత్త పడాలి పై స్కామ్లు వినడానికి సింపుల్గా ఉన్న.. సైబర్ నేరస్తుల చేతి వాటం చూపిస్తే సెకన్ల వ్యవధిలో కోట్లు కొల్లగొట్టేస్తారు. అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాప్సర్ స్కై విడుదల చేసిన రిపోర్ట్లో సూచించింది. నెట్ఫ్లిక్స్ నుంచి మెయిల్స్, లేదంటే ప్రీమియం చెల్లించాలని మెసేజ్లు వస్తే వాటిని ఓపెన్ చేయొద్దని, వాటిని ఓపెన్ చేసే ముందు ఒరిజినల్ నెట్ ఫ్లిక్స్ వెబ్సైట్లను సందర్శించాలని, వాటిలో ఫ్రీ, లేదంటే తక్కువ ప్రీమియం మెంబర్ షిప్ అందిస్తుందో చెక్ చేయాలి. మీకే ఏమాత్రం అనుమానం వచ్చినా వాటిని ఓపెన్ చేయకపోవడమే మంచిదని ఓటీటీ యూజర్లకు క్యాస్పర్ స్కై జాగ్రత్తలు చెబుతోంది. -
అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు
ఇండోర్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్లైన్లో గంజాయిని విక్రయిస్తుందనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై మధ్యప్రదేశ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో పోలీసులు గతవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) అంతేకాదు తాము అమెజాన్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ డ్రగ్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ను ఛేదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాన్ఫెడరేషన్ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ కామర్స్ ప్లాట్ఫారమ్పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ప్రతినిధి దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం, మద్దతును ఇస్తానని హామీ కూడా ఇచ్చిన సంగతని ఈ సందర్భంగా పోలీసులు గుర్తుచేశారు. పైగా అమెజాన్ సంస్థ సకాలంలో స్పందించి అందించిన వివరాలు తాము వెలకితీసిన సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అంతేకాదు వివిధ చిరునామాలకు బుక్ చేసి డెలివరీ చేసిన 20 నిషేధిత సరుకుల వివరాలు ఇంకా అందాల్సి ఉందని భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ..."ఈ కేసు విచారణకు ఈ-కామర్స్ దిగ్గజం సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆన్లైన్ వ్యాపారాలకు ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతేకాదు అమెజాన్కు కాల్ చేసినా వారు స్పందించడం లేదన్నారు. దయచేసి మాకు సహకరించండి లేనట్లయితే అమెజాన్ ఎండీ సీఈవోకి విజ్ఞప్తి చేస్తాం లేదా తదుపరి చర్యలు త్వరిత గతిన ప్రారంభిస్తాం" అని హెచ్చరించారు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్గా ఉందో ఈ ఏనుగు!!) -
Amazon: ఎంతకి తెగించార్రా ! ఇంత పని చేస్తారా ?
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల విక్రయ లావాదేవీలకు తమ ప్లాట్ఫాం వేదికగా మారిందన్న ఆరోపణలపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా అటు దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని భిండ్ పోలీసులు ఆన్లైన్ మారిజువానా విక్రయ రాకెట్ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ–కామర్స్ సంస్థ ద్వారా నిందితులు ఈ రాకెట్ నిర్వహించారని, వచ్చిన లాభాల్లో సంస్థకు మూడింట రెండొంతుల లాభాలు అందినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు వేదికగా నిల్చినందుకు గాను సదరు ఈ–కామర్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. ఎన్సీబీ ఎంక్వైరీకి డిమాండ్ ఈ కామర్స్ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది తీవ్ర నేరమని, మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది. అమెజాన్ సీనియర్ మేనేజ్మెంట్ను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. -
స్మార్ట్ ఫోన్పై అమెజాన్ బంపర్ ఆఫర్, ఈఎంఐ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..!
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనా స్మార్ట్ సంస్థకు చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్మీ 9 పవర్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రెడ్మీ 9 పవర్ ఫీచర్లు రెడ్మీ 9 పవర్ ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రెడ్ మీ 9లో ఉన్న కెమెరా ఫీచర్లు చూసుకుంటే 48ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రోమోడ్ , పోట్రేట్ ,ఏఐ సీన్ రికగ్నైజేషన్, నైట్ మోడ్, హెచ్డీఆర్,ప్రో మోడ్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ ఎస్ డీ కార్డ్ స్లాట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు. రెడ్మీ 9 పవర్ ధర రెడ్మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే పొందవచ్చు.రూ.541తో ఈఎంఐ ప్రారంభం కాగా..నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై యూపీఐ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు లభించనున్నాయి. చదవండి: షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా -
మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్ ఫోన్లను ఎక్ఛేంజ్ ఆఫర్తో సగానికి పైగా తక్కువ ధరకే లభించేలా ఆఫర్లు అమలు చేస్తోంది. సుమారు రూ.40వేల ఖరీదైన ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్పై అన్ని రకాల రాయితీలు వర్తిస్తే కేవలం రూ. 12, 849కే సొంతం చేసుకోవచ్చు. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 4,520ఎంఏహెచ్ బ్యాటరీ,క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉండగా ..కెమెరా వెనుక భాగంలో ఉన్న 3కెమెరాలకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్తో అమెజాన్లో అందుబాటులో ఉన్న ఫోన్పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లు ఇలా ఉన్నాయి దేశంలో ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో భారీ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో భాగంగా షావోమీ ఇండియా 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫోన్ ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 ఉంది, ఈ మోడల్పై ఎక్సేంజీ ఆఫర్లో గరిష్టంగా రూ.25,250లను షావోమీ ఆఫర్ చేస్తోంది. మీ పాత మొబైల్ ఫోన్కి ఎక్సేంజీలో మ్యాగ్జిమమ్ అమౌంట్ వస్తే ఫోన్ ధర రూ.14,249కి వస్తుంది. అయితే ఇక్కడో మరో ఆఫర్ని కూడా పొందే వీలుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ. 1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. దీంతో మొబైల్ చివరకు రూ.12,849లకే సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్లో మరో వేరియంట్ 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్తో రూ.41,999గా ధరతో ఉంది. ఈ మొబైల్ ఫోన్పై గరిష్ట ఎక్సేంజీ రూ.16,250గా ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ.1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. అయితే 256 జీబీ వేరియంట్తో పోల్చితే 128 వేరియంట్ని ఎంపిక చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్పై అదిరిపోయే డిస్కౌంట్స్
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021' కొనసాగుతుంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రారంభించిన ఈ సేల్లో అమెజాన్ పలు రకలా గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్, ల్యాప్ట్యాప్లపై భారీ ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా బ్రాండెడ్ ల్యాప్ట్యాప్స్పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుస్ వివో బుక్ 14 ఆసుస్ వివో బుక్ 14పై అమెజాన్ డిస్కౌంట్స్ అందించింది. 16: 9 యాస్పెట్ రేషియోతో 14అంగుళాలు 1920*1*1,080 స్క్రీన్, పీక్ బ్రైట్ నెస్ కోసం 220 నిట్స్, ఇంటెల్ కోర్ ఐ5 10జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్తో పాటు 12జీబీ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 512జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ 3.0 ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా 1.6కేజీల బరువు ఉండే ఈ ఆసుస్ వివో బుక్ 14ను బ్యాటరీ లైఫ్ 6గంటల వరకు వినియోగించుకోవచ్చు. విండోస్10 సపోర్ట్ చేస్తున్న వివోబుక్ 14ను ఫ్రీగా విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక దీని ధర రూ.56,776 ఉండగా రూ.41,990కే సొంతం చేసుకోవచ్చు. హెచ్పీ 15 15.6 అంగుళా ఫుల్ హెచ్డీ (1920*1,080)డిస్ప్లే, పీక్ బ్రైట్ నెస్ కోసం 220నిట్స్, ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్(16జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు) 256జీబీ పీసీఐఈ ఎన్వీఎంఈ ఎం.2 ఎస్ఎస్డీ, ఏఎండీ ర్యాడ్ఆన్ గ్రాఫిక్స్, యూఎస్బీ సీపోర్ట్ తోపాటు సూపర్ స్పీడ్ యూఎస్బీ టైప్ ఏ-పోర్ట్ను అందిస్తుంది. ఇక హెచ్పీ 15 మార్కెట్ ధర రూ.46,055 ఉండగా అమెజాన్లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 15.6 అంగుళాల (1366*768పిక్సెల్స్) డిస్ప్లే ,ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్ (12జీబీ వరకు అప్ గ్రేడ్)256జీబీ ఎస్ఎస్డీ, 1.85ల వెయిట్తో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10గంటల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాదు ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. గంటలో 80శాతం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ధర రూ.55,890 ఉండగా రూ.36,490కే అమెజాన్ సేల్లో కొనుగోలు చేయవచ్చు. డెల్ ఇన్స్ప్రాన్ 3501 డెల్ ఇన్ స్ప్రాన్ 3501 స్పోర్ట్స్ 15.6అంగుళాల (1920*1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ ఎల్ఈడీ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 256జీబీ ఎం.2 పీసీఐఆ ఎన్బీఎంఈ ఎస్ఎస్డీ, యూహెచ్ డీ గ్రాఫిక్స్ విండోస్ 10సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.44,634 ఉండగా అమెజాన్లో రూ.38,390కే సొంతం చేసుకోవచ్చు. హెచ్పీ క్రోమ్ బుక్ ఎక్స్360 హెచ్పీ క్రోమ్ బుక్ ఎక్స్360 14అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ డీడీఆర్4 ర్యామ్ అండ్ 64జీబీ ఎస్ఎస్డీ, ఇక ఈ క్రోమ్బుక్ సింగిల్ ఛార్జింగ్ను 13గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ట్యూన్ చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్,స్పీకర్లు ఉండగా క్రోమ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.65కేజీలు ఉండగా దీని ధర రూ.57,610 ఉండగా అమెజాన్ సేల్ లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. -
భారత్లో అమెజాన్ వ్యవహారం.. ‘జెఫ్ బెజోస్ పచ్చి అబద్ధాలకోరు’!
Reuters Allegations On Amazon's Business Practices: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు మొట్టికాయలు గట్టిగానే పడ్డాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఐదుగురు చట్టసభ్యుల యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం కంపెనీని హెచ్చరిస్తూ ఘాటుగా ఓ లేఖను రాసింది సదరు కమిటీ. అమెజాన్ అనైతిక వ్యాపారధోరణిపై రాయిటర్స్ తాజా సంచలన కథనం మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో కంపెనీలో పని చేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తులు, చివరికి వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా అంతా పార్లమెంట్(అమెరికా కాంగ్రెస్)ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసి ఉంటారని, అబ్దదాలు సైతం చెప్పారంటూ యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ తన లేఖలో పేర్కొంది. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరపిస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీని ఉద్దేశిస్తూ ఓ లేఖలో ప్యానెల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే విషయంలో అమెజాన్ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ రాయిటర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. గత బుధవారం ఆ కథనం ప్రచురితం కాగా.. ఈ సంచలన కథనం ఆధారంగా స్పందించిన దర్యాప్తు కమిటీ అమెజాన్ను పరోక్ష హెచ్చరికగా లేఖను రాసింది. స్థానిక ఉత్పత్తులను కాపీ కొట్టి ప్రొడక్టులు తయారుచేసుకోవడంతో పాటు, భారత్లాంటి దేశాల్లో అమెజాన్ ఇండియా యాప్ ద్వారా స్థానిక ఉత్పత్తులను తొక్కిపడేస్తూ, తమ ప్రొడక్టులను.. తమ అనుకూల ఉత్పత్తులనే ఎక్కువగా ప్రమోట్ చేస్తోందంటూ అమెజాన్పై రాయిటర్స్ తన కథనంలో ఆరోపించింది. మరోవైపు భారత్లోనూ ఈ కథనం ఆధారంగా అమెజాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ ఉత్పత్తుల వ్యాపారాన్ని దెబ్బతీస్తోందంటూ అమెజాన్పై పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు లక్షల మంది సంప్రదాయ వ్యాపారుల తరపున బృందం.. అమెజాన్పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి లేఖను సైతం రాసింది. ఇదిలా ఉంటే గతంలోనూ అమెజాన్పై ఇదే తరహా ఆరోపణలు రాగా.. ఈ ఐదుగురు సభ్యుల హౌజ్ జ్యుడీషియరీ కమిటీ 2019 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆరోపణలు రావడంతో అప్పుడు సీఈవోగా ఉన్న జెఫ్ బెజోస్ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించింది ప్యానెల్. అయితే తాము ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం లేదంటూ ఆ టైంలో అంతా వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు రావడంతో క్రిమినల్ దర్యాప్తు తప్పదని హెచ్చరించింది విచారణ కమిటీ. అయితే తామెప్పుడూ కమిటీని తప్పుడు దోవ పట్టించలేదని, మీడియా కథనాలే తప్పుల తడకగా ఉన్నాయని వివరించామని ఓ ప్రతినిధి వెల్లడించారు. చదవండి: బెజోస్కు ఆ ఆనందం లేకుండా చేసిన ఎలన్ మస్క్ -
బీభత్సం: తొలి వారంలోనే రూ.32వేల కోట్లు..!
దసరా ఫెస్టివల్ సీజన్ ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారింది. ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ రెడ్సీర్ ప్రకారం..ఫ్లిప్కార్ట్, అమెజాన్లు ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్ సీజన్ లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్సీర్ రిపోర్ట్ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. మొదటి వారంలోనే 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) కోట్లు అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు రూ. 68 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు జరిగినట్లు రిపోర్ట్లో పేర్కొంది. ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ ముందంజ ఈ సంవత్సరం అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా..అమెజాన్ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. దీంతో టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరగా..వారిలో టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లేనని తెలిపింది. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980 ఉండగా ఈ ఏడాదిలో రూ .5034 కి పెరిగినట్లు రెడ్సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. చదవండి: 'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
అమెజాన్పై సంచలన కథనం
పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా పని చేసే క్రమంలో ఈ-కామర్స్ కింగ్ ‘అమెజాన్’ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా India Private Brands Programme పేరుతో సేకరించిన పత్రాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది. ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్ అమెజాన్ మార్కెట్లో లోకల్ బ్రాండ్లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్కు ఎక్కువగా బలైందని వెల్లడించింది. అమెజాన్కు సంబంధించిన బ్రాండ్లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్లనే(రివ్యూలతో సంబంధం లేకుండా) వినియోగదారులకు టాప్ సెర్చ్లో చూపిస్తోందనేది(డిస్ప్లే చేయడం) చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం. మరి అమెజాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: amazon.. ఈ ఆఫర్ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్సేల్ ముగియగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతుంది.అయితే ఈ సేల్ను క్యాష్ చేసుకునేందుకు ఆయా టెక్ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బడ్జెట్ ఫోన్ను లాంఛ్ చేసింది. వివో వై20టీ ఫీచర్లు 'వివో వై20టీ' సిరీస్లో విడుదలైన ఈ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్డీ క్వాలిటీతో పాటు సెక్యూర్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 చిప్ సెట్, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, ర్యామ్ను ఎక్స్టెండ్ చేసుకుందుకు ర్యామ్ 2.0 ఫీచర్, 1జీబీ వర్చువల్ మెమెరీ, గేమ్లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్ వర్క్ పర్పస్ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ బొకేహ్ కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్ లైట్ అండ్ పోట్రేట్ మోడ్ సాఫ్ట్వేర్ ఫీచర్ మోడ్లో 8ఎంపీ సెల్ఫీ షూటర్ సదుపాయం ఉంది. వివో వై20 టీ ధర ఎంతంటే భారత్లో విడుదలైన వివో వై20 టీ ఫోన్ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్ స్టోర్ వేరియంట్ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్ ను బజాజ్ ఫిన్ సర్వ్లో 12నెలలు పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్ బ్యాక్తో పాటు అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ స్టోర్లలో 6నెలల పాటు నో కాస్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
ఈ ల్యాప్ ట్యాప్పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
ల్యాప్ ట్యాప్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్పై అమెజాన్ భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్ సేల్లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్పై ఆఫర్లను అందిస్తుంది. 'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ట్యాప్ 64బిట్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కు సపోర్ట్ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,18జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్ను అందిస్తుంది. హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్గా డేటాను స్టోర్ చేసేందుకు ఎస్ఎస్డీ డ్రైవ్ కూడా ఉంది. వీటితో పాటు కలర్ కాంట్రాస్ట్ కోసం ఎల్ఈడీ బ్యాక్ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ,వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇక ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్ ధర రూ.89,999 ఉండగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో రూ.30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ల్యాప్ట్యాప్పై ఎక్ఛేంజ్ కింద రూ.18,100 వరకు ఆఫర్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 500వరకు,ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్ను పొందవచ్చు. చదవండి: ఈ ఆఫర్ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
గుడ్ న్యూస్, అమెజాన్లో ఆ టెక్నాలజీపై ఉచితంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ/స్టార్ట్ కార్యక్రమాన్ని భారత్లో ప్రారంభించింది. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఔత్సాహికులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ ఇస్తారు. 12 వారాలపాటు సాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రాంకు ఎటువంటి సాంకేతిక అనుభవం అవసరం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్లో కెరీర్ ప్రారంభించేందుకు ఇది దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. యూఎస్, యూకేతోపాటు ప్ర పంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఇప్పటికే రీ/స్టార్ట్ కార్యక్రమం నిర్వహించారు. మల్టీక్లౌడ్కు భారీ అవకాశాలు దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్లకు భారీ అవకాశాలున్నట్లు యూఎస్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వీఎంవేర్ తాజాగా అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్వహించిన వీఎంవరల్డ్ 2021 సదస్సులో పలు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పలు సంస్థలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయాణం రెండో దశలో ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు క్లౌడ్స్మార్ట్గా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్ల మార్కెట్ అత్యంత వృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడింది. దేశీ మార్కెట్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వీఎంవేర్ ప్రెసిడెంట్ సుమీత్ ధావన్ వెల్లడించారు. తమ మల్టీక్లౌడ్ సొల్యూషన్లనకు పలు అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఐదేళ్ల కాలంలో దేశీ మార్కెట్లో రెండు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2018లోనే వీఎంవేర్ ప్రకటించింది. తద్వారా కార్యకలాపాల విస్తరణ, ఉపాధి కల్పను తెరతీయను -
అదిరిపోయే ఆఫర్, రూ.60 వేల భారీ డిస్కౌంట్తో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్
మనేదేశంలో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ దుమ్మురేపుతున్నాయి. ఆన్లైన్ వేదికగా జరిగే ఈ అమ్మకాల్లో తమకు నచ్చిన ప్రాడక్ట్లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు వినియోగదారులు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు. అయితే కొనుగోలు దారుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆ రెండు ఈ కామర్స్ కంపెనీలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను రూ.10,000 లోపే అందిస్తున్నాయి. ఇప్పుడు హై కాన్ఫిగర్ బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్లను తక్కువ ధరకే అమ్మేందుకు అమెజాన్ సిద్ధమైంది.ప్రముఖ గేమింగ్ ల్యాప్ట్యాప్ 'ఆసుస్ డాష్ ఎఫ్15' ధర రూ. 1,39,900 మార్కెట్లో విడుదలైంది.ఈ థమకా సేల్లో ల్యాప్ ట్యాప్ను రూ.60వేల డిస్కౌంట్తో రూ.79,990కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ ల్యాప్ ట్యాప్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఐ5 11 జనరేషన్ వేరియంట్ ల్యాప్ ధర రూ.69,990కే సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. ఆసుస్ టీయూఎఫ్ డాష్ ఎఫ్15 స్పెసిఫికేషన్లు ♦ 15.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 144హెచ్జెడ్ హై రిఫ్రెష్ రేట్ ♦ 11 జనరేషన్, కోర్ ఐ7చిప్ సెట్ ♦ 16 జీబీ డీడీఆర్4 ర్యామ్ 512జీబీ ఎన్వీఎంఈ పీసీఐఆ 3.0 ఎస్ఎస్డీ ♦ బ్లూటూత్ వీ5.2 అండ్ వైఫై 6 కనెక్టివిటీ ♦ త్రీ యూఎస్బీ టైప్ ఏ (3.2జనరేషన్1) పోర్ట్ ♦ థండర్ బోల్ట్ 4 పోర్ట్, హెచ్డీఎంఐ 2.0 పోర్ట్ ♦ ఆర్జే 45 అండ్ 3.5ఎం ఎం హెడ్ ఫోన్ జాక్ చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్ ఇవే...!
Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ను ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను అక్టోబర్ 3 నుంచి ఒక నెల రోజుల పాటు అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్పై ఒక లుక్కేయండి...! చదవండి: ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..! స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ 11 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కొనుగోలుదారులకు ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ ధర రూ. 38,999 కు లభించనుంది. స్మార్ట్ఫోన్ ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. 64జీబీ ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 68,300. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ఫోన్ అత్యంత తక్కువ ధరలో రూ. 36,990 కే కొనుగోలుదారులకు లభించనుంది. స్మార్ట్ఫోన్ ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 74,999. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలుదారులకు రూ. 32,999కు లభించనుంది. ఎక్సేచేంజ్పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 47,900. ఐక్యూ జెడ్3 5జీ వివో సబ్ బ్రాండ్ ఐనా ఐక్యూ కంపెనీ స్మార్ట్ఫోన్ ఐక్యూ జెడ్3 5జీ స్మార్ట్ఫోన్ (6జీబీ+128 జీబీ) వేరియంట్ కొనుగోలుదారులకు రూ. 17,990 కే లభించనుంది. అంతేకాకుండా 9 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ, ఆర్నెల్ల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 22,990. రెడ్మీ నోట్ 10ప్రో రెడ్మీనోట్ 10 ప్రో కొనుగోలుదారులకు రూ. 16,499 కే లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 19,999. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ బిగ్బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 26, 999 కు లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 39, 900. గూగుల్ పిక్సెల్ 4ఏ బిగ్బిలియన్ డేస్ సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 25,999 కు లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 31, 999. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్కార్ట్ బండిల్ ఆఫర్ను కూడా అందిస్తోంది. గూగుల్ నెస్ట్ ను కేవలం రూ. 1, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ను కేవలం రూ. 4999కు అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో పోకో ఎక్స్ 3 ప్రో స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 16,999కే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 23, 999. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ రూ. 19,999కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 24, 999. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం మేర తక్షణ తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్బ్యాక్...! -
ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. తాజాగా ప్రైమ్ యూజర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ప్రైమ్ యూజర్లకు ‘ అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్ చేసింది. చదవండి:75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ ప్రోగ్రాం సహాయంతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్ ఈఏమ్ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తించనుంది. దాంతో పాటుగా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై అదనంగా కస్టమర్లు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చును. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల కోసం మరిన్నీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందించనుంది. అమెజాన్ అందిస్తోన్న 'అడ్వాంటేజ్ - జస్ట్ ఫర్ ప్రైమ్' ప్రోగ్రామ్ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ఫోన్లైన సామ్సంగ్ గెలాక్సీ M52 5జీ , ఐక్యూ జెడ్5, షావోమీ 11 లైట్ 5G ఎన్ఈ, ఒప్పో ఏ55 నో కాస్ట్ ఈఎమ్ఐలను అందిస్తోంది. నెల రోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ల్యాప్టాప్లు , స్మార్ట్ టీవీలు , మొబైల్ ఫోన్లు , ఎయిర్ ప్యూరిఫైయర్లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు మరిన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది . చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! -
విద్యార్ధులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు. 6–12 తరగతి విద్యార్థులకు.. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (వాయిస్ టెక్నాలజీ) వంటి భవిష్యత్ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది. అమెజాన్ సైబర్ రోబోటిక్స్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్స్, కోడింగ్ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్లో నాణ్యమైన సీఎస్ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్నర్ కోడ్.ఓఆర్జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. ఏఎఫ్ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ‘ఉపాధి రంగంలో కంప్యూటర్ సైన్స్ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారింది. సీఎస్ను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘నాణ్యమైన కోర్సు కంటెంట్ లేకపోవడం, స్థానిక భాషలో పరిమితంగా అధునాతన కంటెంట్ వంటివి సీఎస్ కెరీర్ను ఎంచుకోవాలనుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అడ్డంకులు. ప్రతిభ, అభిరుచి యువకులందరిలో విస్తరించినప్పటికీ అవకాశాలు పరిమితమే. ఏఎఫ్ఈతో సీఎస్ విద్యను ముందస్తుగా అందించడం ద్వారా ఈ అంతరాన్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. చదవండి: వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్లోకి. -
భారత్లో ‘కుట్ర’ ఆరోపణలు.. అమెజాన్ రియాక్షన్ ఇది
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాల ద్వారా భారత్లో విదేశీ కుట్రకు పాల్పడుతోందన్న ఆరోపణలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్కు చెందిన ‘పాంచ్జన్య’లో అమెజాన్ను ‘ఈస్టిండియా కంపెనీ 2.0’తో పోలుస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ కథనానికి అమెజాన్ కౌంటర్ ఇచ్చింది. ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ అనే హెడ్డింగ్తో అమెజాన్కు వ్యతిరేకంగా ఈమధ్య ఓ కథనాన్ని ప్రచురించింది పాంచ్జన్య. అందులో.. ‘‘భారత మార్కెట్లో పైచేయి కోసం అమెజాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నిరకాలు స్వేచ్ఛలను, భారతీయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. తమ అనుకూలత కోసం ఓ మెట్టుదిగజారి అవినీతికి సైతం పాల్పడుతోంది. వీటికి తోడు ప్రైమ్ వీడియోల ద్వారా సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ ఎలాగైతే భారత్ను దోచుకుందో.. ఇప్పుడు అదేవిధంగా జాతి సంపదను కొల్లగొడుతూ అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీని తలపిస్తోంది’’ అని ఆరోపించింది పాంచ్జన్య. అయితే ఈ కథనానికి స్పందించిన అమెజాన్.. తమ విక్రయదారుల్లో భారత ఎగుమతిదారులూ ఉన్నారని, వాళ్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులనే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నామని తెలిపింది. లెక్కలతో సహా.. 200 దేశాల్లో భారత ఉత్పత్తులను అందిస్తున్నామని స్పష్టం చేసింది అమెజాన్. అంతేకాదు భారత అమ్మకందారులకు అమెజాన్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుందో వివరించింది. ‘‘కరోనా టైంలో మూడు లక్షల మంది కొత్త అమ్మకందారులు చేరారు. అందులో 45 ఫ్లస్ నగరాల నుంచి 75 వేలమంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. మెట్రోనగరాలు, టైర్-2, టైర్-3, టైర్- స్థాయి పట్టణాల నుంచి కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్టులను సేకరించి.. 200 దేశాల్లో మా సర్వీసుల ద్వారా అందిస్తున్నాం. పైగా అమెజాన్ ఎక్స్పోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది భారత్కు చెందిన ఎగుమతిదారులే ఉన్నారని, వాళ్లంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే అమ్ముతున్నారని స్పష్టం చేసింది. చదవండి: భారత్లో అమెజాన్ ‘ధన’బలం! చదవండి: అమెజాన్ లీగల్ ప్రతినిధుల రాంగ్రూట్?! ఇదిలా ఉంటే పాంచ్జన్య.. గత కొన్నిరోజులుగా అమెజాన్ మీద ఫోకస్ పెట్టి వరుస కథనాలు ప్రచురిస్తోంది. హిందీ వీక్లీ, ఆరెస్సెస్ అనుబంధ పత్రికా విభాగం అయిన పాంచ్జన్య ఇంతకు ముందు ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ను ‘జాతి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే కదా!. అయితే ఈ కథనంపై ఆరెస్సెస్ ఆల్ఇండియా పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. పాంచ్జన్య కథనం రాసినవాళ్ల సొంత అభిప్రాయమని, ఆరెస్సెస్తో ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. Panchjanya is not mouthpiece of the RSS and the said article or opinions expressed in it should not be linked with the RSS. @editorvskbharat — Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021 సంఘ్కు అవసరమా? ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ జోక్యానికి కారణమైంది. ఆరెస్సెస్ పాంచ్జన్య కథనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్రస్తుతమని పేర్కొంది. అవసరం లేని వ్యవహారాల్లో ఆరెస్సెస్ జోక్యం ఎక్కువైందని, అమెజాన్ మీద పాంచ్జన్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, ఉపేక్షించదగినవి కావని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ప్రయోజనాలకే తప్ప.. దేశ ప్రయోజనాలకు ఆ విభాగం(ఆరెస్సెస్) పని చేయదంటూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: అమెజాన్కి చెక్ పెట్టే పనిలో టాటా గ్రూపు -
సర్వే:ఈ పండుగ సీజన్లో జనం ఎక్కువగా కొనే వస్తువులు ఇవే?!
ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు స్థూలంగా 9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (జీఎంవీ) విక్రయించే అవకాశం ఉందని కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో నమోదైన 7.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనపర్చే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి ఏడాదికి మొత్తం ఆన్లైన్ స్థూల జీఎంవీ 49–52 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండవచ్చని, గతేడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఈ–కామర్స్ పండుగ సీజన్ నివేదికలో రెడ్సీర్ అంచనా వేసింది. ఆర్డర్ల రద్దు, వాపసు చేయడం మొదలైన వాటిని తీసివేయడానికి ముందు, స్థూలంగా అమ్ముడైన ఉత్పత్తుల మొత్తం విలువను స్థూల జీఎంవీగా వ్యవహరిస్తారు. కోవిడ్ తరవాత పరిసథితుల నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరగడం.. అమ్మకాల వృద్ధికి దోహదపడగలదని రెడ్ సీర్ తెలిపింది. కొత్త మోడల్స్ ఆవిష్కరణల ఊతంతో మొబైల్స్ విక్రయాలు అత్యధికంగా ఉండగలవని, ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్..గృహోపకరణాలు మొదలైనవి ఉంటాయని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
భారత్లో అమెజాన్ ‘ధన’బలం!
న్యూఢిల్లీ: భారత్లో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కార్యకలాపాలు పటిష్టంకావడానికి ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు దేశంలో కేవలం రెండేళ్లలో రూ.8,646 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) న్యాయపరమైన వ్యయాలు (లీగల్ ఫీజులు) చేసినట్లు వచ్చిన వార్తా కథనాలు సంచలనం రేపుతున్నాయి. దేశంలో అమెజాన్ పబ్లిక్ అకౌంట్ ఫైలింగ్స్ గురించి సమాచారం తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ వెలువడిన వార్తల ప్రకారం, అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ సెల్లర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ హోల్సేల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇంటర్నెట్సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్సహా భారత్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ–కామర్స్ దిగ్గజ విభాగాలు 2018–19లో 3,420 కోట్ల లీగల్ ఫీజులు చెల్లించగా, 2019–20లో ఈ విలువ రూ. 5,126 కోట్లుగా ఉంది. ఈ రెండేళ్లలో అమెజాన్ మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 20 శాతమని కూడా సంబంధిత వర్గాలు అంచనా. అవినీతి మయం: సీఏఐటీ కాగా ఈ వార్తాకథనాలపై అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా స్పందించింది. ఈ స్థాయి వ్యయాలు ప్రశ్నించదగినవిగా పేర్కొంది. ‘‘భారత్లో తన కార్యకలాపాల కొనసాగింపు, పటిష్టత లక్ష్యంగా భారత్ ప్రభుత్వ అధికారులను అమెజాన్, దాని అనుబంధ సంస్థలు ఎలా మభ్యపెడుతున్నాయి, లంచాలు ఇవ్వడానికి తమ ఫైనాన్షియల్ బలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాయి అన్న అంశాన్ని ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు చెల్లించిన న్యాయపరమైన భారీ ఫీజులు తెలియజేస్తున్నాయి’’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ మంత్రి పియూష్ గోయెల్కు రాసిన ఒక లేఖలో సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. అయితే తన ఆరోపణలకు ఆయన ఎటువంటి సాక్ష్యాలను చూపించని ఆయన, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు విభాగం (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో వచ్చిన దాదాపు రూ.45,000 కోట్ల టర్నోవర్పై రూ.8,500 కోట్లు న్యాయపరమైన వ్యయాలు చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. కథనాలపై స్వయంగా విచారణ ప్రారంభించిన అమెజాన్ కాగా, ఈ వ్యవహారంపై అమెజాన్ స్వయంగా విచారణ ప్రారంభించింది. ఈ అంశంలో సీనియర్ కార్పొరేట్ న్యాయవాదిని ఒకరిని సెలవుపై పంపినట్లు కూడా తెలుస్తోంది. ఆరోపణలను ధృవీకరించడంకానీ లేదా ఖండించడంకానీ చేయని అమెజాన్, ఆరోపణలపై పూర్తి స్థాయిలో తగిన విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. అవినీతి ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయ వివాదాలు ఇవీ.. ఫ్యూచర్ గ్రూప్ను రిలయన్స్ కొనుగోలు (రూ.24,713 కోట్ల ఒప్పందానికి సంబంధించి) వ్యవహారాన్ని సవాలుచేస్తూ, దేశంలో అమెజాన్ అతిపెద్ద న్యాయపరమైన వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో నలుగుతోంది. దేశంలో దాదాపు రూ.లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుడానికి జరుగుతున్న వాణిజ్య యుద్ధంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇక ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు సుప్రీంకోర్టులో ఇటీవలే ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీల అప్పీలేట్ పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ‘‘క్రిమినల్ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ– కామర్స్ కంపెనీలు ఈ తరహా ఆరోపణలపై విచారణను అడ్డుకుంటూ కోర్టుల్లో సవాలు చేయడం తగదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ కూడా తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. -
‘ఎవర్నీ వదలం’.. భారత్లో పరిణామాలపై అమెజాన్ గరం
న్యూఢిల్లీ: భారత్లోని కొందరు లీగల్ ప్రతినిధులపై వచ్చిన లంచం ఆరోపణలను అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సీరియస్గా తీసుకుంది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలను నిర్ధారించడం గానీ లేదా ఖండించడంగానీ చేయని అమెజాన్..‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము‘ అని పేర్కొంది. ది మార్నింగ్ కాంటెక్ట్స్ అనే పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత్లో ప్రభుత్వాధికారులకు తమ లీగల్ ప్రతినిధులు కొందరు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అమెజాన్ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో సీనియర్ కార్పొరేట్ కౌన్సెల్ను సెలవుపై పంపించింది. దీనిపైనే కంపెనీని వార్తా సంస్థలు సంప్రదించగా.. ఆరోపణలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయబోమని, విచారణ ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పలేమని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. విదేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు కోసం తమ సిబ్బంది ఎవరైనా ఆయా దేశాల ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చినట్లు ఆరోపణలు వస్తే.. అమెరికన్ కంపెనీలు వాటిని తీవ్రంగా పరిగణిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐతో విచారణ జరిపించాలి: సీఏఐటీ మరోవైపు, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమని, అన్ని స్థాయిల్లో అవినీతి పేరుకుపోయిందన్న భావనను తొలగించేందుకు ప్రభుత్వం దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్కు లేఖ రాసింది. అమెజాన్ లీగల్ ప్రతినిధుల మీద లంచాల ఆరోపణల అంశాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) చైర్మన్ గ్యారీ గెన్సలర్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసే శక్తుల నుంచి దేశీ ఈ–కామర్స్ మార్కెట్ను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలను దెబ్బ తీసే విధంగా చౌక ధరలు, తన ప్లాట్ఫాంపై కొందరు విక్రేతలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర విక్రేతల అవకాశాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో అమెజాన్ మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేస్తున్న తరుణంలో కంపెనీ ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఫ్యూచర్ గ్రూప్లో ఇన్వెస్టరయిన అమెజాన్.. ఆ సంస్థ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయపోరాటం కూడా చేస్తోంది. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టుల్లో అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ పరస్పరం దావాలు వేశాయి. చదవండి: చైనాకు అమెజాన్ భారీ షాక్ -
అమెజాన్ కు రెండో టెక్నాలజీ హబ్ భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమెరికా తర్వాత భారత్ తమకు రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్గా మారిందని టెక్ దిగ్గజం అమెజాన్ కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశీయంగా తమ సంస్థలో ఇంజినీరింగ్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో సుమారు ఒక లక్ష మంది పైగా ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ ఇండియా కెరియర్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది దేశీయంగా 35 నగరాల్లో 8,000 మంది పైచిలుకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నట్లు అగర్వాల్ చెప్పారు. -
అలెక్సాతో పనిచేసే టీవీ, ఫీచర్లు ఇలా ఉన్నాయ్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సొంతంగా అమెజాన్ బ్రాండెడ్ టీవీని మార్కెట్లోకి విడుదల చేయనుంది. బ్రాండ్ ఫైర్ టీవీ (మల్టీపుల్ మోడల్) తరహాలో 55 నుంచి 75 అంగుళాల నిడివితో ఉన్న టీవీని అక్టోబర్లో అందుబాటులో తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఫీచర్స్ బిజినెస్ ఇన్ సైడర్ ప్రకారం.. వర్చువల్ అసిస్టెంట్ డివైజ్ 'అలెక్సా' కమాండ్ కంట్రోల్తో పనిచేసేలా రెండేళ్ల నుంచి టీవీపై వర్క్ చేస్తుంది. ఇందుకోసం చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఇక అమెజాన్ - టీసీఎల్ భాగస్వామ్యంలో బిల్డ్ అవుతున్న ఈ టీవీలో అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్ను యాడ్ చేస్తుంది. డిష్వాషర్ ధ్వని, వ్యక్తుల మధ్య సంభాషణలు, ఎక్కడైనా ప్లే అవుతున్న మ్యూజిక్ గుర్తించి అలెక్సా స్పందించనుంది.వీటితో పాటు భారత్లో అమెజాన్ బేసిక్ బ్రాండెడ్ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్వేర్ ఆధారితమైన తోషిబా, ఇన్సిగ్నియా టీవీలను విక్రయించనుంది. ఇందుకోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ బెస్ట్బైతో ఒప్పందం కుదుర్చుకుంది. సొంత సాఫ్ట్ వేర్ లేదు అమెజాన్ సంస్థ ఇప్పటి వరకు 'వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' అందించే సాఫ్ట్వేర్, ఇతర ఎక్విప్మెంట్లతో తయారు చేసిన టీవీలను అమెజాన్ మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా అమెజాన్ సంస్థ సొంతంగా తయారు చేసిన సాఫ్ట్వేర్ ఆధారిత టీవీలను విడుదల చేయాలని భావిస్తుంది.ఇందులో భాగంగా తొలిసారి అమెజాన్ బ్రాండెడ్ టీవీ బిల్డ్ చేస్తుంది. వచ్చే నెలలో అమెరికా, ఆ తరువాత భారత్లో విడుదల చేయనుంది. -
Amazon: రైతులకు టెక్నికల్గా సాయం
భారత్లో అన్ని రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు టెక్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెజాన్ రిటైల్, రైతుల కోసం అగ్రోనమీ సర్వీసెస్ను ప్రారంభించింది. టెక్నాలజీ సంబంధిత ఈ సర్వీసుల ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, నిర్ణయాలు, వాళ్ల నుంచి విలువైన సూచనలు తీసుకుని మరికొందరు రైతులకు అందించే ఉద్దేశంతో ఆగ్రోనమీని మొదలుపెట్టింది. రైతులకు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని అందించడంతో పాటు ఉత్పత్తిని మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకే ఈ అగ్రోనమీ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు అమెజాన్ ఇండియా గ్రాసరీ, ఫుడ్ అండ్ హెల్త్ డైరెక్టర్ సమీర్ ఖేతర్పాల్ వెల్లడించారు. అగ్రోనమీ సేవలతో పాటు వ్యవసాయం పరిశోధకులను, నిర్వాహకుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయనుంది అమెజాన్. శిక్షణ పొందిన రైతుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వాళ్లను.. మరికొందరికి శిక్షణ ఇచ్చే నిర్వాహకులుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. గత దశాబ్దకాలంగా వ్యవసాయంలో టెక్నాలజీ పాత్ర పెరిగింది. ఈ తరుణంలో రైతులకు తోడ్పాటుగా నిలవడం ద్వారా అగ్రో సెక్టార్లోనూ ముందుకెళ్లాలని భావిస్తోంది అమెజాన్. మట్టి, వాతావరణాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సూచనలు అందించే టెక్నాలజీని సైతం త్వరలో అగ్రోనమీ ప్రాజెక్టులో చేర్చనున్నట్లు అమెజాన్ తెలిపింది. చదవండి: దేశంలో ఆగిపోనున్న వీపీఎన్ సర్వీసులు? -
అమెజాన్ ఇండియా కారీగర్ మేళా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. -
ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ 'అలెక్సా' కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
చీటింగ్ కేసు: అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్కు కోర్టు సమన్లు
చీటింగ్ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన న్యాయవాది అమృత్ పాల్ సింగ్ ఖల్సా దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదులో అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ కు ఉల్హాస్ నగర్ లోని మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అమృత్ పాల్ సింగ్ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్ నగర్ నివాసి. 2019లో అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ తనకు రాకపోవడంతో అతను స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తులను చేసినప్పటికీ తను చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేయలేదని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఖల్సా డిసెంబర్ 2019లో 3,999 రూపాయల విలువైన హార్డ్ డ్రైవ్ ను ఆర్డర్ చేశారు. ఈ విషయంపై ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించినట్లు ఖల్సా పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిర్యాదుపై విచారణ జరపాలని మేజిస్ట్రేట్ 2021 మార్చిలో ఉల్హాస్ నగర్ పోలీసులను ఆదేశించింది. అయితే, పోలీసులు అగర్వాల్ కు, ఖల్సా ఆర్డర్ చేసిన థర్డ్ పార్టీ విక్రేతలకు సమన్లు పంపినప్పటికీ వారు గైర్హాజరు అయ్యారు. దీంతో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమెజాన్ ఇండియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అమెజాన్ ఇండియా, థర్డ్ పార్టీ విక్రేతలకు నోటీసు జారీ చేసిన కూడా అమృత్ పాల్ సింగ్ ముంబైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. -
స్టార్టప్స్ విజేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ప్రారంభ దశలోని స్టార్టప్స్కు సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా, సిక్వోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్సైడ్ వెంచర్స్తో భాగస్వామ్యమై యాక్సిలేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొఫైల్ స్టార్టప్ యాక్సిలేటర్లో స్లర్ప్ ఫార్మ్, సిరోనా హైజీన్, వెల్బీయింగ్ న్యూట్రీషన్ మూడు స్టార్టప్లను విజేతలుగా ఎంపిక చేసింది. వీటికి 50 వేల డాలర్లు (rs.3,71,2875.00) ఈక్విటీలను గ్రాంట్గా అందించామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశం ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తుందని.. ఈ ప్రయాణంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎగుమతులను పెంచడంలో, మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించారు. చదవండి: హైదరాబాద్ వినియోగదారుల ఫోరంలో ఎస్బీఐకి దెబ్బ -
అమెజాన్ బంపర్ ఆఫర్: భారీ ఎత్తున క్యాష్ ఫ్రైజ్, ఉచితంగా కొత్త కార్లు
ఉద్యోగులకు అమెజాన్ భారీ ఆఫర్ను ప్రకటించింది.వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతుల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.రెండు నెలల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాస్క్ అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలు మాస్క్లు లేకుండా, కోవిడ్-19 నిబంధనల్ని ఉల్లంఘించడంతో మరోసారి కరోనా విజృభించింది అయితే 'మాస్క్ ఫ్రీ' ప్రకటనతో కరోనా ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకు కనీసం లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు.. వందల సంఖ్యలో డెల్ట్ వేరియంట్ బాధితులు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇప్పటికే మాస్క్ ఫ్రీ అని ప్రకటించిన అమెజాన్ దిద్దుబాటుకు చర్యలు తీసుకుంది. అమెజాన్ హెడ్ క్వార్టర్స్కు చెందిన లాజిస్టిక్స్ సెంటర్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ వేయించుకోలేదు.పైగా మాస్క్ లేకుండా తిరగడం వల్ల.. సహోద్యోగులు కరోనా భారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అమెజాన్ వ్యాక్సిన్ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు బహుమతుల్ని ప్రకటించనుంది. ఇందుకోసం రూ.14.9కోట్లను కేటాయించిందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7కోట్లను అమెజాన్ అందించనుందని తెలిపింది. తర్వాత ఆరుగురికి రూ. 74లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ఫ్రంట్ లైన్ వర్క్ర్లు అంటే అమెజాన్లోని కాకుండా ఆ సంస్థకు అనుసంధానంగా ఉన్న ఆర్డర్లు స్టోర్ చేసే గోడౌన్స్, హోల్ సేల్ మార్కెట్లు, ఫ్రెష్ గ్రాసరీ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. మరి కాంటెస్ట్ ను ఎంతమంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. -
వర్క్ఫ్రం హోం.... ఆ సంస్థ కీలక నిర్ణయం
డెల్టా వేరియంట్ కేసుల కారణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వచ్చే ఏడాది వరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. ప్రపంచదేశాల్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు 135 దేశాలకు వ్యాపించినట్లు ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. మరోవైపు అమెరికాలో సైతం డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండడంతో అమెజాన్లో పనిచేసే ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నెల వరకు అందరూ వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించింది. వాస్తవానికి వర్క్ ఫ్రం హోం ఈ ఏడాది సెప్టెంబర్ నెలతో ముగియనున్నాయి. కానీ పెరుగుతున్న డెల్టా కేసులు దృష్ట్యా ఆ సమయాన్ని అమెజాన్ పొడిగించింది. ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.."దేశంలోని కోవిడ్ పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. సెప్టెంబర్ 7,2021 వరకు ఉద్యోగులు ఇంట్లోనే విధులు నిర్వహించేలా మెయిల్ పెట్టాము. సెప్టెంబర్ 8నుంచి కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ మార్గదర్శకాల్ని సరిచేస్తున్నాం.జనవరి 3, 2022 వరకు వర్క్ ఫ్రం హోం విధులు కొనసాగించాలని ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు" చెప్పారు. -
తెలంగాణలో మరో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఫుల్ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ రాష్ట్రంలో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేయనుంది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మేడ్చల్లో ఉన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీపి పెంచింది. తాజాగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కంపెనీ ఐదు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను కలిగి ఉండనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్ అవతరించనుంది. రాష్ట్రంలో అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది. ఈ సందర్బంగా అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ డైరక్టర్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ..తాజా విస్తరణతో అమెజాన్ తన కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నిచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సాధికారిత వస్తోందని తెలిపారు. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. -
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. అదిరిపోయే ఆఫర్లతో పండగే పండగ
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో ఆఫర్ల పండుగ మొదలైంది. పంద్రాగస్ట్ను పురస్కరించుకొని అమెజాన్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్' ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళమీరు జులైలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే.. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో గాడ్జెట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సేల్ సందర్భంగా కష్టమర్లకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్ ఎస్బీఐతో టై అప్ అయ్యింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సేల్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ( గరిష్టంగా రూ.1750) కొనుగోలు చేస్తే 10 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఆపిల్ ఐఫోన్ 11 అమెజాన్ సేల్ లో ఆపిల్ ఐఫోన్ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు కోసం పేరొందిన క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 రూ.79,900విలువైన ఆపిల్ ఐఫోన్ 12ను ఈ ఆఫర్ లో 11,901 తగ్గుతుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎక్సేంజ్ ఆఫర్లో రూ.13,400 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.వీటితో పాటు వన్ ప్లస్ 9జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బ్రాండ్లపై ఆఫర్లు అమెజాన్కు చెందిన డివైజ్ ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే ఈ బుక్ రీడర్స్ పై ఆఫర్లు లభిస్తాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈ సోనీ డబ్ల్యూహెచ్ ఎక్స్ఎం3 వైర్ లెస్ హెడ్ ఫోన్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఆపిల్ వాచ్ సిరీస్ ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2020 హెచ్ పీ పెవిలియన్ గేమింగ్ ల్యాప్ ట్యాప్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. -
‘ప్రైమ్డే’లో 2,400 ఉత్పత్తుల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 26–27 తేదీల్లో నిర్వహించే ’ప్రైమ్ డే’లో 100 పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలు 2,400 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ తెలిపారు. ఈ సంస్థల్లో స్టార్టప్లు, మహిళా ఎంటర్ప్రెన్యూర్లు, చేనేత కళాకారులు మొదలైన వారు ఉంటారని పేర్కొన్నారు. ఇల్లు..వంటగదికి అవసరమైన ఉత్పత్తులు మొదలుకుని ఫ్యాషన్, ఆభరణాలు, స్టేషనరీ, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులు ఉంటాయని భాసిన్ వివరించారు. ప్రైమ్ డేలో 450 నగరాల నుంచి 75,000 పైచిలుకు ’లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ విక్రేతలు పాల్కొంటారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం గతేడాది లాక్డౌన్లు విధించినప్పట్నుంచీ ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లో తమ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని భాసిన్ చెప్పారు. ప్రస్తుతం తమ కస్టమర్ ఆర్డర్లలో 65 శాతం, కొత్త కస్టమర్లలో 85 శాతం మంది వీరే ఉంటున్నారన్నారు. వర్క్–ఫ్రం–హోమ్, ఆన్లైన్ స్కూలింగ్కు సంబంధించిన ఉత్పత్తులతో పాటు వ్యక్తిగత సౌందర్య సాధనాలు, నిత్యావసరాలు మొదలైన వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. -
40శాతం విస్తరణకు అమెజాన్ కీలక నిర్ణయం
-
అమెజాన్ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కల్పన!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అమెజాన్ తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ప్రారంభించనుంది. కాగా ప్రస్తుతం ఉన్న 9 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను మరింత విస్తరించనుంది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, వేర్ హౌస్ సెంటర్లతో భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ సిద్ధమైంది. అంతేకాకుండా పదివేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలనదించడంతో పాటుగా తగినశక్తిని అందించాలనే మా వాగ్ధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, బీహర్, గుజరాత్, అసోం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. -
బుక్ లవర్స్కు గుడ్న్యూస్..! నాలుగేళ్ల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2కే..!
పుస్తక ప్రియులకు శుభవార్త..! బుక్ లవర్స్ కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. అమెజాన్కు చెందిన అడిబుల్ యాప్ నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2 కే అందించనుంది. అడిబుల్లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చును. అంతేకాకుండా విభిన్నమైన పాడ్కాస్ట్లను కూడా అడిబుల్ అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వెబ్సైట్లో ఈ ఆఫర్ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ కేవలం మొదటిసారి జాయిన్ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అడిబుల్ సబ్స్క్రీప్షన్ తీసుకుంటే ఆఫ్లైన్లో మీకు నచ్చిన పుస్తకాలను వినొచ్చు. అడిబుల్ సాధారణంగా నెలకు రూ.199 కు అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. -
విద్యార్థులకు బంపర్ ఆఫర్ను ప్రకటించిన అమెజాన్..!
కరోనా రాకతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. టీచర్లు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. కాగా నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ల్యాప్ టాప్లు, హెడ్ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్పై విద్యార్థులకు ఎడ్టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును. ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్యా వంటి ఎడ్యుకేషన్ యాప్లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా గాడ్జెట్స్ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తోంది. హెచ్పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్టాప్పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్టాప్ కొనుగోళ్లపై అడిషనల్ కూపన్లను అందించనుంది. -
ఆపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సోమవారం ఆపిల్ డేస్ సేల్ను ప్రకటించింది. ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. కొనుగోలుదారులకు ఆపిల్ డేస్ సేల్ జూలై 17 శనివారం వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఇతర ఆపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. ఆపిల్ డేస్ సేల్లో ఐఫోన్ 12 బేసిక్ ఫోన్ను రూ. 9,000 తగ్గింపుతో రూ .70,900 వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై సుమారు రూ. 6,000 అదనపు తగ్గింపును పొందవచ్చును. ఆపిల్ ఐప్యాడ్ మినీ, మాక్బుక్ ప్రో, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను కూడా తీసుకురాబోతోంది. ఆపిల్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ ఎక్స్ మాక్స్ నుంచి ఐఫోన్ 6 ఎస్ వరకు ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చునని అమెజాన్ పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ ఇతర ఆపిల్ మోడళ్లకు ఆన్లైన్లో తగ్గింపు ధరలకు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. -
అమెజాన్ కస్టమర్లకు గుడ్న్యూస్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు తీపికబురును అందించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించింది. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో అమెజాన్ ప్రైమ్ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రైమ్ డే సేల్లో బ్లాక్బస్లర్ డీల్స్తో పాటు, భారీ డిస్కౌంట్లను, సూపర్ సేవింగ్ డీల్స్ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుంగా సుమారు 300కి పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కాగా జూలై 8 నుంచి జూలై 24 వరకు అమ్మకందారులతో అమెజాన్ ఒప్పందాలను కుదుర్చుకోనుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, వంటివి లాంచ్ చేయడమే కాకుండా వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లక్షలాది స్థానిక వ్యాపారులకు లాక్డౌన్ నుంచి ఉపశమనం కల్గుతుందని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. #PrimeDay is here! 🤩 Save the dates 🗓 2️⃣6️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ – 2️⃣7️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ Celebrating 5 years of Prime in India, #DiscoverJoy with two days of savings, great deals, blockbuster entertainment, and much more. 🛍📽🎧 Read more 👉🏼 https://t.co/F4XfMbhcyT pic.twitter.com/UOyH4AU3DE — Amazon India News (@AmazonNews_IN) July 8, 2021 -
అమెజాన్ మెగా హోమ్ మాన్సూన్ సేల్: 70 శాతం వరకు తగ్గింపు!
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్సూన్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్ను అందిస్తోంది. అమెజాన్ శాంసంగ్, ఎల్జీ, వర్ల్పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్ను ఇవ్వనుంది. ఎల్జీ, శామ్సంగ్, వర్ల్పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది. -
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. అమెజాన్ తన కస్టమర్లకు ఐఫోన్ 12 బేసిక్ మోడల్(64జీబీ) రూ .70,900 కు అందిస్తోంది. ఐఫోన్ 12 బేసిక్ అసలు ధర రూ. 79,900. 128 జీబీ ఐఫోన్ 12 మోడల్ పై సుమారు రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాగా 256 జీబీ వేరియంట్పై ఏలాంటి ఆఫర్ను అందించడంలేదు. ఐఫోన్ 12 మినీ వేరియంట్ పై సుమారు రూ. 6000 వరకు డిస్కౌంట్ వస్తోంది. అంతేకాకుండా అమెజాన్ పే, లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే రూ. 400 క్యాష్బ్యాక్ లభించనుంది. చదవండి: ఈ ఏడాది చివరలో ఐఫోన్ 13..! -
అమెజాన్ స్మాల్ బిజినెస్ డేస్.. డేట్ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా జూలై 2–4 తేదీల్లో స్మాల్ బిజినెస్ డేస్ను నిర్వహిస్తోంది. కోవిడ్–19 కారణంగా వ్యాపారాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో.. వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ సేల్ను చేపడుతున్నట్టు వెల్లడించింది. జూలై 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై.. జూలై 4వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు స్మాల్ బిజినెస్ డేస్ కొనసాగుతాయని తెలిపింది. లక్షలాది తయారీదారులు, చిన్న బ్రాండ్స్ యజమానులు, 1,000కిపైగా స్టార్టప్స్, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షలపైచిలుకు చేతివృత్తులవారు, చేనేతకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఇందులో పాలుపంచుకుంటారని కంపెనీ వివరించింది. చదవండి: డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్గేట్స్ మాత్రం కాదు.. -
Deal Of The Day: న్యూ ఆపిల్ ఐఫోన్ 12 మినీపై డిస్కౌంట్
హైదరాబాద్: న్యూ ఐఫోన్ 12 మినీపై మెగా డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. మార్కెట్లో ఈ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 69,900లు ఉండగా డీల్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ ఫోన్పై రూ. 7,000 డిస్కౌంట్ వస్తోంది. దీంతో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా మరో రూ. 15,000 వరకు తగ్గింపును పొందవచ్చు. స్మాల్డిస్ప్లే ప్రస్తుత ట్రెండ్కి భిన్నంగా ఈ మొబైల్ డిస్ ప్లే సైజు చిన్నగా డిజైన్ చేసింది. జేబులో ఇమిడిపోయే సైజులో 5.4 అంగులాల డిస్ప్లేతో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. చిన్న సైజు మొబైల్ ఫోన్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మెజారిటీ ఫోన్లు 6 అంగులాల డిస్ప్లే తోనే వస్తున్నాయి. ఫీచర్స్ 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ ప్రైమరీ కెమెరా, వైడ్ కెమెరాలతో పాటు 12 మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా విత్ నైట్ మోడ్లో లభిస్తోంది. ఈ మొబైల్తో 4కే డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. న్యూ ఆప్ లైబ్రరీ, కొత్తం రకం హోం స్క్రీన్ విడ్జెట్స్ తదితర ఆప్షన్లు ఉన్నాయి. చదవండి:ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం -
Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ ద్వారా ఆఫర్లను ప్రకటించింది. జూన్ 12వరకు ఆయా ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రియల్మి, శాంసంగ్ , వివో, షియోమి స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు ఆఫర్లతో పాటు డిస్కౌంట్లను ప్రకటించింది అమెజాన్. ఉచిత ఈఎంఐ సౌకర్యంతో పాటు డిస్కౌంట్లను, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,000 తగ్గింపు ఉంది. రియల్ మి ఎక్స్ 7ను కొనుగోలు చేసిన కష్టమర్లకు రూ.750 డిస్కౌంట్ తో పాటు అదనంగా రూ.1,000 అమెజాన్ కూపన్ అందిస్తుంది. రియల్ మీ నార్జో 30ఏ పై రూ. 8,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఇ 5జి శాంసంగ్ ను అమెజాన్ కూపన్ ద్వారా రూ. 6,000 డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకు మరో 10 శాతం తగ్గింపుతో ఫోన్ లభిస్తుంది. గెలాక్సీ ఎస్ 21 + 5జీని జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ పై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రూ.12,999 శాంసంగ్ గెలాక్సీ ఎ 12 ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లావాదేవీలపై ₹ 750 డిస్కౌంట్ తో లభిస్తోంది. దీంతో పాటు కొన్ని షియోమి ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. రూ. 10,990గల రెడ్మి నోట్ 9 రూ.500 అమెజాన్ కూపన్తో పాటు రూ.750 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. రెడ్ మి 10 ఐ 5జి ఫోన్ పై రూ. 2,000 డిస్కౌంట్, రూ.13,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. రెడ్మి 9 హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డుపై రూ.750 డిస్కౌంట్తో లభిస్తుంది. చదవండి : Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! ఒప్పో ఎఫ్ 17 పై రూ. 1,750 డిస్కౌంట్తో పాటు కూపన్పై అదనంగా రూ. 1,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. రూ.25,990విలువైన ఒప్పో ఎఫ్ 19 ప్రో + 5 జిపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డులపై రూ. 3,000 తగ్గింపుతో లభిస్తుంది. ఒప్పో ఏ74 5జీపై రూ.2వేల డిస్కౌంట్ లభించనుంది. -
అమెజాన్ వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా
నమోదిత వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా ఉచితంగా కల్పిస్తున్నట్టు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50,000 వరకు కవరేజ్ ఉంటుందని వెల్లడించింది. బీమా సంస్థ ఆకో జనరల్ ఇన్సూరెన్స్తో అమెజాన్ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కాల పరిమితి ఒక ఏడాది ఉంటుంది. 2020 జనవరి 1 నుంచి 2021 మే 1 మధ్య అమెజాన్.ఇన్ పోర్టల్లో నమోదైన వర్తకులు అర్హులు. వర్తకులు తమ పేర్లను 30 రోజుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి యూనిక్ హెల్త్ ఐడెంటిఫికేషన్ సంఖ్యను బీమా సంస్థ కేటాయిస్తుంది. క్లెయిమ్, రీఇంబర్స్మెంట్స్ కోసం ఈ నంబరును వినియోగించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకున్నా బీమా వర్తిస్తుంది. మహమ్మారి వేళ వర్తకుల ఆరోగ్య బీమాకు అయ్యే ఖర్చును తామే భరిస్తున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది సైతం అమెజాన్ తన వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా కల్పించింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
జేఈఈ ప్రిపేర్ విద్యార్థుల కోసం అమెజాన్ ఫ్రీ కోచింగ్
మీరు జేఈఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఐఐటీ జేఈఈ కోర్సుల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ అందిస్తుంది. అమెజాన్ ఇండియా జనవరిలో అమెజాన్ అకాడమీ పేరుతో ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. నిపుణులైన జేఈఈ ఉపాధ్యాయులచే లైవ్ సెషన్స్ కూడా అందిస్తుంది. ఈ పరీక్షల కోసం మీరు అమెజాన్ అకాడమీ (https://academy.amazon.in/) వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్లో అమెజాన్ అకాడమీ పేరుతో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. కొన్ని నెలల పాటు మొత్తం కంటెంట్ ఉచితంగా అందించనున్నట్లు అమెజాన్ అకాడమీ పేర్కొంది. కేవలం విద్యార్థులు తమ ఇంటి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ ఉంటే చాలు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అమెజాన్ అకాడమీ ప్లాట్ఫామ్ లో జేఈఈ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అవసరమయ్యే మొత్తం కంటెంట్ ఉంటుంది. అనుభవం గల టీచర్లు చెప్పే లైవ్ ఆన్లైన్ క్లాసులకు హాజరు కావొచ్చు. మాక్ టెస్టుల్లో పాల్గొనొచ్చు. నిపుణుల సారథ్యంలో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు. రియల్ టైమ్లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అమెజాన్ అకాడమీ నిర్వహించే జేఈఈ మాక్ టెస్టులకు హాజరై ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసుకోవచ్చు. భారతదేశంలో జేఈఈ రాయాలనుకుంటున్నవారితో పోటీపడటంతో పాటు తమ స్కోర్స్ కంపేర్ చేసుకోవచ్చు. చదవండి: సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక -
రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గడువు మార్చి 31, 2021 నాటికి ముగిసిపోయింది. తాజాగా కొనుగోలు ఒప్పందం గడువు సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత ఏడాది కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వాటాలున్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ-కామర్స్ దిగ్గజం దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. 2020 ఆగస్టు 29న ప్రకటించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం, సిసిఐ, సెబీ, బోర్సెస్ వంటి రెగ్యులేటర్ల నుంచి ఇప్పటికే క్లియరెన్స్ పొందింది. ఈ ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడటంతో రిలయన్స్ గడువును పొడిగించాల్సి వచ్చింది. చదవండి: మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు -
మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ
ముంబై: గ్రోసరీ వ్యాపారంలో మరింతగా విస్తరించే ప్రణాళికలతో అమెజాన్ ఇండియా ఉంది. నాన్ మెట్రో, ఇతర పట్టణాల్లోని మొదటి సారి కస్టమర్లను పెద్ద ఎత్తున సొంతం చేసుకోవాలనుకుంటోంది. గడిచిన ఏడాది కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ఇతర పట్టణాల నుంచి అమెజాన్లో షాపింగ్ చేసిన కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ ప్లాట్ఫామ్పై కొత్త కస్టమర్లలో 85 శాతం.. అలాగే, ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాల నుంచే ఉన్నాయి. అమెజాన్ గ్రోసరీ వ్యాపారమైన అమెజాన్ ప్యాంట్రీలనూ కొనుగోలు చేసే మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగింది. అమెజాన్ ప్యాంట్రీలో కొనుగోలుదారులు రెట్టింపుయ్యారు. కరోనా తర్వాత అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ ఫ్రెష్పై ఆర్డర్లలో 60 శాతానికి పైగా నూతన కస్టమర్ల నుంచే, అది కూడా నాన్ మెట్రోల నుంచే ఉంటున్నాయి. వేగంగా డెలివరీ.. ఆర్డర్ చేసిన వెంటనే వేగంగా గ్రోసరీ డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్.. 10 పట్టణాల్లో ప్యాంట్రీ (డ్రై గ్రోసరీ/కిరాణా సరుకులు), ఫ్రెష్ (కిరాణా, పండ్లు, కూరగాయలు) సేవలను ఏకీకృతం చేసింది. మరింత వేగంగా డెలివరీ చేసేందుకు సమగ్ర ఆన్లైన్ స్టోర్ను ఏర్పాటు చేసింది. ఆర్డర్లను ఇక్కడి నుంచే వేగంగా డెలివరీ చేయనుంది. ఇక మిగిలిన 290 పట్టణాల్లో ఫ్రెష్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్యాంట్రీ ద్వారా ఆయా పట్టణాల్లో గ్రోసరీ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ‘‘గ్రోసరీ విభాగం రెండు రెట్లు పెరిగి అమెజాన్ డాట్ ఇన్లో నూతన కస్టమర్లకు ఒక గేట్వేగా మారింది. ఆన్లైన్ గ్రోసరీ విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఇది ఇప్పటికీ చాలా చిన్న మార్కెట్గానే ఉంది. భారత్లో ప్రజల గ్రోసరీ కొనుగోళ్ల తీరు పూర్తిగా పరిణామం చెందనుంది. రానున్న కొన్నేళ్లలో ఈ విభాగం ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. కొత్తగా వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుంచే ఉంటారని అంచనా వేస్తున్నాము. డ్రై గ్రోసరీ పరిధిని విస్తరించనున్నాము. టాప్-50 పట్టణాల్లో ఫ్రెష్, డ్రై గ్రోసరీలో పూర్తి శ్రేణిలో ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. టాటాలు సైతం.. టాటా గ్రూపు సైతం ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారంపై భారీ అంచనాలతోనే ఉంది. టాటా డిజిటల్ లిమిటెడ్ ఇప్పటికే బిగ్ బాస్కెట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, కాంపిటిషన్ కమిషన్ ఆమోదం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. రిలయన్స్ జియో సైతం జియోమార్ట్ పేరుతో పట్టణాల్లో గ్రోసరీ డెలివరీ చేస్తుండగా.. ఫ్లిప్కార్ట్ కూడా విస్తరణ ప్రణాళికలతో ఉంది. ఈ ఏడాది ఈ విభాగంలో మంచి వృద్ధి నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాయి. గతేడాది లాక్డౌన్లు విధించడం ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ విస్తరణకు మద్దతునిచ్చిన అంశంగా చెప్పుకోవాలి. 2019లో 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారం 2020లో 3.3 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు రెడ్సీర్ సంస్థ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2025 నాటికి ఈ మార్కెట్ 24 బిలియన్ డాలర్లకు (రూ.1.75లక్షల కోట్లు) విస్తరిస్తుందని అంచనా వేస్తోంది. స్థానిక కిరాణా వర్తకుల భాగస్వామ్యంతో కూడిన అమెజాన్ ‘లోకల్ షాప్స్’ ఈ ఏడాది మార్చి నాటికి 450 పట్టణాల్లో 50,000 ఆఫ్లైన్ రిటైల్ దుకాణాలకు విస్తరించగా.. ఈ ఏడాది చివరికి రెట్టింపు సంఖ్యకు చేరుకుంటామని అమెజాన్ ఇండియా అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ ఈ కామర్స్ వేదికగా స్థానిక కిరాణా వర్తకులు రిజిస్టర్ చేసుకుని విక్రయాలు చేపట్టవచ్చు. చదవండి: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే! -
మహిళా వర్తకుల ఉత్పత్తులకు ప్రాధాన్యం
ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా దేశంలోని మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మహిళా సాధికారిత కోసం పనిచేసే సంస్థ యూఎన్ ఉమెన్తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే 450 మందికి పైగా మహిళ వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన సుమారు 80 వేలకు పైగా ప్రత్యేక స్టోర్ ఫ్రంట్ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ మీద రూ.25లను దేశంలోని నిరుపేద బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎన్జీఓ ‘నన్హీ కలీ’కు తమ వంతు బాధ్యతగా విరాళం కింద అందజేస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారితో కలిగిన ఆర్ధిక విఘాతంతో మహిళల ఆదిపత్య రంగాలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని, మహిళలు జీవనోపాధి కోల్పోయే దశకు చేరిందని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. మహిళల్లో వ్యవస్థాపకత మెరుగైన ఆర్ధిక ఫలితాలను చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ అగర్వాల్ చెప్పారు. -
అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి
అమెజాన్ ఇండియా స్థానిక కార్యకలాపాలను నిషేధించాలని భారతీయ చిల్లర వ్యాపారుల బృందం బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాల విషయంలో మోసాలు, అన్యాయాలకు పాల్పడినట్లు రాయిటర్స్ నివేదించింది. కఠినమైన విదేశీ పెట్టుబడి నిబంధనలను తప్పించుకునేందుకు భారత చట్టాలను ఉల్లంఘించినట్లు సీఐఐటి తెలిపింది. భారతదేశంలో 80 మిలియన్ల రిటైల్ దుకాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) ఒక ప్రకటనలో రాయిటర్స్ కథనంలోని "దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడి" అయ్యాయి కాబట్టి భారతదేశంలో అమెజాన్ కార్యకలాపాలను వెంటనే నిషేధించడానికి ఈ సమాచారం సరిపోతుంది అని పేర్కొంది. "కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ అన్యాయమైన, అనైతికంగా వాణిజ్యాన్ని నిర్వహించడానికి భారతదేశం యొక్క ఎఫ్ డిఐ[ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్] చట్టాలను ఉల్లఘించినట్లు సిఐఐటి తెలిపింది. అమెజాన్, ప్లిప్కార్ట్ వంటి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) కొన్ని సంవత్సరాలుగా వాణిజ్యశాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఈడీకి చేరవేసింది డీపీఐఐటీ. ఈ క్రమంలోనే అమెజాన్పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. భారతీయ చిల్లర వ్యాపారుల బృందం దేశ బహిష్కరణ ప్రకటనలపై అమెజాన్ స్పందించలేదు. కానీ, సిఏఐటి అమెజాన్ నిషేధానికి పిలుపునిచ్చిన కొద్దికాలానికే రాయిటర్స్ నివేదికపై అమెజాన్ స్పందించింది. "ఇది ఆధారాలు లేని, అసంపూర్ణమైన, అసత్య ప్రచారం అని విమర్శించింది. అమెజాన్ భారతీయ చట్టాలకు లోబడి ఉంది అని" పేర్కొంది. "గత కొన్ని సంవత్సరాలుగా (ఎ) నిబంధనలలో అనేక మార్పులు జరిగాయి. అమెజాన్ ప్రతి సందర్భంలోనూ సమ్మతిని నిర్ధారించడానికి వేగంగా చర్యలు తీసుకుంది. అందువల్ల ఈ కథనం పాత సమాచారం ఉన్నట్లు అనిపిస్తుంది" అని తన అమెజాన్ ఇండియా న్యూస్ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. The story is unsubstantiated, incomplete, factually incorrect. Amazon remains compliant with Indian laws. We haven't seen the documents & Reuters hasn't shared provenance to confirm veracity: the details are likely supplied with intent to create sensation & discredit Amazon. 1/3 https://t.co/lblDPxYVCH — Amazon India News (@AmazonNews_IN) February 17, 2021 అమెజాన్ సంస్థకు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్గా ఉంది. బయటకు లక్షలాది మంది చిరు వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ కార్పొరేట్, తన వాటా దారులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిరు వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది. చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం! -
అమెజాన్ ఇండియా భారీ మోసం
భారత చట్టాలను ఉల్లఘించడానికి అమెజాన్ వేసిన ఓ కుట్రకు సంబందించిన కథనాన్ని రాయిటర్స్ సంస్థ ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. 2019 ప్రారంభంలో అమెజాన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే కార్నె ఒక ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతున్నారు. జే కార్నె ఇంతక ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద ప్రెస్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో భారత రాయబారితో జే కార్నె మాట్లాడాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కొత్తగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను ప్రకటించింది. ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం తీసుకొచ్చిన నిబంధనల వల్ల అమెజాన్ వ్యాపారానికి భారీ నష్ట్టం వాటిల్లుతుంది. అయితే ఈ సమావేశానికి ముందు అమెజాన్ ఉద్యోగులు కార్నీ కోసం ఒక డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేశారు. ఈ డ్రాఫ్ట్ నోట్ లో జే కార్నె ఏమి చెప్పాలో?, ఏమి చెప్పకూడదు అని అందులో ప్రస్తావించారు. అమెజాన్ భారత దేశంలో 5.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, 4 లక్షల మంది భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాలు సాగించేందుకు తమ ఆన్ లైన్ ప్లాట్ ఫాం సహాయం అందిస్తుందనే పాయింట్ హైలైట్ చేయాలి అని డ్రాఫ్ట్ నోట్ లో ఉంది. అయితే కంపెనీ వెబ్సైట్లో విక్రయించే అన్ని వస్తువుల విలువలో మూడింట ఒక వంతు మంది 33 మంది అమెజాన్ అమ్మకందారులని వెల్లడించవద్దని ఆయన ఆ నోట్లో పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి బహిర్గతం చేయకూడని అందులో పేర్కొంది. మూడింట రెండు వంతులు అమెజాన్ వాటాదారులే ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అమెజాన్ పరోక్ష ఈక్విటీ వాటాను కలిగి ఉన్న మరో పెద్ద ఇద్దరు అమ్మకందారులు 2019 ప్రారంభంలో అమెజాన్ ప్లాట్ఫాం అమ్మకాల వచ్చిన ఆదాయంలో 35 శాతం వాటాను కలిగి ఉన్నారు. మొదటి 33 మంది వాటా 33 శాతం, అమెజాన్ సంస్థ పరోక్షంగా పెట్టుబడులు కలిగిన ఈ ఇద్దరు వాటా 38 శాతం. ఇలా మొత్తం వాటాలో మూడింట రెండు వంతులు అమెజాన్ వాటాదారులే కలిగి ఉన్నారు. మొత్తం అమెజాన్ షాపింగ్ లో 4 లక్షల మంది వ్యాపారులు చేసేది మూడింట ఒక వంతు అయితే, ఈ 35(33+2) మంది చేసేది మూడింట రెండు వంతులు. అయితే, ఈ విషయాన్ని కార్నే అంబాసిడర్కు చెప్పారో లేదో కూడా తెలీదు. 2019 ఏప్రిల్లో ఎలాంటి మీటింగ్ జరగలేదు అని సమాచారం. -
బడ్జెట్ లో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్
న్యూఢిల్లీ: రెడ్మీ బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్మార్ట్ బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్ సెప్టెంబర్లో 5న రూ.1,599($22) ధరతో భారతదేశంలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు, ఈ ఫిట్నెస్ ట్రాకర్ను రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా మీకు రూ.999($ 13.69)కి లభిస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫాం అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్ను నిర్వహిస్తుంది. షియోమీ దాదాపు అన్ని దేశాలలో ఎంఐ, రెడ్మీ బ్రాండెడ్ ఉత్పత్తుల మీద డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ లో 1.08-అంగుళాల టిఎఫ్టి ఎల్సిడి కలర్ ప్యానెల్, టచ్ ఇన్పుట్, 24 గంటల హార్ట్ బీట్ మానిటరింగ్, 5 స్పోర్ట్స్ మోడ్లు, బ్లూటూత్ 5.0 ఎల్ఇ, యాప్ నోటిఫికేషన్లు, 5 ఎటిఎం వాటర్ రెసిస్టెంట్, 14 రోజుల బ్యాటరీ లైఫ్ , యుఎస్బి ఛార్జింగ్ వంటి మరిన్ని ఆప్షన్స్ కలిగి ఉంది.(చదవండి: ఫేస్బుక్కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్) -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్సిరీస్లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్సిరీస్లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు. -
అమెజాన్బేసిక్స్ నుంచి తొలిసారి స్మార్ట్ టీవీలు
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్బేసిక్స్ తొలిసారి దేశీయంగా స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 50-55 అంగుళాల పరిమాణంలో వీటిని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. రూ. 29,999 నుంచి ధరలు ప్రారంభంకానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇవి ఫైర్టీవీ ఎడిషన్ టీవీలుకాగా.. 4కే హెచ్డీఆర్ లెడ్ డిస్ప్లేతో విడుదల చేసినట్లు తెలియజేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫార్మాట్లలో హెచ్డీఆర్, ఆడియో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఇవి అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 4కే స్మార్ట్ టీవీ విభాగంలో ప్రాథమిక(ఎంట్రీ లెవెల్) విభాగంలోని షియోమీ, టీసీఎల్, వీయూ తదితర కంపెనీలతో ఇవి పోటీ పడనున్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల) ఇతర ఫీచర్స్ అమెజాన్బేసిక్స్ 50- 55 అంగుళాల పరిమాణంలో రెండు మోడళ్లను విడుదల చేసింది. ఇవి అల్ట్రాహెచ్డీ(3840+2160 పిక్సెల్) లెడ్ తెరలను కలిగి ఉంటాయి. డాల్బీ విజన్ ఫార్మాట్ వరకూ హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుంది. 20 డబ్ల్యూ రేటెడ్ స్పీకర్స్ ద్వారా డాల్బీ ఆట్మోస్ను కల్పించింది. క్వాడ్కోర్ ఆమ్లాజిక్ ప్రాసెసర్ కలిగిన వీటికి రెండు యూఎస్బీ, మూడు హెచ్డీఎంఐ పోర్టులను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. అమెజాన్ ఎకోసిస్టమ్కు సంబంధం లేకుండా సొంత సెట్టాప్ బాక్సును సైతం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఫైర్ టీవీ స్టిక్ తరహాలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, యూట్యూబ్ తదితర సర్వీసులను యాప్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా మూవీస్, మ్యూజిక్ తదితరాలను సెట్ చేసుకోవచ్చు. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్) -
అమెజాన్ కోటీశ్వరులు 4,152 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది 1.5 లక్షల మంది వర్తకులు తమ వేదికపైకి కొత్తగా వచ్చారని ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఆదివారం వెల్లడించింది. కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇక్కడి విక్రేతలు విజయవంతం అయ్యారని తెలిపింది. అమెజాన్ ఇండియా ఎస్ఎంబీ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 70,000 పైచిలుకు వర్తకులు మొత్తం సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఉత్పత్తులను 15 అంతర్జాతీయ అమెజాన్ వెబ్సైట్ల ద్వారా ఎగుమతి చేశారు. ఉత్తర అమెరికా, ఈయూ, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా నుంచి భారత ఉత్పత్తులకు డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. 2020లో రూ.1 కోటి, ఆపైన విక్రయాలు నమోదు చేసినవారు 4,152 మంది ఉన్నారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది కరోడ్పతి సెల్లర్స్ సంఖ్య 29% పెరిగింది. వేదికపై 20 కోట్లకుపైగా.. సహేలీ కార్యక్రమం ద్వారా మహిళా వర్తకుల వ్యాపారం 15 రెట్లు అధికమైంది. చేనేత, చేతివృత్తులవారు 2.8 రెట్లు తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. 55,000 స్థానిక స్టోర్స్ అమెజాన్తో చేతులు కలిపాయి. 10 లక్షల పైచిలుకు చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలతో కలిసి కంపెనీ పనిచేస్తోంది. వీరిలో విక్రేతలు, డెలివరీ, లాజిస్టిక్స్ భాగస్వాములు, కిరాణా వర్తకులు, డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్స్, రచయితలు ఉన్నారు. ఆన్లైన్ సెల్లర్స్ 7 లక్షల పైమాటే. బీటూబీ మార్కెట్ప్లేస్లో 3.7 లక్షల మంది సెల్లర్స్ ఉన్నారు. వీరు జీఎస్టీ ఆధారిత 20 కోట్లకుపైగా ప్రొడక్ట్స్ను విక్రయిస్తున్నారు. రచయితలకూ ఆదాయం.. నవంబర్ 30 నాటికి కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ (కేడీపీ) వేదిక ద్వారా రచయితలు రూ.45 కోట్లకుపైగా ఆర్జించారు. కేడీపీ ఏటా రెండు రెట్లు పెరుగుతోంది. వందలాది మంది రచయితలు ఒక్కొక్కరు రూ.1 లక్షకుపైగా రాయల్టీ పొందారు. అలెక్సా కోసం భారత్కు చెందిన ఒక లక్ష మంది డెవలపర్లు పనిచేస్తున్నారు. వీరు అలెక్సా స్కిల్స్ కిట్ ద్వారా 30,000 పైగా నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. వేలాది స్మార్ట్ హోం ఉపకరణాలు అలెక్సాతో అనుసంధానించవచ్చు. అలెక్సాతో కూడిన 100కు పైచిలుకు స్మార్ట్ స్పీకర్స్, ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇదీ అమెజాన్ లక్ష్యం.. సుమారు రూ.7,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2025 నాటికి ఒక కోటి చిన్న, మధ్యతరహా వ్యాపారులను ఆన్లైన్ వేదికపైకి తీసుకురావడం, రూ.74,000 కోట్లకు ఆన్లైన్ ఎగుమతులను చేర్చడం, అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. -
30 రోజుల్లో రూ. 61,000 కోట్ల అమ్మకాలు
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈకామర్స్ కంపెనీలకు మాత్రం జోష్నిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్గా పేర్కొనే ఈ కాలంలో ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ విడుదల చేసిన నివేదిక వివరాలివి. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్సీర్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయ్... 88 శాతం వృద్ధి గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది. రూ. కోటికిపైగా సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్కోడ్స్ నుంచి సెల్లర్స్కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది. కారణాలివీ భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలోనూ ఈకామర్స్ కంపెనీలు గరిష్ట స్థాయిలో వస్తువులను అందుబాటులో ఉంచడం అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు రెడ్సీర్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బ్రాండ్లు, ఫైనాన్సింగ్ ఒప్పందాలు దీనికి జత కలసినట్లు తెలియజేసింది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ స్థాయి పట్టణాలకు పెరిగిన ఉద్యోగుల వలస, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు వంటి అంశాలు ఆన్లైన్ అమ్మకాలకు దోహదపడినట్లు అభిప్రాయపడింది. కొనుగోలుదారులు అటు ఖరీదైన లేదా ఇటు కారుచౌక వస్తువులకంటే అందుబాటు ధరల ఐటమ్స్కే మొగ్గు చూపినట్లు వివరించింది. -
స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. పెరిగిన విక్రేతలు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు. కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. -
అమెజాన్తో జట్టు కట్టిన యమహా
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్తో ఒప్పందం చేసుకుంది. దీంతో కస్టమర్లు యమహా ఇండియా టీషర్ట్స్, జాకెట్స్, స్టిక్కర్స్, కీచెయిన్స్ వంటి ఇతరత్రా యాక్ససరీలను అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఒక మోటార్ కంపెనీ అపెరల్స్, యాక్ససరీలను ఆన్లైన్లో విక్రయించే ఒప్పందం చేసుకోవటం దేశంలోనే తొలిసారని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమీ శిటారా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే యమహా కంపెనీ ఆన్లైన్లో వాహన విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఉపాధికి పండుగ సీజన్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్నర్స్, హౌస్కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. డెల్హివెరీలో ఇలా... సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు. మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్సీర్ ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
అమెజాన్లో 10 లక్షల ఉద్యోగాలు
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండగ వేళ దేశంలో మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకుగాను వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లక్షమంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నట్లు ప్రకటించింది. కాగా వినియోగదారుల డిమాండ్ మేరకు డెలీవరీ సిబ్బందిని నియమించుకున్నామని అమెజాన్ తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియమకాలు మాత్రమే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ విభాగాలలోకూడా అనేక మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది. అయితే దేశంలో టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దేశ కీలక రంగాలలో అనేక పెట్టుబడులు పెట్టనున్నామని, భారీ పెట్టుబడుల నేపథ్యంలో 2025 సంవత్సరం వరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే మరో నివేదిక రెడ్సీర్ ప్రకారం పండగ సీజన్లో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరుగుతామని, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహ రుణాలు పండగ సీజన్లో భారీ డిమాండ్కు అవకాశం ఉందని అభిప్రాయపడింది. (చదవండి: కరోనా : అమెజాన్లో వారికి భారీ ఊరట) -
అమెజాన్లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్ని భారత్లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్కు ఇచ్చే డ్రగ్ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్ని విచారించనుంది. -
కరోనా : అమెజాన్లో వారికి భారీ ఊరట
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా 100 శాతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మరో 10 వారాలపాటు ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా లక్షలాదిమంది వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలనుంచి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 10 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు కోలుకునేలా సాయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి ప్రణవ్ భాసిన్ వెల్లడించారు. అమెజాన్ అందిస్తున్న కారీగర్ ప్రోగ్రాం ద్వారా 8 లక్షలకు పైగా చేతివృత్తులవారు, నేత కార్మికులు, అమెజాన్ సహేలి ప్రోగ్రాం ద్వారా 2.8 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు 100 శాతం అమ్మకం ఫీజు మినహాయింపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్లలో చేరిన కొత్త అమ్మకందారులకు కూడా ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీరి ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం ద్వారా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, వారికి మూలధన సహాయానికి తోడ్పడుతుందని భాసిన్ తెలిపారు.(అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు) కారీగర్, సహేలి అమ్మకందారుల నుండి స్థానికంగా రూపొందించిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు కస్టమర్ డిమాండ్ను పెంచేందుకు 'స్టాండ్ ఫర్ హ్యాండ్మేడ్' స్టోర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు భాసిన్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఎంపోరియంలు, ఐదు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉందన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం సహా వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు, మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మహిళలకోసం మహిళలు రూపొందించిన ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఆయన ప్రకటించారు. కాగా జూన్ 2020 చివరి వరకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫీజును 50 శాతం మాఫీ చేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అలాగే స్టోరేజ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్టు అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
20 వేల ఉద్యోగాలు: హైదరాబాద్లో ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆదివారం పేర్కొంది. హైదరాబాద్ సహా పది నగరాల్లో ఈ ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుంది. కస్టమర్ సర్వీస్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి పాస్ అయి ఉండాలని అమెజాన్ ఇండియా డైరెక్టర్(కస్టమర్ సర్వీస్) అక్షయ్ ప్రభు తెలిపారు. (అమెజాన్లో 50 వేల ఉద్యోగాలు) అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలన్నారు. అభ్యర్థుల పనితీరు, కంపెనీ అవసరాల ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన మార్చుతామని తెలిపారు. సెలవు సీజన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో కస్టమర్ల ఆన్లైన్ షాపింగ్ వినియోగం మరింత పెరుగుతందని ఆయన అంచనా వేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు నేరుగా బయట అడుగు పెట్టడానికే బయటపడుతున్నారు. దీంతో ప్రతిదానికి ఆన్లైన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 50 వేల సిబ్బందిని నియమించుకుంటామని అమెజాన్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. (లాక్డౌన్ సడలింపులు : అమెజాన్ గుడ్ న్యూస్ -
నిజాయితీయే మా విజయ రహస్యం: అమెజాన్
ముంబై: కరోనా దెబ్బకు ఈ కామర్స్ కంపెనీలు భారీగా కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు ఈకామర్స్ కంపెనీలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. వినియోగిదారులను ఆకర్శించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా ఊపయోగిస్తామని అమెజాన్ ఇండియా పేర్కొంది. వినియోగదారులను ఆన్లైన్ సేవలకు మొగ్గు చూపే విధంగా ఈకామర్స్ కంపెనీలు కృషి చేస్తున్నాయి. నిజాయితిగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలకు ఎప్పటికి భవిష్యత్తు ఉంటుందని అమెజాన్ కంపెనీ ప్రతినిథులు తెలిపారు. నిజాయితియే తమ విజయ రహస్యమని అమెజాన్ కంపెనీ ప్రకటించింది. కరోనా తగ్గుదల తర్వాత వినియోగదారులు రక్షణాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకు తీవ్రంగా కృషి చేయాలని అమెజాన్ ఇండియా ముఖ్య ప్రతినిథి అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. రానున్న కాలంలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చిన్న సంస్థల కోసం అమెజాన్ నిధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్పరమైన లాక్డౌన్తో దెబ్బతిన్న చిన్న స్థాయి లాజిస్టిక్స్ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. సరుకు డెలివరీ సేవలందించే చిన్న, మధ్య తరహా వ్యాపార భాగస్వామ్య సంస్థలకు, దేశీయంగా ఎంపిక చేసిన రవాణా భాగస్వామ్య సంస్థలకు దీని ద్వారా సహాయం అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్లో సిబ్బంది చెల్లింపులు, కీలకమైన ఇన్ఫ్రా వ్యయాలు లాక్డౌన్ ఎత్తివేత తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్తి స్థాయిలో విస్తరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక తోడ్పాటును వన్టైమ్ ప్రాతిపదికన సమకూర్చనున్నట్లు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ ఆపరేషన్స్ విభాగం) అఖిల్ సక్సేనా తెలిపారు. కోవిడ్–19 వ్యాధి బారిన పడిన వారికి తోడ్పాటునిచ్చేందుకు కంపెనీ ఇటీవలే 25 మిలియన్ డాలర్లతో అమెజాన్ రిలీఫ్ ఫండ్ (ఏఆర్ఎఫ్) ప్రారంభించింది. దీన్ని ఎంపిక చేసిన డెలివరీ భాగస్వాములకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. -
అమెజాన్ డెలివరీ ఏజెంట్పై కేసు
బంజారాహిల్స్: సెల్ఫోన్ను డెలివరీ ఇవ్వకుండా మోసగించిన అమేజాన్ డెలివరీ ఏజెంట్పై బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన శ్రీకాంత్ గత నెల 28న అమేజాన్లో వివో యూ–10 ఫోన్ బుక్ చేశాడు. ఇందుకోసం రూ.9990 అతడి అకౌంట్లో నుంచి కట్ అయ్యాయి. గత నెల 30న ఫోన్ డెలివరీ చేసినట్లు అతడికి సమాచారం అందింది. అయితే 30న డెలివరీ బాయ్ రాకపోగా కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని ఐదు రోజులు ఆగినా ఫలితం లేకపోవడంతో అమేజాన్ కస్టమర్ కేర్ సెంటర్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన అమేజాన్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పి చేతులెత్తేశారు. దీంతో తనకు మొబైల్ డెలివరీ చేయకుండానే డబ్బులు డ్రా చేసుకొని మోసగించిన ఘటనలో డెలివరీ ఏజెంట్, సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్న నగరాల నుంచీ ఆన్‘లైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ–కామర్స్ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్ ఫెస్టివ్ యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. పారదర్శక ధర కారణంగానే భారత్లో ఈ–కామర్స్ విజయవంతం అయిందన్నారు. దేశ జనాభాలో 10 శాతం మంది ఈ–కామర్స్ వేదికగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక ఉత్పాదనను విక్రయించేందుకు బెస్ట్ ప్రైస్తో విక్రేతలు పోటీపడతారని, ఇది కస్టమర్కు కలిసి వచ్చే అంశమని వివరించారు. చిన్న నగరాల నుంచే..: కొత్తగా అమెజాన్కు జతకూడుతున్న కస్టమర్లలో 91 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉన్నారని షాలిని వెల్లడించారు. ‘99.6% పిన్కోడ్స్కు చేరుకున్నామంటే ఈ–కామర్స్ పట్ల పెరిగిన అవగాహనే ఉదాహరణ. అమెజాన్ పోర్టల్లో 20 కోట్లకుపైగా ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. రోజూ 2 లక్షల ప్రొడక్టులు జోడిస్తున్నాం. 5 లక్షల మంది సెల్లర్లున్నారు. ఆర్డర్లలో 40% ఒక రోజులోనే డెలివరీ చేస్తున్నాం. ప్రైమ్ కస్టమర్ల సంఖ్య 18 నెలల్లో రెండింతలైంది. కొనుగోలు నిర్ణయంపై కస్టమర్ రేటింగ్స్దే కీలక పాత్ర. నచ్చకపోయినా, నాసిరకంగా ఉన్నా ఉత్పాదనను 30 రోజుల్లో వెనక్కి ఇచ్చే అవకాశం ఉండడం వినియోగదార్లకున్న వెసులుబాటు’ అన్నారు. ఆన్లైన్కు పెద్ద బ్రాండ్లు..: ఆఫ్లైన్లో కార్యకలాపాలు సాగిస్తున్న పెద్ద బ్రాండ్లను ఆన్లైన్కు తీసుకొచ్చామని అమెజాన్ ఫ్యాషన్ ఇండియా బిజినెస్ హెడ్ అరుణ్ సిర్దేశ్ముఖ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బ్రాండ్లు కొన్ని ఉత్పాదనలను తొలిసారిగా అమెజాన్లో ప్రవేశపెట్టాయన్నారు. ఇవి రెండు రోజుల్లోనే తమ ఉత్పత్తులను డెలివరీ ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఏడాదిలో కొత్తగా 1.20 లక్షల మంది సెల్లర్లు తోడయ్యారని కస్టమర్ ఎక్స్పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిషోర్ తోట పేర్కొన్నారు. కాగా, ఫెస్టివ్ యాత్రలో భాగంగా ట్రక్కులపై నిర్మించిన నమూనా ఇంటిని కంపెనీ ప్రదర్శించింది. అమెజాన్ పోర్టల్లో లభించే ఉత్పత్తులతో ఈ ఇల్లును అందంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ సేల్ అదుర్స్.. : సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫస్ట్ సేల్ గ్రాండ్ సక్సెస్ అని అమెజాన్ ప్రకటించింది. రిసెర్చ్ ఏజెన్సీ నీల్సన్ ప్రకారం.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 మధ్య దేశంలో జరిగిన ఆన్లైన్ సేల్స్లో కస్టమర్లు, కొనుగోళ్ల పరంగా అమెజాన్ అధిక వాటా సొంతం చేసుకుంది. 500లకుపైగా సిటీస్ నుంచి 65,000ల కంటే ఎక్కువ సెల్లర్లకు ఆర్డర్లు లభించాయి. మిలియనీర్, క్రోర్పతి సెల్లర్స్ సంఖ్య 21,000 దాటింది. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 15 రెట్లు, పెద్ద ఉపకరణాలు 8 రెట్ల వృద్ధి నమోదైంది. ఎకో డివైసెస్ 70 రెట్ల వృద్ధి సాధించాయి. -
ఐఫోన్ లవర్స్కు నిరాశ : మూడురోజుల్లోనే..
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ లవర్స్కు షాకింగ్ న్యూస్. ఈ నెలలో లాంచ్ చేసిన యాపిల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నెల 20 నుంచి ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాపిల్ ఐఫోన్ 11 వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్గా నిలిచింది. అమెజాన్ ఇండియా, ప్లిప్కార్ట్లో ఇది ప్రీ ఆర్డర్కు లభించడంలేదు. కేవలం మూడు రోజుల్లో ఐఫోన్11 అవుట్ ఆఫ్ స్టాక్గా నిలవడం విశేషం. అయితే ఐఫోన్ 11 ప్రొ అమెజాన్లో మాత్రమే అందుబాటులోవుండగా, ఫ్లిప్కార్ట్లో ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ (256 జీబీ స్టోరేజ్) వేరియంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు దేశీయంగా ఈ నెల 23నుంచి ప్రీ బుకింగులను ఆరంభించగా, ఈ నెల 27నుంచి విక్రయానికి రానున్నసంగతి తెలిసిందే. -
ప్యాకేజింగ్లో ’ప్లాస్టిక్’ తగ్గించనున్న అమెజాన్
న్యూఢిల్లీ: ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్తో ప్యాకేజింగ్ను 2020 జూన్ నాటికి పూర్తిగా నిలిపివేయాలని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిర్దేశించుకుంది. ప్రస్తుతం తమ గిడ్డంగుల్లో ప్యాకేజింగ్కు ఉపయోగించే ప్లాస్టిక్లో సింగిల్ యూజ్ తరహా ప్లాస్టిక్ వాటా ఏడు శాతం కన్నా తక్కువే ఉంటుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. వ్యర్ధాలను తగ్గించుకుని, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి అమెజాన్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. బబుల్ ర్యాప్స్, ఎయి ర్ పిల్లో మొదలైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్ప త్తుల స్థానంలో ’పేపర్ కుషన్స్’ను వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరుకి అన్ని గిడ్డంగులకు విస్తరించనున్నట్లు సక్సేనా వివరించారు. 2021 మార్చికి 100% రీసైకిల్డ్ ప్లాస్టిక్ వినియోగం దిశగా.. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని 25% తగ్గించుకున్నట్లు ఫ్లిప్కార్ట్ ఇప్పటికే ప్రకటించింది. -
మాజీ సైనికులకు అమెజాన్లో ఉద్యోగాలు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికులకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఉద్యోగాలను కల్పించనుంది. మిలటరీ వెటరన్స్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పేరిట దీన్ని గురువారం ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ఇండియా ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిసెటిల్మెంట్ (డిజెఆర్), ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఎడబ్లు్యపిఒ)లతో కలిసి దేశవ్యాప్తంగా సైనిక కుటుంబాల కోసం దీనిని నిర్వహిస్తున్నామన్నారు -
లాంఛనంగా అమెజాన్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ నెలకొల్పిన అతి పెద్ద క్యాంపస్ భవనాన్నిబుధవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ పాల్గొన్నారు. ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. కార్యాలయాన్ని ప్రారంభించి హోంమంత్రి మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ తెలంగాణలోనే అతిపెద్ద బిల్డింగ్ కావడం విశేషమని, ఇది మనకు గర్వకారణమని అన్నారు. అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. 9.5 ఎకరాల్లో విస్తరించిన అమెజాన్ క్యాంపస్లో సుమారు 15వేల మంది పనిచేయనున్నారని వివరించారు. -
హైదరాబాద్లో అమెజాన్ అతిపెద్ద డెలివరీ సెంటర్
-
కిరాణా సేవల విస్తరణలో అమెజాన్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ ఇన్ భారత్లో తన సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా నిత్యావసరాల సరఫరా సేవల విభాగమైన ‘అమెజాన్ ప్యాంట్రీ’ ఏర్పాట్లను శరవేగంగా పెంచే పనిలోపడింది. వచ్చే ఆరు–ఏడు నెలల్లో ఈ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. గతేడాది నవంబర్ నాటికి 40 నగరాల్లో ప్యాంట్రీ సేవలుండగా.. మరో 70 నగరాల్లో సేవలను విస్తరించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సంస్థ గ్రోసరీ విభాగ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్యాంట్రీ సేవల్లో 500 బ్రాండ్లకు చెందిన.. స్టేపుల్స్, గృహ సరఫరా, వ్యక్తిగత సంరక్షణ వంటి దాదాపు 5,000 ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు. -
హానర్ గాలా ఫెస్టివల్ సేల్ : నేటి నుంచే
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ మేకర్ హానర్ ఫెస్టివ్సేల్ సోమవారం ప్రారంభమైంది. చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్లను అందిస్తోంది. నేటి (ఏప్రిల్ 8) నుంచి 12 వరకు సాగనుంది. ఈ కామర్స్ దిగ్గజాలు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా హానర్ గాలా ఫెస్టివ్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్ లో దాదాపు 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. హానర్ 9 ఎన్, హానర్ 9లైట్, హానర్ 7ఏ, హానర్ 10 లైట్ తదితర ఫోన్లతోపాటు టాబ్లెట్లు, తదితర ఉత్పత్తులపై ఈ తగ్గింపు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం రూ. 50 కోట్ల మేర ఈ ఆ ఫర్లను అందిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్కార్ట్ ధరలు : హానర్ 9 ఎన్ (4జీబీ/64జీబీ) వేరియంట్ను రూ. 9,499లకే అందిస్తోంది. అసలు ధర : రూ.13999. హానర్ 9 లైట్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. అసలు ధర రూ. 14,999 హానర్ 9 ఐ (4జీబీ/64జీబీ) వేరియంట్ ను రూ.10, 999లకే అందిస్తోంది. అసలు ధర రూ. 17999 అమెజాన్ ధరలు హానర్ ప్లే (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 13,999 లు. అసలు ధర 19,999 హానర్ 8 ఎక్స్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 12, 999లు. అసలు ధర 14,999 Celebrating 5 years of ‘Best Quality, True Price’ with #HONORGala. Sale Live on @Flipkart now - https://t.co/HbXIF9DLhw. Hurry! pic.twitter.com/EtHEbp5A7z — Honor India (@HiHonorIndia) April 8, 2019 -
అమెజాన్కి కౌంటర్: ఫ్లిప్కార్ట్ బొనాంజా సేల్
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు వరుస ఆఫర్లతో స్మార్ట్ఫోన్ ప్రేమికులకు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ -2019ను సోమవారం ప్రకటించింది. మార్చి 28వరకు వరుసగా నాలుగురోజులపాటు ఈ సేల్ ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్స్ లను వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం అదనపు డిస్కౌంట్ను కూడా ఇవ్వనుంది. ముఖ్యంగా షావోమి రెడ్మి నో 6 ప్రొ, రెడ్మి 6 , పోకో ఎఫ్ 1 లను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే రియల్మి స్మార్ట్ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఏ 50, గెలాక్సీ ఏ 10, తోపాటు హానర్ 9 లైట్, హానర్ 9ఎన్, హానర్ 10 లైట్ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ తాజా మొబైల్ మొనాంజా సేల్ 2019లో లిస్ట్ అయి వుండటం విశేషం. -
అమెజాన్ హోలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం మరోసారి డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్ 2019 పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హావావే వై 9, వివో 5ప్రొ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్,కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ను ఆపర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాకు, 3టీబీ జియో డాటా ను అందివ్వనుంది. దీంతోపాటు హోలి స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మార్చి 9న మొదలైన ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. -
అమెజాన్కు ఏమైంది?
ఒకవైపు మార్కెట్ క్యాప్లో అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. మరోవైపు టీవీ యాంకర్తో ప్రేమలో పడిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యకుతో విడాకులకు సిద్ధం..ఇంకోవైపు అమెజాన్లో విక్రయదారుల భారీ డేటాలీక్తో అమెజాన్ వార్తల్లో నిలిచింది. అంతర్గత వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా పలు అమెజాన్ ఇండియా పోర్టల్లో విక్రయదారుల డేటా లీక్ అయింది. ముఖ్యంగా సెల్లర్స్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు అక్రమంగా బహిర్గతం కావడం కలకలం రేపింది. వరుస డేటాలీక్స్ సోషల్ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్బుక్ ఖాతాల డేటాబ్రీచ్ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్ ఇండియాలో మరో డేటా బ్రీచ్ కలకలం రేపింది. అమెజాన్లో నమోదైన సెల్లర్స్ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్లోడింగ్ సందర్భంగా సమస్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్ అంశాన్ని గమనించామని వెల్లడించింది. అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రకటించింది. అయితే ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. కాగా అమెజాన్లో దాదాపు150 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు వుండగా, సుమారు 40 లక్షలమంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ్యంలో తాజా డాటాలీక్ ప్రభావానికి ఎంతమంది గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్ ఫిర్యాదు చేశారనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కూడా అమెజాన్లో దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది. -
దిగ్గజాలకు దిగులే వన్ప్లస్ స్మార్ట్ టీవీలు త్వరలో
ముంబై: స్మార్ట్ఫోన్ రంగంలో తనదైన శైలితో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వన్ప్లస్ టీవీ రంగంలో కూడా అడుగుపెట్టనుంది. గత సెప్టెంబర్ 14నే తమ కంపెనీ నుంచి స్మార్ట్టీవీ రానుందని వన్ప్లస్ సీఈవో పీటే లౌ తెలిపారు. దాని తర్వాత టీవీ గురించి ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా లౌ మాట్లాడుతూ టీవీని 2019 మధ్యలో మార్కెట్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని మే నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నామన్నారు. కానీ స్థాయికి తగ్గ ప్రొడక్ట్ను తయారు చేయాలని నిశ్చయించున్నాం కాబట్టి కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని తెలిపారు. వన్ప్లస్ మొబైల్స్లాగే, టీవీ సేల్స్ కూడా అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు. వన్ప్లస్ మొబైల్తో అనుసంధానం చేసేలా టీవీని తయారుచేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ సర్వీస్ ద్వారా సినిమాలు, షోలు చూసే సౌలభ్యం కల్పించనున్నారు. వన్ప్లస్ స్మార్ట్టీవీ రాక షావోమీకి గట్టి ఎదురుదెబ్బ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎంఐ స్పెషల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఎంఐ ఫ్యాన్స్కు శుభవార్త. షావోమి ఇండియా ప్రమోషనల్ ఆఫర్ను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వతేదీవరకుఈ స్పెషల్ సర్ప్రైజ్ సేల్ను నిర్వహించనుంది. అమెజాన్లో ప్రత్యేకంగా ఈ సేల్ ఉంటుంది. ముఖ్యంగా ఎంఐ ఏ2, రెడ్ మి వై2 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. ఎంఐఏ 2: 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ. 14,999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ. 17,499. ఎంఐఏ 2 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ. 16,999లకే లభ్యం. ఎంఆర్పీ ధర రూ. 20,500. రెడ్మి వై2 ( 3/2జీబీ) వేరియంట్ రూ.8999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ. 10,499. రెడ్మి వై2 ( 4జీబీ/64జీబీ) వేరియంట్ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ.13,499. వీటితోపాటు రెడ్ మి 6ఏ స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది. Mi fans! It is Selebration time. I ❤️ Mi sale on @amazonIN begins on December 6th. We have got huge discounts on your favourite Mi smartphones. 🎊🎉🎈 RT if you're excited! pic.twitter.com/EZr6zBjnvR — Mi India (@XiaomiIndia) December 4, 2018 -
‘మరి’ "బుల్లెట్ దిగిందా"
గ్యాంగ్ ఉంది... గన్నులున్నాయి..చూడ్డానికి ఆడియెన్స్ ఉన్నారు.రివాల్వర్ తిరిగినట్టు ఒక అరడజన్ ట్విస్టులున్నాయి.పండుగాడు లేకపోయినా దిమ్మతిరుగుద్ది.సగం టైం ఏం జరుగుతుందో తెలీక ఓ డజన్ ఎపిసోడ్స్ డజన్ అరటిపండ్లు జీర్ణమైనంత ఈజీగా అయితే కాదు..బాగా మైండ్ పెట్టాలంతే!బుల్లెట్ దిగిందా లేదా అన్న డౌట్ మాత్రం ఆడియెన్స్ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది. లొకేషన్ ఒక హోటల్ సూట్ (స్వీట్ అనాలి) లాంటి గది. అది విశ్వకు ఇచ్చిన బస. లోపలికి వచ్చి చూస్తే పడక గదిలో మంచం మీద ‘రెడ్’ పడుకొని ఉంటాడు. తన గదిలోకి ఎలా వచ్చావని రెడ్తో గొడవపడ్తాడు. రెడ్ కూడా తీవ్రంగానే గొడవకు సిద్ధమవుతాడు. విశ్వ తన మేనేజర్ కీర్తిని పిలిచి.. రెడ్ తన గదిలోకి ఎలావచ్చాడు అని ప్రశ్నిస్తాడు. కీర్తి కూడా అవాక్కవుతుంది రెడ్ను అక్కడ చూసి. వెళ్లిపొమ్మని చెప్తుంది. కాని రెడ్ వినడు. దాంతో ఘర్షణ పెద్దదవుతుంది. ఎటూ పాలుపోక కీర్తి.. అజయ్కు ఫోన్ చేస్తుంది. వస్తాడు. అతను విశ్వకు తోడవడంతో రెడ్ తన దగ్గరున్న గన్ తీస్తాడు.‘‘పేలుస్తావా.. పేల్చు’ అంటూ విశ్వ అతనిని రెచ్చగొడ్తాడు. అజయ్ అటు విశ్వకు, ఇటు రెడ్కు నచ్చజెçప్తూ వారిస్తుండగానే విశ్వ, రెడ్ ఒకరిపై ఒకరు తలపడ్తారు. వాళ్లను ఆపే ప్రయత్నంలో ఆ ఇద్దరి మధ్యలోకి అజయ్ వెళ్లి రెడ్ చేతిలో ఉన్న గన్ తీసుకోబోతుండగా పేలుతుంది. రెడ్కు బులెట్ తగిలి చనిపోతాడు. కీర్తి సహా ఆ ఇద్దరూ షాక్ అవుతారు. దాన్నుంచి బయటపడటం ఎలా? ఆ క్షణంలోనే అజయ్ స్నేహితురాలు జర్నలిస్ట్ జాహ్నవి అక్కడకు వస్తుంది. డెడ్ బాడీని చూసి ఆమె కూడా అవాక్కవుతుంది. సహాయం కోసం జాహ్నవికి అసలు విషయం చెప్పేస్తాడు అజయ్. హెల్ప్ చేస్తానని మాటిచ్చి బయటకు వచ్చి ఆ ఏరియా సీఐ ఆంజనేయులుకు ఫోన్ చేస్తుంది. సీన్లోకి ఆంజనేయులు ఎంటర్ అవుతాడు. చనిపోయిన రెడ్.. కేడీ బావమరిది. కేడీ.. సీఐకి బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే పదికోట్లు కావాలని డిమాండ్ చేస్తాడు. వీళ్లు ఒప్పుకుంటారు. ఇక్కడే కథ ఓ మలుపు తిరుగుతుంది. ఫ్లాష్బ్యాక్ విశ్వ.. సినిమా హీరో. కీర్తి.. అతని మేనేజర్. అజయ్.. విశ్వ నటిస్తున్న సినిమా హీరోయిన్ ఐశ్వర్య మేనేజర్. కీర్తి, అజయ్.. క్లాస్మేట్స్. కాలేజ్ డేస్లో ప్రేమికులు కూడా. కీర్తికి వచ్చిన మోడలింగ్ అవకాశాన్ని తన మేల్ ఈగోతో అడ్డుకుంటాడు అజయ్. దాంతో వాళ్లిద్దరి ప్రేమ బ్రేక్ అవుతుంది. ఇద్దరి ధ్యేయం ఒకటే, సినిమా ఫీల్డ్లోకి రావాలని. ప్రొడ్యూసర్ కావాలని కీర్తి, డైరెక్టర్ కావాలని అజయ్ సినీరంగంలో స్ట్రగుల్కి సిద్ధపడ్తారు . అంతకుముందు విశ్వకు మేనేజర్గా ఉన్న వ్యక్తికి ఛాతీనొప్పి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అతని స్థానంలో కీర్తి మేనేజర్గా బాధ్యత తీసుకుంటుంది. అజయ్ తండ్రి ఒకప్పుడు హీరో కావాలనే తాపత్రయంతో సినీ రంగంలోకి వస్తాడు. బ్యాక్గ్రౌండ్ లేక.. జూనియర్ ఆర్టిస్ట్గానూ సెటిల్ కాలేక న్యూస్రీడర్గా స్థిరపడ్తాడు. తన కొడుక్కీ తనలాంటి అనుభవమే ఎదురవుతుందేమోననే భయంతో అజయ్ను సినిమాలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంటాడు. కొడుకు పట్టుదల చూశాక ఆఖరు చాన్స్గా ఓకే అంటాడు. డైరెక్టర్ కావాలని అడుగుపెట్టిన అజయ్కు మేనేజర్గా అవకాశం వస్తుంది. ఈ లైన్ ద్వారా లక్ను పరీక్షించుకుందామని చేరుతాడు. అలా కీర్తి, అజయ్ ఇద్దరూ హీరోహీరోయిన్ మేనేజర్లుగా ఒక సెట్ మీద తారసపడతారు. ఆ సినిమా వెనక కథ విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమాకు అనధికార నిర్మాత కుమార్ దాస్ ఉరఫ్ కేడీ. అతనొక గ్యాంగ్స్టర్. వడ్డీ వ్యాపారి కూడా. ఆయన వయసులో సగం వయసున్న అమ్మాయి కేడీని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఒక పాప. బయటివాళ్లతో కరుకుగా ఉండే కేడీ పెళ్లాం, బిడ్డలంటే ప్రాణం పెడ్తాడు. ఒకసారి చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన కేడీకి వైద్య పరీక్షలు చేసి.. క్యాన్సర్ అని తేలుస్తారు డాక్టర్లు. అదీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, ఇంకెంతో కాలం బతకడనీ చెప్పేస్తారు. కుంగిపోతాడు కేడీ. తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసి.. తన తదనంతరం తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లేక బతికేలా చూడాలని ఆరాటపడ్తుంటాడు. అలాంటి ఏర్పాటు చేయమని మిత్రుడు సీఐ ఆంజనేయులు దగ్గరకు వెళ్తాడు. తన జబ్బు విషయమూ బయటపెట్టేస్తాడు. బాగా ఆలోచించిన ఆంజనేయులు ఆ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టి వైట్ చేసుకోవచ్చని, అందుకు పాల సుబ్రహ్మణ్యమనే నిర్మాతను పట్టుకుందామని సలహా ఇస్తాడు. సుబ్రహ్మణ్యం పాల వ్యాపారంతో పైకెదిగి సినిమా నిర్మాతగా మారి పాల సుబ్రహ్మణ్యంగా పాపులర్ అవుతాడు. వీళ్ల ప్రపోజల్ను ఒప్పుకుంటాడు. అలా విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమా స్టార్ట్ అవుతుంది. మరి రెడ్ ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమా సెట్స్ మీదున్నప్పుడు ఐశ్వర్య, విశ్వ అందరూ కలిసి పబ్లో పార్టీ చేసుకుంటారు. హఠాత్తుగా ఆ పార్టీలో ఐశ్వర్య మాజీ బాయ్ఫ్రెండ్ ప్రత్యక్షమవుతాడు. అసహనంగా ఉంటాడు విశ్వ. చిన్న రగడ అవుతుంది. ఆ గొడవతో చిరాకు పడ్డ ఐశ్వర్య.. విశ్వను, తన మాజీ బాయ్ ఫ్రెండ్ను తిట్టి వెళ్లిపోతుంది. విశ్వ హర్ట్ అవుతాడు. ఆ పార్టీకి అజయ్ ఫ్రెండ్ జర్నలిస్ట్ జాహ్నవి కూడా వస్తుంది. ఆ వ్యవహారాన్నంతా సెల్ఫోన్లో రికార్డ్ చేసి తన న్యూస్చానల్కు ఫీడ్ ఇస్తుంది. రచ్చవుతుంది. సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పాల సుబ్రహ్మణ్యం చాకచక్యంతో ఇద్దరినీ కన్విన్స్ చేసి సినిమా ఆగిపోకుండా చూస్తాడు. కాని హీరో, హీరోయిన్ ఒకరినొకరు సాధించుకుంటూ షూటింగ్కి ఆటంకం కలిగిస్తుంటారు. దీన్ని చక్కదిద్దడానికి తన బావమరిది రెడ్ను సెట్స్ మీదకు పంపిస్తాడు కేడీ. రెడ్ కూడా సినిమా హీరో కావాలనుకుంటుంటాడు. కాని బావ తనకు ఆ అవకాశం ఇవ్వకపోవడం పట్ల కొంచెం కోపంగా ఉంటాడు. రెడ్.. షారూఖ్ ఫ్యాన్. ట్విట్టర్ అంటే క్రేజీ. ఎప్పుడూ బొడ్లో గన్తో, నలుగురిని వెంటేసుకొని తిరుగుతుంటాడు. రెడ్కు తిక్కెక్కువ. ఆ తిక్కతోనే అదిగో.. తన గన్ తూటాకు తనే బలవుతాడు. తర్వాత కేడీకి తెలియకుండా అతని బావమరిది శవాన్ని మాయం చేయడానికి సీఐ ఆంజనేయులు అడిగిన పదికోట్ల రూపాయలను సర్దలేకపోతారు అజయ్, విశ్వ. దాంతో మండిపడ్డ ఆంజనేయులు .. రెడ్ శవాన్ని తీసుకుని స్టేషన్కు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రకారం శవాన్ని తీసుకుని ఆ గది బయటకు రాగానే కేడీ ఎదురుపడ్తాడు వీళ్లకు. రెడ్ శవాన్ని చూసి .. ‘‘ఎవడు నా బామ్మర్దిని చంపింది’’ అంటూ ఆంజనేయులు వారిస్తున్నా వినకుండా ఆవేశంతో విశ్వ, అజయ్ మీదకు కాల్పులు జరుపుతాడు కేడీ. అజయ్కు తూటా తగిలి నేలకొరుగుతాడు. కంగారు పడ్తాడు ఆంజనేయులు. అప్పుడు కేడీనే ఉపాయం చెప్తాడు. అజయ్ శవాన్ని నువ్వు తీసుకుపో.. నా బామ్మర్ది శవాన్ని నేను తీసుకుపోతాను అని. అలాగే జరుగుతుంది. అజయ్ శవాన్ని ఊరవతల కొండమీదకు తీసుకెళ్లి అక్కడినుంచి చెరువులో పడేస్తాడు. అది రికార్డ్ అయి ఆ వీడియో మళ్లీ చానళ్లలో ప్రసారం అవుతుంది. దీనికంతటికీ ముందు కేడీకి క్యాన్సర్ లేదని, వైద్య పరీక్షలకోసం తీసిన బ్లడ్ శాంపిల్స్ తారుమారవడం వల్ల ఆ పొరపాటు జరిగిందని డాక్టర్లు క్షమాపణ చెప్తారు కేడీకి. ఇక టీవీలో వచ్చిన ఆంజనేయులు నిర్వాకానికి పోలీస్ బాస్ గుస్సా అవుతాడు. వివరణ కోరుతాడు. ఆ హత్య కేడీ చేశాడని చెప్పేస్తాడు ఆంజనేయులు. కేడీని పిలిపిస్తారు. నేనెవరినీ చంపలేదు అంటాడు. అబ్ధమని వాదిస్తూ అజయ్ వాళ్లే రెడ్ని చంపారనే విషయాన్నీ బయటపెడ్తాడు. నిర్ధారణ కోసం విశ్వను పిలిపిస్తారు. అజయ్ కూడా వస్తాడు. ఆ ట్విస్ట్ వెనక సీఐ ఆంజనేయులు అడిగిన డబ్బును అరేంజ్ చేస్తానని ఆ స్వీట్ నుంచి బయటపడ్డ అజయ్ డైరెక్ట్గా కేడీ దగ్గరకు వెళ్లి నిజం చెప్తేస్తాడు పెనుగులాటలో రెడ్ చనిపోయినట్టు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఫీలవుతాడు కేడీ. దానికి కారణం.. కేడీకి క్యాన్సర్ ఉందని తేలగానే అతనికి దగ్గరున్న డబ్బును కొట్టేయాలనుకుంటాడు సీఐ ఆంజనేయులు. హీరో చాన్స్ ఇవ్వలేదని బావ మీద అసంతృప్తిగా ఉన్న రెడ్నూ రెచ్చగెట్టి అతనితో కేడీకి స్పాట్ పెట్టించాలని ప్లాన్ వేస్తాడు. రెడ్ ఒప్పుకుంటాడు. దీన్ని చూసిన కేడీ అనుచరుడు వీడియో తీసి కేడీకి చూపిస్తాడు. నా అనుకున్న, నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని కలత చెందుతాడు కేడీ. వాళ్లపని పట్టేందుకు సమయం కోసం వేచి చూస్తుంటాడు. అజయ్ వాళ్ల వల్ల రెడ్ లైఫ్కి ఎండ్పడడంతో హ్యాపీగా ఫీలవుతాడు కేడీ. ఇక సీఐ అంతుతేల్చడానికి అజయ్తో ఓ పథకం వేస్తాడు కేడీ. అదే.. అజయ్కు డమ్మీ బుల్లెట్ తగిలినట్టు నాటకం ఆడటం. శవాన్ని పడేస్తుంటే వీడియో తీయడం ఎట్సెట్రా. ఇంతకీ చెరువులో పడేసింది రెడ్ శవమన్నమాట. కేడీ అజయ్ను కాల్చాక.. సీఐని మాటల్లో పెడ్తాడు. ఆ టైమ్లో తన ప్లేస్లో రెడ్ను సీఐ జీప్లో పడేస్తారు అజయ్ అండ్ విశ్వ. లాస్ట్ సీన్ విశ్వ, ఐశ్వర్య, కీర్తి, అజయ్ల మధ పొరపొచ్చాలు తొలగి ఒక్కటవుతారు. జరిగిన ఆ కథనంతా స్క్రిప్ట్గా రాసి డైరెక్ట్ చేసే చాన్స్ అజయ్కి ఇస్తాడు కేడీ. అలా ది ఎండ్కి అజయ్ డైరెక్టర్ అయిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. తొలి తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్లాట్ ఫామ్ మీద స్క్రీన్ అయిన తొలి తెలుగు వెబ్సిరీస్ గ్యాంగ్స్టార్స్. స్క్రిప్ట్, స్క్రీన్ప్లే తెలుగు సినిమా ఫక్కీలో ఉండడం వల్ల వెబ్ సిరీస్గా ఇది ఆకట్టుకోలేకపోయింది. పెద్ద తారలను తీసుకున్నారు కథ, కథనం మీద కూడా అంతే శ్రద్ధ పెడితే ఇంకా బాగుండేది. కేడీగా జగపతిబాబు, విశ్వగా నవదీప్, ఐశ్వర్యగా శ్వేతాబసు ప్రసాద్, అజయ్గా సిద్ధు జొన్నలగడ్డ, కీర్తిగా అపూర్వ అరోరా, రెడ్గా రాహుల్ రామకృష్ణ, సీఐ ఆంజనేయులగా శివాజీ, పాల సుబ్రహ్మణ్యంగా పోసాని కృష్ణమురళి, విశ్వ తండ్రిగా కృష్ణ భగవాన్ నటించారు. – సరస్వతి రమ -
కాట్స్ ఐ డిజైన్తో లాంచ్ అయిన హానర్ 8సీ
చైనా సెల్ఫోన్ దిగ్గజం హానర్ సరికొత్త మొబైల్ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీతోపాటు అదిరే ప్రాసెసర్తో హానర్ 8సీ పేరుతో ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ 10న అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా అమ్మకానికి రానుంది. రెండు మెమొరీ వేరియంట్లతో కాట్స్ ఐ, నలుపు రంగుల్లో రిలీజ్ చేయనున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ను మొట్టమొదటి సారిగా ఈ ఫోన్లోనే వినియోగించారు. హానర్ 8సి ఫీచర్లు 15.9 సెంటీమీటర్ల ఫుల్వ్యూ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4+32 జీబీ మోడల్ ధర 11,999 4+64 జీబీ మోడల్ ధర 12,999 -
వన్ప్లస్ 6టీ టీజర్ వచ్చేసింది...
వన్ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్ప్లస్ '6టీ' వేరియంట్ను మరింత గ్రాండ్ లుక్లో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. తన అప్కమింగ్ వన్ప్లస్ 6టీ స్మార్ట్ఫోన్ టీజర్ను కంపెనీ విడుదల చేసింది. అమెజాన్ ఇండియాలో ఎక్స్క్లూజివ్గా ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘నోటిఫై మి’ అనే పేజీతో వన్ప్లస్ 6టీ అమెజాన్ ఇండియాలో బుధవారం నుంచి లైవ్కు వచ్చింది. అమెజాన్లో మాత్రమే కాక, టీవీల్లో, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లలో కంపెనీ ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ప్రమోషన్లను ఇస్తోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వన్ప్లస్ 6టీ ప్రకటనలను అదరగొడుతున్నారు. వన్ప్లస్ 6టీ కమింగ్ సూన్ అనేది, అమెజాన్ ఇండియా టీజర్ పేజీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వన్ప్లస్ 6 లాంచ్ అయిన మూడు నెలల్లోనే దీని టీజర్ వచ్చేసింది. ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్తో వస్తున్న తొలి వన్ప్లస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదే ఫీచర్ను వివో తన నెక్స్, వీ11 ప్రొ ఫోన్లలో, ఒప్పో ఆర్17 ప్రొలలో అందించాయి. వివో, ఒప్పో, వన్ప్లస్ లు సిస్టర్ బ్రాండ్లు. ఎప్పడికప్పుడూ తమ టెక్నాలజీలను ఈ కంపెనీలు షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి. అయితే వన్ప్లస్ 6టీలో హెడ్ఫోన్ జాక్ను అందించడం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధానమైన ఫీచర్గా వస్తోంది. బ్యాటరీ కూడా చాలా పెద్దదే అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ ఫీచర్లుగా ఉండబోతున్నాయి. -
అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం
న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్కు గట్టి పోటీగా... దేశీయ కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి అమెజాన్ చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా అమెజాన్ ఇండియా మరో కొత్త ప్రయోగం చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో తన వెబ్సైట్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తన ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ సైట్ యూజర్లకు ఈ లాంగ్వేజ్ సపోర్టు ఇవ్వనుంది. హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ తన వెబ్సైట్లో తీసుకురావడం దేశీయ మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఈ-కామర్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. దేశీయంగా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ హిందీ లాంగ్వేజ్ సపోర్టును తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి అమెజాన్ ఇండియా కస్టమర్లు హిందీలోనే ప్రొడక్ట్ సమాచారాన్ని, డీల్స్ను, డిస్కౌంట్లను తెలుసుకోవచ్చు. ఆర్డర్లను ప్లేస్ చేసుకోవడం, ఆర్డర్లకు చెల్లించడం, అకౌంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం, ఆర్డర్లను ట్రాక్ చేయడం, ఆర్డర్ హిస్టరీ ప్రతి ఒక్కటీ హిందీ భాషలోనే చేపట్టుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ వెబ్సైట్లలో ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్ను, ఎడమవైపు ఉన్న మెనూ బార్లో చూడవచ్చు. దీని కోసం కొత్తగా అమెజాన్ యాప్ను అప్డేట్ చేసుకోవాల్సినవసరం లేదు. సర్వర్ సైడే దీన్ని అప్డేట్ చేయనున్నారు. ఇంగ్లీష్ లోంచి హిందీలోకి మారే ఆప్షన్ను లాంగ్వేజ్ బటన్ కల్పిస్తోంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్ట్ల సమాచారం, ముఖ్యమైన షాపింగ్ సమాచారం మాత్రమే హిందీలో లభ్యమవుతున్నాయి. అయితే సెర్చ్ ఫీచర్, డెలివరీ అడ్రస్కు మాత్రం ఇంగ్లీష్ అవసరం. మరిన్ని షాపింగ్ ఫీచర్లను హిందీలో అందించేందుకు అమెజాన్ సిద్దమవుతోంది. ఒక్కసారి మీరు ఎక్కువగా సెర్చ్ చేసే లాంగ్వేజ్ను ఎంపిక చేసుకున్న తర్వాత, అది సేవ్ అయి, తర్వాత అమెజాన్ ఇండియా సైట్లోకి వెళ్లేటప్పుడు అదే లాంగ్వేజ్లో సైట్ దర్శనమిస్తుంది. మరిన్ని లాంగ్వేజ్ల సపోర్టును కూడా అమెజాన్ త్వరలో ప్రవేశపెట్టబోతుంది. సుమారు 50 శాతం మంది కస్టమర్లు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కంపెనీ గుర్తించింది. వీరి కోసమే హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ ఇండియా ప్రవేశపెట్టింది. -
వర్క్ మెయిల్స్కు స్పందించకండి : అమెజాన్ చీఫ్
బెంగుళూరు : చాలా మందికి ఆఫీసే జీవితమైపోతుంది. ఇంట్లో కూడా ఆఫీస్ వర్కే. ఎప్పడికప్పుడూ ఈ-మెయిల్స్ను, వాట్సాప్ను చెక్చేసుకుంటూ... ఉన్నతాధికారులు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ‘ ప్రస్తుత పరిస్థితంతా ఓ విపత్తులా మారిపోయింది. ఇదో టైమ్ బాంబ్ అని, ఎప్పుడైనా పేలవచ్చు’ అని పలువురు మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులకు, అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్ సంచలనాత్మక కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఎనిమిది గంటల వరకు ఈమెయిల్స్కు, వర్క్ కాల్స్కు స్పందించవద్దని తన కొలిగ్స్కు సూచించారు. వర్క్ లైఫ్ను వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలనే విషయంపై వీరికి ఈ కౌన్సిలింగ్ చేపట్టినట్టు తెలిసింది. అదేవిధంగా పని ప్రదేశంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలో కూడా తెలిపారు. ఈ సూచనలు చేస్తూ అమిత్ అగర్వాల్ తన కొలీగ్స్కు ఒక ఈమెయిల్ పంపారు. ఈ ఈ-మెయిల్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సైట్లలో హాట్ టాఫిక్గా మారింది. అగర్వాల్ అమెజాన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అగర్వాల్ అంతకముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా ఉన్నారు. అగర్వాల్ తన కొలీగ్స్కు పంపిన ఈమెయిల్పై అమెజాన్ స్పందించడం లేదు. కాగా, టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పని ఒత్తిడి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటోంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ను ఇవి పెద్ద ఎత్తున్న హరిస్తున్నాయని వాదన. దేశంలో మూడో అతిపెద్ద నగరమైన బెంగళూరులో ఇది మరీ అధికంగా ఉంది. అర్థరాత్రి సమావేశాలు, వీకెండ్ కాల్స్ వీరిని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో 25 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండే వారికి గుండె పోటులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ ఎస్ కల్యాణసుందరం చెప్పారు. ఈ రంగంలో గత నాలుగేళ్లలో తానెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రతి శనివారం అపాయింట్మెంట్లను కేవలం టెక్ వర్కర్లకే కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్నినెలల ముందే వీరు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. ‘కేవలం ఒక్క జీవితం... అది కూడా పనికే.. ఇది మహా విపత్తు, ఇదో టైమ్ బాంబు, ఎప్పుడైనా పేలవచ్చు’ అని హెచ్చరించారు. తాను రోజులో 14 గంటలు ఆఫీసులోనే ఉంటానని ఓ ఈ-కామర్స్ డేటా అనాలిటిక్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా.. కాల్స్, ఈమెయిల్స్కు స్పందిస్తూ ఉంటానని చెప్పారు. నా కొలిగ్స్ కూడా వెన్ను నొప్పి, ఒత్తిడి, నిద్ర లేమితో బాధపడుతున్నట్టు తెలిపారు. అమెజాన్ అమిత్ అగర్వాల్ ఆలోచన స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురంటున్నారు. అయితే అమలు చేయడం కష్టమని చెబుతున్నారు. వర్క్ మెయిల్స్ను టర్న్ ఆఫ్ చేయడం వ్యవస్థాపకులకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డిస్కౌంట్ ఆఫర్లో వన్ప్లస్ 6
వన్ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 6 డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా సైట్లో ఈ స్మార్ట్ఫోన్పై ఫ్లాట్ 2000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వన్ప్లస్ నుంచి ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్ను ఇవ్వనున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఉచితంగా 12 నెలల పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఐడియా వినియోగదారులు ఈ స్మార్ట్ఫోన్ను కొంటే, మరో రెండు వేల రూపాయల క్యాష్బ్యాక్ లభిస్తుంది. క్లియర్ట్రిప్ నుంచి విమానం, హోటల్ బుకింగ్స్ చేసుకునే వారికి వన్ప్లస్ కంపెనీ రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇలా పలు ప్రయోజనాలను వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు ఆ కంపెనీ ఆఫర్ చేస్తుంది. వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లు 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్లలో మార్కెట్లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్ ధర 34,999 రూపాయలు కాగ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 39,999 రూపాయలు. మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ లిమిటెడ్ ఎడిషన్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. పైన పేర్కొన్న అన్ని వేరియంట్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐ ఆఫర్ వాలిడ్లో ఉంది. ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ఇండియా సైట్లో మాత్రమే ఉంది. వన్ప్లస్ స్టోర్లో ఈ ఆఫర్లు లేవు. వన్ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్లాక్) వెనుకవైపు ఫింగర్ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ -
అమెజాన్లో ఫోన్ లేదా ల్యాప్టాప్ కొంటున్నారా...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ లేదా ఇతర ఏదైనా ఖరీదైన వస్తువు కొంటున్నారా? అయితే ఇక నుంచి డెలివరీని ధృవీకరించడానికి ఆరు అంకెల ఓటీపీ అవసరమట. మరింత సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం అత్యంత విలువైన ఆర్డర్లకు వన్ టైమ్ పాస్వర్డ్(ఎటీపీ)ని ఇవ్వడం ప్రారంభించింది అమెజాన్ ఇండియా. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్లు డివైజ్లో నమోదుచేసి, డెలివరీని ధృవీకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల్లో ఎక్కువ విలువున్న ఉత్పత్తుల కోసం ఈ కొత్త ఓటీపీ ఫీచర్ను అమెజాన్ ఇండియా తీసుకొచ్చింది. ఆర్డర్ను ధృవీకరించడానికి అమెజాన్ ఇండియానే ఆరు అంకెల ఓటీపీని మెసేజ్ రూపంలో అందిస్తోంది. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్ల డివైజ్లో కస్టమర్లు నమోదు చేసి, తమ ప్రొడక్ట్ను తీసుకోవాలి. ఈ విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి గాడ్జెట్స్ 360కి ధృవీకరించారు. ‘కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన అమెజాన్, కస్టమర్లందరికీ సురక్షితంగా డెలివరీని అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని ఆర్డర్లకు ప్రస్తుతం ఓటీపీ ఆధారిత డెలివరీ మెకానిజం తీసుకొచ్చాం. కస్టమర్ రిజిస్ట్రర్ చేసిన మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్ అడ్రస్కు ఈ ఓటీపీ పంపుతాం. దీన్ని డెలివరీని అంగీకరించినట్టు తెలుసుకునేందుకు వాడుతున్నాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నెల మొదట్లోనే అమెజాన్ ఇండియా తన ఐదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్ ద్వారా తమ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో వెయ్యి రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి 250 రూపాయల క్యాష్బ్యాక్ అందిస్తోంది. గత రెండేళ్ల కాలంలో భారత్లో ఎక్కువగా సందర్శించిన సైట్ల్లో అమెజాన్.ఇన్ను నిలిపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అమెజాన్ ఇండియా సైట్లో సీఈవో జెఫ్ బెజోస్ లేఖ పోస్టు చేశారు. -
‘హానర్ 8 ప్రొ’పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం హువావే తన సబ్బ్రాండ్ హానర్ నుంచి అద్భుత స్మార్ట్ఫోన్ ‘హానర్ 8 ప్రొ’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని ఆశించే వారికి ఫ్లిప్కార్ట్, అమెజాన్లు గుడ్న్యూస్ చెప్పాయి. తమ తమ వెబ్సైట్లలో నిర్వహించబోయే సేల్స్లో హానర్ 8 ప్రొ స్మార్ట్ఫోన్పై భారీగా 7000 రూపాయల డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపాయి. మే 13 నుంచి ఈ కంపెనీల సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమయంలో హానర్ 8 ప్రొ తక్కువగా రూ.22,999కే కొనుగోలు చేసుకోవచ్చు. మిగతా సమయాల్లో హానర్ 8 ప్రొ స్మార్ట్ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లు తమ సేల్స్లో భాగంగా హానర్ 8 ప్రొ ధరను తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ను రూ.29,999కే విక్రయిస్తుండగా.. అమెజాన్ ఇప్పటికే హానర్ 8 ప్రొను రూ.22,999కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే అమెజాన్ తన సమ్మర్ సేల్స్లో భాగంగా రూ.22,999పైనే 7000 రూపాయల డిస్కౌంట్ను అందిస్తుందా..? లేదా ధరను రూ.29,999కు పెంచి ఆ ధరపై డిస్కౌంట్ అందిస్తుందా..? అన్నది ఇంకా క్లారిటీ తెలియరాలేదు. ఇక హానర్ 8 ప్రొ కు సంబంధించిన రివ్యూ చూస్తే, హానర్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్లలో ఇదీ ఒకటి. అంతా కొత్త డిజైన్ మాత్రమే కాక, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత. త్వరగా ఛార్జ్ చేసే సపోర్టును ఇది కలిగి ఉంది. స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఈ ఫోన్కు 5.7 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్, కిరిన్ 960 ప్రాసెసర్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్టు, వెనుకవైపు 12 మెగాపిక్సెల్తో డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, ఫేస్ డిటెక్షన్, హెచ్డీఆర్, పనోరమ ఫీచర్లు ఉన్నాయి. కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఫ్లిప్కార్ట్ బిగ్షాపింగ్ డేస్, అమెజాన్ సమ్మర్ సేల్తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమకు వచ్చిన గొప్ప అవకాశమని హువావే కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. ఈ సేల్స్లో భాగంగా పలు హానర్ ఫోన్లను డిస్కౌంట్లలో అందుబాటులోకి తెస్తున్నామని, హానర్ 9 లైట్ 3జీబీ వేరియంట్పై ఫ్లిప్కార్ట్ రూ.1000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొన్నారు. 4జీబీ మోడల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో రూ.2000 డిస్కౌంట్ ఉంది. హానర్ 9ఐ స్మార్ట్ఫోన్పై కూడా రూ.1000 డిస్కౌంట్ లభ్యం కానుంది. -
నోకియా 6పై రెండోసారి ధర తగ్గింపు
నోకియా 6 స్మార్ట్ఫోన్ 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర మరోసారి తగ్గింది. ఈ స్మార్ట్ఫోన్ ధరను హెచ్ఎండీ గ్లోబల్ రూ.12,999కు తగ్గించింది. గతేడాది జూన్లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర 14,999 రూపాయలుగా ఉండేది. గత నెలలో దీని ధరను 1500 రూపాయలు తగ్గించి, 13,499 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో దీని ధరను మరింత తగ్గించి రూ.12,999కు ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ధర నోకియా 6 3జీబీ ర్యామ్ వేరియంట్ సిల్వర్, మేట్ బ్లాక్ రంగుల ఆప్షన్లకు అందుబాటులో ఉంది. నోకియా 6(2018) స్మార్ట్ఫోన్ లాంచింగ్కు కొన్ని గంటల ముందు ఈ స్మార్ట్ఫోన్ ధరను హెచ్ఎండీ గ్లోబల్ తగ్గించింది. ఈ కొత్త ధరతో పాటు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్తో నోకియా 6 స్మార్ట్ఫోన్ అత్యంత తక్కువగా రూ.9,915కే లభ్యమవుతోంది. నోకియా 6 3జీబీ ర్యామ్తో పాటు 4జీబీ ర్యామ్ వేరియంట్ కూడా ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. 16,999 రూపాయలుగా ఉన్న దీని ధరను, కంపెనీ ఏ మాత్రం మార్పు చేయలేదు. నోకియా 6 ఫీచర్లు డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియా 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ఎస్ఓసీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెన్సార్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ 128జీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమరీ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోఫోన్ ఇక ఆ వెబ్సైట్లో కూడా...
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియోఫోన్కు, వినియోగదారుల్లో ఫుల్ క్రేజీ ఉంది. విడుదల చేసిన ప్రారంభంలోనే ఈ ఫోన్కు భారీ మొత్తంలో ఆర్డర్లు కూడా వచ్చాయి. ఆ డిమాండ్ తట్టుకోలేక ఒకానొక సమయంలో కంపెనీ బుకింగ్స్ను కూడా ఆపివేసింది. ఆ ఫోన్ ఇప్పటివరకు రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ జియోవెబ్సైట్, మైజియో యాప్, జియో రిటైల్ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇక ఇప్పటి నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో కూడా లభ్యమవుతుందట. రిలయన్స్ జియో, అమెజాన్ ఇండియా శుక్రవారం తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యంలో జియోఫోన్ను ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో మొబిక్విక్ ద్వారా కూడా జియోఫోన్ బుకింగ్లను చేపట్టవచ్చని కంపెనీ చెప్పింది. రూ.1500కు జియోఫోన్ను అమెజాన్ ఇండియా లిస్ట్చేసింది. ముందస్తు మాదిరిగానే జియోఫోన్ను యాక్టివేట్ చేసుకోవడానికి, యూజర్లు తమ డివైజ్, దాని ఒరిజినల్ బాక్స్, ఆధార్ నెంబర్తో పాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా రిలయన్స్ జియో పార్టనర్ స్టోర్ను సందర్శించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు దీనిపై ప్రత్యేక లాంచ్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచుతోంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా జియో ఫీచర్ ఫోన్ను కొనుగోలు చేస్తే, కస్టమర్లకు 50 రూపాయల క్యాష్బ్యాక్ అందిస్తామని కంపెనీ చెప్పింది. అదేవిధంగా ఈ ఫోన్కు రీఛార్జ్ను కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారానే చేపడితే, ఫ్లాట్ 50 శాతం క్యాష్బ్యాక్ను ఇవ్వనున్నారు. గతేడాది జూలైలో ఈ ఫోన్ను లాంచ్చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్కు 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంది. మెమరీ కార్డు ద్వారా దీన్ని128జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 2 మెగాపిక్సెళ్ల కెమెరా, ముందు వైపు వీజేఏ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వల్ల వీడియో కాల్స్కు అనుమతి ఉంది. అలాగే అందరూ తరచుగా వాడే యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్క్రోమ్, ఫైర్ఫాక్స్వంటి వెబ్ బ్రౌజర్లు కూడా ఉన్నాయి. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఎక్స్ప్రెస్ న్యూస్ వంటి యాప్స్ ప్రీలోడెడ్గా వచ్చిన తొలి జియో-బ్రాండెట్ ఫోన్ ఇందే. జియోటీవీ యాప్ ద్వారా 450 ప్లస్ వరకూ లైవ్ టీవీ ఛానెళ్లని చూడొచ్చు. అలాగే జియోమ్యూజిక్ ద్వారా వివిధ భాషల్లో కోటి పాటల వరకూ యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్తో తెలుగుతో సహా 22 భాషల్లో సహకారం. -
అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా శాంసంగ్ ఫోన్
శాంసంగ్ తన సరికొత్త గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్ఫోన్ను అధికారికంగా భారత్లోకి విడుదల చేసింది. ఫుల్ మెటల్ యూనిబాడీ డిజైన్, 5.5 అంగుళాల డిస్ప్లే, శాంసంగ్ పే మినీ సపోర్టుతో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్గా మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ఫోన్, ధర, అందుబాటులో ఉండే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కొత్త గెలాక్సీ ఆన్7 ప్రైమ్ కోసం మాత్రం అమెజాన్ ఇండియా ఓ పేజీని అంకితం చేసింది. ''నోటిఫై మి'' అనే ఆప్షన్తో ఈ స్మార్ట్ఫోన్ను అమెజాన్ లిస్టు చేసింది. ఆన్7, ఆన్7 ప్రొ మాదిరి ఈ స్మార్ట్ఫోన్ కూడా బడ్జెట్లోనే అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారులు, అమెజాన్ ఇండియా స్టోర్లో ''నోటిఫై మి'' ఆప్షన్లో వివరాలను నమోదుచేసుకోవాలని కంపెనీ పేర్కొంది. ఇక స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 1.6గిగాహెడ్జ్ , ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7870 ప్రాసెసర్ను కలిగి ఉంటుంది 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 356జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్తో వెనుకవైపు, ముందు వైపు కెమెరా శాంసంగ్ పే మినీ సపోర్టు(యూపీఐ లేదా మిగతా మొబైల్ వాలెట్ల ద్వారా ఇన్స్టాంట్ పేమెంట్లు) -
నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్ఫామ్పై నోకియా మొబైల్ వీక్ నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ మొబైల్ వీక్లో నోకియా 8, నోకియా 6 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు అంటే జనవరి 12 వరకు ఈ మొబైల్ వీక్ను అమెజాన్ నిర్వహించనుంది. ఈ సేల్లో భాగంగా నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.1500 వరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఇన్స్టాంట్ డిస్కౌంట్తో రూ.14,999గా ఉన్న నోకియా 6 స్మార్ట్ఫోన్ రూ.13,499కు దిగొచ్చింది. అంతేకాక రూ.36,999గా ఉన్న నోకియా 8 స్మార్ట్ఫోన్ రూ.35,499కు తగ్గింది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే, అదనంగా ఫ్లాట్ రూ.1500 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నోకియా 8 స్మార్ట్ఫోన్ అమెజాన్ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్బ్యాక్ లభించనుంది. అమేజింగ్ మొబైల్స్ లేదా గ్రీన్ మొబైల్స్లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది. అంతేకాక కస్టమర్లకు రూ.1500 ఐసీఐసీఐ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ.2000 అమెజాన్ పే క్యాష్బ్యాక్ ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్బ్యాక్ లభించనుంది. -
గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్పై భారీ డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ధరను అమెజాన్ ఇండియా ప్రస్తుతం రూ.39,990కు తగ్గించింది. అసలు ఈ ఫోన్ ధర రూ.76వేలు. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్పై రూ.36,010 డిస్కౌంట్ను అందిస్తున్నట్టు తెలిసింది. అంటే దాదాపు 47 శాతం డిస్కౌంట్ అన్నమాట. ఒక్క పిక్సెల్ ఎక్స్ఎల్పైనే మాత్రమే కాక, కొత్త గూగుల్ ఫోన్ పిక్సెల్ 2పై కూడా అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్కార్ట్ భారీ మొత్తంలో డిస్కౌంట్ అందిస్తుంది. 64జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.61వేల నుంచి రూ,49,999కు ప్లిప్కార్ట్ తగ్గించింది. అంతేకాక అదనంగా ఎక్స్చేంజ్పై రూ.18వేల తగ్గింపును అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన పిక్సెల్ 2 ధరను రూ.70వేల నుంచి రూ.58,999 తగ్గించినట్టు కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. తన 2018 మొబైల్ బొనాంజ సేల్లో వీటిపై డిస్కౌంట్లను ఆఫర్చేస్తుంది. రేపటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాబోతుంది. ఫ్లిప్కార్ట్ అప్కమింగ్ ఆఫర్లలో గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు 13,001 రూపాయలు, 8,001 రూపాయలు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వాడి కొనుగోలు చేసే వారికి పిక్సెల్ 2పై రూ.8000 తగ్గింపు ఉంది. 64జీబీ స్టోరేజ్ పిక్సెల్ 2 స్మార్ట్ఫోన్ రూ.39,999కు అందుబాటులో ఉంటుండగా.. అతిపెద్ద పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.52,999కు లభ్యమవుతుంది. -
స్మార్ట్ఫోన్ ఆర్డర్ చేస్తే.. రాయి వచ్చింది
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో స్మార్ట్ఫోన్ ఆర్డర్ చేస్తే.. రాయి రావడం. బట్టలు ఆర్డర్ చేస్తే మరేదో రావడం. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్ట్రకు చెందిన రాకేష్ ఛాబరియా, అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఓ కొత్త స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేశాడు. దాని కోసం రూ.33వేలు కూడా చెల్లించాడు. కానీ ఆర్డర్ తన చేతిలోకి వచ్చాక కానీ తెలియలేదు. తనకి ఓ పెద్ద రాయి వచ్చిందని. అంటే రాకేష్కు స్మార్ట్ఫోన్ బదులు ఓ పెద్ద రాయి డెలివరీ అయింది. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన పార్శిల్ కాస్త భిన్నంగా కనిపించడంతో, రాకేష్కు అనుమానం వచ్చింది. డెలివరీ బాయ్నే రాకేష్ బాక్స్ను తెరమన్నాడు. ఈ బాక్స్లో ఉన్న రాయిని చూసి ఇద్దరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బాక్స్ నుంచి ఫోన్ ఎలా మిస్ అయిందని డెలివరీ బాయ్ను అడగగా.. తనకేమీ తెలియదంటూ సమాధానమిచ్చాడు. వెంటనే వీటి ఫోటోలను తీసిన రాకేష్, అమెజాన్కు ఈ-మెయిల్ పంపాడు. రాకేష్కు క్షమాపణ చెప్పిన అమెజాన్, తదుపరి విచారణ కోసం ఆధార్ కార్డు వివరాలు పంపమని కోరింది. వచ్చే 3-4 రోజుల్లో ఈ విషయాన్ని పరిష్కరిస్తామని చెప్పింది. అయితే ఐదు రోజులు గడుస్తున్నా.. రాకేష్కు అమెజాన్ నుంచి కనీస స్పందన లేదు. ఓ ఆంగ్ల వార్త గ్రూప్ అమెజాన్ను సంప్రదించగా.. కస్టమర్లందరికీ తాము జాగ్రత్తగా డెలివరీ చేపట్టాలని అంకితభావంతో పనిచేస్తున్నామని, ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చింది. రూ.33వేలు చెల్లించినప్పటికీ, తన చేతిలోకి ఇంకా కొత్త ఫోన్ రాకపోవడంపై రాకేష్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాడు. -
మరింత చౌకగా ఐఫోన్ ఎస్ఈ
భారత్లో లభ్యమవుతున్న ఆపిల్ ఐఫోన్లలో అత్యంత చౌకగా దొరికేది ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ మాత్రమే. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం మరింత చౌకగా మారింది. ఐఫోన్ ఎస్ఈపై భారీగా ధర తగ్గింది. రూ.26వేలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ 32జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ.17,999కే లభ్యమవుతుంది. అంటే రూ.8వేల మేర ధర తగ్గింది. అయితే ఈ ధర కోత అధికారికంగా కాదని, ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.26వేలుగానే ఉన్నట్టు తెలిసింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా ఐఫోన్కు అధికారిక రీసెల్లర్స్ కావు. ఐఫోన్ ఎస్ఈపై ధర తగ్గడం ఇది రెండోసారి. కస్టమ్ డ్యూటీ పెరిగిన నేపథ్యంలో ఐఫోన్లపై రేట్లు పెరిగిన వారంలో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గడం విశేషం. అయితే కస్టమ్ డ్యూటీ నేపథ్యంలో పెరిగిన ధరల్లో ఐఫోన్ ఎస్ఈ లేదు. ధర తగ్గడంతో ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుతం మోటో జీ5ఎస్ ప్లస్, నోకియా 6, షావోమి ఎంఐ ఏ1 వంటి ఆండ్రాయిడ్ ఫోన్ల రేంజ్లో దొరుకుతోంది. అంతేకాక ఎక్స్చేంజ్లో ఈ ఐఫోన్ ఎస్ఈపై అమెజాన్ రూ.15వేల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది. ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లు... 4 అంగుళాల డిస్ప్లే ఐఓఎస్ 11 వెనుక వైపు 12 ఎంపీ ఐసైట్ కెమెరా ముందువైపు 1.2 ఎంపీ కెమెరా టచ్ ఐడీ -
న్యూఇయర్ గిఫ్ట్: అమెజాన్ కొత్త స్మార్ట్ఫోన్
బెంగళూరు : ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్.. కొత్త ఏడాది సందర్భంగా భారత్లో కూడా స్మార్ట్ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టబోతుంది. వచ్చే ఏడాది జనవరిలో అమెజాన్ ఇండియా కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. టెనోర్ బ్రాండు పేరుతో అమెజాన్ ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. టినోర్ ఈ, టినోర్ జీ పేరుతో రెండు మోడల్స్ స్మార్ట్ఫోన్లను అమెజాన్ లాంచ్ చేస్తుందని తెలిపాయి. రెండు నెలల క్రితమే అమెజాన్ ఇండియాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిలియన్ కింద ఇన్-హౌజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొత్తంగా మొబైల్స్, టాబ్లెట్ మార్కెట్ వార్షికంగా 8.5 బిలియన్ డాలర్ల నుంచి 9 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని రెడ్షీర్ కన్సల్టింగ్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ లేబుల్ మార్కెట్ కింద భారత్లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడం ప్రస్తుతం నవశతకమని నిపుణులు చెప్పారు. ప్రైవేట్ లేబుల్ స్మార్ట్ఫోన్లు ఎక్కువగా లోకల్, లో బ్రాండు, మిడిల్ బ్రాండు స్మార్ట్ఫోన్ల బలాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇది 20 శాతం మార్కెట్ను కలిగి ఉన్నట్టు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ లేబుల్స్కు 2 బిలియన్ డాలర్ల అవకాశాలున్నాయన్నారు. స్మార్ట్ఫోన్లకు మాత్రమే కాక, స్టాపుల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్ వంటి కేటగిరీలకు అమెజాన్ ఇండియాలో సోలిమో, సింబల్, మిక్స్ వంటి ప్రైవేట్ లేబుల్స్ ఉన్నాయి. దేశంలో తన గ్లోబల్ బ్రాండు అమెజాన్ బేసిక్స్ను కూడా విక్రయిస్తోంది. ఫైర్ బ్రాండు కింద అమెజాన్ గ్లోబల్గా తన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. -
డిస్కౌంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు
హువావే తన హానర్ బ్రాండులోని రెండు స్మార్ట్ఫోన్లపై పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై అమెజాన్.ఇన్లో డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. హానర్ 6ఎక్స్ స్మార్ట్ఫోన్ 32జీబీ, 64జీబీ వేరియంట్లపై రూ.2000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొనగా.. హానర్ 8 ప్రొ స్మార్ట్ఫోన్పై రూ.4వేల దాకా డిస్కౌంట్ అందిస్తోంది. మంగళవారం నుంచి డిసెంబర్19 మంగళవారం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. హానర్ 6 ఎక్స్ స్మార్ట్ఫోన్ జనవరిలో లాంచ్ అయింది. డిస్కౌంట్ అనంతరం హానర్ 6ఎక్స్ స్మార్ట్ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.9,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర అంతకముందు 11,999 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా రూ.13,999గా ఉన్న హానర్ 6ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.11,999కు లభ్యమవుతుంది. హానర్ 8 ప్రొ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం అమెజాన్లో రూ.25,999కు లభ్యమవుతోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 29,999 రూపాయలు. హానర్ 6ఎక్స్, హానర్ 8 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా హానర్ ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.