cbi investigation
-
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న ఆరోపణలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సిట్లను సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే ఏర్పాటు చేస్తుంటారు. కానీ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించాల్సి ఉంటుంది.అందువల్ల సిట్ దర్యాప్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదనేది ఎక్కువమంది భావన. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని పనిగట్టుకొని సిట్ సారథిగా నియమించడం కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తోంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పనిచేసిన గోపీనాధ్ జెట్టీని సిట్ సభ్యునిగా నియమించారు. ఇందులో హేతుబద్దత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పని చేసిన వ్యక్తిగా కూడా ఆ తప్పుతో సంబంధం ఉండే అవకాశముంది.సిట్ విధి విధానాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేరకు తావు ఉంటుందనే సందేహమే. ఉదాహరణకు లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది సత్యమన్నదన్న విషయాన్నిన్ని ఈ సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ,ఇతర ఆహార పదార్థాలుగానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువేనని అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిపుణులను సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తుందా? లేకపోతే చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున, దానికి విరుద్దంగా నివేదిక వస్తుందా? టీటీడీ ఈవో మొదట ఒక రకంగా, తరువాత చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జున్, జులై నెలల్లో కొత్త ప్రభుత్వం ఆధీనంలోనే టీటీడీ పని చేసింది. ఏఆర్ కంపెనీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి వస్తే నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడే అవకాశమే లేదు. అటువంటపప్పుడు అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఒక వేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబు నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడు అవుతారు కదా? ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈ సారి ఏఆర్ కంపెనీ నెయ్యి శాంపిల్స్ నే ఎందుకు ఎన్డీడీబీకి పంపించారు. ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ సమయంలో 18 సార్లు టీటీడీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా శాంపిల్స్ వేర్వేరు ప్రయోగశాలలకు పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీకి అంటగట్టడానికే ఈ సిట్ ను వేశారనే అభియోగం వస్తోంది. పోనీ సిట్ ఉన్నతాధికారి త్రిపాఠి ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగా ఉందా? అని చూస్తే.. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ విధ్వసకాండ జరిపినా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్ట్ లో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైమ్లో జరిగిన కల్తీని వైఎస్సార్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు, కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. ఉదాహరణకు రాజమండ్రిలో పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. అది కూడా చంద్రబాబు కుటుంబం స్నానాల ఘట్టం షూటింగ్ తీసే సందర్భంలో అయితే ,ఆయన నియమించిన విచారణ కమిషన్ మాత్రం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తప్పు భక్తులది, మీడియాది ఫలానా టైమ్ మంచి ముహూర్తమని ప్రచారం చేయడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆ కమిషన్ చెప్పిందే తప్ప, చంద్రబాబు ఆ స్నానాల ఘట్టానికి వెళ్లడం తప్పని చెప్పలేకపోయింది. అంత పెద్ద ఘటనలో ఒక్క పోలీస్ కానిస్టేబుల మీద కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీ టీవీ పుటేజిని మాయం చేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తీరా మంజునాథ్ తన ఆలోచనలకు భిన్నంగా నివేదిక ఇస్తారని తెలిసిన చంద్రబాబు ఆ కమిటీ సభ్యులతో వేరే నివేదిక తెప్పించి శాసన సభలో పెట్టారు.ఇలా పలు విషయాల్లో చంద్రబాబు టైమ్ లో వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు, సుప్రీంకోర్ట్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్ గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతోటి ఇలా చేస్తుండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయనవైపే చూపెడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.ఇదీ చదవండి: Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే -
సీబీఐ దర్యాప్తు పూర్తయినా 6,900 కేసులు కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది. సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది. దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది. సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలిపింది. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
అవినీతి మరక లేకపోతే ఎందుకు భయం ?
మైసూరు: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను శుద్ధంగా ఉన్నానని వందసార్లు చెప్పిన సీఎం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడకుండా శుభ్రంగా ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ నిలదీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకి కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించారని, ఈడీ రంగంలోకి దిగగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నారన్నారు. పెట్రోల్ బంకులతో పాటు వివిధ వనరుల నుంచి రాష్ట్రానికి చెందిన డబ్బు తెలంగాణ ఎన్నికలకు తరలించారన్నారు. వాల్మీకి కుంభకోణం గురించి సీఎంకు చాలా సమాచారం ఇచ్చానని, అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్.అశోక్ మండిపడ్డారు. ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా జేడీఎస్తో కలిసి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ముడా కుంభకోణంపై మీ సొంత పార్టీ అధ్యక్షుడు మరిగౌడ ఈడీ అధికారులకు లేఖ రాశారు కదా అని గుర్తు చేశారు. అలా అయితే మీ పార్టీ నేత అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. జనాందోళన సభకు కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అశోక్ విమర్శించారు. -
ఐదేళ్లు... 65 పేపర్ల లీకులు
సాక్షి, అమరావతి : దేశంలో ప్రశ్నపత్రాల లీకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు.. దానిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కోసం నిర్వహించే పోటీ పరీక్షలు.. వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు, వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ప్రశ్నపత్రాలు లీకులు అమాంతంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఏకంగా 65 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం గమనార్హం. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకుల వివరాలివీ..» 2019–24 మధ్య దేశంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించి 65 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిలో సైన్యంలో నియామకాల కోసం నిర్వహించిన ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2021, ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ)–2023, నీట్–యూజీ–2021, జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2021 ప్రధానమైవి. » ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్లలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.» ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించిన 17 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి. » మొత్తం మీద గత ఐదేళ్లలో ఇలా 65 రకాల ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. వాటిలో 27 పరీక్షలను రద్దుచేయడంగానీ వాయిదా వేయడంగానీ చేశారు. » అలాగే, గత ఐదేళ్లలో 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎనిమిది ప్రశ్నపత్రాలు, బిహార్లో ఆరు లీకయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్లలో నాలుగు చొప్పున.. హరియాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్లలో మూడేసి ప్రశ్నాపత్రాలు.. తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్లలో రెండేసి ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. జమ్మూ–కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్లలో ఒక్కో ప్రశ్నపత్రం లీకైంది. శభాష్ ఏపీవైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనత ఇదీ..2019–24 మధ్య కాలంలో పోటీ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా విఫలమైనప్పటికీ ఏపీకు మాత్రం ఆ మరక అంటలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. ఏకంగా ఒకేసారి 1.50 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, 6,500 మంది పోలీసుల నియామక పరీక్ష, గ్రూప్–1, గ్రూప్–2 తదితర ప్రవేశ పరీక్షలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. -
నీట్ అవకతవకలపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత
-
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్తో పాటు బక్క జడ్సన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి. ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్కు అప్పగిస్తూ సేల్డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్చిట్
సాక్షి, అమరావతి: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చిచెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. మంత్రి కాకాణి ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈమేరకు విజయవాడలోని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్– మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో సీఐబీ దాఖలు చేసిన చార్జ్షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ... నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో 2022 ఏప్రిల్ 13వతేదీ రాత్రి కొందరు ఆగంతకులు దొంగతనానికి పాల్పడిఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు పలు పత్రాలను అపహరించారు. దీనిపై మర్నాడు కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజాలను అరెస్ట్ చేసి వారి నుంచి ల్యాప్టాప్, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్కు పంపారు. ఈ ఉదంతంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఆధారాలను గల్లంతు చేసేందుకు చోరీకి పురిగొల్పారని అభాండాలు వేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కాకాణి దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐబీ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపింది. రెండేళ్లపాటు దర్యాప్తు చేసి 88 మంది సాక్షులను విచారించి రూపొందించిన 403 పేజీల చార్జ్షీట్ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంతో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ నిర్ధారించింది. ఏపీ పోలీసులు ఈ కేసును సక్రమంగానే విచారించారని స్పష్టం చేసింది. చార్జ్షీట్లో సీబీఐ ప్రధానంగా పేర్కొన్న అంశాలివీ.. కాకాణికి సంబంధం లేదు... నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి కాకాణి, ఆయన పీఏలు, సన్నిహితుల ఫోన్ కాల్స్ డేటాను సీబీఐ విశ్లేషించింది. న్యాయస్థానం సిబ్బందితోగానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వారితోగానీ, దర్యాప్తు అధికారులతోగానీ మంత్రి కాకాణి, ఆయన అనుచరులు ఫోన్లో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్ల గురించి అతి స్వల్ప వ్యవధి కాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్తో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధాలు లేవన్నది నిర్ధారణ అయింది. నిందితుల నుంచి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను ఎవరూ ట్యాంపర్ చేయలేదని తిరువనంతపురంలోని సీ–డాక్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దొంగతనాలే ప్రవృత్తి.. ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూలే నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిద్దరిపై 15 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు కేసుల్లో శిక్ష పడగా మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన నిందితులిద్దరూ దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు. నిందితుల భార్యలు కూడా వారికి దూరంగా ఉంటున్నారు. నిందితులు తమ తల్లుల ఫోన్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వారిద్దరే నెల్లూరు న్యాయస్థానంలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ల్యాప్టాప్, ట్యాబ్, మొబైల్ ఫోన్లను తస్కరించి మిగిలిన పత్రాలను సమీపంలోని కాలువలో పారేశారు. తాము అపహరించిన వస్తువులు మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కేసుకు సంబంధించినవి అనే విషయం నిందితులకు తెలియదు. పోలీసులు వారిద్దరి నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలువలో పారేసిన రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంపు, స్టాంప్ ప్యాడ్లు మాత్రం లభ్యం కాలేదు. సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఐబీ తేల్చి చెప్పింది. ఆయన చేసిన 14 ఆరోపణలను విడివిడిగా ప్రస్తావిస్తూ అవన్నీ నిరాధారణమని పేర్కొంది. నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, ఖాజా రసూలపై విచారణ కొనసాగించాలని సీఐబీ పేర్కొంది. సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? పారదర్శకంగా నెల్లూరు పోలీసుల విచారణ: మంత్రి కాకాణి నెల్లూరు(సెంట్రల్): కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ ఘటన చోటు చేసుకుందని, ఈ కేసును విచారించిన ఎస్పీ విజయారావు పూర్తి వివరాలను వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనపై బురద చల్లేందుకు దీన్ని తనకు ఆపాదిస్తూ ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఏడాదిపాటు క్షుణ్నంగా విచారించిన సీబీఐ అధికారులు 88 మందిని విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారని చెప్పారు. ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలి తనకు సంబంధం లేని ఫైల్స్ చోరీ కేసులో చంద్రబాబు తనపై నిందలు వేశారని, లోకేశ్ కూడా కోర్టు దొంగ అంటూ తనపై నిందలు మోపారని, ప్రజలు నాలుగుసార్లు తిరస్కరించిన సోమిరెడ్డి తనపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాకాణి పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో ఆ ముగ్గురు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీపీఐ రామకృష్ణ కూడా విమర్శలు చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ లోకేశ్ పలు దఫాలు విమర్శలు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించారనేందుకు ఈ కేసే ఉదాహరణ అని తెలిపారు. బాబు కుమ్మక్కు రాజకీయాలు నిజం గెలవాలంటూ పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నిజంగానే అలా కోరుకుంటుంటే చంద్రబాబుపై ఉన్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే నిజం గెలుస్తుందని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని మంత్రి సవాల్ విసిరారు. తనకు అనుభవం ఉందంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్తో రాజకీయంగా తలపడలేక కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు. గురువారం ఆమె రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని చెప్పారు. మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. -
డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి
బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. 2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది. రాజకీయ దురుద్దేశంతోనే: డీకే రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు. -
‘స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాగా, ఉండవల్లి అరుణ్కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్ స్కామ్లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ ప్రాజెక్ట్తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. బెయిల్పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్ స్కామ్లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పుంగనూరు ఘటన: సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని బాబు బిల్డప్పు
-
వివేకా హత్య కేసులో విస్మయం కలిగిస్తున్న సీబీఐ దర్యాప్తు
-
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్సింగ్కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్షీట్లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్లో మొదటి చార్జ్షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్షీట్లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్షీట్లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అవినాశ్రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డి కారణం. అవినాశ్రెడ్డి అనుచరుడు డి.శివశంకర్రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివ శంకర్రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ
-
వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక ఇలాటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఓ వర్గం మీడియా తమ సొంత అజెండాతో దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలి. టీవీ ఛానళ్ల డిబేట్లలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజాయితీపరులపై అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జగన్దే తుది నిర్ణయం వైఎస్ జగన్ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్ ఆహ్వానించారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్దే తుదినిర్ణయం. ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనేది జగన్ ఇష్టం. వివేకా హత్య కేసు విషయంలో రాజకీయం కోణం ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరిని అడిగిన ఆ విషయం చెప్తారు. ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు లేఖను దాచిపెట్టాలని వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి చెప్పారు. కేవలం ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వివేకా హత్య వెనక ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో దర్యాప్తు జరపడం లేదు. కీలక అంశాలపై సీబీఐ విచారణ చేపట్టలేదు. టీడీపీకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ప్రతికూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం ఓడినట్టా? చివరకు న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది. -
అవినాశ్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్ పిటిషన్పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్ విచారించినప్పటికీ వెకేషన్ బెంచ్ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు (జూన్ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్ 5కు వాయిదా వేసిందని, మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్ తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్ రాలేదని, జూన్ 5న మేటర్ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు వెకేషన్ బెంచ్ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు. Justice Narasimha: He has the right to... Mr. Luthra you can take all these objections when the anticipatory bail is taken up by vacation bench. — Live Law (@LiveLawIndia) May 23, 2023 Bench: ...We are inclined to accept the prayer as the anticipatory bail taken up for hearing pursuant to our order was heard, but no order was passed...We direct the Criminal LP...will be placed before next vacation bench on 25.05.2023... — Live Law (@LiveLawIndia) May 23, 2023 ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? -
అవినాష్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, గుంటూరు: వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అవినాష్రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారాయన. శుక్రవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ హైదరాబాద్కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో కూడిన ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నాయి. గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. అవినాష్రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి అవినాష్పై అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల ఆరోపించారు. అసలు హంతకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ విచారణకు హాజరయ్యారు. తల్లికి అనారోగ్యం అని క్రియేట్ చేసుకుని.. విచారణకు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. కానీ, నిందితుడు, గూగుల్ టేకౌట్ అని రకరకాల పేర్లతో సీబీఐ హడావిడి చేస్తోంది. అయిదు సార్లు విచారణకు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు వెళ్లడు?. ఒకవేళ తీవ్రపరిణామాలు ఎదురైనా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లికి బాగలేదని సీబీఐకి చెప్పి మరీ వెళ్లాడు. సీబీఐ ఎదుటకు రేపు అయినా వెళ్లాల్సిందేగా?. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నేరుగా సెటిల్మెంట్ చేస్తున్నాడు. కానీ, ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు అని సజ్జల ఆక్షేపించారు. ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని కూడా వివేకా కేసులో సీబీఐ పిలవగానే విచారణకు వెళ్లారు. అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒక ఎంపీపై బురద జల్లడం సబబు కాదు. వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే.. అప్పట్లో చంద్రబాబు ఊరుకునేవారా?. వాస్తవాలు బయటకు రావాలనే సీబీఐ విచారణ చేస్తున్నా మేం అభ్యంతరం పెట్టలేదు. కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదు అని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: అవినాష్రెడ్డి తల్లికి సీరియస్ -
దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట..
నేను సీబీఐ ఎస్పీకి చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించడం దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్ జగన్ నాతో అన్నారని నేను సీబీఐకి వెల్లడించినట్లు వెలువడ్డ కథనం పచ్చి అబద్ధం. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, హత్య కేసుకు సంబంధం ముడిపెడుతూ కథనాలను ప్రచురించటాన్ని బట్టి ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు వైఎస్ జగన్ తనకు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త పచ్చి అబద్ధమని అజేయ కల్లం ఖండించారు. అంతకుముందే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, అందులో పాల్గొన్న వారిని విచారించాలంటూ గతంలో ఓ కథనం వెలువరించిందని, అందులో భాగంగానే మళ్లీ పచ్చి అబద్ధాలను ప్రచురించిందన్నారు. ఏదో ఒకవిధంగా ముఖ్యమంత్రి జగన్ పేరును లాగాలనే ప్రయత్నం మినహా ఆంధ్రజ్యోతి కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాలంటూ తప్పుడు సమాచారంతో ఆ పత్రిక విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. సీబీఐ తనను విచారించిందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి సమాచారం తీసుకున్నారని, ఆ సమయంలో గుండెపోటు అంశం చర్చకే రాలేదని, దాని గురించి అడగలేదని అజేయ కల్లం వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన రోజు యాధృచ్ఛికంగా పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. తమకు కాలేజీలో పాఠాలు బోధించిన గురువు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేనిఫెస్టో రూపకల్పనలో సహాయం చేయాలని కోరడంతో సమాశానికి వెళ్లానని అజేయ కల్లం తెలిపారు. సమావేశం జరుగుతుండగా కొంతసేపటికి ‘వివేకానందరెడ్డి గారు నో మోర్..’ అని ఇంగ్లీషులో చెప్పడంతో ఇక లేచి వచ్చేశామన్నారు. అదే విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పానన్నారు. ‘మీరు స్వచ్ఛందంగా అంగీకరిస్తే రికార్డు చేసుకుంటామని సీబీఐ ఎస్పీ కోరారు. సెక్షన్ 161 కింద సమాచారాన్ని అడిగారు. అయితే ఆ సమాచారం, రికార్డుకు ఎటువంటి న్యాయపరమైన విలువ ఉండదు. సంతకాలు తీసుకోలేదు’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ‘సాంకేతికంగా ఎటువంటి విలువ ఉండదు. ఎవిడెన్స్గా పనికిరాదు. ఆ సెక్షన్ కింద కొన్ని అంశాలు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు తొలగించవచ్చు’ అని కల్లం తెలిపారు. గుండెపోటు మాటే చర్చకు రాలేదు.. అసలు గుండె పోటు అనే పదమే సీబీఐ ఎస్పీని కలుసుకున్న సందర్భంగా చర్చకు రాలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో రహస్యంగా ఉండాల్సిన తమ ఇద్దరి సంభాషణ సమాచారం లీకుల పేరుతో ఆంధ్రజ్యోతిలో రావడం అంటే సీబీఐ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నట్లేనని పేర్కొన్నారు. ఇది సీబీఐ పేరును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సీబీఐ ముందుకొచ్చి ఇలాంటి లీకు వార్తలను నిరోధించడంతో పాటు ఖండించాల్సి ఉందన్నారు. ‘మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆ పనిమీద దృష్టి పెడతాం కానీ గడియారం చూసుకుంటూ కూర్చోం కదా! ఎవరు ఎప్పుడు బయటకు వెళ్లారో ఎలా తెలుస్తుంది? అయినా ఈ సమావేశాన్ని సీరియస్ మర్డర్ కేసుకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి తనకు కావాల్సినట్లు రాసుకోవడం కంటే అనైతికం మరొకటి ఉండదు..’ అని కల్లాం మండిపడ్డారు. ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది తన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చార్జిషీటు వేసేవరకు రహస్యంగా ఉండాలని, లీకుల పేరుతో తప్పుడు సమాచారం మీడియాలో ప్రచురితమైనందున ఆ వార్తను ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని కల్లాం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మీడియాలో సమాంతర దర్యాప్తు జరగకూడదని, ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు మీడియాకు వివరాలు వెల్లడించరాదని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కల్లాం ప్రస్తావించారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా అందుబాటులో లేని సమాచారాన్ని మీడియాలో లీకుల పేరుతో ప్రచురించకూడదన్నారు. నా భార్యకు కూడా తెలియదు.. ‘దర్యాప్తు అంశాలను ఇష్టానుసారం ప్రచురించేందుకు, మీడియా తమ ఇష్టం అనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పులున్నాయి. కనీస క్రమశిక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీడియాకు అవసరం. నేను సీబీఐ ఎస్పీకి చెప్పని అంశాలను చెప్పినట్లుగా నా ఫొటోతో పెద్ద శీర్షిక పెట్టి కథనాలు ప్రచురించటాన్ని బట్టి ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. ఆ సమయంలో నేను, సీబీఐ ఎస్పీ మాత్రమే ఉన్నాం. మా ఇంటికి సీబీఐ ఎస్పీ వచ్చిన విషయం నా భార్యకు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త ప్రచురించిన తరువాతే మిగతా వారికి తెలిసింది’ అని కల్లాం తెలిపారు. ‘సెక్షన్ 161 కింద ఇచ్చిన సమాచారానికి ఎటువంటి న్యాయపరమైన విలువ లేదు. అయినా సాక్షిగా కూడా కాదు. తప్పుడు వార్తపై తగిన సమయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు. సమాంతర విచారణ తగదు.. ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు దానికి సమాంతరంగా విచారణను ప్రభావితం చేసేలా మీడియా కథనాలను రాయకూడదు, చర్చలు పెట్టకూడదు. దర్యాప్తు సమయంలో విచారణాధికారికి సాక్షులు వెల్లడించిన అంశాలను చార్జిషీట్ వేసేవరకు బహిర్గతం చేయకూడదు. విచారణలో వెల్లడైన అంశాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రచురిస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లేనని పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్వాగతించింది’ అని పేర్కొంటూ ఈ సందర్భంగా అజేయ కల్లం వాటిని ఉదహరించారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. వివేకా హత్య కేసులో స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసింది. సుమారు 3 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. రెండోసారి సీబీఐ విచారణకు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు -
దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత బోగస్ అనేది బట్టబయలైంది. ఆ చార్జ్షీట్ ఎంత కల్పితాల కట్టుకథో స్పష్టమైంది. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఇప్పించిన అవాస్తవ వాంగ్మూలం బండారం బహిర్గతమైంది. వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న బెంగళూరు భూ సెటిల్మెంట్ వ్యవహారం పూర్తిగా ఫేక్ అని సీబీఐ దర్యాప్తులోనే నిర్ధారణ కావడం గమనార్హం. వివేకాతో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి వివాదాలున్నాయని ఓ కట్టుకథను కేంద్ర బిందువుగా చేసుకుని దాన్ని వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డితో అంటగడుతూ దస్తగిరి ద్వారా సీబీఐ నడిపించిన డ్రామా గుట్టు వీడింది. కొత్త బృందం.. పాత పాటే! ‘బెంగళూరు భూసెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డికి వాటా ఇవ్వకుండా వైఎస్ వివేకా ఎగ్గొట్టారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి కక్ష పెంచుకుని వివేకాను హత్య చేయాలని నాతో చెప్పారు..!’ ఇదీ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశం. ‘వివేకాను హత్య చేసిన తరువాత ఆ ఇంట్లో భూమి పత్రాల కోసం ఎర్రగంగిరెడ్డి గాలించారు..’ అని కూడా అందులో పేర్కొన్నారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్ వివేకాను హత్య చేశామని దస్తగిరి చెప్పినట్టు వాంగ్మూలంలో ఉంది. దస్తగిరిని ఢిల్లీకి తరలించి కొద్ది వారాలపాటు చిత్రహింసలు పెట్టి మరీ ఇప్పించిన ఈ వాంగ్మూలం మినహా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారం లేదు. పాత బృందంతోపాటు తాజాగా నియమించిన సీబీఐ కొత్త బృందం కూడా ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఆ వాంగ్మూలం కట్టుకథేనని స్పష్టమైంది. డాక్యుమెంట్లు ఫేక్... సెటిల్మెంట్ ఫేక్ బెంగళూరు యలహంక ప్రాంతంలోని 8.6 ఎకరాల భూమి విషయంపై వై.రాధాకృష్ణ మూర్తి, హిమాచలపతి అనే వ్యక్తుల మధ్య విభేదాలున్నాయి. ఈ విషయం తెలిసి వైఎస్ వివేకానందరెడ్డి తన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు లక్ష్మీకర్, మరికొందరితోపాటు వై.రాధాకృష్ణమూర్తిని కలసి తాము ఆ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. భూమి వివాదం పరిష్కరిస్తే రూ.8 కోట్లు ఇస్తానని రాధాకృష్ణమూర్తి చెప్పారు. యలహంక ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కర్ణాటక హోంమంత్రి ద్వారా ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్ వివేకా ప్రయత్నించారు. ఈ క్రమంలో హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి ఆ భూ వివాదంపై చర్చించడంతో రాధాకృష్ణమూర్తి ఇచ్చిన భూమి పత్రాలు ఫోర్జరీవని తేలింది. బెడిసికొట్టిన బ్యాంకు రుణం భూమి పత్రాలు ఫోర్జరీవని తెలిసినప్పటికీ వైఎస్ వివేకా వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పీటర్ క్యాండీని సంప్రదించారు. ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం ఇప్పించాలని కోరారు. బ్యాంకు రుణం వస్తే అందులో 60 శాతం వివేకా, రాధాకృష్ణమూర్తి పంచుకోగా మిగిలిన 40 శాతాన్ని బ్రోకర్ పీటర్ క్యాండీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లీగల్ ఖర్చుల కోసం పీటర్ క్యాండీకి మల్లిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా వైఎస్ వివేకా రూ.24 లక్షలు ఇప్పించారు. అయితే ఏడాది దాటినా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకు కూడా సమ్మతించలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.24 లక్షలు తిరిగి ఇవ్వాలని వివేకా, పీటర్ క్యాండీని మల్లిశెట్టి వెంకటరమణ ఒత్తిడి చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 2019 ఫిబ్రవరి, మార్చిలో నాలుగు డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో రూ.24 లక్షలు తిరిగి చెల్లించారు. చివరి డిమాండ్ డ్రాఫ్ట్ను 2019 మార్చి 12న అంటే వివేకా హత్యకు రెండు రోజుల ముందే చెల్లించారు. పీటర్ క్యాండీ తన వద్ద ఉన్న ఫోర్జరీ పత్రాలను సైతం రాధాకృష్ణమూర్తి కుమారుడు వెంకట ప్రసాద్కు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ భూమి సెటిల్మెంట్ చేయడం, బ్యాంకు రుణం తీసుకోవడం సాధ్యం కాదని తేలడంతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు. ఈ సెటిల్మెంట్ చేసేందుకు యత్నించిన వైఎస్ వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి మొత్తం వ్యవహారం తెలుసు. అంటే బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని, భూమి పత్రాలు సైతం వివేకా వద్ద లేవని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా తెలుసు. ఇదంతా సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాధాకృష్ణమూర్తి, హిమాచలపతి, వెంకట ప్రసాద్, పీటర్ క్యాండీలను సీబీఐ అధికారులు విచారించి మరీ దీన్ని నిర్ధారించుకున్నారు. జరగని సెటిల్మెంట్.. లేని పత్రాల కోసం హత్య ఏమిటి? అసలు బెంగళూరు భూసెటిల్మెంట్ అనేది జరగలేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. అటువంటప్పుడు వైఎస్ వివేకా తనకు వాటా ఇవ్వలేదని కక్ష ఎందుకు పెంచుకుంటారు? అంటే ఈ కారణంతో వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమవుతోంది. వైఎస్ వివేకాను హత్య చేసిన తరువాత ఆయన ఇంట్లో బెంగళూరు భూమి పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, తాము గాలించినట్లు దస్తగిరి చెప్పాడు. కానీ ఆ భూమి పత్రాలను అప్పటికే రాధాకృష్ణమూర్తి కుమారుడికి తిరిగి ఇచ్చిన విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. దీన్నిబట్టి దస్తగిరి చెప్పింది అవాస్తవమే అని స్పష్టమవుతోంది. ఇక బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ కారణంతో వైఎస్ వివేకాను హత్య చేయమని చెప్పడంగానీ, తనకు అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి సహకారం ఉందనడం కూడా అవాస్తవం అని నిర్ధారణ అవుతోంది. అంటే అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం పేరిట సీబీఐ పూర్తిగా కల్పిత కథనాలను అల్లినట్లు తేలిపోతోంది. అసలు ఆ వాంగ్మూలమే అవాస్తవం అయినప్పుడు దాని ఆధారంగా భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డిని విచారణ పేరిట సీబీఐ వేధించడం దురుద్దేశపూరితమేని స్పష్టమవుతోంది. -
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు
పులివెందుల: విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి శనివారం తనను విచారణకు పిలిచినట్లు కొన్ని వార్తా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని ఖండించారు. గతంలో నోటీసు ఇవ్వడానికి సీబీఐ అధికారులు వచ్చినప్పుడు తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈనెల 24 తర్వాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని తెలిపారు. ఆ తర్వాత తనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. -
సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా
-
సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. నిజాన్ని వెలికితీసే కోణంలో కాకుండా, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందన్న భావన కలుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్లాలని చెబుతున్నానే తప్ప అనుమానించడం లేదని స్పష్టం చేశారు. మీడియా సైతం ఈ విషయంలో నిజాలను నిజాలుగా చూపాలని కోరారు. తనకు తెలిసిన అన్ని నిజాలను పొందుపరుస్తూ సీబీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చానని, అందులోని అంశాలపైనా విచారణ జరగాలని కోరినట్టు తెలిపారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. జనవరి 28న విచారణకు కొనసాగింపుగా శుక్రవారం రెండోసారి సీబీఐ అధికారుల విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో విచారణప్పుడు మరోమారు పిలుస్తామని చెప్పారని, ఈసారి మాత్రం మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎంపీ ఇంకా ఏమన్నారంటే.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని మనవి చేస్తున్నా. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి, ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు సబబు? నేను దుబాయ్కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారు. ► తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దానిపై గంటల తరబడి, రోజులపాటు చర్చలు పెడుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలి. మీడియానే ట్రయల్ పూర్తి చేసి..దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ణయిస్తోంది. ఇది విచారణపై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసే ప్రయత్నం జరుగుతోంది. ► ముందు నుంచి కూడా ఫ్యాక్ట్ టార్గెట్గా కంటే పర్సన్ టార్గెట్గా విచారణ జరగడం సరికాదు. గూగుల్ టేకౌట్ అన్నది నిజమైన గూగుల్ టేకౌటా.. టీడీపీ టేకౌటా అన్నది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. సీబీఐ సమర్పించిన కౌంటర్లోని విషయాలన్నీ ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలే. అందువల్ల ఎవరికైనా సందేహాలు రావడం సహజం. ఈ పరిస్థితిలో విచారణ సరైన కోణంలో వెళ్లాలని చెబుతున్నాను తప్ప.. నేను అనుమానించడం లేదు. ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా ► వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడాను. మళ్లీ రెండు రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో.. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. సీబీఐ వాళ్లకు అదే చెబుతున్నా. ఎవరెన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెబుతా. ఎందుకంటే నాకు తెలిసిన నిజం అదే కాబట్టి. ► ఆ రోజు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా. సీబీఐ వారి ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. ► వివేకం సార్ చనిపోయిన రోజు సీన్ ఆఫ్ క్రైంకి నేను వెళ్లేటప్పటికే అక్కడ ఒక లెటర్ ఉంది. కానీ, ఆ లెటర్ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అది హత్య అని స్పష్టంగా ఉంది. అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను చెప్పడం కంటే భవిష్యత్తులో అవన్నీ బయటికి వస్తాయి. ► ఇంతకు ముందు అడిగినట్టే అడ్వొకేట్ సమక్షంలో ప్రశ్నించాలని, అన్ని విషయాలు ఆడియో.. వీడియో రికార్డింగ్ చేయాలని ఇప్పుడు కూడా కోరాం. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కూడా లెటర్ పెట్టాం. కానీ అది జరగలేదు. అయితే ఒక ల్యాప్టాప్ను మాత్రం నా ముందు ఉంచారు. అది ఎందుకోసం అన్నది నాకు తెలియదు. -
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
ముగిసిన ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్కు వచ్చిన అవినాష్రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. సీబీఐ కౌంటర్కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. నేను వెళ్లే సమయానికి లెటర్ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అనేక విషయాలు ఉన్నాయి. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్లో వస్తున్నాయంటే.. గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు. నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల ఎర కేసు.. కీలకంగా సుప్రీం విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నతన్యాయస్థానం దర్యాప్తు చేపట్టమని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేందుకు రెడీ కూడా అయ్యింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందనా, సహకరం రెండూ లేవు. పైగా కోర్టును ఆశ్రయించుకుంటూ పోతోంది. ఈ తరుణంలో.. సుప్రీం కోర్టు విచారణపైనే సీబీఐ దర్యాప్తు ఆధారపడనుంది. ఎమ్మెల్యేల ఎర కేసులో రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ కీలకం కానుంది. సుప్రీం విచారణ తర్వాత కేసు నమోదుపై సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖ కూడా రాసింది దర్యాప్తు సంస్థ. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీం విచారణ, ఆదేశాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
వివేకా కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరగాల్సిందే!
సాక్షి, ఢిల్లీ: వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యను సీబీఐ ఒక కోణంలోని ఎందుకు దర్యాప్తు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానంద హత్య జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆ టైంలో ఆయన(చంద్రబాబు నాయుడు) ఎందుకు క్రైమ్ సీను కాపాడలేకపోయారు?. ఎందుకు వివేకానంద రెడ్డి డెడ్ బాడీని మూవ్ చేశారు? ఎందుకు హడావుడిగా పోస్టుమార్టం చేయించారు? నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఎందుకు సీజ్ చేయలేదు?. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించలేదు? చంద్రబాబును ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు? అని ప్రశ్నల వర్షం గుప్పించారు కేఏ పాల్. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీరు లేదంటే మీ నాయకులే ఈ పని చేయించారా?. 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలని చూశారా? అని అనుమానాలు వ్యక్తం చేశారాయన. అలాగే.. సీబీఐ దర్యాప్తు కరెక్ట్ యాంగిల్ లో జరిగే వరకు ఊరుకోను అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అవకతవకలకు ప్రయత్నాలూ చేశారని టీడీపీ అధినేతపై కేఏ పాల్ మండిపడ్డారు. ‘మళ్లీ మీ ఓటు బ్యాంకు పెరగాలని చూశారు. నా బీఫాం వాడుకొని 38 మందిని నిలబెట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లను ప్రజాశాంతి పేరు మీద చంద్ర బాబు అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు కేఏ పాల్. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ
అశ్వాపురం: కాంగ్రెస్ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలని పీఎం, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్, చీఫ్ సెక్రటరీకి, మొయినాబాద్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. మొయినాబాద్ పోలీసులు ఇచ్చే నివేదిక, తమ ఫిర్యాదు ఫైల్ను సీబీఐకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఒత్తిడికి లొంగి సీబీఐకి కేసు సమాచారం ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలతో పాటు పార్టీ ఫిరాయింపులే పనిగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్పై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఎం, కేంద్ర హోం మంత్రి, సీబీఐ డైరెక్టర్కు లేఖలు రాయాలని కోరారు. లేదంటే కేసీఆర్తో వారు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ మంగళవారం ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తు తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు (పిటిషన్ను విచారణకు స్వీకరించే వరకు) స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం మెరిట్స్లోకి వెళ్లలేదు కాబట్టి తమ లంచ్మోషన్ పిటిషన్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చని జస్టిస్ విజయ్సేన్రెడ్డి ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు. సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. ఇప్పటికే సీబీఐ జేడీ ఫైళ్లు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని, సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలని కోరారు. ఈ కేసులో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సింగిల్ జడ్జి తీర్పు తర్వాత దర్యాప్తు కోసం సీబీఐ ప్రభుత్వంపై ఒత్తిడి చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంచేసిందని ఏజీ బదులిచ్చారు. ద్విసభ్య ధర్మాసనం అప్పీల్లోని మెరిట్స్ ఆధారంగా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అప్పీల్కు విచారణార్హత లేదని తేల్చినందున సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చన్నారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాక స్టే కోసం సింగిల్ జడ్జి వద్దకు ప్రభుత్వం రావడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదని, సింగిల్ జడ్జి స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని వాదించారు. సింగిల్ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే సింగిల్ జడ్జి వద్దకు స్టే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు ఆదేశాలను నిలుపుదల చేయడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు చేయాలని భావించడమూ అత్యుత్సాహం కిందకే వస్తుందని చెప్పారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్సేన్రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. బుధవారం సీజే బెంచ్ వద్ద స్పష్టత తీసుకుని చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. -
ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరాము. మా విజ్ఞప్తిని సీబీఐ అధికారులు అంగీకరించలేదు. వాస్తవాలను ఒక సెక్షన్ మీడియా వక్రీకరిస్తోంది. విచారణను ఒక మీడియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్రెడ్డిని సాక్షిగా విచారించే క్రమంలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్సింగ్ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. -
సీబీఐ దాడులకు నేను భయపడను : కవిత
-
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తే విచారణ జరపొద్దా..? : బండి సంజయ్
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: రాజస్తాన్లో కరౌలీ జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెహందీపూర్ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎస్బీఐ మెహందీపూర్ బ్రాంచ్లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
-
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై హైకోర్టు తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసు డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా కోర్టులో చోరీపై నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ పిల్పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు మేలని పీడీజే నివేదికలో అభిప్రాయపడ్డారని గుర్తు చేసింది. కాకాణి గోవర్ధన్రెడ్డి తరఫు న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు తమకూ అభ్యంతరం లేదన్నారు. కోర్టు ఆదేశిస్తే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. సీబీఐ తరఫున జూనియర్ న్యాయవాది అలేఖ్య స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సైతం సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మీరెలా ఈ విషయం చెబుతారని ప్రశ్నించింది. కోర్టు ముందున్న రికార్డుల ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి అభ్యంతరం లేదని అశ్వనీ కుమార్ చెప్పారు. దీనిని ధర్మాసనం రికార్డ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
సుపారీ కథ.. సూపర్ కదా!
సాక్షి, అమరావతి: చేతిలో కోటి రూపాయలున్న వ్యక్తి.. ఐదొందల కోసం అడుక్కుంటాడా..? ఏమైనా నమ్మశక్యంగా ఉందా...? కోట్లుంటే.. కాళ్ల బేరమెందుకు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇలానే ఉంది మరి...! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు రూ.40 కోట్లకు సుపారీ కుదిరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కుట్రలో పాలు పంచుకున్న నిందితుడు దస్తగిరికి నెల రోజుల ముందే రూ.కోటి అడ్వాన్స్ అందినట్లు దర్యాప్తులో తేలిందని చార్జ్షీట్ నమోదు చేసింది. అయితే రూ.కోటి ముట్టాయని సీబీఐ చెబుతున్న దస్తగిరి హత్యకు ఒక రోజు ముందుదాకా అప్పుల కోసం నానా తిప్పలు పడినట్లు వెలుగులోకి వచ్చింది. 2019 ఫిబ్రవరి 10 నుంచి వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 మధ్య నిందితులు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన కొన్ని వందల వాట్సాప్ చాటింగ్ల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. రూ.20 వేలు.. కాదు కాదు.. కనీసం రూ.వెయ్యి... అదీ వద్దు... ఖర్చులకు రూ.500 చాలంటూ సునీల్ యాదవ్ను పలుమార్లు దస్తగిరి ప్రాథేయపడటం గమనార్హం. దీంతో వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదిరినట్లు సీబీఐ చెబుతుండటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిందితుడినే అప్రూవర్గా మార్చి వాంగ్మూలం.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి వాంగ్మూలం కేంద్రంగా సీబీఐ దర్యాప్తు తతంగాన్ని నడిపిస్తోంది. దస్తగిరిని ఢిల్లీ తీసుకెళ్లి తమ ‘అతిథి’గా చాలా రోజులు మర్యాదలు చేసి మరీ అప్రూవర్గా మార్చి వాంగ్మూలం ఇప్పించింది. హత్య చేశానని స్వయంగా చెప్పిన దస్తగిరిని అప్రూవర్గా మార్చడం, బెయిల్ పిటిషన్ను గట్టిగా వ్యతిరేకించకపోవడంతో సీబీఐ తీరుపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. సీబీఐ చార్జిషీట్, దస్తగిరి వాంగ్మూలంలో అంశాలివీ.. వైఎస్ వివేకా హత్య కోసం 2019 ఫిబ్రవరి 10న రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిలతో కలసి హత్యకు పన్నాగం పన్నాడు. వివేకాను హత్య చేస్తే డి.శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగతా ముగ్గురు నిందితులకు చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి ఆ తరువాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చాడు. ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ కూడా చెరో రూ.కోటి తీసుకున్నారు. దస్తగిరి తనకు అందిన రూ.కోటిలో రూ.46.70 లక్షలను మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచాడు. మున్నా వద్ద దాచిన మొత్తాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. తాపీగా రెండేళ్ల తరువాత... హత్యకు పథకం వేసిన నాలుగు రోజులకే.. అంటే 2019 ఫిబ్రవరి 10 తరువాత దస్తగిరి వద్ద రూ.కోటి ఉన్నాయని సీబీఐ చెబుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురికాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ 2020 జూలై 9న చేపట్టింది. 2021 నవంబరు 13న దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ తరువాత పలువురిని విచారించిన అనంతరం అంటే వివేకా హత్యకు గురైన దాదాపు రెండేళ్ల తరువాత సీబీఐ అధికారులు మున్నా వద్దకు వెళ్లి మరీ ఆ రూ.46.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారట..! ఏమైనా లాజిక్ ఉందా...? వైఎస్ వివేకా హత్య కుట్రలో భాగస్వాములుగా సీబీఐ పేర్కొన్న సునీల్ యాదవ్, దస్తగిరి మధ్య 2019 ఫిబ్రవరి, మార్చిలో కొన్ని వందల సార్లు వాట్సాప్ చాటింగ్ జరిగింది. అప్పు కోసం దస్తగిరి అందులో పలుమార్లు దీనంగా వేడుకున్నాడు. ఎంతగా అంటే కనీసం రూ.500 ఇవ్వాలని ప్రాథేయపడటం గమనార్హం. వివేకా హత్యకు ముందు రోజు కూడా అప్పు ఇవ్వాలని దస్తగిరి కోరాడు. మరి దస్తగిరి చేతిలో రూ.కోటి ఉంటే ఇలా రూ.వెయ్యి... రూ.500 కోసం ఎందుకలా వేడుకుంటాడు? సీబీఐ చెబుతున్నట్లుగా ఇద్దరి వద్దా చెరో రూ.కోటి ఉంటే ఇలా అడగాల్సిన పనేమిటి? దస్తగిరి వద్ద డబ్బులు లేవంటే.. సుపారీ కింద రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందన్న అభియోగాల్లో నిజం ఉందా? సుపారీ కథ సూపర్..! సునీల్ యాదవ్తో దస్తగిరి జరిపిన వాట్సాప్ చాటింగ్ చూస్తే సీబీఐ చెప్పిన విషయాలపై పలు అనుమానాలు తలెత్తక మానవు. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీతో ఒప్పందం కుదిరిందని... అది డి.శివశంకర్రెడ్డి ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులకు చెప్పినట్లు సీబీఐ చార్జ్షీట్లో పేర్కొనడం కట్టుకథేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దస్తగిరి వాట్సాప్ చాటింగ్ ద్వారా అతడి వద్ద డబ్బులు లేవన్నది స్పష్టమవుతోంది. మరి అతడి వద్ద రూ.కోటి లేవంటే... రూ.40 కోట్ల సుపారీ కథ కట్టుకథేనా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు దోషులను గుర్తించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ హయాంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథ ఉచ్చులో సీబీఐ చిక్కుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సునీల్ యాదవ్కు దస్తగిరి పంపిన వాట్సాప్ సందేశాల్లో ముఖ్యమైనవి.. 2019 ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12.07 గంటలకు.. ‘అన్నా... ఒక రూ.వెయ్యి ఇస్తావా. ఖర్చులకు లేవు అన్నా. ప్లీజ్ డబ్బులివ్వు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.32 గంటలకు.. ‘అక్కడ అనంతపురం వాడు ఫోన్ చేస్తున్నాడు. ఏం అన్నా... నువ్వు మనిషినే పట్టించుకోవు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.33 గంటలకు.. ‘ఏంటన్నా... నేను చనిపోయాక డబ్బులిస్తావా... ఏంటి అన్నా...’ 2019 మార్చి 3 ఉదయం 7.22 గంటలకు.. ‘పులివెందుల వచ్చానంటావు... మళ్లీ రాలేదంటావు. ఏందన్నా... రూ.20 వేలు అడిగితే ఈ రోజు.. రేపు అంటూ టైమ్ చెబుతావు. ఏంది అన్నా?’ 2019 మార్చి 3 ఉదయం 10.18 గంటలకు.. ‘అన్నా నేను అప్పుల వాళ్లతో అనిపించుకోలేను. నాకు అవసరం లేదు. నేను అప్పు తెచ్చాను కదా. అప్పు కట్టు అన్నా’ 2019 మార్చి 14 మధ్యాహ్నం 12.24 గంటలకు.. (వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందురోజు) ‘రూ.30 వేలు కూడా అవసరం లేదన్నా... నాకు రూ.19 వేలు ఇచ్చినా సరిపోతుంది. ‘ఇతియోస్’కు రూ.14,500.. స్కార్పియోకు రూ.4,500 ఇవ్వాలి. నాకు రూ.500 మిగులుతుంది. అవి నేను ఖర్చుకు ఉంచుకుంటా’ -
దారి తప్పిన దర్యాప్తు
► హతుడు ఏమైనా లేఖ రాశారా...? సెల్ఫోన్ ఎక్కడ ఉంది...? ► ఎక్కడైనా హత్యగానీ ఆత్మహత్యగానీ జరిగితే పోలీసులు, దర్యాప్తు అధికారులు వెంటనే దృష్టిసారించే అంశాలు ఇవీ. ► లేఖ, సెల్ఫోన్లను స్వాధీనం చేయకపోతే దానివెనుక కుట్ర కోణం ఏమై ఉంటుంది...? ► హత్యాస్థలిలో ఆధారాలు తుడిచివేయాలని ఎవరైనా ఆదేశిస్తే... కారణాలు ఏమై ఉంటాయి? ► ఇక గతానికి భిన్నంగా స్వరం మార్చి ఆరోపణలు చేస్తుంటే దాని వెనుక ఏమైనా ప్రలోభాలు, ఒత్తిళ్లు దాగి ఉన్నాయా? ► ఒక కేసు దర్యాప్తులో ప్రాథమికంగా దృష్టి సారించే కీలక అంశాలు ఇవీ. – సాక్షి, అమరావతి దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చిన్న లాజిక్లను ఉద్దేశపూర్వకంగానే ఉపేక్షించడం విస్మయపరుస్తోంది. సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలను విస్మరించడంతో సీబీఐ దర్యాప్తు దారితప్పింది. టీడీపీ నేతల రాజకీయ కోణంలో సాగుతూ ఏకపక్ష దర్యాప్తుతో కేసును తప్పుదారి పట్టిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సహజ మరణం కాదని అప్పుడే తెలిసినా.. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారని 2019 మార్చి 15న ఉదయం మొదట ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖ, సెల్ఫోన్లను ఆయనే స్వాధీనం చేసుకున్నారు. సహజంగానే ఆ లేఖను ఆయనే తొలుత చదివి ఉంటారు. తనపై డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా దాడి చేశాడని ఆ లేఖలో వివేకానందరెడ్డి రాసినట్టుగా ఉంది. అంటే వివేకాది సహజ మరణం కాదు... ఎవరో దాడి చేశారని అప్పుడే స్పష్టమైంది. ఆ లేఖ, సెల్ఫోన్ విషయాన్ని కృష్ణారెడ్డి వెంటనే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశారు. అయితే తాము వచ్చే వరకు వాటి గురించి ఎవరికీ చెప్పొద్దని రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు ఆదేశించారు. దీంతో కృష్ణారెడ్డి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీ అవినాష్రెడ్డికిగానీ ఇతరులకుగానీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఎందుకా గోప్యత? ఆ లేఖ గురించి అప్పుడు చెప్పి ఉంటే వివేకానందరెడ్డిని ఎవరో హత్యచేశారని వెంటనే స్పష్టత వచ్చే ది. పోలీసులకూ చెప్పేవారు. మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు తీసుకురాకుండా, రక్తపు మరకలు తుడవకుండా అడ్డుకునేవారు. కానీ ఆ లే ఖ, సెల్ఫోన్ విషయాన్ని పోలీసులతో సహా ఎవరికీ చెప్పొద్దని వివేకా అల్లుడు, ఆయన సోదరుడు ఎం దుకు చెప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారు మధ్యాహ్నం పులివెందుల చేరుకున్నాక ఆ లేఖ, సెల్ఫోన్లను తీసుకున్నారు. సాయంత్రం వాటిని పోలీసులకు కృష్ణారెడ్డి ద్వారా అప్పగించారు. ఆ మెస్సేజ్ల వెనుక కథ ఏమిటి...? మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివేకా సెల్ఫోన్లోని మెస్సేజ్లు, ఇతర కీలక సమాచారాన్ని వారు డిలీట్ చేశారా...? చేస్తే ఎందుకు చేశారన్నది ఈ కేసులో కీలకం. అంతటి కీలకమైన అంశాలపై సీబీఐ అధికారులు ఇప్పటివరకు దృష్టి సారించనే లేదు. హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా సెల్ఫోన్కు ఓ మహిళ నుంచి వచ్చిన మెస్సేజ్లు తరువాత బయటపడ్డాయి. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఆమె దూషించి ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ మెస్సేజ్ల్లో ఉండటం గమనార్హం. అంటే వివేకా కుటుంబంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. మరి ఆ అంశాలపై సీబీఐ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డిలను విచారించి నమోదు చేసిన వాంగ్మూలాల్లో ఆ విషయాలపై స్పష్టత లేదు. గుండెపోటని టీడీపీ మంత్రితో ఎందుకు చెప్పారు? వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డి సూచనలతో ఆయన అనుచరుడు ఇనయతుల్లా మార్చి 15న ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం ఫొటోలు, వీడియోలను శివప్రకాశ్రెడ్డికి వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే అది హత్యేనని స్పష్టమవుతుంది. కానీ ఆయన వాటిని చూసిన తరువాత కూడా అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించినట్లు చె ప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. శివప్రకాశ్రెడ్డి అలా ఉద్దేశపూర్వకంగా గుండెపోటని ఎందుకు చెప్పారో సీబీఐ ఇంతవరకు దృష్టిసారించ లేదు. శివప్రకాష్రెడ్డి వాంగ్మూలం నమోదు సమయంలోనూ ఆ విషయంపై ప్రశ్నించలేదు. తుడవమని ఎందుకు చెప్పారు? వివేకా మృతదేహం వద్ద రక్తపు మరకలను తుడవాలని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డికి శివప్రకాష్రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. అదే విషయాన్ని ఎర్ర గంగిరెడ్డి కూడా వెల్లడించాడు. అలా రక్తపు మరకలు తుడవమని ఎందుకు చెప్పారు? సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ఎందుకు భావించారు? ఈ విషయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయలేదు. ఆయన్ను ప్రశ్నించనూ లేదు. శాస్త్రీయ ఆధారాలతో విచారిస్తే... గతంలో టీడీపీ ఏ ఆరోపణలు చేసిందో ప్రస్తుతం అవే అభియోగాలతో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేయడం, సాక్షులు చెప్పని విషయాలను కూడా వారు చెప్పినట్లుగా వాంగ్మూలాలు నమోదు చేస్తుండటం ఈ కేసు దారి మళ్లిందనేందుకు స్పష్టమైన నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన స్థాయికి తగ్గట్టుగా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. కీలక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ . ఊహాజనిత, రాజకీయ ప్రేరేపిత ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేయడం వెనుక ఒత్తిళ్లు దాగి ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. మాట మార్చిన సునీత దంపతులు, టీడీపీ రాజకీయ ఆరోపణలు, తాము బలవంతంగా అప్రూవర్గా మార్చిన నిందితుల కోణం నుంచి కాకుండా శాస్త్రీయ ఆధారాలను బట్టి కేసును దర్యాప్తు చేయాలని సూచిస్తున్నారు. మాట మార్చటానికి కారణాలేమిటి? వివేకా హత్య అనంతరం ఆయన కుమార్తె సునీత పులివెందుల, హైదరాబాద్లలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాదాపు 700 మంది ఉన్న తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపు కోసం పనిచేసిన తన తండ్రి వివేకానందరెడ్డి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని వైఎస్ అవినాష్రెడ్డిని ఎంపీ ని చేసేందుకు చివరివరకూ కృషిచేశారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ధ్వజమెత్తారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులపైనే సునీత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనే అంశంపై సీబీఐ అధికారులు ఏ మాత్రం ఆరాతీయలేదు. సునీత మాట మార్చ డం వెనుక ప్రలోభాలు, ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యంగా మారినా సీబీఐ ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
కొత్త జిల్లాలకు సరిపడా సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సరిపడా పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఇటీవలే రాష్ట్రానికి కేంద్రం ఐపీఎస్లను కేటాయించిందని, అందువల్ల కొత్త జిల్లాలకు వారి కొరత ఉండదని విశాఖలో సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో గ్రామ పోలీసు చట్టం బ్రిటీష్ కాలం నుంచీ అమలులో ఉందని.. గ్రామస్థాయిలో పోలీసు విజిలెన్స్ కోసం సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు. వైఎస్ వివేకా ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒడిశాతో కలిసి గంజాయి కట్టడి ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోందని.. దీనిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. గంజాయి సాగు, సరఫరా నియంత్రణ కోసం ఒడిశాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. నిజానికి గంజాయి సాగు మొదటినుంచీ ఉందని.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా కాలేజీలు, రిసార్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. దిశ యాప్ మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), మిలాన్–2022ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులను డీజీపీ అభినందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పోలీసుల వీక్లీ ఆఫ్లను తిరిగి అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు. -
పరిధి మరిచి మాట్లాడారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధులను, అధికారాలను దాటి వెళుతోందంటూ మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభ్యంతరం తెలిపారు. జస్టిస్ చంద్రు పేరు ప్రస్తావించకుండా సీజే ధర్మాసనం, జస్టిస్ చంద్రు పేరును ప్రస్తావిస్తూ జస్టిస్ దేవానంద్ సోమవారం పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైమ్లైట్లో ఉండేందుకు కొందరు జ్యుడిషియల్ సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీజే జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. అలాంటి లైట్ను తాము ఆర్పివేస్తామన్నారు. న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులేనని, వారూ తప్పులు చేస్తుంటారని తెలిపారు. మానవ హక్కుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ఆయన దాని గురించే మాట్లాడి ఉండాల్సిందన్నారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏ పని మీద వచ్చారో ఆ పరిధిని మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధి గురించి మాట్లాడటమేమిటని సీజే ఆక్షేపించారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నమోదు చేసిన కేసులో పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. గౌరవానికి జస్టిస్ చంద్రు అర్హులు కారు గ్రామ సచివాలయాలకు ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ దేవానంద్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు హైకోర్టు ప్రతిష్టను దిగజార్చేవిగా ఉన్నాయన్నారు. హైకోర్టు మొత్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఆయనకు ఎవరిపైనైనా అభ్యంతరం ఉండి ఉంటే వారి గురించి మాట్లాడితే సరిపోయేదన్నారు. మొత్తం హైకోర్టును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు. జస్టిస్ చంద్రుపై ఉన్న గౌరవం పోయిందన్నారు. గౌరవానికి ఆయన ఏమాత్రం అర్హులు కారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడుతోందన్న వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని తెలిపారు. పౌరుల హక్కుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పెట్టిన అనుచిత పోస్టులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తప్పెలా అవుతుందన్నారు. ధిక్కార చర్యలకు సీజేకు లేఖ రాద్దామనుకున్నా హైకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు జస్టిస్ చంద్రుపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని భావించానని, అయితే జస్టిస్ చంద్రు వయస్సు, న్యాయవాదిగా ఆయన అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. న్యాయమూర్తిగా తాను చేసిన రాజ్యాంగ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిరూపిస్తే తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నారు. దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని హైకోర్టు ఏపీ హైకోర్టు మాత్రమేనన్నారు. కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్వయంగా కోర్టు ముందు హాజరైన రావత్ ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా బిల్లులు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ కోర్టు ముందు హాజరయ్యారు. శాఖల అంతర్గత విషయాల వల్ల సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయామని రావత్ చెప్పారు. నిధులు విడుదల చేశామని, కొద్ది రోజుల్లో చెల్లింపు పూర్తవుతుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్, విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. ఆలోపు బిల్లుల మొత్తాలు అందాయో లేదో చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి రావత్కు మినహాయింపునిచ్చారు. -
సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికీ న్యాయమూ ర్తులను కించప రుస్తూ పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐకి తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువు నిస్తున్నట్లు తెలిపింది. తద్వారా దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని రుజువు చేసుకోవాలని సీబీఐకి స్పష్టం చేసింది. లేని పక్షంలో సీబీఐ ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేకపోతోందని పేర్కొంటూ, దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తామని మౌఖికంగా చెప్పింది. ఈ మొత్తం కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరుతామంది. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయనున్నారో తెలియ చేస్తూ ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతేడాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చానెల్ను బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు.. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు విని పిస్తూ.. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానెల్ను బ్లాక్ చేయడంతో పాటు అతడి పోస్టులను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ల నుంచి తొలగిం చారని తెలిపారు. యూట్యూబ్ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారు. ఫేస్బుక్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్ వాదనలు వినిపిస్తూ.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ద్వారా వీడియోలను వీక్షిస్తున్నారని.. ఇలా చేయ డం చట్టవిరుద్ధమని తెలిపారు. యూఆర్ఎల్ వివరాలు ఇస్తే 36 గంటల్లో పోస్టులను తొలగిస్తామ న్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు నమోదు చేసిన వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ కంపెనీలపై ఉందం ది. సీబీఐ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్ వాదనలు వినిపిస్తూ.. వీడియోల తొలగిం పునకు గూగుల్కు లేఖ రాశామన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. అతడి అరెస్ట్ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ సాయం కూడా తీసుకుం టున్నామన్నారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తాము ఏమీ చేయడం లేదనడం ఎంత మాత్రం సరికాదన్నారు. -
‘హెచ్సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్సీఏ, బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది. -
వెయ్యి కోట్ల కుంభకోణం
సాక్షి, న్యూఢిల్లీ: కోకాపేట్ భూముల వ్యవహారం సీబీఐ ముందుకు చేరింది. కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల ఫిర్యాదు లేఖను సీబీఐ డైరెక్టర్కు అందించారు. అనంతరం నార్త్బ్లాక్ వద్ద రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భూముల అమ్మకాల పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అనుయాయులకు, పార్టీ నేత లకు చవక ధరలకే విలువైన భూముల్ని కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములున్న కోకాపేట్లో ఎకరం భూమిని రూ. 25 కోట్లకు అమ్మారని, అంతకన్నా తక్కువ రేట్లున్న పుప్పాలగూడ, ఖానామెట్లో మాత్రం ఎకరం భూమిని రూ.40 కోట్లకు అమ్మారన్నారు. పుప్పాల్గూడకు చెందిన 125 ఎకరాల భూకుంభకోణం వివరాలను త్వరలో బయటపెడతానని చెప్పారు. ప్రైవేట్ బిల్డర్లకు లాభం భూముల వేలం వ్యవహారంలో ఎంఎస్టీసీ క్రియాశీల సహకారంతో సిండికేట్ ఏర్పడినందున, వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్, స్విస్ చాలెంజ్ పద్ధతి వంటి పారదర్శక వేలం విధానాన్ని చేపట్టి ఉంటే కచ్చితమైన విలువ తెలిసి ఉండేదన్నారు. ఎంఎస్టీసీ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖజానాకు నష్టాన్ని కలిగించి, ముఖ్యమంత్రి సన్నిహితులైన ప్రైవేట్ బిల్డర్లకు లాభాన్ని చేకూర్చారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఐటీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్ నిబంధనలను ఉల్లంఘించి, కేసీఆర్ చెప్పినవారికే వేలంలో భూములు వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు. మధ్యవర్తిగా వేలంలో పాల్గొన్న ఎంఎస్టీసీ నియోపోలిస్, కోకాపేట్, గోల్డెన్ మైల్ బిడ్డర్ల పేర్లను బహిర్గతపరచలేదన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తా.. భూకుంభకోణంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిల కుటుంబ సభ్యులు, మైహోం సంస్థకు చెందిన వారు ఉన్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంపై త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతిపై ఏదైనా కోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప విచారణకు ఆదేశించే అవకాశం సీబీఐకి చాలా తక్కువగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారన్నారు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్లు అవినీతికి పాల్పడితే నేరుగా సీబీఐ విచారణ చేపట్టవచ్చన్న విçషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. అడిగిన 24 గంటల్లోనే కేసీఆర్కు అపాయింట్మెంట్ దొరికినప్పుడు, కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్, కిషన్రెడ్డిలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. -
మూడో రోజూ ఆయుధాల కోసం గాలింపు
పులివెందుల : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయుధాల కోసం పులివెందులలో సీబీఐ బృందం మూడోరోజు సోమవారం కూడా గాలించింది. ఉదయం పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న వంక బ్రిడ్జి కింద బురదను వెలికితీశారు. అలాగే, హత్య తర్వాత నిందితులు రక్తపు మరకల దుస్తులు వేశారన్న సమాచారంతో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న గరండాల్ బ్రిడ్జి కింద కూడా జేసీబీతో గాలింపు చేపట్టారు. అయితే, సాయంత్రం వరకు రెండుచోట్లా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గాలింపును మంగళవారానికి వాయిదా వేశారు. ఇక సోమవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత కాసేపు సమావేశమయ్యారు. అలాగే, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లెపు వరప్రసాద్, ఎర్రంరెడ్డిపల్లె జగదీశ్వరరెడ్డి, రాజారెడ్డి ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, సీఎస్ఐ చర్చికి సంబంధించిన శిఖామణి, సంపత్, నీలయ్య, సుధాకర్, దినేష్ నర్సింగ్ హోం మెడికల్ స్టోర్ సిబ్బంది ఓబులేసు, రామకృష్ణారెడ్డి, యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్కుమార్రెడ్డి, కాంపౌండర్ ప్రకాష్రెడ్డి, మాజీ లెక్చరర్ చంద్రశేఖరరెడ్డిలను సీబీఐ బృందం విచారించింది. వివేకా ఇంటి వద్దకు సునీల్ యాదవ్ వివేకా హత్యకేసులో నిందితుడు సునీల్ యాదవ్ను సోమవారం సాయంత్రం సీబీఐ అధికారులు వైఎస్ వివేకా ఇంటి వద్దకు తెచ్చి, అక్కడ ఫొటోలు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఇరువైపులా ఉన్న రోడ్లపై వాహనంలోనే ఉంచి తిప్పారు. -
వివేకా హత్య కేసులో చట్ట ప్రకారమే దర్యాప్తు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చట్ట ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి తమ దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే పిటిషనర్ల ఉద్దేశమని పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసులో పిటిషనర్లయిన సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్ల పాత్రను ప్రస్తుత దశలో కొట్టిపారేయలేమని సీబీఐ స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైఎస్సార్ జిల్లా మోతునూతలపల్లికి చెందిన యాదాటి సునీల్ యాదవ్, అతని సోదరుడు, తల్లి, తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ కౌంటర్ దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పిటిషనర్లకు క్లీన్చిట్ ఇవ్వలేదు.. ► హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టాం. చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు కీలక దశలో ఉంది. కఠినమైన చట్టం నుంచి తప్పించుకునేందుకు పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు చెబుతున్నవన్నీ నిరాధారమైనవి. రాష్ట్ర పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదు. ఈ కేసులో పిటిషనర్ల పాత్రను తోసిపుచ్చలేం. పిటిషనర్ను ఢిల్లీ సీఐడీ కార్యాలయంలో విచారణ చేసినంత కాలం అతను ఢిల్లీలోని తన బంధువు ఇంట్లో ఉన్నారు. ► హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ ప్రవర్తన, నడవడిక అత్యంత అనుమానాస్పదంగా ఉన్నట్లు మా దర్యాప్తులో తేలింది. అతనికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించాయి. వాటిని ప్రస్తుతం బయట పెట్టలేం. అందువల్ల ఈ పిటిషన్కు విచారణార్హతే లేదు. ► పిటిషనర్ ఆమోదంతో అతని ఈ మెయిల్ ఐడీ, ఫేస్ బుక్ ఖాతాలను, అతని చేతి రాత నమూనాలను అతని సమక్షంలోనే పరిశీలించాం. సునీల్ యాదవ్ అంగీకారంతో ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అతనికి సైకలాజికల్ అసెస్మెంట్, వాయిస్ లేయర్డ్ అనాలసిస్ నిర్వహించాం. అయితే ఎలాంటి పోలిగ్రాఫ్ టెస్ట్ చేయలేదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం వాస్తవానికి సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు రావాల్సి ఉంది. అయితే విచారణకు రాకపోవడంతో సునీల్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ గురువారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీని సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆగస్టు 5కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ కౌంటర్లో ఆగస్టు 12వ తేదీ లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని దమ్మాలపాటిని ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అమరావతి భూ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన న్యాయవాది కె.శ్రీనివాస స్వామిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. స్వామిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏసీబీ కేసుపై దమ్మాలపాటి అత్యవసర పిటిషన్.. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్రానికి గతేడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి గతేడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం పెండింగ్లో ఉండగానే.. ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రాయడం వల్ల తమ పరువుపోతోందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం విచారిస్తాం.. తాజాగా గురువారం దమ్మాలపాటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దమ్మాలపాటి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను న్యాయమూర్తి పరిశీలించారు. 4 వారాల్లో ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే విచారణ జరుపుతానని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు, ఆ కౌంటర్పై రీజాయిండర్ దాఖలుకు ఇరుపక్షాలకు నిర్ణీత గడువు విధించారు. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని చెప్పారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో 13వ నిందితురాలిగా ఉన్న వెల్లంకి రేణుకాదేవి వ్యాజ్యాన్ని కూడా దమ్మాలపాటి పిటిషన్కు జత చేశారు. ఆ వ్యాజ్యంలో కూడా విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. చర్చనీయాంశమైన ‘గ్యాగ్’.. ఈ వ్యాజ్యాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను నిలిపేశారు. ఈ కేసులో ఏ ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే స్టే ఎత్తివేత కోసం వాదనలు వినిపిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 4 వారాల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. -
కోటి అందింది.. రాజా ఇంకా పది కోట్లివ్వాలి!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ 5 చానల్ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనకు ఇప్పటి వరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా ఇంకా పది (పది కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్లో బిఆర్ నాయుడుతో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెం:4లో వివరంగా ఉంది. పార్టీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖ ప్రతిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేసింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రీయంగా నిర్థారణ.. ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు, బి.ఆర్. నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. మనీలాండరింగ్, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు. దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఏపీఎస్ఎఫ్ఎస్ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చాం. ‘అంగడియా’ .... క్రిమినల్ కేస్ నెంబర్ 12/2021 విచారణ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిందితుల వస్తువులను విశ్లేషించి ఒక మిలియన్ యూరోల మేరకు హవాలా లావాదేవీ జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు గుర్తించారు. హవాలా లావాదేవీకి రుజువుగా ‘అంగడియా’ అనే ప్రస్తావన రఘురామకృష్ణరాజు, బి.ఆర్.నాయుడు మధ్య సాగిన సంక్షిప్త సందేశాల సంభాషణలో ఉంది. ఓసీబీసీ ఖాతా నుంచి ఒక మిలియన్ యూరోలు వెల్స్ ఫార్గో ఖాతాకు బదిలీ అయినట్టు ఈ సంభాషణ తేటతెల్లం చేస్తోంది. ఇది మనీ లాండరింగ్ను రుజువు చేస్తోంది. లావాదేవీ ‘3’ అని చేసిన ప్రస్తావన హవాలా కింద ఇచ్చిన కోట్ల రూపాయల గురించి వెల్లడిస్తుండగా మిగిలినవి ఒక రోజు అనంతరం ఇస్తానని ఇచ్చిన హామీగా గుర్తించవచ్చు. ఒకటో నెంబరు నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు రెండో నెంబరు నిందితుడిగా ఉన్న బి.ఆర్.నాయుడు మొత్తం రూ.11 కోట్ల మేర లావాదేవీల్లో రూ.కోటి చెల్లించినట్లు పేజీ నెంబరు 4లో ఉంది. ఈ వ్యవహారాన్ని పేజీ నెంబరు 5లో పేర్కొన్న మిలియన్ యూరో బదిలీ ప్రస్తావనలోనూ గమనించవచ్చు. విదేశాలకు పరారీ కాకుండా నిరోధించండి.. నిందితులైన కె.రఘురామకృష్ణరాజు, బి.ఆర్.నాయుడులపై పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు. సీఐడీ రాసిన లేఖను జతపరిచిన ఎంపీలు.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్కు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సీఐడీ రాసిన లేఖను, సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ప్రధాన నిందితుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీజైన మొబైల్ ఫోన్ను ఏపీఎఫ్ఎస్ఎల్కు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపామని, దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది. రఘురామకృష్ణరాజు(ఏ1), టీవీ 5 ఛైర్మన్(ఏ2)కు మధ్య జరిగిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వివరించింది. ఇవిగో ఖాతా నంబర్లు... వెల్స్ ఫార్గో ఖాతా నెం: 51700263205 నుంచి పది లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెం: 501189518301కు బదిలీ చేసినట్లు ఆ ఫోన్ ఛాటింగ్ తేటతెల్లం చేసింది. ఇది పీఎంఎల్ఏ నిబంధనల ఉల్లంఘనను రుజువుగా నిలుస్తోంది. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించి ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3 లో ఛాటింగ్ వివరాలు ఉన్నాయి’’ -
అమరావతి భూకొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై సీఐడీ విచారణ నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ వినీత్శరణ్, జస్టిస్ దినేష్మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ధావన్ వాదనలు వినిపించారు. ‘కేసు హైకోర్టుకు పంపండి. దర్యాప్తు కొనసాగనీయండి. మేం చట్ట పరిధిలోనే ముందుకెళ్లాం. సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడూ దర్యాప్తును ఆపలేదు..’ అని ధావన్ పేర్కొన్నారు. దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్సాల్వే వాదనలు వినిపిస్తూ.. పత్రాలు, ఎఫ్ఐఆర్ చదివితే అని చెబుతుండగా.. జస్టిస్ వినీత్శరణ్ జోక్యం చేసుకొని ఇరుపక్షాలు కోరితే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ధావన్ హైకోర్టుకు పంపించాలని కోరుతున్నారు, మీ స్పందన ఏంటని ధర్మాసనం సాల్వేను ప్రశ్నించింది. ‘ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో ఉంది.. పాలనాపరమైన కక్ష సాధింపే ఇది.. అక్కడికి ఇక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేము..’ అని సాల్వే చెప్పారు. హైకోర్టులో డీటైల్డ్గా విచారణ జరపవచ్చు ఈ సందర్భంగా జస్టిస్ శరణ్.. ఇరుపక్షాలు అంగీకరిస్తే సుప్రీంకోర్టే విచారణ చేపడుతుందని, దాన్నిబట్టి ముందుకెళ్తామని పేర్కొన్నారు. ధావన్ స్పందిస్తూ.. సాల్వే తన వ్యాఖ్యలు తనపైనే (పాలనపరమైన కక్ష సాధింపు) ప్రయోగించడం నచ్చిందన్నారు. సుప్రీంకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించేచోట తాను లేనని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, హైకోర్టులో డీటైల్డ్గా విచారణ జరపొచ్చని చెప్పారు. ఒకవేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వాల్సివస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో స్పష్టం చేయవచ్చన్నారు. ‘ఎస్సెల్పీ మేం దాఖలు చేశాం.. ఒకవేళ కేసు విచారణ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చేపడితే అన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వారికి సుప్రీంకోర్టులో విచారణ జరగాలని లేదు’ అని ధావన్ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్సెల్పీపైనే అయితే విచారణ చేపట్టాలని, ఎస్సెల్పీని కొట్టివేస్తే అప్పుడు హైకోర్టు విచారిస్తుందని సాల్వే పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినరోజే న్యాయమూర్తి విచారించారని, ప్రభుత్వ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ధావన్ చెప్పారు. న్యాయమూర్తులెవరనే దానిపై చర్చించదలచుకోలేదని, దర్యాప్తు కొనసాగనిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఓ న్యాయమూర్తి పర్యవేక్షణ ఉండాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. అప్లికేషన్ను విచారిస్తామని, కొంత విచారణ తమకూ అవసరమని పేర్కొంది. కేసు విచారణకు వచ్చే వారంలో ఓ తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. దర్యాప్తు నిలిచిపోయిందని, హైకోర్టు కూడా విచారణ జరపడం లేదని ధావన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టులో విచారించాలని ధావన్ కోరారు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేస్తూ జాబితాలో చివరిగా చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో ఈ పిటిషన్ను జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ వినీత్శరణ్, జస్టిస్ ఎంఆర్షాలతో కూడిన ధర్మాసనం విచారించిన విషయం విదితమే. -
రఘురామ కేసులో ప్రతివాదిగా... రాష్ట్ర ప్రభుత్వం తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు గాయాలపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని నివేదించారు. సీఐడీ పోలీసు కస్టడీలో తన తండ్రిని హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ పిటిషన్లో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కోరారు. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం, మంగళగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్, సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ ఆర్.విజయపాల్ను ప్రతివాదులుగా తొలగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినలేదని, సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల తొలగింపుపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిస్క్ భరిస్తానని అంగీకరించారని పేర్కొంది. ‘ప్రతివాది నంబర్ 1గా ఎవరిని చేర్చారు? ఏపీ ప్రభుత్వాన్ని ఇపుడు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ధర్మాసనానికి దవే నివేదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది రిస్క్ భరిస్తానంటున్నారు కదా? అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. దవేకు ‘లోకస్ స్టాండీ’ లేదని, ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని రోహత్గి పేర్కొనడంతో ఈ ప్రొసీడింగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని దవే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఆసక్తి ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని, కావాలనుకుంటే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులిద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. వివేక కుమార్తై విజ్జప్తి మేరకు దీన్ని సీబీఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్యకేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తుచేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అదే విధంగా, ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏనుగు లాంటివారని ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని అన్నారు. కాగా, దోషులను పట్టుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నాని స్పష్టం చేశారు,. -
విచారణ వేగవంతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య చేశారని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగి రెండేళ్లయినా ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగుతోందని ఈ మధ్యలో సాక్షులకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఉన్నానని చెప్పారు.శ్రీనివాసరెడ్డి మృతి దీనికి బలం చేకూర్చిందన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం తమ్ముడు, ప్రస్తుత సీఎం బాబాయి మృతి విషయంలోనే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి, న్యాయం కోసం ఇంకెంత కాలం చూడాలి అని ప్రశ్నించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనకు అనుమానం ఉన్న 15 మంది పేర్లు రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఎంత కష్టమైనా నిందితుల్ని పట్టుకునే వరకు పోరాడతానని సునీత చెప్పారు. -
కళ్లుగప్పి.. కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. కనికట్టు చేసి బ్యాంకులను దోచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరిలనే మించిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కెనరా బ్యాంకు నేతృత్వంలోని ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియంనే మోసం చేసి రూ.7,926.01 కోట్లను కొల్లగొట్టినట్లు సీబీఐ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. బ్యాంకుల అధికారుల సహకారం లేకుండా రాయపాటి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉండదనే నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. రూ.7,926.01 కోట్లు ఎగవేత పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్, తిరుపతి–తిరుత్తణి–చెన్నై టోల్వేస్.. భోపాల్–బయోరా టోల్వేస్.. దిండిగల్–తెన్ని–కుమ్లి టోల్వేస్.. కృష్ణగిరి–దిండివనం హైవేస్, ఒబేదుల్లాగంజ్–బేతుల్, తిరుచ్చి–కలైకుడి టోల్వేస్ పనులు చేపట్టేందుకు రుణం ఇవ్వాలని కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియంను ట్రాన్స్ట్రాయ్ కోరింది. ఈ రుణానికి బోగస్ గ్యారంటీలను చూపింది. ఇవి నిజమైనవా కాదా అన్నది తేల్చుకోకుండా బ్యాంకుల కన్సార్షియం రూ.9,394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు 2013–2014లో అంగీకరించింది. ఈ రుణాన్ని నగదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ), గ్యారంటీ (బీజీ)ల రూపంలో ఇస్తామని పేర్కొంది. 2015–16 నాటికి రూ.7,926.01 కోట్ల రుణాన్ని నగదు, ఎల్వోసీ, బీజీల రూపంలో ఇచ్చింది. కానీ, తీసుకున్న రుణం చెల్లించకుండా ట్రాన్స్ట్రాయ్ మోసం చేయడంతో 2019 డిసెంబర్ 30న యూనియన్ బ్యాంక్, 2020 డిసెంబర్ 15న కెనరా బ్యాంక్ అధికారులు వేర్వేరుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన సీబీఐ.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి, ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర బాబ్జీ, మరో డైరెక్టర్ ఎం.సాంబశివరావులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్యాప్తులో వెల్లడైన అంశాలివీ.. రూ.2,261.58 కోట్లు ఏ బాబు జేబులోకో.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు ఏ సంస్థ అయినా బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన లావాదేవీలను ఆ బ్యాంకుల పరిధిలోనే నిర్వహించాలి. దీనివల్ల ఇచ్చిన రుణం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కానీ, కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.7,926.01 కోట్లలో రూ.2,261.58 కోట్లను కన్సార్షియంలోని లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), ఆర్బీఎల్లకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఐదు బ్యాంకుల ద్వారా మళ్లించిన మొత్తానికి ట్రాన్స్ట్రాయ్ సరైన లెక్కలు చూపకపోవడంతో.. ఆ నిధులు ఏ బాబు జేబులోకి చేరాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ట్రాన్స్ట్రాయ్లో డైరెక్టర్గా ఉన్న ఎం.సాంబశివరావు పేరుతో యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయించిన రాయపాటి, పోలవరం పనుల కోసం ఆ సంస్థ నుంచి కేవలం రూ.3 కోట్ల విలువ చేసే వాహనాలను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, కొన్న వాహనాలనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపి బ్యాంకులు మంజూరు చేసిన రుణంలో యూనిక్ ఇంజనీర్స్ ఖాతాలోకి రూ.313.85 కోట్లను మళ్లించి కాజేశారు. సిమెంటు, స్టీలు వంటివి కొనకుండానే.. పోలవరం, ఇతర రహదారుల పనుల కోసం ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2017 వరకూ ట్రాన్స్ట్రాయ్ కేవలం రూ.274.36 కోట్ల విలువైన సామగ్రిని మాత్రమే ఐదు సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. అదే మెటీరియల్ను మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి రూ.2,568.77 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని కాజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సంస్థ నుంచి సిమెంటు కొనుగోలు చేసినట్లు బ్యాంక్ లెడ్జర్ బుక్లో చూపారు. కానీ, ఆ సంస్థకు కాకుండా మరో సంస్థకు చెల్లింపులు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. బ్యాంక్ లెడ్జర్ బుక్కూ బ్యాంక్ స్టేట్మెంట్కూ పొంతన లేని లావాదేవీల ద్వారా రూ.1,624.35 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దోచేసింది. సక్రమంగా చెల్లింపులూ చేయని ట్రాన్స్ట్రాయ్ ట్రాన్స్ట్రాయ్ ఎక్కడ పనిచేసినా సబ్ కాంట్రాక్టర్లకు సక్రమంగా చెల్లింపులు చేయదు. పోలవరంలో చేసిన పనులకు బిల్లులు ఎగ్గొట్టడంతో 2016 నుంచి 2019 వరకూ ట్రాన్స్ట్రాయ్కి వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్లు నెలల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.794.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా ఇచ్చామని.. వాటిని తిరిగి ఇవ్వలేని దుస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉండటంతో వాటిని మాఫీ చేశామని ట్రాన్స్ట్రాయ్ లెక్కలు చెప్పడంపై సీబీఐ అధికారులే నిర్ఘాంతపోయినట్లు సమాచారం. -
శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండటంతోపాటు అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్పై వామన్రావు గోదావరిఖని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే మంథని మున్సిపల్ చైర్మన్, మధుకర్ భార్య శైలజ ఎన్నికను సవాల్ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్డెత్గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్ నంబర్ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
బొల్లినేని శ్రీనివాసగాంధీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ జీఎస్టీలో అసి స్టెంట్ కమిషనర్గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనల్లో సీబీఐ కేసులు నడుస్తున్న క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) శాఖ బొల్లినేనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతనితోపాటు డిప్యూటీ కమిషనర్ చిలుకా సుధారాణిపైనా వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. అవినీతి, అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేనిపై ఏడాది వ్యవధిలో రెండు సార్లు సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఆయన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బొల్లినేని అక్రమాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. బొల్లినేని వేధింపులకు తాళలేక గతేడాది ఓ బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. 2019 జూలైలో బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. 2020 సెప్టెంబర్లో మరో కేసు నమోదు చేసింది. అయితే ఇన్ని ఆరోపణలున్నా.. బొల్లినేనికి ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో గతేడాది అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి పొందడం గమనార్హం. సాధారణంగా పదోన్నతుల సమయంలో వ్యక్తిగత ప్రవర్తనపై సీబీఐసీ ఢిల్లీ అధికారులు రిపోర్టు కోరినప్పుడు తనపై సీబీఐ కేసులున్న సంగతి పైకి వెళ్లకుండా బొల్లినేని జాగ్రత్తపడ్డాడని సమాచారం. పకడ్బందీగా వేధింపులు.. రూ.కోట్లలో బేరాలు దర్యాప్తులో బొల్లినేని అక్రమాలు తెలుసుకుని సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. బొల్లినేని తన వద్దకు వచ్చిన జీఎస్టీ రిటర్నులను బాగా అధ్యయనం చేస్తాడు. లోపాలుంటే వాటిని దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేయాలి. కానీ, బొల్లినేని ఇక్కడే తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడని తెలిసింది. ముందుగా తాను కేసు నమోదు చేయబోయే వ్యాపారి, ఉత్పత్తి దారులకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, వ్యాపార భాగస్వాములను విచారణ పేరుతో పిలిపించి, కేసులు పెడతామని బెదిరిస్తాడు. వారు దారికి రాగానే.. ముందుగా రాసిన స్టేట్మెంట్పై సంత కాలు తీసుకుంటాడు. తర్వాత అసలు వ్యాపారిని పిలిపిస్తాడు. ‘మీ సిబ్బంది అంతా అప్రూవర్గా మారారు. మీరే మిగిలారు.. మా ఉన్నతాధికారులు మీపై కోపంగా ఉన్నారు. మేం అడిగిన్ని రూ.కోట్లు ఇవ్వకపోతే మీపై కేసులు పెడతాం. మీ ఇంట్లో ఆడవారు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది’అని బెదిరింపులకు దిగుతాడు. అడిగినంత ఇస్తే కేసే లేదు.. కానీ, ఇవ్వకపోతే వారిపై కేసులు నమోదు చేసేస్తాడు. డిమాండ్ చేసిన లంచాన్ని నగదు రూపంలో కూడా పూర్తిగా తీసుకోడు. 10 శాతం నగదు, మిగిలిన 90 శాతం బాధితుల భూములు బినామీల పేరిట రాయించుకుంటాడని తెలిసింది. బదిలీలు లేకుండా ఒకేచోట 13 ఏళ్లు.. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్ స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లోకి డిప్యుటేషన్ పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ పని చేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్ ) లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో ఎవరికైనా రెండేళ్లే అవకాశమిస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది అదనంగా డిప్యుటేషన్ కొనసాగనిస్తారు. అంతే తప్ప 13 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగించిన దాఖలాలు లేనే లేవని సొంతశాఖ అధికారులే విస్తుపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్కి బొల్లినేనిని సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’అంటారు. కానీ, తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్ను తప్పించుకుని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్మెంట్, బషీర్బాగ్లో పోస్టింగ్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు! 2010–2019 వరకు పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని.. కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.3.74 కోట్లు.. కూకట్పల్లి హైదర్నగర్లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరు.. హైదరాబాద్లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్పల్లిలలో బొల్లినేని భారీగానే స్థిరాస్తులు కూడగట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా అతనిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
సిట్ దర్యాప్తు సాగుతోందిగా.. సీబీఐ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) పరిష్కరించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ను) ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును కొనసాగనిద్దామని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ సిట్.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్కు మౌఖికంగా తెలిపింది. ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్ను పరిష్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్కుమార్ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్ను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
అరుదుగానే సీబీ‘ఐ’
సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీస్స్టేషన్పై దాడి కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తమ అభిప్రాయాన్ని బుధవారం హైకోర్టుకు తెలియజేసింది. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టులు అరుదుగానే ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పిందని సీబీఐ నివేదించింది. జాతీయ భద్రత చట్టం నిర్ధేశించిన షెడ్యూల్డ్ నేరాల జాబితా పరిధిలోకి పోలీస్స్టేషన్పై దాడి ఘటన రాదని ఎన్ఐఏ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. 2018లో పాత గుంటూరు పోలీస్స్టేషన్పై కొందరు ముస్లిం యువకులు దాడి చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గత ఆగస్టులో జీవో ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గణేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాడి కేసును స్వతంత్ర దర్యా ప్తు సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న ధర్మాసనం.. సీబీఐ, ఎన్ఐఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్ఐఏ ఎస్పీ సీవీ సుబ్బారెడ్డి, సీబీఐ ఎస్పీ పి.విమలాదిత్య, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్లు దాఖలు చేశారు. బుధవారం ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. అసాధారణ కేసుల్లోనే ఆదేశించాలి: సీబీఐ అసాధారణ కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని సీబీఐ తరఫు న్యాయవాది పి.చెన్నకేశవులు తెలిపారు. షెడ్యూల్డ్ నేరాల జాబితాలోని దేశ భద్రత, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, బాంబుపేలుళ్లు తదితర కేసుల్లో మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ తెలియజేశారు. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ వెనుక దురుద్దేశాల్లేవు పోలీస్స్టేషన్పై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశాలు, రాజకీయ కారణాలు లేవ ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తాము సూచన మాత్రమే చేశామని, అంతిమ నిర్ణయం సంబంధిత మేజిస్ట్రేట్దేనని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్రెడ్డి తెలిపారు. అయితే దర్యాప్తు దశలో ఉన్న కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ను ఎలా ఉపసంహరించుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చే విషయంలో న్యాయస్థానం స్వీయ నియంత్రణ పాటించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ సీబీఐ ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అఫిడవిట్ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. -
‘గీతం’పై సీబీఐ విచారణ జరపాలి
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమాల పర్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది. 71 ఎకరాలకు పైగా చేజిక్కించుకున్నది చాలక పక్కనున్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలనూ కాజేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలు ప్రజా సంఘాలు నినదిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తుంటే ఉపేక్షించరాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ అండతో కబ్జాల పర్వం కొనసాగించారని, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, వైద్య వ్యాపారం ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సోమవారం ఆందోళన నిర్వహించింది. యాజమాన్యాన్ని అరెస్టు చేసి, సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఎస్పీ విమల్ ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున విదేశాల నుంచి రూ.కోట్లాది నిధులు, విరాళాలు పొందుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన గీతంపై అంతర్గత ఆడిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సంస్థ అధినేత విశాఖ ఎంపీగా పనిచేసిన సమయంలో విశాఖ నగరాభివృద్ధికి కేటాయించిన నిధులను సైతం గీతం వర్సిటీకి దారి మళ్లించారని, గీతం ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో భారీ కట్టడాలు, భవంతులు ఉండరాదని హైకోర్టు ఉత్తర్వులుండగానే అదే హైకోర్టులో అరగంటలో అక్రమ కట్టడాలను కూల్చివేయరాదని ఏవిధంగా స్టే తెచ్చుకున్నారో విచారణ జరపాలన్నారు. గీతం వ్యవహారాలపై హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ ఎస్పీ తెలిపారన్నారు. -
హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..
లక్నో : హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అధికారులు.. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు పరిశీలించారు. క్రైం సీన్ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ( ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం ) దీనిపై సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేశారు. -
హథ్రాస్ కేసు: ఐదు గంటల పాటు విచారణ!
లక్నో: హథ్రాస్ సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఘటనాస్థలి వద్దకు వెళ్లి వివరాలు సేకరించిన సీబీఐ బృందం, శనివారం మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసింది. భూల్ఘర్లోని వారి ఇంటికి వెళ్లి, సుమారు ఐదు గంటల పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలి తల్లి, వదిన చెప్పిన వివరాలను నమోదు చేసుకుంది. వీరితో పాటు చోటు అనే సాక్షిని కూడా విచారించినట్లు సమాచారం. అంతేగాకుండా ఈ కేసులోని ప్రధాన నిందితుడు, బాధితురాలి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆధారాలు పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో, ఈ విషయం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లు భయపడ్డం లేదు.. జైలు మార్చండి!) కాగా, ఈ కేసులోని నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని సీబీఐ అధికారులు గురువారం విచారించిన విషయం తెలిసిందే. ఆధారాల సేకరణ కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిందితుడు లవ్ కుశ్ సికార్వర్ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అవి రక్తపు మరకలు కాదని, ఎర్రని పెయింట్ అని అతడి సోదరుడు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక హథ్రాస్ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేసింది. (‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’) -
సోషల్ మీడియాలో పోస్టింగ్లపై సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఆధారాలన్నీ సీబీఐకి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా కాగ్నిజబుల్ నేరం ఉందని భావిస్తే మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ పోస్టుల వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గమనిస్తే హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఆ యూజర్లను బ్లాక్ చేయాలని సీబీఐకి సూచించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి ఎనిమిది వారాల్లోపు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఆదేశించింది. సీబీఐ కోరితే పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సూచిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో కొత్త ఒరవడి మొదలైన విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తించింది. హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలలో దూషణల పర్వం మొదలైంది. దూషించినా, తిట్టినా తమ నిష్పాక్షికత, నిజాయితీ గురించి చెప్పుకునే వేదిక న్యాయమూర్తులకు లేదు. ఈ అపరాధులను శిక్షించేందుకు కోర్టు ధిక్కార చట్టం సరిపోదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారు. అయితే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్న విషయాన్ని వీరు మర్చిపోయారు’ అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పటికప్పుడు ఆదేశాలు.. సీఐడీతో పోలిస్తే మానవ వనరులు, సాధన సంపత్తి అధికంగా ఉండటం, విస్తృత పరిధి తదితర కారణాలతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు హైకోర్టు తన 20 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం చెప్పకపోవడం మరో కారణమని పేర్కొంది. ఈ కేసు సోమవారం నాటి కేసుల విచారణ జాబితా (కాజ్ లిస్ట్)లో లేకున్నా భోజన విరామం అనంతరం ధర్మాసనం అప్పటికప్పుడు ఆదేశాలు వెలువరించింది. -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం
సాక్షి, అమరావతి: పలు హెబియస్ కార్పస్ పిటిషన్లలో పోలీసులపై అక్రమ నిర్భంద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు ప్రాథమిక అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ కేసులను సీబీఐతో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో రాజ్యాంగ అమలు వైఫల్యం (కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్) ఉందా లేదా అన్న అంశంపై వాదనలు వినిపించాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులపై దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ సర్వా సత్యనారాయణప్రసాద్ పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. ఆ న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించలేదు దంపతుల అక్రమ నిర్భందంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సత్యనారాయణప్రసాద్ అన్నారు. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని కూడా ఒత్తిడి చేయలేదన్నారు. న్యాయవాది ఇంట్లో తనిఖీలకు ఈ కేసుకు సంబంధంలేదని ఆయన తెలిపారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలే తప్ప, వాస్తవాలు కావన్నారు. సివిల్ జడ్జి ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయని, ఆ నివేదిక సమగ్రంగా లేదని సత్యనారాయణ ప్రసాద్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తా.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సివిల్ జడ్జి నివేదికలో ఉన్న వాస్తవాలని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే.. ఆ నివేదికను పోలీసులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపింది. ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ సమయంలో సత్యనారాయణ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ.. ప్రతీ చిన్న కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరంలేదన్నారు. ఎలాంటి సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. అసలు ఈ వ్యాజ్యాల్లో పోలీసు ఉన్నతాధికారులపై ఎలాంటి ఆరోపణలులేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన దాఖలాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రీతిలో గతంలో ఓ న్యాయవాది విషయంలో కూడా పోలీసులు వ్యవహరించారని, తరువాత ఆ న్యాయవాది తన కేసును ఉపసంహరించుకున్నారని తెలిపింది. ఆ కేసును ఇప్పటికే మూసేసినప్పటికీ, దానిపై మళ్లీ విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఆ కేసును కూడా ప్రస్తుత కేసుల జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులపై నటి రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #JusticeforSushant అనేది ఓ బోగస్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సతీశ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇక సుశాంత్కు న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నవాళ్లదంతా ఓ బోగస్ ప్రచారం. డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!) మీలాంటి వాళ్లంతా సిగ్గుతో తలకు ఉరేసుకోవాలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, సోకాల్డ్ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతడితో సహ జీవనం చేసిన నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక రియా తరఫున సతీశ్ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆ లోకాన్ని వీడి మూడు నెలలు దాటినా అతడి మరణానికి గల స్సష్టమైన కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. మీడియా, సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాల కేసు గురించే విపరీతచర్చ జరుగుతోంది. దీంతో సుశాంత్ మృతి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని, అతడిది ఆత్మహత్యా లేదా హత్యా అన్నది తేల్చడంలో సీబీఐ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కుటుంబ లాయర్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) ఈ మేరకు.. ఎయిమ్స్ బృందంలోని ఓ డాక్టర్కు తాను గతంలో కొన్ని ఫొటోలు పంపించానని, అందులో సుశాంత్ మెడపై కొన్ని గుర్తులున్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. వాటిని బట్టి సుశాంత్ను ఎవరో గొంతు నులిమి చంపేశారని, అయితే 200 శాతం సూసైడ్ కాదని చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చడంలో సీబీఐ జాప్యం చేయడం విసుగు తెప్పిస్తోందంటూ వికాస్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు స్పందనగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి సైతం.. ‘‘చాలా రోజుల నుంచి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం! నిజాన్ని వెలికితీసేందుకు ఇంకెంత సమయం పడుతుంది?’’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం పానెల్ చీఫ్ వికాస్ సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మృతుడి శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, రిపోర్టు వచ్చేంత వరకు కాస్త ఓపికగా వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో బైకుల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY — Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020 -
తప్పు చేయకుంటే భయమెందుకు?
సాక్షి, న్యూడిల్లీ: అమరావతిలో భూముల అక్రమాలపై ఆధారాలుంటే కేసులు పెట్టాలని సవాల్ చేసిన టీడీపీ నేతలు దర్యాప్తుపై స్టే ఎందుకు తెచ్చుకున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీలు సూటిగా ప్రశ్నించారు. ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది: బెల్లాన ► సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే దానిపై స్టే తెచ్చారు. విపక్ష పార్టీల నేతలు గుడులు, గోపురాలపై దాడులు చేస్తూ దొంగే దొంగ అని అరిచిన మాదిరిగా వ్యవహరిస్తున్నారు. సవాల్ చేసి పరార్.. రంగయ్య..: భూ కుంభకోణాలు, ఇతర స్కాములపై ఆధారాలు చూపి కేసులు పెట్టుకోవాలని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేతలు మాటపై నిలబడకుండా పారిపోతున్నారు.తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కోర్టులకు వెళ్లి స్టే ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకుంటున్నారు? తప్పు చేయకుంటే స్వాగతించండి: బ్రహ్మానందరెడ్డి ► అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటున్నారు. ► అమరావతిలో చంద్రబాబు భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పు చేయకుంటే సీబీఐ దర్యాప్తును ఎందుకు స్వాగతించడం లేదు? ఆలయాలపై పారదర్శకంగా వ్యవహరిస్తూ సీబీఐ దర్యాప్తు కోరితే స్వాగతించకుండా విమర్శలకు దిగడం సిగ్గుచేటు. -
హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జారీచేసిన జీఓలను తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం, సిట్ను ఏర్పాటుచేశారన్న విషయాన్ని హైకోర్టు విస్మరించింది. పిటిషన్లు వేసేందుకు అర్హతలేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరపడమే కాకుండా, ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించడాన్ని తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తన అధికార పరిధిని ఉపయోగించి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టడం సరికాదు’.. అని వారు పేర్కొన్నారు. విచారణాధికారం ప్రభుత్వానికి లేదా? అలాగే, ‘గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అలాంటి ప్రజాస్వామ్యబద్ధ అధికారాన్ని న్యాయస్థానం తిరస్కరించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. గత ప్రభుత్వంపై విస్తృత అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షించే స్వతఃసిద్ధ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పడం ద్వారా హైకోర్టు తప్పుచేసింది. దర్యాప్తు చేయడాన్ని పునః సమీక్షగా హైకోర్టు భావించింది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. దర్యాప్తు చేసే, దర్యాప్తు సంస్థలను ఏర్పాటుచేసే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోలేదు’.. అని అందులో వివరించారు. హైకోర్టు తప్పుగా అర్ధంచేసుకుంది అంతేకాక.. ‘ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు చాలా విస్తృతమైనవి. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం సరికాదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ఒక్కరే కాబట్టి, పక్షపాతం ఉండే అవకాశం ఉందన్న హైకోర్టు వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. ఏ ప్రభుత్వానికీ అలాంటి దర్యాప్తు చేయడానికి వీలుండదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ప్రభుత్వంలో భాగం కాబట్టి, దానికి పక్షపాతాన్ని ఆపాదించడానికి ఏ మాత్రం వీల్లేదు’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా, సుమోటోగా సీబీఐ దర్యాప్తును కోరలేదు. ఈ విషయాన్ని హైకోర్టు తప్పుగా అర్ధం చేసుకుంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న న్యాయసూత్రాన్ని హైకోర్టు విస్మరించింది’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి తమ పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని వారు అభ్యర్థించారు. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సుశాంత్ది ముమ్మాటికీ హత్యే.. ఒకవేళ
‘‘నాలుగేళ్ల నుంచి సుశాంత్తో టచ్లో లేను. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను నమ్మను. తనది ముమ్మాటికి హత్యే అనిపిస్తోంది’’ అంటూ టీవీ నటుడు దీపక్ ఖజీర్ తన మనసులోని భావాలు వెల్లడించాడు. రాయడం అంటే సుశాంత్కు ఎంతో ఇష్టమని, ఒకవేళ తను నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదని అనుమానం వ్యక్తం చేశారు. మీడియా కథనాల ఆధారంగా ఈ విషయంలో అందరి అభిప్రాయాలు మారుతున్నాయని, అయితే సీబీఐ విచారణ పూర్తై, సుశాంత్ది ఆత్మహత్య అని తేలిస్తే తన అభిప్రాయంలో మార్పు ఉండవచ్చన్నారు. కాగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి, అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్లో అడుగుపెట్టిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14 తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించి విషయం విదితమే. (చదవండి: డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ వాడిన రియా!) ఈ క్రమంలో అతడి మృతి అనేక సందేహాలు, ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అంతేగాక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సాప్ చాట్లు బహిర్గతం కావడంతో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్కు ఎంతో గుర్తింపు తెచ్చిన పవిత్ర రిష్తా సీరియల్లో అతడితో కలిసి నటించిన దీపక్ ఖజీర్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ పవిత్ర రిష్తా సీరియల్ తర్వాత మళ్లీ తనను ఎన్నడూ కలవలేదు. అయితే నాలుగైదేళ్లలో ఓ వ్యక్తి పూర్తిగా మారిపోతాడని నేను అనుకోను. సుశాంత్కు ప్రతీ విషయం పేపర్పై పెట్టడం అలవాటు. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే నోట్ రాసేవాడు కదా. (చదవండి: ‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’) అంతేకాదు అయినా ఎలాంటి ఆధారాలు లభించకుండానే సుశాంత్ది సూసైడ్ అని ముంబై పోలీసులు ఎలా తేలుస్తారు? సుశాంత్ కుటుంబం ఇప్పటికే శోక సంద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసే సమయంలో మరాఠీలో రాశారని వార్తలు వచ్చాయి. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ’’అని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో నటి, ఎంపీ జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలను దీపక్ విమర్శించారు. ‘‘ఆమె అన్నట్లు ఇక్కడ చాలా మంది దగ్గర కనీసం కంచం కూడా లేదు. ఓ చిన్న గిన్నె పట్టుకుని పేమెంట్ల కోసం ఎదురుచూస్తారు. ఆలస్యమైతే ఆర్థిక బాధలు భరించలేక జీవితాలను అంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి’’అని సినీ నటుల పరిస్థితిని వివరించారు. అయితే సుశాంత్కు ఇలాంటి కష్టాలేమీ లేవని, అతడు ఆర్థికంగా బలంగా ఉండటం సహా చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు తీసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. తనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. -
నక్సల్స్కు మద్దతుగా పిటిషన్లా?
‘నక్సలైట్లు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అటువంటి వారికి మద్దతుగా పిటిషన్లు ఎలా వేస్తారు? ఇలాంటి పిటిషన్ల విషయంలో తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ల చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఆ పోలీసుల కుటుంబాల కోసం ఎవరైనా హైకోర్టులో పిటిషన్లు వేశారా? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా?’ – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా పెదబయలు మండలం బురద మామిడిలో 2012లో ఇద్దరు ఆదివాసి రైతులను ఎన్కౌంటర్లో కాల్చి చంపడంపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. పౌర హక్కుల నేత ఎన్హెచ్ అక్బర్ 2012లో దీనిపై పిల్ దాఖలు చేశారు. ఘటనకు కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నక్సలైట్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని సమర్థిస్తూ పిల్ దాఖలు చేసినందుకు పిటిషనర్ను వివరణ కోరతామంది. -
ఆ రెండింటికి సమాధానం చెప్పలేకపోతున్న రియా
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్ర, శనివారాలు వరుసగా రెండు సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆదివారం కూడా ఆమెను విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో రియా రెండు ముఖ్యమైన ప్రశ్నలకు దాటవేసే సమాధానాలిస్తున్నట్లు సమాచారం. సుమారు 50 ప్రశ్నలు అడిగితే అందులో రెండింటికి మాత్రం సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆ రెండు ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ దీనిపై మరింత క్లారిటీ కోసం మరోసారి వీటిని ప్రశ్నించనుంది.(చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఇంతకీ ఆ రెండు ప్రశ్నలేంటంటే.. "జూన్ 8న సుశాంత్తో బ్రేకప్ చేసుకున్నాకే అతని ఇంటి నుంచి వెళ్లిపోయారా? సమాధానం అవును అయితే ఏ కారణంతో విడిపోయారు?" రెండోది.. "మీరు అతని ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా సుశాంత్.. మీ సోదరుడికి ఫోన్ చేస్తూ మీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. మరి జూన్ 8 నుంచి 14 తేదీల మధ్య అతని కోసం మీరేమైనా పట్టించుకున్నారా? లేదా?" ఆదివారం నాటి విచారణలోనైనా రియా దగ్గర నుంచి ఈ రెండింటికి సరైన సమాధానాలు రాబట్టాలని సీబీఐ ఆలోచిస్తోంది. ఇదిలా వుండగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే సుశాంత్ ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితానీ, సామ్యూల్ మిరండ, సుశాంత్ వంటమనిషి నీరజ్, వాచ్మెన్, మేనేజర్, రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) -
‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి చెందాడు’
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు.(చదవండి: ‘కరోనా రిపోర్టు రాకముందే పోస్ట్మార్టం ఎందుకు?’) ఇక సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆది నుంచి ఈ నటుడిది హత్యేనని పేర్కొంటూ సుబ్రహ్మణ్యస్వామి పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సుశాంత్ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. (చదవండి: సుశాంత్ కేసు.. స్వామి సంచలన ఆరోపణలు) Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 ఇక అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఇటీవలే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ... నిజానిజాలను వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టింది. (చదవండి: సుశాంత్ మృతి: జూన్ 14న ఏం జరిగిందంటే..) -
బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు స్టేలతో అడ్డుకున్నారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ► చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నాను. ఈ మేరకు నా విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నా. దీనిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలి. ► చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ను అవినీతిమయం చేసి ఏటీఎంగా మార్చారన్న ప్రధాని.. గత ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపించారు. ► ఇప్పుడైనా ఆ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. ► ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో బాబు స్పష్టం చేయాలి. కనీస ఆధారాలే లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారు. ► చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం ముసుగులో బాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారు. -
సుశాంత్ కేసు: పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టి వేస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులను తమ పని తమను చేయనివ్వాలని, తమకేదైనా స్పష్టమైన సందేహం ఉంటే ముంబై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ అల్కా ప్రియకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. (దిల్ బేచారా: ఎంత మంది చూశారంటే!) అలాగే అభిమానులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా సుశాంత్ తండ్రి రియాపై పట్నాలో ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. తన కొడుకును మోసం చేసి రియా డబ్బులు లాక్కుందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో ఆరోపించారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) కాగా రియా ఈ కేసును ముంబైకి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి ట్రాన్సఫర్ చేయాలనీ.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా అదే కేసులో బీహార్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని రియా న్యాయవాది చెప్పారు. అంతేగాక స్వయంగా హోమంత్రి అమిత్షాకు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. మరోవైపు రియా చర్యను అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి ఈ రోజు(గురువారం) సుప్రీంకోర్టులో కోవియట్ పిటిషన్ వేశారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఇప్పటికే 40 మందికి పైగా ప్రశ్నించారు. (ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు) -
రంగయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
మంథని/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య మృతిపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథనిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు హింసించడం వల్లే రంగయ్య చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దళితుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయకుండా దహనం ఎందుకు చేయించారని భట్టి ప్రశ్నించారు. రంగయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని తలుపులను తడుతామని, రాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర, జాతీయ హక్కుల కమిషన్లను కలుస్తామని ఆయన వివరించారు. మంథని ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, సిరిసిల్లలోని నేరెళ్ల, పెద్దపల్లిలోని బొంపెల్లి ఘటనలపై విచారణ జరిపించి.. నివేదికలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యంగా తలెత్తుకొని బతకొచ్చని ఆశించి తెలంగాణ తెచ్చుకుంటే.. ఆరేళ్లలో ఏ ఒక్క వర్గం అలా ముందుకెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశించిన తెలంగాణ కోసం మరోమారు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడుతూ రంగయ్య మృతిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని భట్టి, శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.ఓసీపీ–1 బ్లాస్టింగ్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. -
సుధాకర్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా వైద్యుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సీబీఐకి నిర్దేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పులను, ప్రభుత్వ కౌంటర్, మెజిస్ట్రేట్ నివేదికలతో అన్ని రికార్డులను సీబీఐ అడిగినప్పుడు ఇవ్వాలని రిజిస్ట్రా్టర్ జనరల్కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎంత నిజాయతీగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపినా, ఎవరో ఒకరు వేలెత్తి చూపుతారని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ► డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. లేఖతోపాటు ఓ వీడియోనూ జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోను జత చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించడం తెలిసిందే. ► దీనిపై జస్టిస్ రాకేష్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ నెల 16న విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి సిగరెట్లు తాగి పోలీసులపైకి విసరడం.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం.. తదితరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను పోలీసులు ధర్మాసనం ముందుంచారు. పోలీసుల పట్ల అత్యంత అభ్యంతరకరంగా సుధాకర్ వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద నివేదించారు. ► ఈ క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం.. ఇవి గానీ, అనిత పంపిన వీడియో క్లిప్పింగులు గానీ పరిపూర్ణంగా లేవని, వీటి ఆధారంగా నిర్దిష్టమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదంది. ► అనంతరం డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేసి విశాఖ నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పంపిన నివేదికనూ పరిశీలించిన ధర్మాసనం.. ఇందులోని అంశాలకు, ప్రభుత్వ కౌంటర్లోని అంశాలకు మధ్య తేడాలున్నాయంది. సుధాకర్ ఒంటిపై ఆరు గాయాలున్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, అయితే వైద్యులు ఒక గాయమే ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయని, అందువల్ల ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించడం మేలంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.