deadline
-
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
పట్టాలెక్కనున్న ఎఫ్టీయూ
న్యూఢిల్లీ: భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య చాలాఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం(ఎఫ్టీయూ) త్వరలో పట్టాలకెక్కే దిశగా అడుగు ముందుకు పడింది. చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లెయెన్ నిర్ణయించారు. ఈ మేరకు ఒక డెడ్లైన్ విధించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుండడంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ దేశాలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, ఉర్సులా ఒక అంగీకారానికి వచ్చారు. వారిద్దరూ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. నిజానికి ఇండియా, ఈయూ మధ్య ఈ ఒప్పందం కోసం గత 17 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్లో పునఃప్రారంభమయ్యాయి. కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. కొన్ని అంశాలపై ఈయూ గట్టిగా పట్టుబడుతుండగా, ఇండియా సమ్మతించడం లేదు. కార్లు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయాలని ఈయూ కోరుతుండగా, భారత ప్రభుత్వం తిరస్కరిస్తోంది. మోదీ, ఉర్సులా భేటీ కావడంతో ఇక ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కలసికట్టుగా పనిచేద్దాం భారత్, ఈయూ మధ్య సంబంధాలపై మో దీ, ఉర్సులా విస్తృతంగా చర్చించారు. ఇరుపక్షాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఇండియాతో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఉర్సులా పేర్కొన్నారు. ఇండియా–ఈయూ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కచి్చతమైన రోడ్మ్యాప్ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు. తదుపరి ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సు నాటికి రోడ్మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ సదస్సు వచ్చే ఏడాది భారత్లో జరుగనుంది. మరోవైపు భేటీ తర్వాత మోదీ, ఉర్సులా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, ఈయూ మధ్య వ్యాపారం వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, రవాణా వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. -
ఏటా రూ.9 లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రతిఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2030ని డెడ్లైన్గా విధించింది. అయితే, గడువు కంటే ముందే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న విశ్వాసం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ‘భారత్ టెక్స్–2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్త్రాల ఎగుమతిలో ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని తెలిపారు. మనం ప్రతిఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దీన్ని మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో వస్త్ర టెక్స్టైల్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మనం ఇలాగే కష్టపడి పనిచేస్తే గడువు కంటే ముందే ఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయగలమని స్పస్టంచేశారు. టెక్స్టైట్ రంగంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.75 కోట్లు అవసరమని, దీంతో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంక్లకు సూచించారు. వస్త్ర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 5ఎఫ్ విజన్ను ప్రధానమంత్రి ప్రతిపాదించారు. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ విజన్తో రైతులకు, నేత కార్మికులకు, డిజైనర్లకు, వ్యాపారులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన నూతన పరికరాల తయారీ కోసం ఐఐటీల వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. భారత్ టెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హై–గ్రేడ్ కార్బన్, ఫైబర్ తయారీ దిశగా మన దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
వర్క్ పర్మిట్లపై బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలి
వాషింగ్టన్: అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) గడువు 180 రోజుల నుంచి అటోమేటిక్గా 540 రోజులకు పెరిగేలా వెసులుబాటు కల్పిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. దీనివల్ల హెచ్–1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ప్రయోజనం చేకూరుతోంది. జో బైడెన్ ప్రభుత్వం పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 13న డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫైనలైజ్ చేసింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వలసదార్ల విషయంలో నూతన అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ పర్మిట్ల రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ గురువారం కాంగ్రెస్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఈఏడీ గడువు పెంచడాన్ని రద్దు చేయకపోతే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు. -
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!
ఆధార కార్డు అప్డేట్ కోసం.. 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' పలుమార్లు గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. కాగా ఇప్పుడు పొడిగించిన గడువు (డిసెంబర్ 14) సమీపిస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు చేయాలనుకునేవారు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.డిసెంబర్ 14 లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఇప్పటి వరకు స్థాన చలనం చేయకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➜మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➜లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➜నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➜రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➜అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➜మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➜అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు.ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం.ఇదీ చదవండి: ఈ ఒక్క ఐడీ ఉంటే చాలు.. ఆధార్ నెంబర్తో పనే లేదు! -
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికిగాను నవంబర్ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024 -
డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి. తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు. ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. -
డిసెంబర్ 14 డెడ్లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.ఆధార్ కార్డ్లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.ఆధార్ అప్డేట్ ఆవశ్యకతప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.డిసెంబర్ 14 ఆఖరి గడువు?పదేళ్లు దాటిన ఆధార్లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా..⇒ 'MyAadhaar' పోర్టల్కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్ను నమోదు చేయండి.⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి.⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి.ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలురేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కార్పొరేట్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 31 గడువు తేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 15 రోజులు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.సీబీడీటీ ఇప్పటికే ఆడిట్ నివేదికల దాఖలు తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.గడువు తేదీ లోపు ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి చాలా మంది ట్యాక్స్పేయర్స్, సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడవు పొడిగింపు వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదనపు సమయం లభించడంతో ఎలాంటి ఒత్తిడి, జరిమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఫైలింగ్లను పూర్తి చేయవచ్చు. -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
TG: ప్రభుత్వానికి హరీశ్రావు డెడ్లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్రావు డెడ్లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
ఐటీఆర్ గడువు పొడిగింపు? ఐటీ శాఖ క్లారిటీ
ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. “ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం’’ అని వివరించింది.అదే విధంగా ఆదాయపు పన్ను రీఫండ్లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. “తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలు లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్ఎంఎస్లు, మెయిల్ పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అప్రమత్తం చేసింది.కాగా 22 జూలై వరకు 4 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాఖలు చేసిన రిటర్న్లతో పోలిస్తే 8% ఎక్కువ. జూలై 16న రోజువారీ దాఖలు చేసిన ఐటీఆర్ల సంఖ్య 15 లక్షలు దాటింది. గడువు తేదీ సమీపిస్తుండటంతో రోజువారీ ఫైలింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్సైట్లో పేర్కొంది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్ను యాక్సెస్ చేయగలరు.» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.» స్టెప్ 8: 'సబ్మిట్' ఆప్షన్పై క్లిక్ చేయండి.» స్టెప్ 9: 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్లో ఈ విషయం తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్సభతోపాటు అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలంటే.. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి. కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్డేట్లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు. #UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders. This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt — Aadhaar (@UIDAI) March 12, 2024 -
ఇదే ఫైనల్.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్ డెడ్లైన్!
ఇదే ఫైనల్.. ఇక ఆఫీసులకు రాకపోతే మీ ఇష్టం.. ఇది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇచ్చిన్న వార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు మార్చి ఆఖరికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్లైన్ విధించినట్లు సమాచారం. రిటర్న్-టు-ఆఫీస్ మ్యాండేట్కు అనుగుణంగా ఉద్యోగుల హైక్లు, వేరియబుల్ పేఅవుట్లను టీసీఎస్ లింక్ చేస్తున్నట్లు నివేదికలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఈ డెడ్లైన్ రావడం గమనార్హం. కొత్త ఆదేశాల గురించి యూనిట్ హెడ్లు తమ టీం సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రహ్మణ్యంను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. డెడ్లైన్కు సంబంధించి టీసీఎస్ ఉద్యోగులకు తుది కమ్యూనికేషన్ పంపించింది. విస్మరించినవారు పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం ఇటు ఉద్యోగులు, అటు కంపెనీ ఇద్దరికీ ఇబ్బందికరమని సంస్థ పేర్కొంటోంది. ఇప్పటికే 65 శాతం మంది టీసీఎస్ జనవరి 11 నాటి డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల ప్రకటనలో 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నారని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికర ప్రాతిపదికన 5,680 పడిపోయింది. టీసీఎస్కు హెడ్కౌంట్ తగ్గడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. క్యూ2లో ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గింది. గత డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 603,305. -
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు ఫిబ్రవరి 5
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించే పదోతర గతి (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు విధించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించేది లేదని పేర్కొ న్నారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజర య్యేవారే ఆ తరువాత జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమచేయాలని, అదేరోజు నామినల్ రోల్స్ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పెంపు
సాక్షి, అమరావతి: ఆధార్లో అడ్రసు తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్లైన్ వెబ్పోర్టల్లో అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును ఆధార్కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్కార్డులు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారైనా వారికి సంబంధించి తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఐడీఏఐ అప్పట్లో ప్రకటించింది. అదే సమయంలో.. ఆధార్కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్లైన్లో సొంతంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా అప్పట్లో ప్రకటించింది. మొదట 2023 ఫిబ్రవరి వరకే ఈ ఉచిత సేవలని యూఐడీఏఐ ప్రకటించగా.. అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది. తాజాగా నాలుగోసారి 2024 మార్చి 14 వరకు గడువు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. -
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. -
రూ.2000 నోట్లు: ఆర్బీఐ గుడ్ న్యూస్
Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలను కోరింది. RBI సంచలన ప్రకటన ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది. ► వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు. ► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి. ► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. కాగా క్లీన్-నోట్ విధానంలో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్ సేల్, ధర ఎంతంటే?) -
గృహలక్ష్మి పథకం.. ఆరు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల ఐదో తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ కసరత్తు పూర్తి చేయాలనే అక్టోబర్ 5 డెడ్లైన్గా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తులు 15 లక్షలు..అర్హత ఉన్నవి 11లక్షలు సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించి.. వారే ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లు మొత్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహా్వనించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. వాటి నుంచి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఏ ఊరు.. ఎవరు లబ్ధిదారులు నియోజకవర్గంలో ఏఏ ఊళ్ల నుంచి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని గతంలోనే మౌఖికంగా ఆదేశాలందాయి. ఇప్పుడు అధికారులకు ఎమ్మెల్యేలు అందించే వివరాల ఆధారంగా జాబితాలు రూపొందుతున్నాయి. ఏఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వేగంగా వివరాలు అందిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో జాబితాలు అంత వేగంగా సిద్ధమవుతున్నాయి. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందితో జాబితా సిద్ధమైంది. మిగతా లబ్దిదారుల జాబితా వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం లోపు ఖరారు చేయాలని తాజాగా సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖికంగా అదేశాలందినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆ పనిలో వేగం పెంచారు. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ గతంలో అందిన దరఖాస్తులే కాకుండా ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అందిన దరఖాస్తులు కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ‘అవసరం’అని భావిస్తే, ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని జాబితాలో పేరు చేరుస్తున్నట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేది నిరంతర ప్రక్రియే అన్న మాటతో ఈ తంతు కానిస్తున్నట్టు సమాచారం. -
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సీఎంఆర్ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్సీఐని ఆదేశించింది. -
రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్లైన్ పొడిగిస్తారా?
Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆర్బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది. అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్లైన్ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్లైన్ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై కేంద్రం నుంచి ఆర్బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే రెండు వేల రూపాయలనోట్లను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్ని కలిగి ఉండటం మంచిది. ఈ వారంలో బ్యాంకుల సెలవులు ♦ బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి. ♦ గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు. ♦ శుక్రవారం,శనివారం అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో శుక్రవారం కూడా సెలవు. మరోవైపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది. -
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్ వంటి ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్లైన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లకు నామినీల చేర్పు ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) కొత్త టీసీఎస్ నియమాలు క్రెడిట్ కార్డ్లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 2,000 నోట్ల మార్పిడి రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. -
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్లో నీటికొరతపై సుభాష్చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్అరాధే, శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
స్పైస్జెట్కు డెడ్లైన్: కడతారా? జైలుకెడతారా అజయ్ సింగ్కు సుప్రీం వార్నింగ్
SpiceJet Vs Credit Suisse క్రెడిట్ సూయిస్ కేసులో విమానయాన సంస్థ స్పైస్జెట్కు భారీ షాక్ తగిలింది.క్రెడిట్ సూయిస్ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్జెట్ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్జెట్లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 15లోగా క్రెడిట్ సూయిస్కి వాయిదాల రూపంలో 5 లక్షల డాలర్లను చెల్లించాలని, అలాగే డిఫాల్ట్ చేసిన మొత్తానికి 1 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్జెట్ సుప్రీంకోర్టు ఆదేశించింది.లేని పక్షంలో 'కఠిన చర్యలు' తీసుకుంటామని స్పైస్జెట్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. (ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు) ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం క్రెడిట్ సూయిస్ బకాలయిలను క్రెడిట్ సూయిస్కి బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెల్లించని పక్షంలో సింగ్ను తీహార్ జైలుకు పంపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే ఇక డిల్లీ-డాలీ బిజినెస్ను కట్టిపెట్టండి అంటూ కోర్టు ఆగ్రహ్యం వక్తం చేసింది. అనంతరం ఈ కేసును సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. -
గుడ్న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్’ (Amrit Kalash) స్కీమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ప్రత్యేక పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. ఎస్బీఐ అమృత్ కలశ్ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ స్కీమ్. ఈ పథకం 2023 ఏప్రిల్ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్ అయిన ఈ స్పెషల్ స్కీమ్ గడువును ఎస్బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి -
ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి?
జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైంది. ఎప్పటి నుంచో పొడించుకుంటూ వస్తున్న ఆధార్-పాన్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీతో ముగిసిపోయింది. ఇక పొడిగింపు ఉండదని ఆదాయపు పన్న శాఖ తేల్చి చెప్పేసింది. అయితే జూలై నెలలో పూర్తి చేయాల్సిన ఫినాన్సియల్ డెడ్లైన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఐటీఆర్ దాఖలు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 ఆఖరు తేదీ. గడువు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందడం సహజం. అయితే ఫారమ్ 16, 26AS, వార్షిక సమాచార స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వడ్డీ, మూలధన లాభాల స్టేట్మెంట్ వంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, తరచుగా చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులువుగా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో హడావుడి తప్పులకు దారితీస్తుంది.ఆదాయపు పన్ను రిటర్న్ను సంబంధిత డాక్యుమెంట్లు జోడించకుండా ఫైల్ చేయడం వలన తక్కువ రిపోర్టింగ్కు దారి తీయవచ్చు. దీనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఆఖరు వరకు వేచి ఉండకుండా కాస్త ముందుగానే ఐటీఆర్ ఫైల్ ఉత్తమం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి గడువును జూలై 11 వరకు పొడిగించింది. అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్లను ఆన్లైన్ ద్వారా ఎంచుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈపీఎఫ్వో వెబ్సైట్కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉద్యోగి UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వంటి నిర్దిష్ట వివరాలను అందించాలి. దరఖాస్తు ధ్రువీకరణ కోసం ఉద్యోగి ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, చందా సమాచారంతో కూడిన మునుపటి క్రియాశీల పీఎఫ్ లేదా పెన్షన్ ఖాతాల గురించిన సమాచారాన్ని అందించాల్సిన అప్లికేషన్ తదుపరి పేజీకి వెళ్తారు. ఇక్కడ సమాచారంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయ్యాక ఒక రసీదు సంఖ్య వస్తుంది. దాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం దాచుకోవాలి. అధిక పెన్షన్ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్వో లింక్ను కూడా అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: కోటికి పైగా ఐటీఆర్లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా.. -
గుడ్న్యూస్: ఈపీఎఫ్వో అధిక పింఛన్కు దరఖాస్తు గడువు పొడిగింపు
ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో అధిక పింఛన్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ఈపీఎఫ్వో సభ్యులకు ఊరట లభించింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడవును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) పొడిగించింది. ఇది జూన్ 26తో ముగియాల్సి ఉండగా జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధిక పింఛన్ను ఎంచుకునేందుకు ఈపీఎఫ్వో సభ్యులకు గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించిన ఈపీఎఫ్వో తాజాగా మరోసారి పొడిగించింది. సభ్యులకు మరింత అవకాశం కల్పించేందుకు ఇంతకుముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్ 26 వరకు డెడ్లైన్ను పొడించుకుంటూ వచ్చింది. ఎవరు అర్హులు? 2014 సెప్టెంబరు 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పింఛన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబరు 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే. అవసరమైన పత్రాలు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీవో), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు అవసరమవుతాయి. అధిక పెన్షన్ను ఎలా లెక్కిస్తారు? 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 12 నెలలలో కాంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిలో తీసుకున్న సగటు నెలవారీ వేతనం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన, విరమణ చేయబోయే ఉద్యోగులకు, సభ్యత్వం నుండి నిష్క్రమించే తేదీకి ముందు 60 నెలలలో పొందిన సగటు నెలవారీ వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కకడతారు. -
గడువు ముగుస్తోంది.. పాన్-ఆధార్ లింక్ చేశారా?
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్తో లింక్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ముగుస్తోంది. మినహాయింపు కేటగిరీకి చెందినవారు తప్ప మిగిలిన వారందరూ వెంటనే తమ పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్లో రిమైండర్ను షేర్ చేసింది. చివరి తేదీ సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు, పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. పాన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన సూచనలతోపాటు గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జరిగే పరిణామాల గురించి కూడా హెచ్చరించింది. చివరి తేదీ ఎప్పుడు? పాన్-ఆధార్ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. ఈలోపు పాన్ను ఆధార్తో అనుసంధానించకపోతే, 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ పాన్ కార్డ్ పని చేయకుండా పోతుంది. పాన్-ఆధార్ లింక్ చేయడమెలా? ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ కోసం సెర్చ్ చేసి అందుబాటులో ఉన్న పాన్-ఆధార్ లింక్పై క్లిక్ చేయాలి అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి లేకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి (యూజర్ ఐడీగా పాన్ నంబర్ నమోదు చేయాలి) వెంటనే ఆధార్-పాన్ లింక్ను తెలియజేసే పాపప్ కనిపిస్తుంది. (ఒకవేళ కనిపించకపోతే వెబ్సైట్ ఎడమ వైపు విభాగాన్ని సందర్శించండి) అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి వివరాలను నిర్ధారించి, క్యాప్చాను ఎంటర్ చేయాలి ఇది పూర్తయిన తర్వాత పాన్ ఆధార్ కార్డ్కి విజయవంతంగా లింక్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. లింక్ చేయకపోతే ఏమౌతుంది? ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది. అలాగే ఈ కింది పరిణామాలను పాన్ హోల్డర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెల్లింపులు నిలిచిపోతాయి. పాన్ పని చేయని కాలానికి నిలిచిపోయిన నగదుపై ఎటువంటి వడ్డీ రాదు అధిక టీడీఎస్, టీసీఎస్లు భరించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు, కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల వాసులు, భారతీయ పౌరులు కానివారు, 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి, జరిమానాల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2023 మార్చి 28న ఆర్థిక శాఖ ఇచ్చిన ప్రకటనలో పాన్-ఆధార్ లింకింగ్కు చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2023 మార్చి 28 నాటికి 51 కోట్లకుపైగా పాన్లు ఆధార్తో లింక్ అయినట్లు పేర్కొంది. पैन धारक कृपया ध्यान दें! आयकर अधिनियम, 1961 के अनुसार, पैन धारक, जो छूट की श्रेणी में नहीं आते हैं, उन्हें 30.06.2023 तक अपने पैन को आधार से जोड़ना अनिवार्य है। कृपया अपना पैन और आधार आज ही लिंक करें! Kind attention PAN holders! As per Income-tax Act, 1961, it is mandatory… pic.twitter.com/VyliEJ75Gy — Income Tax India (@IncomeTaxIndia) June 21, 2023 ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
ట్విటర్కు ఆస్ట్రేలియా డెడ్లైన్: ఉద్యోగులను తొలగించిన పాపం ఊరికే పోతుందా?
ఆన్లైన్ దుర్వినియోగాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ట్విటర్కు జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ సంస్థ హెచ్చరించింది. ఎలాన్ మస్క్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ట్విటర్లో విషపూరిత, విద్వేష కంటెంట్ పెరిగిపోయిందని ఆరోపించింది. ఆన్లైన్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఆస్ట్రేలియాలో నమోదవుతున్న ఫిర్యాదులలో మూడింటిలో ఒకటి ట్విటర్పై ఉంటోందని ఆ దేశ ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అన్నారు. ఆమె ట్విటర్ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. వైఫల్యాన్ని సవరించుకోవడానికి ట్విటర్కు 28 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు దాటితే రోజుకు 7 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.3.9 కోట్లు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్మాన్ గ్రాంట్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో చిక్కులు మస్క్ 2022 అక్టోబర్లో ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో 80 శాతం ఉద్యోగులను తొలగించారు. వీరిలో కంటెంట్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పనిచేసే కంటెంట్ మోడరేటర్లు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నియంత్రించే గ్లోబల్ డ్రైవ్కు ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తోంది. ఇన్మాన్ గ్రాంట్ ట్విటర్ ట్విటర్ తప్పులను ఎత్తిచూపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్లోనే ఆమె మస్క్కి లేఖ రాశారు. సంస్థలో మితిమీరిన ఉద్యోగుల తొలగింపులు ఆస్ట్రేలియన్ చట్టాలను అందుకోలేకపోవడానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్విటర్లో జాత్యాహంకార వ్యాఖ్యలకు తాను గురైనట్లు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ స్టాన్ గ్రాంట్ పేర్కొన్నారు. దీనిపై గత మే నెలలో ట్విటర్ యాజమాన్యానికి తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: Olx Layoffs: ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత -
బ్యాంక్ లాకర్ డెడ్లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్..
Bank Locker Deadline: విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలను భద్రపరచడానికి అత్యంత సురక్షితమైన సాధనం బ్యాంక్ లాకర్ అని మనందరికీ తెలుసు. ఈ బ్యాంక్ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి లాకర్ పరిమాణాన్ని బట్టి ఖాతాదారుల నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి. ఈ లాకర్లకు సంబంధించి ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి. తాజగా బ్యాంక్ లాకర్ల వినియోగదారులకు ఎస్బీఐతో సహా అనేక బ్యాంకులు ముఖ్యమైన అలర్ట్ అందించాయి. సవరించిన లాకర్ ఒప్పందంపై జూన్ 30 లోపు సంతకం చేయడం తప్పనిసరి అని సూచించాయి. ఆర్బీఐ మార్గదర్శకాలేంటి? జనవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్ ఒప్పంద ప్రక్రియను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే జూన్ 30 నాటికి 50 శాతం లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ పూర్తవ్వాలి. ఆ తర్వాత సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, డిసెంబర్ 31 నాటికి 100 శాతం పూర్తవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు లాకర్ ఒప్పందాలు పూర్తి చేయాలని కస్టమర్లకు అలర్ట్లు పంపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీ చేసింది. తర్వాత 2021 ఆగస్టులో లాకర్ ఒప్పంద నియమాలను సవరించింది. ఎటువంటి చార్జ్ లేకుండా.. బ్యాంకుల్లో కొత్త లాకర్లను పొందే కస్టమర్ల కోసం ఒప్పంద నియమాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే లాకర్లు కలిగిన కస్టమర్లు ఒప్పంద ప్రక్రియను 2023 జనవరి 1 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా చాలా మంది కస్టమర్లు సవరించిన ఒప్పందాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్బీఐ గడువును 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జ్లు వసూలు చేయకుండా స్టాంప్ పేపర్పై ఒప్పందాలను పూర్తి చేయాలి. లాకర్ నిబంధనలు ఇవే.. బ్యాంక్ లాకర్లు వివిధ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు పడటం వంటి విపత్తులు, అల్లర్లు, తీవ్రవాద దాడుల వంటి ఘటనల కారణంగా లాకర్కు కలిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే లాకర్ భద్రతను నిర్ధారించడం బ్యాంక్ బాధ్యత. అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు, దోపిడీలు, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం, బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్క్యాష్మెంట్పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్న్యూస్: నామినీ నమోదు ఎలా?
సాక్షి,ముంబై: మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ భారీ ఊరటనిచ్చింది. నామినీ వివరాల నమోదుకు గడువు పొడిగిస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాదారులకు సమర్పించే గడువును ఆరు నెలలపాటు, అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30వరకు పొడిగించింది. (ఇదీ చదవండి: దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో) ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువు మార్చి 31తో ముగియనున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా 2021 జూలైలో సెబీ ఆదేశించింది. ఆ తరువాత ఈ గడువును పెంచడంతోపాటు 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం మ్యాండేటరీ చేసింది. (హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ ) నామిని అంటే నామినేషన్ అనేది మరణం సంభవించినప్పుడు ఖాతాదారుడి ఆస్తులకు వారసుడిగా ఒకవ్యక్తిని నియమించే ప్రక్రియ. ఇన్వెస్టర్లు ప్రారంభించిన కొత్త ఫోలియోలు/ఖాతాలకు నామిని నమోదు తప్పనిసరి. దీంతో పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి నిధులను బదిలీ చేయడం సులభమవుతుంది. లేదంటే వారి వారసులు ఆయా యూనిట్లను అతడు లేదా ఆమె పేరు మీద బదిలీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా వీలునామా, చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రం, ఇతర చట్టపర వారసుల నుండి ఎన్వోసీలు లాంటి అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) నామినీ నమోదు ఎలా? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు స్వయంగా సంబంధిత శాఖల ద్వారా, లేదా CAMD, KFintech వంటి RTA వెబ్సైట్ల ద్వారా నామినేషన్ పూర్తి చేయవచ్చు. వన్-టైమ్-పాస్వర్డ్ (OTP) ధృవీకరణ ద్వారా ఆ ప్రక్రియనుపూర్తి చేయవచ్చు. -
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్లైన్ ముగియకముందే మేల్కొండి!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు నామినేషన్ సమర్పించేందుకు ఇచ్చిన గడువు మార్చి 31తో ముగియనుంది. ఎవరినైనా నామినీగా నమోదు చేయడం లేదంటే, నామినేషన్ ఆప్ట్ అవుట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇన్వెస్టర్ ఎంపిక చేసుకోకపోతే గడువు ముగిసిన తర్వాత వారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నీ స్తంభనకు గురవుతాయి. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. ఫండ్స్ పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలకు నామినేషన్ లేదా నామినేషన్ వద్దంటూ డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ సెబీ 2022 జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జూలై ఆఖరి వరకు గడువు ఇవ్వగా.. అక్టోబర్ వరకు పొడిగించారు. అప్పటికే పెట్టుబడులు కలిగిన వాటికి నామినేషన్ సమర్పించేందుకు 2023 మార్చి 31 వవరకు గడువు ఇచ్చింది. నామినేషన్ లేకుండా పెట్టుబడిదారు మరణించినట్టయితే.. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వారసులు లేదా కుటుంబ సభ్యులు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా నామినేషన్ను సెబీ తీసుకొచ్చింది. -
Taxpayers-ITR Filing: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్లను గడువుకు ముందే సమర్పించాలి. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) ఆలస్యమైతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! -
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్లో ఒ కప్రకటన జారీ చేసింది. నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్ను పూర్తి చేయని కస్టమర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్ను, కేవేసీ రికార్డ్లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. pic.twitter.com/HZOMQN9pbJ — Bank of Baroda (@bankofbaroda) March 13, 2023 -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్న్యూస్
సాక్షి, ముంబై: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు. 2023 మార్చి 3 తో గడువు ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్వో గడువును పొడిగించింది. అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం ఈ గడువు మే 3 వ తేదీవరకు ఉంది. ఈ పరిధిలోని చందాదారులు, పెన్షన్దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మే 3 తేదీ వరకు అప్లయ్ చేసుకోవవచ్చు. (ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?) సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది. అయితే తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏకీకృత సభ్యుల పోర్టల్లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్ఓ తన జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్!
ఇటీవల ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి దానిలో ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చాలా వాటిలో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవగా, పాన్ కార్డులో ఇది ఇంకా కొనసాగుతోంది. అందుకే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వ ( March 2023) లోపు లింక్ చేసుకోవాలిని సూచిస్తోంది. వాస్తవానికి ఈ అనుసంధానం కోసం ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చింది ఐటీ శాఖ. ఈ క్రమంలో మరో మారు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చినా, ఇక్కడ ఇంకో నిబంధన కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్తో లింకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత గడువు లోపు లింకు చేస్తున్న వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు గమనిస్తే.. మరోమారు ఈ ప్రక్రియకు పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గడువు తేదిలోపు లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, డెడ్లైన్
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేసిన వెంటనే కీలక ఉద్యోగులపై వేటు, వారం రోజుల్లో సంస్థలో సగం మందిని ఇంటికి పంపించిన మస్క్ మిగిలిన ఉద్యోగులకు కూడా కఠిన షరతులు పెడుతున్నారు. చాలా తీవ్రంగా పని చేస్తారా లేక నిష్క్రమిస్తారా తేల్చుకోవాలంటూ ఉద్యోగులకు డెడ్లైన్ విధించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించింది ట్విటర్. కంపెనీతో కలిసి ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలని, ట్విటర్ సంస్థాగతపునర్నిర్మాణంలో భాగంగా తీవ్ర ఒత్తిడితో, ఎక్కువ గంటలు పని చేయాలని లేదా వైదొలగేందుకు అంగీకరించాలని ఈ మెయిల్ సందేశాన్ని ఉద్యోగులకు అందించింది. న్యూయార్క్ కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ఫారమ్ను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్యోగులు పూర్తి చేయాలని మస్క్ కోరుకున్న ఫారమ్లో ఒకే ప్రశ్న ఉంది: "మీరు ట్విట్టర్లో ఉండాలనుకుంటున్నారా?" అలాగే ఆన్లైన్ ఫాంని సమర్పించేందుకు .. నో అనే అప్షన్ లేనేలేదు. కేవలం ఎస్ అనే ఆప్షన్ మాత్రమే ఇచ్చింది. దీనికి అంగీకరించని వాళ్లు మూడు నెలల సెవరెన్స్ పే అందుకుంటారని ఇమెయిల్ పేర్కొంది. అంతేకాదు అసాధారణ పనితీరు ఆధారంగానే గ్రేడ్ ఉంటుందని ట్విటర్ తెగేసి చెప్పింది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్పై ప్రశంసలు) సంస్థ ఆదాయం 50 శాతం పెంచేలా ఉద్యోగులు కష్టపడాల్సిందేనంటూ తన తొలి ఈమెయిల్లో మస్క్ ఆదేశాలు జారీ చేశారనీ, అలాగే సంస్థ సక్సెస్ కోసం చాలా హార్డ్కోర్గా ఉండాలని ఆదేశించిన ఈమెయిల్ సందేశాన్ని ఉటంకిస్తూ, వాషింగ్టన్ పోస్ట్, బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ చేశాయి. దీనిపై పలువురు ఉద్యోగులు సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తుండగా, తాజా పరిణామంపై ఉద్యోగ, పౌరహక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయని తెలుస్తోంది. -
డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్,ఆఫ్సేల్ యాప్లో లావాదేవీలలో ఉపయోగించిన మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి ప్రత్యేక టోకెన్లతో భర్తీ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జూలై 1 నుండి 'క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్' మార్గదర్శకాలను అమలు చేయాల్సవ ఉంది. అయితే, పరిశ్రమ వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును అక్టోబరు 1కి పెంచింది. కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడతాయని, కార్డ్ వివరాలు ఎన్క్రిప్టెడ్ “టోకెన్”గా స్టోర్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బహిర్గతం చేయకుండా చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. ఫలితంగా కార్డ్ హోల్డర్ల ఆన్లైన్ లావాదేవీల అనుభవాలను మెరుగుపరుస్తుంది. సైబర్ నేరగాళ్లనుంచి కార్డ్ సమాచారాన్ని భద్ర పరుస్తుంది. కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. టోకెన్లు ఎలా రూపొందించుకోవాలి ♦ కొనుగోలుకుముందు చెల్లింపు లావాదేవీని ప్రారంభించడానికి, ఇ-కామర్స్ వ్యాపారి వెబ్సైట్ లేదా అప్లికేషన్కు వెళ్లాలి ♦ ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ♦ షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి. ♦ క్రియేట్ టోకెన్ను సెలక్ట్ చేసి,అధికారిక మొబైల్ ఫోన్ లేదా ఇమెయిల్లో ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతోటోలావాదేవీ పూర్తి అవుతుంది. ♦ తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అదే వెబ్సైట్ లేదాయాప్లో తదుపరి కొనుగోళ్లకు నాలుగు అంకెల టోకెన్ ఇస్తే సరిపోతుంది. ♦ తద్వారా మోసాలకు తావుండదని, కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు కష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయం. ♦ దీని ప్రకారం ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ కస్టమర్ యాక్టివేట్ చేయపోతే, ఎలాంటి సమ్మతి రాకపోయినా, కన్ఫర్మేషన్ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలోగా, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ అవుతుంది. -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్లైన్ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదా? లేదంటే కత వేరుంటది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ ( ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం. గడువు కంటే ముందే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోని ప్రాముఖ్యత, ప్రయోజనాలు ♦ పన్ను చెల్లింపుదారులు ఏదైనా జరిమానా లేదా పెనాల్టీని నివారించడానికి గడువు ముగిసేలోపు ఐటీఆర్ను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. ♦ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తులు, ఉద్యోగుల ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ♦ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారికి గడువు అక్టోబర్ 31. పెనాల్టీ గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి. చట్టపరమైన చర్య ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు మనమిచ్చిన సమాధానంతో ఐటీ డిపార్ట్మెంట్ సంతృప్తి చెందకపోతే, ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసును కూడా ఎదుర్కోవాలి. రుణాలను పొందడం సులభం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్లో క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే, బ్యాంకులనుంచి రుణాలను పొందడం సులభమవుతుంది. లోన్లను అందించే సమయంలో ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే. సో.. అధికారిక రుణం కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ తప్పనిసరి. ఐటీఆర్ ఫైల్ చేయని వ్యక్తులు సంస్థాగత రుణదాతల నుండి రుణాలు పొందడం కష్టం కేరీ ఫార్వర్డ్ లాసెస్ గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ఫార్వార్డ్ చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు అనుమతిస్తాయి. ఇది పన్ను చెల్లింపు దారులు తమ భవిష్యత్ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వరగా వీసా కావాలంటే వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్ ఫైలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది. -
రుణ చెల్లింపులో రష్యా విఫలం
మాస్కో/కీవ్: అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగానే పడుతోంది. దాంతో విదేశీ రుణాల చెల్లింపులో విఫలమైంది. గత 104 ఏళ్లలో రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన నేపత్యంలో స్విఫ్ట్తో పాటు పలు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థల నుంచి రష్యాను అంతర్జాతీయ సమాజం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దాంతో నిధులున్నా కూడా పలు విదేశీ రుణాలపై 10 కోట్ల డాలర్ల మేర వడ్డీలను నిర్ణీత తేదీలోపు రష్యా చెల్లించలేకపోయింది. ఈ మొత్తాన్ని యూరోక్లియర్ బ్యాంకుకు పంపినా అక్కడే నిలిచిపోయింది. చెల్లింపులు ఆగిపోవడం నిజమేనని రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిల్యానోవ్ అంగీకరించారు. అయితే ఇది అంతర్జాతీయ సహాయ నిరాకరణ ఫలితమే తప్ప ఎగవేత కాదని వివరించారు. ఈ నేపథ్యంలో విదేశీ చెల్లింపులను రష్యన్ బ్యాంకు ద్వారా రూబుల్స్లో చెల్లించాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. లీసిచాన్స్క్పై నిప్పుల వర్షం డోన్బాస్లోలో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరం లీసిచాన్స్క్పై రష్యా సేనలు సోమవారం నిప్పుల వర్షం కురిపించాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాటో దేశాధినేతల భేటీ కొనసాగుతుండగానే రష్యా దాడులను ఉధృతం చేయడం గమనార్హం. గత 24 గంటల్లో రష్యా సాగించిన క్షిపణి దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మృతిచెందారని, మరో 31 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెసా, మైకోలైవ్ తదితర నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్లొవియాన్స్క్పైనా రష్యా క్లస్టర్ బాంబు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. స్లొవియాన్స్క్లో ఉక్రెయిన్ మిలటరీ బేస్ ఉంది. 1,000 మంది ఉన్న మాల్పై... రష్యా క్షిపణి దాడి ఉక్రెయిన్లో సామాన్య పౌరులపైనా రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం క్రెమెన్చుక్లో 1,000 మందికిపైగా జనంతో కిక్కిరిసి ఉన్న ఓ భారీ షాపింగ్ మాల్పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మరణించారని, 40కి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. దాడి తర్వాత షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. జనం హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్రెమెన్చుక్లో రష్యా క్షిపణి దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. బాధితుల సంఖ్యను ఊహించడం సాధ్యం కాదని చెప్పారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. సాధారణ జనజీవితాలను రష్యా అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ ఉక్రెయిన్లో ఉన్న క్రెమెన్చుక్ ప్రముఖ పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది. -
సీఎం అభ్యర్థిని ప్రకటించండి!
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్జోత్సింగ్ సిద్ధూ గురువారం డెడ్లైన్ విధించారు. జలంధర్లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు. త్వరలో నిర్ణయిస్తాం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఆస్తులుగా పరిగణించే అవకాశం..! ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్ చేస్తోన్న డిజిటల్ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..! క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. భారత్లో 641 శాతం మేర వృద్ధి..! చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! -
15 వరకే ఎయిరిండియా గడువు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి బిడ్స్ దాఖలు గడువు ఈ నెల 15తో ముగియనున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాథమిక బిడ్స్ దాఖలుకు ఇంతవరకూ ఐదుసార్లు గడువును పొడిగించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గతేడాది డిసెంబర్లో టాటా గ్రూప్సహా పలు కంపెనీలు ప్రాథమిక బిడ్స్ దాఖలు చేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి అర్హత సాధించిన కంపెనీలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) ద్వారా తగిన సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. ప్రాథమిక బిడ్స్ విశ్లేషణ తదుపరి ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. వీటికి సెపె్టంబర్ 15 వరకూ గడువును ప్రకటించింది. గడువు ముగిశాక ప్రభుత్వం రిజర్వ్ ధరపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా భారీ నష్టాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఎయిరిండియా విక్రయం డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యే వీలున్నట్లు వివరించాయి. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్ను ఇన్ఫీ నిలిపివేసింది. -
గుర్తుందా.. 15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
హైదరాబాద్: టోల్గేట్ల వద్ద నగదు రహిత టోల్ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్గేట్ దాటదని అధికారులు చెబుతున్నారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. అయితే ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి. -
టిక్టాక్కు ఫైనల్ వార్నింగ్
వాషింగ్టన్ : చైనా చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం టిక్టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ అల్టి మేటం జారీ చేశారు. టిక్టాక్ యాప్ కొనుగోలు వ్యవహారాన్ని సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్టాక్ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్టాక్ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు. తాజా పరిణామంపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్టాక్ స్పందించాల్సి ఉంది. (టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్) గత నెలలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా విధించిన సంగతి తెలిసిందే. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థ బైట్డాన్స్తో ప్రధానంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చర్చల్లో ఉన్నాయి. మరోవైపు టిక్టాక్ యజమాని బైట్ డాన్స్, నిర్దేశిత గడువు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తుండటం, చైనా కొత్త నిబంధనలు, బిడ్డర్లతో సంక్షిమైన చర్చల కారణంగా కొనుగోలు ఒప్పందం కుదరకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. (టిక్టాక్ : రేసులో మరో దిగ్గజం) -
టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్
వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్టాక్’ షో!) టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పన్ను చెల్లింపు దారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది. Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare #IndiaFightsCorona pic.twitter.com/ZoGBpok3V7 — Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020 -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్ కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) ప్రకటించింది. డిసెంబరు 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పెంచుతున్నట్టు సీబీడీటీ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందటానికి చివరి తేదీ జనవరి 31 వరకు సిబిడిటి పొడిగించినట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. ఐపీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తో సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ తుది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. కాగా న్యాయబద్ధమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు, ప్రాసిక్యూషన్ కేసుల పెండింగ్ను తగ్గించేందుకు ‘‘వన్-టైమ్" అవకాశాన్నిగత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. డిసెంబరు 31వరకు అవకాశాన్నికల్పించింది. పన్ను నేరాలు లేదా పన్ను ఎగవేతకు పాల్పడిన వారు పన్ను బకాయిలు, సర్చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో వారిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయకపోవడాన్నే కాంపౌండింగ్గా వ్యవహరిస్తారు. -
మహా రాజకీయం : డెడ్లైన్ చేరువైనా అదే ఉత్కంఠ
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులైనా తదుపరి సీఎం ఎవరనేది ఇంతవరకూ వెల్లడికాలేదు. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడకపోవడం, శివసేనతో కలిసేందుకు ఇతర విపక్షాలు ముందుకురాని పరిస్థితితో తదుపరి మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్లైన్ తరుముకొస్తుండటంతో రాజకీయ పార్టీలతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెడ్లైన్ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర గవర్నర్ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిన క్రమంలో ఈ ప్రతినిధి బృందానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దూరంగా ఉన్నారు. శివసేన లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖంగా లేదని చెబుతున్నారు. మరోవైపు డెడ్లైన్ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. బీజేపీపై ఒత్తిడి పెంచేలా సేన వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. -
ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి. 2018-19 సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్లను దాఖలు చేయాలని సూచించింది. కాగా ఐటీఆర్లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్సైట్గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్లు ఈ–ఫైలింగ్ ఆప్షన్ను అందిస్తున్నాయి. ఐటీఆర్లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్తో దాఖలు చేయవచ్చు. It has come to the notice of CBDT that an order is being circulated on social media pertaining to extension of due dt for filing of IT Returns. It is categorically stated that the said order is not genuine.Taxpayers are advised to file Returns within extended due dt of 31.08.2019 pic.twitter.com/m7bhrD8wMy — Income Tax India (@IncomeTaxIndia) August 30, 2019 -
ఐటీ రిటర్న్ల దాఖలుకు మూడు రోజులే గడువు
ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి మరో మూడు రోజులే గడువుంది. గత ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లను ఎలక్ట్రానిక్ పద్దతిలో దాఖలు చేయడానికి గడవు తేదీ ఈ నెల 31వ తేదీ. కాగా ఐటీఆర్లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నా యి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్సైట్గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్లు ఈ–ఫైలింగ్ ఆప్షన్ను అందిస్తున్నాయి. ఐటీఆర్లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్తో దాఖలు చేయవచ్చు. -
కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్లైన్
బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష నాటకీయ పరిణామాల మధ్య పలు మలుపులు తిరుగుతోంది. విస్తృత చర్చ అనంతరమే విశ్వాస పరీక్ష చేపట్టాలని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పట్టుబడితే..తక్షణమే సీఎం కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ విధించిన డెడ్లైన్ దాటిపోవడంతో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష చేపట్టాలని గవర్నర్ తాజా డెడ్లైన్ విధించారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి కర్ణాటక అసెంబ్లీకి సమాచారం అందింది. మరోవైపు విప్ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీకి 15 మంది అసమ్మతి ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న సుప్రీం ఉత్తర్వులపైనా ఈ పిటిషన్లో స్పష్టత కోరారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విప్ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కని ఆయన పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి , అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవద్దని కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.శాసనసభలో ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలని, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. రాష్ట్రపతి పాలన దిశగా.. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వజుభాయ్ వాలా జారీచేసిన ఆదేశాలను స్పీకర్ రమేష్ కుమార్ బేఖాతారు చేయడంతో బీజేపీ గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమైంది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకపోవడం, అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం కర్ణాటకలో రాష్ట్రపతి పాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయని భావిస్తున్నారు.మైనార్టీ ప్రభుత్యం కొనసాగుతున్నా స్పీకర్ సభను సాగదీస్తున్నారని, బలపరీక్షను ఎదుర్కొంటానని ప్రకటించింది ప్రభుత్వమే అయినా పరీక్షకు అవకాశం మాత్రం ఇవ్వడంలేదని గవర్నర్కు బీజేపీ మరోసారి ఫిర్యాదు చేయనుంది. -
మూడు గుణాలు
ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) ఒకసారి కొలువు తీరి ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిని బంధించి ఈడ్చుకుంటూ అక్కడకు తీసుకువచ్చి ‘ఓ విశ్వాసుల నాయకా..! వీడు మా తండ్రిని హత్య చేశాడు, మీరు వీడికి మరణశిక్ష విధించాలి..’ అని అన్నారు ఉమర్ (ర) ఆ యువకుడి వైపు చూస్తూ .. ‘ఎందుకు చంపావు వీళ్ల తండ్రిని..?’ అని అడిగాడు. ఆ యువకుడు.. ‘నేనొక ఒంటెల కాపరిని. అనుకోకుండా నా ఒంటె ఒకటి వారి పొలంలో మేసింది. అది చూసి వీళ్ల నాన్న ఒక పెద్ద రాయిని దాని మీదకు విసిరాడు. రాయి కంటికి తగిలి అది బాధతో గిల గిల లాడింది. నేను కోపంతో అదే రాయిని తీసి వాళ్ల నాన్న మీదకు విసిరాను. అది ఆయన తలమీద పడి ఆయన చనిపోయాడు’ అని చెప్పాడు. ‘అలా అయితే నేను నీకు అదే శిక్ష విధిస్తాను’ అన్నారు ఉమర్ (ర). యువకుడు కంగారుగా.. ‘ఓ నాయకా..! దయచేసి నాకు మూడు రోజులు గడువు ఇప్పించండి. మా నాన్న చనిపోతూ నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు, ఇంకా నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బాధ్యత కూడా నా మీద ఉంది. మీరు నన్ను ఇప్పుడే చంపేస్తే నా ఆస్తికి రక్షణ, నా చెల్లెలికి సంరక్షణ ఉండదు. నాకు మూడు రోజులు గడువు ఇవ్వండి. నేను నా చెల్లెలికి సంరక్షణ ఏర్పాటు చేసి వెంటనే తిరిగి వస్తాను’ అన్నాడు. దానికి ఉమర్ (ర).. ‘సరే, నీకు పూచీగా ఎవరు ఉంటారు?’ అని అడిగారు. యువకుడు అక్కడ గుమిగూడి ఉన్న జనంలోకి చూశాడు. అందరూ తలలు వంచుకున్నారు. కానీ ఒక చేయి పైకి లేచింది. అది హజరత్ అబూజర్ గిఫారీ (ర) గారిది.‘ఇతనికి పూచీగా ఉంటావా అబూజర్..?’ అని అడిగారు ఉమర్. ‘ఉంటాను నాయకా...!’ అన్నాడు అబూజర్ (ర). ‘‘అతను తిరిగి రాకపోతే ఆ శిక్ష నీకు పడుతుంది, తెలుసుగా...?’ అన్నారు ఉమర్. ‘ నాకు సమ్మతమే నాయకా! అన్నాడు అబూజర్ (ర). ఆ యువకుడు వెళ్లి పోయాడు.. రెండు రోజులు గడిచిపోయాయి. మూడవ రోజు సాయంత్రం కావస్తుంది. ఆ యువకుడి జాడ లేదు. అతడు తిరిగి రాకపోతే అబూజర్ (ర) కు మరణ శిక్ష పడవచ్చని అందరూ భయపడసాగారు. సూర్యాస్తమయానికి ఇంకా కొంచెం సమయం ఉందనగా.. ఆ యువకుడు వచ్చి సభలో ఉన్న హజరత్ ఉమర్ (ర) ముందు హాజరయ్యాడు. అలసి సొలసినట్లు ఉన్న ముఖంతో అతడు ఇలా అన్నాడు.. ‘..ఓ నాయకా! నా ఆస్తిని, చెల్లెలి సంరక్షణ బాధ్యతను మా మామయ్యకు అప్పచెప్పాను... ఇక మీరు నాకు శిక్ష విధించవచ్చు’ అని!ఉమర్ (ర) ఆశ్చర్యంతో.. ‘శిక్ష నుండి తప్పించుకొనే అవకాశం ఉన్నా సరే ఎందుకు తిరిగి వచ్చావు?’ అని అడిగాడు. ‘ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమర్థతను మనుషులు కోల్పోయారని అందరికీ అనిపిస్తుందని భయం వేసింది, అందుకే తిరిగి వచ్చాను’ అన్నాడు యువకుడు. ఉమర్(ర) : (అబూజర్ వైపు చూస్తూ) ‘అసలు నీవెందుకు అతడికి పూచీగా ఉన్నావు? అబూజర్ (ర) : సాటి మనిషి ఆపదలో ఉండి చేయి చాస్తే అతడికి మేలు చేసే ఆకాంక్షను మనుషులం కోల్పోయాం అనిపిస్తుందని భయం వేసింది. అందుకే పూచీగా ఉన్నాను.. అన్నాడు. ఇక హత్యానేరాన్ని మోపిన ఆ వ్యక్తులు ఇదంతా చూసి ఇలా అన్నారు.. ‘ఓ నాయకా! మేము కూడా ఈ యువకుడిని క్షమించి వేస్తున్నాము, దయచేసి అతడిని శిక్షించకండి’ అన్నారు. ఉమర్ (ర) అమితాశ్చర్యంతో.. ‘అదేంటి? ఎందుకు క్షమించి వేస్తున్నారు?’ అన్నారు. క్షమాగుణం మనుషుల హృదయాల నుండి తుడిచి పెట్టుకు పోయినట్లనిపిస్తుందని భయం వేస్తోంది. అందుకే క్షమిస్తున్నాము’ అన్నారు ఆ వ్యక్తులు. – మర్యమ్ -
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్లో 188, చౌడూర్లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
వేతన జీవులకు గుడ్న్యూస్!
-
ఆధార్-పాన్ లింక్.. నేడే చివరి తేదీ
న్యూఢిల్లీ : మీ బయోమెట్రిక్ ఐడీ-ఆధార్తో పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)ను లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే, వెంటనే చేసేసుకోండి. ఆధార్-పాన్ అనుసంధానానికి నేడే ఆఖరి తేదీ. ఆధార్ను పాన్తో లింక్ చేసుకోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు సార్లు తుది గడువు పొడిగించింది. నేటితో ఈ గడువు ముగియబోతోంది. అయితే మరోసారి కూడా ఈ తుది గడువును పొడిగిస్తారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టెక్నికల్గా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్తో పాన్ను తుది గడువు లోపు అనుసంధానం చేసుకోకపోతే, పాన్ కార్డు ఇన్వాలిడ్ అవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుంచి తుది గడువుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో, వెంటనే ఆధార్తో పాన్ను అనుసంధానం చేసుకోవాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి. ఐదు తేలిక పద్ధతుల్లో ఆధార్ను పాన్తో లింక్ చేసుకోవచ్చు. ఆధార్తో పాన్ను ఎలా అనుసంధానించుకోవాలో ఓసారి చూద్దాం.. స్టెప్ 1 : ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్కి వెళ్లాలి. టాప్ మధ్యలో బ్లూ రంగు బాక్స్ కనిపిస్తుంది. దానిలో కొన్ని ఫ్లాష్లు కనిపిస్తాయి. ఒక ఫ్లాష్ లో ‘లింక్ ఆధార్’ అనే బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. వెంటనే వేరొక పేజీకి వెళ్తాం.. స్టెప్ 2 : అక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఆ అనంతరం కింద ఉన్న ‘లింక్ ఆధార్’ అనే దానిపై క్లిక్ చేయాలి. స్టెప్ 3 : ఒక్కసారి రెండో స్టెప్ పూర్తయ్యాక, మీ అభ్యర్థనను యూఐడీఏఐకి పంపిస్తున్నట్టు మెసేజ్ కనిపిస్తుంది. హోమ్ పేజీలో ఉన్న ఆధార్ హైపర్ లింక్ను క్లిక్ చేసి స్టేటస్ను తెలుసుకోవాల్సిందిగా సూచిస్తుంది. స్టెప్ 4 : మరోసారి హోమ్ పేజీకి వెళ్లి, లింక్ ఆధార్ను క్లిక్చేయాలి. ఆ అనంతరం వచ్చే పేజీలో పైననే... ఒకవేళ లింక్ ఆధార్ అభ్యర్థనను ఇప్పటికే సమర్పించి ఉంటే, స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆధార్-పాన్ లింక్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. -
అర్ధరాత్రి వరకూ పన్నులు చెల్లించే సదుపాయం
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించేందుకు శనివారం తుది గడువు కావడంతో అర్ధరాత్రి వరకూ ట్యాక్స్ కట్టే సౌకర్యం కల్పిస్తున్నామని డీసీఆర్ సోమన్నారాయణ తెలిపారు. ఇందుకోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలతోపాటు మీ సేవా కేంద్రాలు అర్ధరాత్రి వరకూ పనిచేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండానే ఇంటి పన్ను, నీటిఛార్జీలు, వీఎల్టీ చెల్లించుకోవచ్చన్నారు. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, అపరాధ రుసుం విధిస్తామనీ, అలాంటి చర్యలకు ఉపక్రమించకముందే పన్ను చెల్లింపులు చెయ్యాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి వస్తుందనీ, ఈ అదనపు భారం లేకుండానే నగర ప్రజలు ట్యాక్స్లు కట్టాలని సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు. -
గంట తిరగకుండానే మంత్రి యూటర్న్..
-
టీడీపీలో ప్రకంపనలు
-
టీడీపీలో ప్రకంపనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాల్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏంచేయాలో దిక్కుతోచక టీడీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేసేందుకు టీడీపీ సిద్ధమా అని వైఎస్ జగన్ గురువారం సవాల్ విసిరారు. దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ తమ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. గంట కూడా గడవకముందే మాట మార్చారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. గంట వ్యవధిలో రెండుసార్లు మీడియా ముందుకు వచ్చిన మంత్రి ఆది ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం 6 గంటలకు ఆది కామెంట్స్.. వైఎస్సార్సీపీ ఎంపీల కంటే ముందు మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూల్ వైఎస్సార్సీపీ డెడ్లైన్ ఏప్రిల్ 6 అయితే మాది మార్చి 5 పార్లమెంట్లో కేంద్రం ఏపీకి అనుకూల ప్రకటన చేయకపోతే ఆరోజే మా కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారు అదేరోజు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటాము 19 అంశాలు కేంద్రం ముందుంచాం, ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరిరోజు రాత్రి 7 గంటలకు ఆది కామెంట్స్.. మార్చి 5 రాజీనామాలకు డెడ్లైన్ అన్నది పార్టీ నిర్ణయం కాదు నా వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే -
మార్చి 31 వరకు ఆధార్ గడువు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆధార్తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుందని పేర్కొంది. ఆధార్ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధార్ నమోదు కార్యక్రమంపై స్టే విధించాలంటూ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ వాదనలు జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు విన్పిస్తూ.. కొన్ని ఏళ్లుగా అమలవుతున్న ఆధార్ పథకంపై ఎటువంటి స్టే విధించరాదని, డిసెంబర్ 31తో ముగుస్తున్న ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించనున్నట్లు కోర్టుకి తెలిపారు. పెళ్లయితే మతం మారదు అన్య మతస్తుడిని పెళ్లాడితే మహిళ మతం మారిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్శి మహిళ వేరే మతస్తుడిని వివాహమాడితే ఆమె మత గుర్తింపు మారుతుందా? అన్న కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ‘ ఇతర మతస్తుడిని పెళ్లి చేసుకున్న తరువాత సదరు మహిళ తన పుట్టింటి మతాన్ని కోల్పోతుందని చెప్పే చట్టాలేం లేవు. పైగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం...ఇద్దరు దంపతులు తమ సొంత మతాలనే ఆచరించొచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. లాయర్ల ‘అల్లరి’పై సీరియస్ ఇటీవల జరిగిన కొన్ని ప్రముఖ కేసుల విచారణ సందర్భంగా సీనియర్ లాయర్లు గట్టిగా అరవడం, వాగ్వాదానికి దిగి జడ్జీలను బెదిరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు హాల్లో అరుపులు, కేకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంది. బాబ్రీ మసీదు , ఢిల్లీ ప్రభుత్వం–కేంద్రం వివాదాల విచారణ సమయంలో సీనియర్ లాయర్ల మితిమీరిన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయోధ్య కేసు విచారణను 2019 జూలై వరకు వాయిదా వేయాలని కోరుతూ సీనియర్ లాయర్లు కపిల్ సిబల్ తదితరులు మొండి పట్టుదలకు పోవడం తెలిసిందే. ‘లాయర్లను న్యాయ పరిరక్షకులుగా భావిస్తారు. కొందరు లాయర్లు తాము గళమెత్తి న్యాయ వ్యవస్థతోనే వాగ్వాదానికి దిగగలమని అనుకుంటున్నారు. గట్టిగా అరవడం వారి అసమర్థత, అపరిపక్వతనే సూచిస్తుంది’ అని బెంచ్ పేర్కొంది. విడిగా ఉన్న భార్యకూ భరణం విడాకులు తీసుకున్న భార్య తరహాలోనే చట్టబద్ధంగా విడిగా ఉంటున్న భార్యకు ఆమె భర్త భరణం చెల్లించాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. విడిగా ఉంటున్న భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పునిచ్చింది. నెలకు రూ.4 వేలు భరణం చెల్లింపును నిరాకరించడానికి హైకోర్టు చూపిన కారణాలు సహేతుకంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టుకు సూచించింది. -
నెల రోజులే గడువు
ఆలమూరు (కొత్తపేట): కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు నెల రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు అభ్యుదయం సంఘం ఆలమూరులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే నెల ఆరున జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి లోపు కాపులను బీసీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాపు సామాజికవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు వ్యూహం రూపొందించుకుంటామన్నారు. ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా కాపు మేధావులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువత, మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. ఇప్పటికే చాలమంది కాపు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారని, రానున్న నెల రోజుల్లో మరిన్ని అభిప్రాయాలు సేకరించి, దానికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ముద్రగడ చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ సీఎం తన మంత్రివర్గ సభ్యులతో పలికిస్తున్న చిలక పలుకులను కాపు సామాజికవర్గం నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది కాపు నేతలను అమరావతి తీసుకువెళితే ఏదో ఒక శుభవార్త వింటామని ఎదురుచూసిన కాపు జాతికి నిరాశే మిగిలిందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కాపు రిజర్వేషన్ల అమలుపై కప్పదాటు వైఖరి ప్రదర్శించి, కాపు నేతల చెవిలో క్యాబేజీ పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందువల్లనే చివరిగా వచ్చే నెల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తరలిరావాలి ఈ నెల 12న కిర్లంపూడిలో కాపు నేతల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు దళితులు, కాపు నేతలు అధిక సంఖ్యలో తరలిరావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్కు లక్షలాది విగ్రహాలు ఏర్పాటు చేసినా విధించని నిబంధనలు కిర్లంపూడిలో మాత్రమే విధించడంపై ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. పోలీసుల పడగ నీడలో జీవితాలను గడపాల్సిన దారుణమైన పరిస్థితులను కల్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వై.ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నయనాల హరిశ్చంద్రప్రసాద్, దున్నాబత్తుల నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈనెల 23
నెల్లూరు (టౌన్): 2018 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్లకు రూ.125, విద్యార్థి 3 సబ్జెక్ట్లకు రూ.110, 3 సబ్జెక్ట్ పైన రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. వచ్చే నెల 8వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.50, 20వ తేదీలోపు రూ.200, జనవరి 4వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.500లతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ప్రధానో ఎడ్యుకేషన్ స్పోర్ట్స్, అర్ట్స్, కల్చర్, జనరల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, అదర్ రిసిప్ట్స్ పద్దుల్లో చలానా రూపంలో చెల్లించవచ్చన్నారు. -
నవంబర్ 3న ఏం తేలబోతుంది?
అహ్మదాబాద్ : పటీదార్ ఉద్యమానికి మద్ధతు ప్రకటించి.. అత్యధిక సీట్లను కేటాయిస్తేనే కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తానని హర్దిక్ పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో సూరత్ సభలో హర్దిక్ రాహుల్తో వేదిక పంచుకుంటారంటూ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నేపథ్యంలో హర్దిక్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హమీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతామని చెప్పాడు. నవంబర్ 3లోగా దానిపై ఓ ప్రకటన చేయాలని లేనిపక్షంలో గతంలో అమిత్షా సూరత్ పర్యటన సందర్భంగా ఎదురయిన పరిణామాలే పునరావృతం అవుతాయని ట్వీట్లో పరోక్షంగా వారించాడు. 3/11/2017तक कोंग्रेस पाटीदार को संवैधानिक आरक्षण कैसे देंगी,उस मुद्दे पर अपना स्टेण्ड क्लीयर कर दे नहीं तो अमित शाह जैसा मामला सूरत में होगा — Hardik Patel (@HardikPatel_) October 28, 2017 గత నెలలో సూరత్ లో అమిత్ షా నిర్వహించిన సమావేశం రసాభాసంగా మారింది. పటీదార్ ఉద్యమ మద్దతుదారులు ఫర్నీఛర్ నాశనం చేసి నానాబీభత్సం సృష్టించారు. గతంలోనే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ హర్దిక్ డిమాండ్లకు ఓకే చెప్పింది. హర్దిక్ కూడా గజదొంగలను గద్దెదించేందుకు దొంగలకు మద్దతు ఇవ్వటంలో తప్పులేదని బీజేపీ, కాంగ్రెస్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే ఎటొచ్చి రిజర్వేషన్ కోటా శాతం, ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలోనే ప్రతిష్టంబన ఏర్పడింది. హర్దిక్ డిమాండ్లలో కొన్ని.. - ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని హార్దిక్ కోరినట్లు తెలిసింది. - కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో పటేళ్ల ప్రాతినిధ్యం పెంచాలి. - పటేళ్ల రిజర్వేషన్ల అమలుపై న్యాయసమీక్ష లేకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలి. - ప్రస్తుత రిజర్వేషన్లకు భంగం కలిగించకుండా పటేళ్లకు వేరుగా రిజర్వేషన్ ఇవ్వాలి. వీటితోపాటు పటీదార్ ఆందోళన సందర్భంగా తమ వర్గం వారిపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని హార్దిక్ పటేల్ కోరినట్లు తెలిసింది. -
గడువు లోపు ఆధార్-పాన్ లింక్ తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారుల పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని యుఐడిఎఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ అనుసంధానానికి డెడ్లైన్ యధావిధిగా కొనసాగుతుదని వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి పన్ను చెల్లింపుదారులు ఆధార్తో వారి పాన్ నంబర్ లింక్ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తాజా నేపథ్యంలో ఈ నిబంధనపై ఎలాంటి మార్పు వుంటుందని ప్రశ్నించినపుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 తో పొడిగించిన గడువు నాటికి ఆధార్తో పాన్ జతచేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు (గోప్యత మౌలికమైన హక్కు) అనే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆదాయ పన్ను చట్టంలోని ఒక సవరణ ద్వారా ఇది తప్పనిసరి అవుతుందని పాండే స్పష్టం చేశారు. సుప్రీం ఆర్డర్ నేపథ్యంలో తమ వివరాలు ఇవ్వడానికి ఎవరైనా తిరస్కరించారా అని అడిగిన ప్రశ్నకు పాండే ఇప్పటివరకూ అలాంటి లేదన్నారు. ఎందుకంటే ఆధార్ చట్టం చెల్లుబాటు అయ్యే చట్టమనీ, సుప్రీం తాజా తీర్పులో ఆధార్ చట్టంపై ఏమీ వ్యాఖ్యానించలేదని చెప్పారు. ఆధార్ చట్టం ప్రజల గోప్యతను ఒక మౌలికమైన హక్కుగా పరిరక్షిస్తుందని యు.ఐ.డిఎఐ సీఈఓ తెలిపారు. అలాంటి అంతర్గతంగా గోప్యతా రక్షణ నిబంధనలు కలిగి ఉంది. వ్యక్తిగత డేటాను కాపాడేందుకు, అటువంటి డేటాను ఎలా ఉపయోగించవచ్చో దాని నిబంధనలు పొందు పరిచాం కాబట్టి, వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా డేటా భాగస్వామ్యం చేయబడదని తెలిపారు. జాతీయ భద్రత వంటి పరిస్థితులలో మినహా, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోలేరని, అదికూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అనుమతి కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉపయోగ పరిమితి, షేరింగ్ పరిమితి, పర్పస్ పరిమితిని లాంటి అన్ని ఈ పరిమితులు, నిబంధనలతో ఆధార్ చటాన్ని రూపొందించామన్నారాయన. -
సంతకాలు చేస్తేనే జట్టులో ఉంటారు
ఆటగాళ్లను హెచ్చరించిన సీఏ సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పంద ప్రక్రియ మరింతగా ముదిరింది. నూతన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నేటి (శుక్రవారం)తో గడువు ముగుస్తుందని, ఈలోగా స్పందించకపోతే జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం ఉండదని సీఏ హెచ్చరించింది. ‘జూన్ 30న మీ ఒప్పందం ముగిసిపోతే ఇక నుంచి సీఏ, రాష్ట్ర క్రికెట్ సంఘం, బిగ్బాష్ లీగ్ జట్టులో సభ్యులుగా ఉండేందుకు వీలుండదు’ అని సీఏ హైపెర్ఫామన్స్ మేనేజర్ పాట్ హోవర్డ్ స్పష్టం చేశారు. ఇదే జరిగితే బంగ్లాదేశ్, భారత్ పర్యటనలతో పాటు యాషెస్ సిరీస్ కూడా సందేహంగా మారనుంది. మరోవైపు సీఏ ఒప్పందం ఇవ్వకపోతే విదేశీ టి20 లీగ్ల్లో ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధపడుతున్నా... దీనికోసం కచ్చితంగా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హోవర్డ్ స్పష్టం చేశారు. -
టెట్ ఫీజు చెల్లింపు గడువు 24 వరకు..
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు గురువారం టెట్ కన్వీనర్ శేషుకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని, 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
ఫిట్‘లెస్’
నిబంధనలకు అనుగుణంగా లేని స్కూల్ బస్సులు కండీషన్పై దృష్టి సారించని యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం గత నెల 15తోనే ముగిసిన ఫిట్నెస్ గడువు 987 బస్సులకు గాను 341కు మాత్రమే ఫిట్నెస్ బడి గంటలు మోగే సమయం దగ్గర పడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు చేయిస్తున్నారు. అయితే.. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై చూపడం లేదు. కండీషన్ లేకపోయినా దశాబ్దాల తరబడి పాత బస్సులనే తిప్పుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు, అక్కడి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులే అధికంగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసిన చిన్నారులు తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం పిల్లల అడ్మిషన్లపై దృష్టి సారిస్తున్నాయే తప్ప వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంపై చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల రాకపోకలు సాగించేందుకు వినియోగిస్తున్న బస్సుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలలు స్థాపించి ఇరవై, ముప్పై ఏళ్లు అవుతున్నా ప్రారంభం నుంచి అవే బస్సులను తిప్పుతుండటం ఒకింత ఆందోళన కల్గిస్తోంది. ఫిట్‘లెస్’ బస్సులే ఎక్కువ.. స్కూల్ బస్సులకు గత నెల 15తోనే ఫిట్నెస్ రెన్యూవల్ గడువు ముగిసింది. జిల్లాలో మొత్తం 987 స్కూల్ బస్సులు ఉన్నాయి. గడువు మీరిపోయినా కొన్ని యాజమాన్యాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకూ 341 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆర్టీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. అనేక స్కూల్, కళాశాలల యాజమాన్యాలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సెకండ్హ్యాండ్ (ఇదివరకే వినియోగంచిన) బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చిన వీటికి పెయింటింగ్ మార్చి స్కూల్ బస్సులుగా తిప్పుతున్నారు. 20, 30 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తప్పనిసరి స్కూల్ బస్సుల విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు విధించినప్పటికీ కొన్ని యాజమాన్యాలు వాటిని తుంగలో తొక్కుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర ద్వారం, అగ్నిని నిరోధించే సిలిండర్, ప్రథమ చికిత్స పరికరాల కిట్, విద్యార్థులు ఎక్కేందుకు అనువుగా మెట్లు (ఫుట్స్టెప్), హ్యాండ్బ్రేక్, హెడ్లైట్స్, బ్యాక్లైట్స్, ఇండికేటర్స్, అంబర్లైట్స్, ముందు భాగాన తెలుపు, వెనుక ఎరుపు, సైడ్కు పసుపుపచ్చ రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలి. తాజా నిబంధనల ప్రకారం 60 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకుండా స్పీడ్ గవర్నర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు బస్సు కండీషన్ ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న స్కూల్ బస్సుల్లో యాభై శాతానికి పైగా నిబంధనలు పాటించడం లేదు. అయినా అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే సీజ్ : సుందర్వద్దీ, ఉపరవాణా కమిషనర్, అనంతపురం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు గడువు మే 15కే పూర్తయ్యింది. ఇప్పటికీ ఫిట్నెస్ కోసం స్కూల్ బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు కావడంతో వాటిని మరమ్మతులు చేసుకుంటున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి బస్సుకూ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అది లేకుండా నడిపితే సీజ్ చేయడంతో పాటు కోర్టుకు హాజరుపరుస్తాం. -
ఆర్కామ్కు డిసెంబర్ వరకు గడువు
అప్పటి వరకు రుణ చెల్లింపులు వాయిదా ⇔ అంగీకరించిన బ్యాంకర్లు ⇔ సెప్టెంబర్ నాటికి రూ.25వేల కోట్ల చెల్లింపులు ⇔ అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్ని పరిశీలిస్తాం ⇔ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబై: గత కొన్ని రోజులుగా ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కు కాస్తంత ఊరట లభించింది. రుణాల చెల్లింపులకు ఏడు నెలల గడువు లభించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల రుణ బకాయిలకు సంబంధించి వాయిదాల్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైన ఆర్కామ్ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తగ్గిస్తుండడంతో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటి పోకుండా చూసేందుకు రుణాలిచ్చిన బ్యాంకర్లతో శుక్రవారం ముంబైలో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ వివరాలు వెల్ల డించారు. దేశ, విదేశీ రుణదాతలు వ్యూహాత్మక పునరుద్ధరణ ప్రణాళికకు అంగీకరించారని, రూ.45,000 కోట్ల రుణాలకు సంబంధించి చెల్లింపులకు గాను ఈ ఏడాది డిసెంబర్ వరకు ఏడు నెలల గడువు ఇచ్చినట్టు తెలిపారు. సెప్టెంబర్ నాటికి రూ.20,000 కోట్లకు రుణ భారాన్ని తగ్గించుకుంటామన్నారు. ‘‘రుణాలిచ్చిన సంస్థలు కంపెనీ సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకున్నాయి. నూతనంగా వైర్లెస్ కంపెనీ ఎయిర్కామ్ను విడిగా ఏర్పాటుచేయడం, ఎయిర్సెల్తో ఒప్పందం, ఇన్ఫ్రాటెల్లో వాటాను కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ సంస్థకు విక్రయించడడం వంటివన్నీ ఇందులో భాగం. ఈ రెండు లావాదేవీల ద్వారా వచ్చే నిధులతో రూ.25,000 కోట్ల మేర రుణాలను తీర్చేస్తాం. మొత్తం రుణంలో 60 శాతానికి సమానం’’ అని అనిల్ అంబానీ వివరించారు. మిగిలిన రూ.20,000 కోట్ల రుణం సంగతేంటన్న ప్రశ్నకు... అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్నీ పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సోదరుడితో సత్సంబంధాలే సోదరుడు ముకేశ్ అంబానీతో తన సంబంధాలు సహృద్భావంగానే ఉన్నాయని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా వినిపించే వదంతులన్నీ అర్థంలేనివిగా కొట్టి పడేశారు. ‘‘నా సోదరుడితో నా అనుబంధం సహజంగానే ఉంది. అర్థవంతంగా, పూర్తి గౌరవంగా ఉంటుంది. ఈ విషయంలో ఊహాగానాలు అనవసరం’’ అని అనిల్ అంబానీ తెలిపారు. తండ్రి ధీరూభాయి అంబానీ మరణం తర్వాత దశాబ్దం క్రితం అంబానీ సోదరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పంచుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్కామ్, రిలయన్స్ జియో మధ్య సంబంధాలపై ఎదురైన ప్రశ్నకు... రెండూ వేర్వేరు సంస్థలని, అవి అలానే కొనసాగుతాయని అనిల్ అంబానీ చెప్పారు. ‘‘స్పెక్ట్రం, ఫైబర్, ఇంట్రా సర్కిల్ రోమింగ్, టవర్లు, మరికొన్ని అంశాల్లో వ్యూహాత్మక సహకారం ఉంటుంది. దీనివల్ల వ్యయాలు తగ్గుతాయి’’ అని పేర్కొన్నారు. -
వారం రోజులే డెడ్లైన్
- ‘మీ కోసం’ వినతులపై అధికారులకు కలెక్టర్ హెచ్చరిక - వచ్చే వారం నాటికి పరిష్కారించాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యలకు సంబంధించి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలకు అందిన వినతులపై విచారణ జరిపి వచ్చే వారం నాటికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సమస్యలు మున్సిపాలిటీల్లో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని వచ్చే వారానికి క్లియర్ చేయకపోతే సంబంధిత అధికారులకు చార్జి మెమోలు ఇస్తామని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు బాలాజినగర్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకరావడంతో సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆస్పరి మండలం నగరూరు అభివృద్ధికి రిలయన్ సంస్థ విడుదల చేసిన నిధులను గ్రామ సర్పంచ్ దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు పిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బనగానపల్లి ఆయుష్ ఆసుపత్రికి మెడికల్ ఆఫీసర్ వారంలో 2 రోజులు మాత్రమే వస్తున్నారని ఆ ప్రాంతం వారు ఫోన్ చేయగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జేసీ-2 రామస్వామిని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఒ గంగాధర్గౌడు తదితరులు పాల్గొన్నారు. -
బీపీఎస్ గడువు పెంపు
కర్నూలు (టౌన్): బీపీఎస్ (భవనాల క్రమబద్ధీకరణ పథకం)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ పథకం గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది. అయితే అనేక మున్సిపాల్టీల నుంచి అభ్యర్థనలు రావడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా భవనాలు నిర్మించుకున్న భవన యజమానులు బీపీఎస్ కింద తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. -
కమిటీ నివేదికకు గడువు నిర్దేశించలేం
తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ నిర్దిష్ట వ్యవహారానికి సంబం ధించి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అది ఫలానా గడువులోపు నివేదిక ఇవ్వాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. కమిటీ చేసే సిఫారసులను అమలు చేయాలా.. వద్దా.. అన్నది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమంది. ఇంటర్ వృత్తి విద్యా కోర్సుల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని నిర్దిష్టకాల వ్యవధిలోపు నివేదిక సమర్పిం చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈమేరకు తాత్కా లిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడి న ధర్మాసనం 4 రోజుల కిత్రం ఉత్త ర్వులు జారీ చేసింది. ఇంటర్ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2015 సెప్టెంబర్లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని, నిర్దిష్ట గడువులోపు నివేదిక ఇచ్చేలా కమిటీని, కమిటీ సిఫా రసులను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ వృత్తి విద్యా కోర్సుల విద్యా ర్థులు, నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ప్రభాకర్ ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఓ నిర్దిష్ట పద్ధతిలో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించాలని కోరే హక్కు పిటిషనర్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా ఇటువంటి విషయాల్లో హైకోర్టు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తమకున్న విస్తృతాధికారాలను ఉపయోగించదంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ కోరిన విధంగా నిర్దిష్టకాల వ్యవధి లోపు నివేదిక ఇవ్వాలనిగాని, కమిటీ సిఫార సులను అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం గాని చేయలేమని తేల్చి చెప్పింది. -
పానిక్ బటన్ ఏర్పాటుకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువునిచ్చింది. తమ వద్ద విక్రయం కాని పానిక్ బటన్ ఫీచర్లేని ఫోన్లు చాలా ఉన్నాయనే మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీల విజ్ఞప్తి మేరకు కొత్త హ్యాండ్సెట్స్లో పానిక్ బటన్ ఏర్పాటుకు ఇది వరకు ఇచ్చిన గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నామని టెలికం కార్యదర్శి జె.ఎస్.దీపర్ తెలిపారు. 2017 జనవరి 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ హ్యాండ్సెట్స్లోనూ పానిక్ బటన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం గతేడాది ఏప్రిల్లోనే నిర్ణయం తీసుకుంది. -
పంట రుణాల చెల్లింపునకు గడువు పెంపు
60 రోజుల పాటు పెంచిన కేంద్ర ప్రభుత్వం • నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 లోపు చెల్లించాల్సిన వాటికి మాత్రమే.. న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు శుభవార్త. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 లోపు చెల్లించాల్సిన మూడు శాతం ప్రోత్సాహకంతో కూడిన పంట రుణాల చెల్లింపు గడువును మరో 60 రోజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ఓ రైతు ఈ ఏడాది నవంబర్ 15న పంట రుణం చెల్లించాలనుకోండి. ఆ గడువుకు మరో 60 రోజుల తర్వాత ఆ రుణాన్ని చెల్లించవచ్చు. తద్వారా మూడు శాతం వడ్డీ రాయితీని ప్రోత్సాహకం కింద కూడా పొందవచ్చు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ భుటాని తెలిపారు. ప్రభుత్వం 2016–17లో రూ. 9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 7.56 లక్షల కోట్ల రుణాలు రైతులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వడ్డీ రాయితీ పథకం కింద రైతులు ఏడాదికి ఏడు శాతం వడ్డీతో తీసుకున్న స్వల్పకాలిక రుణాలను సకాలంలో (ఏడాది లోపు) చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ ప్రోత్సాహకం కింద లభిస్తుంది. ఆ గడువు దాటిపోతే ఈ ప్రోత్సాహకం లభించదు. కాగా కేంద్ర, రాష్ట్ర విత్తన కంపెనీల వద్ద విత్తనాల కొనుగోలుకు రూ. 500 నోట్లు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘ఈ-చలాన్ల’ చెల్లింపు గడువు పెంపు
ఈ నెల 24 వరకు అవకాశం: ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లను వినియోగించి పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు చెల్లించుకునే అవకాశాన్ని 10 రోజుల పాటు పొడిగిం చినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి 48 గంటల ఇచ్చిన అవకాశం సోమవారం సాయంత్రంతో ముసిగింది. రెండు రోజుల కాలంలో 7,013 మంది వాహనచోదకులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకారుులు ఉన్నారుు. పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనచోదకులు తమ పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు. -
పాత నోట్ల చలామణి గడువు పొడిగింపు
-
విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వండి
మాల్యాకు సుప్రీం నెల గడువు న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లో తెలియజేయాలని ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల పారిశ్రామికవేత్త’ విజయమాల్యాను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మాల్యా తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్న విషయం వివిధ అంశాల ప్రాతిపదికన స్పష్టమవుతోందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ సంస్థ డియోజియో నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించలేదని వివరించింది. మొత్తంగా చూస్తే ఆస్తుల వెల్లడికి సంబంధించి 2016 ఏప్రిల్ 7న తాము ఇచ్చిన ఉత్తర్వులను మాల్యా తగిన విధంగా అమలు పరచలేదన్న విషయం స్పష్టమవుతున్నట్లు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు దేశంలో ఆస్తుల వివరాలను మాల్యా ఇప్పటికే వెల్లడించారు. అయితే వీటిలో సమగ్రత లేదని బ్యాంకింగ్ వాదిస్తోంది. కేసు తదుపరి విచారణ నవంబర్ 24కు వాయిదా పడింది. -
ప్రత్యేక పాలన
• ముగిసిన స్థానిక ప్రజాప్రతినిధుల గడువు • నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన • గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పెత్తనానికి సోమవారంతో తెరపడింది. వారి స్థానంలో నియమితులైన ప్రత్యేక అధికారుల అజమాయిషీకి మంగళవారం తెర లేవనుంది. ప్రత్యేక అధికారుల పాలన కోసం ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ఉత్తర్వులను విడుదల చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని 12 కార్పొరేషన్ల పరిధిలో 919 వార్డు సభ్యులు, 124 మున్సిపాలిటీల్లో 3613 వార్డు సభ్యులు, 528 పంచాయతీల్లో 8,288 వార్డు సభ్యులు లెక్కన మొత్తం 12,820 ప్రజా ప్రతినిధుల పదవులు ఉన్నాయి. 31 జిల్లా పంచాయతీల్లో 655 వార్డు సభ్యులు, 388 పంచాయతీల్లో 6,471 వార్డు సభ్యులు 12,524 గ్రామ పంచాయతీల్లో 99,324 వార్డు సభ్యుల పదవులున్నాయి. ఇలా అన్ని స్థానిక సంస్థలను కలుపుకుని మొత్తం 1,31,794 స్థానిక సంస్థల్లోని పదవులకు 2011లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. వీరి పదవీకాలం సోమవారం ముగిసిపోయింది. వీరి పదవీకాలం ముగిసిపోయేలోపే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17, 19 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఎన్నికలను రద్దు చేయడంతోపాటూ తాజా నోటిఫికేషన్ను జారీ చేసి ఈ ఏడాది డిసెంబరు 31లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కార్యకలాపాలను వెంటనే నిలిపి వేసింది. ప్రత్యేక అధికారులు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజాప్రతినిధులు లేని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల నియామకం అవసరమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన కేబినెట్ సమావేశమై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. మరలా 19వ తేదీన మంత్రివర్గం మళ్లీ సమావేశమై అధికారులకు అప్పగించాల్సిన బాధ్యతలపై చర్చించారు. ప్రత్యేక అధికారుల పాలనపై రంగం సిద్ధం కాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ ద్వారా ప్రభుత్వం సోమవారం జారీచేసింది. ప్రజాప్రతినిధులు లేనపుడు సహజంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, పంచాయితీల్లో పంచాయతీ ఆఫీసర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. తాజా పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలుచేయనుంది. అయితే గ్రామ పంచాయతీ పదవులు లక్షకు పైగా ఉన్నందున ఆయా పంచాయతీలపై పరిపాలనపరమైన నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్లకు వదిలివేశారు. ఒక్కో ప్రత్యేకాధికారికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రత్యేక అధికారులకు బాధ్యతలతోపాటూ వాహన సదుపాయం, నెలకు 50 లీటర్ల డీజిల్ను కేటాయించనున్నారు. మంగళవారం నుంచి బాధ్యతల్లో దిగనున్న ప్రత్యేక అధికారులు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు ఆయా బాధ్యతల్లో కొనసాగుతారు. -
ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్బీఐ
ముంబై: ఈఎంవీ చిప్ ఆధారిత కార్డుల జారీ తుది గడువు 2018 డిసెంబర్గానే కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదని బ్యాంకులకు నిర్దేశించింది. దీనిగురించి మరింత తెలుసుకోవాలంటే... మీ దగ్గర ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఒక్కసారి పరిశీలించండి. దానిమీద నల్లని స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంటుంది. దీనిని మ్యాగ్నటిక్ స్ట్రిప్ అని అంటారు. మీ అకౌంట్ వివరాలు, బ్యాంకింగ్ ఆర్థిక అంశాలు అన్నీ ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్తోనే అనుసంధానమై ఉంటాయి. అయితే ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్తో పాటు దీనికన్నా ఇంకా అధిక భద్రతా ప్రమాణాలతో కూడిన ఈఎంవీ చిప్లను కలిగి ఉన్న కార్డులూ ప్రస్తుతం జారీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్తోపాటు తప్పనిసరిగా ఈఎంవీ చిప్ ఉన్న కార్డులనూ జారీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈఎంవీ చిప్, పిన్(ఏ లావాదేవీ జరిపినా పిన్ జారీ, ఆధారిత చెల్లింపులు) ఆధారిత కార్డులు మోసపూరిత ఆర్థిక లావాదేవీల నివారణలో గణనీయంగా దోహదపడతాయని ఆర్బీఐ పేర్కొంది. -
రేపటి నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్
వరుసలో ఐదవది... 9వ తేదీ వరకూ దరఖాస్తులు బాండ్ల జారీ తేదీ 23 న్యూఢిల్లీ: ఐదవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ప్రారంభం కానుంది. దరఖాస్తుల దాఖలుకు గడువు సెప్టెంబర్ 9. బాండ్ల జారీ 23న జరుగుతుంది. ఇప్పటి వరకూ 4 విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. ఇందులో మూడవ విడత వరకూ జారీ అయిన బాండ్ల ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లలో ఇప్పటికే ప్రారంభమయింది. ఈ నెల 29వ తేదీనే మూడవ విడత బాండ్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక సెప్టెంబర్ 23వ తేదీ జారీ అయ్యే బాండ్లతో కలుపుకుంటే... రెండు విడతల బాండ్ల ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నమాట. విధానం ఇదీ..: 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఒక గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. ఇన్వెస్టర్ దృష్టి ఫిజికల్ గోల్డ్ వైపు నుంచి మళ్లించడం ఈ పథకం లక్ష్యం. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం రూ.919 కోట్లు సమీకరించింది. మొదటి మూడు విడతల్లో 4.9 టన్నుల పసిడికి సంబంధించి రూ.1,318 కోట్ల విలువైన పెట్టుబడులను సేకరించింది. -
హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి మరికొంత గడువు లభించింది. దీనితో సహా మొత్తం ఏడు సంస్థలకు సెజ్ల ఏర్పాటుకు గాను కేంద్రం మరికొంత గడువిచ్చింది. -
ఓపన్ డిగ్రీ ప్రవేశానికి 20న తుది గడువు
అనంతపురం సప్తగిరి సర్కిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపన్ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 20న తుది గడువు అని అనంతపురం మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రామచంద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి 2012–2016 వరకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఓపన్ ఇంటర్, పాలిటెక్నిక్, నర్సింగ్ 10+2 పాసైన వారు అర్హులన్నారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 20 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–245908 నంబర్కు సంప్రదించాలన్నారు. -
రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు
-
కళాశాలల బదిలీ గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాల బదిలీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడు వు పొడిగించినట్లు ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ తెలిపారు. ఈ మే రకు డిగ్రీ రెండు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కళాశాలల బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దరఖాస్తుల ను అగస్టు 3వ తేదీ వరకు తమ కార్యాలయంలో సమర్పించాలని రిజిస్ట్రార్ ఈ సందర్భంగా తెలిపారు. -
గడువులోగా పూర్తి చేయాలి
నాగార్జునసాగర్ : గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలని, లేనట్లయితే సదరు కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెడతామని జెడ్పీ సీఈఓ మహేందర్రెడ్డి హెచ్చరించారు. గురువారం పెద్దవూర మండలంతో పాటు సాగర్లో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను సందర్శించారు. సాగర్లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి అక్కడ లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికైనా పనులు పూర్తి కాకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఘాట్లతో పాటు తాగునీరు, విద్యుత్, శానిటరీ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఎస్ఈకి సూచించారు. ఆయన వెంట ఈఈ విష్ణుప్రసాద్,ఏఈ వెంకటేశ్వర్లు, డీఈ విజయకుమార్, జేఈ జనార్దన్, తహశిల్దార్ పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్లైన్
♦ 48 గంటల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక ♦ 40 శాతంపైన వికలత్వం ఉన్న అందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ ♦ మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి దివ్వాంగునికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సిందే ♦ రాజకీయ రిజర్వేషన్లు 7 శాతం ఇవ్వాలి.. లేకుంటే గుణపాఠం తప్పదు ♦ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఒంగోలు : దివ్వాంగుల హక్కులు కాలరాయాలనుకుంటే సహించేది లేదని, 40 శాతం, ఆపైన వికలత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేయాల్సిందేనని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యూరు. బస్సు పాసుల వ్యవహారంపై రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు 48 గంటల డెడ్లైన్ ఇస్తున్నామని, ఆ సమయంలోగా ఉత్తర్వులు జారీ చేయకుంటే ఇంటిని ముట్టడించడంతో పాటు అక్కడే తిని, అక్కడే పడుకుంటామని హెచ్చరించారు. చెవిటి, మూగ, అంధుల విషయంలో దొడ్డిదారిన ఆర్టీసీ యాజమాన్యం 100శాతం వికలత్వం ఉంటేనే బస్సు పాసులు జారీ చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయకుంటే అనంతపురంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇంటిని సైతం ముట్టడించడం ఖాయమన్నారు. సదరం సర్టిఫికెట్ వికలత్వాన్ని చూపుతుంటే స్థానికంగా నివాసం ఉండడం లేదంటూ ప్రభుత్వం ఇంటి రుణం మంజూరుకు సైతం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సైతం నిధులు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి వికలాంగుల కార్యాలయం కోసం కనీసం 5 సెంట్ల స్థలం కూడా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని కొల్లి విమర్శించారు. 2 వేల పింఛన్లు కట్ చేసిన జన్మభూమి కమిటీలు రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ 3శాతం రిజర్వేషన్లు అంటున్నా కనీసం బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడం లేదన్నారు. టీడీపీ తన మ్యానిఫెస్టోలో వికలాంగులకు రూ.1500లు పింఛన్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక 80శాతంపైన వికలత్వం ఉన్న వారికే పింఛన్ ఇస్తామనడం మోసం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో జిల్లాలో 2 వేల మందికిపైగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారని ఆగ్రహించారు. ఆగస్టు 15వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని దేశాలు తిరిగినా తాము అభ్యంతరం పెట్టమని, కాకుంటే ముందుగా రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండువ వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు వనిపెంట గురవారెడ్డి, అంబటి చవరబాబు, చెన్నుబోయిన సుబ్బారావు, కాలేషా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహబూబ్బాషా, జిల్లా కార్యదర్శి సోమయ్య, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి వై.మైనర్బాబు పాల్గొన్నారు. -
‘మిగులు’కు మరో ఛాన్స్ '
♦ దరఖాస్తుల నమోదు గడువు పొడిగింపు ♦ ప్రభుత్వానికి లేఖ రాసిన యంత్రాంగం ♦ ఆక్రమణదారులు ముందుకు రాకపోవడమే కారణం ⇒ జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ⇒ మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,627 అర్జీలే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులొచ్చారుు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి ఛాన్ ్స అని హెచ్చరించినా ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆక్రమణదారులకు మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ర్ట సర్కారు వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంట్లో భాగంగా జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు గత నెల 25వ తేదీవరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఒకవేళ క్రమబద్ధీకరణకు ముందుకు రాకపోతే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. అరుునప్పటికీ మీ-సేవ కేంద్రాల ద్వారా 4,627 అర్జీలు మాత్రమే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కావడంతో రెవెన్యూయంత్రాంగం ఆశ్చర్యపోరుుంది. అరుుతే గుర్తించిన భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు జారీ చేసినా.. నిర్ణీత వ్యవధిలో వారికి అందలేదని అధికారుల పరిశీలనలో బయటపడింది. అర్జీల సమర్పణ గడువు ముగిసిన తర్వాత చాలా మందికి నోటీసులు అందినట్లు తేలింది. ఇది దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు స్పష్టమైంది. దీనికితోడు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల అప్లోడ్లో జాప్యం, ఆక్రమణదారుల్లో చాలా మంది స్థానికంగా నివసించకపోవడం.. పొజిషన్ లో ఉన్నవారికి తమ స్థలాలు యూఎల్సీ పరిధిలో ఉన్నాయని తెలియకపోవడం కూడా దరఖాస్తులపై ప్రభావం చూపిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచే అంశాన్ని పరిశీలించాలంటూ యూఎల్సీ ప్రత్యేకాధికారి ప్రభుత్వాన్ని కోరారు. కనీసం మూడు వారాలపాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇవ్వాలని లేఖ రాశారు. -
సందడే.. సందడి
♦ మున్సిపాలిటీలో నామినేటెడ్ పర్వం ♦ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం ♦ దరఖాస్తుకు రేపటివరకు గడువు ♦ పెరగనున్న ఆశావహుల సంఖ్య ♦ మంత్రి ప్రసన్నం కోసం మొదలైన అభ్యర్థుల ప్రయత్నాలు సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో మరోమారు రాజకీయ సందడి నెలకొంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ వేడి మొదలైంది. మూడు కోఆప్షన్ స్థానాలకు సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తుకు శుక్రవారం వరకు గడువు ఉంది. ఆశావహులు ఎవరికి వారు దరఖాస్తు చేయడంలో మునిగిపోయారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 34 మంది కౌన్సిల్ సభ్యులున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం సంఖ్యాపరంగా ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునే అవకాశం ఉంది. రెండు నెలల క్రితమే కొత్త పాలక వర్గం కొలువుదీని విషయం తెల్సిందే. నిర్ణీత గడువులోగా కోఆప్షన్ సభ్యుల ఎంపికను నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులు మూడు స్థానాల కోసం ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల దాఖలుకు శుక్రవారం వరకు ఉంది. కౌన్సిలర్ అభ్యర్థిత్వానికి ఉన్న నిబంధనలనే కోఆప్షన్ ఎన్నికకు అమలు చేయనున్నారు. మూడింటిలో రెండింటిని మైనార్టీలకు, మరోటి ఇతరులకు కేటాయిస్తారు. దరఖాస్తుకు ఎవరు అర్హులు..? మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్, మాజీ సర్పంచ్ల అర్హతను, ఐదేళ్ల రాజకీయ అనుభవాన్ని ప్రమాణికంగా తీసుకొని దరఖాస్తుకు అర్హులుగా ప్రకటించారు. వీరితోపాటు మూడేళ్లపాటు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా పనిచేసిన వారు అర్హులే. అదీగాక మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్అండ్బీ, టౌన్ప్లానింగ్, వాటర్ సప్లయ్, పబ్లిక్ హెల్త్ వంటి మున్సిపల్ అనుబంధ విభాగాల్లో ఉద్యోగులుగా ప్రత్యేక అనుభవం కలిగిన వారు కో ఆప్షన్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అ భ్యర్థిత్వాన్ని ఆశించే వారు సిద్దిపేట పట్టణంలో ని ఏదైన వార్డుకు చెందిన ఓటరై ఉండాలి. వా రిపై క్రిమినల్ కేసులు ఉండరాదు. ముగ్గురు పిల్లల నిబంధనను అమలు చేస్తున్నారు. దరఖాస్తుల వెల్లువ.. కోఆప్షన్ సభ్యత్వానికి దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మాజీ కౌన్సిలర్లు, తదితరులు గత మూడు రోజులుగా దరఖాస్తు ఫారాల స్వీకరణ, సంబంధిత ధ్రువీకరణ పత్రాల తయారీ, దరఖాస్తుల సమర్పణ వంటి ప్రక్రియల్లో నిమగ్నమయ్యారు. బుధవారం సాయంత్రం నాటికి మున్సిపల్ అధికారుల నుంచి దాదాపు 20 దరఖాస్తు ఫారాలను తీసుకెళ్లినట్టు సమాచారం. ఇందులో ఆరు దరఖాస్తులు అధికారులకు అందినట్టు తెలిసింది. మరో రెండు రోజులు గడువు ఉండడంతో దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా కోఆప్షన్ రూపంలో మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. ఓవైపు దరఖాస్తు చేయడంలో మునిగిపోతూనే మరోవైపు మంత్రి హరీశ్రావు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
‘క్రమబద్ధీకరణ’ గడువు పెంపుపై తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం, పలుమార్లు గడువు పెంచినా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2014 డిసెంబర్లో జీవో 59 విడుదల చేసిన సర్కారు.. 90 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేసింది. అయితే ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్న భూపరిపాలన విభాగంలో కమిషనర్లు తరచుగా మారుతుండటంతో సిబ్బందికి మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఎట్టకేలకు గత నెల మొదటి వారం నుంచి పూర్తి సొమ్ము చెల్లించిన కొన్ని దరఖాస్తులను క్లియర్ చేసిన తహసీల్దార్లు ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. మరోవైపు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారు మరికొన్ని వాయిదాలు చెల్లించాల్సి రావడం, కొన్ని దరఖాస్తుల్లో పేర్కొన్న భూమి పాక్షిక కమర్షియల్/పాక్షిక రెసిడెన్షియల్ కేటగిరీలో ఉండటం క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. గడువు పొడిగించలేం..: భూముల క్రమబద్ధీకరణ ఏడాదిన్నరగా సాగుతున్నందున మరోమారు గడువు పొడిగించడం సమంజసం కాదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు గడువు ముగిసినందున తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇమ్మని కొందరు దరఖాస్తుదారులు తహసీల్దార్లను డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరణను త్వరితగతిన ముగించేందుకు గడువు పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖ రాశారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి వాటితో సీసీఎల్ఏ బిజీగా ఉండటంతో గడువు పెంపుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. -
వారం రోజుల్లో చెప్పండి
♦ కృష్ణా ప్రాజెక్టుల పరిధిపై ♦ 10వ తేదీ వరకు బోర్డు డెడ్లైన్ ♦ లేదంటే బోర్డు మాన్యువల్ను ఆమోదిస్తున్నట్లుగా ♦ పరిగణిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై అభిప్రాయం చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు వారం రోజులు గడువు పెట్టింది. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్రం తన అభిప్రాయం చెప్పాలని సూచించింది. గడువులోగా అభిప్రాయం చెప్పకపోతే తాము తయారు చేసిన మాన్యువల్ను రాష్ట్రం అంగీకరిస్తున్నట్లుగా పరిగణించి, ఆ ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 27న ఇరు రాష్ట్రాలతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మినిట్స్ను గురువారం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. దీన్లో ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ప్రస్తావించింది. ఆ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణపై రూపొందించిన మాన్యువల్ను ఇరు రాష్ట్రాలకు అందించింది. దాని ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయి. హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియంత్రణలో ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, అందుకనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా ఈ మాన్యువల్ను బోర్డు రూపొందించింది. అయితే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే యత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదీగాక బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో చెప్పాకే బోర్డు నియంత్రణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది. ఈ అంశాల్ని పేర్కొంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు గతంలోనే కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాశారు. అదలా ఉండగానే.. అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు డెడ్లైన్ పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గుర్తింపు సప్పుడు లేదు
జూన్ 28తో ముగియనున్న టీబీజీకేఎస్ కాలపరిమితి మొదలుకాని సింగరేణి ఎన్నికల ప్రక్రియ సీఎల్సీకి లేఖ రాయని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్న కార్మిక సంఘాలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి జూన్ 28తో ముగియనున్నది. గడువు ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది. అరుునా ఇప్పటి వరకు యూజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ముందస్తు పనులు చేపట్టలేదు. కార్మిక సంఘాలు మాత్రం రెండు నెలల క్రితం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి గనులను చుట్టి వస్తున్నాయి. - గోదావరిఖని(కరీంనగర్) సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను సెం ట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉం టుంది. ఇందుకు రెండు మూడు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభించాలి. దీనికంటే ముందు యాజమాన్యం ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) కి లేఖ రాయాలి. ఆ తర్వాత సీఎల్సీ నుంచి హైదరాబాద్లోని రీజినల్ లేబర్ కమిషనర్(సెంట్రల్)కు ఓ ప్రత్యే క అధికారిని నియమిస్తూ ఆదేశాలిస్తారు. ఆయన పర్యవేక్షణలో ఆర్ఎల్సీ కార్యాలయానికి చెందిన కార్మిక శాఖ అధికారులు సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో పర్యటించి గనులు, కార్మికుల సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతాలు తదితర వివరాలను సేకరిస్తారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. అరుుతే ఇప్పటి వరకు యాజమాన్యం ఢిల్లీలోని సీఎల్సీకి ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయలేదు. హైదరాబాద్లోని ఆర్ఎల్సీ అధికారులు సైతం ఎన్నికల విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతున్నది. గడువు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి సింగరేణిలో ప్రస్తుతం 11 ఏరియూలున్నాయ. గత ఎన్నికల్లో ఐదు ఏరియూలు గెలిచిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా.. రెండేసి ఏరియూలు గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరిస్తున్నాయి. 2012 జూన్ 28న నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్కు ఆగస్టు 6న యాజమాన్యం అధికారికంగా లేఖ అందజేసింది. దీనిని బట్టి ఆగస్టు 6వ తేదీ వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కొనసాగే అవకాశం ఉందని ఆ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన జూన్ 28 తోనే కాలపరిమితి పూర్తవుతుందని, దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రాతినిధ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకత్వం ఢిల్లీలోని సీఎల్సీ కార్యాలయానికి లేఖ రాసింది. త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కంపెనీపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సీఎల్సీకి సైతం నాయకులు వినతిపత్రం అందజేశారు. -
ఉమ్మడి చట్టాల స్వీకరణ గడువు జూన్ 2
లేదంటే చెల్లుబాటు కావు : సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను అన్వయించుకునేందుకు గడువు ముంచుకొస్తుంది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ ఏడాది జూన్ రెండో తేదీలోగా అప్పటి చట్టాలను తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. లేని పక్షంలో వాటన్నింటినీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు ఏయే చట్టాలను యథాతథంగా అన్వయించుకున్నారు.. వేటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.. ఇంకా ఎన్ని చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉందో.. పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. అన్ని శాఖలు వీటిని పరిశీలించి సమగ్రంగా ప్రతిపాదనలన్నీ ఒకే ఫైలుగా పంపించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకోవాల్సిన మిగిలిన చట్టాల ప్రతిపాదనలన్నింటినీ మే 31లోగా సమగ్రంగా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పునర్విభజన చట్టంలోని 101 సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను నిర్దేశించిన గడువులోగా చట్టసభల అనుమతి, ఆమోదం లేకుండానే కొత్త రాష్ట్రం యథాతథంగా, లేదా స్వల్ప మార్పులతో దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. లేకుంటే వీటన్నింటినీ చట్టసభల అనుమతితో కొత్త చట్టాలుగా రూపొందించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
గడువు పెంచినా స్పందన కరువు
♦ చెల్లింపు కేటగిరీ క్రమబద్ధీకరణలో ♦ మొదలు కాని రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు మే 31 దాకా ప్రభుత్వం గడువు పెంచినా పెద్దగా స్పందన కని పించడంలేదు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులుగా ఎంపికైనవారికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చినా లబ్ధిదారులెవరూ ముందుకు రాని పరిస్థితి. పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించిన వారికి కూడా ఆయా స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించే వారూ వెనుకంజ వేస్తున్నారు. క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం వివిధ కారణాలు చూపుతూ అధికారులు పక్కన బెట్టడం కూడా మరో కారణం. వాస్తవానికి చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,915 దరఖాస్తులు అందగా, అం దులో 17,891 దరఖాస్తులనే అధికారులు క్లియర్ చేశారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ చేసే విషయమై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయి లో తహసీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. బేసిక్ వాల్యూ తగ్గించాలని డిమాండ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధర కన్నా సబ్రిజిస్ట్రార్లు చెబుతున్న బేసిక్వాల్యూ ఎక్కువగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో బతుకుదెరువు కోసం టీ స్టాల్, చిన్న దుకాణం పెట్టుకున్నా కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తున్నారంటున్నారు. దీనిపై లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అప్పీల్ చేసుకుంటున్నారు. -
ఒక్కరోజు..రూ.4 కోట్లు
♦ వంద శాతం పన్నుల వసూళ్లు.. ♦ లక్ష్యసాధనకు అధికారుల ఉరుకులు ఉన్న గడువు ఒక్కరోజు.. వసూలు కావాల్సిన పన్ను రూ. 4.23 కోట్లు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నా.. మిగిలిన ఒక్కరోజులో మిగతా లక్ష్యాన్ని చేరడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 వరకు రూ.37.74 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెల 30 వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా, 950 పంచాయతీల నుంచి వంద శాతం వసూలయ్యాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న మెదక్ జిల్లా.. ఈసారీ ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికారులు చెమటోడుస్తున్నారు. జోగిపేట: పన్నుల వసూళ్లలో జిల్లా గత ఏడాది మాదిరిగానే మొదటి స్థానం నిలబెట్టుకుంటుందో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వసూళ్లకు గడవు ఇక ఒక్క రోజు మాత్రమే ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. 2015-16 సంవత్సరానికిగాను రూ. 37.74 కోట్ల పన్నుల వసూలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలోని 1077 గ్రామ పంచాయతీలకు గాను 950 పంచాయతీల్లో బుధవారం వరకు 100 శాతం పన్నులు వసూలయ్యాయి. ఈనెల 31వరకు వెయ్యి పంచాయతీలు 100 శాతం ఇంటి పన్నులు వసూలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించిన పన్నులే ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమల ద్వారా రూ.19 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. జిల్లాలో 4.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. కార్యదర్శుల కొరతతో ఇబ్బందులు జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 469 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పంచాయతీలకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండటంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడంలేదని సమాచారం. 2013లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినప్పటికీ పన్నుల వసూలుపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి సురేష్బాబు పర్యవేక్షణలో డివిజనల్ పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వంద శాతం లక్ష్యం పెట్టుకున్నా, కార్యదర్శుల కొరతతో అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేదు. పంచాయతీల నిర్వహాణ పాలకవర్గానికి కష్టంగా మారుతోంది. మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వారం రోజుల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం ఈనెల 31లోగా జిల్లాలోని అన్ని పం చాయతీల్లో ఇంటి పన్నులను వసూలు చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. అనుకున్న సమయంలో కాకున్నా మరో వారం పాటు జిల్లాలో పన్నుల వసూలు చేస్తాం. ఇప్పటికే 950 పంచాయతీల్లో వంద శాతం వసూళ్లు సాధించాం. రేపటి వరకు వెయ్యి పంచాయతీల్లో వంద శాతం పూర్తవుతుంది. మరో వారం పాటు వసూళ్లు కొనసాగించి 1077 పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో మన జిల్లానే పన్నుల వసూళ్లలో అగ్ర స్థానంలోనే నిలవడం ఖాయం. జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలున్నాయి. వాటి ద్వారానే రూ.19 కోట్లు వ సూలు కావాల్సి ఉంది. అయితే కొన్ని పంచాయతీల పరిధిలోని ఫ్యాక్టరీలు మూతబడిపోవడం, జప్తు చేద్దామన్న ఎలాంటి ఆస్తులు లేకపోవడం వల్ల కూడా వంద శాతం పూర్తి కాలేకపోతుంది. సదాశివపేట మండలంలో ఇలాంటి పరిస్థితే ఉంది. పన్నుల వసూళ్లలో మంచి పనతీరును గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లో ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయనుంది. దీనికింద రాష్ట్రానికి రూ.105 కోట్లు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2771 పంచాయతీలు వంద శాతం పన్నుల వసూళ్లు చేయగా అందులో మెదక్ జిల్లాకు చెందిన పంచాయతీలు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. పనితీరు గ్రాంట్ కింద సుమారుగా రూ. 40 కోట్లు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. 2014-15 సంవత్సరంలో చేపట్టిన పన్నుల వసూళ్లకు సంబంధించి పనితీరు గ్రాంట్లు విడుదల చేయనున్నారు. - సురేష్బాబు, జిల్లా పంచాయతీ అధికారి -
వీసా గడువు తీరిన వారికి స్వర్గధామం కర్ణాటక
ఆఫ్రికన్ దేశాల్లో రాజకీయ అస్థిరత కారణంగా వలసలు రాష్ట్రంలో 30 వేలకు పైగా జనాభా విద్యాభ్యాసం కోసం బెంగళూరుకు వస్తున్న వైనం సంపాదన కోసం అక్రమ మార్గాలు మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ మోసాల్లో నిష్ణాతులు ! బెంగళూరు: వీసా గడువు తీరిన వారికి కర్ణాటక స్వర్గధామంలా మారుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు బెంగళూరు, మంగళూరు తదితర నగరాల్లో ఉన్న పరిస్థితులు ఇందుకు కారణంగా పరిణమిస్తున్నాయి. దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరుకు వివిధ దేశాలతో పాటు ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం బెంగళూరు బాట పడుతున్నారు. ఇలా వచ్చే వారు తక్కువ ఖర్చు, నిఘా ఉండదన్న కారణంతో టూరిస్ట్ వీసాపై బెంగళూరుకు వస్తూ గడువు తీరిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంస్థ ద్వారా ప్రతి ఏడాది దాదాపు 200 మందికి పైగా ఆఫ్రికన్ విద్యార్థులు కర్ణాటకకు వ స్తున్నారు. ఐసీసీఆర్-కర్ణాటక రీజినల్ కార్యాలయంలోని గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 245 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఒక్క బెంగళూరులోనే 133 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు అందిస్తున్న స్కాలర్షిప్పుల ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ప్రతి ఏడాది మూడు వేల మందికి పైగా విద్యార్థులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వస్తున్నారు. ఇలా విద్యాసంబంధ కారణాలు చూపుతూ వస్తున్న వారిలో ఎక్కువమంది బెంగళూరు, మైసూరు, మంగళూరులోని ఉంటున్నారని పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా టూరిస్ట్ వీసాపై వచ్చి ఏళ్లు గడిచినా వారి దేశాలకు వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నవారు రాాష్ట్రంలో 30 వేల మందికి పైగా ఉన్నారని పోలీసుశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 15 వేల మందిపై కేసులు... ఆఫ్రికన్ దేశాల్లో రాజకీయ అస్థిరత్వం సర్వసాధారణం. దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. దీంతో చదువు కోసం వచ్చిన ఆఫ్రికన్ విద్యార్థులకు కర్ణాటకలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు, ఆహ్లాద వాతావరణం వారిని ఇక్కడకు రప్పిస్తోంది. ఇక్కడే వివిధ రంగాల్లోని ఉద్యోగ, ఉపాధిని వెతుక్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొంతమంది అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. బెంగళూరు, మంగళూరు వంటి నగరాలకు డ్రగ్స్ను చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ మోసాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆక్రమ మార్గంలో వీరు మధ్యవర్తులుగా మాత్రమే ఉంటున్నారని ఆఫ్రికన్ దేశాల్లోనే ఉన్న కొంతమంది ‘డాన్’లు కర్ణాటకలోని ఉద్యోగ, ఉపాధి వేటలో ఉన్న ఆఫ్రికన్ విద్యార్థులను వినియోగించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏమైనా ఇలా వివిధ రకాల ఘటనలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వ రకూ 15 వేల మంది ఆఫ్రికన్ విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం 85 మందికి మాత్రం శిక్ష ఖరారు కాగా మిగిలిన వారిలో చాలా మంది బెయిల్పై బయటికి వచ్చారు. ఇలా బెయిల్ పై వచ్చిన వారు తమ మకాంతో పాటు పేరును కూడా మార్చి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు డ్రగ్స్ అక్రమ రవాణాలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా డగ్స్ను రవాణా చేస్తూ రెండేళ్లలో రాష్ట్రంలో 28 మంది ఆఫ్రికన్ దేశాలకు చెందిన అమ్మాయిలు రాష్ట్ర పోలీసులకు, రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల్లోని తనిఖీ బృందానికి చిక్కారు. వీరిలో నైజీరియా, టాంజానియా దేశాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 30 వేల మంది : హోం మంత్రి రాష్ట్రంలో వివిధ చోట్ల ఆఫ్రికన్ దేశాలకు చెందిన 30 వేల మంది ప్రజలు అక్రమంగా నివశిస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే ఎవరు, ఎక్కడ ఉన్నారన్న విషయం పై ఇప్పటి వరకూ సమాచారం లేదు. ఈ విషయంపై పోలీసుకుల ఇప్పటికే దిశానిర్దేశం చేశాను. మద్యంలో మత్తులో ఆఫ్రిక్ విద్యార్థి వీరంగం బెంగళూరు (బనశంకరి) : పీకల మద్యం తాగిన ఓ ఆఫ్రికన్ విద్యార్థి స్థానికులపై దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు...హెణ్ణూరు రోడ్డు బైరతిబండె వద్ద రాత్రి మద్యం మత్తులో ఉన్న ఆఫ్రికన్ విద్యార్థి బైక్తో పాదచారులను ఢీకొని గొడవకు దిగాడు. అనంతరం బైరతిబండె వద్ద ఉన్న ఎలక్ట్రిక్ దుకాణం ముందుకు వచ్చిన స్థానికులతో ఘర్షణ పడ్డాడు. షర్టును తొలగించి వీరంగం సృష్టించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దృశ్యాన్ని మొబైల్లో చిత్రీకరిస్తుండగా అతనిపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఆఫ్రికన్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులను అరెస్ట్ చేయడంతో ఆదివారం సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్థానికులు జంకుతున్నారు. -
‘ఎస్కలేషన్’కు డెడ్ లైన్!
► వారంలోగా ప్రతిపాదనలు ► ఇవ్వకుంటే కఠిన చర్యలే ► ప్రాజెక్టుల నిర్మాణ ఏజెన్సీలకు ► నీటిపారుదల శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించని యెడల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. టెండర్ అగ్రిమెంట్ను రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఏజెన్సీల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని నీటి పారుదల శాఖ సీరియస్గా తీసుకుంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఏజెన్సీలతో హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధలో వర్క్షాప్ నిర్వహించారు. దీనికి ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లు మురళీధర్, విజయ్ప్రకాశ్ హాజరయ్యారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లోని 111 ప్యాకేజీల్లో స్టీలు, సిమెంట్, ఇంధన ధరలకు తోడు కార్మికుల కూలీ, యంత్ర పరికరాల ధరలకు అదనంగా చెల్లించడానికి జీవో 146లో ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలు నవంబర్ 30 నాటికే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో డిసెంబర్ 30వరకు ఒకమారు, జనవరి 15 వరకు మరోమారు గడువు పొడగించారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా ఏజెన్సీలతో అధికారులు సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు లేవనెత్తిన అంశాలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న 19 ప్యాకేజీలు, కరీంనగర్ 20 ప్యాకేజీలు, ఆదిలాబాద్ జిల్లాలోని 6 ప్యాకేజీలపై సమీక్ష జరిగింది. ప్రాజెక్టుల పనులు ముందుకు కదలకపోవడంతో ఆయకట్టు లక్ష్యాలు దెబ్బతింటున్నాయని, రూ.10 వేల కోట్ల పనులు ఆగిపోయాయని జోషి వారి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవాలంటే కాంట్రాక్టర్లు సహకరించాలని, పనులు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. వారం లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, లేనియెడల టెండర్ అగ్రిమెంట్ను రద్దు చేసి కాంట్రాక్టర్లపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. అయితే, దీనిపై మెజార్టీ ఏజెన్సీలు సానుకూలత వ్యక్తం చేసినట్టుగా, ప్రతిపాదనలు సమర్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. గురువారం మరిన్ని ప్యాకేజీల పరిధిలోని ఏజెన్సీలతో సమావేశం కొనసాగే అవకాశం ఉంది. -
జూన్ 2 ఉద్యోగులకు డెడ్ లైన్
-
కొరియా సరిహద్దుల్లో మళ్లీ యద్ద మేఘాలు
-
ఎనిమిది వారాలు గడువు
పాలికె ఎన్నికల నిర్వహణపై సుప్రీం తీర్పు బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు మరో ఎనిమిది వారాల పాటు గడువునిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెనక్కు వెళ్లనుంది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు ప్రతి తమకు అందినతర్వాతే ఈ విషయంపై మాట్లాడగలనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచార్ తెలిపారు. వివరాలు... ఆగస్టు 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రభుత్వానికి రూ.10వేల అపరాధ రుసుం విధించిన విషయం విషయం తెలిసిందే. అయితే హైకోర్టును తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈకేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వాదనల్లో భాగంగా బీబీఎంపీ వార్డులను పునఃవిభజన చేయడంతో పాటు నూతనంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఎన్నికల నిర్వహణకు కనీసం మరో మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించిన ఫణీంద్ర....‘ప్రస్తుత తరుణంలో వార్డుల పునఃవిభజ చేయడం వల్ల ఓటర్ల జాబితాను మార్చాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వార్డుల రిజర్వేషన్ల జాబితా అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు అందజేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. అందువల్ల రిజర్వేషన్ జాబితా మార్చడానికి కాని, ఎన్నికల వాయిదా వేయడం కాని సరికాదు.’ అని వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయపీఠం బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి మరో ఎనిమిది వారాల పాటు గడువు ఇస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఈ విషయమై ఫణీంద్ర మాట్లాడుతూ...తాజా తీర్పు వల్ల వార్డుల పునఃవిభజనకు అవకాశం కలగదు. అంతేకాకుండా రిజర్వేషన్ల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎనిమిది వారాలు వెనక్కు వెళ్లేఅవకాశం ఉందన్నారు. ఈ ఎనిమిది వారాల వాయిదా నేటి (శుక్రవారం) నుంచి అన్వయిస్తుందా లేదా ఆగస్టు 5 నుంచి అన్వయిస్తుందా అనే విషయంపై తీర్పు ప్రతి అందిన తర్వాత స్పష్టత వస్తుంది.’ అని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ శ్రీనివాచార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించి నూతన ఎన్నికల షెడ్యూల్ వెళ్లడించడం పై అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం తీర్పు వల్ల గతంలో వలే ఆగస్టు 5 లోపు కాకుండా అక్టోబర్ 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2005కి ముందు ఉన్నకరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువు మరింత పొడిగించారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది చివరివరకు(డిసెంబర్ 31) వరకు పొడిగించారు. ఆలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి కరెన్సీ నోట్లను రూ.500, రూ.1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుసుకునే వీలుంది. 2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు. -
ఓయూసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
హైదరాబాద్: ఓయూసెట్-2015 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్రెడ్డి తెలిపారు. అపరాధ రుసుముతో ఈ నెల 22తో గడువు ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇంత వరకు 1.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
‘జేఎన్ఎన్యూఆర్ఎం’ గడువు పొడిగింపు
హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం(జేఎన్ఎన్యూఆర్ఎం) గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల వరకు పొడిగించింది. పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. గత యూపీఏ ప్రభుత్వం 2005-06లో ప్రవేశపెట్టిన ఈ పథకం గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోగా దీన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు పెంచింది. ‘సమీకృత గృహ, మురికివాడల అభివృద్ధి కార్యక్రమం’(ఐహెచ్ఎస్డీపీ), ‘పట్టణ పేదలకు కనీస సదుపాయాలు’(బీఎస్యూపీ) కార్యక్రమాలకు ఈ పెంపు వర్తించనుంది. 2005-12 మధ్య కాలంలో బీఎస్యూపీ కింద జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,603.19 కోట్ల అంచనా వ్యయంతో 88,035 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 71,470 గృహాల నిర్మాణం పూర్తయింది. ఐహెచ్ఎస్డీపీ కింద రాష్ట్రంలోని పలు పట్టణాలకు రూ.140.46 కోట్ల అంచనా వ్యయంతో 11,664 గృహాలు మంజూరయ్యాయి. అందులో 9607 గృహాల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన గృహాల పనులు ఆగిపోయాయి. గత మార్చితో గడువు ముగిసిపోవడంతో కేంద్రం నుంచి నిధులు సైతం స్తంభించిపోయాయి. ఈ పథకం స్థానంలో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు సైతం ప్రారంభించడంతో వీటి నిర్మాణం కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
డీఎస్సీ దరఖాస్తుకు ఆరు రోజులే గడువు
చిత్తూరు(ఎడ్యుకేషన్): డీఎస్సీ పరీక్ష కు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులు (ఆదివారం మినహా) మాత్రమే గడువు మిగిలి ఉంది. ఫిబ్రవరి ఐదో తేదీ ఆఖరు కావడం తో అభ్యర్థులు దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 28,500 దరఖాస్తులు డీఈవో కార్యాలయానికి చేరాయి. గురువారం అధిక సంఖ్య లో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. దరఖాస్తుల రీ వెరిఫికేషన్ ముమ్మరంగా జరుగుతున్నట్లు డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ పురుషోత్తం తెలిపారు. -
అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెన్సన్లు, ఆహార భద్రతా కార్టులకు అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణ నిరంతర ప్రక్రియ, అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే సంతృప్తికరమైన పద్దతిలోనే పథకాల అమలు జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దరఖాస్తు ఇప్పుడు ఇచ్చి, ధృవీకరణ పత్రం తర్వాత ఇచ్చినా ఫర్వాలేదని కేటీఆర్ మీడియాకు వివరించారు. లబ్దిదారులకు పథకాల సమాచారాన్ని అందించేందుకు కలెక్టర్లు, అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
అక్టోబర్ 20.. డెడ్లైన్ కాదు!
-
చివరి రోజే కీలకం!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 19వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడువు పూర్తి కానుండడంతో ఆ రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో ముందుగానే సంప్రదించాలని, అభ్యర్థుల నామినేషన్లు సరైన ధ్రువీకరణ పత్రాలతో దాఖలు చేసేలా చూడాలన్నారు. నామినేషన్ల పరిశీలనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. పోస్టల్ బ్యాలెట్లు కూడా సరైన సమయంలో ముంద్రించి, పంపిణీ చేయాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిపించాలని ఆదేశించారు. పీఓలకు, ఏపీఓలకు ఈవీఎంలపై పూర్తిస్థారుులో అవగాహన కల్పిం చాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితం గా అమలు చేయాలన్నారు. తొమ్మిది పర్యవేక్షణ కమిటీలను నిర్థేశించిన స్థలాల్లో అందుబాటులో ఉంచాలని, ఉన్నతాధికారులకు త్వరగా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈనెల 24 నుంచి 30వ తేదీలోపు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. వచ్చేనెల 3వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లకు తాగునీరు, నీడ కల్పించాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సూక్ష్మ పరిశీల కులు తప్పకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ బి. రామారావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరాావు, డీఆర్ఓ బి. హేమసుందర్, ఆర్డీఓ జె. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
మరో ఛాన్స్
సాక్షి, గుంటూరు : ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఓటర్ల తుది జాబితాలో పేరు లేని వారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందినవారు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే ఓ చోట ఓటు ఉండి మరో చోట కూడా పొందితే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. జనవరి 31వ తేదీ ప్రచురించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా జనాభాలో ఓటర్లు 70.2 శాతంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తెనాలిలో 73.9 శాతంగా ఉంది. 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏడాదికి 2.6 శాతం పెంచి 2014 జనాభాను అంచనా చేశారు. దీని ప్రకారం తెనాలి నియోజకవర్గంలో జనాభా 3,05,149 మంది ఉంటే, ఓటర్లు 2,25,636 మంది ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాలో 739 మంది ఓటర్లున్నారు. జనాభాలో ఓటర్ల శాతం 73.9 శాతంగా ఉంది. అత్యల్పంగా జనాభాలో ఓటర్లు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ 3,22,346 మంది జనాభా ఉంటే, ఓటర్లు 2,15,517 మంది ఉన్నారు. ప్రతి వెయ్యిమంది జనాభాలో 668 మందిఓటర్లున్నట్లు లెక్క. ప్రతి వెయ్యిమంది జనాభాకు పెదకూరపాడులో 712 మంది ఓటర్లు, తాడికొండలో 695, మంగళగిరిలో 670, పొన్నూరులో 726, వేమూరులో 733, రేపల్లెలో 701, బాపట్లలో 690, ప్రత్తిపాడులో 697, గుంటూరు వెస్ట్లో 709, చిలకలూరిపేటలో 680, నరసరావుపేటలో 681, సత్తెనపల్లిలో 699, వినుకొండలో 704, గురజాలలో 716, మాచర్లలో 702 మంది చొప్పున ఓటర్లున్నారు. జిల్లాలో సెక్స్ రేషియో 1027 గా ఉం ది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,027 మంది మహిళలున్నట్లు అంచనా. ఇది చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం 1058గా నమోదైంది. వినుకొండలో తక్కువగా 1008 మంది ఉన్నారు. -
గడువుపై తేల్చని రాష్ట్రపతి
కొనసాగుతున్న ఉత్కంఠ నేడు నిర్ణయం.. వారం గడువిచ్చే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపించేందుకు అసెంబ్లీకి ఇచ్చిన గడువును పొడిగించే విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా నడవనందువల్ల సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల బిల్లును తిరిగి పంపించేందుకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం లేఖ పంపిన విషయం తెలిసిందే. బిల్లును అసెంబ్లీకి పంపిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23తో ముగియనుండటంతో, రాష్ట్రప్రభుత్వం పంపిన లేఖపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారం రోజులు గడువు పొడిగించే అవకాశం ఉండవచ్చని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించాక అసెంబ్లీ స్పీకర్ లేఖ రాయాల్సి ఉంటుందని.. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాయడంపై న్యాయపరమైన చర్చ జరుగుతోందని, అందువల్లే నిర్ణయం వెలువడడంలో ఆలస్యం అవుతుండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై అటార్నీ జనరల్ నుంచి రాష్ట్రపతి న్యాయ సలహా కూడా కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు గడువు పొడిగింపు వద్దంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. గడువు పొడిగింపు వల్ల ప్రయోజనం లేదని, సభాసమయాన్ని వృథాచేశారని, గడువు పొడిగిస్తే పార్లమెంటులో బిల్లు అనుమతి పొందేందుకు సమయం సరిపోదని వాటిలో పేర్కొన్నారు. -
మలి పోరుకు ముగిసిన నామినేషన్ల పర్వం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్ : మలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగి సింది. 2013 సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు సర్పంచ్, 75 వార్డు స్థానాలకు ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా గడువు ముగిసే సమయానికి మొత్తం 107 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి. సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. రెండు పంచాయతీలకు దాఖలు కాని నామినేషన్లు జిల్లాలో రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. ఈ రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వియ్యంపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తుండడంతో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించారు. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఆ స్థానానికి కూడా ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు.ఈ పంచాయతీలో తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో కేవలం ఐదవ వార్డుకు మాత్రమే నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వేపాడ మండలం గుడివాడ సర్పంచ్ స్థానానికి తొమ్మి నామినేషన్లు, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 75 వార్డు స్థానాలకు మలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా అందులో జోగింపేట పంచాయతీ పరిధిలో 9 వార్డు లకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జీఎల్పురం మండలంలోని మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు ల్లో పోటీ చేసేందుకు మొత్తం 93 నామినేషన్ల దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు మంగళవారం పరిశీలించనున్నా రు. 8వ తేదీ సాయింత్రం 5 లోగా తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత అభ్యర్థులు ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవాలి.అప్పీలుకు వెంటనే రశీదు అందజేస్తూ దరఖాస్తు పరిష్కారానికి తేదీ, సమయం, కార్యాలయం కూడా తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా నామినేషన్లును ఉపసంహ రణకు గడువుగా నిర్ధేశించగా, అనంతరం అదే రోజున సాయంత్రం 5 గంటలకు పోటీల్లో ఉ న్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు. -
పంచాయతీ నామినేషన్ల గడువు పూర్తి
శ్రీకాకుళం సిటీ,న్యూస్లైన్: జిల్లాలో ఈ నెల 18న జరగనున్న పలు పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లోని 8 గ్రామ సర్పంచ్లు, 76 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 3 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజునే అత్యధికంగా దాఖలయ్యాయి. 8 సర్పంచ్లకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా, అందులో కంచిలి మండలం శాసనం సర్పంచ్ స్థానానికి 2, బుడితి (సారవకోట)కు 5, కొల్లివలస (ఆమదాలవలస)కు 7, చల్లయ్యవలస (పోలాకి)కు 6, సంతబొమ్మాళి సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు దాఖలు కాగా, బుడుమూరు (లావేరు) స్థానానికి ఒకేఒక్క నామినేషన్ దాఖలయ్యింది. కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురం గ్రామ సర్పంచ్ స్థానంతో పాటు, పంచాయతీలో ఉన్న మొత్తం 8 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అలాగే, కొత్తూరు మండలంలో ఎన్నికలు జరగాల్సిన పొన్నుటూరు సర్పంచ్, 7వవార్డు స్థానాలకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఇక వార్డు సభ్యుల స్థానాల్లో మొత్తం 76 వార్డులకు గాను 67 నామినేషన్లు దాఖలయ్యాయి. మెళియాపుట్టి మండలం గంగరాజుపురంలో ఎన్నికలు జరగాల్సిన 4,5 వార్డులకు, సారవకోట మండలం తొగిరిలోని 3,4,7 వార్డులకు, అలాగే కరడశింగిలో 1,4,7 వార్డులకు, రామకృష్ణపురంలో 7వ వార్డుకు, లావేరు మండలం పెదరావుపల్లిలో 2వార్డు, కోటబొమ్మాళి మండలం కస్తూరిపాడులో 7వ వార్డు, దంతలోని 4వవార్డుకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. నేడు ఉదయం 11 గంటల నుంచి అధికారుల సమక్షంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరుగనుంది. పట్టుపురంలో ఎన్నిక లేనట్టే కోటబొమ్మాళి: మండలంలోని పట్టుపురం పంచాయతీలోని సర్పంచ్, 8 వార్డులకు, దంతలోని నాలుగో వార్డు, కస్తూరిపాడులో ఏడో వార్డుకు నామినేషన్లు వేయలేదు. ఈ సారికూడా ఎన్నికలు లేనట్టేనని ఎన్నికల అధికారి చింతాడ లక్ష్మీబాయి తెలిపారు. ఈ పంచాయతీల్లో గడిచిన జూలైలో కేటాయించిన రిజర్వేషన్లే మళ్లీ కేటాయించడంతో సంబంధిత కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పంచాయతీల్లో ఉన్న ఏనేటికొండలు సామాజిక వర్గానికి చెందిన వారికి గడచిన 2002 వరకు రెవెన్యూ యంత్రాంగం ఎస్టీలుగా కులధ్రువపత్రాలను మంజూరు చేసినా, తర్వాత కాలం నుంచి ధ్రువపత్రాలను జారీచేయడం నిలిపివేసింది. గత ఎన్నికల్లోనూ ఇదే రిజర్వేన్పై ఒక్క నామినేషనూ దాఖలుకాక ఎన్నిక ఆగిపోగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో మళ్లీ అదే రిజర్వేషన్లు కేటాయించడంతో మళ్లీ నామినేషన్లు పడలేదని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఎస్టీలు లేనప్పుడు వారికి ఎలా రిజర్వు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ధర గడువు పెంపు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: గ్యాస్ వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఇంధన సంస్థలు ఆడుకుంటున్నాయి. కొత్త సంవత్సర కానుకగా గ్యాస్ కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, ఇదే సమయంలో చడీచప్పుడు లేకుండా గ్యాస్ సిలెండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఒకేసారి రూ.217 మేరకు పెంచేశాయి. ఈ నిర్ణయాలు అంతిమంగా ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికే ఎక్కువ నష్టం కలుగజేస్తున్నాయి. జిల్లాలో గ్యాస్తో ఆధార్ అనుసంధానానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అప్పటివరకు అనుసంధానం చేసుకోనివారికి సబ్సిడీ పోగా రూ.419కి సిలెండర్ సరఫరా చేస్తున్నారు. అనుసంధానం చేసుకున్న వారు మాత్రం సిలెండర్కు మొదట రూ.1109 చెల్లిస్తే.. ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాకు రూ.614 సబ్సిడీ మొత్తం జమ చేస్తున్నారు. ఈ లెక్కన వారు సిలెండర్కు మిగతావారి కంటే అదనంగా రూ.152 భరిస్తున్నారు. తాజాగా రూ.217 పెంచడంతో సిలెండర్ ధర రూ.1326కు చేరింది. పెరిగిన ధర ప్రకారం సబ్సిడీ కూడా పెరిగి బ్యాంకు ఖాతాల్లో రూ.800 మేరకు జమ అవుతుందంటున్నారు. అదే సమయంలో అనుసంధానం చేసుకోని వారికి ఈ పెరుగుదల రూ.25 మాత్రమే. ఇప్పటివరకు రూ.419 చెల్లించిన వీరు ఇక నుంచి రూ.444 చెల్లించాల్సి ఉంటుంది. పైగా అనుసంధానం చేసుకోవడానికి మరో రెండు నెలల అవకాశం లభించడంతో అప్పటివరకు ధర పెరగకుండా ఉంటే ఈ సబ్సిడీ రేటే వర్తిస్తుంది. దీంతో ఎలా చూసినా ప్రభుత్వ సూచన మేరకు ముందుగానే అనుసంధానం చేసుకున్న వారే ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో 2.92 లక్షల మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 80 శాతం మందే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా సుమారు 60 వేల మంది మిగిలిపోవడంతో డిసెంబర్ 31తో ముగిసిన గడువును కేంద్రం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇది వీరికి ఉపయుక్తంగానే ఉన్నా.. అనుసంధాన చేసుకున్న వారు ధర పెరుగుదలతో బెంబేలెత్తుతున్నారు. సిలెండర్ విడిపించుకున్నప్పుడు పూర్తి మొత్తం చెల్లిస్తున్నప్పటికీ సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలకు సక్రమంగా జమ కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బ్యాంకుల చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. దీనికి తోడు ధర ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. మరోవైపు డెలివరీ చార్జీల పేరిట కొంతమంది డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. -
గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను 30 రోజుల నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు పూర్తయిన కార్మిక శాఖ అధికారులు 10 ఆర్జీలపై ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడంపై డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ సర్వే, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఫారెస్టు అధికారులు సకాలంలో తమ ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 7,053 ఫిర్యాదులు అందగా ఇందులో 6,500 పరిష్కారం కాగా 195 ఫిర్యాదులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. 30 రోజుల్లోగా పరిష్కరించాల్సినవి 207, 30 రోజుల పైబడి 29 దరఖాస్తులు ఉన్నాయన్నారు. 3 నెలలు పైబడినవి 81, ఆరు నెలలు పైబడి 16 దరఖాస్తులు ఆయా శాఖల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. పంచాయతీ నిధులు సక్రమంగా ఉపయోగించి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన సర్పంచ్లకు సూచించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్పంచ్లకు తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్లు పనిచేసే ప్రతి పనికి సంబంధించి ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని సూచించారు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓలుగా పదోన్నతులు పొందిన 47 మందికి కలెక్టర్ ప్రోసిడింగ్ అందజేశారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ సాయిలు, ఆర్డీఓ సాయిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘ఓటు’ గడువు
సాక్షి, కాకినాడ : సామాన్యుల చేతిలో పాశుపతాస్త్రమైన ‘ఓటు’ హక్కు కోసం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజకీయంగా రానున్న కాలంలో చోటు చేసుకోనున్న సమూల మార్పులకు ఇదొక శుభపరిణామం. కొత్త నాయకత్వాన్ని..సరికొత్త రాజకీయాలను సామాన్యులు సైతం కోరుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఓటు హక్కు కోసం ఆన్లైన్లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడం చదువుకున్న వారు, మేధావుల్లో కూడా ఓటు హక్కుపై ఆసక్తి పెరిగినట్టు కన్పిస్తుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తని కనబర్చారు. 2014లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న ఓటర్ల నమోదుకు జిల్లాలో ఊహించని రీతిలో స్పందన లభించింది. జిల్లాలో 18ఏళ్లకు పైబడిన నవ యువఓటర్లు జిల్లా జనాభా నిష్పత్తిని బట్టి 1,42,666 మంది ఉన్నారని అంచనా వేశారు. ఆ మేరకు నమోదైతేనే గొప్ప అని అందరూ భావించారు. ప్రారంభంలో నత్తనడనక సాగిన ఈ ప్రక్రియ ఆతర్వాత ఊపందుకుంది. దీనికి తోడు రెండుసార్లు గడువును కూడా పెంచడం గణనీయంగా ఓటర్ల నమోదుకు దోహదపడింది. జనాభా నిష్పత్తిని బట్టి 1,42,666 మంది మాత్రమే కొత్త ఓటర్లున్నారని అంచనా వేస్తే వాటిని తలకిందులు చేస్తూ ఆదివారం రాత్రికే ఏకంగా జిల్లాలో 1,75,541 మంది ఓటుహక్కు కోసం ఫారం-6లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60 వేల మందికి పైగా తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇక సవరణలకు సంబంధించి ఫారం-7లో 15,256 మంది దరఖాస్తు చేసుకోగా, తమ పేర్లు తొలగించాలంటూ ఫారం-8లో 10,479 మంది 2649 మంది, పోలింగ్ స్టేషన్ల మార్పు కోసం ఫారం-8ఏ లో 2575 మంది దరఖాస్తు చేసు కున్నారు. ఎన్నడూ లేని రీతిలో యువత ఈసారి ఓటర్ల నమోదు పట్ల ఆసక్తిని కనపర్చారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 51,54,296 మంది ఉన్నారు. వీరిలో 34,29,149 మంది ఓటర్లున్నారు. వీరిలో 25,69,688 మంది పురుషులకు 17,13, 958 మంది, 25,84,608 మంది స్త్రీలకు 17,15,089 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. 2014 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు జిల్లాలో ఏకంగా 1,42,666 ఉన్నారని అంచనా వేయగా, ఆదివారం రాత్రి వరకు ఏకంగా 1,75,541 మంది కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 శాతానికి పైగా యువత ఉండగా, మిగిలిన వారు ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాల కోసం జిల్లాలో స్థిరపడిన వేరే ప్రాంతాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్లో 17,735 మంది నమోదు చేసుకోగా, మండపేటలో అత్యల్పంగా 5188 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు నమోదైన ఓటర్ల సంఖ్యను కూడా గణిస్తే కొత్త ఓటర్ల సంఖ్య రెండులక్షలు దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగు రోజులుగా ఆన్లైన్ మొరాయించడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల సంఖ్యను కూడా గణించలేదు. ఈ దరఖాస్తుల సంఖ్య కూడా తేలితే కొత్త ఓటర్లు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఓటరు నమోదుకు మూడు రోజులే గడువు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్లైన్ :ఒక్క వేటుతో చెట్టును పడగొట్టగలమో లేదో...కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో అవినీతి వక్షాన్ని కూల్చవచ్చు. ఆ ఒక్క ఆయుధం మన ఓటే కావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ అలాంటిది. సమసమాజ నిర్మాణం ప్రజల చేతుల్లోనే ఉంది. సచ్చీలురైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన కానుక ఓటుహక్కు. నవభారత నిర్మాణం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాల్సిందే. సమాజంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యతను యువత తెలుసుకోవాలి. డిసెంబర్ 17వ తేదీ వరకు... నూతన ఓటర్ల నమోదుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. బూత్లెవల్ ఏజెంట్లు నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల చివరి జాబితాను ప్రచురిస్తారు. బూత్స్థాయి అధికారులు, తమశీల్దార్లు, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఈ-సేవా, మీ-సేవా, ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి. ఓటరు(చనిపోయిన, నివా సం మారిన వారి)పేరును జాబితా నుంచి తొలగించుకోవడానికి ఫారం-7, జాబితాలో ఓటరు పేరు, ఫొటో, తండ్రి, భార్య, భర్త పేర్ల సవరణకు ఫారం-8, నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్స్టేషన్కు ఓటును మారుకునేందుకు ఫారం-8ఏ ఉపయోగించాలి. ఈ-రిజిస్ట్రేషన్ ఈజీ... ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియపై భారీ కసరత్తు చేస్తోంది. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థుల నుంచి నూతన ఓటరు దరఖాస్తులు తీసుకోవాలని జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మీ-సేవ, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచింది. జిల్లాలో 87 వేల దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా ఓటరు నమోదుకు 87 వేల అప్లికేషన్లు అందినట్లు జిల్లా అధికారులు తెలిపా రు. ఆదివారం(నేడు) జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటరు కార్డుతో ప్రయోజనాలు... ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడానికి, నివాస ప్రాంతం, వయసు ధ్రువీకరణ పత్రంగా బ్యాంక్ ఖాతా తెరవడానికి, డ్రైవింగ్ లెసైన్స్, పాన్కార్డు, ఆధార్కార్డు, గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఓటరుకార్డు ఉపయోగపడుతుంది. -
డెడ్లైన్ దడ
సాక్షి, సంగారెడ్డి: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) వ్యయంపై కలెక్టర్ ఆదేశాలు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. 2010-11, 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వచ్చే నెలాఖరుగాలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు డెడ్లైన్ విధించారు. ఒక వేళ గడువులోగా పూర్తి కాని పనులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆమె తేల్చి చెప్పేశారు. అయితే చోటామోటా నేతలు అడ్వాన్సులు తినేసి ప్రారంభించని పనులు ఎక్కువ శాతం ఉన్నట్లు వెలుగు చూస్తుండడం అధికారుల్లో దడ మొదలైంది. బీఆర్జీఎఫ్ కింద 2010-13 కాలంలో జిల్లాకు మంజూరైన రూ.110.80 కోట్ల నిధులతో 12,353 పనులు చేపట్టగా.. అందులో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో కోట్ల రూపాయలు నిరుపయోగంగా మూలుగుతున్నాయి. బీఆర్జీఎఫ్ నిధుల్లో 20 శాతం జెడ్పీ, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామపంచాయతీలకు వాటాలుగా కేటాయిస్తారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలు ఈ నిధులతో పనులు చేయిస్తాయి. దాదాపు అన్ని పనులకు రూ.5 లక్షల వ్యయం లోపే అంచనాలు తయారు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు, చోటా మోటా నేతలకు నామినేషన్ల ప్రాతిపదికన అడ్వాన్స్లు కట్టబెట్టారు. కొన్ని చిన్న పనులకు రూ.10 వేల నుంచి రూ. లక్ష వ్యయంతో అంచనాలు రూపొందించి పనులు చేయకుండానే నిధులను స్వాహా చేశారు. ఈ క్రమంలో నిధుల వినియోగం, ఒక్కో పని స్థితి గతిపై కలెక్టర్ స్పష్టమైన నివేదిక కోరడంతో అధికారుల గుండెల్లో దడ పుడుతోంది. ఎంపీడీఓల కసరత్తు నిధుల వినియోగంపై ఇప్పటికే ఓ సారి సమగ్ర నివేదిక తెప్పించుకున్న కలెక్టర్.. వారం రోజుల్లో స్పష్టమైన సమాచారంతో మరో నివేదికలను అందించాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. నివేదికల తయారీ కోసం ఆమే స్వయంగా ఆరు రకాల ఫార్మాట్లను తయారు చేసి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నివేదికలపై కసరత్తు జరుగుతోంది. మరో ఐదు రోజుల్లో నివేదికలన్నీ అందాక జెడ్పీ సీఈఓ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.