Deepak Chahar
-
IPL 2025: దీపక్ చాహర్ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే విజేతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) సీఎస్కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్కింగ్స్కు ఆడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో చాహర్ తొలుత బ్యాటింగ్లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కు దిగిన చాహర్ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్లో ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్లోనూ చాహర్ ఆదిలోనే సీఎస్కేను దెబ్బకొట్టాడు. చాహర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో చాహర్ 2 ఓవర్లలో వికెట్ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చాహర్ ముంబై ఇండియన్స్ తరఫున గ్రాండ్గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్ ఓ హాస్యాస్పదమైన మీమ్ షేర్ చేయడం (సోషల్మీడియాలో) ద్వారా సెలబ్రేట్ చేసుకుంది. చాహర్ తన పాత జట్టుకు (సీఎస్కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. Malti Chahar's Instagram story. pic.twitter.com/1bfxj4kcU4— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025చాహర్ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్లో చాహర్ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. -
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్గా నిలిచిన దీపక్ చహర్కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
-
ధోనితో వాదించిన రుతురాజ్.. ఎవరి ఆదేశాలు పాటించాలి?
'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుబ్మన్ గిల్(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్తో మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సీఎస్కే అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్ చహర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ నుంచి చహర్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్ అడిగాడు. ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్, రుతురాజ్.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్ను చూడాలా లేదంటే రుతురాజ్ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా రుతురాజ్ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం ఈ క్రమంలో గుజరాత్తో మ్యాచ్లో రుతురాజ్ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా. గతంలో ఆరంభ ఓవర్లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు. పేసర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్పై బంతిపై గ్రిప్ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్కే ఆల్రౌండర్ శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: #Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్రైజర్స్ -
IPL 2024: ‘ధోని ఇంకో రెండేళ్లు ఆడతాడు’
IPL 2024- Is this MS Dhoni's last IPL season?: మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2024 సీజన్లో ఆడతాడా? లేదా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈసారి కొత్త పాత్రలో నేను అంటూ ధోని కూడా టీజ్ చేయడంతో ఆటగాడిగా జట్టు నుంచి నిష్క్రమిస్తాడా అనే సందేహాలు మరింత బలపడ్డాయి. తాజా ఎడిషన్లో మెంటార్గా ధోని కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్రౌండర్ దీపక్ చహర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. ‘‘ధోని ఈసారి కచ్చితంగా ఆడతాడు. నాకు తెలిసి ఈ సీజన్ ముగిసిన తర్వాతే ఇక ముందు ఆడాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటాడు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. ధోని మరో రెండేళ్లపాటు ఆడతాడు. బ్యాటర్లైనా, బౌలర్లైనా తమ ఆటలో పస తగ్గినపుడే రిటైర్ అవ్వాలని భావిస్తారు. మరి.. గతేడాది ఎంఎస్ ధోని ఎలాంటి షాట్లు బాదాడో చూశారు కదా! గంటకు 145 కిలో మీటర్ల వేగంతో సిక్స్లు కొట్టాడు. నెట్స్లోనూ భారీ షాట్లతో అలరించాడు’’ అని ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా 42 ఏళ్ల ధోని గతేడాది సీఎస్కేను రికార్డు స్థాయిలో ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ ఐపీఎల్ టి20 టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్, న్యూజిలాండ్కు చెందిన డెవాన్ కాన్వే ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే ఎడమ బొటన వేలికి గాయంకాగా, ఈ వారంలో అతనికి శస్త్ర చికిత్స జరగనుంది. కాన్వే కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడిన కాన్వే 9 అర్ధ సెంచరీలతో కలిపి 141.28 స్ట్రయిక్రేట్తో 924 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2024: ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే! -
Ind vs SA: ఆఖరి రెండు వన్డేలకు అయ్యర్ దూరం.. కారణమిదే
India’s updated ODI squad Vs SA 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుతో పంచుకున్న టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. జొహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం(డిసెంబరు 17) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టార్ పేసర్ దీపక్ చహర్ ఈ సిరీస్కు దూరం కానున్నట్లు శనివారం వెల్లడించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని తెలిపింది. అతడి స్థానాన్ని ఆకాశ్ దీప్తో భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. శ్రేయస్ అయ్యర్ దూరం అదే విధంగా శ్రేయస్ అయ్యర్ సైతం ఆఖరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు, మూడో మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలిపింది. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీ గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ రెండు మ్యాచ్ల సిరీస్పై ప్రత్యేక దృష్టిసారించింది. అందుకే పలువురు స్టార్ బ్యాటర్లు, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నారు. ఆ సమయాన్ని టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు కేటాయించనున్నారు. చహర్ స్థానంలో వస్తున్నాడు.. ఇంతకీ ఎవరీ ఆకాశ్ దీప్? దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల ఆల్రౌండర్ ఆకాశ్ దీప్. బెంగాల్ తరఫున 2019 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్ల(లిస్ట్-ఏ, ఫస్ట్క్లాస్, టీ20)లలో 80 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో కలిపి మొత్తంగా నూట డెబ్బైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 500 పరుగులు సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఆకాశ్ దీప్.. ఏడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు. భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్. చదవండి: రోహిత్కు బైబై.. ఇక టీమిండియా టీ20 కెప్టెన్గానూ హార్దిక్ పాండ్యా!? -
టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దృవీకరించింది. షమీ ఫిట్నెస్పై మెడికల్ టీమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా షమీ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా భారత యువ పేసర్ దీపక్ చాహర్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రోటీస్ పర్యటనకు దూరంగా ఉండాలని చాహర్ నిర్ణయించకున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. 🚨 NEWS 🚨 Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series. Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK — BCCI (@BCCI) December 16, 2023 -
Ind vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్లకు టీమిండియా పేసర్ దూరం?
India Tour Of South Africa 2023: టీమిండియా పేసర్ దీపక్ చహర్ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన రైటార్మ్ పేసర్ దీపక్ చహర్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్కు యువ పేసర్ ముకేశ్ కుమార్ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. రాయ్పూర్ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్ చహర్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. తండ్రికి బ్రెయిన్స్ట్రోక్ తాజాగా ఈ విషయం గురించి దీపక్ చహర్ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం. లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం. ఈరోజు క్రికెటర్గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను. ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి సౌతాఫ్రికాకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని దీపక్ చహర్ వెల్లడించాడు. అయితే, డిసెంబరు 10 నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దీపక్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టుకు దీపక్ చహర్ ఎంపికైన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వెళ్లి కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల దీపక్ చహర్ తండ్రి లోకేంద్రసింగ్ భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని సమాచారం. ఆయన బీపీ, షుగర్ పేషంట్. అలీఘర్లో ఓ వివాహ వేడకకు హాజరైన సందర్భంగా పక్షవాతానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు దైనిక్ జాగరణ్ వివరాలు వెల్లడించింది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
IND vs AUS: భారత జట్టులో కీలక మార్పు! స్టార్ బౌలర్ ఎంట్రీ
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. తన పెళ్లి కారణంగా మూడో టీ20కు ముందు ముఖేష్ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బీసీసీఐ భర్తీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే రాయ్పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు అతడు జట్టుతో కలవనున్నాడు. ముఖేష్ జట్టులోకి వచ్చినప్పటికీ చాహర్ కూడా జట్టులో కొనసాగనున్నాడు. "గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20కి ముందు టీమిండియా నుంచి తనను విడుదల చేయాలని ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బీసీసీఐని అభ్యర్థించాడు. ముఖేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో అతడికి సెలవు మంజూరు చేయబడింది. అతడి స్ధానంలో దీపక్ చాహర్ జట్టుతో చేరాడు. ముఖేష్ తిరిగి రాయ్పూర్లో జరిగే 4వ టీ20కి ముందు జట్టులో చేరనున్నాడని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దీపక్ చాహర్ చివరగా గతేడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా తరపున ఆడాడు. చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities. He will join the squad ahead of the… — BCCI (@BCCI) November 28, 2023 -
భారత జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడ మాత్రం 6 వికెట్లతో
విజయ్ హజారే ట్రోఫీ 2023 టీమిండియా యువ పేసర్, రాజస్తాన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో దీపక్ చాహర్ చెలరేగాడు. ఈ మ్యాచ్లో చాహర్ తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 41 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 29 ఓవర్లలో కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో చిరాగ్ గాంధీ(43) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహర్తో పాటు ఖాలీల్ అహ్మద్ రెండు, అంకిత్ చౌదరీ, ధావన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ దీపక్ హుడా(76 నాటౌట్) పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. దీపక్ చాహర్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మిండియా తరపున చివరగా గతేడాది ఆక్టోబర్లో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్లో ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరపున 37 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన చాహర్.. 45 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. ఇకపై యూపీకి ఆడొద్దు: గతాన్ని తలచుకున్న షమీ -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
నువ్వో, నేనో తేల్చుకుందాం.. సీఎస్కే ఆటగాళ్ల మధ్య ఫైట్
ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ల మధ్య సరదా ఫైట్ జరిగింది. జట్టులో స్థానం కోసం ఆల్రౌండర్లు శివమ్ దూబే, దీపక్ చాహర్ మాటల యుద్దానికి దిగారు. తన ఆల్టైమ్ బెస్ట్ సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్లో స్థానం కల్పించకపోవడంతో చాహర్.. దూబేకు ఓ ఛాలెంజ్ విసిరాడు. వచ్చే ఏడాది నువ్వు (దూబే), నేను (చాహర్) ఓ సింగిల్ ఓవర్ మ్యాచ్ ఆడదాం. నేను నీకొక ఓవర్ బౌల్ చేస్తాను. నువ్వు నాకు ఒక ఓవర్ బౌల్ చెయ్యి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారిదే సీఎస్కే ఆల్టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్లో స్పాట్ అని చాహర్.. దూబేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. చాహర్ సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. ఛాంపియన్ జట్టులో స్థానం కోసం ఈ మాత్రం పోటీ ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు. కాగా, దూబే తన ఆల్టైమ్ బెస్ట్ సీఎస్కే జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా తనతో పాటు అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవోలను ఎంపిక చేసి, ఇదే కేటగిరీకి చెందిన దీపక్ చాహర్కు అవకాశం కల్పించలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 ఎడిషన్లో శివమ్ దూబే సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్ల్లో 159.92 స్ట్రయిక్రేట్తో 3 అర్ధసెంచరీల సాయంతో 411 పరుగులు చేశాడు. దూబే ఈ సీజన్లో ఏకంగా 35 సిక్సర్లు బాది ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చాడు. మరోవైపు ఇదే సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన దీపక్ చాహర్ బంతితో ఓ మోస్తరుగా రాణించి 13 వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చూస్తే వీరిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేశారు. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్కు 7 వికెట్లు, అన్ని క్లీన్బౌల్డ్లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్బౌల్డ్లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
అతడు డ్రగ్లాంటి వాడు.. నా జీవితకాలంలో.. : ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni On India, CSK Star: ‘‘దీపక్ చహర్ డ్రగ్ లాంటివాడు. ఒకవేళ తను మన చుట్టుపక్కలే ఉంటే.. ఎక్కడున్నాడు అని వెతుక్కోవాలి. ఒకవేళ మన పక్కనే ఉంటే.. ఇతడు ఇక్కడెందుకు ఉన్నాడని అనుకునేలా చేస్తాడు. అతడు రోజురోజుకీ పరిణతి చెందడం హర్షించదగ్గ విషయం. పూర్తిస్థాయిలో పరిణతి సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అయినా పర్లేదు! కానీ నా జీవితకాలంలో మాత్రం అతడిని మెచ్యూర్ పర్సన్గా చూడలేను’’ అని చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కాగా టీమిండియా ఆల్రౌండర్ దీపక్ చహర్కు ధోనితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. 2016లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ చహర్ను తీసుకున్నపుడు అక్కడే మిస్టర్కూల్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2017 తర్వాత అతడిని సీఎస్కేలోకి తీసుకువచ్చాడు తలా!! చహర్కు అండగా నిలిచి ఇక 2018లో చహర్ను ఆడించడానికి సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిరాకరించగా.. ధోని మాత్రం 14 మ్యాచ్లలో అతడిని ఆడించాడు. చహర్కు అండగా నిలబడి తన కెరీర్ ఊపందుకునేందుకు ఊతమిచ్చాడు. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2022 మొత్తానికి దూరమైన చహర్.. తాజా ఎడిషన్లో 10 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. నిర్మాత ధోని ఇంతకీ ధోని ఏ సందర్భంలో చహర్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడో చెప్పనేలేదు కదూ! ధోని సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎస్కేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తలా.. ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. LGM పేరిట తన ప్రొడక్షన్లో మొదటి సినిమా నిర్మించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఫంక్షన్ను సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చహర్ గురించి ప్రస్తావన రాగా.. ధోని పైవిధంగా స్పందించాడు. చదవండి: Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే? -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్రౌండర్ దీపక్ చహర్కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్కప్ జట్టులో ఉమ్రాన్కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్టైమ్ స్పిన్ బౌలర్గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో శుబ్మన్ గిల్ క్యాచ్ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
దీపక్ చహర్ అరుదైన ఘనత..
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సాహాను ఔట్ చేయడం ద్వారా దీపక్ చహర్ ఒక రికార్డు అందుకున్నాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీపక్ చహర్ మూడో స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో ఇప్పటివరకు దీపక్ చహర్ 53 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ కూడా అన్నే వికెట్లతో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 61 వికెట్లతో ఉండగా.. 55 వికెట్లతో సందీప్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 52 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. Deepak Chahar 🤝 Wickets in Powerplay 🕺 A #Yellove story for the ages! 💯#GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema | @ChennaiIPL @deepak_chahar9 pic.twitter.com/Ethh2nnjZu — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: #NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు.. -
వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
IPL 2023 CSK vs KKR- MS Dhoni Comments: కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు తమ ఆటగాళ్లు శాయశక్తులా ప్రయత్నించారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి తమ బ్యాటర్లు లేదంటే బౌలర్లను నిందించాలనుకోవడం సరికాదని.. పిచ్ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే సొంతగడ్డపై ఆదివారం ఆఖరి మ్యాచ్ ఆడేసింది. దూబే హిట్టింగ్ చెపాక్ వేదికగా కేకేఆర్తో తలపడిన చెన్నై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 30 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన శివం దూబే 34 బంతుల్లో 48 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(20) తప్ప ఎవరూ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. అదరగొట్టిన దీపక్ చహర్.. కానీ ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు దీపక్ చహర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(1), జేసన్ రాయ్(12)లను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు పంపాడు. రాణా, రింకూ హాఫ్ సెంచరీలతో వన్డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(9)ను త్వరగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 57 పరుగులు, నాటౌట్)తో ఆకట్టుకోగా.. రింకూ సింగ్ 43 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వీరిద్దరి అర్ధ శతకాలతో కేకేఆర్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ధోని సేనపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరచుకుంది. ఇక ఓటమితో సీఎస్కే ఖాతాలో ఐదో పరాజయం నమోదైంది. అయినప్పటికీ ఇప్పటికే 13 మ్యాచ్లకు గాను ఏడు గెలిచిన చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కు దాదాపు అర్హత సాధించినట్లే! అదే తీవ్ర ప్రభావం చూపింది ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం ధోని మాట్లాడుతూ.. గెలిచేందుకు తమ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారని, పరాజయానికి వారిని తప్పుపట్టాలనుకోవడం లేదన్నాడు. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నపుడు సెకండ్ ఇన్నింగ్స్ నుంచి బంతి మంచిగా టర్న్ అయినపుడు.. ఇది 180 పరుగుల వికెట్ అని తెలిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మేమైతే ఈ స్కోరు దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాం. డ్యూ(తేమ) ప్రభావం చూపింది. తొలి, రెండో ఇన్నింగ్స్కు తేడా మీరు కూడా చూసే ఉంటారు. మొదటి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్.. రెండో ఇన్నింగ్స్లో పేసర్లకు అనుకూలంగా మారింది. మా ఓటమికి పరిస్థితుల ప్రభావమే కారణం’’ అని ధోని చెప్పుకొచ్చాడు. దూబే అద్భుతం.. చహర్ విలువైన ఆస్తి ఇక శివం దూబే అద్బుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించిన ధోని.. అతడు ఇలాగే నిలకడైన ఆట తీరు కొనసాగించాలని ఆకాంక్షించాడు. అదే విధంగా ఫాస్ట్బౌలర్ దీపక్ చహర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. ఎలా బౌల్ చేయాలి.. ఫీల్డింగ్ ఎలా సెట్ చేసుకోవాలన్న అంశాలపై అతడికి పూర్తి అవగాహన ఉంటుంది. నిజంగా జట్టుకు తనొక విలువైన ఆస్తి. తను ఇప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్గా కనిపిస్తున్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నాడు’’ అని ధోని.. చహర్పై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన చహర్.. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా బ్యాటింగ్ చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: IPL 2023: మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి 'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
దీపక్ చాహర్ ని కొట్టిన ధోని..!
-
ధోని చేసిన పనికి షాక్ తిన్న చహర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ముగిసిన తర్వాత ధోని పెవిలియన్ వైపు నడుస్తున్న సమయంలో దీపక్ చహర్ కనిపించాడు. అయితే ధోని పోతూ పోతూ చహర్వైపు సీరియస్ లుక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అతని పక్కనుంచి వెళ్లిన ధోని.. చహర్ తలపై కొట్టినంత పని చేశాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన చహర్ ధోని వైపు తిరగ్గా.. సీఎస్కే కెప్టెన్ అతని వైపు చూడకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. 'అమ్మ ధోని.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా' అంటూ ఫన్నీగా పేర్కొన్నారు. ధోని.. చహర్ను కొట్టడం అనేది ఫన్నీవేలోనే చేసినప్పటికి అభిమానులు మాత్రం తమకు నచ్చింది ఊహించుకున్నారు.''ఈ సీజన్లో చహర్ ప్రదర్శన పట్ల ధోని అసంతృప్తిగా ఉన్నాడు.. అందుకే ఇలా చేశాడు.. ఒక సీఎస్కే అభిమాని చహర్పై ఎంత కోపంగా ఉన్నాడనేది ధోని చూపించాడు'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లో గాయంతో చహర్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. రెండో అంచె పోటీల్లో ఆడుతున్న చహర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. Thala expressing what every CSK fan feel about chahar 😂😂😂#CSKvDC #Dhoni #shivamdube #rayudu pic.twitter.com/IuYyLvE9MR — Mr Leo (@mrleooffl) May 10, 2023 చదవండి: 'పొరపాటులో మరిచిపోయాడు.. వదిలేయండి!' -
'568 రోజులు తర్వాత ఎట్టకేలకు వికెట్'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఎట్టకేలకు తొలి వికెట్ సాధించాడు. శనివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఔట్ చేయడం ద్వారా వికెట్ సాధించాడు. దాదాపు 568 రోజుల తర్వాత దీపక్ చహర్ ఐపీఎల్లో వికెట్ తీయడం విశేషం. చివరిగా ఐపీఎల్ 2021 ఫైనల్లో వికెట్ తీసిన చహర్ ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఈ సీజన్లోనూ సీఎస్కే ఆడిన ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. కాగా లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకోవడంతో దీపక్ చహర్పై విమర్శలు వచ్చాయి. తాజాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన దీపక్ చహర్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే చహర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి తొలుత ఇషాన్ కిషన్ను ఔట్ చేసిన చహర్.. ఆ తర్వాత నాలుగో బంతికి ధోని సూచనలు పాటిస్తూ రోహిత్ను బుట్టలో వేసుకొని రెండో వికెట్ సంపాదించాడు. ఇక సీఎస్కే దీపక్ చహర్ను రూ.14 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో చహర్ వికెట్ సాధించగానే.. ''568 రోజులు.. 28 కోట్లు.. ఒక్క వికెట్'' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. 568 days and 28 crores later Finally an IPL wicket for Deepak Chahar pic.twitter.com/HXmOjtL4fi — Titu (@TituTweets_) May 6, 2023 👉MSD comes up to the stumps 😎 👉Rohit Sharma attempts the lap shot 👉@imjadeja takes the catch 🙌 Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7 — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్మైండ్! -
పని చేయని ధోని మంత్రం.. పూర్తిగా విఫలమయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చహర్ పెద్దగా మెరవడం లేదు. గాయం కారణంగా సీజన్లో చహర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మూడు మ్యాచ్లు కలిపి 97 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తాజాగా లక్నో సూపరజెయింట్స్తో జరిగిన మ్యాచ్లో దీపక్ చహర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. నాలుగు ఓవర్లు వేసి 10.25 ఎకానమీ రేటుతో 41 పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ తన కెప్టెన్ ధోని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. టాస్ సమయంలో చహర్ గురించి ధోని ప్రస్తావించాడు. ''చహర్ గాయం నుంచి కోలుకోవడంతో ఆకాశ్ సింగ్ను తప్పించాం.. స్లోపిచ్పై చహర్ మెరిసే అవకాశం ఉంది. అందుకే అతను తుది జట్టులోకి తీసుకున్నాం'' అని ధోని పేర్కొన్నాడు. కానీ ధోని మంత్రం పనిచేయకపోగా.. చహర్ విఫలమయ్యాడు. 2019లో సీఎస్కే తరపున 22 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్ చహర్ ఆ తర్వాత 2020లో 14 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక 2021 సీస్కే ఛాంపియన్గా నిలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. 15 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసిన చహర్ను ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో సీఎస్కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ దీపక్ చహర్ గాయం కారణంగా 2022 ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్లోనూ గాయంతో పెద్దగా ఆడింది లేదు. చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?' -
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. కోట్లు పోసి కొన్న ఆటగాడు ఔట్..!
ఐపీఎల్-2023లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ను గాయాల బెడద వెంటాడుతూ ఉంది. ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ తిరగబెట్టడంతో రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లీగ్లో తదుపరి కొనసాగేది అనుమానంగా మారగా.. తాజాగా మరో ఆటగాడు, రూ. 16.25 కోట్ల ప్లేయర్ బెన్ స్టోక్స్ బొటనవేలి గాయం కారణంగా వారం రోజులు లీగ్ను దూరంగా ఉంటాడని తెలుస్తోంది. సీఎస్కే మేనేజ్మెంట్ చాహర్ 4 లేదా 5 మ్యాచ్లకే దూరంగా ఉంటాడని చెబుతున్నప్పటికీ అతని గాయం తీవ్రత అధికంగా ఉందని సమాచారం. చాహర్ ఇదే గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఈ సీజన్ పరిస్థితి ఏమోనని సీఎస్కే యాజమాన్యం లోలోపల ఆందోళన చెందుతుంది. చాహర్ గురించే తలలు పట్టుకున్న సీఎస్కేకు స్టోక్స్ రూపంలో మరో స్ట్రోక్ తగలడంతో బెంబేలెత్తిపోతుంది. స్టోక్స్కు తగిలిన గాయాన్ని చిన్నదిగా చూపించాలని ఎల్లో ఆర్మీ భావిస్తున్నప్పటికీ, ఆ జట్టు కంగారు పడుతున్న తీరు చూస్తుంటే, 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తానికే దూరమవుతాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవి చాలవన్నట్లు కోట్లు పోసి సొంతం చేసుకున్న మరో ఆటగాడు మొయిన్ అలీ కూడా అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇతను కూడా తదుపరి మ్యాచ్లకు దూరమైతే సీఎస్కే విజయావకాశాలపై భారీ ప్రభావం పడుతుంది. ఇన్ని టెన్షన్స్ మధ్య ముంబైతో మ్యాచ్లో రహానే రాణించడం ఒక్కటి సీఎస్కేకు ఊరట కలిగిస్తుంది. ఒకవేళ సీఎస్కే నిజంగా చాహర్, స్టోక్స్ సేవలు కొన్ని మ్యాచ్లకైనా సరే కోల్పోవాల్సి వస్తే, ఆ జట్టు గత సీజన్లో మాదిరే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండాల్సి వస్తుంది. -
సంబురాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్..!
ముంబై ఇండియన్స్పై గెలుపుతో సంబురాల్లో మునిగితేలుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ గాయం తిరగబెట్టడంతో తదుపరి సీఎస్కే ఆడబోయే 4-5 మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నిన్న (ఏప్రిల్ 8) ముంబైతో జరిగిన మ్యాచ్లో గాయం (లెఫ్ట్ హ్యామ్స్ట్రింగ్) తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేయగలిగిన చాహర్.. అది వేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. గాయాల కారణంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయిన సీఎస్కేకు చాహర్ గాయంం మరింత కలవరానికి గురి చేస్తుంది. చాహర్ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు. ప్రస్తుతానికి సీఎస్కే ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, చాహర్ అందుబాటులో ఉండడన్న విషయం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్లో వెటరన్ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకలవడంతో సీఎస్కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది. -
CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే
IPL 2023- Chennai Super Kings vs Lucknow Super Giants- MS Dhoni Comments: నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్లో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా అర్ధ శతకం(31 బంతుల్లో 57 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం బ్యాట్ ఝులిపించాడు. కానీ.. హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వాళ్లతో అంబటి రాయుడు(27 నాటౌట్), ఆఖర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఖుషీ చేసింది. చెపాక్ మైదానంలో తలైవా హిట్టింగ్ ఆడటం వారిని ఆకట్టుకుంది. అంతా బాగానే ఉంది. సీఎస్కే మంచి స్కోరే సాధించింది. భయపెట్టిన మేయర్స్ ఇక మిగిలింది లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే అని అభిమానులు కాస్త కూల్గానే ఉన్నారు. కానీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఓపెనర్ కైలీ మేయర్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధోని బౌలర్లను మారుస్తున్నా అతడిలో వేగం తగ్గలేదు. చెత్త బౌలింగ్ పైగా తుషార్ దేశ్పాండే, దీపక్ చహర్ వైడ్లు, నోబాల్స్ రూపంలో చెత్త బౌలింగ్తో ధోనితో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కూడా చిరాకు తెప్పించారు. అయితే, మొయిన్ అలీ అద్భుత బంతితో మేయర్స్ను ట్రాప్ చేశాడు. మేయర్స్ ఇచ్చిన క్యాచ్ను కాన్వే ఒడిసిపట్టడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. ఇక ఆ తర్వాత ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది. 12 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే, ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా పేసర్లను ఉద్దేశించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాడు. లక్నో ఇన్నింగ్స్లో చెన్నై బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో 18 పరుగులు ఇవ్వడం.. అందులో 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉండటం ధోని అసంతృప్తికి కారణం. ఇంకోసారి నోబాల్స్, వైడ్లు వేస్తే ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి. నోబాల్స్, ఎక్స్ట్రా వైడ్స్ అస్సలు ఉపేక్షించలేం. ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్’’ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక వికెట్ తమను పూర్తిగా ఆశ్చర్యపరిచిందన్న ధోని.. స్లోగా ఉంటుందనుకుంటే.. పరుగుల వరద పారిందని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో దీపక్ చహర్ తన కోటా పూర్తి చేసి 55 పరుగులు ఇవ్వగా.. తుషార్ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగ! ఒక్క సిక్సర్ కూడా లేదు! సెట్ కాడు IPL 2023: కేకేఆర్కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా #CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK — IndianPremierLeague (@IPL) April 3, 2023 -
IPL 2023: ‘ధోని పూర్తి ఫిట్గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఐపీఎల్ ఆడతాడు’
Will MS Dhoni Retire From IPL In 2023?: మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్-2023 తర్వాత రిటైర్ అవుతాడా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మిస్టర్ కూల్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న అంచనాల నేపథ్యంలో ఈ అంశంపై క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాది వేలంలో ఇంగ్లండ్ సారథి బెన్స్టోక్స్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో.. అతడిని కెప్టెన్ను చేసి ధోని ఇక విశ్రాంతి తీసుకుంటాడనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో స్టోక్స్ జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన తర్వాత పగ్గాలు అతడికి అప్పజెప్పి తలా రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సీఎస్కే ఫాస్ట్బౌలర్ దీపక్ చహర్కు ప్రశ్న ఎదురుకాగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘ధోనికి ఐపీఎల్లో ఇదే చివరి ఏడాది అని ఎవరు చెప్పారు. నిజానికి ఆయన కూడా స్వయంగా ఎప్పుడూ ఈ మాట అనలేదు. నాకు తెలిసి ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడు. ఆడాలని కోరుకుంటున్నా కూడా! ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనికి బాగా తెలుసు. టెస్టు క్రికెట్కు, తర్వాత అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికే సమయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు మనమంతా చూశాం కదా! నేనైతే ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడనే అనుకుంటున్నా. ఆయన సారథ్యంలో.. ఆయనతో కలిసి క్రికెట్ ఆడటమనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా. ధోని ఇప్పటికీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్లో తలా బ్యాటింగ్ చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. ధోని రిటైర్మెంట్ గురించి మాకైతే అస్సలు ఐడియా లేదు’’ అని దీపక్ చహర్ న్యూ ఇండియా స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. మరో మూడు, నాలుగేళ్లు.. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ సైతం ధోని ఐపీఎల్ కెరీర్ గురించి స్పందిస్తూ.. ‘‘ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని నేను విన్నాను. నా దృష్టిలో మాత్రం మరో మూడు నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనికి ఉంది. ఇప్పటికీ తను ఫిట్గా ఉన్నాడు. అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. తనొక గొప్ప నాయకుడు. సీఎస్కే విజయవంతం కావడానికి ప్రధాన కారణం అతడి కెప్టెన్సీనే. నాకు తెలిసి ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ కాదు.. అతడు ఇంకొంత కాలం కొనసాగుతాడు’’ అని ఏఎన్ఐతో పేర్కొన్నాడు. కాగా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ఐపీఎల్లో చెన్నై జట్టును నాలుగుసార్లు చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus 2nd ODI: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా.. IND vs AUS: అతడు లేకపోవడం వల్లే టీమిండియాకు ఓటమి.. లేదంటేనా ఆసీస్కు చుక్కలే -
ఐపీఎల్కు ముందు చెన్నైకి గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!
గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలోకి దిగేందుకు చాహర్ సిద్దమయ్యాడు. దీపక్ చహర్ చివరగా భారత్ తరుపున గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్తో రెండో వన్డేలో ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసిన అతడికి వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 2022 ఏడాదిలో కేవలం 15 మ్యాచ్లు మాత్రమే భారత్ తరపున ఆడాడు. అదే విధంగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్కు కూడా చాహర్ దూరమయ్యాడు. ఇక చాహర్ తన ఫిట్నెస్కు సంబంధించిన పలు విషయాలును పీటీఐతో వెల్లడించాడు. "నేను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి గత రెండు మూడు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాను. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే నేను సన్నద్దం అవుతున్నాను. పూర్తి ఫిట్నెస్గా ఉండి బౌలింగ్, బ్యాటింగ్లో రాణించడమే నా లక్ష్యం. ఏ జట్టుకు ఆడిన 100 శాతం ఎఫక్ట్ పెడతాను. అంతే తప్ప నా గురించి ఎవరు ఏమీ మాట్లాడిన నేను పట్టించుకోను" అని పీటీఐతో దీపక్ చాహర్ పేర్కొన్నాడు. తొలి మ్యాచ్లో సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2023 ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ల మధ్య అహ్మదాబాద్లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మే 28న జరుగనుంది. చదవండి: Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్ -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఆల్రౌండర్గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? కోహ్లి కంటే వీళ్లే ముందు!
BCCI- ODI World Cup 2023- Yo-Yo Test: కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సహా కేఎల్ రాహుల్, దీపక్ చహర్ తదితర టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా రోహిత్ అందుబాటులో లేకపోవడం సహా పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో గతేడాది దాదాపు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో పేస్ దళ నాయకుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా సైతం గాయం కారణంగా ఐసీసీ ఈవెంట్కు దూరం కావడం ప్రభావం చూపింది. వెరసి కీలక ఈవెంట్లలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వరుస వైఫల్యాల కారణంగా విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైంది. కాగా 2023లో సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో లోపాలు సవరించుకుని బరిలోకి దిగాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్లేయర్ల ఫిట్నెస్కు ప్రాధాన్యమిస్తూ యో- యో టెస్టును తిరిగి ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. దీంతో పాటు ఎముకల పరిపుష్టి(డెక్సా) పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ యో- యో టెస్టు అంటే ఏమిటి? ఈ టెస్టులో టాప్- 5 స్కోరర్లు ఎవరో తెలుసుకుందాం! ఏమిటీ ‘యో–యో’ టెస్టు?! రెండు కోన్ల (ప్లాస్టిక్ స్థంభాలు) మధ్య బీప్ సౌండ్తో పరిగెత్తించే పరీక్షే యో–యో టెస్టు. రెండు కోన్ల మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. మూడు బీప్ సౌండ్లు మోగేలోపు ఈ దూరాన్ని పూర్తి చేయాలి. అంటే మొదటి బీప్నకు ఇక్కడి కోన్ నుంచి పరుగు ప్రారంభించి... రెండో బీప్ సౌండ్లోపు అవతలి కోన్కు చేరాలి. మూడో బీప్ మోగే సరికి ఇవతలి కోన్ చేరాలి. దీనికి స్కోరు ఉంటుంది. అంటే నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోరు, ఆ తర్వాత సగటు స్కోరు ఇస్తారు. అసాధారణ ఫిట్నెస్తో ఉండే కోహ్లి యో–యో టెస్టు పాసైనప్పటికీ టాప్–5 స్కోరర్స్లో లేడు. అతను 19 స్కోరు చేసి 8వ స్థానంలో ఉన్నాడు. గతంలో షమీ, సంజూ సామ్సన్, రాయుడు, రైనా, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ యో–యో టెస్టులో ఫెయిలయ్యారు. టాప్–5 యో–యో స్కోర్లు 1. షాన్ మసూద్ (పాక్) 22.1 2. బెయిర్స్టో (ఇంగ్లండ్) 21.8 3. మయాంక్ డాగర్ (భారత్) 19.3 4. బెత్ లాంగస్టన్ (ఇంగ్లండ్) 19.2 5. రిజ్వాన్ (పాక్) 19.2 చదవండి: WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
Ind Vs Ban: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్
India tour of Bangladesh, 2022 - 3rd ODI: బంగ్లాదేశ్తో మూడో వన్డేకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాదేశ్తో రెండో వన్డేలో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకున్న టీమిండియా శనివారం నాటి ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. గాయాల బెడద ఇక రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. అయితే, నొప్పిని భరిస్తూనే మైదానంలో అడుగుపెట్టి అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రోహిత్ శ్రమ వృథాగా పోయింది. మరోవైపు.. యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరం కాగా.. దీపక్ చహర్ను సైతం ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. రెండో మ్యాచ్ సందర్భంగా అతడు కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఆఖరి మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ను జట్టుకు ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. టెస్టులకు రోహిత్ దూరం? అదే విధంగా... రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చహర్ స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొంది. రోహిత్ చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో స్పెషలిస్టును సంప్రదించగా.. కుల్దీప్, దీపక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. ఇక కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తామని మేనేజ్మెంట్ పేర్కొంది. బంగ్లాదేశ్తో మూడో వన్డేకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్. చదవండి: Ind A Vs Ban A: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్.. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి -
బంగ్లాదేశ్తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్తో పాటు
బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్ను కోల్పోయిన భారత్కు మరో బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ పేసర్లు దీపక్ చహర్, కుల్దీప్ సేన్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నారు. ఢాకా వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ చేతి వేలికి గాయం కాగా.. దీపక్ చహర్కు కండరాలు పట్టేశాయి. అదే విధంగా తొలి వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరు ముగ్గురు గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దృవీకరించాడు. ఇక అఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే చటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అయితే దీపక్, రోహిత్,కుల్దీప్ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం జట్టులో సిరాజ్, శార్థూల్, ఉమ్రాన్ మినహా అదనపు పేసర్ ఒక్కరు కూడా లేరు. ఇక బంగ్లాతో అఖరి వన్డేకు రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించున్నాడు. చదవండి: చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్ శర్మ -
దీపక్ చాహర్కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్ కూడా లేదంటూ మండిపాటు
వన్డే సిరీస్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ దీపక్ చాహర్కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా ఉన్న దీపక్ చాహర్, శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్ నేరుగా వెల్లింగ్టన్ నుంచి మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు. కానీ మలేషియా ఎయిర్లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్ మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్లైన్స్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్ను చూడలేదంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ఫుడ్ కూడా లేదు "మలేషియా ఎయిర్లైన్స్లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా అందజేయలేదు. మాతో పాటు లగేజ్ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజ్ రాకపోతే.. రేపు మ్యాచ్కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా చాహర్తో పాటు మరి కొంత మంది ప్రయాణికుల లగేజ్ కూడా రాలేదు. ఇక దీపక్ చాహర్ ట్వీట్పై మలేషియా ఎయిర్లైన్స్ నిమిషాల వ్యవధిలోనే స్పందించింది. చాహర్కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ఆదివారం(డిసెంబర్ 4)న ఢాకా వేదికగా జరగనుంది. Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022 చదవండి: Ricky Ponting: చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా! -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్లో చహర్ను కాదని ఠాకూర్ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్కే ఠాకూర్ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్ను తప్పించి చహర్కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్గా పంత్ను కాదని శాంసన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి!
టీ20 ప్రపంచకప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత టీ20 జట్టులోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్ను తీసుకురావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. చాహర్ గాయాలతో బాధపడుతున్నప్పటికీ భువీ కంటే మెరుగైన ఆటగాడు అని అతడు తెలిపాడు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఆడిన భువీకి వన్డే సిరీస్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్కు దూరంగా ఉన్న దీపక్ చహర్ వన్డే సిరీస్కు భారత జట్టులోకి వచ్చాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్లో కనేరియామాట్లాడూతూ... "దీపక్ చాహర్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడిని భారత జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చాహర్ని తీసుకోవాలి. అతడు భువీ కంటే అద్భుతంగా రాణించగలడు. అతడు పవర్ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. మీకు నాలుగు ఓవర్లలో 35 నుంచి 40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువీకి గుడ్బై చెప్పే సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్ వంటి పేస్ బౌలర్లు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి భువీ ఫిట్గా ఉండడానికి మనకు తెలుసు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం"అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్?
టీ20 ప్రపంచకప్-2022కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా రిప్లేస్మెంట్ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. ఇప్పటి వరకు ఇంకా బుమ్రా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. ఆక టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఆయా దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునేందుకు ఆదివారం(ఆక్టోబర్9) వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బుమ్రా స్థానం కోసం ముఖ్యంగా ఇద్దరు పేసర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకరు వెటరన్ పేసర్ మహ్మద్ షమీ కాగా.. మరొకరు యువ పేసర్ దీపక్ చాహర్. కాగా టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వీరిద్దరికి చోటు దక్క లేదు. చాహర్, షమీకి స్టాండ్బై ఆటగాళ్లగా సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికైన షమీ.. కొవిడ్ బారిన పడడంతో దూరమయ్యాడు. ఇక దీపక్ చహర్ ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో మాత్రం దీపక్ అదరగొట్టాడు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ముందు దీపక్ చాహర్ కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే చాహర్ గాయం అంతతీవ్రమైనది కాదు అని బీసీసీఐ అదికారి ఒకరు పేర్కొన్నారు. ఇక షమీ, చాహర్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. వీరిద్దరూ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డారు. అయితే బుమ్రా స్థానంలో అనుభవం ఉన్న షమీనే ఎంపిక చేస్తారని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయనపడుతున్నారు. చదవండి: Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా? -
దీపక్ చాహర్కు గాయం.. వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో చాహర్ స్థానంలో మిగిలిన రెండు వన్డేలకు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. కాగా సుందర్ కూడా గాయం కారణంగా గత కొంత కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు సుందర్ కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. అతడు చివరసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్తో జరిగిన వన్డేలో భారత్ తరపున ఆడాడు. కాగా ప్రోటీస్తో తొలి వన్డేకు ముందు గాయపడిన చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక అఖరి రెండు వన్డేలకు సుందర్ భారత జట్టుతో కలవనున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చెందిన టీమిండియా.. రాంఛీ వేదికగా రెండో వన్డేలో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్కు భారత తుది జట్టులో బిష్నోయ్ స్థానంలో సుందర్కు చోటు దక్కే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ -
దీపక్ చహర్కు గాయం..!
టీమిండియా బౌలర్ దీపక్ చహర్ చీలమండ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసిన దీపక్ చహర్కు కాలు బెణికింది. దీంతో తొలి వన్డేకు చహర్ దూరంగా ఉన్నాడు. అయితే గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికి టి20 ప్రపంచకప్ దృశ్యా మిగతా రెండు వన్డేల నుంచి దీపక్ చహర్కు విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. ''కాలు బెణికినప్పటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం. అందునా టి20 ప్రపంచకప్కు దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్గా ఉన్నాడు. గాయంతో టి20 ప్రపంచకప్కు దూరమైన బుమ్రా స్థానంలో షమీ లేదా దీపక్ చహర్లలో ఒకరిని ఆడించాలని చూస్తోంది. ఒకవేళ షమీ ఫిట్నెస్ నిరూపించుకుంటే చహర్ స్టాండ్ బై ప్లేయర్గానే ఉంటాడు. అలా కాకుండా షమీ ఫిట్నెస్లో విఫలమైతే మాత్రం అప్పుడు దీపక్ చహర్ అవసరం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొనే చహర్కు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చినట్లు'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక దీపక్ చహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ కనబరిచే చహర్ మ్యాచ్కు దూరమవడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో ఆగిపోయింది. బ్యాటింగ్లో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లు రాణించినప్పటికి టాపార్డర్ విఫలం కావడంతో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య రెండో వన్డే ఆదివారం(అక్టోబర్ 9న) రాంచీ వేదికగా జరగనుంది. చదవండి: ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ మహిళా అంపైర్తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
IND Vs SA T20: సిరాజ్కు కలిసిరాని రీఎంట్రీ.. రోహిత్ శర్మ సీరియస్
దక్షిణాఫ్రికాతో ఇండోర్లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతోపాటు ఫీల్డింగ్లోనూ పొరపాట్లు చేసి.. బౌలర్ దీపక్ చహర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. తడబడి.. సిక్సర్గా అసలేం జరిగిందంటే.. అప్పటికే పరుగుల వరద పారించిన ప్రొటీస్ జట్టు బ్యాట్స్మెన్ చహర్ బౌల్ చేసిన చివరి ఓవర్లోనూ రెచ్చిపోయారు. ఈక్రమంలో ఓవర్ ఐదో బంతికి డేవిడ్ మిల్లర్ (5 బంతుల్లో 19) బంతిని గాల్లోకి బాదాడు. అది లాంగాఫ్లో ఉన్న సిరాజ్ వైపుగా వెళ్లింది. కాస్త చాకచక్యంతో దాన్ని ఒడిసిపట్టాల్సిన సిరాజ్ తడబడ్డాడు. క్యాచ్ అయితే పట్టాడు కానీ, బౌండరీ లైన్పై అడుగేశాడు. దాంతో అది సిక్సర్ అయింది. అదిచూసి బౌలింగ్ చేస్తున్న చహర్, కెప్టెన్ రోహిత్ సిరాజ్పై అసహనం వ్యక్తం చేశారు. రోహిత్ అయితే, ఏకంగా.. ఏం ఫీల్డింగ్ రా బూబూ! అన్నట్టు ఓ లుక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. (చదవండి: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి') అశ్విన్ బౌలింగ్లోనూ.. అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతికి కూడా సిరాజ్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్ను బౌండరీపై సిరాజ్ అందుకోలేకపోయాడు. అది సిక్స్గా మారింది. ఇక మొత్తంగా 20వ ఓవర్లో 24 పరుగులు రావడంతో పర్యాటక జట్టు మూడు వికెట్లు కోల్పోయి భారత్కు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ ఛేదనలో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్ సేన సిరీస్ను 2-1తో దక్కించుకుంది. (చదవండి: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!) pic.twitter.com/ElkZ1E8zNV — Guess Karo (@KuchNahiUkhada) October 4, 2022 -
శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..!
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. కాగా ఈ మ్యాచ్లో భారత పేసర్ దీపక్ చాహర్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్ను రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అఖరి నిమిషంలో తన మనసును చాహర్ మార్చుకున్నాడు. జరిగిందంటే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో తొలి బంతి వేయడానికి దీపక్ చాహర్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో నాన్స్ట్రయికర్ ఎండ్లో ఉన్న ట్రిస్టాన్ స్టబ్స్.. బౌలర్ను గమనించకుండా క్రీజు వదిలి చాలా దూరం ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన చాహర్.. బంతిని వేయకుండా ఆపేసి రనౌట్ చేస్తానని నవ్వుతూ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దీపక్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక భారత స్టార్ మహిళా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ.. మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ చార్లీ డీన్ను రనౌట్ (మన్కడింగ్) చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రనౌట్పై రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదు. Not Mankading! The ever smiling and dashing Deepak Chahar maintains the rule, law, spirit, fairness, glory and beauty of cricket! Respect ✊ #INDvSA #ICC2022 #BCCI #CricketTwitter #respect #chennaisuperkings #mankad pic.twitter.com/8pT4SXleEY — Narasimha R N (@NarasimhaRN5) October 4, 2022 చదవండి: IND Vs SA: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
చాహర్ అద్భుతమైన ఇన్ స్వింగర్.. ప్రోటీస్ కెప్టెన్కు ప్యూజ్లు ఔట్
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఘనమైన పునరాగమనం చేశాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమాను చాహర్ ఔట్ చేసిన విధానం మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. చాహర్ ఓ సంచలన బంతితో టెంబా బావుమాను పెవిలియన్కు పంపాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన చాహర్.. అద్భుతమైన ఇన్ స్వింగర్తో బావుమాను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బావుమా కూడా ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆక్టోబర్2న జరగనుంది. Wat a delivery #INDvSA Take a bow @deepak_chahar9 👏🔥 pic.twitter.com/x6h5wTWJXR — Trending Killer (@Trending_007) September 28, 2022 చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు.. దీపక్ చాహర్కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి ఆగ్రశేణి టీంలు ఇప్పటికే తమ జట్టులను ప్రకటించాయి. ఇక మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నీ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయాల బారిన పడటం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్లో పాల్గోనే భారత జట్టును మాజీలు, క్రికెట్ నిపుణులు ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అంచనావేశాడు. బ్యాటర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్. దినేష్ కార్తీక్ను ఎంపిక చేశాడు. అదే విధంగా ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ హుడాకు నెహ్రా చోటిచ్చాడు. ఇక తన జట్టులో స్పెషలిస్టు స్సిన్నర్లగా యుజవేంద్ర చాహల్, అశ్విన్ను మాత్రమే ఎంపిక చేశాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అవకాశమిచ్చాడు. కాగా నెహ్రా తన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ బౌలర్ దీపక్ చాహర్కు చోటు దక్కక పోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్కు ఆశిష్ నెహ్రా ఎంచుకున్న భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో దీపక్ చాహర్ ఎంట్రీ..!
Deepak Chahar Replaces Avesh Khan: ఆసియా కప్ 2022లో టీమిండియా పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేక సూపర్-4 దశలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని అయిపోయాక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతతో జట్టుకు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ స్థానంలో తదుపరి ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోయే మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పని సూపర్-4 దశలో పాక్తో జరిగిన మ్యాచ్కు ముందే చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లంక చేతిలో ఓటమితో టీమిండియా ఫైనల్కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన దశలో ఈ మార్పు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. జట్టు ఎంపికలో మున్ముందైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత సెలెక్టర్లను హెచ్చరిస్తున్నారు. జట్టులో కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు బ్యాటర్లు, బౌలర్లను కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా సాన పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్కప్కు కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. ఇటీవలే జింబాబ్వే సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లతో రాణించాడు. చాహర్ జింబాబ్వే సిరీస్లో పర్వాలేదనిపించినా ఆసియా కప్కు ఎంపిక చేయకపోవడంతో టీమిండియా తగిన మూల్యమే చెల్లించుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చాహర్ను జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్లు స్టాండ్ బై ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్కాట్ చేస్తేనే..! -
'జడేజా స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది'
ఆసియాకప్-2022 టోర్నీ మధ్య నుంచి భారత్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్బైగా ఉన్న అక్షర్ పటేల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ బదులగా పేసర్ దీపక్ చహర్ను జట్టులోకి తీసుకోవాల్సింది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఇండియా న్యూస్తో కరీమ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్ తొలి రెండు మ్యాచ్ల్లో భారత పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం మనం చూశాం. కాబట్టి గాయపడిన జడేజా స్థానంలో పేసర్ దీపక్ చాహర్ను ఎంపిక చేయాల్సింది. చాహర్ టీ20 స్పెషలిస్టు. అతడికి కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు జట్టులో ఉంటే పాకిస్తాన్ అంత పెద్ద టార్గెట్ను చేధించేది కాదు. కాగా ఇప్పటికే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు అక్షర్ రూపంలో నాలుగో స్పిన్నర్ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు -
పాకిస్తాన్తో మ్యాచ్.. అవేష్ ఖాన్కు నో ఛాన్స్! భారత యువ పేసర్ ఎంట్రీ!
ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ లీగ్ దశలో పాక్ను మట్టికరిపించిన టీమిండియా.. ఈ మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో స్టాండ్బైగా ఉన్న పేస్ బౌలర్ దీపక్ చహర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అవేష్ ఖాన్ పక్కన బెట్టి చహర్ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు చాహర్ నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి పాక్తో మ్యాచ్కు చాహర్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. చాహర్ పవర్ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్కు ముందు గాయపడిన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన చాహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి'
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ పుకార్లని బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం దీపక్ చహర్ గాయంతో ఆసియాకప్కు దూరమయ్యాడని.. అతని స్థానంలో కుల్దీప్ సేన్ను స్లాండ్ బై ప్లేయర్గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ.. అవన్నీ తప్పుడు వార్తలని.. దీపక్ చహర్ జట్టుతోనే ఉన్నాడని తెలిపింది. ''దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా నాన్సెన్స్. దీపక్ చహర్ ఆసియా కప్లో ఆడుతున్నాడు. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న అతను ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పాకిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కుల్దీప్ సేన్ను కేవలం నెట్బౌలర్గానే జట్టులోకి తీసుకున్నాయి. టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే కుల్దీప్ సేన్ను నెట్బౌలర్గా ఎంపిక చేశాము. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.. కానీ జట్టులోకి రావడానికి సమయం ఉంది.'' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కుల్దీప్ సేన్(PC: IPL Twitter) ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్లకు దూరంగా ఉన్న దీపక్ చాహార్, కమ్బ్యాక్ తర్వాత జింబాబ్వేతో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈలోగానే దీపక్ చాహార్ మళ్లీ గాయపడ్డాడనే వార్తలు రావడం అతని ఫ్యాన్స్ని కలవరబెట్టింది. అయితే దీపక్ చహర్కు ఏం కాలేదని తెలుసుకొని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసియాకప్కు ప్రకటించిన జట్టులో భువనేశ్వర్ కుమార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్గా ఉన్నాడు. అతనితో పాటు టోర్నీకి ఎంపికైన ఆవేశ్ ఖాన్ జింబాబ్వే టూర్లో అట్టర్ ఫ్లాప్ కాగా... అర్ష్దీప్ సింగ్కి పట్టుమని ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. దీంతో దీపక్ చహర్ స్టాండ్-బైగా ఉన్నప్పటికి పాకిస్తాన్తో మ్యాచ్లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ స్టాండ్ బై - శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ నెట్ బౌలర్- కుల్దీప్ సేన్ చదవండి: ఆరోజు కోహ్లి రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా! కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి' -
ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు!
టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ను ఆసియాకప్కు స్టాండ్బైగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్బైగా ఉన్న చాహర్ను ప్రధాన జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భారత సెలక్టర్లు రానున్న 24 గంటల్లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్తో అద్భుతమైన పునరాగమనం చేశాడు.ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన చహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక ఆసియాకప్ కోసం భారత జట్టు ఇప్పటికే యూఏఈకు చేరుకుంది. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ స్పందిస్తూ.."చాహర్ ఆసియాకప్ ప్రధాన జట్టలోకి చేరడం ఖాయం. అతడు కొంత కాలం ఆటకు దూరమైన తన రిథమ్ను ఏ మాత్రం కోల్పోలేదు. చాహర్ పవర్ ప్లేలో ఒకట్రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన శుభారంభం అందించగలడు. కాబట్టి టీ20 ఫార్మా్ట్కు జట్టును ఎంపిక చేసే ముందు అతడిని ప్రాధాన ఎంపికగా భావించాలి. అయితే ప్రస్తుతం భారత జట్టులో చాలా మంది బౌలర్లు ఉన్నారు. కానీ వారిలో కొత్త బంతితో వికెట్లు తేసే సత్తా ఎవరుకి ఉందో వారికే అవకాశం ఇవ్వాలి. జట్టుకు బుమ్రా, షమీ వంటి ఆటాకింగ్ బౌలర్లు అందుబాటులో లేకపోతే చాహర్ వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగలడు" అని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. ఆసియాకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ స్టాండ్బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ చదవండి: IND Vs PAK: ఇటు బుమ్రా.. అటు షాహిన్; లోటును భర్తీ చేసేది ఎవరు? -
ఏంటి చాహర్ ఇది..? అశ్విన్ను చూసి నేర్చుకున్నావా! వీడియో వైరల్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు. కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్లో జోస్ బట్లర్ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl — Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022 Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed. — Gagan Thakur (@gagan_gt) August 22, 2022 చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్తో మ్యాచ్లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! -
అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్!
India Vs Zimbabwe 1st ODI- Deepak Chahar: తమకు ఇష్టమైన క్రికెటర్ను నేరుగా చూస్తేనే చాలు జన్మ ధన్యమైపోయిందనుకునే వీరాభిమానులు చాలా మందే ఉంటారు. మరి ఏకంగా ఆ ఆటగాడు తమ దగ్గరికి రావడం.. భుజం మీద చేయి వేసుకుని మరీ ఫొటో దిగే ఛాన్స్ ఇస్తే! ఎగిరి గంతేయడం ఖాయం! జింబాబ్వే యువతులు ముగ్గురు ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగిపోయారు. ఇటు అద్భుతమైన బంతులతో మైదానంలో బ్యాటర్లను.. అటు హుందాతనంతో అభిమానులను బౌల్డ్ చేసిన ఆ ఆటగాడు దీపక్ చహర్. కాగా గాయం కారణంగా ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన చహర్.. జింబాబ్వేతో వన్డే సిరీస్తో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన బౌలింగ్తో! ఈ క్రమంలో హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నాటి మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. అలా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు చహర్. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా స్టార్తో ఫొటోలు దిగాలని కొంతమంది యువతులు భావించారు. PC: BCCI ఇందుకు నవ్వుతూ అంగీకరించిన దీపక్ చహర్.. తన భుజంపై చేయి వేసి ఫొటో దిగాలనుకున్న వారి అభ్యర్థనను కాదనలేకపోయాడు. దీంతో వాళ్లు సంతోషంగా ఈ పేసర్తో ఫొటోలు దిగి ఆనందడోలికల్లో తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్టు విమల్ కుమార్ తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. తనను తాకే అవకాశం ఇచ్చాడు! ఇక ఈ విషయం గురించి చహర్తో ఫొటో దిగిన ఓ మహిళాభిమాని మాట్లాడుతూ.. ‘‘చహర్ ఎంతో అణకువ గల వ్యక్తి. తనతో ఇలా ఫొటో దిగడం చాలా చాలా సంతోషంగా ఉంది. తనను తాకే అవకాశం నాకు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు(నవ్వులు).. ఎందుకంటే చాలా మంది ఇతరులు తమను తాకడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే, అతడు మాత్రం మమ్మల్ని నిరాశకు గురిచేయకుండా హుందాగా వ్యవహరించాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక అభిమానులతో మమేకం కావడంపై దీపక్ చహర్ స్పందిస్తూ.. ‘‘నాకు ఆనందంగా ఉంది. మాతృ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటం అనే చిన్ననాటి కల నెరవేరింది. మరి ఫ్యాన్స్తో ఇలా కలిసిపోవడం కూడా కూడా గొప్పగానే ఉంటుంది కదా!’’ అని పేర్కొన్నాడు. చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు! Rohit Sharma: రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు.. అందుకే అలా: దినేశ్ కార్తిక్ -
T20 WC 2022: జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు! ఒక్కసారి దూరమైతే అంతే!
Ind Vs Zim 1st ODI- Deepak Chahar- T20 World Cup 2022: ‘‘మనం చాలా కాలం పాటు జట్టుకు దూరమైతే.. ఇతరులు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. ఒకవేళ వాళ్లు మెరుగ్గా రాణించినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. ఒకవేళ మనం మళ్లీ టీమ్లోకి తిరిగి రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చినపుడు కచ్చితంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. వాటిని ఎలా అందుకోవాలన్న అంశం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. మిగతా విషయాల్లో నేనేమీ చేయలేను’’ అని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. deepak chahar(PC: BCCI) అదిరిపోయే రీఎంట్రీ! గాయాల కారణంగా దీపక్ చహర్ దాదాపు ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిట్నెస్ సాధించిన అతడు జింబాబ్వే టూర్కు ఎంపికయ్యాడు. ఇందులో భాగంగా హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) జరిగిన మొదటి వన్డేలో ఆడిన చహర్.. 7 ఓవర్ల బౌలింగ్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆతిథ్య జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసి.. ఆపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు చహర్. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన చహర్కు ఆసియా కప్-2022కు ప్రకటించిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. 30 ఏళ్ల ఈ ఆల్రౌండర్ను స్టాండ్బైగా ఎంపిక చేశారు సెలక్టర్లు. deepak chahar(PC: BCCI) వాళ్లకు అవకాశాలు అదే సమయంలో జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు మాత్రం ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో చహర్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. జట్టుకు దూరమైన కారణంగా మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోవడం వల్లే తాను సెలక్ట్ కాలేకపోయానని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు కదా! ఇక ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్లు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్ టీ20 వరల్డ్కప్-2022 బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం పోటీపడటం మాత్రమే తన చేతుల్లో ఉందని.. అంతేతప్ప జట్టుకు ఎంపికవుతానా లేదా అన్నది తన ఆధీనంలో ఉన్న విషయం కాదని చెప్పుకొచ్చాడు చహర్. అదే విధంగా... జింబాబ్వేతో తొలి వన్డేలో తాను విజయవంతం కావడంపై స్పందిస్తూ.. ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫిట్నెస్ సాధించడానికి.. ఆటను మెరుగుపరచుకోవడానికి కఠిన శ్రమకోర్చానని.. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను పూర్తి ఫిట్గా ఉన్నానని తెలిపాడు చహర్. ఇక టీమిండియా- జింబాబ్వే మధ్య హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) రెండో వన్డే జరుగనుంది. చదవండి: Babar Azam: భారత్పై గెలుపొక్కటే కాదు.. ఆసియా కప్ కొట్టాలని కంకణం! KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. A brilliant comeback for @deepak_chahar9 as he is adjudged Player of the Match for his bowling figures of 3/27 👏👏#TeamIndia go 1-0 up in the three-match ODI series.#ZIMvIND pic.twitter.com/HowMse2blr — BCCI (@BCCI) August 18, 2022 -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. హరారే: ఫామ్లో ఉన్న ఓపెనర్లు శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్లో ఓపెనింగ్ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్!
ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన భారత పేసర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. హరారే వేదికగా జింబాబ్వే జరుగుతోన్న తొలి వన్డేలో చాహర్ నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన చహర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను ఆదిలోనే ఓపెనర్లు కియా, మారుమణి పెవిలియన్కు పంపి చాహర్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం వన్డౌన్ బ్యాటర్ మాధేవేరేను కూడా ఔట్ చేసి చాహర్ మూడో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా చాహర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐపీఎల్తో పాటు పలు సిరీస్లకు కూడా దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న చాహర్ జింబాబ్వే సిరీస్తో పునరాగామనం చేశాడు. అదే విధంగా ఆసియా కప్-2022కు స్టాండ్బైగా చహర్ ఎంపికయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్లో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు. Deepak Chahar announced his comeback with a scintillating performance 💛🥳 7 Overs | 27 Runs | 3 Wickets#ZIMvIND #WhistlePodu @deepak_chahar9 📷 Getty Images pic.twitter.com/nEVR0IWRnY — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) August 18, 2022 చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర ! -
టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర!
హరారే వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో జింబాబ్వే బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 44. 3 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఒక దశలో జింబాబ్వే స్కోర్ 150 పరుగుల మార్క్ను దాటడం కష్టమనుకున్న సమయంలో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 70 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టీమిండియాపై వీరిద్దరూ సరికొత్త రికార్డును నమోదు చేశారు. వన్డేల్లో భారత్పై తొమ్మిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జింబాబ్వే జోడిగా నిలిచారు. #1stODI | INNINGS BREAK: 🇿🇼 bowled out for 189 in 40.3 overs Richard Ngarava and Brad Evans put on 70-run together, the highest ninth-wicket partnership for 🇿🇼 against India#ZIMvIND | #KajariaODISeries | #VisitZimbabwe pic.twitter.com/H9bQa4giSa — Zimbabwe Cricket (@ZimCricketv) August 18, 2022 చదవండి: IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ -
IND VS ZIM: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో టీమిండియా!
India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’. కేవలం ఈ మూడు వన్డేల సిరీస్తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి. అందరి కళ్లు రాహుల్, చహర్లపైనే... ఇక సిరీస్ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్ రాహుల్కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్ ఫిట్నెస్కే ఇది టెస్ట్! ఇక్కడ ఈ టాపార్డర్ బ్యాటర్ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్లో బ్యాట్తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్ చహర్ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్ల్లోనే ఆల్రౌండర్గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్ అంతా ఫామ్లోనే ఉన్నారు. బౌలింగ్లోనూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్ను... అక్షర్ పటేల్, సంజూ సామ్సన్ తమ టి20 కెరీర్ను జింబాబ్వేలోనే ప్రారంభించారు. జోరు మీదుంది కానీ... ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకాబ్వా, సికందర్ రజా, ఇన్నోసెంట్ కయా చక్కని ఫామ్లో ఉన్నారు. అయితే బౌలింగ్ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్ విభాగం కూడా మెరగవ్వాలి. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం -
Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..
Ind Vs Zim ODI Series: వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతున్న భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్ను తొలుతు జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ పర్యటనలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గరదర్శనం చేయనున్నాడు. జింబాబ్వే సిరీస్కు, ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2022 టోర్నీకి మధ్య తక్కువ వ్యవధి ఉండటమే ఇందుకు కారణం. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్ డేవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్.. జట్టు ఇదే -
వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి!
ఆసియా కప్ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్కు బెస్ట్ టీమ్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. కాగా ఇటీవలే గాయాలు.. ఫిట్నెస్ లేమి.. కరోనా కారణంగా జట్టుకు దూరమయిన టీమిండియా వైట్బాల్ వైస్కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కేఎల్ రాహుల్తో పాటు పేసర్ దీపక్ చహర్ కూడా ఆసియాకప్కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి పంత్, సూర్యకుమార్ యాదవ్లు ఆరు మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఆటగాళ్లుగా బరిలోకి దిగారు. సూర్యకుమార్ ఓపెనర్గా సక్సెస్ అయినప్పటికి.. కేఎల్ రాహుల్ వస్తే.. సూర్య మళ్లీ తన పాత స్థానానికే వెళ్లనున్నాడు. ఆసియా కప్తోనే కేఎల్ రాహుల్ టీమిండియా జట్టులోకి రానున్నాడని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు దుబాయ్, షార్జా వేదికల్లో టి20 ఫార్మాట్లో ఆసియా కప్ 2022 జరగనుంది. ''కేఎల్ రాహుల్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. అతను ఇప్పటికే క్లాస్ ప్లేయర్. ఒక టి20 మ్యాచ్ ఆడుతున్నాడంటే కచ్చితంగా స్పెషలిస్ట్ ఓపెనర్గానే బరిలోకి దిగుతాడు. పంత్, సూర్యకుమార్లు ఎప్పటిలాగే మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు.'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కోహ్లి సంగతేంటి..? టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆసియా కప్కు అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కోహ్లిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపికచేయనుంది. ఆసియాకప్తోనైనా కోహ్లి ఫామ్లోకి వస్తాడని నమ్మితే అతనికి జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ కోహ్లి జట్టులోకి ఎంపికైతే.. యథాతధంగా మూడో స్థానంలోనే వస్తాడు. కోహ్లిని పక్కనబెడితే.. వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ దిగనున్నాడు. అయితే ఇషాన్ కోహ్లికి బ్యాకప్గా ఉంటాడు. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ను బ్యాకప్గా ఉంచనున్నారు. ఇక చేతన్ శర్మ ఆధ్యరంలోని సెలెక్టర్ల కమిటీ ఆసియా కప్కు 15 నుంచి 17 మందితో కూడిన ప్రాబబుల్స్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్తో పాటు బౌలర్ దీపక్ చహర్ పేరును కూడా పరిశీలిస్తుంది. టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్లో జరగనున్న మ్యాచ్లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడనుంది. ఆసియా కప్కు టీమిండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. బ్యాకప్ బ్యాటర్లు: దీపక్ హుడా/ఇషాన్ కిషన్/సంజు శాంసన్ బ్యాకప్ పేసర్లు: అర్ష్దీప్ సింగ్/అవేష్ ఖాన్/దీపక్ చాహర్/హర్షల్ పటేల్. బ్యాకప్ స్పిన్నర్లు: అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్. చదవండి: Hardik Pandya May Vice Captain: రోహిత్ బాటలోనే కేఎల్ రాహుల్.. హార్దిక్కు ప్రమోషన్! కోహ్లి విషయంలో వాళ్లదే తుది నిర్ణయం: బీసీసీఐ అధికారి -
ఒబెడ్ మెకాయ్ ఇరగదీశాడు.. కానీ ఆ రికార్డు ఇప్పటికీ దీపక్ చహర్దే!
సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం భారత్తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మెకాయ్ తన టీ20 కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో మెకాయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను నాలుగురు బౌలర్లు అందుకున్నారు. అజంతా మెండిస్ రెండు సార్లు ఆరు వికెట్ల ఫీట్ను నమోదు చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్పై) ఉన్నారు. అయితే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టిన రికార్డు మాత్రం భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. చహర్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వేపై 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్లను కూడా ఈ టూర్కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
రంజీ ట్రోఫీ 2022 ఫైనల్.. దీపక్ చహర్కు వింత అనుభవం
రంజీ ట్రోఫీ 2022 భాగంగా మధ్యప్రదేశ్, ముంబై మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తికరంగా మారింది. మధ్య ప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోపీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్య ప్రదేశ్ మాత్రం తొలి ఇన్నింగ్స్లో 536 పరుగులకు ఆలౌటైంది. ముగ్గరు మధ్య ప్రదేశ్ ఆటగాళ్లు(రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యష్ ధూబేలు) సెంచరీలతో చెలరేగడంతో మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ చాంపియన్గా అవతరించనుంది. ఇంతకముందు 1998-99 రంజీ సీజన్లో మధ్య ప్రదేశ్ రన్నరప్గా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్ను ఆట ఆఖరి రోజున చూసేందుకు వచ్చిన సీఎస్కే స్టార్ దీపక్ చహర్కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు స్టాండ్స్లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకులు.. సీఎస్కే.. సీఎస్కే అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. చహర్ కూడా చిరునవ్వుతో అక్కడున్న ప్రేక్షకులని కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక దీపక్ చహర్ గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్కు దూరమయ్యాడు. మెగావేలంలో రూ.14 కోట్లకు దీపక్ చహర్ను సీఎస్కే కొనుగోలు చేసింది. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంటున్నాడు. Look who's here! pic.twitter.com/AkXyy7mor2 — cricket fan (@cricketfanvideo) June 25, 2022 చదవండి: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
ఇంగ్లండ్కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
Deepak Chahar: ఓ తమ్ముడికి ఇచ్చే సలహా ఇదేనా? మరీ ఇంత నీచంగా!
Tolls On Deepak Chahar Sister Malti Over Honeymoon Advice: టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సోదరి మాలతి చహర్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక అక్కగా ఏం మాట్లాడాలో తెలియదా? పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద బాగా పడినట్లుంది? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడూ మరీ ఇంత పబ్లిక్గా ఇలాంటి కామెంట్లు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. తమ్ముడు దీపక్, అతడి భార్యను ఉద్దేశించి మాలతి చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. శుభాకాంక్షల వెల్లువ అసలు విషయం ఏమిటంటే.. భారత పేసర్ దీపక్ చహర్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ను జూన్ 2న ఆగ్రాలో వివాహమాడాడు. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీపక్ సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్ చేశారు. ఈమె మా ఇంటిపిల్ల.. నవ దంపతులతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు’’ అని పేర్కొన్నారు. అసలే ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తోందని.. హనీమూన్ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాలతిని విమర్శిస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు. అయినా, దీపక్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్ అయిపోయారా? అతడి సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువీ ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్కే దీపక్ చహర్ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కూడా అతడు ఎంపికకాలేదు. Ab ladki hui humari….Wish you guys a very happy married life🧿 @deepak_chahar9 please take care of your back during your honeymoon..we have World Cup ahead 😜#family #brother #marriage #siblings pic.twitter.com/Hm2unculO7 — Malti Chahar🇮🇳 (@ChaharMalti) June 3, 2022 Deepak Chahar and Rahul Chahar were seen dancing during Haldi Ceremony#deepakchahar #haldiceremony #deepakchaharwedding pic.twitter.com/5Jl2KhbdfA — Shriyansh Bhardwaj (@Shriyansh836821) June 1, 2022 View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
Deepak Chahar Marriage : వైభవంగా క్రికెటర్ దీపక్ చహర్ పెళ్లి (ఫొటోలు)
-
వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్ఫ్రెండ్ జయా భరద్వాజ్ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్లో బుధవారం అర్థరాత్రి దాటిన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తమ వెడ్డింగ్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన దీపక్ చహర్.. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ''జయా భరద్వాద్.. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వే నాకు కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. ఇప్పటివరకు మన జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్ను ఆనందంగా ఎంజాయ్ చేశాం. పెళ్లితో ఒక్కటైన మనం.. ఇకపై కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఆనందంగా ఉంచుతానని ప్రామిస్ కూడా చేస్తున్నా. నా జీవితంలో బెస్ట్ మూమెంట్ ఇదే. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా దీపక్ చహర్ అర్థాంగి జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఎన్సీఆర్లో కార్పోరేట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తుంది. కాగా జయా భరద్వాజ్ సోదరుడు బిగ్బాస్ ఫేమ్ సిద్ధార్థ్ భరద్వాజ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దీపక్ చహర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీపక్ చహర్- జయా భరద్వాజ్ల రిసెప్షన్ వేడుక ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లోని కమల్ మహల్లో నిర్వహించనున్నారు. చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..! ఈ వేడుకకు సీఎస్కే టాప్ స్టార్స్ సహా కోహ్లి, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 60 మంది క్రికెటర్లు ఆహ్వానాలు పంపారని.. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సహా మరికొంతమంది హాజరుకానున్నారు. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లోనే దీపక్ చహర్ తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టాండ్స్లో ఉన్న జయా భరద్వాజ్ వద్దకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసిన దీపక్ చహర్ ఆమె చేతికి రింగ్ను తొడిగాడు. మొదట షాక్ తిన్నప్పటికి జయా భరద్వాజ్ దీపక్ లవ్ప్రపోజ్ను ఎంతో ఇష్టంతో స్వీకరించింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లోనే వైరల్ అయింది.ఇక గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ మెగావేలంలో దీపక్ చహర్ను రూ 14 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంతో దీపక్ చహర్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్కే 14 మ్యాచ్ల్లో 4 విజయాలు.. 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: Deepak Chahar: వైభవంగా దీపక్ చహర్ పెళ్లి వేడుక.. డ్యాన్స్తో దుమ్మురేపిన పెళ్లి కొడుకు View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
వైభవంగా దీపక్ చహర్ పెళ్లి వేడుక.. డ్యాన్స్తో దుమ్మురేపిన పెళ్లి కొడుకు
టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చహర్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్ఫ్రెండ్ జయా భరద్వాజ్ను ఇవాళ(జూన్ 1న) అర్థరాత్రి వివాహామాడనున్నాడు. పెళ్లి వేడుక ఆగ్రాలోని జైపీ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో మే 31 రాత్రి సంగీత్ ఫంక్షన్లో దీపక్ చహర్ దంపతులిద్దరు డ్యాన్స్తో అలరించారు. కాగా పెళ్లి వేడుకకు ముందు బుధవారం ఉదయం నిర్వహించిన హల్దీ వేడుకలో దీపక్ చహర్ డ్యాన్స్ చేయడం హైలైట్గా నిలిచింది. హల్దీ వేడుకలో భాగంగా కుటుంబసభ్యులు, మిత్రులు హల్దీ పెట్టేటప్పుడు దీపక్ చహర్ తీన్మార్ స్టెప్పులతో అలరించాడు. కాగా రిసెప్షన్ వేడుకను ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లోని కమల్ మహల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సీఎస్కే టాప్ స్టార్స్ సహా కోహ్లి, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 60 మంది క్రికెటర్లు ఆహ్వానాలు పంపారని.. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, టీమిండియా స్టార్ విరాట కోహ్లి సహా మరికొంతమంది హాజరుకానున్నారు. ఇక గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ మెగావేలంలో దీపక్ చహర్ను రూ 14 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంతో దీపక్ చహర్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్కే 14 మ్యాచ్ల్లో 4 విజయాలు.. 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: Happy Birthday Dinesh Karthik: దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్స్టోరీ ఉత్కంఠపోరులో జపాన్పై విజయం.. టీమిండియా హాకీ జట్టుకు కాంస్య పతకం Deepak Chahar and Rahul Chahar were seen dancing during Haldi Ceremony#deepakchahar #haldiceremony #deepakchaharwedding pic.twitter.com/5Jl2KhbdfA — Shriyansh Bhardwaj (@Shriyansh836821) June 1, 2022 -
ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..!
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లో సీఎస్కే మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ తన ప్రేయసి జయ భరద్వాజ్ కి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. కాగా వీరిద్దరి వివాహనికి సంబంధించిన ఆహ్వన పత్రిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ను సీఎస్కే రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి చాహర్ దూరమయ్యాడు. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్కు చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్లోనైనా అవకాశమివ్వండి! View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
ఒక్క ఆటగాడు గాయపడితే.. సీజన్ మొత్తం మరీ ఇంత చెత్తగా ఆడతారా?
IPL 2022- CSK Failure: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్కు ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసిరాలేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించడం.. వరుస పరాజయాలు.. ఆ తర్వాత మళ్లీ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వంటి నిర్ణయాలు ఆ జట్టులోని గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టాయి. ఎన్నో అంచనాలతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చహర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం కూడా ప్రభావం చూపింది. అయితే, ఒకరిద్దరు మినహా మిగతావాళ్లంతా దాదాపుగా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉన్నా సరే పరాజయాల పరంపర కొనసాగింది. ఇక రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఆఖరి మ్యాచ్లోనూ ఓటమి పాలై సీజన్ను చేదు అనుభవంతో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఈ ఎడిషన్లో సీఎస్కే ప్రయాణాన్ని, చివరి మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెన్నైకి ఇంతకంటే చెత్త సీజన్ మరొకటి లేదు. ఈసారి వాళ్లు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. తమ మార్కును అస్సలు చూపించలేకపోయారు. దీపక్ చహర్ ఒక్కడే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ ఒక్క ప్లేయర్ లేనంత మాత్రాన మరీ ఇంత ఘోరంగా విఫలమవడం వారి స్థాయికి తగదు’’ అని యూట్యూబ్ చానెల్ వేదికగా ఘాటు విమర్శలు చేశాడు. ఇక రాజస్తాన్తో మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఈ మ్యాచ్ ముఖ్యంగా సీఎస్కే ఇన్నింగ్స్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట టీ10, తర్వాత వన్డే.. ఆ తర్వాత టెస్టు క్రికెట్ను తలపించింది. మొదటి ఆరు ఓవర్లలో టీ10 మాదిరి.. మొయిన్ అలీ అదరగొట్టాడు. అయితే డెవాన్ కాన్వే అవుటైన తర్వాత 50-50 మ్యాచ్ను గుర్తు చేసింది. ఇక జగదీశన్, అంబటి రాయుడు అవుటైన తర్వాత టెస్టు క్రికెట్. ధోని 28 బంతుల్లో 26 పరుగులు చేయడం చూశాం కదా!’’ అంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. చదవండి👉🏾Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్కు చోటు! బ్యాకప్ ప్లేయర్గా త్రిపాఠి చదవండి👉🏾Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"దీపక్ భాయ్తో నిత్యం టచ్లో ఉంటా.. అతడు నాకు చాలా సాయం చేశాడు"
ఐపీఎల్-2022లో సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి సూపర్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖేష్ కీలక పాత్ర పోషించాడు. ఇక సీఎస్కే స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చహర్ స్థానాన్ని ముఖేష్ భర్తీ చేశాడు. పవర్ప్లేలో ముఖేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. గతేడాది సీజన్లో సీఎస్కే నెట్ బౌలర్గా ముఖేష్ ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ముఖేష్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ముఖేష్ వెల్లడించాడు."దీపక్ భాయ్ గత కొంతకాలంగా సీస్కేకు ఆడుతున్నాడు. అదే విధంగా సీస్కేకు అద్బుతంగా రాణించాడు. నేను అతడితో నిత్యం టచ్లో ఉంటా టచ్లో ఉంటాను. అతడు నా బౌలింగ్ మెరుగుపరుచుకునేందుకు చాలా సలహాలు ఇస్తున్నాడు. పరిస్థితుల బట్టి ఎలా బౌలింగ్ చేయాలో అతడు నాకు చెప్పాడు. టోర్నీ తొలి మ్యాచ్ల్లో నేను రాణించలేకపోయాను. దీపక్ భాయ్ నాకు ఫోన్ చేసి కొన్ని టిప్స్ చెప్పాడు. నేను సన్రైజర్స్పై 4 వికెట్లు పడగొట్టినప్పడు.. చాహర్ నాకు ఫోన్ చేసి ప్రశంసించాడు. అదే విధంగా ధోని భాయ్ సూచనలు పాటించమని చెప్పాడు. నిజంగా దీపక్ భాయ్ నాకు చాలా సహాయం చేశాడు. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, చాహర్ మాటలు నన్ను చాలా ప్రోత్సహించాయి" అని ముఖేష్ చౌదరి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ధావన్ అరుదైన ఫీట్.. కోహ్లి రికార్డు బద్దలు..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అదృష్టం అంటే దీపక్ చాహర్దే.. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా 14 కోట్లు రికవరీ..!
Deepak Chahar: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గాయం కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరమై సీఎస్కేకు తీరని శోకాన్ని మిగిల్చాడు. చాహర్పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై టీమ్.. అతను సీజన్ మొత్తానికే దూరం అయ్యాడని తెలిసి నైరాశ్యంలో మునిగిపోయింది. వరుస ఓటములతో (5 మ్యాచ్ల్లో 4 ఓటములు) సతమతమవుతున్న సీఎస్కేకు దీపక్ చాహర్ లేని లోటు పూడ్చలేనిది. కాగా, ప్రస్తుత సీజన్కు సంబంధించి దీపక్ చాహర్ అంత అదృష్టవంతుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. ఈ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ ఆడకపోయినా మెగా వేలంలో దక్కించుకున్న 14 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. అది ఎలాగంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ సీ ప్లేయర్ల లిస్టులో ఉన్న చాహార్కు ఇన్సురెన్స్ పాలసీ కారణంగా వేలంలో దక్కించుకున్న పూర్తి మొత్తం లభించనుంది. బీసీసీఐ స్వయంగా తమ కాంట్రాక్ట్ ప్లేయర్ల ప్రీమియం మొత్తం చెల్లిస్తుంది. దీంతో బీసీసీఐ పుణ్యమా అని దీపక్ చాహార్కు ఒక్క మ్యాచ్ ఆడకపోయినా ఇంచుమించు రూ.14 కోట్ల మొత్తం లభించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఐపీఎల్కు ముందు వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: ఔటైన కోపంలో ఇషాన్ కిషన్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దీపక్ చహర్ ఉదంతం.. ఎస్సీఏకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఐపీఎల్ 2022 సీజన్కు దీపక్ చహర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా చహర్ ఐపీఎల్తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీపక్ చహర్ ఉదంతంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) ఫిజియోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక గాయంతో బాధపడుతూ రీహాబిటేషన్లో ఉన్న ఆటగాడు కోలుకుంటున్న సమయంలోనే మరో గాయం బారిన పడడమేంటని.. అసలు ఫిజియోలు ఏం చేస్తున్నారని మండిపడింది. ''వినడానికి ఆశ్చర్యంగా ఉంది. గాయపడి రీహాబిటేషన్లో కోలుకుంటున్న ఆటగాడు మరో గాయం బారిన పడ్డాడు. అంటే ఎన్సీఏ ఫిజియోలు సరిగా పని చేయడం లేదు. ఒక విషయం క్లియర్గా మీకు తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఒక్క దీపక్ చహర్ మాత్రమే కాదు.. ఇంతకముందు కూడా గాయపడిన ఆటగాళ్లు రీహాబిటేషన్లో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో జరగబోయే మేజర్ ఈవెంట్స్లో ఆటగాళ్ల ఎంపికలో చాలా సమస్యలు వస్తాయి. ఈ అంశంపై ఎన్సీఏ డైరెక్టర్లు నితిన్, వివిఎస్ లక్ష్మణ్తో చర్చలు నిర్వహిస్తాం. అసలెందుకు ఆటగాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకోవడం లేదనే దానిపై ఆరా తీస్తాం.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. నిజం చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితిపై ఎవరం సంతోషంగా లేము. గాయాలనేవి ఆటగాళ్లకు సహజం. వాళ్లు కోలుకోవాలనే ఎన్సీఏ పేరుతో రీహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కానీ అక్కడే పని జరగకపోతే ఏం లాభం. హార్దిక్ పాండ్యా సహా చాలా మంది క్రికెటర్ల విషయంలో ఇది జరిగింది. ఇక్కడి ఫిజియోలతో పని కాదంటే చెప్పండి.. విదేశాల నుంచి ఫిజియోలను తెప్పిస్తాం. అడ్వాన్సన్ టెక్నాలజీతో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది.'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపక్ చహర్ ఒక్కడే కాదు.. ఇంతకముందు హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఈ క్రమంలోనే అతను ఫామ్ కోల్పోవడం.. జట్టులో స్థానం కోల్పోవడం జరిగిపోయాయి. జడేజా కూడా బొటనవేలి గాయంతో రీహాబిటేషన్లో చాలాకాలం గడపాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్లకు చిన్న గాయాలే అయినప్పటికికోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన -
దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన
దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్కు పూర్తిగా దూరమైనట్లు సీఎస్కే శుక్రవారం ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ''మిస్ యూ దీపక్ చహర్.. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. దీపక్ చహర్ దూరమవ్వడం సీఎస్కేకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. గత సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాలుగు మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన జడ్డూ సేన ఆర్సీబీతో మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టింది. ఇక రెండు రోజుల క్రితం దీపక్ చహర్ వెన్నుముక గాయంతో బాధపడుతున్నట్లు తేలింది. 📢 Official Announcement! Deepak Chahar will be missing the IPL 2022 due to a back injury. Send in all the #Yellove for a speedy recovery to namma Cherry! Read More ➡️ https://t.co/ju447A3Q2T pic.twitter.com/jujfCfSB6L — Chennai Super Kings (@ChennaiIPL) April 15, 2022 అంతకముందు తొడ కండరాల గాయంతో విండీస్తో సిరీస్కు దూరమైన చహర్.. ఎన్సీఏ రీహాబిటేషన్లో చేరి అక్కడే కోలుకున్నాడు. ఇక సీఎస్కేలో చేరతాడు అనే సమయానికి దురదృష్టవశాత్తూ చహర్కు వెన్నుముక గాయం తిరగబెట్టింది. నాలుగు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. దీంతో దీపక్ చహర్ ఐపీఎల్తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్కు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Courtesy: IPL Twitter మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్ రషీక్ సలామ్ వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి వైదొలిగాడు. రషీక్ సలామ్ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. స్కానింగ్లో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో రషీక్ సీజన్కు దూరమవుతున్నట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రషీక్ సలామ్ ఈ సీజన్లో కేకేఆర్ తరపున రెండు మ్యాచ్లు ఆడాడు. అతని స్థానంలో ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా కనీస ధర రూ.20 లక్షలకు కేకేఆర్ భర్తీ చేయనున్నట్లు ట్విటర్లో తెలిపింది. 🚨 UPDATE: Harshit Rana replaces an injured Rasikh Salam in the KKR squad. — KolkataKnightRiders (@KKRiders) April 15, 2022 -
దీపక్ చహర్కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్ కిషన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ నిలిచాడు. రూ.14 కోట్లతో సీఎస్కే మూడేళ్ల కాలానికి(రూ.42 కోట్లు) చహర్ను దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే గాయంతో దీపక్ చహర్ దూరమయ్యాడు. తొలుత ఆరంభ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడని అంతా భావించారు. తాజాగా వెన్నుముక గాయంతో సీజన్ మొత్తానికే చహర్ దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ, సీఎస్కే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. రానున్న టి20 ప్రపంచకప్ 2022కు కూడా దీపక్ చహర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే కనీసం నాలుగు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే దీపక్ చహర్ టి20 ప్రపంచకప్ ఆడడం కష్టమే. ఇది సీఎస్కేకు బిగ్షాక్ అనే చెప్పాలి. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఆర్సీబీతో మ్యాచ్లో గెలిచి సీజన్లో బోణీ చేసింది. అయితే దీపక్ చహర్ పూర్తిగా దూరమయ్యాడన్న వార్త సీఎస్కేకు నష్టం కలిగించే అంశం. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, నకుల్ బంతిని విడవడంలో.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంలో దీపక్ చహర్ను ప్రత్యేక బౌలర్గా నిలిపాయి. అంతేకాదు లోయర్ ఆర్టర్లో బ్యాటింగ్లోనూ రాణించగల సత్తా అతని సొంతం. గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంలో దీపర్ చహర్ కీలకపాత్ర పోషించాడు. తాజాగా దీపక్ చహర్ అంశంలో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చహర్కు ఈ ఏడాది సీఎస్కే ఒక్క రూపాయి ఇచ్చే అవకాశం లేదు. ఐపీఎల్లో తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు సీజన్ ఆరంభానికి ముందు జట్టుకు దూరమై.. ఆ తర్వాత సీజన్ మొత్తానికి అందుబాటులోకి రాకుంటే సదరు ఆటగాడికి ఒక్క రూపాయి చెల్లించే అవకాశం ఉండదు. ఈ లెక్కన చహర్ రూ.14 కోట్లు కోల్పోతున్నట్లే. ఇంతకముందు ఒక ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడి ఆ తర్వాత సీజన్ మొత్తం దూరమైనా అతనికి సదరు ఫ్రాంచైజీ పూర్తి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై అలా కుదరదు. తాజాగా సవరించిన రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ► సీజన్ ఆరంభానికి ముందే ఆటగాడు దూరమైతే సదరు ఫ్రాంచైజీ అతనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ►ఒక ప్లేయర్ గాయంతోనో.. లేక వేరే మ్యాచ్లు ఆడాలన్న కారణంతో మధ్యలో వైదొలిగితే అతనికి చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 10శాతం మాత్రమే ఇస్తారు. ►ఇక సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాడు జట్టు క్యాంప్లో రిపోర్టు చేసి.. మ్యాచ్ సమయానికి గాయపడి సీజన్ మొత్తానికి దూరమైతే 50శాతం డబ్బును చెల్లిస్తారు. అంతేకాదు గాయపడిన ఆటగాడి ట్రీట్మెంట్ ఖర్చును కూడా భరిస్తుంది. చదవండి: IPL 2022 GT Vs RR: హార్ధిక్ చేసిన ఆ పని వల్ల లక్షల్లో నష్టం.. ! -
T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా మరో సారి గాయపడ్డాడు. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి వెన్నెముకకు గాయమైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకు సెకెండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహర్ పూర్తిగా దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కనీసం నాలుగు నెలలపాటు క్రికెట్కు దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు చాహర్ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టీ20 ప్రపంచకప్కు చాహర్ దూరమైతే భారత్కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్లపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్కు ఉంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుత సీజన్లో చాహర్ లేని లోటు సీఎస్కే బౌలింగ్లో సృష్టంగా కన్పిస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. తొలి జట్టుగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ క్రికెటర్ను తీసుకోవాల్సిందే.. సీఎస్కేకు అభిమానుల డిమాండ్
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అసలే ఓటముల బాధలో ఉన్న సీఎస్కేకు దీపక్ చహర్ సీజన్ మొత్తానికే దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తేలడంతో పుండు మీద కారం చల్లినట్లయింది. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో దీపక్ చహర్ను రూ. 14 కోట్లు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ సీజన్కు దూరమయ్యే అవకాశం ఉండడంతో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చహర్ స్థానంలో తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 33 ఏళ్ల ఇషాంత్ ఇటీవలే టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఫామ్ కోల్పోయి సతమతవుతున్న ఇషాంత్ను సెలెక్టర్లు పక్కనబెట్టేశారు. ఇక జట్టులోకి ఇషాంత్ రావడం కష్టమే. దీనికి తోడూ మెగావేలంలో అమ్మడుపోని జాబితాలో చేరిపోయాడు. ఇషాంత్కు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న ముంబై, పూణే స్టేడియాలో సరిగ్గా సరిపోతాయని.. గతంలో అతనికి మంచి రికార్డు ఉందంటూ చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న సీఎస్కేకు ఇషాంత్ రాకతో మార్పు వస్తుందేమో.. అంటూ పేర్కొన్నారు. కాగా కొన్నిరోజుల క్రితం ఐపీఎల్ వర్చువల్ గెస్ట్ బాక్స్లో ఇషాంత్ దర్శనమిచ్చాడు. ఇది చాలా మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అందుకే ఇషాంత్ను సీఎస్కే తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇషాంత్పై అభిమానులు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! Jasprit Bumrah: 'సంధికాలం నడుస్తోంది.. మార్చాల్సిన సమయం వచ్చేసింది!' Ishant sharma can be a really good replacement for Chahar. Ishant was very good in powerplays last season. https://t.co/Ii3eCeWdly — Jainil (@jainilism) April 12, 2022 With Chahar's comeback being almost next to impossible right now, can we rope in Ishant Sharma quickly? — Chinmay Singhvi (@SinghviChinmay) April 12, 2022 -
IPL 2022: వరుస ఓటములతో కుంగిపోయిన సీఎస్కేకు మరో భారీ షాక్..!
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ప్రస్తుత సీజన్లో ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్ 15వ ఎడిషన్లో కొత్త కెప్టెన్ (రవీంద్ర జడేజా) నేతృత్వంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ ఓటమిపాలై మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ సీఎస్కేకు మరో భారీ షాక్ తగిలింది. 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. Deepak Chahar ruled out of IPL 2022. (Reported by TOI).— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2022 తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అయితే ఈ విషయంపై సీఎస్కే మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఫిబ్రవరిలో వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్ చాహర్ తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎస్కే ఇవాళ (ఏప్రిల్ 12) తమ 5వ మ్యాచ్లో ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: బరిలోకి దిగనున్న దీపక్ చాహర్.. ఎప్పటి నుంచి అంటే..?
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్లు మిస్ అయిన స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్.. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్ నాటికి సిద్ధంగా ఉంటాడని సీఎస్కే యాజమాన్యం సూచనప్రాయంగా వెల్లడించింది. పంజాబ్తో మ్యాచ్ నాటికి ఫిట్గా ఉండేందుకు చాహర్ ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాడు. జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్స్లో చెమటోడుస్తున్నాడు. కాగా, ప్రస్తుత సీజన్లో సీఎస్కే ఓడిన రెండు మ్యాచ్ల్లో చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2021 సీజన్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన చాహర్ను సీఎస్కే ఏరికోరి మరీ 14 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. చాహర్ త్వరగా కోలుకుని బరిలోకి దిగాలని అభిమానులతో పాటు సీఎస్కే యాజమాన్యం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. సీజన్ తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన సీఎస్కే.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: IPL 2022: ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత -
IPL 2022: సీఎస్కే అభిమానులకు గుడ్న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
IPL 2022: చెన్నై సూపర్కింగ్స్ అభిమానులకు గుడ్న్యూస్! గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చహర్ కాస్త ఆలస్యంగానైనా టీమ్లోకి తిరిగి రానున్నాడట. ముందుగా చెప్పినట్లుగా అతడికి సర్జరీ అవసరం లేదని, ఏప్రిల్ రెండో వారం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని సీఎస్కే 14 కోట్లు ఖర్చు చేసి దీపక్ చహర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా చహర్ నిలిచాడు. అయితే, వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని మొదట్లో వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న చహర్కు సర్జరీ అవసరం లేదని ట్రెయినర్లు చెప్పినట్లు తెలుస్తోంది. రానున్న రెండు వారాల్లోగా అతడు.. జట్టుతో చేరనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. సూరత్లో ప్రాక్టీసు చేస్తున్న ధోని సేనతో చహర్ కలువనున్నట్లు తెలిపింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్లాడిన దీపక్ చహర్ 14 వికెట్లు పడగొట్టి జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్-2022 ఆరంభం కానుంది. చదవండి: IPL 2022- CSK: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే! Namma Special 🦁 Footvolley segment is B⚽CK! 🔁#WhistlePodu pic.twitter.com/pXxIe994sG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 -
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
-
IPL 2022: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చహర్ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ తగిలినట్లయింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్ సగం మ్యాచ్లకు అందుబాటులో ఉండడన్న కథనాల నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. తనదైన రోజున మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించగల స్టార్ దూరం అయితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. మరి చహర్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా! తుషార్ దేశ్పాండే ఐపీఎల్- 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్లీగ్లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేసర్. గత సీజన్లో సీఎస్కేకు నెట్ బౌలర్గా వ్యవహరించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. దేశవాళీ టోర్నీల్లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన తుషార్.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు. రాజ్వర్ధన్ హంగర్కర్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీపక్ చహర్లాగే జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించగలడు కూడా! వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్తో మ్యాచ్లో మూడు వరుస సిక్సర్లు బాది సత్తా చాటాడు. కేఎమ్ ఆసిఫ్ 2018 నుంచి సీఎస్కే జట్టులో ఉన్నాడు ఆసిఫ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడాడు. కేరళకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తొలుత దుబాయ్లో జీవించేవాడు. ఓ షాప్లో స్టోర్కీపర్గా పనిచేశాడు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 2018లో సీఎస్కే కొనుగోలు చేయడంతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్కు దీపక్ చహర్ గాయం కారణంగా దూరం కావడంతో ఆసిఫ్ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ -
చెన్నై సూపర్ కింగ్స్లోకి శ్రీశాంత్...!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్కు ఉన్నాయి. అదే విధంగా పవర్ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్కు ఉంది. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా! -
చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..!
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో తొడ కండరాల గాయానికి చాహర్ గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు దీపక్ చాహర్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు దీపక్ చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్లాడిన చాహర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే సీఎస్కే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022లో అమ్ముడుపోని టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చాహర్ స్ధానంలో భర్తీ చేసేందుకు చెన్నై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో సీఎస్కే విజయంలో చాహర్ కీలకపాత్ర పోషించాడు. తన పేస్తో పవర్ ప్లేలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. ఇక చాహర్ పేస్ బౌలింగ్ బాధ్యతలను ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావోలు తీసుకోనున్నారు. చదవండి: Rod Marsh: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కన్నుమాత.. -
ఐపీఎల్కు దూరం కానున్న స్టార్ ఆల్రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా!
టీమిండియా యంగ్ ఆల్రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దీపక్ చహర్కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో చహర్ ఐపీఎల్ 2022 సీజన్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే పెద్ద దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఈసారి మెగావేలంలో సీఎస్కే దీపక్ చహర్ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్కు చహర్ దూరమైతే మాత్రం సీఎస్కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్లో చహర్ సీఎస్కే తరపున అదరగొట్టాడు. ఒక రకంగా సీఎస్కే టైటిల్ గెలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. చహర్ దూరమైతే అతనికి రీప్లేస్మెంట్ విషయంలోనూ సీఎస్కేకు సరైన ఆటగాడు లేడు. అంతేకాదు ఏడాది కాలంగా దీపక్ చహర్ బంతితోనే కాదు బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్తో తనలో ఆల్రౌండర్ ఉన్నాడని నిరూపించిన చహర్ ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ టీమిండియా తరపున పలు మ్యాచ్లో మెరిశాడు. ఇక విండీస్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టి20లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం దీపక్ చహర్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్లో ఉన్నాడు. ఇప్పటికైతే చహర్ గాయం తీవ్రత గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికి.. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాకాలు చేస్తుంది. చదవండి: Formula One: 'ఫార్ములావన్ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? -
లంకతో సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఉలిక్కిపడ్డ సీఎస్కే
Deepak Chahar: త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. చాహర్ టీమిండియా బయోబబుల్ను వీడాడని సమాచారం. లంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చాహర్ సభ్యుడిగా ఉన్నాడు. వెస్టిండీస్తో ఆఖరి టీ20 సందర్భంగా చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రెండో ఓవర్ బౌలింగ్ చేస్తుండగా కుడి తొడ కండరాలు పట్టేయడంతో చాహర్ మైదానాన్ని వీడాడు. వైద్యుల పరీక్షఅనంతరం గాయం తీవ్రమైందని తెలిసింది. కోలుకునేందుకు 5-6 వారాల పట్టవచ్చని సమాచారం. ఈ వార్త తెలిసి చాహర్ ఐపీఎల్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్ ఉలిక్కిపడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సీఎస్కే చాహర్ను ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే, లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది. చదవండి: టీమిండియా క్రికెటర్లకు అవమానం.. వ్యాక్సిన్ వేసుకోలేదని..! -
'రిటైర్మెంట్ రోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా'
సీఎస్కే ఆల్రౌండర్ దీపక్ చహర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసే దీపక్.. బ్యాటింగ్ చేయడంలోనూ సత్తా చాటగలడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఏడు వన్డేలు ఆడిన చహర్ 179 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక బౌలింగ్లో 10 వికెట్లు తీసిన చహర్ మంచి ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తాను బ్యాటింగ్లో రాణించడం వెనుక ఎంఎస్ ధోని సలహా ఎంతో ఉపయోగపడిందంటూ చహర్ పేర్కొన్నాడు. చదవండి: క్యాచ్ పట్టలేదని చెంపదెబ్బ పీకాడు.. ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి ఐపీఎల్లో గత సీజన్లో దుమ్మురేపే ప్రదర్శన చేసిన చహర్ సీఎస్కే టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే రూ. 14 కోట్లు పెట్టి చహర్ను మరోసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా స్పోర్ట్స్ యారీ య్యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో చహర్ మాట్లాడాడు. ''ధోని రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆరోజు ధోని భయ్యా ఒక విషయం చెప్పాడు. ''బౌలింగ్లో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నావు.. కానీ నీ బ్యాటింగ్ పవరేంటో చూపించలేదు. ఇకపై బ్యాటింగ్పై కూడా ఫోకస్ పెట్టు.. దాని గురించి ఆలోచించు'' అని చెప్పాడు. తక్షణమే బౌలింగ్తో పాటు బ్యాటింగ్పై దృష్టి సారించా. అందుకోసం చాలా హార్డ్వర్క్ చేశా. ఆ తర్వాత గతేడాది శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 82 బంతుల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడం ఎప్పటికి మరిచిపోను. ఆరోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా.''అంటూ పేర్కొన్నాడు. కాగా ఇటీవల విండీస్తో ముగిసిన టి20 సిరీస్లో కండరాల గాయంతో మూడో టి20కి చహర్ దూరమయ్యాడు. రానున్న శ్రీలంకతో టి20 సిరీస్కు దీపక్ చహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ ఆరంభ దశలోనూ సీఎస్కే చహర్ సేవలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా టి20ల్లో పవర్ప్లేలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీపర్ చహర్ నిలిచాడు. చదవండి: ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్పటి నుంచి అంటే..? -
శ్రీలంకతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్!
స్వదేశంలో శ్రీలంకతో టీ 20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన అఖరి టీ20లో మోకాలి గాయంతో చాహర్ బాధపడ్డాడు. ఈ క్రమంలో 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన చాహర్ ఫీల్డ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్లో చాహర్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టేట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే చాహర్ ఐపీఎల్లో కూడా కొన్ని మ్యాచ్లు దూరం కావల్సి వస్తుంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా లక్నో వేదికగా ఫిబ్రవరి 24న భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక.. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ -
Ind VS Wi 2nd T20: వరుసగా 8, 18, 0, 17.. కనీసం ఈ మ్యాచ్లోనైనా!
వెస్టిండీస్తో వన్డే సిరీస్ తర్వాత ఇప్పుడు టి20 సిరీస్ను కూడా సొంతం చేసుకునేందుకు భారత జట్టు సన్నద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా మూడు వన్డేలతో పాటు తొలి టి20లో కూడా అలవోక విజయం సాధించింది. విండీస్ నుంచి ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. ఈ నేపథ్యంలో నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్లు రెండో టి20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఫామ్ను బట్టి చూస్తే భారత్ మరోసారి సంపూర్ణ ఆధిక్యం కనబర్చే అవకాశం కనిపిస్తోంది. వన్డేలతో పోలిస్తే టి20ల్లో కాస్త మెరుగైన, హిట్టర్లతో కూడిన జట్టయిన విండీస్ ఈ ఫార్మాట్లోనూ గత మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయింది. ఈ సారైనా కాస్త మెరుగ్గా రాణించి పర్యాటక జట్టు సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్ వరకు తీసుకెళుతుందా చూడాలి. కోహ్లి చెలరేగేనా! సహజంగానే గెలిచిన జట్టునే కొనసాగించే అలవాటు ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మార్పులకు ఆసక్తి చూపించకపోవచ్చు. టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొనే ప్రతీ మ్యాచ్లో సన్నద్ధమవుతామని చెప్పిన రోహిత్... అందుకు అనుగుణంగా తన ప్రణాళికల ప్రకారం తుది జట్టును ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ ప్రదర్శన చూస్తే భారత్ ఆందోళన చెందే అంశం ఏమీ లేదు. రోహిత్, ఇషాన్ కిషన్, పంత్, సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఒక్క విరాట్ కోహ్లి ఫామ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నా... అతని స్థాయికి ఒక్క ఇన్నింగ్స్తో అంతా మార్చేయగలడు. విండీస్తో గత నాలుగు ఇన్నింగ్స్లలో కోహ్లి వరుసగా 8, 18, 0, 17 పరుగులు చేశాడు. ఇక స్పిన్నర్లలో చహల్ ప్రభావం చూపించగా, రవి బిష్ణోయ్ తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. అయితే ముగ్గురు పేసర్లు కూడా దాదాపు ఒకే తరహా వేగంతో బౌలింగ్ చేసేవారు కావడంతో వైవిధ్యం కోసం ఒక మార్పుకు అవకాశం ఉంది. భువనేశ్వర్ లేదా దీపక్ చహర్లలో ఒకరిని తప్పించి సిరాజ్ను ఎంచుకోవచ్చు. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి -
జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
India Vs West Indies 2nd T20: వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది.ఫీల్డింగ్ సమయంలో ఆల్రౌండర్లు దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్లు గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో టి20 మ్యాచ్కు వీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు టి20 సిరీస్ నుంచి ఔటైన సంగతి తెలిసిందే. వీరు కూడా దూరమైతే టీమిండియా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. చదవండి: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ పొలార్డ్ స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో చహర్ కుడిచేతికి గాయమయింది. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్రూమ్కు వెళ్లిపోయాడు. మూడు ఓవర్లు వేసిన చహర్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చహర్ మిగిలిన ఓవర్ను హర్షల్ పటేల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు అవకాశం రాలేదు. అయితే గాయం తీవ్రతను బట్టి చహర్ రెండో వన్డే ఆడేది లేనిది తెలుస్తుంది. ఇక మరో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో పొలార్డ్ కొట్టిన షాట్ను ఆపే క్రమంలో జారిపడడంతో అయ్యర్ కుడిచేతికి గాయం అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. కాగా వీరిద్దరికి స్కానింగ్ నిర్వహించి.. వచ్చే ఫలితాలను బట్టి రెండో టి20కి అందుబాటులో ఉంటారా.. దూరమవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది. చదవండి: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. కల నిజమైంది.. కానీ ఇది అస్సలు ఊహించలేదు! -
IPL 2022 Auction: దీపక్ చహర్కు రూ.14 కోట్లు.. సీఎస్కే జట్టు చూసేద్దాం
ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే జట్టు నుంచి పెద్దగా మెరుపులు లేవు. దీపక్ చహర్ను రూ. 14 కోట్లకు పెట్టి మళ్లీ కొనుగోలు చేయడం.. అంబటి రాయుడుకు రూ. 6 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. ఇక డ్వేన్ బ్రావోతో పాటు శివమ్ దూబే, క్రిస్ జోర్డాన్ లాంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. వేలానికి ముందు ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకుంది. మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖర్చు చేసిన మొత్తం: రూ. 87 కోట్ల 5 లక్షలుగా ఉంది. చెన్నై సూపర్కింగ్స్ రవీంద్ర జడేజా : రూ. 16 కోట్లు దీపక్ చహర్: రూ. 14 కోట్లు ధోని : రూ. 12 కోట్లు మొయిన్ అలీ : రూ. 8 కోట్లు అంబటి రాయుడు: రూ. 6 కోట్ల 75 లక్షలు రుతురాజ్ గైక్వాడ్ : రూ. 6 కోట్లు బ్రేవో: రూ. 4 కోట్ల 40 లక్షలు శివమ్ దూబే : రూ. 4 కోట్లు క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్ల 60 లక్షలు రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు ఆడమ్ మిల్నే: రూ. 1 కోటి 90 లక్షలు సాన్ట్నర్ : రూ. 1 కోటి 90 లక్షలు రాజ్వర్ధన్ హంగార్గెకర్: రూ. 1 కోటి 50 లక్షలు ప్రశాంత్ సోలంకి : రూ. 1 కోటి 20 లక్షలు డెవాన్ కాన్వే : రూ. 1 కోటి మహీశ్ తీక్షన : రూ. 70 లక్షలు డ్వేన్ ప్రిటోరియస్ : రూ. 50 లక్షలు భగత్ వర్మ : రూ. 20 లక్షలు ఆసిఫ్: రూ. 20 లక్షలు తుషార్ దేశ్పాండే: రూ. 20 లక్షలు జగదీశన్ : రూ. 20 లక్షలు హరి నిశాంత్ : రూ. 20 లక్షలు సుభ్రాన్షు సేనాపతి : రూ. 20 లక్షలు ముఖేశ్ చౌదరి: రూ. 20 లక్షలు సిమర్జీత్ సింగ్ : రూ. 20 లక్షలు -
IPL Auction Day 1: చహర్ 14 కోట్లు... అదరగొట్టిన శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, హసరంగ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మరోసారి అంచనాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 10 మంది ఆటగాళ్లు కనీసం రూ. 10 కోట్లకంటే ఎక్కువ విలువ పలకగా, పెద్ద సంఖ్యలో ప్లేయర్లు మిలియన్ డాలర్ల మార్క్ను దాటారు. గతంతో పోలిస్తే ఈసారి వేలంలో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టాప్–10లో ఏడుగురు భారత ఆటగాళ్లు ఉండగా... ఆ పది మందిలో ఏడుగురు బౌలర్లే ఉండటం లీగ్లో బౌలింగ్ విలువను కూడా చూపించింది. వేలంలో ఎప్పటిలాగే కొన్ని అనూహ్య, అసాధారణ అంకెలు ఆశ్చర్యపరచగా... అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఫ్రాంచైజీలు ఆచితూచి వేసిన అడుగుల ముద్ర కూడా కనిపించింది. 23 ఏళ్ల ఇషాన్ కిషన్ అందరికంటే ఎక్కువగా రూ.15 కోట్ల 25 లక్షలతో శిఖరాన నిలిచాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు; 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్) తర్వాత రెండో ఖరీదైన భారతీయ ప్లేయర్గా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు. టాప్–10 (కనీసం రూ. 10 కోట్లు) ఇషాన్ కిషన్ - ముంబై ఇండియన్స్ ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్. 23 ఏళ్ల వయసు, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఈ జార్ఖండ్ ప్లేయర్ సొంతం. గత రెండేళ్లు ముంబైకి విజయాలు అందించడంలో కీలక పాత్ర. అందుకే ప్రతీ జట్టు అతని కోసం పోటీ పడ్డాయి. అంబానీ టీమ్ కూడా అతడిని వదలదల్చుకోలేదు. అందుకే అందరికంటే ఇషాన్కు ఎక్కువ విలువ. రూ. 15 కోట్ల 25 లక్షలు దీపక్ చహర్ - చెన్నై సూపర్ కింగ్స్- రూ. 14 కోట్లు పవర్ప్లే స్పెషలిస్ట్ బౌలర్. స్వింగ్ అతని బలం. చెన్నైకి ఆడిన గత నాలుగు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. గత రెండేళ్లుగా బ్యాటింగ్లోనూ బాగా మెరుగయ్యాడు. అందుకే రాజస్తాన్కు చెందిన దీపక్ చహర్ను చెన్నై మళ్లీ తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ -కోల్కతా నైట్రైడర్స్ - రూ. 12 కోట్ల 25 లక్షలు ప్రతిభావంతుడైన బ్యాటర్. పరిస్థితికి తగినట్లుగా తన ఆటను మార్చుకోగలడు. ముంబై రంజీ జట్టు నుంచి వచ్చిన సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కెప్టెన్ అవసరం ఉన్న కోల్కతా అందుకే ఎంచుకుంది. శార్దుల్ ఠాకూర్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్గా మారిన బౌలింగ్ ఆల్రౌండర్. ఇటీవలి అతని ప్రదర్శనలు అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్ నేర్పుతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఈ ముంబైకర్ సొంతం. హర్షల్ పటేల్ - బెంగళూరు - రూ. 10 కోట్ల 75 లక్షలు 2021 ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. పవర్ప్లేలో, డెత్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అందుకే భారీ మొత్తానికి ఈ హరియాణా బౌలర్ను బెంగళూరు మళ్లీ తీసుకుంది. వనిందు హసరంగ- బెంగళూరు -రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా లీగ్లలో ఆకట్టుకుంటున్న ఈ శ్రీలంక స్పిన్నర్ టి20 ప్రపంచకప్లో, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అయినా ఒక భారతీయేతర స్పిన్నర్ ఇంత విలువ పలకడం అనూహ్యం. అయితే లెగ్స్పిన్నర్గా అతనిది ప్రత్యేక శైలి. ‘గుగ్లీ’ పదునైన ఆయుధం. నికోలస్ పూరన్- సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 10 కోట్ల 75 లక్షలు ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే అసాధారణ విలువ. ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్కు హిట్టర్గా పేరు ఉన్నా గతంలో పంజాబ్ జట్టుకు ఉపయోగపడలేదు. హైదరాబాద్ అనూహ్య మొత్తాన్ని వెచ్చించింది. లోకీ ఫెర్గూసన్ - గుజరాత్ టైటాన్స్ - రూ. 10 కోట్లు న్యూజిలాండ్కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్. కోల్కతా తరఫున మూడు సీజన్లలో అక్కడక్కడ రాణించాడు. అతని స్థాయికి, అంతర్జాతీయ గుర్తింపునకు ఇది చాలా పెద్ద మొత్తం. అవేశ్ ఖాన్ - లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 10 కోట్లు చాలా రోజులుగా భారత క్రికెట్లో అందరి దృష్టీ ఉంది. 2016 అండర్–19 ప్రపంచకప్లో ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ భారత యువ పేస్ బౌలర్లలో చక్కటి ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కూడా ఆకట్టుకోవడంతో ఫ్రాంచైజీలు ఇతని కోసం పోటీ పడ్డాయి. ప్రసిధ్ కృష్ణ - రాజస్తాన్ రాయల్స్ - రూ. 10 కోట్లు ఐపీఎల్లో గొప్ప రికార్డు లేకపోయినా (9.26 ఎకానమీ) ఇటీవలి వన్డే ప్రదర్శన ప్రసిధ్ కృష్ణకు భారీ మొత్తం అందించింది. తాజా ఫామ్లో ఈ కర్ణాటక బౌలర్ ప్రత్యరి్థని కట్టడి చేయగలడని ఫ్రాంచైజీలు నమ్మాయి. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! -
Ind Vs WI 3rd ODI: 1983 నుంచి ఆడుతున్నాం... ఇలాంటి విజయం ఇదే తొలిసారి!
Ind vs WI 3rd ODI: India Beat West Indies Clinch Series 3-0- అహ్మదాబాద్: బౌలింగ్కు కలిసొచ్చిన పిచ్పై భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్పై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. ఆఖరి వన్డేలో 96 పరుగులతో జయభేరి మోగించి సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. పగ్గాలు చేపట్టగానే రోహిత్ శర్మ చరిత్రకెక్కే వైట్వాష్ సాధించాడు. 1983 నుంచి వెస్టిండీస్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడుతున్న భారత్ తొలిసారి ఆ జట్టుపై వన్డేల్లో క్లీన్స్వీప్ సాధించడం విశేషం. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట భారత్ 50 ఓవర్లలో 265 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 80; 9 ఫోర్లు), రిషభ్ పంత్ (54 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. హోల్డర్ 4 వికెట్లు తీశాడు. తర్వాత వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ప్రసిధ్ కృష్ణ (3/27), సిరాజ్ (3/29) నిప్పులు చెరిగారు. ఈ రెండు జట్ల మధ్య ఈనెల 16 నుంచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. అదరగొట్టిన అయ్యర్ కోవిడ్తో రెండు వన్డేలకూ దూరమైన శ్రేయస్ అయ్యర్ మూడో వన్డేలో తన జోరును ప్రదర్శించాడు. జోసెఫ్ ధాటికి రోహిత్ (13), కోహ్లి (0) నిష్క్రమించగా, ధావన్ (10)ను స్మిత్ వెనక్కి పంపడంతో 42/3 స్కోరు వద్డే టాపార్డర్ కూలింది. ఈ దశలో శ్రేయస్, పంత్ నాలుగో వికెట్కు 110 పరుగులు జోడించి భారత్ను నిలబెట్టారు. తర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సూర్యకుమార్ (6) అవుటవడంతో ఈసారి వాషింగ్టన్ సుందర్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ (38 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఆదుకున్నారు. జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత ఆతిథ్య బౌలర్లు కూడా పిచ్ సహకారంతో రెచ్చిపోయారు. సిరాజ్, దీపక్ చహర్, ప్రసిధ్ తలా ఒక వికెట్ తీసి విండీస్ టాపార్డర్ను 25 పరుగులకే పడేశారు. హోప్ (5), కింగ్ (14), బ్రేవో (19) వెనుదిరిగాక తర్వాత వచి్చన వారిలో నికోలస్ పూరన్ (34; 2 ఫోర్లు, 1), ఒడెన్ స్మిత్ (36; 3 ఫోర్లు, 3 సిక్స్లు), జోసెఫ్ (29; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జోసెఫ్ 13; ధావన్ (సి) హోల్డర్ (బి) స్మిత్ 10; కోహ్లి (సి) షై హోప్ (బి) జోసెఫ్ 0; అయ్యర్ (సి) బ్రేవో (బి) వాల్ష్ 80; పంత్ (సి) షై హోప్ (బి) వాల్ష్ 56; సూర్యకుమార్ (సి) బ్రూక్స్ (బి) అలెన్ 6; సుందర్ (సి) స్మిత్ (బి) హోల్డర్ 33; చహర్ (సి) షై హోప్ (బి) హోల్డర్ 38; కుల్దీప్ (సి) షై హోప్ (బి) హోల్డర్ 5; సిరాజ్ (బి) హోల్డర్ 4; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 265. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–42, 4– 152, 5–164, 6–187, 7–240, 8–250, 9– 261, 10–265. బౌలింగ్: రోచ్ 7–0–39–0, జోసెఫ్ 10–1–54–2, స్మిత్ 7–0–36–1, హోల్డర్ 8–1– 34–4, అలెన్ 8–0–42–1, వాల్ష్ 10–0–59–2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: షై హోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 5; బ్రాండన్ కింగ్ (సి) సూర్యకుమార్ (బి) చహర్ 14; బ్రేవో (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 19; బ్రూక్స్ (సి) అయ్యర్ (బి) చహర్ 0; పూరన్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 34; హోల్డర్ (సి) రోహిత్ (బి) ప్రసి«ద్కృష్ణ 6; అలెన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 0; జోసెఫ్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 29; స్మిత్ (సి) ధావన్ (బి) సిరాజ్ 36; వాల్ష్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రోచ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (37.1 ఓవర్లలో ఆలౌట్) 169. వికెట్ల పతనం: 1–19, 2–25, 3–25, 4–68, 5–76, 6–77, 7–82, 8–122, 9–169, 10–169. బౌలింగ్: చహర్ 8–1–41–2, సిరాజ్ 9–1–29–3, ప్రసిధ్ కృష్ణ 8.1–1–27–3, కుల్దీప్ 8–0–51–2, సుందర్ 4–0–17–0. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! 𝗧𝗵𝗮𝘁 𝗪𝗶𝗻𝗻𝗶𝗻𝗴 𝗙𝗲𝗲𝗹𝗶𝗻𝗴 👏 😊 M. O. O. D as the @ImRo45-led #TeamIndia complete the ODI series sweep & lift the trophy. 🏆 🔝 #INDvWI @Paytm Scorecard ▶️ https://t.co/9pGAfWtQZV pic.twitter.com/B12RdFxzNx — BCCI (@BCCI) February 11, 2022 -
వేలంలో తగ్గేదేలే.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు చెన్నై సూపర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. రానున్న వేలంలో సీఎస్కే.. డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంకు ముందు డు ప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. “వేలంలో మా వ్యూహాన్ని బయటకు చెప్పడం సరైనది కాదు, అయితే సీఎస్కేకు ఎక్కువ కాలం సేవలందించిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము టార్గెట్ చేసుకున్న పేర్లును నేను బయటకు వెల్లడించాలి అనుకోవడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలు అందిచారు. అయితే రీటెన్షన్ నిబంధనల కారణంగా మేము వదులుకోవాల్సి వచ్చింది" అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సీఎస్కే వేలానికి ముందు రవీంద్ర జడేజా,మొయిన్ అలీ,ఎంస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్లను రీటైన్ చేసుకుంది. చదవండి: 6 సిక్స్లు, 2ఫోర్లు.. కేవలం 19 బంతుల్లోనే.. బౌలర్లకు చక్కలు! -
Ind vs Wi: భువీపై టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు.. బ్రేక్ తీసుకుని...
Ind Vs Wi Series: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఫామ్లేని ఆటగాళ్లను నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలన్నారు. వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలని సూచించారు. ఇక వెస్టిండీస్తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు స్పోర్ట్స్తో మాట్లాడిన గావస్కర్... ‘‘భువనేశ్వర్ కుమార్.... అతడి బౌలింగ్లో మునుపటి పస లేదు. పేస్లో పదును లేదు. భువీకి భవిష్యత్తు ఉందని అనిపించడం లేదు. అతడు మళ్లీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. భువనేశ్వర్ బ్రేక్ తీసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఇక భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్ ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయన్న అంశం గురించి గావస్కర్ చెబుతూ... ‘‘దీపక్ చహర్కు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలి. ఈ యువ ఆటగాడు అద్భుతంగా బంతిని స్వింగ్ చేయగలడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. భువీ స్థానంలో చహర్ను తుది జట్టులో ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాగా ఫిబ్రవరి 6 నుంచి విండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు అహ్మదాబాద్కు పయనమయ్యారు. ఇక ఇంగ్లండ్పై టీ20 సిరీస్తో విజయంతో జోరు మీదున్న పొలార్డ్ బృందం త్వరలోనే భారత్ చేరుకోనుంది. కాగా విండీస్తో వన్డే, టీ20 సిరీస్కు దీపక్ చహర్ ఎంపిక కాగా.. భువీ కేవలం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్ IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్కోచ్ -
మెగా వేలంలో అతడు రికార్డు ధర బద్దలు కొట్టడం ఖాయం!
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. అయితే స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉండడంతో వేలానికి ప్రాధన్యత సంతరించుకోంది. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో భారత ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈసారి ఐపీఎల్ వేలంలో చాలా మంది ఆటగాళ్ల కోసం జట్లు పోటీపడతాయి. అదే విధంగా భారత పేసర్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీపక్ చహర్ కోసం జట్లన్నీ పోటీపడబోతున్నాయి. అతడు అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలుస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. చహర్ పవర్ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. అతడు వికెట్ టేకింగ్ బౌలర్. ఒకవేళ పరుగులు ఎక్కువ ఇచ్చినా, వికెట్లు పడగొడతాడు. అతడు బ్యాటింగ్లో కూడా రాణించగలడు. కాబట్టి వేలంలో అత్యంత ఖరీదైన భారత బౌలర్గా దీపక్ చహర్ అవుతాడని" ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. కాగా గత సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న చహర్ను.. ఐపీఎల్-2022 మెగా వేలం ముందు సీఎస్కే వదిలేసిన సంగతి తెలిసిందే. చదవండి: India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా? IPL 2022- MS Dhoni: చెన్నై సూపర్కింగ్స్ సరికొత్త రికార్డు.. 7,600 కోట్లు.. భారతదేశంలో నంబర్ 1గా.. -
ఆ ఇద్దరి రాకతో హార్ధిక్ స్థానం గల్లంతు.. !
చాలా కాలంగా టీమిండియాను వేధిస్తున్న ఆల్రౌండర్ల కొరత శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్ల రాకతో తీరినట్లేనని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ ఇరు(టెస్ట్, వన్డే) ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారని పేర్కొన్నాడు. హార్ధిక్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన వీరు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణిస్తున్నారని, ఇది టీమిండియాకు శుభసూచకమని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో శార్ధూల్(43 బంతుల్లో 50 నాటౌట్, 38 బంతుల్లో 40 నాటౌట్), ఆఖరి వన్డేలో చాహర్(34 బంతుల్లో 54) బ్యాట్తో రాణించిన తీరు సంతృప్తికరంగా ఉందని, మున్ముందు కూడా వీరు ఇలాగే రాణిస్తే హార్ధిక్ స్థానం గల్లంతయ్యే ప్రమాదముందని పరోక్షంగా హెచ్చరించాడు. వీరిద్దరూ తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లుగా మారుతున్నారని కితాబునిచ్చాడు. గతంలో భారత-ఏ జట్టు శ్రీలంక పర్యటనలో దీపక్ చాహర్ బ్యాట్తో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. బౌలర్లుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేస్తూ, లోయర్ ఆర్డర్లో వీలైనన్ని పరుగులు చేసే ఆటగాడిని ఏ జట్టైనా కోరుకుంటుందని, ఇలాంటి ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని శార్ధూల్, చాహర్లకు పరోక్షంగా మద్దతు తెలిపాడు. ఆల్రౌండర్లు జట్టు జయాపజయాలు నిర్ధేశిస్తారనడంలో సందేహం లేదని, శార్ధూల్, చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు జట్టుకు మరింత సమతూకాన్ని తెస్తారని అభిప్రాయపడ్డాడు. మున్ముందు ఈ ఇద్దరికి తగినన్ని అవకాశాలు కల్పించి, జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచే దిశగా సాగుతామని పేర్కొన్నాడు. కాగా, వెన్నెముక గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఆల్రౌండర్ కోటాలో ఆటగాడు కరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం వెంకటేశ్ అయ్యర్ ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినప్పటికీ.. జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అతన్ని సరిగ్గా వాడుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: నిన్ను చూసి గర్వపడుతున్నా: చహర్ కాబోయే భార్య భావోద్వేగం -
నిన్ను చూసి గర్వపడుతున్నా: చహర్ కాబోయే భార్య భావోద్వేగం
‘‘ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి ప్రాక్టీసుకు వెళ్తావు. దేశం కోసం ఆడే ప్రతి మ్యాచ్లోనూ నీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తపనతో ఉంటావు. నిన్నటి మ్యాచ్లోనూ ఈ విషయాన్ని గమనించాను. క్లిష్ట పరిస్థితుల్లోనూ కఠిన శ్రమకు ఓర్చి.. అంకితభావంతో.. ఆట పట్ల నిబద్ధతతోనువ్వు ముందుకు సాగే విధానమే నిన్ను చాంపియన్గా నిలుపుతుంది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే, గెలిపించేందుకు నువ్వు చేసిన కృషి మాత్రం ఎల్లప్పుడూ దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. నీ దేశం కోసం... జట్టు కోసం ఎంతటి కఠిన యుద్ధానికైనా సిద్ధమని చెప్పావు. పట్టుదలగా నిలబడ్డావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. జై హింద్’’ అంటూ టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ కాబోయే భార్య జయా భరద్వాజ్ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఆట పట్ల దీపక్కు ఉన్న నిబద్ధతతను అక్షరాల రూపంలో పేర్చి అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో దీపక్ చహర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 34 బంతుల్లో 54 పరుగులు సాధించి... టీమిండియా ఆఖరి వరకు పోరాటం సాగించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 4 పరుగుల తేడాతో రాహుల్ సేన ఓటమి పాలు కావడంతో దీపక్ చహర్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడితో పాటే దక్షిణాఫ్రికాలో ఉన్న జయ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో కాబోయే భర్తను ప్రశంసిస్తూ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేయడం గమనార్హం. -
ind vs sa: దీపక్ గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న ప్లేయర్
దీపక్ చహర్.... దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో వన్డే ద్వారా తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఈ యువ ఆటగాడు. బంతితోనూ, బ్యాట్తనూ అద్భుతంగా రాణించాడు. తొలుత ప్రొటిస్ ఓపెనర్ జానేమన్ మలన్.. ఆ తర్వాత ఎయిడెన్ మార్కరమ్ వికెట్లు తీసి శుభారంభం అందించాడు చహర్. ఆ తర్వాత మ్యాచ్ చేజారిపోయినట్టే అని అభిమానులు ఉసూరుమంటున్న సమయంలో.. నేనున్నా అంటూ బ్యాట్తో అద్భుతం చేశాడు. అర్ధ సెంచరీతో రాణించి (34 బంతుల్లోనే 54 పరుగులు) భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ... లుంగి ఎంగిడి ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. చహర్ను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ చహల్, ప్రసిద్ క్రిష్ణ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్కు ముగింపు పడింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో విజయం చివరకు సౌతాఫ్రికానే వరించింది. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న చహర్ కన్నీళ్లు ఆపులేకపోయాడు. తన అద్భుత ఇన్నింగ్స్ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయిందనే బాధతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో 3-0తేడాతో భారత్ వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే. ఆఖరి వన్డేలో విజయంతో ప్రొటిస్ భారత్ను క్లీన్స్వీప్ చేసింది. ధావన్, కోహ్లి, చహర్ అర్ధ సెంచరీలు వృథాగా పోయాయి. ముఖ్యంగా చహర్ ఈ మ్యాచ్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... ‘‘దీపక్ మాకు గెలిచే అవకాశాన్ని ఇచ్చాడు. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరికి నిరాశ తప్పలేదు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Virat Kohli- Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి... Sport 💔 pic.twitter.com/3MPTptkc04 — Benaam Baadshah (@BenaamBaadshah4) January 24, 2022 Red ball is fun ☺️ #TeamIndia #BleedBlue pic.twitter.com/eRkF0PupYk — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 22, 2021 -
'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్కు అవకాశమిస్తే'
సౌతాఫ్రికా టూర్కు స్టాండ్బై ప్లేయర్గా ఉన్న దీపర్ చహర్ టీమిండియా క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను ముప్పతిప్పలు పెట్టాడు. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్లో జోరు పెంచింది. పుజారా, రహానే, ప్రియాంక్ పాంచల్, వృద్ధిమాన్ సాహాలకు దీపక్ చహర్ నెట్స్లో బౌలింగ్ చేశాడు. అయితే దీపక్ చహర్ కచ్చితమైన బౌన్స్, స్వింగ్, పేస్ పదునుకు బ్యాటింగ్ చేయలేక పూర్తిగా చేతులెత్తేశారు. చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు అతని బౌలింగ్ దాటికి నలుగురు ఒక్కోసారి క్లీన్బౌల్డ్ లేదా ఎల్బీ రూపంలో వెనుదిరగడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. '' దక్షిణాఫ్రికా పిచ్లు దీపక్ చహర్కు కరెక్ట్గా సరిపోతాయి. ..టెస్టు సిరీస్కు అతన్ని పరిగణలోకి తీసుకోండి''..'' మన బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టిన చహర్ సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించగలడు''.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇప్పటికే టీమిండియా తరపున టి20ల్లో ఆడిన దీపక్ చహర్ తన సత్తా ఏంటో చూపించాడు. ఇక కచ్చితమైన పేస్తో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం చహర్ స్పెషాలిటీ. ఐపీఎల్ 2021 సీజన్లోనూ దీపక్ చహర్ సీఎస్కే తరపున 15 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: David Warner: 27 రోజుల తర్వాత ట్వీట్ చూసి షాక్.. వార్నర్ క్షమాపణ Red ball is fun ☺️ #TeamIndia #BleedBlue pic.twitter.com/eRkF0PupYk — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 22, 2021 -
దీపక్ చాహర్కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Ind Vs Nz 3rd T20I: Rohit Sharma Salute To Deepak Chahar Six Video Goes Viral: ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా రాణించగలడని మరోసారి నిరూపించాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో చాహర్ 21 పరుగులు చేసి రోహిత్ సేన భారీ స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఓపెనర్ ఈషన్ కిషన్ ఔటయ్యక, భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఆడమ్ మిల్నే బౌలింగ్లో.. తొలి రెండు బంతుల్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు కొట్టగా, నాలుగో బంతిని లాంగ్ ఆన్దిశగా భారీ సిక్స్గా మలిచాడు. కాగా షార్ట్ బాల్ను దీపక్ చాహర్ సిక్సర్గా కొట్టినందుకు డగౌట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సెల్యూట్ చేశాడు. అఖరి ఓవర్లో చాహర్ ఏకంగా 19పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్కు నిర్దేశించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్ చంద్... ఫొటోలు వైరల్ pic.twitter.com/fwckFcqHrZ — Simran (@CowCorner9) November 21, 2021 -
Deepak Chahar: అక్కా తను ఎక్కడ... పాపం దీపక్.. మ్యాచ్ జరుగుతుండగానే!
IND vs NZ 1st T20 2021: Deepak Chahar Asks About His Fiancee to His Sister Malti During Match Video Goes Viral: ఎక్కడున్నా సరే.. ఏం చేస్తున్నా సరే.. నచ్చిన నెచ్చెలి పరిసరాల్లో ఉంటే ప్రేమికుడి దృష్టి ఆమెపైకి మళ్లడం సహజం. ఒకవేళ తను కనిపించకపోతే.. పక్కనే ఉన్న వాళ్లను ఆరా తీసి మరీ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.. టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ కూడా అదే పని చేశాడు మరి! సోదరి మాలతీ చహర్తో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చిన జయా భరద్వాజ్ కనిపించకపోయే సరికి కాస్త నిరాశ పడ్డాడు. వెంటనే.. ‘‘తను ఎక్కడ ఉంది’’ అంటూ అక్కను ఆరా తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మాలతీ చహర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు దీపక్ చహర్ను ఉద్దేశించి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పాపం దీపక్.. కాబోయే భార్య కోసం ఎలా ఆరా తీస్తున్నాడో చూడండి’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.. న్యూజిలాండ్తో జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాగా సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో భాగంగా తుదిజట్టులో దీపక్ చహర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 42 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ మార్టిన్ గప్టిల్ను పెవలియన్కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఐపీఎల్-2021 రెండో అంచె సందర్భంగా యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు తన ప్రేయసి జయకు ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs Nz 1st T20- Deepak Chahar: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్గా దిగుతా View this post on Instagram A post shared by Malti Chahar(Meenu) 🇮🇳 (@maltichahar) View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
గప్టిల్ సీరియస్ లుక్.. దీపక్ చహర్ స్టన్నింగ్ రియాక్షన్
Martin Guptill Vs Deepak Chahar Stunning Looks.. టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మార్టిన్ గప్టిల్, బౌలర్ దీపక్ చహర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చహర్ వేసిన తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. అప్పుడు గప్టిల్ దీపక్ చహర్ను చూస్తూ సీరియస్గా లుక్ ఇచ్చాడు. అయితే తర్వాతి బంతిని కూడా గప్టిల్ సిక్స్గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో గప్టిల్ కథ ముగిసింది. ఈసారి దీపక్ చహర్ వంతు వచ్చింది. పెవిలియన్ వెళ్తున్న గప్టిల్వైపు దీపక్ సీరియస్ లుక్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Deepak chahar is known for this 👀pic.twitter.com/TyZMPrD9pY — VIVO IPL 2022 | Wear a Mask 😷 (@IPL2022_) November 17, 2021 -
Ind Vs Nz 1st T20: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్గా దిగుతా
Deepak Chahar hilariously wants to open the batting: పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమైంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుధవారం కివీస్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక రోహిత్ శర్మకు కెప్టెన్గా.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్కు ఇదే మొదటి సిరీస్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్లతో పాటు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో తుదిజట్టులో ఎవరు ఆడతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. కాగా ఇప్పటికే రెగుల్యర్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఉండగా... ఒకవేళ తుదిజట్టులోకి ఎంపికైతే ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్కు ఆ ఛాన్స్ ఇస్తారేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీపక్ చహర్ సోషల్ మీడియా షేర్ చేసిన పోస్టు, అందుకు జతచేసిన క్యాప్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘ఈరోజు రాత్రి నా హోం గ్రౌండ్లో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు అంతా సిద్ధమైంది’’అంటూ చహర్ రోహిత్తో మాట్లాడుతున్న ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీంతో.. బహుశా బౌలింగ్లో చహర్ఓ పెనింగ్ చేస్తాడేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఆగ్రాకు చెందిన దీపక్ చహర్ రాజస్తాన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. రాజస్తాన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న గ్రెగ్ చాపెల్ దీపక్లో ఫాస్ట్బౌలర్కు ఉండాల్సిన లక్షణాలు లేవని కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ 2010-11లో హైదరాబాద్తో మ్యాచ్లో కేవలం 10 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాయాలు వెంటాడినా.. చిక్కులను అధిగమించి.. 2018లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో వన్డేల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న దీపక్ చహర్ ఈ సీజన్లో జట్టు చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తన కెరీర్లో చహర్ ఇప్పటి వరకు మొత్తంగా 1686 పరుగులు చేశాడు. ఇందులో 166 ఫోర్లు, 74 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్! Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్ కావడమే ఎంతో సంతోషం! All set to open the innings at my home ground tonight. 😃 pic.twitter.com/Rr8Z4VfKhK — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) November 17, 2021 -
దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని హంగామా చూడాల్సిందే..!
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం తన నెచ్చెలి జయా భరద్వాజ్కు లైవ్లో ప్రేమను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అనంతరం సీఎస్కే యాజమాన్యం ఈ లవ్ జంట కోసం అదిరిపోయే పార్టీని అరేంజ్ చేసింది. తొలుత వీరిరువురు కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోగా.. ఆ తర్వాత అసలు సిసలైన సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ధోని నేతృత్వంలో రైనా, జడేజా, శార్ధూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్పలు చాహర్ను కేక్, డ్రింక్స్తో ముంచెత్తారు. ఈ వేడుకల్లో ధోని, రైనాల కూతుళ్లు తెగ సందడి చేయగా, ధోని భార్య సాక్షి.. జయా భరద్వాజ్ను హత్తుకుని విష్ చేసింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది. జోడి బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే జట్టు నిన్నటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసం ధాటికి సీఎస్కే 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, చెన్నైకు ఇదివరకే ఫ్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కావడంతో మ్యాచ్ నామమాత్రంగా సాగింది. 13 మ్యాచ్ల్లో 13 వికెట్లతో దీపక్ చాహర్ సీఎస్కే విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?! -
Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!
Deepak Chahar Girlfriend Name And Details: నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం... ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం.. ఓ ప్రేమికుడి జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఏముంటాయి! చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగితేలుతున్నాడు. మనసిచ్చిన అమ్మాయిని మనువాడబోయే మధుర క్షణాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా.. దీపక్ స్టేడియంలోనే తన ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం, ఆమె కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను దీపక్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, చాలా మంది ఆ అమ్మాయిని విదేశీయురాలిగా పొరబడుతున్నారు! ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? విదేశీయురాలు కాదు.. దీపక్ చహర్ ప్రేమించిన అమ్మాయి పేరు జయా భరద్వాజ్. ఆమె ఢిల్లీకి చెందిన అమ్మాయి. మోడల్, వీజే, ఎమ్టీవీ రియాలిటీ షో స్ప్లిట్స్విల్లా సీజన్ 2 విజేత సిద్ధార్థ్ భరద్వాజ్(34) చెల్లెలు. ఈ విషయాలను దీపక్ చహర్ సోదరి మాలతీ చహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరదలు దొరికేసింది.. ‘‘మొత్తానికి నా సోదరుడు చెప్పేశాడు. భాభీ దొరికేసింది. తన పేరు జయా భరద్వాజ్. విదేశీయురాలు కాదు.. ఢిల్లీ అమ్మాయి’’ అంటూ ఓ ఫొటోను మాలతీ షేర్ చేశారు. లవ్బర్డ్స్ అంటూ తమ్ముడూ, మరదలిపై ప్రేమను కురిపించారు. కాగా జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్లు సమాచారం. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే... పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొందింది. ఈ మ్యాచ్లో చహర్ ఒక వికెట్ తీశాడు. స్కోర్లు: చెన్నై: 134/6 (20) పంజాబ్: 139/4 (13). సోదరితో దీపక్ చహర్ చదవండి: MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..! View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) Showering lots of 💛 & 🎂 for the Cherry couple! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/t3a3bDIyzD — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021 -
CSK Vs PBKS: లైవ్లో లవ్ ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్..
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం సీఎస్కే ఆల్రౌండర్ దీపక్ చాహర్ అందరూ చూస్తుండగా లైవ్లో తన గర్ల్ఫ్రెండ్కు రింగ్ తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమ్మాయి తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. చాహర్, అతని ప్రేయసి ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) స్టాండ్స్లో ఇరువురి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ తంతుని మొత్తం క్రీడా జగత్తు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియా తెగ వైరలవుతోంది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రికెట్ ప్రపంచం ఈ ప్రేమ పావురాలకు విషెస్ తెలిపింది. అయితే కొందరు మాత్రం చాహర్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. మ్యాచ్పై కాన్సంట్రేట్ చేయకుండా లైవ్లో ఇలాంటి పని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ చాహర్, అతని ప్రేయసికి ఈ రోజు జీవితకాలం గుర్తుండిపోతుంది. కాగా, చాహర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి విదేశీయురాలిగా తెలుస్తోంది. చదవండి: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. చారిత్రక సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ దూరం -
T20 World Cup 2021: మంచి ఫామ్లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు
Ian Bishop Comments On Deepak Chahar: టీ20 ప్రపంచకప్ జట్లలో మార్పులకు అక్టోబరు 10 వరకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో తాజా ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్-2021 రెండో అంచెలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టీ20 వరల్డ్కప్ జట్టులోని వారి స్థానాలను శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లతో భర్తీ చేయడం బెటర్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలోనూ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్ను ఆడిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ భువీ, దీపక్ మధ్య పోలికలు, తాజా ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ... ‘‘టీ20 జట్టులో ఎంపిక కాని... దీపక్ చహర్ దురదృష్టవంతుడనే చెప్పాలి. భువీ గత ప్రదర్శన, అనుభవం రీత్యా అతడికే సెలక్టర్లు ఓటు వేసి ఉంటారన్న విషయాన్ని అర్థం చేసుకోగలను. కానీ.. ప్రస్తుతం దీపక్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరే ఇతర బౌలర్కు సాధ్యం కాని విధంగా బాల్ను స్వింగ్ చేస్తున్నాడని నా అభిప్రాయం. ఇంకో విషయం.. డెత్ ఓవర్లలో భువీ స్పెషలిస్టు అన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఐపీఎల్ సీజన్లో అతడి కంటే దీపక్ చహర్ మెరుగ్గా బౌల్ చేస్తున్నాడని అంగీకరించక తప్పదు’’ అని పేర్కొన్నాడు. భువీ స్థానంలో దీపక్ను ఎంపిక చేస్తే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్.. 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువీ... ఆడిన 8 మ్యాచ్లలో 8.53 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో వీరికి అవకాశం ఇస్తే మంచిదేమో! Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి -
భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో!
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే అవసరం. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాకు ఎంపికైన 15 మంది ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ అక్టోబరు 10వరకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఆటగాళ్లు చేసే ప్రదర్శన బట్టి వారి స్థానాలు మారిపోయే అవకాశం ఉందంటూ సెలక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్లు ఫామ్లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో కీలకంగా భావిస్తున్న మిడిలార్డర్లోఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లు ఫామ్ పేలవంగా ఉండడంతో వారి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాటర్స్కు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా బౌలింగ్ విభాగంలోనూ ఆ కలవరం మొదలైంది. బుమ్రా, షమీలకు తోడుగా ఎంపిక చేసిన భువనేశ్వర్ కుమార్ అనుకున్నంత ఫామ్ కనబరచడం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న భువీ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో 8.53 ఎకానమీ రేటుతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. పేస్ బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటకీ అతని ఫిట్నెస్పై నమ్మకం లేదు. మ్యాచ్ జరిగేవరకు అతను బౌలింగ్ చేస్తాడా లేదా అనేది అనుమానమే. దీంతో భువీకి ప్రత్యామ్నాయంగా మరో పేస్ బౌలర్ అవసరం కనిపిస్తుంది. స్టాండ్ బై ప్లేయర్లలో శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్ లాంటి నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నప్పటికీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్లాంటి బౌలర్లకు అవకాశమిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. దీపక్ చహర్: వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం దీపక్ చహర్ ప్రత్యేకత. బ్యాటర్ పొరపాటున బంతి వదిలేశాడో క్లీన్ బౌల్డ్ అవడం ఖాయం. మంచి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరే దీపక్ ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కేకు ప్రధాన బౌలర్గా వ్యవహరిస్తున్నాడు. టి20 ప్రపంచకప్కు సంబంధించి భువీ స్థానంలో సరిగ్గా సరిపోయే పేస్ బౌలర్గా దీపక్ కనిపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించడంలో దీపక్ చహర్ స్పెషలిస్ట్. సీఎస్కే తరపున 10 మ్యాచ్లాడిన చహర్ 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.అంతేగాక టీమిండియాకు అవసరమైనప్పుడు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు. చదవండి: Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది మహ్మద్ సిరాజ్: టీమిండియా బౌలర్గా మహ్మద్ సిరాజ్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. సిరాజ్ కెరీర్లో ఆసీస్ పర్యటన ఒక టర్నింగ్ పాయింట్. అక్కడినుంచి అతను టీమిండియాలో కీలక బౌలర్గా మారిపోయాడు. కానీ ఎందుకనో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికచేయలేదు. ప్రస్తుత ఫామ్ దృశ్యా సిరాజ్ సేవలు టీమిండియాకు చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. టెస్టుల్లో స్థిరమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న సిరాజ్ అవకాశమొస్తే టి20ల్లోనూ చెలరేగే సత్తా ఉన్నవాడే. తన చూపులతో ప్రత్యర్థి బ్యాటర్స్ను భయపెట్టే సిరాజ్ ఆరంభ, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా అడ్డుపడుతూనే కీలక సమయంలో వికెట్లు తీయగలడు. ఇక ఐపీఎల్లో కోహ్లి సారధ్యంలోని ఆర్సీబీలో ఉన్న సిరాజ్పై కెప్టెన్ ఎంతో నమ్మకముంచాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడు వికెట్లే తీసినప్పటికీ ఆర్సీబీ ప్రధాన బౌలర్గా కనిపిస్తున్నాడు. ఆవేశ్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం ప్రధాన బౌలర్గా ఉన్నాడు. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ వైవిధ్యమైన బౌలింగ్తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు రాబట్టడం ఆవేశ్ ఖాన్ ప్రత్యేకత. అదే అతన్ని ఢిల్లీకి ప్రధాన బౌలర్ను చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7.55 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
హార్ధిక్ పాండ్యా పనైపోయింది.. ఆ ఇద్దరికి అవకాశాలివ్వండి..!
ముంబై: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న హార్ధిక్ను సన్నీ ఏకి పారేశాడు. కెరీర్ ఆరంభంలో బంతితో, బ్యాట్తో చెలరేగిపోయిన హార్ధిక్లో ఇప్పుడు ఆ జోరు కనపడటం లేదని, ఫిట్నెస్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. హార్దిక్కు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. ఇక హార్ధిక్ పనైపోయిందని, అతని స్థానాన్ని దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్లతో రీప్లేస్ చేయాలని సూచించాడు. చాహర్, భువీలకు తగినన్ని అవకాశాలిచ్చి వారిని మేటి ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని బీసీసీఐని అభ్యర్ధించాడు. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్ రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను చాహర్, భువీ అద్భుతమైన బ్యాటింగ్తో గట్టెక్కించారని, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగిన ఈ ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్స్లా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో చాహర్ 82 బంతుల్లో సిక్స్, 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేయగా, భువీ.. 28 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు స్కోర్ చేశారని, అంతకుముందు బౌలింగ్లోనూ వీరిద్దరూ రాణించారని కితాబునిచ్చాడు. కేవలం ఈ మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగానే వీరికి మద్దతు తెలపడం లేదని, గతంలో వీరి ఆల్రౌండ్ ప్రదర్శనలను బేరీజు వేసుకునే ఈ నిర్ణయానికొచ్చానని, తన అభిప్రాయాన్ని సమర్ధించుకున్నాడు. -
India Vs Srilanka: ప్రయోగాలు చేస్తారా!
కొలంబో: బౌలర్ దీపక్ చహర్ అసమాన బ్యాటింగ్తో రెండో వన్డేలో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. రెండు రోజుల విరామం అనంతరం శ్రీలంకతో సిరీస్లో చివరిదైన మూడో వన్డేకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ యోచిస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. మార్పులు ఉంటాయా! ఇప్పటికే సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో రిజర్వ్ బెంచ్ను పరీక్షించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగితే టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు. పృథ్వీ షా స్థానంలో మరో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ సామ్సన్ కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరీస్లో విశేషంగా రాణిస్తో న్న స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్లకు విశ్రాంతి ఇచ్చి రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్లను ఆడించొచ్చు. అంతేకాకుండా భారత్ తన లోపాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... సూర్య కుమార్, మనీశ్ పాండేలు జట్టును ఆదుకున్నారు. చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ ఆడకుండా ఉంటే భారత్కు ఓటమి తప్పేదికాదు. వీటితో పాటు డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుం టున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే మూడో వన్డేలో భారత్కు విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు రెండో వన్డేలో అంచనాలకు మించి ఆడిన లంకేయులు ఒక దశలో మ్యాచ్ను గెలిచేలా కనిపించారు. దీపక్, భువనేశ్వర్ల భాగస్వామ్యం ఆ జట్టుకు గెలుపును దూరం చేసింది. ఈ సిరీస్ ద్వారా శ్రీలంక జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని తేలింది. వీరు అనుభవం గడిస్తే శ్రీలంక జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, అసలంక, కెప్టెన్ దసున్ షనక, కరుణరత్నే, హసరంగ ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తున్నారు. వీరందరూ చివరి వన్డేలోనూ ఆడితే భారత్కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీలంక జట్టుకు జరిమానా రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్లో భాగం కావడంతో శ్రీలంక జట్టుకు ఒక పాయింట్ కోత విధించారు. ఆర్టికల్ 16.12.2 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఓవర్కు పాయింట్ చొప్పున కోత విధిస్తారు. -
నాడు క్రికెట్కు పనికిరాడన్నారు.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెన్సేషనల్ బ్యాటింగ్తో (69 నాటౌట్) టీమిండియాకు అద్భుత విజయాన్నందించిన దీపక్ చాహర్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న వేళ భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చాహర్.. తన 16వ ఏట (2008) రాజస్థాన్ క్రికెట్ అకాడమీలో చోటు దక్కించుకున్న సమయంలో అకాడమీ డైరెక్టర్గా ఉన్న గ్రెగ్ చాపెల్.. అతని బౌలింగ్ సామర్థ్యాన్ని శంకిస్తూ, క్రికెట్కు పనికిరాడని రిజెక్ట్ చేశాడని పేర్కొన్నాడు. గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తి బౌలింగ్లో పసలేదని, క్రికెట్లో భవిష్యత్తు లేదని చెప్పడంతో చాహర్ నైరాశ్యంలోకి కూరుకుపోయాడని, అయితే తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ సహకారంతో తిరిగి గాడిలో పడ్డాడని వివరించాడు. కాగా, నాడు చాపెల్.. దీపక్ చాహర్పై చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశీ కోచ్లు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మకూడదని, వాళ్లు చెప్పిన విషయాలన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఎత్తు కారణంగా నాడు క్రికెట్కు పనికిరాడన్న వ్యక్తి.. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడని, అదే చాపెల్ మాటలు నమ్మి సెలెక్టర్లు చాహర్కు అవకాశం ఇచ్చుండకపోయుంటే టీమిండియా ఓ గొప్ప ఆల్రౌండర్ సేవలను కోల్పోయేదని తెలిపాడు. ఇకనైనా బీసీసీఐ.. విదేశీ కోచ్లపై మోజును తగ్గించుకోవాలని, వాళ్ల మాటలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పోత్సహించాలని సూచించాడు. విదేశీ కోచ్లతో పోలిస్తే, స్వదేశీ కోచ్లకు భారత యువ క్రికెటర్లపై మంచి అవగాహన ఉంటుందని, అందుకే బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు స్వదేశీ కోచ్లకు తగినన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో వన్డేలో చాహర్ తన ఆల్రౌండ్ ప్రతిభతో భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. -
ఆ నిర్ణయం ద్రవిడ్దే.. అందువల్లే గెలవగలిగాం: భువీ
కొలంబో: ఉత్కంఠ పోరులో ఏడో స్థానంలో బరిలోకి దిగి అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన దీపక్ చాహర్(82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ, టీమిండియా వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వికెట్లు వడివడిగా పడుతున్న సమయంలో చాహర్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలన్న నిర్ణయం కోచ్ రాహుల్ ద్రవిడ్దేని, అందువల్లే తాము మ్యాచ్ గెలవగలిగామని తెలిపాడు. మరపురాని ఇన్నింగ్స్తో చాహర్ ఏడో స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి బంతి వరకు ఆడాలని తాము ముందుగానే నిర్ధేశించుకున్నామని పేర్కొన్నాడు. ద్రవిడ్ కోచింగ్లో భారత్-ఏ తరఫున చాహర్ భారీగా పరుగులు చేశాడని, అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్కు ముందే తెలుసని, అందుకే చాహర్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపాడని వెల్లడించాడు. ద్రవిడ్ పెట్టుకున్న నమ్మకాన్ని చాహర్ కూడా వమ్ము చేయలేదని అన్నాడు. తాను కూడా రంజీల్లో చాహర్ బ్యాటింగ్ను చూశానని, అందేవల్లే అతనితో సమన్వయం చేసుకోగలిగానని తెలిపాడు. కాగా, చాహర్ తన 5 వన్డేల కెరీర్లో ఎప్పుడు కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగలేదు. ఇదిలా ఉంటే, చాహర్ సూపర్ ఇన్నింగ్స్కు తోడు సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ, భువీ(28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు)తో కీలక 84 పరుగుల భాగస్వామ్యం తోడవ్వడంతో టీమిండియా మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాటింగ్లో రెచ్చిపోయిన చాహర్ (2/53), భువీ(3/54) బౌలింగ్లోనూ రాణించారు. ఇరు జట్ల మధ్య నామకార్ధమైన మూడో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(జులై 23) జరగనుంది. -
IND vs SL: బ్రదర్.. ఇప్పుడు నువ్వు ఒక స్టార్
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు దీపక్ చహర్ శ్రీలంకతో జరిగిన వన్డేలో (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడాడు. చహల్ ఇన్నింగ్స్పై అతని సోదరి మాల్తీ చహర్ ట్విటర్ వేదికగా వినూత్న రీతిలో స్పందించింది. ''బ్రదర్ ఈ ఇన్నింగ్స్తో నువ్వు సాధించావు.. ఈ ఒక్క ఇన్నింగ్స్తో ప్రతీ భారత అభిమాని మనసులను గెలుచుకున్నావు. నువ్వు ఇలాగే ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నా. కీప్ స్మైలింగ్ మై లవ్ లీ బ్రదర్'' అంటూ ట్వీట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. And you did it brother 😘 Won the match for India and heart of every Indian❤️ @deepak_chahar9 You are ⭐️.. keep shining😘#indiavssrilanka #teamindia #bleedblue pic.twitter.com/WpLVejJCWh — Malti Chahar🇮🇳 (@ChaharMalti) July 20, 2021 -
మ్యాచ్ విజయం; ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
కొలంబో: శ్రీలంకపై రెండో వన్డే విజయం అనంతరం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూంలోఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ విజయం చాలా గొప్పదని.. మ్యాచ్లో అందరు మంచి ప్రదర్శన కనబరిచారని తెలిపాడు. ద్రవిడ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ వైరల్గా మారింది. ద్రవిడ్ వ్యాఖ్యలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. ద్రవిడ్ మాట్లాడుతూ.. ''వాళ్లు ఈ మ్యాచ్లో బాగా ఆడారు.. కానీ సరైన సమయంలో మనం ఒక చాంపియన్ టీమ్లా ఆడాం. ఓటమి కోరల్లో నుంచి బయటపడేందుకు దృడ సంకల్పంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుంజుకున్నాం. ఇది గొప్ప విజయం.. వెల్డన్ బాయ్స్. ఒక దశలో ఒత్తిడి లోనైన నేను మ్యాచ్ ఎటు పోతుందో అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ విజయం మనకు ఇంకో పది మ్యాచ్ల వరకు మంచి బూస్టప్ ఇస్తుంది. ఇక ఒత్తిడిని తట్టుకుంటూ చహర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి భువనేశ్వర్ సహకరించిన తీరు కూడా బాగుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేద్దాం'' అంటూ చెప్పుకొచ్చాడు. దీపక్ చహర్ను అభినందిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. From raw emotions to Rahul Dravid's stirring dressing room speech 🗣️🗣️@28anand & @ameyatilak go behind the scenes to get you reactions from #TeamIndia's 🇮🇳 thrilling win over Sri Lanka in Colombo 🔥 👌 #SLvIND DO NOT MISS THIS! Full video 🎥 👇https://t.co/j2NjZwZLkk pic.twitter.com/iQMPOudAmw — BCCI (@BCCI) July 21, 2021 -
ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది కల.. ఈరోజుతో నెరవేరింది
కొలంబో: ''ఈ ప్రదర్శనే నేను కలగన్నది.. ఈరోజుతో నెరవేరింది.. అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాను.. దేశానికి విజయం అందించడం గర్విస్తున్నా'' అంటూ దీపక్ చహర్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్తో అభిమానులకు హీరోగా మారిపోయాడు. దీపక్ చహర్ ఈ ఇన్నింగ్స్ను టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడాడే కాబట్టే అంత క్రేజ్ వచ్చింది. అయినా టీమిండియా ఆడుతోంది.. శ్రీలంకతోనే కదా అని చిన్నచూపు మాత్రం చూడొద్దు. వాస్తవానికి లంక జట్టు ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాతో సమానంగా నిలిచింది. దానికి ఉదాహరణే రెండో వన్డే.. మొదట బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ విజృంభించి 193 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దీపక్ చహర్, భువనేశ్వర్తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం నమోదు చేసి భారత్కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న చహర్ స్పందించాడు. 'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్ ద్రవిడ్ సర్ చెప్పారు. ఆయన కోచింగ్లో నేను భారత్-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. నా ఇన్నింగ్స్ సమయంలో కోచ్ ద్రవిడ్ డ్రింక్స్ బాయ్గా ఉన్న నా సోదరుడు రాహుల్ చహర్కు బ్యాటింగ్ పరంగా కొన్ని కీలక సూచనలు ఇచ్చి పంపించాడు. డ్రింక్స్ విరామం సమయంలో రాహుల్ నా దగ్గరకు వచ్చి ద్రవిడ్ సూచనలు అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా.ఈరోజుతో అది నెరవేరింది.' అని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Will never forget this moment #teamindia #dream . Thank you so much for your wishes means a lot ☺️🙏 #keepsupporting pic.twitter.com/y0iGLAaaKY — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) July 21, 2021 -
IND Vs SL: టీమిండియా సూపర్ విక్టరీ; అభిమానుల ట్రోల్స్ వైరల్
కొలంబో: రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా విక్టరీ తర్వాత అభిమానులు చేసిన మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దీపక్ చహర్, భువనేశ్వర్ల ఇన్నింగ్స్, లంక ఓటమి, భువీ 3093 బంతుల తర్వాత మళ్లీ నో బాల్ సంధించడం లాంటి విషయాలపై ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. దీపక్ చహర్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ను '' ధావన్ కెప్టెన్సీలో ధోని అంటూ.. 3093 బంతుల తర్వాత భువీ నోబాల్ వేయడాన్ని (3093-1).. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అండర్ టేకర్ వ్రెసల్మేనియా విజయాలతో పోల్చుతూ.. కామెంట్లు పెట్టారు. వీలైతే మరు ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. #INDvSL Bhubaneswar Kumar Overstepped After 3093Balls Meanwhile Bumrah:- pic.twitter.com/5LxhjHs5m0 — बिहारी 🖤🥀 (@Shitt_posterr) July 20, 2021 Deepak Chahar under Dhawan's captaincy.#INDvSL pic.twitter.com/7hYRdY66mf — ᵃ (@aqqu___) July 20, 2021 Mickey Arthur In Last 5 Overs :-#INDvSL pic.twitter.com/mqBKZkncfR — Sami.Sajjad (@SamiSajjad15) July 20, 2021 Deepak Chahar entering into dressing room be like 👏 #INDvSL pic.twitter.com/is62dgLlgQ — Prince Pandey🍁🦜 (@princepandey_) July 20, 2021 -
సరిగ్గా నాలుగేళ్ల క్రితం; ఇదే శ్రీలంక.. అప్పుడు భువీనే
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలకపాత్రపోషించగా.. చివర్లో భువనేశ్వర్ కుమార్ 19 నాటౌట్తో అతనికి సహకరించాడు. ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా అచ్చం ఇదే తరహాలో 2017లో ఇదే శ్రీలంకపై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో కూడా భువీనే ఉండడం విశేషం. ధోనితో కలిసి 8వ వికెట్కు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడమే గాక అర్థసెంచరీతో రాణించాడు. ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. 47 ఓవర్లలో 231 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా.. లంక బౌలర్ అఖిల ధనుంజయ(6 వికెట్లు) దెబ్బకు భారత జట్టు 22 ఓవర్లలో 131 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలోనే కెప్టెన్ ధోని అద్భుతం చేశాడు. భువనేశ్వర్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ధోని 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడమేగాక జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ సిరీస్ను భారత్ 5-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక టీమిండియా ఆడిన వన్డేల్లో ఎనిమిదో వికెట్కు ధోని-భువీల సెంచరీ భాగస్వామ్యం తొలి స్థానంలో ఉండగా.. తాజాగా దీపక్ చహర్, భువీల మధ్య నమోదైన 84 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది. ఇక 2009లో ఆసీస్తో జరిగిన వన్డేలో ప్రవీణ్ కుమార్, హర్భజన్ జంట ఎనిమిదో వికెట్కు 84 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇక మ్యాచ్ అనంతరం వైస్ కెప్టెన్ హోదాలో భువీ మాట్లాడుతూ.. '' ఈరోజు మ్యాచ్ అచ్చం నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్ను తలపించింది. 276 పరుగులు చేధనలో 193 పరుగుల వద్ద నేను క్రీజులోకి అడుగుపెట్టాను. ఏం జరిగినా సరే దీపక్ చహర్కు అండగా చివరి వరకు నిలబడాలని గట్టిగా అనుకున్నా.. అంతా మ్యాజిక్లా జరిగిపోయింది. నేను చేసింది 19 పరుగులే కావొచ్చు.. కానీ నా కెరీర్కు ఇది చాలా బూస్టప్ను ఇస్తుంది. 2017లో జరిగిన మ్యాచ్లోనూ అంతే.. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ధోని భయ్యాకు సహకరిస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాను.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రమైన చివరి వన్డే జూలై 22న జరగనుంది. Highest 8th wicket partnerships for India in ODIs - 1. MS Dhoni, Bhuvneshwar Kumar - 100* vs Srilanka, 2017 2. Deepak Chahar, Bhuvneshwar Kumar - 84* vs Srilanka, 2021#INDvSL #deepakchahar #bhuvaneshwarkumar #RahulDravid #MSDhoni pic.twitter.com/TAXgaar3Hq — Athul Sreevatsan (@AthulSreevatsan) July 20, 2021 DEEPAK CHAHAR HAS DONE THE IMPOSSIBLE. TAKE A BOW! India win the match & the series! 🤩 Final ODI, Friday on Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #SLvIND pic.twitter.com/fiujunPQQs — Sony Sports (@SonySportsIndia) July 20, 2021 -
దీపక్ చహర్ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం
కొలంబో: దీపక్ చహర్ అద్భుతం చేశాడు. ఒంటిచేత్తో టీమిండియాకు పరాభవాన్ని తప్పించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ విఫలమైన చోట నేనున్నానంటూ భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. భారత్కు బ్రేక్ ఇచ్చిన చహల్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (42 బంతుల్లో 36; 6 ఫోర్లు) మరోసారి శుభారంభం చేశారు. ఓవర్కు ఆరు పరుగుల చొప్పున సాధించారు. ఈ క్రమంలో కొన్ని చూడచక్కని బౌండరీలు సాధించారు. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 59/0గా నిలిచింది. భారత్కు చహల్ బ్రేక్ ఇచ్చాడు. 14వ ఓవర్ వేసిన అతను వరుస బంతుల్లో మినోద్, రాజపక్స (0)లను అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన అవిష్క ఫెర్నాండోను భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు సాధించడంతో శ్రీలంక 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 195/6 గా నిలిచింది. ఈ దశలో క్రీజులో ఉన్న అసలంక, కరుణరత్నే దూకుడుగా ఆడారు. ఏడో వికెట్కు 50 పరుగులు జోడించారు. పేలవ ఆరంభం ఛేజింగ్ను భారత్ పేలవంగా ఆరంభించింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్ కిషన్ (1), శిఖర్ ధావన్ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్కు చేరారు. ఈ దశలో ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్ తీసుకున్నారు. అయితే మనీశ్ పాండేను (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) దురదృష్టం వెంటాడింది. షనక బౌలింగ్లో సూర్యకుమార్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడగా... బంతి బౌలర్ చేతిని తాకుతూ నాన్స్ట్రయికింగ్ ఎండ్లోని వికెట్లను గిరాటేసింది. అదే సమయంలో పరుగు కోసం పాండే క్రీజును వదిలి ముందుకు రావడంతో రనౌట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో హార్దిక్ (0) కూడా అవుటవ్వడంతో భారత్ 116 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో సూర్యకుమార్, కృనాల్ ఉండటంతో భారత్ గెలుపుపై ధీమాగానే కనిపించింది. సందకన్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన సూర్య వన్డేల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీగా వెనుదిరగాడు. కాసేపటికే కృనాల్ (35; 3 ఫోర్లు) హసరంగ బౌలింగ్లో బౌల్డ్ అవ్వడంతో భారత్కు ఓటమి తప్పదనిపించింది. దీపక్ వీరోచిత పోరాటం ఎనిమిదో నంబర్లో వచ్చిన దీపక్ తనలోని బ్యాట్స్మన్ను పరిచయం చేశాడు. కృనాల్ ఉన్నంతసేపు డిఫెన్స్ ఆడిన దీపక్... అతను అవుటయ్యాక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. భువనేశ్వర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) సాయంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. సందకన్ బౌలింగ్లో సిక్సర్ బాదిన దీపక్... ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమం లో 64 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కండరాలు పట్టేయడంతో చికిత్స తీసుకున్న దీపక్ నొప్పిని భరిస్తూనే ఫోర్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అజేయమైన 8వ వికెట్కు భువనేశ్వర్తో కలిసి దీపక్ 84 పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 50; భానుక (సి) మనీశ్ (బి) చహల్ 36; రాజపక్స (సి) ఇషాన్ కిషన్ (బి) చహల్ 0; ధనంజయ (సి) ధావన్ (బి) చహర్ 32; చరిత్ అసలంక (సి) (సబ్) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 65; షనక (బి) చహల్ 16; హసరంగ (బి) చహర్ 8; కరుణరత్నే (నాటౌట్) 44; చమీర (సి) (సబ్) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 2; సందకన్ (రనౌట్) 0; కసున్ రజిత (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 275. వికెట్ల పతనం: 1–77, 2–77, 3–124, 4–134, 5–172, 6–194, 7–244, 8–264, 9–266. బౌలింగ్: భువనేశ్వర్ 10–0– 54–3, దీపక్ చహర్ 8–0–53–2, హార్దిక్ 4–0–20–0, చహల్ 10–1–50–3, కుల్దీప్ 10–0–55–1, కృనాల్ 8–0–37–0. భారత ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) హసరంగ 13; ధావన్ (ఎల్బీ) (బి) హసరంగ 29; ఇషాన్ (బి) రజిత 1; పాండే (రనౌట్) 37; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) సందకన్ 53; హార్దిక్ (సి) ధనంజయ (బి) షనక 0; కృనాల్ (బి) హసరంగ 35; దీపక్ చహర్ (నాటౌట్) 69; భువనేశ్వర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో 7 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–28, 2–39, 3–65, 4–115, 5–116, 6–160, 7–193. బౌలింగ్: రజిత 7.1–0–53–1, చమీర 10–0–65–0, హసరంగ 10–0–37–3, సందకన్ 10–0–71–1, కరుణరత్నే 6–1–26–0, షనక 3–0–10–1, ధనంజయ 3–0–10–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఫ్యామిలీ మ్యాన్-3'కి ప్రిపేర్ అవుతున్నావా బ్రో..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా.. తన ఐపీఎల్ సహచరుడు, సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. చాహర్.. తాజాగా తన న్యూలుక్కి సంబంధించిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేయగా, రైనా స్పందించాడు. ఈ ఫోటోలో చాహర్.. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2లో టెర్రరిస్ట్ క్యారెక్టర్ను పోలి ఉన్నాడని, ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 3 ఆన్ ద వే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం రైనా చేసిన ఈ కామెంట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. మరోవైపు చాహర్ అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఫ్యామిలీ మ్యాన్-2లో లీడ్ రోల్ శ్రీకాంత్.. ఫ్యామిలీ అడ్వైజర్ను కలిసే సీన్ చాహర్కు సరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే చాహర్.. గజినీలో ఆమీర్ ఖాన్ను పోలి ఉన్నాడంటున్నారు. ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేనియా నడుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ వెబ్ సిరీస్.. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్-2లో టాలీవుడ్ హీరోయిన్ సమంతా కీలక పాత్ర పోషించింది. నెగటీవ్ రోల్ అయినప్పటికీ.. రాజీ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సెకండ్ సీజన్ను తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కించపరిచే సీన్లున్నాయని, అందకే ఈ సినిమాను నిషేధించాలని వారు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ను తెలుగు వారు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ అండ్ డీకే(రాజ్ నిడిమోరి, దాసరి కృష్ణ) డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో సురేశ్ రైనా, దీపక్ చాహర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాహర్కు చోటు దక్కలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. చదవండి: విశ్వనాథన్ ఆనంద్తో తలపడనున్న ఆమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా? -
గబ్బర్ ఉన్నాడుగా.. ఇక వేరేవాళ్లు ఎందుకు?
ఢిల్లీ: టీమిండియా జూలైలో శ్రీలంక పర్యటనకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కోచ్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా కెప్టెన్ అయ్యేవాడు. కానీ అతను గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమవడంతో కెప్టెన్సీ రేసుకు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ధావన్కు కెప్టెన్సీ ఇవ్వాలంటూ అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు మద్దతు ఇచ్చారు. తాజాగా సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ గబ్బర్కే ఓటు వేశాడు. ధావన్కు కెప్టెన్సీలో మంచి అనుభవముందని పేర్కొన్నాడు. ''కెప్టెన్గా శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా అతను టీమిండియాకి ఆడుతున్నాడు. అలానే టీమ్లో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ కూడా. కాబట్టి.. శిఖర్ ధావన్ని కెప్టెన్గా ఎంపిక చేయడమే సమంజసం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతడ్ని గౌరవిస్తారు. కెప్టెన్ని ఆటగాళ్లు గౌరవించాలి. ఇక ధావన్కు గతంలో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.''అని చహర్ చెప్పుకొచ్చాడు. ఇక దీపక్ చహర్ శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా దీపక్ చహర్ ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కు తరపున దుమ్మురేపాడు. సీఎస్కేకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 11 వికెట్లతో మెరిశాడు. ఇక బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా రెండో జట్టు జులై 13 నుంచి 27 వరకూ లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మరోవైపు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న కోహ్లీ సేన ముందు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: జడేజా పేసర్ అయితే బాగుండు.. మాకు చాన్స్ వచ్చేది శ్రీలంక పర్యటనకు కోచ్గా ద్రవిడ్ -
'చహర్.. నీ నుంచి ఇంకా చాలా రావాలి'
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. తొలి మ్యాచ్ ఓటమి తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలతో చెన్నై జోరు మీద ఉంది. బ్యాటింగ్లో బలంగా కనిపిస్తున్న సీఎస్కే బౌలింగ్లో దీపక్ చహర్ కీలకంగా మారాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో విఫలమైన చహర్ తర్వాతి మూడు మ్యాచ్ల్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 4-1-13-4తో తన కెరీర్లోనే బెస్ట్ స్పెల్ నమోదు చేసిన చహర్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ 4 వికెట్లు తీసి మొత్తం 8 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న చహర్ ఐపీఎల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో ఓపెనర్ గిల్ను ఔట్ చేయడం ద్వారా ఈ మార్క్ను అందుకున్నాడు. ఈ సందర్భంగా దీపక్ చహర్ సోదరి మాలతీ చహర్ తమ్ముడి ప్రదర్శనపై ట్విటర్ వేదికగా స్పందించింది. ''ఈ సీజన్లో చహర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 50 వికెట్ల మార్క్ను అందుకున్నందుకు కంగ్రాట్స్.. ఇంకా ఇలాంటివి నీ నుంచి చాలా రావాలి '' అంటూ ఎంకరేజ్ చేస్తూ క్యాప్షన్ జత చేసింది. మాలతీ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ''నీలాంటి అక్క దొరకడం చహర్ చేసుకున్న అదృష్టం.. సూపర్ మాలతీ.. చహర్కు నీ ఎంకరేజ్ చాలా అవసరం.. '' అంటూ కామెంట్లు చేశారు. ఇక 2016 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన దీపక్ చహర్ తొలి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి సీజన్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన చహర్ రెండో సీజన్లో మూడు మ్యాచ్లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే 2018లో దీపక్ చహర్ను రిటైన్ చేసుకున్న సీఎస్కేకు మూడో టైటిల్ దక్కడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్ సీజన్ దీపక్ చహర్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సీజన్లో ఫైనల్కు చేరిన సీఎస్కేకు 17 మ్యాచ్లు ఆడిన చహర్ 22 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో చహర్ 12 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే తొలిసారి ప్లే ఆఫ్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 25న ముంబై వేదికగా ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: సీఎస్కేకు సపోర్ట్ చేసిన ఈ మోడల్ ఎవరో తెలుసా? సాహోరే చహర్ బ్రదర్స్.. ఇద్దరూ సేమ్ టూ సేమ్ And many more to come 😘 @deepak_chahar9 https://t.co/15CRmKtgt8 — Malti Chahar🇮🇳 (@ChaharMalti) April 23, 2021 -
సీఎస్కేకు సపోర్ట్ చేసిన ఈ మోడల్ ఎవరో తెలుసా?
ముంబై: మాలతీ చహర్.. దీపక్ చహర్ అక్క. ఈమె సీఎస్కేకు వీరాభిమాని. గత సీజన్లలో కూడా సీఎస్కేకు సపోర్ట్ చేసింది మాలతీ. సీఎస్కే ఆడే మ్యాచ్లకు తరచు హాజరై సందడి చేసింది. అప్పుడే ఈ అమ్మాయి ఎవరు అని కెమెరాకు చిక్కగా ఆమె దీపక్ చహర్కు సిస్టర్ అని తేలింది. మోడలింగ్ రంగంలో రాణిస్తున్న మాలతీ త్వరలో బాలీవుడ్లో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కరోనా కారణంగా ఈ సీజన్లో స్టేడియాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎస్కేపై తన అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. యెల్లో స్కర్ట్, కాళ్లకు ప్యాడ్లు, చేతిలో యెల్లో కలర్లో ఉన్న బాటన్ పట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు విపరీతమైన లైక్లు రావడమే కాకుండా సీఎస్కే ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. బుధవారం(ఏప్రిల్ 21వ తేదీ) కేకేఆర్-సీఎస్కేల మ్యాచ్కు ముందు ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు మాలతీ చహర్. నిన్నటి మ్యాచ్లో తమ్ముడు దీపక్ చహర్ నాలుగు వికెట్లు రాణించి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by Malti Chahar(Meenu) 🇮🇳 (@maltichahar) -
సాహోరే చహర్ బ్రదర్స్.. ఇద్దరూ సేమ్ టూ సేమ్
చెన్నై: మొన్న కోల్కతా నైట్రైడర్స్పై ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం.. నిన్న పంజాబ్ కింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ. ఈ రెండు మ్యాచ్లకు ఎటువంటి సంబంధం లేకపోయినా, ఆయా జట్లను గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు పొందిన వారికి మాత్రం సంబంధం ఉంది. ఒకరు రాహుల్ చహర్ అయితే మరొకరు దీపక్ చహర్. వీరిద్దరూ అన్నదమ్ములు. రాహుల్ చహర్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ అయితే, దీపక్ చహర్ ఫాస్ట్ బౌలర్. నిన్న(ఏప్రిల్16వ తేదీ) పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దీపక్ చహర్ తన కెరీర్లో గుర్తిండిపోయే గణాంకాల్ని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం మరొక విశేషం. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్తో గేల్ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్ను షార్ట్పిచ్ బాల్తో పెవిలియన్కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో దీపక్ చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై గెలుపులో రాహుల్ చహర్దే కీలక పాత్ర. ముంబై ఓటమి దిశగా పయనిస్తున్నప్పుడు గేమ్ చేంజర్గా మారిపోయాడు రాహుల్. నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లను సాధించాడు రాహుల్ చహర్. ఇక్కడ 6.80 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం మరొక విశేషం. ముంబై నిర్దేశించిన 153 పరుగుల టార్గెట్ ఛేదనలో కేకేఆర్ తొలుత గెలుపు దిశగా పయనించింది. కాగా, చహర్ వేసిన ప్రతీ ఓవర్లోనూ వికెట్ సాధిస్తూ ముంబై విజయంపై ఆశలు పెంచాడు. 9 ఓవర్ ఐదో బంతికి శుబ్మన్ గిల్ను ఔట్ చేసిన రాహుల్.. ఆపై 11 ఓవర్ మూడో బంతికి త్రిపాఠిని పెవిలియన్కు పంపాడు. అటు తర్వాత 13 ఓవర్ ఐదో బంతికి ఇయాన్ మోర్గాన్ ఔట్ చేశాడు. ఇక 15 ఓవర్ ఐదో బంతికి నితీష్ రానాను ఔట్ చేసి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ గెలుపు తీసుకొచ్చాడు. ఈ నాలుగు వికెట్లతో తిరిగి తేరుకోలేకపోయిన కేకేఆర్ 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్లో రాహుల్, దీపక్ చాహర్లు తలో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులుకు కూడా దక్కించుకుని సాహోరే చహర్ బ్రదర్స్ అనిపించుకుంటున్నారు. ఇక్కడ చదవండి: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్.. వరస్ట్ నుంచి బెస్ట్! -
‘నువ్వు మంచి బౌలర్వి భాయ్, కానీ నెక్ట్స్ మ్యాచ్ ఆడకు’
ముంబై: ‘‘ఆరోజు నేను గదికి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా చెక్ చేసుకుంటున్నా. అప్పుడే ఒక అబ్బాయి నుంచి మెసేజ్ వచ్చింది. ‘‘భాయ్ మీరు మంచి బౌలర్ అని నాకు తెలుసు. అయితే, నాదొక విన్నపం.. మీరు తదుపరి మ్యాచ్లో మాత్రం ఆడకండి’’ అని మెసేజ్ పెట్టాడు. నిజానికి, ఆటగాళ్ల మీద ఎవరి అంచనాలు వారికి ఉండటం సహజం. ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకుంటారు. అందుకే ఆ అబ్బాయి నాకు అలా సందేశం పంపాడు. అయితే, నేను ఒకవేళ ఈరోజు ఆడకపోయి ఉంటే ఇలాంటి ఒక ప్రదర్శన చూసే అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన చెత్త ప్రదర్శన చేస్తాడన్న ముద్ర వేయకూడదు. అలాంటి వాళ్లకు మద్దతుగా నిలవండి’’ అని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో దీపక్ చహర్.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి ప్రదర్శనపై కొంతమంది విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై, పంజాబ్ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో చహర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పంజాబ్ కీలక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు శార్దూల్ ఠాకూర్తో ముచ్చటిస్తూ ఢిల్లీ మ్యాచ్ ఫలితం తర్వాత సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అభిమానులకు అంచనాల మేరకు రాణించేందుకు కృషి చేస్తానని, అయితే, ఒక్క ప్రదర్శనతో తన విలువేమిటో నిర్ణయించడం సరికాదని చహర్ హితవు పలికాడు. చదవండి: నాకైతే ఫీల్డ్లో 11 మంది జడ్డూలు కావాలి: చహర్ దటీజ్ ధోని.. వైరల్ అవుతున్న ఫొటో -
నాకైతే ఫీల్డ్లో 11 మంది జడ్డూలు కావాలి: చహర్
ముంబై: ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తనూ ఒకడు. నా బౌలింగ్లో ఎన్నో క్యాచ్లు అందుకున్నాడు. నాకైతే మైదానంలో 11 మంది జడ్డూలు ఉంటే బాగుండు అనిపిస్తుంది’’ అంటూ చెన్నై సూపర్కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ సహచర ఆటగాడు రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ స్థానంలో గనుక జడ్డూ భాయ్ ఉంటే, తొలి ఓవర్లోనే గేల్ వికెట్ లభించేదని అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ తమ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చహర్ (4/13)కు ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డు లభించింది. అయితే, ఈ మ్యాచ్లో చహర్ వికెట్లతో రాణిస్తే రవీంద్ర జడేజా తన మెరుపులాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ను రనౌట్ చేసిన విధానం, ఆ తర్వాత చహర్ బౌలింగ్(ఐదో ఓవర్)లో క్రిస్ గేల్ను అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపించడం పట్ల ఫిదా అవుతున్నారు. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను అవుట్ చేయడంలో జడ్డూ ప్రధాన పాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చహర్ మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించాడు. కాగా తొలి ఓవర్లో చహర్ వేసిన బంతిని గేల్ షాట్ ఆడగా, గాల్లోకి లేచిన బంతిని రుతురాజ్ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం..‘‘ ఇండియాలోని అత్యుత్తమ ఫీల్డర్ తను. ఇదే నిజం’’ అంటూ రవీంద్ర జడేజాను ఆకాశానికెత్తాడు. India’s greatest ever fielder .. @imjadeja .. #Fact — Michael Vaughan (@MichaelVaughan) April 16, 2021 The name is Ravindra Jadeja ! 🔥❣️@imjadeja jaddu 💛#CSKvsPBKS pic.twitter.com/oFSqacnSId — vellamanasυ🎭 ˢʳᵉᵉʳᵃᵐ࿐ (@sreeramvellaman) April 16, 2021 చదవండి: సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ అదరగొట్టిన చహర్: 4–1–13–4 స్కోర్లు: పంజాబ్ కింగ్స్ 106/8 (20) చెన్నై సూపర్ కింగ్స్ 107/4 (15.4) -
అదరగొట్టిన చహర్: 4–1–13–4
టి20 మ్యాచ్ల్లో బౌలర్లు అదరగొట్టే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో మాత్రం బౌలర్ల హవా నడుస్తోంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ప్రధాన పేసర్ దీపక్ చహర్ తన వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను హడలెత్తించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్తో క్లీన్బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్తో గేల్ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్ను షార్ట్పిచ్ బాల్తో పెవిలియన్కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దాంతో సీజన్లో తొలి హ్యాట్రిక్ను తీసే చాన్స్ను చహర్ మిస్ చేసుకున్నాడు. హాక్ఐలో బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. ఇక్కడ చదవండి: సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు -
రెండో టీ20: భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు!
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్తో జరుగబోయే రెండో మ్యాచ్లో రోహిత్ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్లో అంతగా ప్రభావం చూపని లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ల స్థానాల్లో లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్, మీడియం పేస్ బౌలర్ దీపక్ చాహర్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్ షాట్కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి? కాగా, ఫామ్లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ రీ ఎంట్రీ, రాహుల్, దీపక్ చాహర్లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్, రాహుల్ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్ను కనబర్చిన రాహుల్ చాహర్ను, తొలి మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్ స్థానంలో పేసర్ దీపక్ చాహర్కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ -
బ్రదర్ కాస్కో.. నిన్ను టీజ్ చేస్తా: రాహుల్ చాహర్
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ముంబైపై సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. కాగా, ఆ తర్వాత చతికిలబడ్డ సీఎస్కే వరుస ఓటములను చవిచూసి టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ఈరోజు(శుక్రవారం) ముంబై ఇండియన్స్-సీఎస్కేల మధ్య షార్జా వేదికగా రెండో అంచె మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో సీఎస్కేపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ముంబై ఇండియన్స్. (‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’) ఈ మేరకు ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ మాట్లాడుతూ.. నేటి మ్యాచ్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. అదే సమయంలో సీఎస్కే తరఫున ఆడుతున్న అన్న దీపక్ చాహర్ను కూడా టీజ్ చేస్తానంటున్నాడు. దీనిలో భాగంగా రాహుల్ చాహర్ ఒక వీడియోలో మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. దీన్ని ముంబై ఇండియన్స్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘సీఎస్కేపై మేము మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం మా అన్న దీపక్ చాహర్ను టీజ్ చేయడం ఖాయం. నాకు 2018 బాగా గుర్తుంది. నన్ను మా బ్రదర్ దీపక్ చాహర్ టీజ్ చేశాడు. అతని జట్టు సీఎస్కే గెలిచిన తర్వాత నన్ను ఏడిపించాడు. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది. 2019లో మేము సీఎస్కేపై గెలిచిన తరవఆత దీపక్ను టీజ్ చేశా. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం నాకు వస్తుందని ఆశిస్తున్నా. బ్రదర్ కాస్కో.. నేను టీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ రాహుల్ చాహర్ పేర్కొన్నాడు. కాగా, తామిద్దరం ఎప్పుడు కలిసిన ఒకరి ఆట గురించి మరొకరం మాట్లాడుకోమని రాహుల్ చెప్పాడు. కానీ తాము జట్ల కోసం వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు అన్నను కూడా ప్రత్యర్థి ఆటగాడు మాదిరిగానే చూస్తానన్నాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?) -
‘ఆ ఫాస్ట్ బౌలర్పైనే ధోని ఆశలు’
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) బలహీనంగానే కనబడుతోంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్లు జట్టుకు దూరం కావడంతో సీఎస్కే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా వీక్గానే కనబడుతోంది. బ్యాటింగ్లో రైనా స్థానాన్ని మురళీ విజయ్తో పూడ్చాలని చూస్తున్న సీఎస్కే.. బౌలింగ్లో పరుగులు నియంత్రణ చేసేది ఎవరూ అనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇమ్రాన్ తాహీర్ వంటి స్పిన్నర్ సీఎస్కేకు అందుబాటులో ఉన్నా భజీ స్థానాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలనే కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత మొత్తం 13 మంది సీఎస్కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు దీపర్ చహర్, రుతురాజ్ గ్వైక్వాడ్లు కరోనా బారిన పడ్డారు. దీపక్ చహర్ కరోనా నుంచి కోలుకున్నా రుతురాజ్ గ్వైక్వాడ్ మాత్రం ఇంకా హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. బ్యాట్స్మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన గ్వైక్వాడ్పై కూడా సీఎస్కే ఆశలు పెట్టుకుంది. గ్వైక్వాడ్ ఏమన్నా భజ్జీ ప్రత్యామ్నాయం అవుతాడా అనే విషయాన్ని కూడా సీఎస్కే పరిశీలిస్తోంది.(చదవండి: ఆర్సీబీ.. ఈ జట్టుతో ఎలా నెట్టుకొస్తారు?) కాగా,. సీఎస్కే బౌలింగ్లో ప్రధాన ఆయుధం పేసర్ దీపక్ చహర్ అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి సీఎస్కేకు చాహర్ కీలకం కానున్నాడన్నాడు. కాకపోతే కడవరకూ అతని ఫిట్నెస్ ఎంతవరకూ కాపాడుకుంటాడు అనేది ఇక్కడ పరిశీలించాన్నాడు. ‘ చాహర్పై ధోని భారీ ఆశలు పెట్టుకున్నాడు. చాహర్పై ధోని చాలా ఎక్కువగా ఆధారపడతాడనే విషయం నాకు తెలుసు. కొత్త బంతిని చహర్ పంచుకోవాల్సి ఉంది. చాలాకాలం నుంచి అందరు క్రికెటర్లు తరహాలనే చహర్ కూడా సరైన ప్రాక్టీస్ లేదు. దానికి తోడు ఐపీఎల్ కోసం దుబాయ్కు వెళ్లిన తర్వాత కరోనా బారిన పడి హెమ్ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రాక్టీస్ కూడా తగ్గింది. 2018లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో చహర్ సభ్యుడు. ప్రస్తుతం సీఎస్కేకు చహర్ చాలా ముఖ్యమైన ఆటగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో లైన్ అండ్ లెంగ్త్ను దొరకబుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతేడాది డిసెంబర్లో చహర్ వెన్నుగాయంతో బాధపడ్డాడు. ఏప్రిల్ వరకూ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు అతను ఫిట్నెస్ను కాపాడుకుని కడవరకూ నిలబడాలి. ధోని ఎక్కువ ఆశలు పెట్టుకున్న బౌలర్ చహర్ సీజన్ అయ్యేంతవరకూ జట్టుతో ఉంటేనే సీఎస్కే పోటీలో ఉంటుంది’ అని స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో అగార్కర్ తెలిపాడు.(చదవండి: ‘కోహ్లిని ఔట్ చేయడానికి ఒక్క బాల్ చాలు’) -
కుటుంబంతో ఉంటే మాస్క్ ధరిస్తామా?
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడేందుకు వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)లో కరోనా కలకలం రేగిన సంగతి తెలసిందే. దీపక్ చహర్ సహా ఇతర చెన్నై ఫ్రాంచైజీ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా వీరు వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. దీపక్ సోదరుడు, ముంబై ఇండియన్ లెగ్స్పిన్నర్ రాహుల్ చహర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోమని రాహుల్ చెప్పిన ప్రతీసారి దీపక్ వాటిని తేలిగ్గా కొట్టిపరేశాడు. ఇంట్లో ఉంటే ఈ దూరాలేంటి కుటుంబంతో ఉంటే మాస్క్ ధరించడమేంటి? అని చాలా లైట్ తీసుకున్నాడు. (సీఎస్కేలో 10మందికి కరోనా పాజిటివ్!) ఈ నేపథ్యంలో దీపక్కు కరోనా సోకడంతో ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ వైరల్గా మారింది. ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా దాని ప్రభావం ఇతరులపై పడుతుందంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనాకు గురైన దీపక్కు సోదరుడు రాహుల్ బాసటగా నిలిచాడు. ధైర్యంగా ఉండు..త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులో ఇప్పటికే 10 మంది సీఎస్కే సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (వెంటాడుతున్న కరోనా : ఆలస్యం కానున్న ఐపీఎల్) -
కరోనా ‘ఆట’ మొదలైంది!
ఐపీఎల్ భారత్లో లేట్ అయినా... యూఏఈలో లేటెస్ట్గా మొదలవుతుందిలే అనుకుంటే మాయదారి మహమ్మారే అక్కడా మొదలైంది. మూడు సార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్కింగ్స్ మెడకు కోవిడ్ చుట్టుకుంది. జట్టు బృందంలో భాగమైన పది మందికి కరోనా సోకింది. సీఎస్కే టీమ్నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా... వీరిలో పేసర్ దీపక్ చహర్ ఉన్నట్లు సమాచారం. లీగ్ ప్రారంభానికి తగినంత సమయం ఉన్నా... తొలిసారి లీగ్కు చెందిన క్రికెటర్ కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. మున్ముందు ఇది ఎంత వరకు వెళుతుందనే ఆందోళన కూడా కనిపిస్తోంది. అబుదాబీ: చెన్నై సూపర్కింగ్స్ను మహమ్మారి చుట్టేసింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో... ఇక ప్రాక్టీస్, మైదానంలో మెరుపులే తరువాయి అనుకుంటున్న దశలో... ఇక్కడి యూఏఈ వర్గాలు, భారత్లోని బీసీసీఐ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేసే పిడుగు వచ్చి పడింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్ చహర్కు కరోనా సోకడం లీగ్కు ముప్పు లేకపోయినా కాస్త ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఆటగాళ్ల క్వారంటైన్ రోజుల్ని పెంచారు. చెన్నై కోవిడ్ కేసులపై బయటకు తెలిసిపోయినా... సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. గురువారం పరీక్షా ఫలితాలు వచ్చినా మిన్నకుండిపోయింది. ఎంతమందికి వైరస్ సోకింది.... ఎవరా సభ్యులు అనే విషయాలేవీ తెలపకుండా తాత్సారం చేసింది. దీంతో అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియలేదు. అయితే ఇక్కడి వర్గాల సమాచారం మేరకు 10 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులున్నట్లు తెలిసింది. ఒకరు ఆటగాడైతే మిగతావారంతా జట్టు సహాయ సభ్యులేనని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో బాధితులున్నప్పటికీ ఆటగాడు ఒక్కడే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఈ 10 మంది ఇంకెంత మందికి అంటించారోననే బెంగ బీసీసీఐని ఆందోళన పరుస్తోంది. చెన్నై ఫ్రాంచైజీ ఇప్పుడు ప్రాక్టీస్కు కాకుండా హోటల్ గదులకే పూర్తిగా పరిమితం కానుంది. ధోని సహా ఆటగాళ్లంతా సెప్టెంబర్ మొదటి వారంలోనే నెట్స్కు వెళ్లే అవకాశముంది. లీగ్ 19న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కిం కర్తవ్యం? ఐపీఎల్ టోర్నీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ప్రకారం పాజిటివ్ బాధితులంతా వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలి. అలాగే వాళ్లతో కాంటాక్టు అయిన వ్యక్తుల్ని గుర్తించి వారిని కూడా క్వారంటైన్లో ఉంచాలి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో ఉన్న వారిని బయో సెక్యూర్ (జీవ రక్షణ బుడగ) నుంచి రెండు వారాల పాటు వెలుపలే వుంచి చికిత్స అందజేస్తారు. ఈ సమయంలో మిగతా ఆటగాళ్లను, ఐపీఎల్, ఫ్రాంచైజీ వర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవరాదు. లక్షణాలున్న బాధితుల్ని టోర్నమెంట్ అనుబంధ ఆసుపత్రికి తరలిస్తారు. ఇక లక్షణాలు లేకపోయినా సరే ప్రాక్టీస్కు అనుమతించరు. 14 రోజుల పాటు పూర్తిగా గదులకే పరిమితం కావాలి. ఈ ఐసోలేషన్ సమయం పూర్తయ్యాక రెండు సార్లు వరుస పరీక్షల్లో అది కూడా పీసీఆర్ టెస్టుల్లోనే (ర్యాపిడ్ కిట్ టెస్టు కాకుండా) నెగెటివ్ రిపోర్ట్ రావాలి. అప్పుడే బుడగ లోపలికి తీసుకుంటారు. ఇక ఎవరికి వారే.. తాజా ఉదంతంతో బీసీసీఐ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఐసోలేషన్లో ఉన్నవారెవరూ ఒకరితో ఒకరు మాట్లాడేందుకు కూడా ఇక మీదట అనుమతించరు. కాంటాక్టు అయ్యేవారి వివరాల్ని పక్కగా నిక్షిప్తం చేస్తారు. దీంతో మహమ్మారి బారిన పడిన వారి కాంటాక్టు వ్యక్తుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించే అవకాశముంటుంది. రిస్కు రేటు తగ్గించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కృషి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ అధికారగణం నిర్ణయించుకుంది. -
‘ధోని గేమ్ మార్చాడు.. పట్టు కోల్పోయాడు’
చెన్నై: టీమిండియా సీనియర్ ఆటగాడు, చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దీపక్ చహర్ తెలిపాడు. క్రికెట్తో పాటు ఫుట్బాల్ ఆటపై ధోని అమితాసక్తి కనబరుస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మోస్ట్ పాపులర్ గేమ్ పబ్జీలో ధోని అత్యంత నిష్ణాతుడని సీఎస్కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఆటల్లో టేబుల్ టెన్నిస్ లేక పబ్జీలలో ఒకటి ఎంచుకోవాలంటే ఏది ఎంచుకుంటావని చహర్ను సీఎస్కే ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. ’ఏ మాత్రం ఆలోచించకుండా పబ్జీ అనే చెబుతాను. ఎందుకుంటే ఇప్పటికీ పబ్జీ ఆడతాను. ధోని కూడా చాలా బాగా ఆడేవాడు. నేను, ధోనితో పాటు మరికొంతమంది ఆన్లైన్లో ఈ గేమ్ ఆడేవాళ్లం. అయితే ధోని మరో గేమ్కు మారాడు. కాల్ ఆఫ్ డ్యూటీ(సీఓడీ)తో ప్రస్తుతం బిజీగా ఉంటున్నాడు. దీంతో అతడికి పబ్జీపై పట్టు కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు’ అంటూ దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఇక డిసెంబర్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్ తర్వాత ఈ పేస్ బౌలర్ టీమిండియా తరుపున ఆడలేదు. అయితే ఐపీఎల్ను సద్వినియోగం చేసుకొని మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని ఆశించాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు ‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ -
‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా రోహిత్
దుబాయ్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గార్ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారానికి ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 98 బంతుల్లో 84 పరుగులు చేసిన అతను తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు. 2019లో వన్డేల్లో 12, టెస్టుల్లో 22 వికెట్లు కూడా తీసిన స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనను ఐసీసీ గుర్తించింది. ఈ ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచ కప్లో ఏకంగా ఐదు సెంచరీలు సహా 81 సగటుతో రోహిత్ 648 పరుగులు సాధించాడు. అత్యుత్తమ టెస్టు ఆటగాడి అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్కు దక్కింది. 2019లో కమిన్స్ 59 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చాహర్ సూపర్... టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శనగా భారత బౌలర్ దీపక్ చాహర్ మ్యాజిక్ స్పెల్ ఎంపికైంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చాహర్ 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ఉత్తమ అంపైర్గా రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఎంపికయ్యాడు. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు మార్నస్ లబ్షేన్ (ఆస్ట్రేలియా)కు దక్కింది. కోహ్లి క్రీడా స్ఫూర్తి... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ప్రవర్తన ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ప్రేక్షకులు స్టీవ్ స్మిత్ను హేళన చేస్తుండగా... వద్దని వారించిన కోహ్లి చప్పట్లతో ప్రోత్సహించమని కోరి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ‘ఎన్నో ఏళ్లుగా మైదానంలో తప్పుడు ప్రవర్తన కారణంగానే చెడ్డపేరు తెచ్చుకున్న నాకు ఈ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మన అభిమానులు స్మిత్ను అలా చేయడం ఆ క్షణంలో తప్పనిపించింది. అందుకే కలగజేసుకున్నాను’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఐసీసీ టెస్టు జట్టు కోహ్లి (కెప్టెన్), మయాంక్, లాథమ్, లబ్షేన్, స్మిత్, స్టోక్స్, వాట్లింగ్, కమిన్స్, స్టార్క్, వాగ్నర్, లయన్ ఐసీసీ వన్డే జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్, షై హోప్, బాబర్ ఆజమ్, విలియమ్సన్, స్టోక్స్, బట్లర్, స్టార్క్, బౌల్ట్, షమీ, కుల్దీప్ -
పసందైన విందు
ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది. సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్... భారత్లో పింక్బాల్ టెస్టు... ఓపెనింగ్లో రో‘హిట్స్’... బౌలింగ్లో దీపక్ చాహర్ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్తో హీరోగా మార్చేశాయి. క్రికెట్ లోకానికి పసందైన విందును అందించాయి. ఇంగ్లండ్దే వన్డే ప్రపంచం క్రికెట్ ఇంగ్లండ్లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్రౌండర్ బెన్ స్టోక్స్! పురిటిగడ్డపై కొత్త చాంపియన్ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్ ఓవర్’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్’తో ఇంగ్లండ్ విజేత అయ్యింది. ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్ టైటిల్ పోరులో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్’ ఓవర్ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్’ ఐసీసీ పుణ్యమాని చెక్ రిపబ్లిక్ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్లో అసోసియేట్, అఫిలియేట్ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ (నెదర్లాండ్స్ 39 ఆలౌట్), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్ శర్మ, మిల్లర్) ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి. టెస్టు ‘క్లాసిక్స్’... సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్)తో కలిసి కుశాల్ పెరీరా (153 నాటౌట్) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్లోనూ ఆసీస్పై ఇంగ్లండ్ బ్యాట్స్మన్ స్టోక్స్ (135 నాటౌట్) కూడా ఆఖరి వరుస బ్యాట్స్మన్ జాక్ లీచ్ (1 నాటౌట్)తో కలిసి అదే పోరాటం చేశాడు. చాహర్ చెడుగుడు... బంగ్లాదేశ్తో భారత్లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్లో దీపక్ చాహర్ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్ కోల్పోని రికార్డు భారత్ది. దీంతో కీలకమైన మ్యాచ్లో భారత్ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్ 3.2–0–7–6 బౌలింగ్ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్ ఓడిపోని రికార్డు భారత్ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. ‘పేస్’ ఇయర్... ఈ సంవత్సరం ‘పేస్’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్ బౌలర్లే. ఓవరాల్గా టాప్–5 బౌలర్లలో నంబర్వన్ బౌలర్ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్ (కివీస్) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్ (కివీస్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), భువనేశ్వర్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ భరతం పట్టారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్లో అతను 10 మ్యాచ్ల్లోనే 27 వికెట్లు తీశాడు. పదేళ్ల తర్వాత... సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో పాక్లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది. టెస్టుల్లో లబ్షేన్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ‘టాప్’ లేపాడు. 11 మ్యాచ్లే ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్మన్ 17 ఇన్నింగ్స్ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్మన్ లబ్షేన్ కావడం విశేషం. స్టీవ్ స్మిత్ (8 మ్యాచ్ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ‘టాపర్’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డేల్లో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్లాడిన ఈ ఓపెనర్ 27 ఇన్నింగ్స్ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్లోనే చేయడం విశేషం. బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్వెల్ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్తో భారత్ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆసీస్ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది. భారత్లో ఎట్టకేలకు డేనైట్ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్కతా ఈడెన్గార్డెన్స్లో బంగ్లాదేశ్తో ఫ్లడ్లైట్ల టెస్టు జరిగింది. వీడ్కోలు వీరులు... ఈ ఏడాది పలువురు స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్ యువరాజ్ సింగ్ జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
పంత్పై ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: వరుస వైఫల్యాలతో సతమవుతున్న టీమిండియా యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్తో కాస్త ఉపశమనం లభించింది. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో రెచ్చి పోయిన పంత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. విశాఖ వన్డేలో ధాటిగా టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. అయితే చివరి వన్డేలో మాత్రం ఘోరంగా నిరుత్సాహపరిచాడు. అయితే ఓవరాల్గా ఈ సిరీస్లో పర్వాలేదనిపించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కేవలం పంత్ బ్యాటింగ్ లోపాలపై మాట్లాడే ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా అతడి కీపింగ్పై కూడా పెదవివిరిచాడు. కీపింగ్లో పంత్ మరింత మెరుగుపడాలని సూచించాడు. ఈ క్రమంలో స్పెషలిస్టు వికెట్ కీపింగ్ కోచ్ పర్యవేక్షణలో పంత్కు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనలలో పంత్ కీపింగ్లో అంతగా ఆకట్టుకోలదని పేర్కొన్నాడు. అయితే అంతగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదన్నాడు. పంత్ కీపింగ్ నుంచి తాము హై లెవల్ స్టాండర్డ్స్ ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇందుకోసమే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్లో పంత్ కాస్త మెరుగుపడినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి వన్డేలో కష్టకాలంలో ఉన్న టీమిండియాను శ్రేయస్ అయ్యర్తో కలిసి పంత్ ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ల కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మీడియా సమావేశంలో పై విధంగా మాట్లాడాడు. అంతేకాకుండా దీపక్ చాహర్ గాయంపై కూడా చీఫ్ సెలక్టర్ స్పందించాడు. చాహర్ గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. చాహర్కు సుదీర్ఘ విశ్రాంతి అవసరమని తెలిపాడు. దీంతో చాహర్ను ఐపీఎల్ తర్వాతనే సెలక్షణ్ కోసం పరిగణలోకి తీసుకుంటామన్నాడు. అయితే బౌలర్ల గాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నాడు. యువ బౌలర్లతో రిజర్వ్బెంచ్ బలంగా ఉందన్నాడు. చదవండి: పంత్కు పూనకం వచ్చింది.. అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం! -
ఐపీఎల్ వరకూ కష్టమే..!
న్యూఢిల్లీ: ఇటీవల వెస్టిండీస్తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఆ తర్వాత మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఆ గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు వెన్నుగాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీపక్ చాహర్కు కూడా అదే గాయం బారిన పడగా కొన్ని నెలల పాటు విశ్రాంతి తప్పకపోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రాబోవు సీజన్ ఆరంభం నాటి వరకూ చాహర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడుటం లేదు. శ్రీలంక, ఆసీస్ జట్లతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లకు భారత జట్టును ఎంపిక చేసిన క్రమంలో సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. దీపక్ చాహర్ ఏప్రిల్ వరకూ అందుబాటులోకి రావడం కష్టమనే అనుమానం వ్యక్తం చేశాడు. ‘ ఏప్రిల్ వరకూ దీపక్ చాహర్ జట్టుకు అందుబాటులోకి రాకపోవచ్చు. అతను వెన్నుగాయంతో సతమతమవుతున్నాడు. నాకు తెలిసినంత వరకూ చాహర్కు సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావొచ్చు.’ అని అన్నాడు. కాగా, జట్టుకు కొంతమంది దూరమైనప్పటికీ తమకు అన్ని ఫార్మాట్లకు తగినంత బ్యాకప్స్ ఉన్నాయన్నాడు. గత ఆరేడేళ్ల కాలం నుంచి చూస్తే భారత్ జట్టుకు అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉందన్నాడు. దాంతో మ్యాచ్లకు సిద్ధమయ్యే క్రమంలో ఫలానా ఆటగాడు లేడని చింతించాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఆస్ట్రేలియాతో సిరీస్కు ముగ్గురు ఓపెనర్లు కూడా అందుబాటులో ఉంటారు. చాహర్కు అనూహ్యంగా వెన్ను నొప్పి వచ్చింది. అయితే మనకు తగినంత సంఖ్యలో రిజర్వ్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను న్యూజి లాండ్లో పర్యటించే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేశాం’ అని ఎంఎస్కే అన్నాడు. -
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
కటక్: ఇప్పటికే గాయాల బారిన పడి పలువురు టీమిండియా స్టార్ క్రికెటర్లు వెస్టిండీస్తో సిరీస్కు దూరమైతే ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్ దీపక్ చాహర్.. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేకు దూరమయ్యాడు. విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన చాహర్.. చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదని టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మహ్మద్ షమీతో కలిసి బౌలింగ్ పంచుకుంటున్న చాహర్ లేకపోవడం భారత్కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, చాహర్ స్థానంలో నవదీప్ షైనీని ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ పేర్కొంది. ‘ రెండో వన్డేలో చాహర్ను వెన్నుగాయం వేధించింది. దాంతో అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పింది. ఈ క్రమంలోనే చాహర్కు చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. చాహర్ స్థానంలో మరో యువ పేసర్ షైనీ జట్టులో ఎంపిక చేశాం’ అని సెలక్షన్ కమిటీ తెలిపింది. ఆదివారం కటక్లో భారత్-విండీస్ జట్ల మధ్య తుది వన్డే జరుగనుంది. భారత మూడో వన్డే జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, శివం దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ -
తొలి టీ20: టీమిండియా లక్ష్యం 208
హైదరాబాద్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా స్థానిక ఉప్పల్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియాకు వెస్టిండీస్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్కు పెట్టింది పేరైన కరేబియన్ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో హెట్మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(37;19 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్ హోల్డర్(24; 9 బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో చహల్ రెండు, జడేజా, చహర్, సుందర్లు తలో వికెట్ పడగొట్టాడరు. జోరును అడ్డుకోలేకపోయిన బౌలర్లు.. కరేబియన్ బ్యాట్స్మన్ జోరుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్తో కోహ్లి సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఒకటి కాదు రెండు కాదు అనేక క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఇక బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దీపక్ చహర్ ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఆరంభం నుంచి ధాటిగానే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ వాషింగ్టన్ సుందర్ వేసిన తొలి ఓవర్లోనే 13 పరుగులు పిండుకుంది. అయితే దీపక్ చహర్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ సిమన్స్(2) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్తో కలిసి లూయిస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దిడు. ముఖ్యంగా లూయీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి విండీస్ 50 పరుగులు దాటేసింది. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో లూయిస్(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్లో బ్రాండన్ కింగ్(31; 23 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్) స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మణికట్టు స్పిన్నర్ చహల్ బౌలింగ్లో పొలార్డ్(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే ఓవర్లో హెట్మైర్(56) కూడా భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో ఓకే ఓవర్లో విండీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. -
టీ20 చరిత్రలో నయా వరల్డ్ రికార్డు
పోఖరా(నేపాల్): అంతర్జాతీయ టీ20ల్లో మరో నయా రికార్డు లిఖించబడింది. ఆరు వికెట్లు సాధించడమే కాకుండా అసలు పరుగులే ఇవ్వకుండా నేపాల్ మహిళా క్రికెటర్ అంజలీ చాంద్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోమవారం మాల్దీవులతో జరిగిన మ్యాచ్లో అంజలీ చాంద్ ఈ రికార్డును సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన మాల్దీవులు 16 పరుగులకే చాపచుట్టేయగా, నేపాల్ బౌలర్ అంజలీ చాంద్ ఆరు వికెట్లతో చెలరేగిపోయారు. అదే సమయంలో కనీసం ఒక్క పరుగును కూడా ఇవ్వలేదు. దాంతో ఆరు వికెట్లు సాధించడమే కాకుండా పరుగులివ్వని బౌలర్గా అంజలీ చాంద్ రికార్డు పుస్తకాల్లోకెక్కారు. ఏడో ఓవర్లో మూడు వికెట్లు సాధించిన అంజలీ చాంద్.. 9 ఓవర్లో మరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 11 ఓవర్లో వికెట్ను తీశారు. ఈ మీడియం పేస్ బౌలర్ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే వేసి ఆరు వికెట్లు సాధించడం విశేషం. కాగా, పరుగులు ఇవ్వకపోవడం రికార్డుగా చేరింది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20లో భారత పేసర్ దీపక్ చాహర్ ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో పురుషుల టీ20 క్రికెట్లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతరం 17 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 0.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాసియా క్రికెట్ గేమ్స్లో భాగంగా పోఖరాలో నాలుగు జట్లు ఆడుతున్నాయి. నేపాల్, మాల్దీవులతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ మ్యాచ్లలో టాప్లో నిలిచే రెండు జట్లు గోల్డ్ మెడల్ కోసం పోటీ పడతాయి. ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న జట్లు కాంస్య పతకం కోసం తలపడనున్నాయి. -
4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్ మెరుపులు
తిరువనంతపురం: ఆదివారం అంతర్జాతీయ టి20లో హ్యాట్రిక్... మంగళవారం మూడు బంతుల్లో (వైడ్ను మినహాయించి) మూడు వికెట్లు... ఇప్పుడు గురువారం మళ్లీ అదే తరహా ప్రదర్శన! పేసర్ దీపక్ చాహర్ జోరు కొనసాగుతూనే ఉంది. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన చాహర్ నాలుగు బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో మొదటి, మూడో, నాలుగో బంతులకు చాహర్కు ఈ 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో రాజస్తాన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూపీ 9 వికెట్లకు 164 పరుగులు చేయగా, రాజస్తాన్ 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. -
నా సక్సెస్కు అదే కారణం: చాహర్
నాగ్పూర్: సహచర క్రికెటర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకడు. తాను నమ్మిన క్రికెటర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వారి నుంచి ఫలితాలు రాబట్టడంలో ధోని సిద్ధహస్తుడు. ఇలా ధోని తయారు చేసిన ఒక మెరికే దీపక్ చాహర్. ఈ విషయాన్ని చాహరే ఒప్పుకున్నాడు. తాను ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డును ఎంజాయ్ చేస్తున్నానంటే అందుకు ధోని కారణమన్నాడు. తాను ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఆడటం అంతర్జాతీయ క్రికెట్కు ఎంతగానో లాభించిందన్నాడు. ‘ నా ప్రతిభ వెలుగులోకి రావడం ముందుగా చెప్పుకోవాల్సింది ఐపీఎల్. అందులోనూ ధోని సారథ్యంలో సీఎస్కే ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా. ప్రధానంగా ధోని భాయ్ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. ప్రధానం బ్యాట్స్మన్ బాడీ లాంగ్వెజ్ను తొందరగా అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా సన్నిద్ధం కావడానికి సీఎస్కేతో పాటు ధోనిలే కారణం. ధోనిని నన్ను ఎక్కువగా ప్రోత్సహించేవాడు. నా బౌలింగ్పై నమ్మకం ఉంచి పదే పదే నాకు బౌలింగ్ అప్పచెప్పేవాడు. అదే నన్ను రాటుదేలేలా చేసింది. అతను వికెట్ల వెనుక నుంచి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. బ్యాట్స్మన్ ఏ రకంగా ఆడుతున్నాడు అనే విషయాన్ని గమనిస్తాడు. ఇలా చాలా సార్లు నాకు చెప్పడం, అందుకు తగ్గట్టు బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసేవాడిని. అలా బ్యాట్స్మన్ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది’ అని చాహర్ పేర్కొన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన చివరి టీ20లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన చాహర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఒక హ్యాట్రిక్తో పాటు ఒత్తిడిలో ప్రధాన వికెట్లను ఖాతాలో వేసుకుని భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. -
నువ్వే మా బుమ్రా..!
నాగ్పూర్: జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరంగేట్రం మ్యాచ్ మొదలుకొని ఇప్పటివరకూ తన మార్కు బౌలింగ్తో దుమ్మురేపుతున్న బుమ్రా భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. కాగా, బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు బుమ్రా గాయం కారణంగా తప్పుకోవడంతో దీపక్ చాహర్కు అవకాశం దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని మ్యాన్ ఆఫ్ ద సిరీస్తో మరీ నిరూపించుకున్నాడు చాహర్. చివరి మ్యాచ్లో హ్యాట్రిక్తో పాటు ఆరు వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలవడంతో పాటు మొత్తంగా ఎనిమిది వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను కూడా గెలుచుకున్నాడు. అయితే బంగ్లాదేశ్తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చాహర్కు కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే ఒక్క విషయం చెప్పాడట. ‘కీలక ఓవర్లలో నువ్వు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజుకి నువ్వు మా బుమ్రావి అని రోహిత్ చెప్పాడు. ఆ మాటలే నాలో మరింత ప్రేరణ కల్గించాయి. నాపై పెట్టిన బాధ్యతను ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా నా వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మకాన్ని మనం ఎప్పుడూ వమ్ము చేయకూడదు. నిజంగా మనం వారి నమ్మకాన్ని నిలబెట్టకపోతే మనలో మనకే చెడు భావన కల్గుతుంది. ఈ క్రమంలోనే నువ్వే మా బుమ్రా అని కెప్టెన్ రోహిత్ భాయ్ చెప్పిన మాటలు నాలో మరింత బాధ్యతను పెంచాయి’ అని చాహర్ చెప్పుకొచ్చాడు. -
చెన్నై చెక్కిన చాహర్
2018 ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంతర్గత సమావేశం జరుగుతోంది. ‘పేసర్ దీపక్ చాహర్ రాబోయే లీగ్లో 14 మ్యాచ్లూ ఆడతాడు. ఇక మనం వేరే ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం’... ఒక యువ బౌలర్పై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకం అది. అంతటి నాయకుడే విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాత ఆ బౌలర్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. తనపై ఉంచిన నమ్మకాన్ని చాహర్ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బౌలింగ్ను ప్రదర్శిస్తూ కేవలం 7.28 ఎకానమీతో కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరో రెండు నెలలకే అతనికి భారత జట్టులో చోటు దక్కడం... ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం వరకు మిగతావన్నీ అతని ఐపీఎల్ ప్రదర్శనకు కొనసాగింపులాంటివే. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్లోనే దీపక్ చాహర్ సంచలన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇన్నింగ్స్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ తరఫున 18 ఏళ్ల చాహర్ బరిలోకి దిగగా... 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి చెత్త రికార్డు నమోదు చేసిన ఆ జట్టు హైదరాబాద్. అంతటి అద్భుత ఆరంభం తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెటర్ అనిపించుకోవడానికి చాహర్కు ఎనిమిదేళ్లు పట్టింది. అయితే ఆదివారం బంగ్లాదేశ్తో ప్రదర్శన తర్వాత ఇకపై చాహర్ పేరును మాత్రం ఎవరూ మరచిపోకపోవచ్చు. గాయాల సమస్యలతో... తొలి రంజీ సీజన్లో 30 వికెట్లు సాధించి ఘనంగా మొదలైన దీపక్ కెరీర్ తర్వాతి ఏడాది వచ్చేసరికే తలకిందులైంది. వరుసగా ఎదురైన గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఫలితంగా 2011–12 రంజీ సీజన్లో 4 మ్యాచ్లకే అతను పరిమితమయ్యాడు. అతని ఫిట్నెస్ సమస్యలను గుర్తించడం వల్లే కావచ్చు... ‘ఎనిమిది వికెట్ల ఘనత’కు రెండేళ్ల ముందు రాజస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్గా ఉన్న ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ నువ్వు బౌలర్గానే పనికి రావంటూ చాహర్ను తిరస్కరించాడు. నాటి 50 అత్యుత్తమ ఆటగాళ్లలో కూడా అతనికి చోటివ్వలేదు. దేశవాళీ క్రికెట్లో ఒక్క సంవత్సరానికే ఇలా కావడం దీపక్ను మానసికంగా కూడా దెబ్బ తీసింది. అయితే అతని తండ్రి, ఎయిర్ఫోర్స్ అధికారి అయిన లోకేంద్ర సింగ్ కుమారుడికి అండగా నిలిచి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఈ కుటుంబం స్వస్థలం ఆగ్రా అయినా... ఉద్యోగరీత్యా వారు జైపూర్లో స్థిరపడటంతో మొదటి నుంచి చాహర్ రాజస్తాన్ జట్టునే ఎంచుకున్నాడు. వారి సొంత అకాడమీలోనే అతను స్వింగ్ బౌలర్గా ఎదిగాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడంపైనే అతను పూర్తిగా శ్రద్ధ పెట్టాడు. ఇందు కోసం తండ్రి ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ప్రాక్టీస్ సెషన్కు కొత్త బంతులను సిద్ధం చేసేవాడు. కెరీర్ ఆరంభంలో 125 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేసిన దీపక్... ఆ తర్వాత రాటుదేలి, ఫిట్నెస్ మెరుగుపర్చుకొని 150 కిలోమీటర్ల స్పీడ్కు తన వేగాన్ని పెంచుకోవడం విశేషం. ధోని అండదండలతో... 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పుణే సూపర్ జెయింట్స్ జట్టులో చాహర్ ఉన్నాడు. తనని ఆడిస్తానంటూ ధోని అప్పుడే మాట ఇచ్చాడు. అయితే లీగ్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. చివరి 3 మ్యాచ్లు మాత్రం ఆడగలిగాడు. మరుసటి ఏడాది స్మిత్ కెప్టెన్ కావడంతో అతని ప్రణాళికల్లో చాహర్ పనికి రాలేదు. దాంతో 2 మ్యాచ్లే దక్కాయి. ధోని మాత్రం మాటంటే మాటే అంటూ 2018లో చెప్పి మరీ చెన్నై జట్టులోకి తీసుకున్నాడు. ఐపీఎల్లో సూపర్కింగ్స్ విజేతగా నిలిచిన తర్వాత అంతా మారిపోయింది. రెండు నెలలకే భారత్ తరఫున ఆడే అవకాశం లభించింది. బుమ్రా గాయపడటంతో ఇంగ్లండ్తో బ్రిస్టల్లో చాహర్ అరంగేట్రం జరిగింది. భువనేశ్వర్ తరహాలో కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం, డెత్ ఓవర్లలో పాత బంతితో కట్టడి చేయడం దీపక్కు బాగా అబ్బిన విద్య. సాధారణంగా ఐపీఎల్లో పవర్ప్లేలోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను చాహర్తో ధోని వేయించేవాడు. మొత్తంగా 80 శాతం బంతులు అతను పవర్ప్లేలో వేసినవే. ఐపీఎల్–2019లో ఒక మ్యాచ్లో వరుసగా రెండు ఫుల్ టాస్ నోబాల్స్ వేయడంతో చాహర్పై ధోని ఆగ్రహోదగ్రుడైన విషయం అందరూ చూసిందే. అందులో ఒక కెప్టెన్గా తన జూనియర్పై కోపంకంటే తాను తీర్చిదిద్దిన బౌలర్ బాగా ఆడాలనుకునే సాన్నిహిత్యం కనిపించిందంటే తప్పు లేదు! రెండో మ్యాచ్లోనే... బంగ్లాదేశ్తో మ్యాచ్లో ప్రపంచ రికార్డుకు ముందే దాదాపు ఇదే తరహా ప్రదర్శన దీపక్ నుంచి వచ్చినప్పుడే అతనిపై అందరికీ నమ్మకం పెరిగింది. ప్రొవిడెన్స్లో వెస్టిండీస్తో ఆడిన తన రెండో టి20లో 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన చాహర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కెరీర్లో తొలి మ్యాచ్ మినహా మిగిలిన 6 మ్యాచ్లలోనూ అతను ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. ఆసియా కప్లో భాగంగా ఏకైక వన్డే ఆడిన చాహర్, టెస్టుల్లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచ రికార్డు ప్రదర్శనతోనే ఆగిపోకుండా మున్ముందు మరిన్ని అద్భుతాలు చేయగల సత్తా 27 ఏళ్ల దీపక్ చాహర్లో ఉందనేది మాత్రం వాస్తవం. ప్రపంచ రికార్డు సాధిస్తానని ఏమాత్రం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నేను కొత్త బంతితోనే బౌలింగ్ చేస్తాను. కానీ నన్ను బుమ్రా తరహాలో వాడుకుంటామని, కీలకమైన ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ భాయ్ చెప్పాడు. ఒత్తిడిలో నాపై నమ్మకముంచి బాధ్యత అప్పగించడం సంతోషంగా అనిపించింది. బంతి తడిగా ఉండటంతో పట్టు సాధించడం కష్టమైంది. అయితే చెన్నైలో మ్యాచ్లు ఆడిన అనుభవం పనికొచ్చింది. అక్కడ సాయంత్రం తేమతో పాటు చేతులకు బాగా చెమట పట్టేస్తుంది. చేతులను ఎలా పొడిగా ఉంచుకోవాలో నాకు తెలుసు. సీనియర్లు తిరిగి వచ్చినా... రాబోయే టి20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడమే ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం. –దీపక్ చాహర్ అదే మలుపు... రాజస్తాన్ జట్టు వరుసగా రెండు సంవత్సరాలు రంజీ ట్రోఫీ విజేతగా నిలవగా, రెండు సార్లూ చాహర్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ గాయాలతో గతి తప్పిన తర్వాత రెగ్యులర్గా అతనికి టీమ్లో చోటు లేకుండా పోయింది. అడపాదడపా ఒక్కో మ్యాచ్ లభించినా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ చాహర్ నుంచి రాలేదు. జట్టు రాజకీయాలు కూడా అతడిని ఇబ్బంది పట్టాయి. కొత్త బంతితో కాకుండా నాలుగో బౌలర్గా అవకాశం కల్పించడం, పచ్చిక ఉన్న పిచ్లపై కాకుండా స్పిన్ వికెట్లపైనే మ్యాచ్ ఆడించడం, ఒక్కోసారి టీమ్ 100కు పైగా ఓవర్లు బౌలింగ్ చేసినా ఐదు ఓవర్లే వేసే అవకాశం ఇవ్వడం కూడా చాహర్ను గందరగోళ స్థితిలో పడేశాయి. ఈ దశలో 2016లో జరిగిన ‘రాజస్తాన్ క్రికెటర్స్ డెవలప్మెంట్ క్యాంప్’ అతని కెరీర్ను మలుపు తిప్పింది. క్యాంప్లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, టి20 స్పెషలిస్ట్ కోచ్ ఇయాన్ పాంట్ పర్యవేక్షణలో దీపక్ బౌలింగ్ పదునెక్కింది. మరో మాజీ క్రికెటర్ కాథరీన్ డాల్టన్ కూడా అతనికి సహకరించింది. తెల్ల బంతిపై చక్కటి నియంత్రణ రావడంతో పాటు అతనిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. సరిగ్గా చెప్పాలంటే దీని తర్వాతే అతను పవర్ ప్లే స్పెషలిస్ట్గా ఎదిగాడు. -
ఒకేసారి 88 స్థానాలు ఎగబాకాడు..
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో మొత్తంగా ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్ దీపక్ చహర్ తన ర్యాంక్ను మరింత మెరుగుపరుచుకున్నాడు. చివరి టీ20లో ఆరు వికెట్లు సాధించడంతో చహర్ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్లో చహర్ 42వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో మూడో టీ20లో హ్యాట్రిక్ను కూడా సాధించి పొట్టి ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫలితంగా తన ర్యాంక్లో దూసుకుపోయాడు చహర్. ఇక అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ మిచెల్ సాంత్నార్ కొనసాగుతున్నాడు.బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ టాప్ ర్యాంకులోనే ఉండగా, భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానాన్ని కాపాడుకున్నాడు. కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రస్తుతం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం ప్రకటించడంతో అది నబీకి లాభించింది. -
కలలో కూడా అనుకోలేదు: చహర్
నాగ్పూర్: బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20కి ముందు పేసర్ దీపక్ చహర్ భారత్ తరఫున ఆడిన మ్యాచ్లు ఏడు. అందులో ఒకటి వన్డే మ్యాచ్ కాగా, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. అయితే బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి టీ20 చహర్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్లో చిరస్మరణీయమైన ప్రదర్శనతో చహర్ ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. బంగ్లాతో సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి టీ20లో హ్యాట్రిక్తో పాటు మొత్తంగా ఆరు వికెట్లను చహర్ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన తొలి బౌలర్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: చహర్ సిక్సర్... భారత్ విన్నర్) మరొకవైపు అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు.తన ప్రదర్శనపై పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన చహర్.. ఈ ఘనతపై పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘ నేనెప్పుడు ఈ తరహా ప్రదర్శన చేస్తానని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే నా కష్టానికి ఫలితం వచ్చింది. నా చిన్నతనం నుంచి క్రికెట్లో రాణించడం కోసం శ్రమిస్తూనే ఉన్నాను. అందుకు ఫలితం ఇన్నాళ్లకు వచ్చిందేమో’ అని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్లో దీపక్ చాహర్ 10.2 ఓవర్లు వేసి 56 పరుగులివ్వడమే కాకుండా ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా కూడా నిలిచాడు. బంగ్లాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ మూడు వికెట్ల తర్వాత తీసిన మరో మూడు వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ వికెట్ను... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్లను అవుట్ చేసి చహర్ హ్యాట్రిక్తో రికార్డు నమోదు చేశాడు. -
చివరి టి20లో బంగ్లాదేశ్ చిత్తు
-
చహర్ సిక్సర్... భారత్ విన్నర్
నాగ్పూర్లో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన సమయంలో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఉవ్వెత్తున లేచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్ను కుప్పకూల్చి ఒక్కసారిగా తన స్థాయిని ప్రదర్శించి పరువు నిలబెట్టుకుంది. 34 పరుగుల వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు తీసి సొంతగడ్డపై దర్జాగా సిరీస్ను సొంతం చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో రెండు ప్రధాన వికెట్లు తీసి శివమ్ దూబే విజయానికి బాటలు వేస్తే... ఏకంగా 6 వికెట్ల ప్రదర్శనతో దీపక్ చహర్ అదరగొట్టాడు. చహర్ ప్రదర్శన అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమం కాగా, భారత్ తరఫున టి20ల్లో తొలి హ్యాట్రిక్ తీసిన అరుదైన బౌలర్గా కూడా అతను నిలిచాడు. తన 3వ ఓవర్ చివరి బంతికి వికెట్ తీసిన చహర్... నాలుగో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్, రాహుల్ అర్ధసెంచరీలతో టీమిండియా స్కోరులో ప్రధాన పాత్ర పోషించారు. నాగ్పూర్: బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న చివరి మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాక్కొని రోహిత్ సేన 2–1తో సిరీస్ను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడి జామ్తా మైదానంలో జరిగిన పోరులో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయీమ్ (48 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా, మిథున్ (27) సహకరించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 61 బంతుల్లో 98 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించినా... భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్ దీపక్ చహర్ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబేకు 3 వికెట్లు దక్కాయి. చహర్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు దక్కాయి. ఓపెనర్లు విఫలం... రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (2)ను అవుట్ చేసి షఫీయుల్ తన జట్టుకు శుభారంభం అందించాడు. లోపలికి దూసుకొచ్చిన బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా ఈ ఓవర్లో పరుగులేమీ రాలేదు. సిరీస్లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. కొన్ని చక్కటి షాట్లు ఆడినా... మరోసారి శిఖర్ ధావన్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. రాహుల్ జోరు... మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ బ్యాట్ నుంచి చూడచక్కటి బౌండరీలు జాలువారాయి. షఫీయుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, ముస్తఫిజుర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ప్రత్యర్థి ప్రధాన బౌలర్ లయ దెబ్బ తీశాడు. 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే మరో రెండు బంతులకే మిడాఫ్లో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. శ్రేయస్ సూపర్... షఫీయుల్ బౌలింగ్లో ‘సున్నా’ వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను అమీనుల్ వదిలేశాడు. అదే అమీనుల్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాది అయ్యర్ తన బౌండరీల ఖాతా తెరవడం విశేషం. అఫీఫ్ వేసిన తర్వాతి ఓవర్లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6 బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లాంగాన్లో క్యాచ్ ఇవ్వడంతో అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు పంత్ (6) వైఫల్యం ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. చివర్లో పాండే (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు), దూబే (9 నాటౌట్) కలిసి 19 బంతుల్లో 30 పరుగులు జోడించడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. . భారీ భాగస్వామ్యం... ఛేదనలో బంగ్లాదేశ్కు సరైన ఆరంభం లభించలేదు. చహర్ వేసిన మూడో ఓవర్లో ఆ జట్టు లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్ (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నయీమ్ దూకుడైన ఆటతో జట్టును ఆదుకున్నాడు. అతనికి మిథున్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఇదే జోడి బంగ్లాను గెలుపు తీరానికి చేరుస్తుందని భావిస్తున్న తరుణంలో చహర్ బౌలింగ్లో మిథున్ అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. ‘హ్యాట్రిక్’ వెలుగులు దీపక్ చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ మూడు వికెట్ల తర్వాత తీసిన మరో మూడు వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ వికెట్ను... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్లను అవుట్ చేసి చహర్ ‘హ్యాట్రిక్’తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ►1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన తొలి బౌలర్ దీపక్ చహర్. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు ‘హ్యాట్రిక్’ తీయగా... బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూ గినియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ►3 అశ్విన్ (52 వికెట్లు), బుమ్రా (51 వికెట్లు) తర్వాత టి20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ చహల్. చహల్ తక్కువ మ్యాచ్ల్లో (34) ఈ ఘనత సాధించాడు. ►అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్ దీపక్ చహర్. ఈ ఫార్మాట్లోనే అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ (6/8; జింబాబ్వేపై 2012లో... 6/16; ఆ్రస్టేలియాపై 2011లో), భారత స్పిన్నర్ చహల్ (6/25; ఇంగ్లండ్పై 2017లో) మాత్రమే ఆరు చొప్పున వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షఫీయుల్ 2; ధావన్ (సి) మహ్ముదుల్లా (బి) షఫీయుల్ 19; రాహుల్ (సి) దాస్ (బి) అల్ అమీన్ 52; అయ్యర్ (సి) దాస్ (బి) సర్కార్ 62; పంత్ (బి) సర్కార్ 6, పాండే (నాటౌట్) 22; దూబే (నాటౌట్) 9, ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–3; 2–35; 3–94; 4–139; 5–144. బౌలింగ్: అల్ అమీన్ 4–0–22–1; షఫీయుల్ 4–1–32–2; ముస్తఫిజుర్ 4–0–42–0; అమీనుల్ 3–0–29–0; సౌమ్య సర్కార్ 4–0–29–2; అఫీఫ్ 1–0–20–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సుందర్ (బి) చహర్ 9; నయీమ్ (బి) దూబే 81; సౌమ్య సర్కార్ (సి) దూబే (బి) చహర్ 0; మిథున్ (సి) రాహుల్ (బి) చహర్ 27; ముష్ఫికర్ (బి) దూబే 0; మహ్ముదుల్లా (బి) చహల్ 8; అఫీఫ్ (సి అండ్ బి) దూబే 0; అమీనుల్ (బి) చహర్ 9; షఫీయుల్ (సి) రాహుల్ (బి) చహర్ 4; ముస్తఫిజుర్ (సి) అయ్యర్ (బి) చహర్ 1; అల్ అమీన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 144. వికెట్ల పతనం: 1–12; 2–12; 3–110; 4–110; 5–126; 6–126; 7–130; 8–135; 9–144; 10–144. బౌలింగ్: ఖలీల్ 4–0–27–0; వాషింగ్టన్ సుందర్ 4–0–34–0; దీపక్ చహర్ 3.2–0–7–6; చహల్ 4–0–43–1; దూబే 4–0–30–3. -
టీమిండియా లక్ష్యం 150
మొహాలి : సారథి డికాక్ (52; 37 బంతుల్లో 8ఫోర్లు), బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్)రాణించడంతో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొహాలి పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేజింగ్ వైపు మొగ్గు చూపాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(6) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి సారథి డికాక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే టీమిండియా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్కు సఫారీ బ్యాట్స్మెన్ ఇబ్బందులకు గురయ్యారు. లైన్అండ్లెంగ్స్తో సఫారీ బ్యాట్స్మెన్ పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అయితే బవుమా స్లో బ్యాటింగ్తో నిరత్సాహపరిచినా.. డికాక్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే అర్దసెంచరీ తర్వాత డికాక్ను నవదీప్ సైనీ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్ క్రీజులో నిలదొక్కుకోడానికి నానాతంటాలు పడ్డారు. అయితే బవుమా కూడ హాఫ్ సెంచరీ సాధించకుండానే దీపక్ చహర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. డసెన్(1), మిల్లర్(18) విఫలమవ్వడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ దక్కించుకున్నారు. -
‘సాహోరే చహర్ బ్రదర్స్’
ప్రొవిడెన్స్ (గయానా) : నాలుగు పరుగులు మూడు వికెట్లు. టి20లో సాధ్యంకాని బౌలింగ్ గణాంకాలు. అది కూడా పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్పైన. కెరీర్లో గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు యువ బౌలర్ దీపక్ చహర్. అరంగేట్రపు మ్యాచ్లో దారాళంగా పరుగులిచ్చాడు. దీంతో అతడిపై ఆశలు సన్నగిల్లాయి. కానీ విండీస్తో జరిగిన చివరి మ్యాచ్లో బుల్లెట్లా దూసుకొస్తున్న దీపక్ చహర్ బంతులను ఆడటానికి కరేబియన్ బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టింది. దీపక్ చహర్తో పాటు ఐపీఎల్, లిస్టు ఏ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ రాహుల్ చహర్ విండీస్తో జరిగిన చివరి టి 20లో అదరగొట్టారు. వీరి ఆటకు మంత్రముగ్దుడైన సారథి విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్తో టి20 సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 3–0తో క్లీన్స్వీప్ చేసింది. తొలి రెండు టి20లను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత కూడా టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి మ్యాచ్లోనూ కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ఆటతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి చహర్ బ్రదర్స్ను పొగడ్తలతో ముంచెత్తాడు. భువీ స్కిల్ఫుల్ బౌలర్ ‘పిచ్ అంత గొప్పగా ఏంలేదు. బౌలింగ్కు అంతగా సహకరించటం లేదు. అయినా రాహుల్ చహర్ తన తొలి స్పెల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. అనంతరం దీపక్ చహర్ బౌలింగ్ అత్యద్భుతం. తన స్వింగ్ బౌలింగ్తో విండీస్ బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు పడగొట్టాడు. అయితే ఓ దశలో విండీస్ భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నాం. కానీ చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ సంచలన రీతిలో బౌలింగ్ చేయడంతో విండీస్ను కట్టడి చేయగలం. నిజంగా చహర్ బ్రదర్స్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. భువీ స్కిల్ ఫుల్ బౌలర్. అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచకప్ 2023 గురించి ఇప్పుడే ఆలోచిండంలేదు తొలి రెండు టి20లో పంత్ విఫలమవ్వడం నన్ను ఎంతగానో నిరాశపరిచింది. అయితే చివరి మ్యాచ్లో పంత్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ పంత్ నుంచి ఇంకా ఆశిస్తున్నాం. అయితే అతడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకరావడం లేదు. పంత్కు పూర్తి స్వేచ్చనిచ్చాం. ఇక నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. పరుగులు ఎన్ని సాధించాం అనే దానికంటే జట్టుకు మనం చేసిన పరుగులు ఎంతవరకు ఉపయోపడ్డాయి అనేది ముఖ్యం. ప్రపంచకప్ 2023 గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. యువ ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మరింత బలం చేకూర్చాలని భావిస్తున్నాం’అంటూ కోహ్లి వివరించాడు. -
విజయం పరిపూర్ణం
పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్పై భారత్ విజయం పరిపూర్ణమైంది. తొలి రెండు టి20లను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత కూడా టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి మ్యాచ్లోనూ కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ఆటతో ప్రత్యర్థిని చిత్తు చేసి 3–0తో పోరును ముగించింది. గత రెండు మ్యాచ్లతో పోలిస్తే ఈ సారి కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చినా... చివరకు విండీస్కు సొంతగడ్డపైనా విజయం దక్కలేదు. దీపక్ చహర్ అద్భుత బౌలింగ్తో ఆరంభంలోనే దెబ్బ తిన్న విండీస్ సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కోహ్లి, పంత్ శతక భాగస్వామ్యంతో భారత్ను గెలిపించారు. ఇక భారత్ తర్వాతి లక్ష్యం వన్డే సిరీస్లో సత్తా చాటడమే. ప్రొవిడెన్స్ (గయానా): వెస్టిండీస్తో టి20 సిరీస్లో సాధికారిక ఆటను ప్రదర్శించిన భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రావ్మన్ పావెల్ (20 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’దీపక్ చహర్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (42 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (45 బంతుల్లో 59; 6 ఫోర్లు) మూడో వికెట్కు 77 బంతుల్లోనే 106 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గురువారం ఇదే మైదానంలో జరిగే తొలి మ్యాచ్తో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. విండీస్ సిక్సర్ల మోత... వెస్టిండీస్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు మాత్రమే ఉండగా, 11 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇందులో ఆరు పొలార్డ్ ఒక్కడే బాదాడు. తొలి టి20లో త్రుటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్న పొలార్డ్ ఈ మ్యాచ్లోనూ దూకుడు ప్రదర్శించాడు. దీపక్ చహర్ (3/4) దెబ్బకు 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తన జట్టును అతను ఆదుకున్నాడు. సైనీ బౌలింగ్లో భారీ సిక్సర్తో ఖాతా తెరిచిన పొలార్డ్, రాహుల్ చహర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదాడు. పొలార్డ్, పూరన్ (23 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్కు 56 బంతుల్లో 66 పరుగులు జోడించడంతో విండీస్ కోలుకుంది. పూరన్ వెనుదిరిగిన తర్వాత కృనాల్ బౌలింగ్లో భారీ సిక్స్తో 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పొలార్డ్... అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టాడు. ఏడున్నరేళ్ల తర్వాత పొలార్డ్ అంతర్జాతీయ టి20ల్లో అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం! చివరకు అతను సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు. తన బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన కెప్టెన్ బ్రాత్వైట్ (10)ను తర్వాతి బంతికే ఔట్ చేసి రాహుల్ చహర్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. అయితే సైనీ వేసిన ఆఖరి ఓవర్లో పావెల్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగడంతో విండీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. 14 ఓవర్ల వరకు 6 రన్రేట్ను దాటలేకపోయిన విండీస్... చివరి 6 ఓవర్లలో 62 పరుగులు చేసింది. భారీ భాగస్వామ్యం ఇన్నింగ్స్ మూడో బంతికే రాహుల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) భారీ సిక్సర్ కొట్టడంతో భారత్ ఖాతా తెరవగా, తర్వాతి ఓవర్లో శిఖర్ ధావన్ (3) వెనుదిరిగాడు. కొద్ది సేపటికి అలెన్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన రాహుల్ కూడా డగౌట్ చేరాడు. ఈ స్థితిలో కోహ్లి, పంత్ ప్రశాంతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించారు. కోహ్లి చూడచక్కటి షాట్లు కొట్టగా... పంత్ గత రెండు మ్యాచ్లకు భిన్నంగా ఈ సారి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. నిలదొక్కుకున్న తర్వాత కీమో పాల్ బౌలింగ్లో సిక్స్తో దూకుడు పెంచాడు. పాల్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు సిక్స్, ఫోర్తో 14 పరుగులు రాబట్టారు. నరైన్ బౌలింగ్లో డీప్ మిడ్వికెట్ మీదుగా ఫోర్ కొట్టడంతో 37 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. అంతర్జాతీయ టి20ల్లో అతనికి ఇది 21వ హాఫ్ సెంచరీ. ఆ వెంటనే పంత్ 37 బంతుల్లో తన రెండో అర్ధసెంచరీని అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... మనీశ్ పాండే (2 నాటౌట్)తో కలిసి పంత్ మ్యాచ్ ముగించాడు. బ్రాత్వైట్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని పంత్ భారీ సిక్సర్ బాదడంతో టీమిండియా గెలుపు పూర్తయింది. దీపక్ సూపర్ స్పెల్... 2019 ఐపీఎల్లో చక్కటి ప్రదర్శనతో మళ్లీ భారత జట్టులోకి వచ్చిన పేసర్ దీపక్ ఏడాది విరామం తర్వాత తన రెండో టి20 మ్యాచ్ ఆడాడు. అరంగేట్ర మ్యాచ్లో (ఇంగ్లండ్పై) 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి పేలవ ప్రదర్శన కనబర్చిన దీపక్ ఈ మ్యాచ్ను మాత్రం చిరస్మరణీయం చేసుకున్నాడు. తన తొలి ఓవర్లోనే నరైన్ (2) వికెట్ తీసిన అతను, రెండో ఓవర్ మరింత అద్భుతంగా వేశాడు. లూయిస్ (10), హెట్మైర్ (1)లను ఎల్బీడబ్ల్యూలుగా ఔట్ చేయడంతో పాటు మెయిడిన్గా ముగించాడు. మూడో ఓవర్లో కూడా ఒక్క పరుగే ఇచ్చిన దీపక్ గణాంకాలు 3–1–4–3 కావడం విశేషం. ఇంత అద్భుత స్పెల్ తర్వాత అనూహ్యంగా అతడిని తప్పించిన కోహ్లి చివర్లో మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. భారత్ తరఫున 81వ ప్లేయర్గా రాహుల్ చహర్ గయానాలో వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో టి20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్గా అతను గుర్తింపు పొందాడు. టాస్ వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా రాహుల్ చహర్ టీమిండియా క్యాప్ను అందుకున్నాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. సోదరుడు దీపక్ చహర్తో కలిసి అతను ఈ మ్యాచ్లో ఆడటం విశేషం. అయితే వీరిద్దరు సొంత అన్నదమ్ములు కాదు. కజిన్స్ మాత్రమే. వీరిద్దరి తండ్రులు సొంత అన్నదమ్ములు, తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడం మాత్రం మరో విశేషం. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 10; నరైన్ (సి) సైనీ (బి) దీపక్ చహర్ 2; హెట్మైర్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 1; పొలార్డ్ (బి) సైనీ 58; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 17; రావ్మన్ పావెల్ (నాటౌట్) 32; బ్రాత్వైట్ (సి) సుందర్ (బి) రాహుల్ చహర్ 10; అలెన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–4; 2–13; 3–14; 4–80; 5–105; 6–119. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–19–0; దీపక్ చహర్ 3–1–4–3; సైనీ 4–0–34–2; రాహుల్ చహర్ 3–0–27–1; వాషింగ్టన్ సుందర్ 3–0–23–0; కృనాల్ పాండ్యా 4–0–35–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) పూరన్ (బి) అలెన్ 20; ధావన్ (సి) కాట్రెల్ (బి) థామస్ 3; కోహ్లి (సి) లూయిస్ (బి) థామస్ 59; పంత్ (నాటౌట్) 65; మనీశ్ పాండే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–10; 2–27; 3–133. బౌలింగ్: కాట్రెల్ 4–0–26–0; థామస్ 4–0–29–2; అలెన్ 3–0–18–1; నరైన్ 4–0–29–0; బ్రాత్వైట్ 2.1–0–25–0; కీమో పాల్ 2–0–23–0. -
ఆర్సీబీతో మ్యాచ్: సీఎస్కే లక్ష్యం 162
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్బీబీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సారథి విరాట్ కోహ్లి(9)ని దీపక్ చహర్ ఔట్ చేశాడు. చహర్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆరంభం నుంచి దాటిగా ఆడాడు. అదే జోరులో జడేజా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి డివిలియర్స్(25) వెనుదిరిగాడు. దీంతో 58 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పార్థీవ్ పటేల్, అక్ష్దీప్ నాథ్లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ముఖ్యంగా యువ ఆటగాడు అక్ష్దీప్ సిక్స్లు కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో వైపు పార్థీవ్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడుతూనే అర్దసెంచరీ పూర్తి చేశాడు. అయితే స్కోర్ పెంచే యత్నంలో భారీ షాట్లకు యత్నించి అక్ష్దీప్(24) అవుటయ్యాడు. అనంతరం వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్కే పరిమితం అవుతుందునుకున్నారు. అయితే చివర్లో మొయిన్ అలీ(26) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో చహర్, జడేజా, బ్రేవో తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తాహీర్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. -
దీపక్ చాహర్ ఐపీఎల్ రికార్డు
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోల్కతా నైట్రైడర్స్తో చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహర్.. 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇందులో 20 డాట్ బాల్స్ ఉండటంతో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ 20 డాట్బాల్స్ ఎవరూ వేయలేదు. గతంలో ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్లు ఐపీఎల్లో అత్యధికంగా డాట్ బాల్స్ వేశారు. ఈ ముగ్గురూ 2009 ఐపీఎల్ సీజన్లో 19 డాట్ బాల్స్ వేశారు. అయితే మంగళవారం రాత్రి ఆ సంయుక్త రికార్డును దీపక్ చాహర్ బ్రేక్ చేశాడు. గత శనివారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దీపక్ చాహర్ వరుసగా రెండు నోబాల్స్ విసరడంతో.. అతనిపై ధోని గుస్సా అయిన సంగతి తెలిసిందే. అయితే ధోని కోపం తర్వాత తప్పిదాల్ని దిద్దుకున్న చాహర్.. ఆ ఓవర్లో ఓ వికెట్ పడగొట్టి చెన్నైని గెలిపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా, చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే చెన్నైవిజయాన్ని అందుకుంది.