Dulquer Salmaan
-
మెగాస్టార్ ఇంట్లో బస చేసే ఛాన్స్.. రోజుకు రూ.75,000!
హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు.. కథానాయకుల లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..ఇంటిని అభిమానుల కోసం..మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్, కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ను అమల్లోకి తెచ్చారు. ఒక్కరోజు ఉండాలంటే..ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.దుల్కర్ సల్మాన్ బెడ్రూమ్సినిమా..మమ్ముట్టి.. చివరగా డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే సినిమా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్ గేమ్ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by VKation Experiences (@vkationexperiences) చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్ -
OTT: 13 వారాలుగా ట్రెండింగ్లో తెలుగు సినిమా
పండగను క్యాష్ చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అందుకే పోటీ ఉన్నా సరే పండక్కి వచ్చేందుకు సిద్ధవుతుంటారు. అలా గతేడాది దీపావళికి కిరణ్ అబ్బవరం 'క', శివకార్తికేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar Movie) చిత్రాలు రిలీజయ్యాయి. అక్టోబర్ 31న విడుదలైన ఈ మూడు సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద గండం గట్టెక్కడమే కాకుండా హిట్, సూపర్ హిట్ జాబితాలో చేరిపోయాయి. ఓటీటీలో టాప్ ప్లేస్లో..ఈ మూడు చిత్రాలు ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేశాయి. లక్కీ భాస్కర్ చిత్రం నవంబర్ 28న నెట్ఫ్లిక్స్ (Netflix)లో రిలీజైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. అయితే మూడు నెలలుగా ఈ సినిమా ఓటీటీలో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. 13 వారాలుగా నెట్ఫ్లిక్స్లో టాప్లో ట్రెండ్ అవుతున్న తొలి దక్షిణాది సినిమా అంటూ సితార ఎంటర్టైన్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది.చదవండి: కలర్ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్సినిమాలక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించగా.. నిమిషా రవి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. #LuckyBhaskar’s mind game is spot on in the digital arena too 😎🔥First South Indian film to trend for 13 weeks straight on @netflix 💥A true downpour of love from the audience ❤️#BlockbusterLuckyBaskhar streaming in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Languages on… pic.twitter.com/nbrAEjhuZm— Sithara Entertainments (@SitharaEnts) February 26, 2025 చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘కాంత(Kantha)’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని ఓ లీడ్ రోల్ చేశారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ డాక్యుమెంటరీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.నటుడిగా దుల్కర్ పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’లోని ఆయన ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘1950 నాటి మద్రాస్(చెన్నై) నేపథ్యంలో ‘కాంత’ ఉంటుంది. అప్పటి మానవీయ సంబంధాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో ఈ మూవీ కొత్తగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాను. -
లక్కీ భాస్కర్ వెరీ లక్కీ.. తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్
లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. టాలీవుడ్లోనే మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి 'ఆకాశంలో ఒకతార' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్బాక్స్ మీడియా బ్యానర్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో నిర్మాత అశ్వనీ దత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్తో పాటు నటీనటుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.Finally a Little Sandhadi…❤️The Legendary Trio comes together to take our Star forward…💫#AakasamloOkaTara Journey Begins…❤️🔥#AOTMovie @dulQuer @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/3OuZlFeqG0— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
‘ఆకాశంలో ఒక తార’అంటూ రాబోతున్న దుల్కర్ సల్మాన్
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు.లైట్ బాక్స్ మీడియా బ్యానర్పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. -
ఆప్తుడి ఇంటి వేడుకలో మమ్మూటీ, దుల్కర్ల సందడి (ఫొటోలు)
-
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
దుల్కర్ సల్మాన్ - అమల్ సూఫియాల బంధానికి 13ఏళ్లు (ఫోటోలు)
-
లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. లక్కీ భాస్కర్ ఎలా ఉందో తెలియజేస్తూ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.ముందు జాగ్రత్తమధ్యతరగతి జీవితంలో జరిగిన అద్భుతమే ఈ సినిమా. కథ ముంబైలో జరుగుతుంది, పాత్రలు తెలుగులో మాట్లాడతాయి అని ముందే చెప్పేశారు. ముంబైలో తెలుగు మాట్లాడటమేంటని ఎవరూ విమర్శించకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా ప్రారంభ సన్నివేశం బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రీన్ప్లేతో ఆటాడుకున్నారు. ఎన్నిరకాలుగా డబ్బును కాజేయొచ్చనేది సినిమాలో చూపించారు. దిగువమధ్యతరగతి స్థాయిలో ఉన్న భాస్కర్ వందకోట్లకు అధిపతి అయిపోతాడు. అసలు గేమ్ప్రపంచంలో కొందరు కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతున్నారన్నది సినిమాలో చూపించారు. ప్రేమకథపై కాకుండా ఒరిజినల్ కథపైనే ఎక్కువ దృష్టి సారించడం బాగుంది. మొదట అతడి కష్టం, కన్నీళ్లు చూపించాక అసలైన గేమ్ మొదలుపెట్టారు. చివర్లో తను సంపాదించిన డబ్బంతా చెక్కులపై రాసిచ్చేసినప్పుడు ప్రేక్షకులకు బాధేస్తుంది. కట్ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు.ట్విస్టులు బాగున్నాయిప్రతి రూపాయిని బ్లాక్మనీలా కాకుండా వైట్ మనీ చేసుకున్న హీరో బ్రెయిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. వంద కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి. చిన్న పాత్ర అని తెలిసినా ఒప్పుకుని నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరిని అభినందించాల్సిందే! అని పరుచూరి చెప్పుకొచ్చాడు.చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
ఓటీటీలో 'లక్కీ భాస్కర్'.. అధికారిక ప్రకటన
దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్తో అక్టోబర్ 31న థియేటర్స్లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో పలుచోట్ల ఆడుతోంది. ఇదలా ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సుకుమార్ ఇంట్లో పనిమనిషికి ప్రభుత్వం ఉద్యోగం)దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన 'లక్కీ భాస్కర్'. 1990ల్లో జరిగిన బ్యాంక్ స్కామ్ కాన్సెప్ట్తో తీసిన సినిమా. 'సార్' చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి బ్యాంక్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. నెట్ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.ఇకపోతే 'లక్కీ భాస్కర్' ఓటీటీ డీల్ని నెట్ఫ్లిక్స్ నాలుగు వారాల కోసమని మాట్లాడుకుందట. అలా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దాదాపు ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనితో పాటే థియేటర్లలో రిలీజైన 'క', 'అమరన్' కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్) -
తెలుగులో సూపర్ హిట్ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.తెలుగులో సూపర్హిట్గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్ను షేర్ చేశారు. మాలీవుడ్లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ క మూవీ రైట్స్ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024 -
అది నా అదృష్టం : వెంకీ అట్లూరి
‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను. -
అది లక్కీ భాస్కర్తో నెరవేరింది
‘‘నేను ఎప్పటి నుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ‘లక్కీ భాస్కర్’ సినిమాతో నెరవేరింది. డైరెక్టర్ వెంకీ బ్యాంకింగ్ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. సినిమాలో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, చిన్న బ్యాంక్ ఉద్యోగి అయిన భాస్కర్ తన పరిధిలో స్కాం చేయడం కొత్తగా అనిపించింది.మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో దుల్కర్ సల్మాన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ నేను తెలుగులో నటించిన ‘మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్’ సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషంగా ఉంది. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుణ్ణి బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. ‘లక్కీ భాస్కర్’ చిత్రంలోని భాస్కర్ పాత్రలో నెగటివ్ షేడ్స్తో పాటు ఎన్నో భావోద్వేగాలున్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి. ఈ సినిమా షూటింగ్ని ప్రతిరోజూ చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.⇒ నేను నటుడు మమ్ముట్టిగారి కొడుకుని అయినప్పటికీ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తాను. లాటరీ తగిలితే సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని చిన్నప్పుడు కలలు కనేవాడిని. ‘లక్కీ భాస్కర్’ చూసిన నాన్నగారు నాతో ఏం చెప్పలేదు. కానీ, వెంకీతో మాట్లాడి యూనిట్ని ప్రత్యేకంగా అభినందించారు. నాకు బాగా నచ్చిన కథల గురించి నాన్నకి చెబుతుంటాను. ‘లక్కీ భాస్కర్’ కథకి తగ్గట్టుగా, ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సినిమాకి వస్తున్న స్పందన చూసి నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్యగార్లు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. -
దిల్ రాజు సినిమా చాన్స్ ఇస్తే.. చేయనని చెప్పేశా: దుల్కర్ సల్మాన్
‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. -
దుల్కర్కు జోడీగా...
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కనుంది. దుల్కర్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో అధికారికంగా ప్రకటించారు. కానీ దుల్కర్ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.ఈ ఏడాది చివర్లో సెట్స్పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
నన్ను నేను సవాల్ చేసుకుంటాను
‘‘ఫలానా పాత్రలే చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని నేనేం పరిమితులు పెట్టుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నాకే కాదు... స్క్రీన్పై నన్ను చూసే ఆడియన్స్కు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా ఎప్పటికప్పుడు నన్ను నేను సవాల్ చేసుకుంటుంటాను. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో తొలిసారిగా నేను అమ్మ పాత్ర చేశాను. ఇక ‘మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాల్లోనూ డిఫరెంట్ రోల్స్ చేశాను’’ అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి చెప్పిన విశేషాలు. ⇒ ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి గృహిణి సుమతి పాత్ర చేశాను. ప్రేమను పంచే కుటుంబం, జీవించడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం భాస్కర్ (దుల్కర్ పాత్ర)ది. కానీ ఎక్కువ డబ్బు, దురాశల కారణంగా భాస్కర్–సుమతిల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు మాది మధ్యతరగతి ఫ్యామిలీయే. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉంటారో తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా ఈ పాత్ర చేశాను. సుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననుకుంటున్నాను. ⇒ నేను నటించిన ‘మట్కా, మెకానిక్ రాకీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్గారితో ఒక సినిమా చేస్తున్నాను. -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్ను వెంకీ సక్సెస్ఫుల్గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్గారి రైటింగ్లో మంచి డెప్త్ ఉంటుంది.విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్లోని పాత్రలు మెచ్యూర్డ్గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య కారణాల వల్లే సినిమాలకు బ్రేక్
-
లక్కీ భాస్కర్ నాకు చాలా ప్రత్యేకం: దుల్కర్ సల్మాన్
‘‘దాదాపు 14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో వినోదం, భావోద్వేగాలు, సంగీతం బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా అన్నివర్గాల వారికి నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేసిన ΄పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన సుమతి నాకు బాగా ఇష్టమైన ΄పాత్ర’’ అన్నారు. ‘‘బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.'లక్కీ భాస్కర్' దీపావళి కానుకగా థియేటర్లోకి రానున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రమని వారు చెప్పుకొచ్చారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఆ కారణం వల్లే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది: దుల్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వచ్చి ఏడాదిపైనే అవుతోంది. గతేడాది ఆగస్టులో కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తర్వాత కల్కి 2898 ఏడీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.అందుకే గ్యాప్ వచ్చిందినా గత సినిమా అంతగా ఆడలేదు. అందులో ఎవరి తప్పూ లేదు. అయితే నాకు చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. అందుకే గతేడాది ఒకే ఒక్క సినిమా చేయగలిగాను. నేను ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. అది నా తప్పే అని చెప్పుకొచ్చాడు.సినిమాల విషయానికి వస్తే..దుల్కర్ ప్రధాన పాత్లలో నటించిన ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఇతడు పీరియాడికల్ ఫిలిం కాంత సినిమా చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. . 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ సాధినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
దీపావళికి లక్కీ భాస్కర్
అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్గా థియేటర్స్లోకి రానున్నాడు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయాలనుకున్నారు.కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైమ్ పడుతుందని, అందుకే వాయిదా వేసి, దీపావళికి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
దుల్కర్ సల్మాన్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
సీతారామం మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.తాజాగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు మంచి క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేస్తున్నామని వెల్లడించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్ను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ సందడి చేయనున్నట్లు పోస్ట్ చేశారు. కాగా.. 1980-90 కాలంలో ఓ బ్యాంక్ క్యాషియర్ అసాధారణస్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.అయితే అక్టోబర్ 31న మరో యంగ్ హీరో సినిమా రిలీజ్ కానుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న మెకానిక్ రాకీ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరి కావడం మరో విశేషం. దీంతో ఓకే రోజు రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు గుంటూరు కారం భామ సిద్ధమైంది. Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024 -
ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ!
వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్కి చేరుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
హీరో దుల్కర్ భార్యని చూశారా? హీరోయిన్ల కంటే అందంగా! (ఫొటోలు)
-
ఆకాశంలో ఒక తార
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ఖరారైంది. పవన్ సాధినేని ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. కాగా ఆదివారం (జూలై 28) దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను అధికారికంగా ప్రకటించి,పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ మూవీ ‘లక్కీభాస్కర్’. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించారు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దుల్కర్ బర్త్ డే సందర్భంగా ‘లక్కీభాస్కర్’ టైటిల్ ట్రాక్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈపాటను ఉషా ఉతుప్పాడారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ స్వరకర్త. -
స్టార్ హీరో తనయుడు.. ఒక్క సినిమాతో తెగ నచ్చేశాడు! (ఫోటోలు)
-
భాస్కర్ డేట్ ఫిక్స్
భాస్కర్గా దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో కనిపించనున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. 1980–90ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 7న ‘లక్కీ భాస్కర్’ని రిలీజ్ చేయనున్నట్లు సోమవారం యూనిట్ పేర్కొంది.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ముంబైలోని బ్యాంకులో పని చేసే క్యాషియర్గా కనిపిస్తారు దుల్కర్. నాటి ముంబై నగరాన్ని, భారీ బ్యాంకు సెట్ని హైదరాబాద్లో రూపొందించాం. భాస్కర్ అసాధారణ ప్రయాణంలో ప్రేక్షకులు లీనమైపోతారు’’ అని యూనిట్ పేర్కొంది. -
వరసగా తెలుగు సినిమా కమిట్ అవుతున్న దుల్కర్..
-
వరసగా తెలుగు సినిమా కమిట్ అవుతున్న దుల్కర్..
-
కోపాలు చాలండి శ్రీమతి గారు.. సాంగ్ విన్నారా?
"మహానటి", "సీతారామం" సినిమాలతో తెలుగులో ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం "లక్కీ భాస్కర్". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. బుధవారం ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు.సాంగ్ అదిరిందిజి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. పాన్ ఇండియా స్థాయిలో..మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా, నవీన్ నూలి ఎడిటర్గా పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. -
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
'లక్కీ భాస్కర్' బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లక్కీ భాస్కర్.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. 'మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టీజర్ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మణిరత్నంకు నో చెప్పిన దుల్కర్ సల్మాన్
-
‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే దుల్కర్ లుక్ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రంగరాయ శక్తివేల్ నాయకర్.. థగ్లైఫ్
‘నాయగన్ ’(1987) చిత్రం తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూ΄÷ందుతున్న తాజా చిత్రానికి ‘థగ్ లైఫ్’ టైటిల్ని ఖరారు చేసి, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక ΄ాత్రలు ΄ోషించనున్నట్లు కూడా వెల్లడించారు. ‘రంగరాయ శక్తివేల్ నాయకర్.. నాది కాయల్ పట్టినమ్’, ‘రంగరాయ శక్తివేల్ నాయకర్ అంటే క్రిమినల్, గూండా, యాకుజా. యాకుజా అంటే జపనీస్లో గ్యాంగ్స్టర్ అని అర్థం’, ‘చావు నా కోసం ఎదురుచూడటం ఇదేం తొలిసారి కాదు. చివరిసారి కూడా కాదు’, ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్.. మర్చి΄ోవద్దు’ అని కమల్హాసన్ చెప్పే డైలాగ్స్ ‘థగ్స్ లైఫ్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్నాయి. కమల్హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు కమల్ బర్త్ డే సందర్భంగా ‘థగ్ లైఫ్’కి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: రవి కె.చంద్రన్. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
ఓటీటీలో దుల్కర్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ప్రేమకథలకు చిరునామాగా మారిన దుల్కర్ సల్మాన్ తొలిసారి యాక్షన్ అవతారమెత్తిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 22న ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సడన్గా ఓటీటీలో వస్తుందేమో అంటే అదీ జరగలేదు. దీంతో ఈ నెల 28 లేదా 29న ఏదో ఒకరోజు ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. హాట్స్టార్లో సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్స్టార్ ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు. సినిమా కథేంటంటే.. కింగ్ ఆఫ్ కొత్త కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. దాన్ని సాకారం చేసుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. నెమ్మదిగా కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. అయితే ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్కి చెక్ పెట్టేందుకుగానూ రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు. అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’ను ఓటీటీలో చూడాల్సిందే. చదవండి: శరత్ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!! -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
దుల్కర్కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్బాబు ‘గుంటూరు కారం’, వరుణ్తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ సినిమాకు పేలవమైన కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్స్టర్ సినిమా అంతగా వర్కవుట్ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ ఇలాగే ఉంటే డిజాస్టర్ దిశగా ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్స్ కూడా డల్ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్ ఆఫ్ కోతగానే ఉంచారు. దుల్కర్ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్ ఆఫ్ కొత్తగా రిలీజ్ చేశారు. చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
ఈ సినిమాలో ప్రతి పాత్ర.. కథని మలుపు తిప్పేదే
‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు.... ► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది. ► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా (నవ్వుతూ). ► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి. -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
నా స్క్రీన్ టైమ్ తక్కువే కానీ..
‘‘దర్శకుడు అభిలాష్ జోషి ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా స్కేల్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్గా అనిపించింది. నాకంటూ డ్రీమ్ రోల్స్ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
దుల్కర్తో వన్స్మోర్ అంటున్న హీరోయిన్!
మాలీవుడ్ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్కు కోలి అనే టైటిల్ను నిర్ణయించారు. అట్లీ శిష్యుడు కార్తీకేయన్ వేలప్పన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్కు జంటగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు. చదవండి: ఈ ప్రేమకథలకు ట్రెండ్తో సంబంధం లేదు -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది. తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్ను వరించిన అవార్డ్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్కుమార్) ఉత్తమ వెబ్ సిరీస్గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్కు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
సౌత్లోనే క్రేజీ హీరో.. కానీ ఈయన్ని నటుడిగానే చూడని భార్య!
చిన్న వయసులోనే కారు నడుపుతున్న ఈ హీరో ఇప్పుడు పెద్ద స్టార్. ఇతడి కంటే ఆయన తండ్రి ఇంకా పెద్ద స్టార్. అగ్రహీరో వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మాతృ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. మహానటిలో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు గతేడాది తెలుగులో హీరోగా చేసి బ్లాక్బస్టర్ హిట్ సాధించాడు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యాడు. అతడే దుల్కర్ సల్మాన్. రెండో సినిమాతో సక్సెస్ మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్. ఇతడు 1986 జూలై 28న జన్మించాడు. ముందు చదువుపైనే ధ్యాస పెట్టిన ఇతడు దుబాయ్లో ఐటీ ఉద్యోగం చేశాడు. అయితే తండ్రి బాటలోనే నడవాలని మనసు లాగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా తిరిగొచ్చేశాడు. ముందుగా నటనలో శిక్షణ తీసుకుని సెకండ్ షో అనే మలయాళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతోనే సినీప్రపంచంలో అడుగుపెట్టాడు కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చేసిన ఉస్తాద్ హోటల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు సైతం పొందాడు. ఆ తర్వాత ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ పోయాడు. సీతారామంతో అమాంతం పెరిగిన క్రేజ్ తమిళ, మలయాళంలోనూ సినిమాలు చేశాడు. తెలుగులో ఓకే బంగారం, మహానటి చిత్రాలతో కావాల్సినంత గుర్తింపు సంపాదించాడు. సీతారామం సినిమాతో దుల్కర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లెఫ్టినెంట్ రామ్గా అభిమానులు ఆయన్ను ఆరాధించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఉప్పొంగిపోయిన ఇతడు ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. జూలై 28న ఆయన బర్త్డే రోజు తెలుగులో మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేసినట్లు వెల్లడించాడు. సార్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి లక్కీ భాస్కర్ టైటిల్ ఫిక్స్ చేశారు. నేను ఎంతపెద్ద స్టార్ అయినా నా భార్య మాత్రం నన్ను కనీసం నటుడిగా కూడా చూడదు. మరోపక్క నాన్న(మమ్ముట్టి).. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోతే ఇంట్లోకి కూడా రానివ్వనని కండీషన్ పెట్టాడు. ఒక్క సినిమా చేయడానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టనిస్తానని సరదాగా హెచ్చరిస్తూ ఉంటాడు. - దుల్కర్ సల్మాన్ -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!
స్టార్ హీరోలు.. తమ అభిమానుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు! దారుణంగా మోసం చేస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య కాలంలో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. తాాజాగా స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. తమని తామే తిట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? వీడియో దానికోసమా? మిగతా హీరోల సంగతేమో గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసి, డిలీట్ చేసేశాడు. తనకు సరిగా నిద్రపట్టడం లేదని ఆ వీడియోలో బాధపడ్డాడు. కట్ చేస్తే.. ఇదంతా కూడా ఓ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) రామ్చరణ్ కూడా పైన దాంట్లో దుల్కర్ వీడియో పెట్టి కావాలని డిలీట్ చేసి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అలా ఏం చేయలేదు. కాకపోతే రెండు రోజుల ముందు ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో రామ్ చరణ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కనిపించారు. ఇదేదో వెబ్ సిరీస్ లేదా సినిమా కోసమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇదీ ఓ బట్టలు విక్రయించే ఓ యాప్ కోసం ప్రమోషన్ అని తేలిపోయింది. ఇలా పైన చెప్పిన రెండు సందర్భాలే కాదు.. ఈ మధ్య పలువురు హీరోహీరోయిన్లు ఇలానే ఏదో ఓ వీడియో రిలీజ్ చేయడం, అభిమానుల్లో హైప్ వచ్చేలా చేయడం, తీరా చూస్తే అది ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం అని తెలిసి మోసపోవడం. ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సొంత హీరోహీరోయిన్లనీ ఏం అనలేక అభిమానులు తమని తామే తిట్టుకుంటున్నారు. కాబట్టి స్టార్స్ ఏదైనా వీడియో, పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు) -
ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. వీడియో డిలీట్ చేసిన దుల్కర్
మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్.. తమిళ, మలయాళ భాషల్లో హీరోగా సత్తా చాటిన ఇతడు మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడు సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో షేర్ చేశాడు. 'తొలిసారి నేను ఓ సంఘటనను ఎదుర్కొన్నాను, అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. దానివల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. జరిగిన సంఘటన నా మైండ్లో నుంచి పోవడం లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ దాన్ని నేను చెప్పలేకపోతున్నాను' అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కాసేపటికే సదరు వీడియోను డిలీట్ చేశాడు. దీంతో అభిమానులు దుల్కర్ మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుల్కర్కు ఏమైంది? అతడి వ్యక్తిగత జీవితం బానే ఉంది కదా? అని కంగారుపడుతున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా యాక్టింగే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రమోషనల్ స్టంట్ అయి ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది హీరోనే స్వయంగా చెప్తే కానీ తెలియదు. ఇదిలా ఉంటే దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోట ఆగస్టు 25న రిలీజ్ అవుతోంది. What happened to #DulquerSalmaan 🥺🥺. He posted and deleted it later. Is everything alright to him ?. #KingOfKotha pic.twitter.com/PyGnrwnorw — DON BOY (@preethamtweets_) July 2, 2023 చదవండి: ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు -
హీరోయిన్ తో డాన్స్ చేసిన సీతారామం హీరో
-
అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్
-
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్కాల్ తనదే: హీరో
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్లో నేను చేసిన పెద్ద సినిమా ఇది. వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్. ‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్కు ఎంత వేల్యూ ఇస్తాం. ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్లో ఎక్స్-షోరూమ్ ధర). దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్లకు ఈ GLS 600ని జోడించారు. -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రం హిందీ వర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్కు లవ్ లెటర్స్) సీతారామం హిందీ వర్షన్ ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ రావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా బాలీవుడ్ అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ వర్షన్ కూడా ఓటీటీలోకి రానుండడంతో థియేటర్లలో చూడలేని వారికి ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. #Sitaramam (Hindi) Premieres on Disney+ Hotstar - November 18th. 🤩😍#SitaRamamHindi @dulQuer @mrunal0801 @iamRashmika https://t.co/uqC5GgRHtS — South Hindi Dubbed Movies (@SHDMOVIES) November 9, 2022 -
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోతా. మలయాళ సీనియర్ దర్శకులు జోషి కుమారుడు అభిలాష్ జోషి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మధురైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. 'అతడికి కొంతమంది భయపడతారు..మరికొంతమంది గౌరవిస్తారు.. ఇంకొంతమంది ప్రేమిస్తారు, కానీ అతని నిజస్వరూఐపం తెలిసినవారు చాలా తక్కువమంది' అంటూ దుల్కర్ పాత్రను చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సమంత, ఐశ్వర్యలక్ష్మీల పేర్లు తెరపైకి వచ్చాయి. -
‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్, మృణాల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. I watched @hanurpudi’s #SitaRamam last night. So refreshing to see @dulQuer… so impressive, his power comes from his genuineness. And what to say about young @mrunal0801 this is the first time I saw her performance… so fresh and original… she will be a big star. Wow. Congrats! — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022 చదవండి: బిగ్బాస్ హౌజ్లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్గుడ్ లవ్స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’
స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్పై స్పందించాడు. చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా ఈ మేరకు దుల్కర్ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్కు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్షాట్స్యే కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్షాట్స్ అవి. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నింటి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్గా అటాక్ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. -
‘సీతారామం’ సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ ఏమన్నారంటే..
ఒక సినిమా హిట్ అయితే చాలు.. దాని సిక్వెల్ తీస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత టాలీవుడ్లోనూ ఈ సీక్వెల్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హిట్ సినిమాల కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘సీతారామం’ మూవీకి కూడా సీక్వెల్ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ దుల్కర్ సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. సీక్వెల్పై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (చదవండి: మహేశ్-రాజమౌళి సినిమా: జక్కన్న భారీ స్కెచ్...హీరోయిన్ ఆమేనా?) ‘ఏదైనా ఒక సినిమాకి విశేష ప్రేక్షకాదారణ లభించి, క్లాసిక్గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందు నుంచే తెలుసుకున్నా. మేం కథను బాగా నమ్మాం. సీతారామం ఒక క్లాసిక్ మూవీగా నిలస్తుందని భావించాం. అనుకున్నట్లే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నా’అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. అలాగే రీమేక్ కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో మృణాళిక ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక,తరుణ్ భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. -
నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్
హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ తనదైన నటన, స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోలలో ఒక్కడిగా మారాడు. ఒకే బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్ని పలకరించిన దుల్కర్ ‘మహానటి’తో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇక రీసెంట్గా విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో రామ్గా ప్రేక్షకు హృదయాలను కొల్లకొట్టాడు. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ అనే ఆర్మీ యువకుడిగా కనిపించాడు. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఈ సినిమాతో తెలుగులో మరో కమర్షియల్ హిట్ అందుకున్నద దుల్కర్ త్వరలో ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ నెగిటివ్ రివ్యూస్, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంగ్లీష్ చానల్తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మొదట్లో తనపై కూడా చాలా నెగిటివ్ రివ్యూస్, విమర్శలు వచ్చాయని, అవి చదివి చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘‘కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని. అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. ‘నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కూడా కొరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్గా పనికి రాననన్నారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకుంటున్నాం’ అంటూ అంటూ నాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అది నన్ను చాలా బాధించింది’’ అంటూ దుల్కర్ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్టాక్ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
చక్కటి ప్రేమకావ్యం.. ‘సీతారామం’పై చిరు ప్రశంసలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యానికి అమరికాలో కూడా మంచి ఆదరణ లభించింది. అక్కడ ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సీతారామం చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా ఆ లిస్ట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. రీసెంట్ ఈ సినిమా వీక్షించిన చిరు.. ట్వీటర్ వేదికగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి: వాట్ ఏ ట్రాన్స్ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో) ‘సీతారామం’చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ప్లేతో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులో చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్, ప్రియాంక దత్లకు, ఒక ప్యాషన్తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలాషిస్తున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. Kudos Team #SitaRamam 💐@VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022 -
సీతారామం మ్యాజిక్.. ఇప్పటికాదా ఎంత వచ్చిందంటే?
అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022 చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
అందుకే 'సీతారామం'లో నటించాను: దుల్కర్ సల్మాన్
ప్రస్తుత రోజుల్లో సినిమాల సక్సెస్ అరుదైపోయిందనే చెప్పాలి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే సుముఖత చూపడం లేదు. ఎందుకు కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే మంచి కంటెంట్తో వచ్చిన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు ఉదాహరణ సీతారామం. తమిళంలో అనువాద చిత్రంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది. దుల్కర్ సల్మాన్, ఉత్తరాది భామ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఇందులో నటి రష్మిక మందన్నా, టాలీవుడ్ నటుడు సుమంత్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈచిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 5వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. త్వరలో హిందీలోనూ వి డుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో లైకా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర సక్సెస్మీట్ను నిర్వహించారు. ముందుగా లైకా సంస్థ నిర్వాహకుడు త మిళ్ కుమరన్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ విజయవంతమైన చిత్రాల వరుసలో సీతారామం నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కూడా మంచి కథా చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ సీతారామం కథ విన్నప్పుడే ఇది డ్రీమ్ చిత్రం అని భావించానని చేశారు. ఇది అద్భుతమైన క్లాసికల్ ప్రేమ కావ్యం అని పేర్కొన్నారు. ఇంతకుముందు వినని కథ కావడం, చాలా ఒరిజినల్గా అనిపించడంతో తాను నటించడానికి అంగీకరించానన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అన్నారు. చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సీతారామం చిత్రం తమిళనాడులోనూ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం వావ్ అనిపించడం వెనుక పెద్ద వార్ ఉందన్నారు. ముఖ్యంగా చిత్ర యూనిట్ మూడున్నర ఏళ్ల శ్రమ ఉంటుందన్నారు. కాశ్మీర్లోని డిఫరెంట్ డిఫికల్ట్ లొకేషన్లో మైనస్ 24 డిగ్రీల చలిలో షూటింగ్ నిర్వహించామన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్, ఇతర నటీనటులు, యూనిట్ సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. -
'సీతారామం' మూవీ సక్సెస్ మీట్.. ఫోటోలు వైరల్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందీ సినిమా. సీత, రామ్ల లవ్స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్కు వెళ్లింది!: నాగార్జున
‘‘గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలను గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్గారు థియేటర్కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు’’ అన్నారు హీరో నాగార్జున. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. చదవండి: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే! హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ మూవీ థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్కి వెళ్లింది (నవ్వుతూ). చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘గీతాంజలి, సంతోషం, మన్మథుడు’ రోజులు గుర్తొచ్చాయి’’ అన్నారు. ‘‘నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు దుల్కర్. ‘‘నేను నాలుగు సినిమాలు తీశాను.. కానీ ‘సీతారామం’ వంటి ఆదరణ లేదు. ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది’’ అన్నారు హను. ‘‘నాగార్జునగారు మా బేనర్లో ఐదు సినిమాలు చేశారు.. ‘మహానటి, సీతారామం’తో మా బ్యానర్కి రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయాడు’’ అన్నారు అశ్వనీదత్. -
సీతారామం కలెక్షన్స్: ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది. మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్
ఓటీటీలు వచ్చాక ఇంకా జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? అబ్బే, సినిమాలు ఆడటం ఇప్పుడంత సులువు కాదు, ఏదో భారీ బడ్జెట్ సినిమాలు అందులోనూ స్టార్ హీరో మూవీస్ అంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వైపు ఓ లుక్కిస్తారు.. ఇలా చాలా మాటలే వినిపించాయి. జూలైలో సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అందుకోవడంతో సినీపండితులు గాబరా పడ్డారు. కానీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సీతారామం, బింబిసార సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. మీడియం రేంజ్ సినిమాలైనా కంటెంట్ ఉంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందేనని స్పష్టం చేశాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ అవడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంపై హీరో దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ అయ్యాడు. 'తెలుగులో డబ్ అయిన నా మొదటి సినిమా ఓకే బంగారం. ఇందుకు మణిరత్నంగారికి ధన్యవాదాలు. తర్వాత నాగి, వైజయంతి.. మహానటిలో జెమిని అనే నెగెటివ్ పాత్ర ఇచ్చారు. ఇక్కడా నన్ను ఆదరించారు. కనులు కనులను దోచాయంటే, కురుప్ కూడా డబ్ అయ్యాయి. ఇలా ప్రతి సినిమాను ఆదరిస్తూ నామీద చూపించిన ప్రేమాభిమానాలను నేనెన్నటికీ మర్చిపోలేను. స్వప్న, హను నన్ను సీతారామం కోసం అడిగారు. ఎప్పటినుంచో నేనొక యునిక్ సినిమాతో తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయాలనుకున్నా. ఇదొక క్వాలిటీ ఫిలిం కాబట్టి దీనితోనే ప్రయాణాన్ని ఆరంభించా. ఎంతోమంది ఆర్టిస్టులు, సిబ్బంది శ్రమ వల్లే సీతారామం ఇంత అందంగా వచ్చింది. సినిమా రిలీజ్ రోజు వచ్చిన స్పందన చూసి సంతోషంతో ఏడ్చేశాను. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీవాడిలా నన్ను భావించినందుకు మరోసారి కృతజ్ఞతలు.. మీ రామ్' అని ఓ లేఖ రాసుకొచ్చాడు. Filled with gratitude and emotion !! 🥹🥹🥹❤️❤️🦋🦋🦋#SitaRamamSaysThankU 🙏💕#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/cF5u4tqeNw — Dulquer Salmaan (@dulQuer) August 9, 2022 మరోవైపు నిర్మాత అశ్వినీదత్ సైతం సినిమా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. సీతారామం సినిమాకు అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉన్నానన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం సీతారామం చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిత్ర నిర్మాణాన్ని రెండేళ్లపాటు ఒంటిచేత్తో నడిపించి మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన స్వప్నకు అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ లేఖలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. A big thank you to everyone 🙏 - @AshwiniDuttCh#SitaRamamSaysThankU #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/PtJ2vyf3Vp — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 9, 2022 చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
కలిసొచ్చిన సండే, ఇప్పటిదాకా సీతారామం ఎంత వసూలు చేసిందంటే?
చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసిన అందమైన ప్రేమకావ్యం సీతారామం.. సినిమా చూశాక ప్రేక్షకులు సంతోషంతో చెప్తున్న మాటిది.. హీరోహీరోయిన్ల నటన, సాంగ్స్, ప్రతి సీనూ అద్భుతంగా ఉండటంతో సీతారామం సినిమాకు పాజిటివ్ స్పందనే కాదు అంతకుమించిన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.60 కోట్ల గ్రాస్, రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ వసూళ్లు కొంత పెరగడంతో రూ.7.25 కోట్ల గ్రాస్ రాగా రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తానికి సీతా, రామ్ల మ్యాజిక్ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. Timeless Blockbuster #SitaRamam Grossed 25 Crores Worldwide in 3️⃣ days 💥 💥 #SitaRamamInCinemas @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/soLWFzobVg — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 #SitaRamam gaining love ❤ from everywhere! Watch the classical love story 💌 of Ram & Sita 💕 in Theaters near you for the amazing visual experience! ✨@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @LycaProductions @proyuvraaj pic.twitter.com/b7bbY6nDWR — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! శ్రీదేవి సినిమాలను రీమేక్ చేస్తారా? జాన్వీ ఆన్సరిదే -
హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్తో ముచ్చటించాడు దుల్కర్ సల్మాన్. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ సందర్భంగా తన తండ్రి మమ్ముట్టి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను సినిమాల్లోకి వస్తానని చెబితే నాన్న బాధపడ్డారంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు, డాన్స్లు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని దుబాయ్లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆ విషయంలో టాలీవుడ్ గ్రేట్: తమిళ నిర్మాత రాజన్ ఆ తర్వాత ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే జరిగిందన్నాడు. ‘నేను సినిమాల్లోకి వెళతానని చెప్పాగానే నాన్న పెద్ద గొడవ చేశారు. అంతకుముందు ఆయనను ఎప్పుడూ అంత కోపం, బాధతో చూడలేదు. హీరోగా చేస్తానని చెప్పగానే నువ్వు ఎప్పుడూ సరదాగా డాన్స్ చేసింది లేదు.. నటించేందుకు నువ్వు ప్రయత్నించడం కూడా నేనేప్పుడు చూడలేదు. యాక్టింగ్ అంటే నువ్వు అనుకున్నత సులువు కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు’ అని చివాట్లు పెట్టారని చెప్పాడు. తాను నటిస్తానంటే వద్దని చెప్పిన ఆయనే ఇప్పుడు తన సినిమాలు చూసి సూచనలు ఇస్తుంటారని దుల్కర్ పేర్కొన్నాడు. -
Sita Ramam: రెండో రోజు పుంజుకున్న‘సీతారామం’ కలెక్షన్స్.. ఎంతంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. (చదవండి: 'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..) పోటీలో ఉన్న ‘బింబిసార’ ఉండటం.. ఆ చిత్రానికి కూడా హిట్ టాక్ రావడంతో తొలిరోజు ‘సీతారామం’ రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్ వసూలు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్, రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ కాబట్టి ఏ సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. బీ,సీ సెంటర్లో ‘బింబిసార’ జోరు వలన కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్ చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ‘సీతారామం’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ.1.39 కోట్లు ► సీడెడ్ - రూ.37 లక్షలు ► ఈస్ట్ - రూ.34 లక్షలు ► వెస్ట్ - రూ. 20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.55లక్షలు ► గుంటూరు- రూ. 30 లక్షలు ► కృష్ణా - రూ.30 లక్షలు ► నెల్లూరు - రూ.13 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.35 లక్షలు ► ఇతర భాషలు రూ. 90 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.85 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ.6.68 కోట్లు(రూ.13.30 కోట్ల గ్రాస్) -
Sita Ramam Movie Box Office Collection: ‘సీతరామం’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సీత, రామ్ల లవ్స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (చదవండి: ‘సీతారామం’ మూవీ రివ్యూ) అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్(రూ.1.50 కోట్ల షేర్) కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.60 కోట్ల గ్రాస్, రూ. రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ బాకా కనెక్ట్ అయినప్పటికీ.. బీ, సీ సెంటర్ ‘బింబిసార’ జోరు వలన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. అయితే ఇలాంటి చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.05 కోట్లు వసూలు చేసింది. ఇంకా రూ.13.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.54 లక్షలు ► సీడెడ్ - రూ.16 లక్షలు ► ఈస్ట్ - రూ.15 లక్షలు ► వెస్ట్ - రూ.8లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు ► గుంటూరు- రూ.16లక్షలు ► కృష్ణా - రూ.13 లక్షలు ► నెల్లూరు - రూ. 5లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ఇతర భాషలు రూ.35 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. రూ.3.05 కోట్లు(రూ.5.60 గ్రాస్ వసూలు) -
సమంతకు కబురొచ్చిందా? ఈ వార్త నిజమైతే..
మాలీవుడ్ నుంచి కబురందుకున్నారట హీరోయిన్ సమంత. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో ‘కింగ్ ఆఫ్ కోథా’ అనే గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కనుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు చిత్రయూనిట్ సమంతను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు. అయితే బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, రణ్వీర్ సింగ్లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సమంత నటించిన ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు సమంత. -
‘సీతారామం’ మూవీ రివ్యూ
టైటిల్ : సీతారామం నటీనటులు : దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాగూర్, సుమంత్, రష్మిక, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాత: అశ్వినీదత్ దర్శకత్వం: హను రాఘవపూడి సంగీతం : విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది:ఆగస్ట్ 05,2022 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమై, తనదైన స్టైల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ..లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మలయాళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్ హీరో నేరుగా తెలుగులో నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సీత,రామ్ల లవ్స్టోరీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి టాక్ని సంపాదించుకోవడమే కాకుండా..సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడం, అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరోలను భాగం చేయడంతో ‘సీతారామం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? సీత,రామ్ల లవ్ స్టోరీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘సీతారామం’ కథంతా 1965, 1985 నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి(సచిన్ ఖేడ్కర్) మనవరాలు అఫ్రిన్(రష్మిక). లండన్లో ఉంటున్న ఆమె తిరిగి వచ్చేసరికి తాతయ్య చనిపోతాడు. ఇంట్లో ఓ ఉత్తరం ఉంటుంది. అది 20 ఏళ్ల క్రితం భారత సైనికుడు లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) రాసిన లెటర్. దానిని హైదరాబాద్లో ఉంటున్న సీతామహాలక్ష్మికి అందజేయాల్సిన బాధ్యతను అఫ్రిన్కి అప్పజెప్పుతాడు. అది తాతయ్య చివరి కోరిక. తాతయ్యపై ప్రేమతో కాకుండా ఆ లెటర్ సీతామహాలక్ష్మికి అందిస్తే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదన్న కండీషన్ ఉండడంతో అఫ్రిన్ ఆ లెటర్ని పట్టుకొని హైదరాబాద్ వెళ్తోంది. సీత గురించి వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సీతా, రామ్ల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. లెఫ్టినెంట్ రామ్ ఓ అనాథ. దేశం కోసం పనిచేయడం తప్ప..ఆయనకంటూ నా అనేవాళ్లు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి ఓ రోజు లెటర్ వస్తుంది. అది సీతామహాలక్ష్మి రాసిన లేఖ. అడ్రస్ లేకుండా వచ్చిన ఆ ఉత్తరాలను చదివి ఆమెతో ప్రేమలో పడిపోతాడు రామ్. ఓ రోజు సీతను కలుస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం..ఆపై ప్రేమ పుడుతోంది. ఓ రహస్యాన్ని దాచి రామ్ కోసం హైదరాబాద్ నుంచి కశ్మీర్కి వస్తుంది సీత. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో ఓ కారణంగా వాళ్లిద్దరు దూరమవుతారు. అసలు సీత దాచిన రహస్యం ఏంటి? సీత ఎవరు? సీత కోసం రామ్ రాసిన లేఖ పాకిస్తాన్లో ఎందుకు ఆగిపోయింది? ఆ లెటర్ని ఆఫ్రిన్ సీతకు అందించిందా లేదా? అందులో ఏముంది? అసలు అఫ్రిన్కు రామ్ ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ‘సీతారామం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు స్పెషలిస్ట్ హను రాఘవపూడి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా..లవ్ స్టోరీని మాత్రం బాగా హ్యాండిల్ చేస్తారనే పేరుంది. ఇప్పుడు ‘సీతారామం’తో కూడా అదే మ్యాజిక్ని రిపీట్ చేశాడు. యుద్దంతో ముడిపడి ఉన్న ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అంతే బ్యూటిఫుల్గా తెరకెక్కించాడు. ప్రేమ, యుద్ధం అనే రెండు వేర్వేరు నేపథ్యాల్ని ఉత్తరంతో కలిపి ఓ బ్యూటిఫుల్ లవ్స్టోరీని తెరపై చూపించాడు. పాకిస్తాన్ తీవ్రవాదులు కశ్మీర్లో ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పాయింట్తో కథ మొదలవుతుంది. అయితే ఇది ప్రేమ కథా చిత్రమని మేకర్స్ మొదటి నుంచి ప్రచారం చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి అంతా రామ్, సీతల లవ్ స్టోరీపైనే ఉంటుంది. ఎప్పుడైతే రామ్కి సీత ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. సీత కోసం రామ్ హైదరాబాద్ వెళ్లడం.. అక్కడ వాళ్ల జర్నీ..తనకు ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరిని రామ్ కలుస్తుండడం.. ఇలా తెలియకుండానే ఫస్టాఫ్ ముగుస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిశోర్, సునీల్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్లో సీత, రామ్లా లవ్స్టోరీ ఎలా సాగుతుందనేదానిపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. అంతే ఆసక్తిగా సెకండాఫ్ సాగుతుంది. లవ్స్టోరీని క్యారీ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ని యాడ్ చేస్తూ సెకండాఫ్ని నడిపించాడు. రామ్ తనకు లేఖలు రాసిన ఓ చెల్లి దగ్గరకు వెళ్లడం..ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఆ బాధ్యతను తనపై వేసుకోవడం హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఆర్మి అధికారి విష్ణుశర్మ(సుమంత్)లోని రెండో కోణం కూడా ఇంట్రెస్టింగ్ చూపించాడు. సినిమా ప్రారంభంలో కశ్మీర్ అల్లర్లకు, యుద్దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో అనేదానికి సెకండాఫ్లో మంచి వివరణ ఇచ్చాడు. అలాగే అఫ్రిన్ పాత్ర ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రతి పాత్రని ఫర్ఫెక్ట్గా వాడుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగినప్పటికీ.. సెకండాఫ్లో మాత్రం ఎమోషనల్గా నడిపించి సరికొత్త ప్రేమ కథను చూపించాడు. ఎలాంటి అశ్లీలత లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే. లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన మాటతీరు, యాకింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు దుల్కర్ ఫర్ఫెక్ట్ చాయిస్ అనేలా నటించాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. ఇక సీత పాత్రకు మృణాల్ న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించింది. మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్గా రష్మిక అదరగొట్టేసింది. క్లైమాక్స్లో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా పండిన పాత్రల్లో సుమత్ది ఒకటి. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తొలి నుంచి అనుమానంగానే చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఆయన భార్యగా భూమిక కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రలో అంతగా స్కోప్ లేదు. ఇక గోపాల్గా తరుణ్ భాస్కర్తో పాటు ఆర్మీ చీఫ్లుగా ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ సంగీతం. అద్భుతమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ని తెరపై అందంగా చూపించాడు. కశ్మీర్ అందాలను అద్భుతంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Sita Ramam Movie HD Images : ‘సీతారామం’ మూవీ స్టిల్స్
-
Sita Ramam Movie: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ
'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక, సుమంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘సీతారామం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 05) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సీతారామం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #SitaRamam Overall a Decent Poetic Love Story that works for the most part! The visuals and the technical values are top notch. DQ did well and Mrunal completely steals the show. Flipside, the pacing and length feel tedious at parts and could be crisper. Rating: 2.75-3/5 — Venky Reviews (@venkyreviews) August 5, 2022 సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్. విజువల్స్ , టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయని చెబుతున్నారు. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతమని కామెంట్ చేస్తున్నారు. #SitaRamam Reviews! Good First Half! Very Good Introduction,Love Scenes,Classic BGM, Songs😍, Interval👍🏻 Excellent 2nd Half! Classic Screenplay Dealed Very Well👍🏻, Songs and Climax👏🔥 4/5- Winner!!! pic.twitter.com/jkGoiBh7ml — Ikbal Hossen (@IkbalHossen1997) August 5, 2022 ఫస్టాప్లో వచ్చే లవ్ సీన్స్, పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయిందట. ఇక సెకండాఫ్ లో స్క్రీన్ప్లేతో మాయ చేశారని చెబుతున్నారు. పాటలు, క్లైమాక్స్ కూడా బాగున్నాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #MovieCritiq 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 𝗠𝗼𝘃𝗶𝗲 : #SitaRamam 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 3/5 𝗣𝗼𝘀𝗶𝘁𝗶𝘃𝗲𝘀 : @dulQuer gave his 100% efforts as usual ~ bgm 👌 ~ @mrunal0801 and @bhumikachawlat impressed 👌 𝗡𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗲𝘀 : Slow First half but good second half 👍#SitaRamamreview #MovieCritiq pic.twitter.com/vp1VRoosoF — The Movie Critic ! (@MovieCritiq) August 5, 2022 రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడని, మృణాల్, దుల్కర్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందట. అయితే ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #SitaRamam After an average first half the second half really picks up momentum and with good songs the overall experience is heartwarming! Overall a very good experience! Definitely deserve a theatrical experience! — Sunny Cinema☀️ (@Sunny9z) August 5, 2022 #SitaRamam USA premiers started... So far so good 👏👏 Good reports for First Half 👌 2nd half progressing..#DulquerSalmaan @mrunal0801 — AB George (@AbGeorge_) August 5, 2022 Last 30min 👍 Poetic, Well rounded story. 1st half could've been lot better. Introduced the army stuff in 1st 30min & then that's it. He came back at it again in the climax. Hence, the story didn't seem like progressing much. Ideas didn't translate into situations. #SitaRamam — God of Thunder (@Kamal_Tweetz) August 5, 2022 #SitaRamam It's one of the most beautiful love stories I have watched. Hanu has done it. Not even a single boring moment. Chemistry between @dulQuer and @mrunal0801 ❤️❤️ Last lo emotional ayya. Beautiful cinematography, emotions, music 👏👏 Easily Top 3 of the year 4/5 pic.twitter.com/wSzX3MV684 — #TeamSitaRamam (@HemsssWorth) August 5, 2022 #SitaRamam Reviews! Avg First Half Good second half Classic BGM, Songs 🍃 2.3/5 — Devil (@Devil_170) August 5, 2022 #SitaRamam Good first half followed by excellent Second half 💝 4/5✨️@dulQuer and #Mrunal will steal your heart 💯 — South Movies (@2_jibin) August 5, 2022 -
ఆ పదం విని విని విసుగొచ్చింది : దుల్కర్ సల్మాన్
పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు’అని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. ఆయన హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► 'సీతారామం'చాలా ఒరిజినల్ కథ. ఇందులో నేను ఆమ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాను. రామ్ ఒక అనాధ. అతనికి దేనిపైనా ద్వేషం ఉండదు. పాజిటివ్ పర్సన్. అతనికి దేశభక్తి చాలా ఎక్కువ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా ఉంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే. ► ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. ‘కానున్న కళ్యాణం’ పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా ఉంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. ► ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఊహించుకుంటాం. 'సీతారామం' కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా అలానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ, ఎనర్జిటిక్ పర్శన్. ► ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ. ► అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్ అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్శన్. చాలా పాజిటివ్ గా ఉంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా ఉంటుంది. నా కోసం ది బెస్ట్ ని ఎంపిక చేస్తారు. దర్శకుడు హను ఈ కథని అద్భుతంగా ప్రజంట్ చేశారు. ► ప్రేమ కథలకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ ఉంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా ఉండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ► తెలుగు ప్రేక్షకులు నాపై చూపిన అభిమానం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. చాలా రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి వచ్చినపుడు ‘మీ సినిమా ఉస్తాద్ హోటల్ చూశాం. చాలా బావుంది' అని ఓ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పారు. అది నా రెండో సినిమా. ఆ చిత్రానికి కనెక్ట్ అవ్వడం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. అలాగే నా చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై చూసి సినిమాల పట్ల ఉన్న ఒక ప్యాషన్ తో చాల మంది కనెక్ట్ అవ్వడం ఆనందమనిపించింది. ► నాన్న గారు నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. సినిమాలు, కథలు గురించి ఇంట్లో మాట్లాడుతుంటాం. నేను నా కథలని సింగిల్ లైన్ లో చెబుతుంటాను. నాన్న గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనే నా హీరో. ► దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ఉంటుంది. -
అందుకే నాకు బాయ్ఫ్రెండ్ ఉండరట!
‘‘వైవిధ్యమైన పాత్రల్లో ఆడియన్స్ నన్ను చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నా పాత్రల ఎంపిక ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉండాలనుకుంటాను’’ అని అన్నారు మృణాళ్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్ప ణలో స్వప్న సినిమాపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మృణాళ్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ► ‘సీతారామం’ స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులోని సీతామహాలక్ష్మి పాత్ర చేయడానికి అంగీకరించాను. వైజయంతీ బేనర్ నిర్మించిన ‘మహానటి’ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్తో నాకు ముందే పరిచయం ఉంది. ‘మహానటి’ మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ అప్పుడు ఆయన్ను నేను కలిశాను. నేను హిందీలో యాక్ట్ చేసిన ‘లవ్ సోనియా’ చిత్రం అదే ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్కు ఎంపిక కావడంతో వెళ్లాను. ‘మహానటి’లో కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించారు. ఇలాంటి పాత్రను నేను ఎందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డాను. ►‘సీతారామం’లాంటి మంచి సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. హిందీలో నా తొలి చిత్రం ‘లవ్ సోనియా’ విడుదలైన తర్వాత నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ ‘సీతారామం’ ట్రైలర్ విడుదల తర్వాత నాకు తెలుగు, హిందీలో కొత్త ఆఫర్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. హిందీలో ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ చేశాను. ఇది తెలుగులో కూడా డబ్ అయింది. ఇందులో నా క్యారెక్టర్కు కాస్త రొమాంటిక్ టచ్ ఉంటుంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సీతారామం’ అనే రొమాంటిక్ ఫిల్మ్ చేశాను. ‘కుంకుమ భాగ్య’ సీరియల్లో నా అక్క పాత్రలో నటీమణి మధురాజా నటించారు. సీతామహాలక్ష్మి పాత్రకు ఆమెను కాస్త స్ఫూర్తిగా తీసుకున్నాను. ‘సీతారామం’ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నన్ను మృణాళ్గా కన్నా కూడా సీతగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను బరువు కూడా పెరిగాను. ►ఓ సినిమాకు నాలుగో అసిస్టెంట్ డైరెక్టర్గా నా జర్నీ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ సినిమాకు నాకు పారితోషికం కూడా అందలేదు. నేను యాక్టర్ అవుతానని అప్పట్లో ఊహించలేదు. పైగా తెలుగు హీరోయిన్ అవుతానని నేను అనుకోలేదు. రేపు నా బర్త్ డే. ‘సీతారామం’ రిలీజ్కు రెడీ అయ్యింది. అందుకే ఈ సినిమానే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్గా భావిస్తున్నాను. ►నాకు కొన్ని లవ్ లెటర్స్ వచ్చాయి (నవ్వుతూ..). కానీ ప్రజెంట్ నా ఫోకస్ అంతా ‘సీతారామం’ పైనే. ప్రమోషన్స్, షూటింగ్స్ కోసం ఇవాళ ముంబైలో ఉంటావు. రేపు హైదరాబాద్ వెళ్తావు. ఇలా ఉంటే నీకు బాయ్ఫ్రెండ్ ఉండరు.. ఎవరు ఉంటారు?’ అని నా స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తుంటారు. ►హిందీలో నేను చేసిన ‘ఫిపా’, ‘పూజా మేరీ జాన్’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ఆదిత్యా రాయ్ కపూర్తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. -
‘సీతారామం’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ‘సీతారామం’ టీం సందడి (ఫొటోలు)
-
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022 -
కథ నచ్చితే విలన్గా రెడీ
‘‘ఒక ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్లో తొలిసారిగా ‘సీతారామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. కథ నచ్చితే నెగటివ్ పాత్రలు చేయడానికి రెడీ’’ అని అన్నారు సుమంత్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్ చేసిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర లుక్ను శనివారం విడుదల చేశారు. ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ... మద్రాస్ రెజిమెంట్’’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ చిత్రంలో సీతరాముల కథను చెప్పాం (ఈ చిత్రంలో హీరో సుమంత్ పాత్ర రామ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ పాత్ర సీత). ఇప్పుడు ఈ ‘సీతారామం’ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నన్ను నటించమన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని హను రాఘవపూడిగారిని అడగడం జరిగింది. దాదాపు 150 పేజీల స్క్రిప్ట్ను చదివి, ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. చాలా షేడ్స్ ఉన్నాయి. నెగటివ్ రోల్ కాదు. బ్యూటీఫుల్ అండ్ చాలెంజింగ్ రోల్లా అనిపించింది. నా కెరీర్లో దుల్కర్ సల్మాన్ను ఓ మంచి కో స్టార్గా చెబుతాను. జనరల్గా సెట్స్లో నేను మానిటర్ చూడను. డైరెక్టర్ ఓకే అంటే నాకు ఓకే. ఈ సినిమా రషెస్ చూసి అశ్వనీదత్ గారు నన్ను అభినందించారు. హ్యాపీ ఫీలయ్యాను. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘సీతారామం’ చిత్రం మంచి హిట్గా నిలుస్తుంది. మరోవైపు నేను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో వెబ్ సిరీస్లు చూస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీ స్పేస్లో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. అలాగే నాకు, తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు)గారికి పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. మా అమ్మగారు తాతయ్యలా ఉంటారు. నేను మా అమ్మ పోలికలతో ఉంటాను (నవ్వుతూ). తాతగారి పోలికలు నాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు. -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
Sita Ramam: ఇంతందం దారి మళ్లిందా.. మెలోడీ అదిరింది
‘‘ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా’ అంటూ పాడేస్తున్నారు దుల్కర్ సల్మాన్. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘సీతారామం’. రష్మికా మందన్న కీలక పాత్ర చేశారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఇంతందం దారి మళ్లిందా..’ అంటూ సాగే లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. కృష్ణకాంత్, మృణాల్, హను, విశాల్ హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘1965 యుద్ధం నేపథ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిన చిత్రమిది. ‘ఇంతందం దారి మళ్లిందా..’ పాటని కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ఆ పాట వినగానే నాకు వేటూరిగారు గుర్తుకొచ్చారు. ఎస్పీ చరణ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది’’ అన్నారు విశాల్ చంద్రశేఖర్. ‘‘ఇంతందం దారి..’ పాట విన్న ప్రతిసారీ మనసు హాయిగా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. ‘‘1965లో ఉండేలా స్వచ్ఛమైన తెలుగు పాట రాయమని హను ‘ఇంతందం దారి..’ పాట సందర్భం చెప్పి నప్పుడు ఆనందంగా అనిపించింది. ఈ పాట అత్యద్భుతంగా ఉంటుంది’’ అన్నారు కృష్ణకాంత్. -
‘‘సీతారామం’ కోసం వందల మంది రెండేళ్లు కష్టపడ్డాం’
‘‘సీతారామం’ కథ గొప్పగా ఉంటుంది. నటుడిగా నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్ చేస్తే నేను హ్యాపీ. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా’’ అన్నారు దుల్కర్ సల్మాన్. లెఫ్టినెంట్ రామ్గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వీనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. (చదవండి: ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది) ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘సీతారామం’ ఒక మ్యాజికల్ లవ్స్టోరీ. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడానికి వందల మంది రెండేళ్లుగా కష్టపడ్డాం. వైవిధ్యమైన ప్రదేశాల్లో మైనస్ 24 డిగ్రీల్లో కూడా షూట్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ‘‘మా బేనర్లో ‘మహానటి’లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న జెమినీ గణేశన్గారి పాత్రని దుల్కర్ బాగా చేశారు. తనకు మా మీద నమ్మకం ఎక్కువ. అందుకే దుల్కర్కి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. ఈ కథకి దుల్కర్ వెంటనే ఓకే చెప్పారు’’ అన్నారు స్వప్నాదత్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్మికా మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: -
టీజర్: ఎవరూ లేని హీరోకు ఇట్లు నీ భార్య అంటూ ఉత్తరాలు!
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్ ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. 'లెఫ్టినెంట్ రామ్.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది' అంటూ హీరో గురించే ఆలోచిస్తున్న హీరోయిన్ వాయిస్ ఓవర్తో టీజర్ మొదలైంది. ఎవరూ లేని అతడికి అన్నీ తానే అవడానికి రెడీ అవుతుంది హీరోయిన్. అతడికి ప్రేమలేఖలు రాయడం మొదలుపెడుతుంది. 'నీ భార్య సీతామహాలక్ష్మి' అంటూ అతడికి ఉత్తరాలు రాస్తుంది. ఆమె ఎవరా? అంటూ తన గురించి ఆలోచించడం మొదలుపెడతాడు హీరో. మరి వీరి ప్రేమ కావ్యాన్ని చూడాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే! కాగా సీతారామంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఖరీదైన ఎస్యూవీ కారు కొన్న స్టార్ హీరో 7/G బృందావన్ కాలనీ హీరోయిన్తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ -
సీతారామం రిలీజ్ డేట్ వచ్చేసింది!
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 5న థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా బుధవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చరిత్రలోని పేజీల్లో దాగి ఉన్న ప్రేమలేఖ ‘సీతారామం’గా థియేటర్స్లోకి వస్తుంది’’ అని ట్వీట్ చేశారు దుల్కర్. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్. A love letter from the pages of history delivering soon to theatres near you…#SitaRamam Worldwide Release On 𝐀𝐮𝐠 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟐 ♥️@mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @Composer_Vishal @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/CUfh6K9rlN — Dulquer Salmaan (@dulQuer) May 25, 2022 చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్లో స్టార్ హీరో కూతురు సందడి, ఫొటోలు వైరల్ -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన యంగ్ హీరోలు
వేరీజ్ దట్ మోడ్రన్ హెయిర్ స్టయిల్.. వాటీజ్ దిస్ మీసకట్టు.. వేరీజ్ దట్ లవర్ బోయ్ లుక్ అంటే... కట్ చేశా.. లుక్ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్.. ఆన్ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం. 'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్కు వెళ్లొచ్చారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్లో ఆమిర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్గా కనిపిస్తారు. సినివలో ఓ వార్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్సింగ్ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్ రోల్. మరోవైపు విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సోల్జర్గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్’ (జేజీఎమ్ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ మూవీ ‘లైగర్’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘జేజీఎమ్’. ‘‘ఇండియన్స్ ఆర్ టైగర్స్, ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కేన్ రూల్ దిస్ వరల్డ్.. 'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఏ లెవల్లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్లోనే టైమ్ స్పెండ్ చేశారు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్గా రషి్మకా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ బోర్డర్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సుమంత్ది కూడా సోల్జర్ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ‘ఏజెంట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చదవండి: మందు తాగుతా, ఆ టైమ్లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్ దటీజ్ రామ్చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా
Dulquer Salmaan Salute Ott Date Fix: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా సెల్యూట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇందులో దుల్కర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, మనోజ్ కె జయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్నిదుల్కర్ సల్మాన్ తన హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్పై నిర్మించారు. -
యంగ్ హీరో ఓటీటీ ఎంట్రీ ఫిక్స్!
Dulquer Salmaan Starts Web Series: ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓటీటీ ఎంట్రీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మేన్’ వంటి సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సిరీస్లో దుల్కర్ ఓ లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాజ్కుమార్ రావ్, ఆదర్శ్ గౌరవ్ ఇతర ప్రధాన తారాగణం. కామెడీ, సస్పెన్స్ బ్యాక్డ్రాప్లో ఈ సిరీస్ రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రలు చేసిన ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) త్వరలో స్ట్రీమిగ్ కానుంది. ఇటు తెలుగులో ‘లెఫ్టినెంట్ రామ్’గా స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తోన్న దుల్కర్ ప్రస్తుతం కరోనా పాజిటివ్తో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. -
మొన్న తండ్రి.. ఇప్పుడు తనయుడు.. వదిలిపెట్టని కరోనా
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ తేడా లేకుండా అందరికీ సోకుతూ ఇండస్ట్రీని గడగడలాడిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్లు కరోనా బారిన పడగా తాజాగా మరో యంగ్ హీరోకు వైరస్ సోకింది. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నాను. స్వల్ప కోవిడ్ లక్షణాలు మినహా అంతా బాగానే ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ ఐసోలేషన్లో ఉంటే మంచింది. ఈ మహమ్మారి మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా దుల్కర్ తండ్రి, మలయాళ స్టార్ మమ్ముట్టి సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే! సంక్రాంతి రోజే తను కోవిడ్ ఉన్నట్లు తేలిందని సోషల్ మీడియాలో వెల్లడించాడు. వారం రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
టాలీవుడ్కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
నేను బ్యాడ్ బాయ్లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్
Dulquer Salman Starer Kurup Movie: ‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. ఇక్కడ రానా, అఖిల్.. ఇలా కొందరు స్నేహితులున్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు వస్తుందని చెప్పలేను. ‘కురుప్’ యూనివర్సల్ సబ్జెక్ట్.. అందుకే తెలుగులోనూ విడుదల చేస్తున్నాం’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కురుప్’. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి, నిర్మించారు. శోభిత ధూలిపాళ్ల కథానాయిక. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ– ‘‘శ్రీనాథ్ రాజేంద్రన్, నా జర్నీ ఒకేసారి మొదలైంది. నా తొలి సినిమా (‘సెకండ్ షో’) ఆయనతోనే చేశాను. అప్పుడే ‘కురుప్’ చేయాలనుకున్నాం. ఇది సుకుమార కురుప్ అనే కిల్లర్ జీవితంతో తీసిన సినిమా. ఇందులో మేం అతడిని హీరోలా చూపించలేదు. నేను కురుప్గా బ్యాడ్ బాయ్ పాత్రలో కనిపిస్తాను. కురుప్ వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయో చూపించాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో
‘‘కురుప్’ సినిమా నాకు చాలా స్పెషల్. ట్రైలర్లోని విజువల్స్ను చూసినప్పుడు సినిమా కోసం మేం ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఇవి కేవలం సినిమాలో ఒక శాతమే. ఈ సినిమా స్టోరీ, ఐడియా యూనివర్సల్. అందుకే మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. ‘కురుప్’ సినిమాకు నేనే తెలుగులో డబ్బింగ్ చెప్పాను ’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. శ్రీ నాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, శోభితా ధూలిపాళ్ల జంటగా రూపొందిన మలయాళ చిత్రం ‘కురుప్’. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కానుంది. ఫణికాంత్, రోహిత్ ‘కురుప్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ రావడం అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులను మించిన సినిమా ప్రేమికులు ఉండరేమోనని నా భావన. నా కెరీర్లో 2012లో వచ్చిన సినిమా ‘ఉస్తాద్ హోటల్’. అప్పట్లో నేను హైదరాబాద్కు వచ్చిన ఓ సందర్భంలో కొందరు నా ‘ఉస్తాద్ హోటల్’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ఇంత ఓటీటీ లేదు. అయినా తెలుగు ప్రేక్షకులు నా సినిమా చూశారు. అంటే 2012లో వచ్చిన మంచి సినిమాల లిస్ట్ను పరిశీలించుకుని వారు ఆ సినిమాను చూసి ఉంటారు. సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు అంత ప్రేమ. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నా సెకండ్ స్ట్రయిట్ ఫిల్మ్ తెరకెక్కుతోంది’’ అన్నారు. ‘‘తెలుగులో ‘కురుప్’ను విడుదల చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన దుల్కర్కు థ్యాంక్స్. సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత రోహిత్. ‘‘నేనేదైనా కథ రాసినప్పుడు దుల్కర్ సలహాలు, సూచనలు తీసుకుంటాను’’ అన్నారు విన్నీ విశ్వ. ఈ కార్యక్రమంలో సంజయ్ రెడ్డి, రితీష్ రెడ్డి, నైమిష్ రవి, భరత్, లగడపాటి శ్రీధర్ పాల్గొన్నారు. -
‘మహానటి’ నటుడి పాన్ ఇండియా మూవీ.. విడుదల ఎప్పుడంటే..
‘ఒకే బంగారం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. కీర్తీ సురేశ్ ‘మహానటి’లో లీడ్రోడ్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అనంతరం వచ్చిన డబ్బింగ్ మూవీతో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా తన క్రేజ్ని మరింత పెంచుకున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కురుప్’. ఈ సినిమాని నవంబర్ 12 విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు దుల్కర్. ‘చివరి ఈ మూవీని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి సినిమాకి ఓ డెస్టినీ ఉంటుంది. అది ఎప్పుడూ విడుదల కావాలో అప్పుడే అవుతుందని నాకు తెలుసు. త్వరలో థియేటర్స్లోకి రాబోతున్నాం’ అంటూ తెలియజేశాడు ఈ కుర్రహీరో. అయితే మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అదే పేరుతో విడుదల కానుంది ఈ మూవీ. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించాడు. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కథానాయికగా నటించింది. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ను ముప్పుతిప్పలు పెట్టిన భయంకరమైన క్రిమినల్ ‘సుకుమార కురుప్పు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అతను 1984లో కేరళలో ఇన్సూరెన్స్ డబ్బులకోసం ఓ అమాయకుడిని కారులో వేసి తగలబెట్టి తనే చనిపోయినట్లు నమ్మించాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చదవండి: లెఫ్టినెంట్ రామ్గా దుల్కర్, గ్లింప్స్ రిలీజ్ At last, we are ready to set Kurup free. The film always had a destiny if it’s own. And I knew it wouldn’t come out till the time. Conning Soon. In cinemas near you, November 12th! #കുറുപ്പ് #குருப் #కురుప్ #ಕುರುಪ್ #कुरुपु #Kurup #KurupFromNovember12 pic.twitter.com/Tivh1u0hhV — dulquer salmaan (@dulQuer) October 23, 2021 -
దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో..
ఓ వ్యక్తి ఆన్లైన్ క్రైంకు పాల్పడ్డాడు.అమెజాన్లో ఖరీదైన వస్తువుల్ని బుక్ చేయడం, వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత పార్ట్ పార్ట్లుగా ఓపెన్ చేసి ఒరిజినల్ పార్ట్స్ బదులు డమ్మీ పార్ట్స్ను అమర్చేవాడు.ఆ ఒరిజినల్ భాగాల్ని అమ్మేసేవాడు.విలాసవంతంగా బతికేవాడు.హీరో సల్మాన్ దుల్కర్ సినిమాని తలపించేలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లు ఇలాగే చేశాడు.చివరికి.. కనులు కనులను దోచాయంటే సినిమాకు మించి దేసింగ్ పెరియసామి డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ అండ్ క్రైమ్ థిల్లర్ చిత్రం 'కనులు కనులను దోచాయంటే'. ఈ సినిమాలో ఆన్లైన్ క్రైం చేసి విలాసవంతంగా జీవించే కేరక్టర్లో దుల్కర్ సల్మాన్ రియలస్టిక్గా నటించాడు. ఈ సినిమా చూసిన వాళ్లెవ్వరైనా ఇలా కూడా ఆన్లైన్ క్రైం చేయొచ్చా' అని అనుకునేంతలా క్యురియాసిటీని పెంచుతుంది. అచ్చం అలాగే అమెరికాకు చెందిన 'హడ్సన్ హామ్రిక్' అమెజాన్లో 2016 - 2020 మధ్య కాలంలో అమెజాన్లో ఖరీదైన ఆపిల్,ఆసుస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గిటార్స్, టూల్స్, కంప్యూటర్స్, గృహోపకరాణలు ఇలా మొత్తం 270 ప్రాడక్ట్లను బుక్ చేశాడు. బుక్ చేసిన 250 వస్తువుల్ని ఓపెన్ చేయడం..అందులోని విలువైన భాగాల్ని తొలగించి, వాటి స్థానంలో నకిలీ భాగాల్ని అమర్చేవాడు. అనంతరం తాను బుక్ చేసిన ప్రాడక్ట్లు బాగలేవని, లేదంటే తాను బుక్ చేసిన ప్రాడక్ట్ వేరే కలర్ అంటూ వాటిని రిటర్న్ చేశాడు. వీటికి సంబంధించి దాదాపు 300 మోసపూరిత లావాదేవీలు నిర్వహించాడు. ఈ ఫ్రాడ్ మొత్తం వ్యాల్యూ $290,000 (ఇండియన్ కరెన్సీలో రూ.2,18,60,055.00) గా ఉందని ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు గుర్తించారు. 20ఏళ్లు జైలు శిక్ష అయితే నిందితుడి నుంచి రిటర్న్ వస్తున్న ప్రాడక్ట్లలో ఏదో మోసం జరుగుతుందని అమెజాన్ గుర్తించి ఎఫ్బీఐ అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నిందితుడు హడ్సన్ హామ్రిక్ చేసిన ఈ ఫ్రాడ్పై నార్త్ కరొలినాలోని షార్లెట్ నగరానికి చెందిన వెస్ట్రన్ డిస్ట్రిక్ నార్త్ కరొలినా న్యాయస్థానం ఈ ఏడాది అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు చేసిన మోసానికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు $250 000 (ఇండియన్ కరెన్సీలో రూ.18,775,625) ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి విలియం టి. స్టెట్జర్ తీర్పిచ్చారు. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
ఇదే బెస్ట్ బర్త్డే గిఫ్ట్: దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ఓ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. నేడు (జూలై 28) దుల్కర్ బర్త్డే సందర్భంగా ఆయనను లెఫ్టినెంట్ రామ్గా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మంచు కొండల్లోనూ తన విధులు నిర్వర్తిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు హీరో. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇదే తన బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అని దుల్కర్ ట్విటర్లో పేర్కొన్నాడు. Thank you for the lovely surprise you guys. Here’s a poster of my next Telugu project with Hanu Raghavapudi. It has been a great learning experience shooting for this one across India and can’t wait for you guys to watch it on screen. @SwapnaDuttCh @SwapnaCinema @hanurpudi pic.twitter.com/Ht272CUMZc — dulquer salmaan (@dulQuer) July 28, 2021 -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్హౌజ్లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్హౌజ్ను మనదేశంలో ఈ ఏప్రిల్లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
సైనికుడిగా దుల్కర్ సల్మాన్.. కొత్త సినిమా గ్లిమ్స్ విడుదల
ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో మద్రాస్ ఆర్మీ ఆఫసర్ లెఫ్ట్నెంట్ రామ్గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలిపింది. `ప్రేమకోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిరస్మరనీయం..త్వరలో తన ప్రేమ కావ్యంతో మన ముందుకు మా లెఫ్ట్నెంట్ రామ్.. చెడుపై మంచి తప్పకుండా గెలుస్తుంది అంత వరకూ సేఫ్గా ఉండండి అని తెలిపింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. -
సినిమా టాకీస్: సంక్షిప్త సమాచారం
దుల్కర్ సెల్యూట్ దుల్కర్ సల్మాన్ హీరోగా రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ‘సెల్యూట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో దుల్కర్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ ఈ సినిమా ద్వారా మలయాళ చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి çసంగీతం: సంతోష్ నారాయణన్. యువత కథ ‘‘ఓ మహిళ నిర్మిస్తున్న ‘ఒక యువత కథ’ చిత్రం లోగో ఆవిష్కరణ మహిళా దినోత్సవం సందర్భంగా మా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. 30 మంది కొత్త వారిని తెరకు పరిచయం చేస్తూ, రూపొందుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ అన్నారు. ఆపతి ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఒక యువత కథ’. ప్రవీణ్ ఎంటర్టైన్మెంట్స్–సూర్య కుమారి వర్క్స్ పతాకంపై ఏలూరి సూర్యకుమారి నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని రామసత్యనారాయణ, సాయి వెంకట్ విడుదల చేశారు. ఏలూరి సూర్యకుమారి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి కొత్తవారిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుత యువత ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు ఆపతి ప్రవీణ్ కుమార్. భరత్ మహేశ్వరం, హేమంత్ వర్మ, అజిత్ సింగ్, సిరిల్ గాలంకి, ఖుష్బు వైష్ణవ్, నందిగామ పూజిత, ప్రియా వైష్ణవ్, యం.ఎస్ నందిని, రత్నశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య. మినీ స్టోరీ ప్రభాస్తో ‘మిర్చి’ వంటి భారీ చిత్రం, శర్వానంద్తో ‘రన్ రాజా రన్’, నానీతో ‘భలే భలే మగాడివోయ్’, అనుష్కతో ‘భాగమతి’.. ఇలా విజయవంతమైన చిత్రాలు నిర్మించి, తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. యూవీకి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ఆరంభమైంది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘ఏక్ మినీకథ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోకుల్ భారతి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: సత్య. తెలిసినవాళ్లు ముఖం ఎక్కడో, మొండెం ఎక్కడో.. ఫొటో చూశారుగా. ‘తెలిసినవాళ్లు’ సినిమా స్టిల్ ఇది. ఎందుకిలా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్ కార్తీక్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో కేఎస్వీ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. విప్లవ్ కోనేటి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో ఉంటుంది. హెబ్బా పటేల్ తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ద్వారా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోబోతున్నారు. షూటింగ్ ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అజయ్ వి. నాగ్, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, లైన్ ప్రొడ్యూసర్: డా. జెకె సిద్ధార్థ. చదవండి: శివరాత్రికి పవన్ సినిమాకు టైటిల్ -
రాంగ్ రూట్లో ప్రముఖ హీరో: అడ్డుకున్న పోలీసులు
-
రాంగ్ రూట్: ప్రముఖ హీరోను అడ్డుకున్న పోలీసులు!
ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం ఏకంగా రాంగ్ రూట్లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసి కెమెరాలకు చిక్కాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని హెచ్చరించి హీరో తన పొరపాటును సరిదిద్దుకునేలా చేశారు. మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును తీసుకుని కేరళ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఓ చోట అతడు రాంగ్ రూట్లో సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు. ఇది గమనించిన ఓ పోలీసు అతడి కారు దగ్గరకు వెళ్లి మందలించాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించాడు. దీంతో అతడు తన కారును రివర్స్ తీసుకుని రోడ్డు కుడివైపు లైనులోకి ప్రవేశించాడు. దీన్నంతటినీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా వుంటే దుల్కర్ సల్మాన్ నటించిన కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తాల్ రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సినిమా టీమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, వీజే రక్షన్, నిరంజని అగత్యాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో కనులు కనులను దోచాయంటే పేరుతో విడుదలైంది. మరోవైపు ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. చదవండి: లెఫ్టినెంట్ రామ్గా వస్తోన్న దుల్కర్ -
లెఫ్టినెంట్ రామ్గా వస్తోన్న దుల్కర్
‘మహానటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ చిత్రంలో దుల్కర్ జెమినీ గణేషన్ పాత్రలో నటించి.. ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దుల్కర్ సల్మాన్. ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. (ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను) ‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. Wishing our 'Lieutenant' RAM, @dulQuer a very Happy Birthday :)#declassifiessoon A film by @hanurpudi Music by @Composer_Vishal Produced by @SwapnaCinema Presented by @VyjayanthiFilms pic.twitter.com/tpL4nuNrun — Swapna Cinema (@SwapnaCinema) July 28, 2020 -
తమిళ ప్రజలకు దుల్కర్ క్షమాపణ
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తమిళ సినీ ప్రేక్షకులకు క్షమాపనలు చెప్పారు. దుల్కర్ నటించిన వారణే అవశ్యముండే చిత్రం ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదల అయింది. అయితే ఈ చిత్రంలోని ఓ చిన్న సన్నివేశ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ను అవమానించేలా ఉందని పలువురు తమిళ ప్రేక్షకులు ఆరోపించారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దుల్కర్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ప్రారంభించారు. దుల్కర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తన తరఫున, చిత్ర యూనిట్ తరఫున వారికి క్షమాపణలు చెబుతూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘వారణే అవశ్యముండే చిత్రంలో ప్రభాకరన్ జోక్ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. ఇది కావాలని చేసింది కాదు. 1988లో వచ్చిన మలయాళ చిత్రం పట్టణ ప్రవేశం చిత్రంలోని జోక్ స్పూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించాం. అది కేరళలో మీమ్స్గా బాగా ఫేమస్. ఇది కేరళలో సాధారణమైన పేరు కావడంతో.. అందుకే చిత్ర ప్రారంభంలో ఇది ఎవరికి ఉద్దేశించింది కాదని పేర్కొన్నాం. చాలా మంది సినిమా చూడకుండానే ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. నాపై, మా దర్శకుడు అనుప్ విమర్శలు చేయడాన్ని మేము అంగీకరిస్తాం. కానీ మా కుటుంబ సభ్యులను, సినిమాలో నటించిన సీనియర్ నటులపై దయచేసి విమర్శలు చేయకండి. ఈ సన్నివేశం ద్వారా బాధపడిన దయ హృదయం కలిగిన తమిళ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. నా సినిమాల ద్వారా, మాటల ద్వారా నేను ఎవరినీ కించపరచాలని చూడను. దీనిని కచ్చితంగా అపార్థం చేసుకున్నారు. కొందరు చాలా అసభ్యకరంగా విమర్శలు చేయడంతోపాటుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాతో పాటు కుటుంబాన్ని కూడా దూషించడం చాలా బాధగా అనిపిస్తుంది. వారు ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను’ అని దుల్కర్ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో దుల్కర్తో పాటుగా శోభన, కల్యాణి ప్రియదర్శన్, సురేష్ గోపి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. -
డైరెక్టర్గా మారిన ప్రముఖ కొరియోగాఫ్రర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారారు. పలు హిట్ సాంగ్స్కు కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన బృందా దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘హే సినామిక’ చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ గురువారం చెన్నైలో ప్రారంభమైంది. తొలి షాట్కు మణిరత్నం, కె భాగ్యరాజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి సుహాసిని, కుష్బూలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు.. బృందాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా బృందాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం టైటిల్ను మణిరత్నం ఒకే కన్మణి(ఒకే బంగారం) సినిమాలోని హే సినామిక పాట పల్లవి నుంచి తీసుకున్నారు. ఈ చిత్రం ప్రారంభానికి సంబంధించిన ఫొటోలను దుల్కర్, అదితీలు ట్విటర్లో షేర్ చేశారు. -
దూసుకుపోతున్న ‘కనులు కనులను దోచాయంటే’
పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి. (‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ) దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది’ అని అన్నారు. -
‘కనులు కనులను దోచాయంటే’ రివ్యూ
టైటిల్: కనులు కనులను దోచాయంటే జానర్: లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, నిరంజని, రక్షణ్, గౌతమ్ మీనన్ సంగీతం: మాసాల కేఫ్ దర్శకత్వం: దేసింగ్ పెరియసామి నిర్మాత: ఆంటోనీ జోసెఫ్ నిడివి: 162.10 నిమిషాలు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో టాలీవుడ్లో అభిమానులను సొంతం చేసుకున్న దుల్కర్ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దుల్కర్ దక్షిణాదిలో సెటిల్ అయినట్టేనా? ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో మన రివ్యూలో తెలుసుకుందాం కథ: ఆరేళ్లుగా సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) మంచి స్నేహితులు. సిద్ధార్థ్ యాప్ డెవలపర్గా, కల్లీస్ యానిమేటర్గా పనిచేస్తూ రిచ్ లైఫ్ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని)లతో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్లైన్ క్రైంతో పాటు ఖరీదైన కార్లలోని ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతాయి. అయితే ఈ కేసులతో పాటు మరో కీలక కేసును అనఫిషియల్గా డీల్ చేస్తుంటాడు పోలీస్ కమిషనర్ ప్రతాప్ సింహా (గౌతమ్ మీనన్). మరోవైపు లవ్, పెళ్లి, ఎంజాయ్ అని సిద్దార్థ్, కల్లీస్, మీరా, శ్రేయాలు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్ధార్థ్కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకి ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ప్రతాప్ వెతుకుతున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్ధార్థ్, మీరాల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? తెలసుకోవాలంటే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూడాల్సిందే. నటీనటులు: ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన దుల్కర్.. ఈ సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అయితే అతడి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఎమోషన్ పండించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఇక తెలుగమ్మాయి రీతు వర్మకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరే లభించింది. డిఫరెంట్ షేడ్స్లో కనిపించి మెప్పిస్తుంది. రక్షణ్, నిరంజనిల మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వులు తెప్పిస్తాయి. గౌతమ్ మీనన్ మొదట్లో సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి చివరికి కమెడియన్ అయిపోతాడు. అనీష్ కురువులకు సైతం ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: కథ, కథనం కొత్తగా, డిఫరెంట్గా ఉంది. కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అన్లైన్ మోసాలు, దొంగతనాలు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పోలీస్ కమిషనర్ ఎంట్రీతో ఇంటర్వెల్ ముందువరకు సాదాసీదాగా సాగిపోతుంది. దీంతో అందరూ రొటీన్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్తో ఆడియన్స్ అంచనాలతో పాటు సినిమా మొత్తం టర్న్ అవుతుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే రెండో అర్థభాగాన్ని కూడా దర్శకుడు చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఫస్టాప్లో ఇచ్చిన ట్విస్టులను సెకండాఫ్లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూనే ఆడియన్స్ను కట్టిపడేసేందుకు సస్పెన్స్ సీన్లను జోడించాడు. దీంతో క్రైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. మధ్యమధ్యలో కామెడీ పండించాలని దర్శకుడు ప్లాన్ చేసినా అంతగా వర్కౌట్ కాదు. కానీ క్రైమ్ సీన్స్ చాలా ఇంట్రెస్ట్గా,కొత్తగా ఉంటాయి. ఓ సందర్భంలో ఇంత సులువుగా క్రైమ్ చేసి, విలాసవంతంగా బతకొచ్చా అనే అనుమానం కలుగుతుంది. కానీ రియలస్టిక్గా సాధ్యం కాదు. అయితే క్రైమ్ సీన్లు చేయడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని సగటు అభిమాని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎందుకంటే క్రైమ్ సీన్ల వెనక ఏదో బలమైన కారణం ఉంటే రెగ్యులర్ సినిమా అవుతుందని భావించిన డైరెక్టర్ విభిన్నంగా ఆలోచించి సింపుల్గా తెగ్గొట్టేశాడు. ఇక సాంకేతిక విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతమే అక్కడక్కడా విసుగుతెప్పిస్తుంది. లిరిక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు రిచ్ లుక్ను తీసుకొచ్చారు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా స్క్రీన్ప్లే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్: డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ సీన్స్ మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్ నిడివి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం -సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను
‘‘కథ నచ్చితే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు చేయడానికి ముందుంటాను. ప్రస్తుతం నేను పని చేస్తున్న (మలయాళం, హిందీ, తెలుగు, తమిళం) ఇండస్ట్రీలన్నీ నాకెంతో ప్రేమను ఇస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దుల్కర్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఆంటోనీ జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ – ‘‘కనులు కనులను దోచాయంటే’ కథను మొదటిసారి విన్నప్పుడే ఈ సినిమా తెలుగులో కూడా చేయొచ్చు అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. బాగానే వచ్చింది అనుకుంటున్నాను (నవ్వుతూ). ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్గా చేసింది. దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్. సినిమా ఫుల్ స్పీడ్గా పరిగెడుతుంటుంది. ఇలాంటి స్టయిల్లో నేను సినిమా చేయలేదు. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడుతుంటాను. ప్రస్తుతం మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయడంతో ఏ ఇండస్ట్రీకి వెళ్లినా మా భాషలో ఎక్కువ సినిమాలు చేయడం లేదేంటి అని అడుగుతున్నారు. అన్ని ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. భాష నా ప్రధాన సమస్య. భాష తెలియకపోతే పాత్రకు పూర్తి న్యాయం జరగదని నమ్ముతాను. గత ఏడాది నేను నటించిన 2–3 సినిమాలు విడుదల ఆలస్యం అయ్యాయి. ఆ టైంలో నిర్మాతనయ్యి మూడు సినిమాలు నిర్మించాను. రీమేక్ సినిమాలు, సీక్వెల్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడను. ఏదైనా కొత్తగా, ఎగ్జయిటింగ్గా చెప్పాలనుకుంటాను. తెలుగులో ఓ సినిమా అంగీకరించాను. త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
రాఖీ బాయ్తో కురుప్..
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కురుప్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన ఏడాది సందర్భంగా దుల్కర్ ఆ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్ తన ఇన్స్టాగ్రామ్లో కేజీఎఫ్ స్టార్ యష్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘కురుప్ రాకీ భాయ్ని కలిసినప్పుటీ ఫొటో. యష్ చాలా మంచి వ్యక్తి. మిమ్మల్ని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది యష్. మీ ఆథిత్యానికి నేను ఫిదా అయ్యాను. మిమ్మల్ని మళ్లీ కలవడం కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే కేజీఎఫ్ 2లో రాక్ స్టార్ రాఖీ కోసం వెయిట్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. దుల్కర్ నటించిన వారణే అవశ్యముండు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, శోభన, సురేష్ గోపి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు యష్ నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ మరి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. -
కొత్తగా... సరికొత్తగా!
నూతన దశాబ్దం మొదలైంది. ఈ కొత్త దశాబ్దంలో సరికొత్తగా ఉండాలనుకుంటున్నారు కాజల్. ఉండాలనుకోవడమే కాదు.. ఆ దిశగా ప్రయాణం కూడా చేస్తున్నాను అంటున్నారామె. ‘‘కొత్త దశాబ్దంలో ఎవ్వరైనా ఇంకా కొత్తగా ఎలా పని చేయగలం అని ఆలోచిస్తారు. నేను కూడా అంతే. ప్రస్తుతం నేను విభిన్నమైన స్క్రిప్ట్స్ను ఎంచుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త కొత్త ఐడియాలు, స్క్రిప్ట్స్తో సినిమాలు చేస్తున్నాను. ఈ దశాబ్దంలోనే వెబ్ ప్రపంచంలో ఓ షో చేయబోతున్నాను. సీనియర్ యాక్టర్స్తో పాటు జూనియర్స్తోనూ యాక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ దశాబ్దం చాలా ఎగ్జయిటింగ్గా ఉండబోతోందని అనుకుంటున్నాను’’ అన్నారు కాజల్. ప్రస్తుతం ఆమె కమల్హాసన్ తో ‘ఇండియన్2’, జాన్ అబ్రహామ్తో ‘ముంబై సాగా’ సినిమాలు చేస్తున్నారామె. తాజాగా దుల్కర్ సల్మాన్ తో ఓ తమిళ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు డ్యాన్స్ మాస్టర్ బందా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా కాజల్ ఓ తమిళ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. -
మరో తెలుగు సినిమాలో దుల్కర్
మళయాల యువ కథనాయుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించిన దుల్కర్, మహానటితో స్ట్రయిట్ తెలుగులో సినిమా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దుల్కర్ను టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యువ నటుడు మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మళయాల మెగాస్టార్ దుల్కర్ తండ్రి అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమాను తెరకెక్కించిన మహి వీ రాఘవ దర్శకత్వంలో దుల్కర్, తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన లైన్కు ఓకె చెప్పిన ఈ యంగ్ హీరో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
క్రేజీ కాంబోతో దిల్రాజు సినిమా..!
ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న దిల్రాజు ఇటీవల కాస్త స్లో అయ్యాడు. తన బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో క్రేజీ కాంబోలను సెట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్లు హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్2తో పాటు మహేష్ బాబు మహర్షి సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు. వీటితో పాటు తదుపరి చిత్రాలను ఫైనల్ చేసే పనిలోఉన్నారట. ఇటీవల నాని హీరోగా తమిళ సూపర్ హిట్ 96ను రీమేక్ చేయనున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో నాని హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ను రెడీ చేస్తున్నారట. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్చేస్తున్నారట. ఈ సినిమాలో నానితో పాటు సౌత్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దుల్కర్ నటిస్తే ఇతర భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయోచ్చన్న ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. అయితే ప్రస్తుతం నాని, దుల్కర్లు బిజీగా ఉన్నారు. వాళ్లు ఫ్రీ అయితే గాని దిల్ రాజు ప్రాజెక్ట్పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
భారతీయుడితో శింబు, దుల్కర్..!
లోక నాయకుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. ఇండియన్ పేరుతో హిందీలోనూ సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత శంకర్, కమల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్ను రెడీ చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే కమల్ తో పాటు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో కమల్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పాటు నయా సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నాడట. ప్రస్తుతానికి శింబు, దుల్కర్ పాత్రలపై అధికారిక ప్రకటన రాకపోయినా భారతీయుడు 2లో ఈ స్టార్స్ కనిపించటం దాదాపుగా కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలకు బాలీవుడు స్టార్ హీరో అజయ్ దేవగన్ను సంప్రదిస్తున్నారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
కొడితే కొట్టాలిరా
... సిక్స్ కొట్టాలి అని క్రికెట్ ప్రాక్టీస్ కోసం చెమటోడుస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఎందుకుంటే... ఆయన హిందీలో నటించనున్న రెండో చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం కోసం. ఇందుకోసం ఆయన క్రికెట్ కోచ్ను కూడా పెట్టుకున్నారు. అనూజా చౌహన్ రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సోనమ్ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ‘కర్వాన్’ సినిమాతో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్కు సౌత్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ముఖ్యగాం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో సౌత్ సినిమా రీమేక్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా అర్జున్ రెడ్డి, టెంపర్ లాంటి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరో సౌత్ సూపర్ హిట్ చేరనుంది. 2014లో మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా బెంగళూర్ డేస్. దుల్కర్సల్మాన్, నివిన్ పౌలీ, నిత్యా మీనన్ ప్రధాన, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తానే స్వయంగా నటిస్తూ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మాల్ ఓపెనింగ్లో విషాదం
సాక్షి, తిరువనంతపురం: ఓ మాల్ ఓపెనింగ్ ఈవెంట్లో విషాదం చోటు చేసుకుంది. తన ఫేవరెట్ స్టార్ను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో అతను మృతి చెందాడని చెబుతున్నప్పటికీ.. స్థానికులు మాత్రం తొక్కిసలాటలోనే ప్రాణాలు విడిచాడని అంటున్నారు. శనివారం సాయంత్రం కొల్లాంలోని కొట్టారక్కరలో ఎంసీ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ చీఫ్ గెస్ట్గా హాజరై దాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రవచబలం(తిరువనంతపురం)కు చెందిన హరి(45) కూడా వారిలో ఉన్నారు. దుల్కర్ అక్కడికి చేరుకోగానే అతన్ని చూసేందుకు ఒక్కసారిగా జనం తోసుకోవటం ప్రారంభించారు. ఈ క్రమంలో హరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పోలీసులు తమ వాహనంలో అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మీడియాలో వస్తున్న తొక్కిసలాట కథనాలను పోలీసులు ఖండిస్తున్నారు. -
మ్యూజిక్ డైరెక్టర్ టు హీరో!
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్ను కోరి’ వంటి చిత్రాలకు పాటలు అందించి, తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన తమిళ, హిందీ సినిమాలకూ మ్యూజిక్ అందిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటనపై దృష్టి సారించారు. హరికృష్ణన్ దర్శకత్వంలో గోపీసుందర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘టోల్ గేట్’. ‘టాలెంటెడ్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ గోపీ సుందర్ యాక్ట్ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన గోపీ యాక్టింగ్తోనూ ఆడియన్స్ను మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్ ఫస్ట్ లుక్ను హీరో దుల్కర్ రిలీజ్ చేశారు. ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘సలాలా మొబైల్స్’ చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసిన గోపీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ‘టోల్ గేట్’. -
వినోదాత్మక ప్రయాణం.. కార్వాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సౌత్ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కార్వాన్. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ ట్రావెల్ డ్రామాతో దుల్కర్ బాలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ను ఆసక్తికరంగా కట్ చేసిన చిత్రయూనిట్ సినిమా థీమ్ ఏంటో రివీల్ చేశారు. తన తండ్రి మరణవార్త విన్న దుల్కర్ డెడ్ బాడీ కోసం వెళ్లటం.., అక్కడ అనుకోని పరిస్థితుల్లో బాడీ మారిపోయిందని తెలిసుకోని ఇర్ఫాన్ తో కలిసి రోడ్ట్రిప్కు వెళ్లాల్సి రావటం లాంటి అంశాలు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది. -
నా తండ్రి జోక్యం అబద్ధం.. హీరో క్లారిటీ
తక్కువ టైమ్లోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్కు ఒక్క మాలీవుడ్లోనే కాదు.. మిగతా సౌత్ లాంగ్వేజ్ల్లోనూ క్రేజ్ ఎక్కువే. మెగాస్టార్ మమ్మూటీ తనయుడు అయినప్పటికీ.. ఆ పేరు వాడుకోకుండా సొంతగా పైకి ఎదిగాడన్న పేరు దుల్కర్కు ఉంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ అరంగ్రేటం కోసం మాత్రం తండ్రి సహకారం తీసుకోబోతున్నాడన్న వార్త ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది. రోన్ని స్క్రూవాలా నిర్మాతగా .. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ‘కార్వాన్’ చిత్రం ద్వారా దుల్కర్ బాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం కోసం రోన్ని.. మమ్మూటీతో పలుమార్లు చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. తనయుడి బాలీవుడ్ డెబ్యూ కోసం మమ్మూకా స్వయంగా రంగంలోకి దిగారని, ప్రమోషన్ల విషయంలోనూ వేలు పెడుతున్నట్లు ఆ కథనం ఉటంకించింది. దీనిపై దుల్కర్ ట్విటర్లో స్పందించాడు. ‘ ఆ వార్త నిజం కాదు. నా కెరీర్ ప్రారంభం నుంచి ఏ చిత్రం విషయంలోనూ నా తండ్రి జోక్యం చేసుకోలేదు. ఏ సినిమాను కూడా ప్రమోట్ కూడా చేయలేదు. అది అలాగే కొనసాగుతుంది’ అంటూ స్పష్టత ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చినందుకు రీట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపిన బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్.. ఆ కథనం రోన్ని స్క్రూవాలా దృష్టికి కూడా వెళ్లిందని తెలిపారు. Point noted @dulQuer... Absolutely aghast that the news was circulated to the media... Brought it to the attention of @RonnieScrewvala too... Glad you clarified! https://t.co/NvF65ItNMo — taran adarsh (@taran_adarsh) 15 June 2018 -
మహానటి హీరో ‘అతడే’
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. దుల్కర్ నటించిన తొలి తెలుగు సినిమా మాత్రం మహానటే. తొలి సినిమాతోనే నటిగా దుల్కర్ కు మంచి గుర్తింపు రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో గతంలో నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. హేయ్ పిల్లాగాడా, 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాతో టాలీవుడ్లో సందడిచేసిన దుల్కర్ త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సోలో సినిమాను తెలుగులో ‘అతడే’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ నాలుగు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకుడు. ఇటీవల ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రామ్ చరణ్ మల్టీ స్టారర్.. ఫేక్ న్యూస్
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఎన్టీఆర్తో కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే మరో క్రేజీ మల్టీస్టారర్కు రామ్ చరణ్ అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్తో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కే చక్రవర్తి కథ అందిస్తుండగా కే యస్ రవిచంద్ర దర్శకత్వం వహిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దుల్కర్ సల్మాన్ సన్నిహితులు స్పందించారు. దుల్కర్ ఏ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ కర్వాన్ పనుల్లో బిజీగా ఉన్న దుల్కర్, తరువాత ఇప్పటికే అంగీకరించిన మలయాళ చిత్రాలు పూర్తి చేయనున్నారు. -
ముగ్గురు మనుషులు.. రెండు శవాలు
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటించిన ‘ఒకే కన్మణి’ చిత్రం తెలుగులో ‘ఓకే బంగారం’ టైటిల్తో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో ‘కర్వాణ్’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, మైథిలా పాల్కర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు డిఫరెంట్ వ్యక్తుల లైఫ్ జర్నీతో ఈ సినిమా సాగనుందని బీటౌన్ టాక్. రెండు డెడ్బాడీస్ చుట్టూ ఈ ముగ్గురి కథ తిరుగుతుందట. అది ఎలా అనేది ఆగస్టులో వెండితెరపై చూడాల్సిందే. -
కన్ఫ్యూజన్ కుర్రోడు
ఓ రిచ్ కుర్రాడు ట్రిప్ కోసం అమెరికా నుంచి ఇండియా రీచ్ అయ్యాడు. బ్యాక్ టు అమెరికా కాకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే ఆ అబ్బాయి రిచ్ అయినప్పటికీ సడన్గా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకలా అంటే.. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్రెడ్డి తెరకెక్కించనున్నారు. ‘మధుర’ శ్రీధర్ నిర్మించనున్నారు. ‘‘ఏబీసిడీ సినిమాలో కథనం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరం’’ అని పేర్కొన్నారు అల్లు శిరీష్. ఈ నెల 28న ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మేజర్ రవి దర్శకత్వంలో మోహన్లాల్ ప్రధాన పాత్ర చేసిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్ ది బోర్డర్స్’లో అల్లు శిరీష్ కీలక పాత్ర చేశారు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘ఏబీసీడీ’ రీమేక్లో నటించనుండటం విశేషం. -
రీమేక్ మీద మనసుపడ్డ అల్లువారబ్బాయి
మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ అందుకోవడం కోసం తంటాలు పడుతున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ సినిమా వచ్చినా అది శిరీష్ కెరీర్కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఇటీవల ఒక్క క్షణం అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో శిరీష్ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. శిరీష్.. రిస్క్ తీసుకోకుండా రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్లో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. మరి ఈ రీమేక్ అయిన శిరీష్కు స్టార్ ఇమేజ్ తీసుకువస్తుందేమో చూడాలి. -
నలుగురు ముద్దుగుమ్మలతో..
తమిళసినిమా: నటుడు దుల్కర్ సల్మాన్ కోలీవుడ్పై మక్కువ చూపిస్తున్నారు. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన మాతృభాషలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా, వాయై మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అయ్యారు. బాలాజీమోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకున్నా, ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్ వరించింది. అలా ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తరువాత మరోసారి మణిరత్నం చిత్రంలో అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. ఇటీవల సోలో అనే చిత్రంలో నటించారు. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటుడిగా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపారు. కొత్త దర్శకుడు కార్తీక్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలోనే దుల్కర్సల్మాన్తో నలుగురు కథానాయికలు రొమాన్స్ చేయనున్నారని సమాచారం. ఇందులో తెలుగు చిత్రం అర్జున్రెడ్డి ఫేమ్ శాలిని పాండే, నటి నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ఇద్దరి ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు మలయాళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. -
కష్టం కాదు.. ఇష్టం
పక్కనున్న ఫొటోలో చూశారుగా హీరో దుల్కర్ సల్మాన్ ఎంత కష్టపడుతున్నాడో! చూస్తుంటే.. ఏదో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది కదూ! కష్టపడుతుంది నిజమే కానీ.. ఎగ్జామ్ కోసం కాదు. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలకమ్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. మోహన్బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, కీర్తీ సురేశ్, సమంత, దుల్కర్ సల్మాన్తో పాటుగా మరికొందరు సినీప్రముఖులు నటించిన ఈ చిత్రం షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వర్క్స్లో భాగంగానే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తన పాత్రకు తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు. దుల్కర్ పలికిన తెలుగు పలుకులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ‘‘ఎగ్జామ్స్ కోసం నేను బాగా కష్టపడుతున్నానని అనుకోకండి. తెలుగులో డబ్బింగ్ చెప్పేందుకు నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను’’ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. అంటే.. దుల్కర్ కష్టంతో కాదు... ఎంతో ఇష్టంగా తెలుగు ప్రాక్టీస్ చేసి, మాట్లాడుతున్నారన్న మాట. ‘మహానటి’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నారు. -
నాగ్ క్లాప్.. సల్మాన్ కెమెరా ఆన్
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని అఖిల్ మూడో చిత్రం అధికారికంగా లాంఛ్ అయ్యింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో, అఖిల్ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. థమన్ మ్యూజిక్ అందించబోతున్న ఈ చిత్రానికి జార్జ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్వీఎస్సీ) బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
సౌత్ క్రేజీ స్టార్.. బాలీవుడ్ ఫస్ట్ లుక్
సాక్షి, సినిమా : సౌత్ క్రేజీ స్టార్ దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘జోయా ఫ్యాక్టర్’ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు. అంజు చౌహాన్ నవల ది జోయా ఫ్యాక్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సరసన బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ సోనమ్ కపూర్ నటిస్తోంది. ‘ఇది నాకు చాలా ప్రత్యేకం’ అంటూ తన ట్విట్టర్లో చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేశాడు. ఓ సున్నితమైన ప్రేమకథగా ఇది తెరకెక్కబోతోంది. అడ్లాబ్స్ ఫిలింస్-ఫాక్స్ స్టార్ స్టూడియోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. 2019 ఏప్రిల్ 5న జోయా ఫ్యాక్టర్ విడుదల కానుంది. అయితే జోయా ఫ్యాక్టర్ దుల్కర్ బాలీవుడ్ డెబ్యూ కాదు. రోన్ని స్క్రూవాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కర్వాన్ షూటింగ్లో ఈ క్రేజీ స్టార్ ఎప్పటి నుంచో పాల్గొంటున్నాడు. మళయాళ సీనియర్ హీరో మమ్మూటీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వరుస సక్సెస్లు, క్రేజ్తో తనకంటూ సల్మాన్ సౌత్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు తెలుగులో సావిత్రి బయోపిక్ మహానటిలోనూ దుల్కర్ నటిస్తున్న విషయం తెలిసిందే. Now this one is really special for me! Introducing #ZoyaFactor a movie based on Anuja Chauhan’s bestseller. Releasing on April 5, 2019! Co-starring @sonamakapoor, directed by #AbhishekSharma. #AdlabsFilms @foxstarhindi pic.twitter.com/1dxzuYYysS — dulquer salmaan (@dulQuer) 13 March 2018 -
తెలుగు రిలీజ్కు రెడీ అవుతున్న ‘సోలో’
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సోలో. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ రుద్ర, శివ, శేఖర్, త్రిలోక్ లు గా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మాలీవుడ్ లో మంచి సక్సెస్సాధించిన ఈసినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దుల్కర్ సరసన ధన్సిక, నేహ శర్మ, శ్రుతి హరిహరన్లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో వెంకట సాయి ప్రియాన్సి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ వెంకట్ సాయి విశాల్ సమర్పణలో గాజుల వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శర వేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ కశ్యప్, ఉమర్జి అనురాధలు తెలుగు వర్షన్ మాటలు అందిస్తున్నారు. -
వెండితెరకు రక్షణ్
తమిళసినిమా: బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మరో బుల్లితెర నటుడు సిల్వర్స్క్రీన్పై కనిపించే అవకాశాన్ని అందుకున్నారు. అతనే వీజే.రక్షణ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కావడం సంతోషంగా ఉందని బుల్లితెర నటుడు వీజే.రక్షన్ అంటున్నాడు. కాదల్ కణ్మణి, సోలో చిత్రాల తరువాత యువ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్. దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాన్సిస్ కన్నూక్కడన్ నిర్మిస్తున్నారు. వేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి వీజే.రక్షణ్ మాటాడుతూ నటనలో ఘనత సాధించాలన్నది తన చిరకాల కల అని చెప్పాడు. అందుకు ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఇది చాలా ఫ్రెష్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం అని, ఇలాంటి మంచి కథా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని, ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. తొలి చిత్రంలోనే దుల్కర్ సల్మాన్ లాంటి హీరోతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని వర్థమాన నటుడు వీజే.రక్షన్ చెప్పాడు. -
మూడు భాషల్లో బిజీ
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఫుల్ బిజీ. ఒక్క భాషలో కాదు. ఏకంగా మూడు భాషల్లో. మాలీవుడ్–టాలీవుడ్–బాలీవుడ్ ఇలా మూడు భాషల చిత్రాల్లో షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యారీ మలయాళ హీరో. తెలుగులో సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్తో కలిసి ‘కర్వాన్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. డబ్బింగ్ మూవీ ‘ఓకే బంగారం’ ద్వారా ఆల్రెడీ దుల్కర్ తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘కర్వాన్’తో బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఇక, దుల్కర్ చేస్తున్న తాజా మలయాళ చిత్రం ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారట. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రితూ వర్మ ఇందులో హీరోయిన్. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది దుల్కర్కి 25వ సినిమా కావడం విశేషం. హీరో అయిన ఐదేళ్లల్లో దుల్కర్ 25 సినిమాల మైలురాయి చేరుకోవడం గొప్ప విషయం. -
రీతూకు మరో చాన్స్!
తమిళసినిమా: యువ నటి రీతూవర్మకు ప్రస్తుతం కోలీవుడ్లోనే ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఈ తెలంగాణ జాణకు పెళ్లిచూపులు చిత్రం పెద్ద విజయాన్నే అందించింది. అంతే కాదు, పలు అవార్డులను తెచ్చిపెట్టింది. తాజాగా అదే పెళ్లిచూపులు చిత్రానికిగాను ఆంధ్ర రాష్ట్రం ఈ బ్యూటీకి నంది అవార్డును కూడా ప్రకటించేసింది. అయితే అక్కడ అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అదృష్టం ఏమిటంటే కోలీవుడ్లో అవకాశాలను రాబట్టుకుంటోంది. ఇప్పటికే గౌతమ్మీనన్ దృష్టిలో పడి విక్రమ్కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటిస్తున్న రీతూవర్మ చేతిలో చిన్నా అనే మరో తమిళసినిమా ఉంది. తాజాగా యువ నటుడు, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్సల్మాన్తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. వాయె మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు రంగప్రవేశం చేసిన దుల్కర్సల్మాన్ ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో కాదల్ కణ్మణి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలా చాలా సెలెక్టివ్ చిత్రాలనే కోలీవుడ్లో చేస్తున్న ఈయన తాజాగా నవ దర్శకుడు దేసింగ్ పెరియస్వామి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడు గోలీసోడా, పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో ఇంజినీర్గా నటిస్తున్న దుల్కర్సల్మాన్కు జంటగా నటి రీతూవర్మను ఎంచుకున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది ప్రేమ, యాక్షన్ కలగలిపిన కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందట. -
బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ షాలిని పాండే. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటితో పాటు 100% లవ్ తమిళ రీమేక్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనుంది షాలినీ. ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ ద్విభాషా చిత్రంలో షాలినీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆర్ ఏ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశముంది. మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న దుల్కర్ ఆ సినిమా షూటింగ్ సమయంలో షాలిని నటన చూసి మరో సినిమాకు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. -
‘అందమైన జీవితం’ మూవీ స్టిల్స్