financial assistance
-
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్గా హోదా పెంపు. -
నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే
దేశరాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తొలుత రూ. 1,000, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఎన్నికలకు ముందు మహిళలను ఆకట్టుకునేందుకు ఇలాంటి పథకాలను ప్రారంభించిన నాల్గవ రాష్ట్రం ఢిల్లీ. ప్రస్తుతం ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఎన్నికల్లో విజయానికి..మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయం(Financial assistance) అందించే పథకాలు ఇటీవలి కాలంలో ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపకరిస్తున్నాయని నిరూపితమయ్యింది. మధ్యప్రదేశ్లో ఎన్నికలకు ముందు బీజేపీ నేత శివరాజ్ ఈ పథకాన్ని ప్రారంభించి, బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో విజయం సాధించారు. ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఏకనాథ్ షిండే ఇదే పథకం ఆధారంగా మహాయుతి కూటమికి మెజారిటీని అందించారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా మయ్యా సమ్మాన్ పథకం ఆధారంగా వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలలో మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒకేలా కనిపించినప్పటికీ వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసం ఆయా రాష్ట్రాల్లోని మహిళలు స్వీకరించే నగదు మొత్తం. మరొకటి వారి వయసు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలలో తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో లాడ్లీ బహన్ యోజన కింద తొలుత మహిళలకు ప్రతినెలా రూ.1,000 ఇవ్వగా, ఇప్పుడు రూ.1,250 అందజేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే పథకం కింద మహిళలకు రూ.1,500 ఇస్తున్నారు. జార్ఖండ్లో ఈ తరహా పథకంలో మహిళలకు తొలుత రూ.1,000, తర్వాత రూ.2,500 అందజేస్తున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్(Kejriwal) ఇదే హామీనిచ్చారు.ఏ రాష్ట్రంలో ఎంతమొత్తం?మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) రాష్ట్రంలోని మహిళలకు ప్రతినెలా రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొదటి విడతగా రూ.1,000 అందించగా, మహారాష్ట్రలో మొదటి విడతగా రూ.1,500 అందించారు. ఢిల్లీలో ఈ పథకంపై ఇంకా చర్చ నడుస్తోంది. జార్ఖండ్లో ఎన్నికల అనంతరం ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచారు. మధ్యప్రదేశ్లో ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లాడ్లీ బహన్ యోజనలో మహిళల వయోపరిమితి 21 నుంచి 60 ఏళ్లుగా ఉంది. జార్ఖండ్లో 21నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళలు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.ఢిల్లీలో చర్చనీయాంశంగా..ఢిల్లీలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతినెలా ఆర్ధికసాయం అందజేయనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్లలోని ప్రభుత్వ శాఖలు ఈ పథకాలను నోటిఫై చేశాయి. అర్హులైన మహిళలు ఇప్పటికీ ఈ పథకం అందించే ప్రయోజనాలను పొందుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఈ పథకానికి సంబంధించి వెలువడిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే.. -
రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూమిలేని పేదలు ఎందరు? రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.అర్హులందరికీ ఇవ్వాలిసారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. -
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్కు ఆ ధైర్యం ఉందా? -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్ల గురించి తెలుసుకుని పార్ట్టైమ్గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్పై దాడిచేసి సెల్ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
నిరుపేద మెడిసిన్ విద్యార్థికి దాతల ఆర్థికసాయం
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దిపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని పానెం శ్రీహర్షిత ఇటీవల ప్రకటించిన మెడిసిన్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించింది. ఆమె దీనస్థితిని గమనించి ‘సాక్షి’ ఈ నెల 3వ తేదీన ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో దాతలు విరివిగా స్పందించారు. ఇప్పటివరకు రూ. 1,10,000 ఆర్థిక సాయాన్ని శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఆదివారం ఖమ్మంకు చెందిన సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎ.నర్సింహారావు, సభ్యులు నాగరాజు, సైదులు, సతీశ్లు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.30 వేలు విలువ చేసే వైద్యవిద్యకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అంతేకాకుండా కొణిజర్ల, బోనకల్ హెల్త్ సూపర్వైజర్లు వి.భాస్కర్రావు, ఎం.దానయ్యలు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. విజయవాడకు చెందిన మరో వైద్యుడు నాలుగేళ్ల హాస్టల్ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్షిత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. -
భర్త అంత్యక్రియలకు సాయం చేయండి..
హుజూరాబాద్ రూరల్: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది. తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
సాయం పెంచండి.. ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.సాయం కోసం ఎదురుచూస్తూనే..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇళ్లలోని ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.పొలాల పరిహారమూ పెంచాలి..వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.– బీరెల్లి సుధాకర్రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాఈ సాయం సరిపోదు..ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్ సిలిండర్ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం దయ చూపితేనే..ఖమ్మం మోతీనగర్కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.ఆదుకుంటేనే మనుగడఖమ్మం వెంకటేశ్వర నగర్కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 6 తేదీన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలిక హత్యకు గురవ్వగా, బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్సీపీ నేత సుకుమార్ వర్మ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెప్పారు.కాగా, సొంత జిల్లాలో బాలికను ఒక యువకుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె.. బాలిక కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించలేదు. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.మరోవైపు, టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
చదువుల తల్లికి సీఎం చేయూత
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీ పాట్నా లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థి ని బదావత్ మధులత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. కోర్సు పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని హైదరాబాద్కు వెళ్లిన విద్యారి్థనితోపాటు వారి కుటుంబీకులకు సీఎంవో హామీ ఇచి్చంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభచూపి 824వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సోమవారం ‘సాక్షి’లో ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇది సీఎంవో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఆ విద్యారి్థనిని హైదరాబాద్కు పిలిచారు. బుధవారం మధులత ఆమె తండ్రి రాములుతో కలిసి వెళ్లింది. చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. మధులత కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.70 వేలు ఇవ్వడంతో పాటు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్రెడ్డి ‘ఎక్స్’లో అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం.. అండగా నిలిచిన వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్తకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తొమ్మిదో వార్డుకు చెందిన ఉమ్మడి అప్పారావుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. అప్పారావుకు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేయర్ హరి వెంకటకుమారి చెక్కును అందజేశారు.కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు.పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వికలాంగులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా దుకాణం పెట్టుకునేందుకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఈ కిరణా దుకాణాన్ని ప్రారంభించి ఆ దివ్యాంగుడికి భరోసా ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూత ఈ సమాజం అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆ సంస్థతో కలిసి తాము కూడా చేతనైన సాయం చేస్తున్నామని బాపు నూతి తెలిపారు.. దివ్యాంగుల సమస్యలను తమ దృష్టికి తెచ్చి వారికి చేయూత అందించడంలో తమను భాగస్వాములు చేసిన హోప్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!) -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
ఊరూరా ఉపాధికి బాటలు
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజస్ (పీఎం ఎఫ్ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది. రూ.10 లక్షల వరకు చేయూత వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్హెచ్జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు. కల్పించిన సౌకర్యాలివే.. ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు. యంత్రాలు కొన్నాం మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప జీడిపప్పు వ్యాపారానికి చేయూత కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా పప్పు పరిశ్రమకు విస్తరించాం పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు -
పెళ్లి సాయంపైనా కుళ్లు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద బిడ్డల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపైనా రామోజీ కుళ్లు రాతలు మానలేదు. క్రిస్టియన్ మైనారిటీలకు అందించే ‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’ పథకంపై ‘మేనిఫెస్టోలో ఆమెన్.. ఆనక మరిచెన్’ అనే తప్పుడు కథనంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే పేద బిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక ప్రోత్సాహం పెంచడంతో పాటు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం లబ్ధిదారులకు అందించిందనే విషయాన్ని ఈనాడు విస్మరించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు రూ.427.27 కోట్ల ఆర్థిక సాయం అందించి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోపణ: వాగ్దానాల అమలుకు ఒక్క రోజు కూడా చర్యలు తీసుకోలేదు వాస్తవం: గత ప్రభుత్వం హామీలను గుప్పించి అమలు చేయకపోగా అధికారిక వెబ్సైట్లోనూ మేనిఫెస్టో మాయం చేశారు. ఇది రామోజీ పచ్చ కళ్లకు కన్పించ లేదు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది. మేనిఫెస్టోను కళ్ల ముందే కన్పించేలా డిస్ప్లే చేస్తూ అందులో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసేలా షెడ్యూల్ ప్రకటించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్పై విషం కక్కే రాతలు రాసింది. క్రైస్తవులకు టీడీపీ హయాంలో అమలు చేసిన పెళ్లి కానుక పథకాన్ని పక్కన పెట్టినట్టు అబద్ధాలు రాసింది. క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ అదేం లేదంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఆరోపణ: పెళ్లి కానుక అటకెక్కించారు వాస్తవం: క్రైస్తవ యువతుల పెళ్లికి గత టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా అబద్ధాలు రాసేశారు. పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చి అమలు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను సైతం విడుదల చేసింది. ఈ వాస్తవాన్ని ఈనాడు మరుగున పరిచింది. ఆరోపణ: పరిశీలన లేదు.. ఎంపిక లేదు వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలను డబ్బా కొట్టిన ఈనాడుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా షాదీ తోపా పథకాన్ని అమలు చేయడం మింగుడు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు నెలలకు(త్రైమాసికం) ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వధువు తల్లికి అందజేస్తోంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్య ద్వారా ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది. గత ప్రభుత్వంలో పట్టణ, గ్రామీణ లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలంటే అవస్థలు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని నిబంధన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీని వల్ల పేద వర్గాలకు చెందిన ఆడపిల్లలందరూ పదవ తరగతికి తగ్గకుండా చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆరోపణ: ఇచ్చిన జీవోకే మళ్లీ జీవో వాస్తవం: పేద బిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఏం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతమేరకు సాయం అందిస్తోంది అనేది గమనిస్తే చాలు ఈనాడు రోత రాతల వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుస్తుంది. గత ప్రభుత్వం అరకొర సాయాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాత బకాయిలు సైతం చెల్లించి ఆర్థిక సాయం పెంచి అందించింది. మైనారిటీలను ఆదుకున్నది జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మైనారిటీలను అదుకున్నది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేది గర్వంగా చెప్పగలం. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56 కోట్ల లబ్ధి చేకూర్చింది. నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్ల లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు చెల్లించింది. మైనారిటీ వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తున్నారు. – బొల్లవరపు జాన్ వెస్లీ, చైర్మన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్మెంట్కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాధితులకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాధితులు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. సహాయం అందుకున్న వారు.. ► విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్తో బాధపడుతున్నాడని.. చికిత్స అవసరాల నిమిత్తం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు. ► విజయవాడ, అజిత్సింగ్ నగర్కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు.. ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ.2 లక్షలు సహాయాన్ని అందించారు. -
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్లోనే కోల్డ్ చైన్, ఐస్ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్షాపులు, గేర్షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
వేదన విన్నారు.. ఆదుకున్నారు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్ విశాఖ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లాకు చెందిన ముగ్గురు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ముగ్గురికీ తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను సమకూర్చగా.. రెవెన్యూ అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. ఎండాడకు చెందిన మద్దాల జ్యోతి సీఎంను కలిసి తన భర్త మద్దాల రాంబాబు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారని.. వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. పీఎం పాలెంకు చెందిన యు.ఉమాదేవి తన 15 ఏళ్ల కుమారుడు ప్రసన్నకుమార్ రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని.. సాయం చేయాలని సీఎంకు విన్నవించుకుంది. ఎండాడ సుభాష్ నగర్కు చెందిన బాసిత్తు వసంతకుమారి తన భర్త పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని మొరపెట్టుకుంది. అలాగే తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆమె అభ్యర్థించింది. బాధితులందరికీ ఆర్థిక సాయం అందించటంతో పాటు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ మల్లికార్జున తక్షణ చర్యలు చేపట్టారు. విశాఖ రూరల్ తహసీల్దార్, ఇతర అధికారులను బాధితుల ఇళ్ల వద్దకే పంపించి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయించారు. -
సమస్య విన్నారు.. ఆదుకున్నారు
పెందుర్తి: ఆపన్నులను ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అందె వేసిన చేయి. ఎవరైనా పేదలు వారి బాధను చెప్పుకొన్న వెంటనే స్పందిస్తారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. బుధవారం విశాఖకు వచ్చిన సీఎం జగన్ ఇదే విధంగా మెదడులో గడ్డతో బాధ పడుతున్న ఓ బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు నూకరాజు, సత్యకళ దంపతుల కుమారుడు లీలాధర్నాయుడు (10)కు చిన్న వయసులోనే మెదడులో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. వయసు పెరిగేకొద్దీ అది పెరిగి గొంతు వరకు వచ్చింది. స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగుళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ మందుల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. బుధవారం చినముషిడివాడ వచ్చిన సీఎం వైఎస్ జగన్ను నూకరాజు, సత్యకళ దంపతులు కలిశారు. వారి కుమారుడి పరిస్థితిని వివరించారు. సమస్యను సావధానంగా విన్న సీఎం వైఎస్ జగన్ తక్షణమే రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆదేశించారు. అధికారులు వెంటనే చెక్ను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు ఆ చెక్ను బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. సీఎం ఎంతో మేలు చేశారు బాలుడి తల్లి సత్యకళ మా కుమారుడి పరిస్థితిని చెబుతుంటే సీఎం జగనన్న చలించిపోయారు. వెంటనే మాకు ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్కి చెప్పారు. తక్షణమే రూ.లక్ష మాకు ఎమ్మెల్యే అదీప్రాజ్ చేతుల మీదుగా ఇచ్చారు. సీఎం జగనన్న మాకు ఎంతో మేలు చేశారు. ఆయన మేలు ఎన్నటికీ మరచిపోలేం. -
సీఎం సాయం.. శరవేగం
అనంతపురం: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24 గంటలు గడవకముందే బాధితులకు చెక్కులు అందించారు. ► అనంతపురం నగరంలోని కమలానగర్కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయింది. ఇద్దరు పిల్లలున్నారని, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. సమస్యను సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ గౌతమిని పిలిచి వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్లో బాధితురాలు సుజాతకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. బాధితురాలికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు, పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ► అనంతపురం రూరల్లోని విద్యారణ్య నగర్కు చెందిన దివ్యాంగురాలు రాచూరి ఝాన్సీ సీఎం వైఎస్ జగన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి రూ.లక్ష చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో రామకృష్ణారెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎంకు తమ సమస్యలను చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఆదుకోవడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
గుంటూరు వెస్ట్: ఆపన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో వారిలో ఆరుగురికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం గుంటూరు కలెక్టరేట్లో జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోపే చెక్కులను అందజేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరమొచ్చినా తక్షణ సాయం లభిస్తుందన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు తమ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మొత్తం రూ.9.90 లక్షలు మంజూరు చేస్తూ సీఎంవో కార్యాలయం చెక్కులు పంపింది. ఈ చెక్కులను కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కలెక్టర్, జేసీలు అందజేశారు. మట్టుకొయ్య కోటేశ్వరరావుకు రూ.60 వేలు, నిలకుదిటి రఘుపతమ్మకు రూ.40 వేలు, మర్రి వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలు, ఇట్ల కుసుమసాయికి రూ.1.60 లక్షలు, అజీ్మర్ దివ్యకు రూ.4.30 లక్షల చొప్పున మొత్తం రూ.9.90 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు -
పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ వచ్చేది. 2019లో జగన్ సీఎం అయ్యాక పెన్షన్ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్ అబ్దుల్ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 30 ఏళ్ల కల నెరవేరింది కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్ రుణం తీర్చుకోలేం. – పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) పింఛన్ మా ఇంటికే వస్తోంది మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం. – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్కుమార్, విలేకరి, దాచేపల్లి) -
మాల్దీవులకు పాక్ ఆర్థిక సాయం దేనికి?
మాల్దీవులకు భారత్కు నడుమ దౌత్యపరమైన విభేధాలు కొనసాగుతున్నాయి. ఈ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. మాల్దీవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటోంది. అదే సమయంలో పాకిస్థాన్ సైతం మాల్దీవులకు ఆర్థిక సాయం అందిస్తుందట. అసలు పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందో?. మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ భారత్ ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. అయితే గతంతో పోల్చితే కొంత మొత్తంలో ఆర్థిక సాయం తగ్గింది. అయితే.. ఇదే క్రమంలో దాయాది దేశమైన పాకిస్తాన్ సైతం మాల్దీవులకు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి అవసరాలకు తాము సాయం అందిస్తామని పాకిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అన్వర్ ఉల్ హక్ కాకర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పాక్ అధ్యక్షుడు అన్వర్.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జకు ఫోన్ చేసి మరీ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ ప్రభుత్వం తమ దేశ అభివృద్ది కోసం నిధులు అందించనుందని తెలిపినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు సైతం పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల మధ్య అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పులకు సంబంధిచిన విషయంలో కూడా మాల్దీవులకు ఆర్థిక సాయంతో పాటు తమ పూర్తి మద్దతు ఉంటుందని పాక్ అధ్యక్షుడు పేర్కొన్నట్లు సమాచారం. ఇక.. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 26, జూలై 1996 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కూడా చైనాకు అనుకూలమైన దేశాలుగా గుర్తింపు ఉండటం గమనార్హం. మరోవైపు పాకిస్తాన్ దేశమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందని అక్కడి ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: సంక్షోభంలో పాక్.. జనం పెదవి విరుపు, వ్యాపారుల గగ్గోలు -
ఆపత్కాలంలో ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: సత్యనారాయణ తరహాలోనే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు దురదృష్టవశాత్తూ ఏదైనా అనారోగ్యం బారినపడితే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కొండంత అండగా నిలుస్తోంది. రోగులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా శస్త్రచికిత్సలను, వైద్య సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు చికిత్సలు చేయించుకుని మంచానికి పరిమితమైనప్పుడు వారిని విశ్రాంతి సమయానికి ఆర్థికంగా ఆదుకుంటోంది. విశ్రాంతి సమయంలో వారి పోషణ కష్టం కాకుండా ఉండటానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రోగులకు ప్రభుత్వం రూ.1,309.92 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. ఈ చిత్రంలోని వ్యక్తి.. టి.సత్యనారాయణ (60). ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంలో ఉంటారు. ఇటీవల గ్రామంలో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో సత్యనారాయణ శిబిరానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నట్టు అనుమానించి పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు సత్యనారాయణను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయన గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా రెండు స్టెంట్లు వేశారు. సత్యనారాయణ రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా ఉచితంగా చికిత్సలు పూర్తి చేశారు. అంతేకాకుండా వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.4వేలకు పైగా భృతిని ప్రభుత్వం ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ‘వయోభారంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నా. నా కుమారుడి సంపాదనతో కుటుంబం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గుండె సమస్య అని తెలిసి చికిత్సకు ఎంత ఖర్చవుతుందోనని చాలా ఆందోళనకు గురయ్యాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకుంది. అంతేకాకుండా విశ్రాంత సమయానికి ఆర్థిక సాయం చేయడంతో అదనపు ఖర్చుల భారం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన ఈ మేలును ఎన్నటికీ మరువలేం’ అని సత్యనారాయణ చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. 21.92 లక్షల మందికి ఆర్థిక చేయూత ఆరోగ్యశ్రీ పథకం కింద 1,519 ప్రొసీజర్లలో చికిత్సలు పొందినవారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రోగులు/వారి కుటుంబీకుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గర్భిణులకు ప్రసవానంతరం రూ.5 వేలు చొప్పున సాయం అందజేస్తోంది. ఇలా గత ఏడాది నవంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 21,92,467 మందికి రూ.1,309.92 కోట్ల మేర సాయం అందించింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సాయం రోగులు పూర్తిగా కోలుకునేందుకు దోహదం చేస్తోంది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చింది. 2019కు ముందు 1,059 ప్రొసీజర్లు ఉండగా, వీటిని ఏకంగా 3,257కు ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా పథకం కింద వైద్య పరిమితిని కూడా ఇటీవలే ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు చేర్చింది. ఆర్థికంగానూ ఆదుకున్నారు.. నాకు గుండెలో రంధ్రం ఉండటంతో మూడు నెలల క్రితం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్కు నా చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆపరేషన్ తర్వాత వైద్యులు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంత సమయానికి భృతి కింద డిశ్చార్జి చేసిన రోజే నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.9,500 జమ చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా కోలుకునే సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంది. ఈ సాయం పౌష్టికాహారం తీసుకోవడానికి, ఇతర నా అవసరాలకు ఎంతో ఉపయోగపడింది. – ఎస్.లలిత, కణేకల్ మండలం, అనంతపురం జిల్లా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. వైద్యం పొందిన లేదా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి భృతి ఇస్తున్నాం. రోగులు/వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల కుటుంబాలు కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. ఇందుకే ప్రభుత్వం జీవన భృతిని అందిస్తోంది. దీన్ని పొందడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 104 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వీటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – బాలాజీ, సీఈవో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఆ నిధులు ఇవ్వాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పెండింగ్ చెల్లింపులపై రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ తర్జనభర్జన పడుతోంది. దళితబంధు పథకం రెండో విడతలో భాగంగా ఎంపికైన పలువురు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడం... తీరా అరకొర ‡గా అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే నాటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా.. ఆ యా లబ్ధిదారులకు పూర్తి స్థాయి సాయం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వ ప్రాధాన్యత ల కంటే మెరుగైన విధంగా కొత్త పథకాల రూ పకల్పనకు సన్నద్ధమవుతుండడంతో ఈ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వద్ద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ని అర్హులకు ఇవ్వాలా? వద్దా? అనే అయో మయం అధికారులను కలవరపెడుతోంది. అన్నీ పక్కన పెట్టినా గ్రేటర్కు మాత్రం మినహాయింపు తెలంగాణ దళితబంధు పథకం రెండో విడత కింద అప్పటి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున యూనిట్లు మంజూరు చేసింది. ఈమేరకు క్షేత్రస్థాయి నుంచి శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్కు ప్రతి పాదనలను పంపారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వా టన్నింటినీ పక్కన పెట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురుగు వ్యర్థాల సేకరణ(సిల్ట్ కార్టింగ్ వెహికల్స్) వాహనాలకు డిమాండ్ ఉండడంతో 2023–24 వార్షిక సంవత్సరంలో 162 యూనిట్లను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు అందించారు. ఈ వాహనాలను జీహెచ్ఎంసీలో వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి జలమండలి(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఇవ్వాల్సింది 230 యూనిట్లకు మాత్రమే..: అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఇతర కేటగిరీలకు సంబంధించి మరో 230 యూనిట్లకు మంజూరు తెలిపిన ప్రభు త్వం అర్హుల ఖాతాల్లో తొలివిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నిధిని జమ చేసింది. మిగతా నిధులను జమచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నిధులు ఎస్సీ కార్పొరేషన్ వద్దే ఉండిపోయాయి. ప్రస్తుతం కోడ్ పూర్తి కాగా... నిధులను మాత్రం అధికారులు లబ్దిదారుల ఖాతాకు విడుదల చేయడం లేదు. ఈమేరకు అనుమతి కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. మరోవైపు కొంత మేర ఆర్థిక సాయం పొందిన లబి్ధదారులు మిగతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సాయం అందితే నిర్దేశించుకున్న యూనిట్లు తెరవాలని ఆశపడుతున్నారు. -
సీఎం జగన్ పెద్ద మనసు.. ఆపన్నులకు అండగా..
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్! -
విన్నారు.. ఆదుకున్నారు..
శ్రీకాకుళం పాత బస్టాండ్: శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు గురువారం వచ్చిన సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఒక్కరోజులోనే ఆయన వారికి ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని పలువురు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. మందుల కోసం, ఇతర వైద్య అవసరాల కోసం సాయం కోరారు. వారి కష్టాలు విన్న సీఎం వెంటనే సాయం చేయాలని అక్కడే ఉన్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఎనిమిది మందికి రూ.9లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందుకున్న వారి వివరాలు ♦ పొందూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోను సంతోషి పదేళ్లుగా తేలికపాటి పక్షవాతం, తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతోంది. ఆమె సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు రూ.2 లక్షలు అందించారు. ♦పెద్ద శ్రీపురం సచివాలయ పరిధికి చెందిన మేరపాటి తులసీదాసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సీఎంను కలిసి కష్టం చెప్పుకోగా ఆయనకు రూ.లక్ష అందించారు. ♦సనపల హేమంత్కుమార్ అనే వ్యక్తి వంశపారంపర్య హైపర్ కొలోస్ట్రిమియా అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తనకు చికిత్స అందేలా చూడాలని సీఎంను కోరారు. వెంటనే ఆయనకు రూ.లక్ష చెక్కును కలెక్టర్ అందజేశారు. ♦ రాజాం మండలానికి చెందిన అడపా యోగేశ్వరరావు సీఎంను కలిసి తనకు గుండెలో రంధ్రాలు, జన్యుపరమైన సమస్యకు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స జరిగిందని, ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ఆయనకు రూ.లక్ష మంజూరు చేశారు. ♦ అలాగే.. వితిక (అధిక రక్తస్రావం), సాయికృష్ణ (మానసిక వ్యాధి), ఎం. సాత్విక్ (జన్యుపరమైన సమస్యలు), అధిక కొలెస్ట్రాల్) కొమర పోలరాజు (ఊపిరితిత్తుల క్యాన్సర్ 4వ దశ)లు కూడా ముఖ్యమంత్రిని కలిసి సాయం అభ్యర్థించగా.. వారికి కలెక్టర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ♦ ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి. ప్రకాశరావు, కొవ్వాడ ఎస్డీసీ తహసీల్దార్ బీవీ రమణ, డి–సెక్షన్ సూపరింటెండెంట్ పి. అమల, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు. -
AP: ఇటు ప్రకటన.. అటు సాయం..
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2,068 గ్రామాలపై ప్రభావం మిచాంగ్ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు. జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం కొనుగోలు తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి సుధాసాగర్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. -
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల: పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామని ఆయన దగ్గరికి వచ్చిన బాధితులకు తక్షణ సాయం అందజేసి మంచి మనసును చాటుకున్నారు. సీఎం జగన్ గురువారం అవుకు రెండో టన్నెల్ను ప్రారంభించిన అనంతరం ఆయన్ని కొంతమంది అభాగ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన సీఎం జగన్ వారిలో ఒకరికి రూ.లక్ష, మరొకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో 15 నిమిషాల్లోనే బాధితులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు. జీవితాంతం రుణపడి ఉంటాం అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మకుంట గ్రామానికి చెందిన నారా పుల్లారెడ్డి (53) ఒక్క కిడ్నీతోనే పుట్టారు. ప్రస్తుతం ఆ కిడ్నీ కూడా సరిగా పనిచేయడం లేదు. కిడ్నీ ల్యాడర్ మందుల కోసమే నెలకు రూ.26 వేల వరకు ఖర్చవుతోంది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మందులు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన బాధను సీఎం జగన్కు తెలియజేశారు. తక్షణం స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితునికి సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశించిన నిమిషాల్లోనే కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బాధితునికి రూ.5 లక్షలు అందజేశారు. తన సమస్య విన్న వెంటనే సీఎం జగన్ స్పందించి, సాయం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని పుల్లారెడ్డి చెప్పారు. ఆర్థిక సాయం కోసం ఎంతో మందిని వేడుకున్నా ఉపయోగంలేకపోయిందని, వెంటనే సాయం చేసిన సీఎం జగన్ దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మా పాపకు కొత్త జీవితాన్ని ఇచ్చారు నంద్యాల జిల్లా అవుకు మండలం గోకులదిన్నె గ్రామానికి చెందిన గుర్రప్ప, సౌమ్య దంపతులకు ఇద్దరు సంతానం. గుర్రప్ప ఆటో డ్రైవర్. వీరికి రెండో సంతానంగా పాప హర్షిత జన్మించింది. పాపకు మూడు నెలలున్నప్పుడు అనారోగ్యానికి గురైంది. గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి పాపను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రస్తుతం పాపకు 20 నెలలు. ఆపరేషన్ చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సాయం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు. చివరికి గురువారం సీఎం వైఎస్ జగన్ను కలిసి వారి బాధను వివరించారు. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కును బాధితులకు అందజేశారు. తమ చిన్నారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జీవితాన్ని ఇచ్చారని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తమ బాధను పూర్తిగా విని వెంటనే సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
చేనేతకు సర్కారు ఊతం
సాక్షి, అమరావతి: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఊతమిస్తోంది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. చేనేతలకు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీతోపాటు విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు, మేలైన మార్కెటింగ్ వ్యవస్థతో అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సంస్థలు, బ్యాంకర్ల సహకారాన్ని సైతం నేతన్నకు అందేలా చూస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున ఐదు పర్యాయాలుగా మొత్తం రూ.969.77 కోట్లు అందించిన విషయం తెల్సిందే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద చేనేత కారి్మకులు ఒక్కొక్కరికి రూ.2,750 చొప్పున 2019 జూన్ నుంచి 2023 జూలై వరకు మొత్తం రూ.1,254.42 కోట్లు అందించారు. రుణాల రూపంలోనూ చేయూత చేనేతలకు ముద్ర రుణాలివ్వడంతోపాటు మగ్గాల ఆధునికీకరణ, మెరుగైన నైపుణ్యం కోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత రంగంలో కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్డీసీ) ద్వారా రాష్ట్రంలో 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు రూ.250.01 కోట్లు అందించారు. ఇదికాకుండా చేనేత కార్మికులకు వ్యక్తిగతంగాను, స్వయం సహాయక సంఘాల ద్వారా నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలును అందించడం విశేషం. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
అధైర్య పడొద్దు... అండగా ఉంటా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్లో సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు శుక్రవారం ఐదో విడత ఆర్ధిక సాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పొందుగుల చిన్నారెడ్డి, నాగోజి చంద్ర శేఖర్ల ఆనారోగ్య సమస్యలను ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సీఎంకు వివరించారు. విజయవాడ భవానీపురానికి చెందిన పొందుగుల చిన్నారెడ్డికి ఇటీవల జరిగిన ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని సీఎంకు చెప్పారు. చంద్రశేఖర్కు రూ.లక్ష చెక్కు అందజేస్తున్న కలెక్టర్,ఎమ్మెల్యే సమస్యను విన్న సీఎం జగన్ చలించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలాగే భవానీపురానికే చెందిన నాగోజి చంద్ర శేఖర్ తన కిడ్నీలు పాడైపోయిన కారణంగా ఆర్థిక కారణాలతో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. అతని సమస్యను విన్న సీఎం వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు. ఇరువురి సమస్యను విన్న సీఎం జగన్ అధైర్య పడొద్దు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశించిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఎమ్మెల్యే వెలంపల్లితో కలిసి శ్రీనివాసరెడ్డికి రూ.10 లక్షలు, చంద్రశేఖర్కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. -
‘గ్రాంట్’ ముసుగు..‘కైండ్’ మిస్టరీ!
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్టెక్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు. 34.88 శాతం లాభంతో.. ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు. అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు. సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్టెక్కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే... సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్టెక్కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్లోని తన బంగ్లాకు తరలించారు. -
వరద బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోంది. వరద వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటినుంచే అప్రమత్తమై ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు రంగంలోకిదిగి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పునరావాస ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా చకచకా పునరావాస ఏర్పాట్లు జరిగాయి. గతంలో మాదిరిగా వరద ప్రభావం తగ్గిన తర్వాత తాపీగా అరకొర నిధులు విడుదల చేయడం కాకుండా.. ఐదుజిల్లాలకు అవసరమైన రూ.12 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఫలితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యకలాపాలు పక్కాగా అమలవుతున్నాయి. 216 గ్రామాలకు వరద ముంపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 216 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల నుంచి 52,753 మందిని తరలించారు. వీరిలో 48,345 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. వరద ముంపు ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాపై ఎక్కువగా ఉండడంతో అక్కడ నాలుగు మండలాల పరిధిలోని 96 గ్రామాల ప్రజల కోసం 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 43,587 మంది ఆశ్రయం పొందుతున్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం వరద తగ్గిన తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ.వెయ్యి నుంచి రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ఆదేశాలు జారీచేయడంతో అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు పంపిణీ కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీచేసింది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. ఐదు వరద ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు ఉండగా సీఎం సూచనతో దాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సరఫరా పథకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఆ గ్రామాల్లో పారిశుధ్యం దిగజారకుండా బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారమిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచే గ్రామాల వారీగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చింతూరు కేంద్రంగా డివిజన్లోని ముంపు ప్రాంతాలకు లాంచీలు, మరబోట్ల ద్వారా బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పాలప్యాకెట్లు, కొవ్వొత్తులు, టార్పాలిన్లు సరఫరా చేస్తున్నారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు రప్పిస్తున్నారు. వరదలకు చింతూరు డివిజన్లో 250 గ్రామాలకు చెందిన 17 వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన దేదారి రాముడు (50) అనే వ్యక్తి పశువులు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ వరదనీటిలో పడి మృతిచెందాడు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు ఆహార, తాగునీటి అవసరాలు తీరుస్తూ, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1,321 కుటుంబాలకు చెందిన 3,787 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల రాకపోకలకు అనువుగా 172 పడవలు ఏర్పాటు చేశారు. వరదలకు బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద మత్స్యకార కాలనీ ముంపు బారిన పడింది. ఇక్కడ 300 మందికి భోజన వసతి కల్పించారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో 700 మందికి ఆహార పొట్లాలు అందించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిలంకల్లో సుమారు 400 మందికి భోజన ప్యాకెట్లను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పంపిణీ చేశారు. జిల్లాలో 20 పునరావాస కేంద్రాలు నడుస్తూండగా, బాధితులకు 21,756 భోజన ప్యాకెట్లు అందజేశారు. 33 వేల మంచినీటి ప్యాకెట్లు, 4,400 వరకు 20 లీటర్ల వాటర్ టిన్నులను అందించారు. -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పంపిణీ పథకం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించి ప్రతి నెలా 15వ తేదీన విడతల వారీగా సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలివిడత కింద ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయానికి ఎంపికైన వారికి చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసిన యంత్రాంగం చివరకు అరకొరగా.. కేవలం పదుల సంఖ్యలోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పంపిణీ ఊసే లేకపోగా.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చోట్ల పరిమితంగా లబ్ధిదారులకు చెక్కులు అందించడంతో ఎంతో ఆశగా సాయంకోసం ఎదురు చూసిన దరఖాస్తుదారులు నిరాశకు గురయ్యారు. ఎంతమందికి అందాయి..? బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండల స్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు వీలైనన్ని దరఖాస్తులను పరిశీలించి జాబితాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. తొలివిడత కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.400 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సగటున 335 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం ఆదించవచ్చని అంచనా వేశారు. కానీ శనివారం మెజార్టీ సెగ్మెంట్లలో ఈ కార్యక్రమమే నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శాసనసభ్యులకు సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు క్షేత్రస్థా యి అధికారులు అధికారులు చెబుతున్నారు. దీంతో 15వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఎంత మందికి చెక్కులు పంపిణీ చేశారనే దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో మండలాల వారీగా సమాచా రాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలివిడతలో చేపట్టిన కార్యక్రమంలో పంపిణీ చేసిన చెక్కుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెపుతున్నారు. అత్యధికం అనర్హులే...! వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులపై ఆధారపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన వచ్చింది. అధికారులు వాటి పరిశీలనకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసినట్లు తెలిసింది. ప్రతి దరఖాస్తుపై పూర్తిస్థాయి పరిశీలన (360 డిగ్రీలు) విధానంలో ఆరా తీసినట్లు చెపుతున్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖా స్తుల్లో మూడోవంతు వాటిని తొలివిడత కింద పరిశీలన చేశారు. ఇందులో మెజార్టీ అర్జీ దారులు కులవృత్తులపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపకాలు నిర్వహిస్తున్నట్లు వెలుగు చూసింది. అంతేకాకుండా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. చాలా మందికి సొంతంగా నాలుగు చక్రాల వాహనాలు, ఇళ్లు, పొలాలు.. తదితరాలున్నా యని తేలింది. ఆదాయపన్ను చెల్లిస్తున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో మెజార్టీ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాల ఆధారంగా పరిశీలించిన దరఖాస్తుల్లోనూ ఇదే తరహాలో పలువురు అనర్హతకు గురైనట్లు తెలిసింది. దీంతో తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేనందున చెక్కుల పంపిణీ విషయంలో వారు ఆసక్తి చూపించలేదని తెలిసింది. -
వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇకపై వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులను బీసీ–బీగా పరిగణిస్తుండటంతో వారికి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వీరిని ముస్లింలుగానే పరిగణించి లబ్ధిని చేకూర్చేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఆ వర్గాలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
‘లక్ష’ణంగా..300 మంది బీసీలకు! ఈ నెల 15వ తేదీ నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఈ మేరకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ శనివారం (ఈ నెల 15వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తొలివిడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మందికి సాయాన్ని అందిస్తామని, ఈ ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మంత్రి గురువారం తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లతో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులైన బీసీ కులవృత్తిదారులకు సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ చేపట్టాలని.. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకున్న వెంటనే కులవృత్తులకు సంబంధించిన యూనిట్ను గ్రౌండింగ్ చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా.. బీసీ కులవృత్తుల వారికి ఆర్థికసాయం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వాటి పరిశీలన పూర్తయిన వెంటనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ సొమ్ముతో కులవృత్తికి సంబంధించిన ముడిసరుకులు, పనిముట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. -
Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
సాక్షి, హైదరాబాద్: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు. బీసీల్లోని ఎన్ని వర్గాలకు? వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ఇవీ అర్హతా నిబంధనలు ►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. ►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు. -
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందచేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 9 మంది బాధితుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తన కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు.. K.సావిత్రి భర్త వెంకట్రాముడు 1. పత్తికొండ మండలం పత్తికొండ గ్రామానికి చెందిన కె.సావిత్రికి ఎనిమిది నెలల నుంచి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు. T. నరసింహులు 2. కౌతాళ మండలం తోవి గ్రామం చెందిన టి నరసింహులు తను పేదరికంతో ఉన్నానని, కుమారునికి అనారోగ్య కారణంగా వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. మెహరున్నీసా 3. కర్నూలు నగరానికి చెందిన మెహరున్నీసా తన కుమార్తెకు కిడ్నీ సమస్య ఉందని, అలాగే తన కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తన సమస్యను విన్నవించుకున్నారు. దిలీప్ కుమార్ రెడ్డి 4.మద్దికెర మండలం, గురజాల గ్రామం చెందిన పి. దిలీప్ కుమార్ రెడ్డి తాను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని, నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవలసి వస్తుందని,. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్నానని తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. బోయ నరసింహులు 5. నందవరం మండలం, సోమల గూడూరు గ్రామం చెందిన బోయ నర్సింహులు తనకు కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదని, తనకు ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. K.రంగమ్మ 6. పత్తికొండ మండలం, నక్కల దొడ్డి గ్రామానికి చెందిన కె.రంగమ్మ వికలాంగత్వంతో ఉన్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్కు విన్నవించుకున్నారు. P. ఈరన్న సోదరుడు 7.ఆలూరు మండలం, కోటవీధికి చెందిన పి. చిదానందం తన కుమారుడు ఈరన్నకు కడుపునొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. కురువ లక్ష్మి 8. ఆదోని మండలం, ఆదోని గ్రామానికి చెందిన కురవ లక్ష్మి తన కుమార్తెలు ఇరువురికి సరిగా చూపు కనపడక అందత్వంతో బాధపడుతున్నారని సీఎం జగన్కు విన్నవించుకున్నారు. L.మహేష్ 9. పత్తికొండ మండలం, పత్తికొండ గ్రామం ఎల్ మహేష్ తన కుమార్తె మూగ మరియు చెవిటి బాధతో ఇబ్బంది పడుతుందని తనను ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని మానవతా దృక్పథంతో ఇంత తొందరగా ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. -
సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూ గుంటూరులో కొందరు పేదలకు వరాల జల్లు కురిపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో గిరిధర్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని శ్యామలా నగర్ వచ్చారు. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకుని సాయం చేయమని వేడుకున్నారు. వారందరినీ పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకురమ్మని అధికారులకు ఆదేశించారు. అక్కడికక్కడే ఆదేశాలు అధికారుల సాయంతో హెలిప్యాడ్కు చేరుకున్న వి.మరియమ్మ, కోటేశ్వరరావు దంపతులు తమ గోడును వివరిస్తూ.. తమ రెండో కుమారుడు నవీన్ థలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనికి రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంటిస్థలం కూడా లేదని వాపోయారు. వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసి.. ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జె.బాబు, శివ లక్ష్మి దంపతులు మాట్లాడుతూ మునిసిపాలిటీలో ఉద్యోగం తీసేశారని, ఆ ఉద్యోగం తమ కుమారుడికి ఇప్పించాలని వేడుకున్నారు. వెంటనే సీఎం జగన్ అందుకు తగిన ఆదేశాలిచ్చారు. బి.పేరిరెడ్డి అనే వ్యక్తి గోడు చెప్పుకుంటూ.. గతంలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకున్నానని కొంత ఆర్థిక సాయం చే యాలని కోరగా.. ఆయనకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని, వైద్యం అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కె.పుష్ప జైన్ మాట్లాడుతూ తమ జైన్ సొసైటీకి కల్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆగమేఘాల మీద సీఎం ఆదేశాలను సాయంత్రానికల్లా అమలు చేశారు. అప్పటికప్పుడే తమ కోర్కెలను మన్నించి న్యాయం చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన ప్రభుత్వం: కలెక్టర్ గుంటూరులోని కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎం. వేణుగోపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి, జేసీ జి.రాజకుమారి బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. చదవండి: ట్విట్టర్ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం.. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
అలేఖ్యకు రూ.50వేలు ఆర్థికసాయం అందజేత
నల్గొండ: గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన అలేఖ్య నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చదువుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కేన్సర్తో బాధపడుతూ ఫిబ్రవరి 11న మృతిచెందింది. ఆమె తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ‘పది’లో సత్తా చాటిన విద్యార్థిని, అలేఖ్యకు బాసటగా నిలుస్తాం అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాలకు పలువురు దాతలు స్పందించి ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పటాన్చెరువు సీఐ నూకల వేణుగోపాల్రెడ్డి తాను చేపట్టిన వన్ చాలెంజ్ ద్వారా హైదరాబాద్లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్న కట్టెబోయిన అలేఖ్యను బుధవారం కలిసి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం ఇకపై పెళ్లి కూతురు తల్లి బ్యాంకు ఖాతాలోకి
సాక్షి, అమరావతి: ఈసారి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్ నెలల మధ్య ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అప్పట్లో ఈ ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అయితే, వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు ఈసారి ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్గా వ్యవహరించే ఇతరులకు ఆ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. -
ఒక్కరోజులోనే ‘సీఎం’ సాయం
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తారనేదానికి.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆదుకుంటారనడానికి బుధవారం జరిగిన సంఘటనే ఉదాహరణ. తాజాగా.. ఈనెల 26న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నార్పలకు విచ్చేసిన సీఎంను వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న పలువురు నేరుగా ఆయన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వారి కష్టాలను విన్న ఆయన చలించిపోయారు. ఆదుకునే విషయంపై అప్పటికప్పుడు కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు బాధితులతో కలెక్టర్ మాట్లాడి అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆమె బాధితులకు చెక్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ గాయత్రిదేవి, పరిపాలనాధికారి విజయలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర ఉన్నారు. ♦ ఇటీవల జరిగిన కెమికల్ బ్లాస్ట్లో భర్తను కోల్పోయానని అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన చాకలి నవ్య సీఎంకు తెలిపారు. ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఆమె కుటుంబానికి కలెక్టర్ రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. ♦ నార్పలకు చెందిన యోగీశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కుమారులతో తనకు కుటుంబపోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఆమె కుటుంబానికి రూ.2 లక్షలు సాయం అందించారు. ♦ నార్పలకు చెందిన రామాంజి విద్యుత్ శాఖలో బిల్ రీడర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై కుడిచేయి కోల్పోయాడు. ఆయనకు రూ.2 లక్షలతో పాటు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ♦ తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నార్పలకు చెందిన గంగయ్య సీఎంకు విన్నవించాడు. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్ చైర్ అందజేశారు. ♦ అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన రాజు, అరుణ కుమారుడు ధనుష్ జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడు. వీరు తమ బిడ్డ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అదే విధంగా ధనుష్కు అవసరమైన వైద్య చికిత్సలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వి. అమర్నాథ్రెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ♦ తన మేనల్లుడు చేతన్రెడ్డి కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన కొండారెడ్డి సీఎంకు తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ♦ నార్పల మండలం సిద్ధరాచెర్లకు చెందిన రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్ చైర్ అందజేశారు. ♦ అనంతపురానికి చెందిన నారాయణమ్మ కుమారుడు జశ్వంత్రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ♦ దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల సైకిల్ ఇవ్వాలని నార్పలకు చెందిన నబిరసూల్ సీఎంకు విన్నవించాడు. ఆయనకు ట్రై సైకిల్ను అందజేశారు. -
సీఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు. ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది. చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్ స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇడుపూరు లే–అవుట్లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. కలెక్టర్కు ఆదేశాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్లలో సీఎం జగన్ గురువారం పర్యటించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దృష్టికి ఐదుగురు బాధితులు తమ అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, ఆర్ధిక సహకారం, ఉపాధి అవకాశాలను కల్పించాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం.. వారిని తక్షణం ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బాధితులను జిల్లా కలెక్టరేట్కు పిలిపించి మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య జిల్లా కలెక్టర్ను కలిసిన బాధితుల్లో చిలకలూరిపేట నియోజకవర్గం, కనపర్రు గ్రామానికి చెందిన తన్నీరు ఓర్సు ఉమాదేవి తాత వెంకయ్య తన మనవరాలు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో అన్నం తినే సమయంలో అన్నవాహికకు అడ్డం పడుతుందని వాపోయారు. తమకు ఎటువంటి స్థిర,చర ఆస్తులు లేవని, ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఏడాదికి సుమారు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని అందించమని వేడుకొనగా తక్షణ సాయం కింద బాధితులకు 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని జిల్లా కలెక్టర్ అందించారు. చిలకలూరిపేట నియోజకవర్గం, ఏలూరుకు చెందిన పటాన్ మహబూబ్ సుభాని తనకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. తనకున్నసమస్యను పరిష్కరించడంతో పాటు కుటుంబ జీవన విధానం బాగుపడేందుకు తగిన ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్ధిక సాయం కింద బాధితునికి జిల్లా కలెక్టర్ 1 లక్ష సాయం అందజేశారు. పటాన్ మహబూబ్ సుభాని అనురాధ, వెంకటేష్ దంపతుల ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) చిలకలూరిపేట పట్టణం 18వ వార్డుకు చెందిన అనురాధ, వెంకటేష్ దంపతులు తన ఏడాదిన్నర పాప (అంకమ్మ యోక్షిత సాయి) పుట్టినప్పటి నుండి కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతుందని సీఎం ముందు వాపోయారు. పాపకు పలు ఆస్పత్రులలో చికిత్సలు అందించినప్పటికీ, హైదరాబాద్లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పటల్ నందు సమస్య నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి పాపకు వైద్యం చేయించామని, కాలేయ మార్పిడి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకోసం లక్షల్లో చికిత్సకు ఖర్చవుతుందని తెలియజేయడంతో బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆశ్రయించి వేడుకోవడంతో వారికి సీఎం వైద్య చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బాధితులకు తక్షణ వైద్య సాయం కింద ఖర్చుల నిమిత్తం 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు. నరసరావుపేటకు చెందిన సమీన్ పర్వానా అనే మహిళ తన ఏడేళ్ల సుభాని అనే బాలునికి జ్వరం రావడం తో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తీసుకు వెళ్ళానని, ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వలన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడని అక్కడినుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి అనేక ప్రముఖ వైద్య శాలలకు తీసుకు వెళ్ళినా నయం కాకపోగా ఐ.సీ,యూ లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ముఖ్య మంత్రి స్పందించిన మేరకు 1 లక్ష రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. సమీన్ పర్వానా కుంభగిరి పేరెడ్డి కుంభగిరి పేరెడ్డి డిసెంబరు 30వ తేదిన ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడిపోయానని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. ఎంత వైద్య చికిత్స చేయించుకున్నా తలకు, పొట్టకు తీవ్ర గాయం అయ్యి కోలుకోలేక పోతున్నానని ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన సీఎం జగన్ మెరుగైన వైద్యసేవలను అందిస్తామని భరోసా కల్పించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ బాధితునికి 1 లక్ష ఆర్ధిక సాయం చేశారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు.. అందుకే చేయలేకపోయా: కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవలే తనపై కొందరు నిఘా ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. గతేడాది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు ఆమె తన ఇన్స్టాలో తెలిపింది. గతేడాది ఓ రెస్టారెంట్ ప్రారంభించాలకున్నట్లు కంగనా తెలిపింది. కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అది వీలు కాలేదని పేర్కొంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో పాల్గొన్న ఇంటర్వ్యూను పంచుకుంది. ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటికే మర్చిపోయానని కంగనా తెలిపింది. గతంలో ఎమర్జెన్సీ చిత్రం నిర్మించడానికి తన ఆస్తులన్నీ తనఖా పెట్టినట్లు కంగనా వెల్లడించారు. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే తన ఆస్తిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. నేను కేవలం రూ.500తో ముంబైకి వచ్చానని.. కాబట్టి పూర్తిగా ఫెయిలైనా మరోసారి నిలబడగలననే విశ్వాసముందని తెలిపారు. కాగా.. కంగనా ఇటీవలే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చంద్రముఖి -2 సినిమాలో నటిస్తోంది. -
విపత్తుల నుంచి రక్షణకు ఆర్థికసాయం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: విపత్తుల నుంచి రక్షించుకోవడానికి తీరప్రాంత రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయాలని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని జిల్లాల్లోనూ మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏటా ఒకటి, అంతకన్నా ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటోందని చెప్పారు. తమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడంతో విపత్తు నిర్వహణ శాఖ విపత్తులు ఎదుర్కోవడంలో విజయం సాధిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కరవు లేదని చెప్పారు. ప్రతి సంవత్సరం తీర ప్రాంతాలను తుపానులు అతలాకుతం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2020వ సంవత్సరం నవంబర్ నెలలో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. తుపానుల ప్రభావం నుంచి కోలుకోవడానికి సహాయం కోరుతున్నట్లు చెప్పారు. ప్రపంచబ్యాంకు నిధులతో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎన్సీఆర్ఎంపీ) సహాయంతో తొమ్మిది తీరప్రాంత జిల్లాల్లో 219 మల్టీ పర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో కూడా వాటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. తమ సీఎం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో విపత్తులు వచ్చినప్పుడు తగిన సేవలు అందిస్తున్నారని తెలిపారు. తీరప్రాంతాల్లో మడ తోటలు, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్, ఇతర నిర్మాణాత్మక చర్యలు ఎంతో అవసరమన్నారు. ఎన్సీఆర్ఎంపీ మౌలిక సదుపాయాల కింద వంతెనల ఏర్పాటు, తుపాను షెల్టర్లకు అనుసంధానించే రహదారుల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆమె కోరారు. -
4 లక్షల మందికి గృహలక్ష్మి!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకానికి రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి ‘గృహ లక్ష్మి’గా నామకరణం చేయడంతోపాటు మొత్తం 4 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో 3వేల మందికి చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,57,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ కోటాలో మరో 43వేల ఇళ్లు కేటాయిస్తామని పేర్కొంది. దీనికోసం ఈ ఏడాది రూ.12వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డిలతో కలిసి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఇంటి’ కోసం మూడు విడతల్లో రూ.3లక్షలు సొంత స్థలాలు ఉండి ఇల్లు లేనివారు, గతంలో ఉన్న ఇల్లు కూలిపోయిన పేదలు ‘గృహలక్ష్మి’ పథకానికి అర్హులు. మంజూరు చేసే ఇళ్లన్నీ మహిళల పేరు మీదనే ఉంటాయి. తక్షణమే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ ప్రక్రియలను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించాం. ఒక్కో విడత రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో రూ.3 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంది. లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇళ్లను నిర్మించుకోవడానికి వీలుగా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించాం. సొంత జాగా లేని పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కొనసాగుతుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులు వేగంగా ముగించాలని అధికారులను ఆదేశించాం. పేదల హౌసింగ్ రుణాలు మాఫీ గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు ఇచ్చిన రూ.40 వేలు/ రూ.60 వేలు/ రూ.90 వేలు అప్పులను మాఫీ చేస్తున్నాం. ఈ మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దాదాపు రూ.4వేల కోట్ల అప్పులను ఆ పేదల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇకపై వారికి బ్యాంకులు, గృహ నిర్మాణ సంస్థ నుంచి నోటీసుల బాధలు ఉండవు. రెండోదశలో లక్షా 30వేల కుటుంబాలకు దళితబంధు లక్షా 30వేల దళిత కుటుంబాలకు రెండోదశ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే దళితబంధు 100 శాతం అమలైంది. మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 1,29,800 మందికి.. సీఎస్ నేతృత్వంలోని కమిటీకి వచ్చే అప్పీళ్ల ఆధారంగా మరో 200 మందికి అందిస్తాం. 2021 ఆగస్టు 16న దళితబంధు పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై ఏటా ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. గతంలో తరహాలోనే ఈసారి కూడా కలెక్టర్ల పర్యవేక్షణలో దళితబంధు అమలు చేయాలని, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించాం. 1.55 లక్షల మందికి పోడు పట్టాలు రాష్ట్రంలో 1,55,393 మంది అడవిబిడ్డలకు 4లక్షల 903 ఎకరాల్లో పోడు పట్టాలు ఇవ్వాలని, తక్షణమే పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం. లబ్ధిదారుల గుర్తింపు, తీర్మానాలు పూర్తి చేయడంతోపాటు పట్టాలను ముద్రించి పంపిణీకి సిద్ధం చేశాం. ఎక్కడైనా మిగిలి ఉన్నచోట ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ హుస్సేన్సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సిద్ధమైంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని మంత్రివర్గంలో నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత ప్రజలు, బిడ్డలను హైదరాబాద్కు పిలుచుకుని, లక్షల మంది సమక్షంలో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతాం. అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి దళితవర్గాల ప్రజలు హైదరాబాద్కు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విగ్రహావిష్కరణ అనంతరం భారీ సభ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. 2020 కటాఫ్తో జీవో 58, 59లకు దరఖాస్తులు ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఇచ్చిన జీవో 58, 59 కింద గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి చివరిసారిగా నెల రోజుల గడువుతో మరో అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో 2014 కటాఫ్ తేదీ ఉండగా 2020కి మార్చుతున్నాం. జీవో 58 కింద ఒక్క రూపాయి లేకుండా పేదలకు స్థలం/ఇంటి మీద హక్కు కల్పిస్తాం. జీవో 58 కింద ఇప్పటివరకు 1,45,668 మందికి, జీవో 59 కింద 42వేల మందికి పట్టాలు అందించడం జరిగింది. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పేదల ఇళ్లను జేసీబీలు, పోక్లెయిన్లతో కూల్చివేస్తే.. మేం క్రమబద్ధీకరిస్తున్నాం. ఏప్రిల్ నుంచి గొర్రెల పంపిణీ గొర్రెల పంపిణీ పథకం కింద రాష్ట్రంలో 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా.. అందులో 50శాతం మందికి గతంలో పంపిణీ పూర్తయింది. రెండో విడత కింద మిగతా వారికి ఏప్రిల్ నుంచి పంపిణీ ప్రారంభించనున్నాం. ఇందుకోసం రూ.4,463 కోట్లను మంజూరు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియ జరగాలని ఆదేశించాం. కాశీ, శబరిమలలో రాష్ట్ర వసతి గృహ సముదాయాలు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లే భక్తుల కోసం కాశీ, శబరిమలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వసతి గృహాలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీటికి చెరో రూ.25 కోట్లను మంజూరు చేసింది. సీఎస్ కాశీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం తీసుకుంటారు. ప్రభుత్వ స్థలం దొరకకపోతే ప్రైవేటు స్థలం కొని అన్ని వసతులతో వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తాం. సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్ శబరిమల వెళ్లి అక్కడి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకోవాలని సూచించాం. తర్వాత మంత్రుల బృందం వెళ్లి పనులు ప్రారంభిస్తుంది. గతంలో సీఎం కేసీఆర్ కేరళ సీఎంతో మాట్లాడినప్పుడు అక్కడ మంచి స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. ఏప్రిల్ నుంచి ధాన్యం కొనుగోళ్లు కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం పనులు పూర్తికావచ్చాయి. జూన్ 2లోగా వీటిని ప్రారంభించుకుంటాం. రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారి విషయంలో చట్టాలు, నిబంధనలకు లోబడి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు మే వరకు సమయం ఉంది. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. యాసంగిలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కేంద్రం కొన్నా, కొనకపోయినా ఏప్రిల్ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం..’’ అని హరీశ్రావు తెలిపారు. -
బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) టెక్నాలజీ, ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ జీడిమెట్ల ఫార్మా క్లస్టర్లో 2023 ఏప్రిల్ నుంచి ఈ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. టీఎస్ఐఐసీ ఒక ఎకరం స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పద్ధతిన సమకూర్చింది. ఈ ఫెసిలిటీ కోసం హెటిరో గ్రూప్ రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ఇతర సంస్థలు సైతం ఆర్థిక సాయానికి ముందుకు వస్తాయని అసోసియేషన్ భావిస్తోంది. ఔషధ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులకు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్లో శిక్షణ ఇస్తారు. అలాగే బీడీఎంఏ సభ్య కంపెనీలు నూతనంగా నియమించుకున్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్ కల్పిస్తారు. ఆధునిక పరిశోధన, పరీక్షలకు కేంద్ర స్థానంగా ఇది నిలుస్తుందని బీడీఎంఏ తెలిపింది. పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఈ విధంగా సాంకేతిక, శిక్షణ కేంద్రం నెలకొల్పడం దేశంలో తొలిసారి అని పేర్కొంది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యం పెంచుకోవడానికి నాలెడ్జ్ సెంటర్గా కూడా పని చేస్తుందని అభిప్రాయపడింది. -
ఎఫ్సీఎన్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్లో ఎఫ్సీఎన్ హోమ్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు నగదు, నిత్యవసరాలను బుధవారం పంపిణీ చేశారు. ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు డా. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు.. కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు. జంట నగరాల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. ఐదువేలు చొప్పున నగదు, జత బట్టలు, దుప్పటి, నిత్యావసరాలను అందజేశారు. ఈ కండర క్షీణిత వ్యాధితో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని గుర్తించి మానవతా దృక్పథంతో వారికి తమ వంతు సహాయం అందజేస్తున్నామని వ్యవస్థాపకులు అన్నారు. కండర క్షీణిత వ్యాధితో బాధితులకు మానవత్వంతో తోచిన సాయాన్ని అందించాలని నిర్వాహకులు పిలుపునివ్వగా, కొందరు దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చారు. స్థానిక ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు స్లీవా రెడ్డి ఒక్కొక్కరికి రూ.1000 నగదు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన దాతలకు ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్ర
సాక్షి, అమరావతి: హజ్ (మక్కా) యాత్రకు వెళ్లే రాష్ట్రానికి చెందిన ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ నుంచి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా హజ్ యాత్రికుల కోసం విజయవాడలో ఇమిగ్రేషన్కు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఏపీకి చెందిన హజ్ యాత్రికులు ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. ఈ ఏడాది నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లొచ్చు. ఈ అవకాశాన్ని రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలి’ అని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. యాత్ర ఏర్పాట్లపై రూపొందించిన కరపత్రాలు, వాల్పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సమావేశం నిర్ణయాలను సభ్యులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన బియ్యం కార్డుదారులకు రూ.60 వేలు, రూ. 3 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తోఫా ఇస్తోంది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వడంలేదు. తొలిసారి 70 ఏళ్ల పైబడిన వారు (1953 ఏప్రిల్ 30కి ముందు జన్మించిన వారు) దరఖాస్తు చేసుకుంటే లాటరీతో సంబంధం లేకుండా నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు. 70 ఏళ్లు పైబడిన వారు ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లొచ్చు. అదే విధంగా ఒంటరిగా ఉండే 45 ఏళ్ల పైబడిన మహిళలు కనీసం నలుగురు (2023 ఏప్రిల్ 30 నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలి) కలిసి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఎంపిక చేస్తారు. ఒక వేళ ఇద్దరు మహిళలే దరఖాస్తు చేస్తే, కమిటీ ద్వారా మరో ఇద్దరు మహిళలను కలిపి పంపిస్తారు. ఈసారి 12 ఏళ్ల లోపు చిన్నారులకు సౌదీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. యాత్రకు వెళ్లే వారి కోసం హజ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా హజ్ సొసైటీల ద్వారా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. యాత్రికుల కోసం జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు ప్రత్యేకంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. వారిని సాగనంపేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు సైతం గన్నవరంలోని ఓల్డ్ ఎయిర్పోర్టు, విజయవాడలోని మదరసాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి సహాయార్ధం వలంటీర్లను సైతం నియమిస్తున్నారు. ప్రయాణానికి 48 గంటల ముందు రిపోర్టు చేసే యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మక్కాలో కూడా ఏపీ నుంచి వెళ్లే యాత్రికులకు ఏపీ ప్రభుత్వం తరపున ఒకే ప్రాంగణంలో వసతి, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ తెలిపారు. కమిటీ సమావేశంలో సభ్యులైన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సయ్యద్ వలియుల్లా హుస్సేన్, çమహమ్మద్ ఇమ్రాన్, షేక్ గులాబ్జాన్, షేక్ అతువుల్హా తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేయండిలా.. హజ్ యాత్రకు వెళ్లే వారు http:hajcommittee.gov.in ద్వారా లేదా స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో మార్చి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తుతో పాటు పాస్పోర్టు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు–2, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు–4, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ లేదా క్యాన్సిల్డ్ బ్యాంక్ చెక్ సమర్పించాలి ► ఉచితంగా దరఖాస్తు చేసేందుకు జిల్లా హజ్ సొసైటీల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ► దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు అవసరమైన పత్రాలు, అడ్వాన్స్ ఫీజు రసీదు, మెడికల్ సర్టిఫికెట్లను డ్రా తర్వాత ఏపీ హజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలి -
కుటుంబ ఆర్థిక భద్రతే ముఖ్యం.. భారతీయుల అభిప్రాయమిదే..!
సాక్షి, హైదరాబాద్: కుటుంబాల ఆర్థిక భద్రతే తమకు సర్వోన్నతమైనదని, అదే అత్యున్నత జీవిత లక్ష్యమని ఎక్కువ మంది భారతీయులు అభిప్రాయపడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతే వ్యక్తిగత కెరీర్, విదేశీ పర్యటనలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం వంటి అంశాలను లక్ష్యాలుగా నిర్దే శించుకుంటున్నట్లు తేలింది. కోవిడ్తో తలకిందులైన ఆర్థిక పరిస్థితులు, ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రజలపై కరోనా ప్రభావాల నేపథ్యంలో భారతీయుల ప్రాధాన్యతలపై లైఫ్ ఇండియాస్ లైఫ్ గోల్స్ ప్రిపేర్డ్నెస్ సర్వే 2023 పేరిట ప్రముఖ జీవితబీమా సంస్థ బజాజ్ అలయెంజ్ అధ్యయనం చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2019లో 51 శాతంతో పోలిస్తే 2023లో 84 శాతం మంది సమతూకమైన జీవనం (బ్యాలెన్స్డ్ లైఫ్) గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. వృద్ధాప్యంలో ఆర్థిక స్వేచ్ఛ కోసం జీవిత బీమాలో పెట్టుబడులకు 82 శాతం ఇష్టపడుతున్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు ► ఉద్యోగ విరమణ అనంతరం భద్రతతో కూడిన, చింతలులేని జీవనం గడిపేందుకు వీలుగా జీవిత బీమా చేసేందుకు 77 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ► వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్య్ర సాధన కష్టసాధ్యమనే భావనలో 67 శాతం ఉన్నారు. ► కరోనా అనంతరం ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా చేసేందుకు 73 శాతం మంది మొగ్గుతున్నారు. ► సొంతింటి కల సాకారమనేది ఇబ్బందితో కూడుకున్నదేనని 61% మంది భావిస్తున్నారు. ► వయసు పైబడిన తల్లిదండ్రుల బాగోగులు ‘ప్రయారిటీ లైఫ్ గోల్’గా 40 % మంది పేర్కొన్నారు. కరోనా మిగిల్చిన దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు.. కరోనా మిగిల్చిన దుష్పప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రజలు శ్రమిస్తున్నారు. కరోనా కాలంలో వారి ఆర్థిక పరిస్థితిపై ఏర్పడిన అనిశ్చితి కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా అనంతర పరిణామాల్లో కుటుంబ ఆర్థిక భద్రతకే పెద్దపీట వేస్తున్నారు. దీంతోపాటు ఇతరులపట్ల సానుభూతి పెరగ డం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే భావనలు పెరిగాయి. బీమా కంపెనీలు సైతం ప్రతి ఏజ్గ్రూప్కు వర్తించేలా వివిధ బీమా ప్లాన్లు తీసుకొస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. – వీరేందర్, కన్సల్టెంట్ సైకాలజిస్ట్ పెరిగిన లక్ష్యాలు.. దేశవ్యాప్తంగా ఢిల్లీ, లూథియానా, బరేలీ, కోల్కతా, పటా్న, భువనేశ్వర్, ముంబై, సూరత్, అమరావతి (మహారాష్ట్ర), చెన్నై బెంగళూరు, మధురై, గుంటూరులలో జరిగిన ఈ అధ్యయనంలో 2019తో పోలిస్తే 2023లో సగటు లక్ష్యాల సంఖ్య 5 నుంచి 11కు పెరిగింది. జీవిత లక్ష్యాలకు సన్నద్ధం కావడంలో ఆత్మవిశ్వాసం, అవగాహన, ఆర్థిక ప్రణాళికల కోసం తీసుకొనే చర్యలు వంటి అంశాలను ఈ సర్వేలో పరిశీలించారు. వివిధ పెట్టుబడులపై ప్రజలు అభిప్రాయాలు ఏర్పరుచుకోవడంలో సోషల్ మీడియా, ఇన్ఫ్లూయెన్సర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబ ఆర్థిక భద్రత, సమతూకమైన జీవితాన్ని గడపాలనే ప్రధాన లక్ష్యాలతోపాటు మరిన్ని కోరికలు నెరవేర్చుకోవాలని సర్వేలో పాల్గొన్న భారతీయులు భావిస్తుండటం ఆసక్తికరం. ఇవి దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన బలమైన సిద్ధాంతాలను, భారతీయుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. – బజాజ్ అలయెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఢిల్లీ) ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ చదవండి: మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్.. పట్టాలకు ఫాబ్రికేషన్.. -
కిలిమంజారోను అధిరోహించే వెన్నెలకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామ గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెల ఈనెల 19 నుంచి కిలిమంజారో (5,895 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించనుంది. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ను వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వెన్నెలకు సంతోష్ రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి ఆశీర్వదించారు. భవిష్యత్లో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని వెన్నెల తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. -
నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్ తక్షణ సాయం..
సాక్షి, అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. గురువారం యలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి.. వారికి అవసరమైన సాయం చేశారు. కొండమంచిలి వాణి యలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి వాణి అమ్మమ్మ విన్నవించుకున్నారు. దీంతో తక్షణ సహాయానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. కలగా శివాజి ఎస్. రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పని చేయకపోవడంతో వీల్ఛైర్కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్ధోమత లేదని సీఎంకి శివాజి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. -
ఆర్టీసీకి 600 కోట్ల అప్పు కావాలి
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఆదాయం పెరుగుతున్నా.. మరోవైపు గుట్టలా పేరుకుపోయి ఉన్న పాత బకాయిలు తీర్చటం ఆర్టీసీకి పెద్ద సవాల్గా మారింది. వీటిని తీర్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సాయం లేకపోవటంతో అనివార్యంగా అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రూ.2270 కోట్ల బ్యాంకు అప్పులు పేరుకుపోయాయి. మళ్లీ కొన్ని ఇతర బకాయిలు తీర్చేందుకు మరోసారి అప్పు తీసుకోబోతోంది. తాజాగా రూ.600 కోట్ల అప్పుల కోసం రెండు బ్యాంకులతో ఆర్టీసీ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇందులో ఎంత అప్పు మంజూరవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మంజూరైతే కనుక ఆర్టీసీ అప్పులు దాదాపు మూడు వేల రూ.కోట్లకు చేరువవుతాయి. హైకోర్టు ఆదేశంతో.... ఆర్టీసీలో ఉద్యోగుల సహకార పరపతి సంఘా(సీసీఎస్)నిది ప్రత్యేక స్థానం. ఆర్టీసీ నిధులతో ఏమాత్రం సంబంధం లేని ఈ సంస్థ పూర్తిగా ఉద్యోగుల జీతాల నుంచి కేటాయించే మొత్తంతో నడుస్తుంది. వేల రూ.కోట్ల నిధులతో ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పరపతి సంఘాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే ఆ తర్వాత నష్టాలు, అప్పులతో కునారిల్లుతున్న ఆర్టీసీ ఆ నిధిని సొంతానికి వాడేసుకోవటంతో ఆ పరపతి సంఘం కాస్తా కొరగాకుండా పోయింది. ఇప్పుడు దానికి వడ్డీతో కలుపుకొంటే దాదాపు రూ.900 కోట్లను ఆర్టీసీ బకాయిపడింది. ఎన్నిసార్లు కోరినా ఆ మొత్తం ఇవ్వకపోవటంతో ఇటీవల ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మొత్తం బకాయిల్లో రూ.200 కోట్లను ఎనిమిది వారాల్లో చెల్లించాలని మధ్యంతర తీర్పు వెలువరించింది. ఇందులో తొలి వంద రూ.కోట్లు తొలి నాలుగు వారాల్లో చెల్లించాల్సి ఉండగా, తాజాగా ఆ గడువు పూర్తయింది. కానీ డబ్బు మాత్రం చెల్లించలేదు. త్వరలో ఈ కేసు మళ్లీ కోర్టు పరిశీలనకు రాబోతోంది. ఈలోపు డబ్బు చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కారం అవుతుంది. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీకి నెలకొంది. వేతన సవరణ బకాయిలు రూ.280కోట్లు మరోవైపు, 2015లో ప్రకటించిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తం ఇంకా చెల్లించలేదు. వాటికోసం చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ బకాయి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లించనున్నట్టు మంత్రులు పేర్కొన్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఉప ఎన్నిక అయిపోయినా ఆ బకాయి అలాగే ఉండటంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బకాయి మొత్తం రూ. 280 కోట్లు కూడా చెల్లించాలని సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికి సంబంధించి నిధులు ఆర్టీసీ వద్ద లేకపోవటంతో మరోసారి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త బస్సులకు అప్పులు ఇచ్చిన బ్యాంకులపైనే ఆశ ఇటీవలే కొత్త బస్సులు కొనేందుకు బ్యాంకుల సాయాన్ని తీసుకున్న ఆర్టీసీ మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుంది. ఓ ఏడాది క్రితం వరకు ఆర్టీసీకి అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు జంకే పరిస్థితి వచ్చింది. కానీ ఎండీ సజ్జనార్ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలతో ఆర్టీసీ ఆదాయం మెరుగుపడింది. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం సగటు రూ.14.50 కోట్లుగా ఉంటోంది. ఆర్టీసీ లాజిస్టిక్ ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఆర్టీసీపై బ్యాంకులకు మళ్లీ నమ్మకం పెరిగింది. కొత్త బస్సుల కోసం అడిగిన వెంటనే లోన్ ఇచ్చిన బ్యాంకులు ఈసారి కూడా సానుకూలతనే వ్యక్తం చేసినట్టు సమాచారం. -
‘వీహబ్’తోడుగా.. విజయం దిశగా..
సాక్షి, హైదరాబాద్: వారు సాధారణ దళిత మహిళలు.. వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా ఏం చేయాలనే స్పష్టత లేనివారు.. కానీ ఇప్పుడు వారు ఉపాధి పొందడమేకాదు.. మరికొందరికి ఉపాధినిచ్చే దశకూ చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ ఆర్థికసాయం.. మహిళలు వ్యాపార, వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘వీహబ్’ భాగస్వామ్యం.. కలిసి దీనిని సాకారం చేశాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో హుజూరాబాద్ ప్రాంతంలో 343 మంది ఎస్సీ మహిళలు వీహబ్ తోడ్పాటుతో ఎంట్రప్రెన్యూర్లుగా ప్రస్థానం ప్రారంభించడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వీహబ్ ఇప్పటికే సుమారు 4 వేల మంది గ్రామీణ మహిళల్లో వ్యాపార దక్షత పెరిగేందుకు తోడ్పాటును అందించింది కూడా. ప్రత్యేకంగా అవగాహన కల్పించి.. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీహబ్ చేస్తున్న కృషిని గుర్తించిన అధికారులు.. హుజూరాబాద్లో దళితబంధు పథకం అమల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన వీహబ్.. మూడు నెలల పాటు దళితబంధు లబ్ధిదారులతో కలిసి పనిచేసింది. వారి అవసరాలు తెలుసుకోవడంతోపాటు ఉపాధి పొందడానికి అవసరమైన తోడ్పాటును అందించింది. మొదట ఉపాధి మార్గం,దానిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన వనరులు తదితర అంశాలపై ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను (ఈడీపీ) నిర్వహించింది. దళితబంధు పథకం కింద స్థానికంగా అధికారులు ఎంపికచేసిన 790 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. అందులో 343మంది మహిళలు సొంతంగా ఉపాధి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు. అన్ని అంశాల్లో తోడుగా.. మహిళల వ్యాపార ఆలోచన, దాని వెనుకుండే లాభనష్టాలు, ప్రాజెక్టు నివేదిక తయారీ వంటి అంశాలపై వీహబ్ అవగాహన కల్పించింది. లబ్ధిదారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏడు అంశాలపై లోతుగా శిక్షణ ఇచ్చింది. వారికి అవసరమైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేష¯] ్లు, లైసెన్సులు, యంత్రాల కొనుగోలుకు అమ్మకందారులతో పరిచయాలు, కొటేషన్లు, స్కీమ్ డబ్బులను అధికారులు విడుదల చేయడం దాకా తోడుగా నిలిచింది. దీంతో 343 మంది మహిళలు 3 నెలల వ్యవధిలోనే వ్యాపారాలను ప్రారంభించగలిగారు. వారి తపన అభినందనీయం తొలుత మేం దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై వారి ఆలోచనలను తెలుసుకున్నాం. వాటిని ఆచరణలోకి ఎలా తేవాలనే దానిపై మార్గదర్శనం చేశాం. వారిలో పట్టుదలను నింపేందుకు ఇప్పటికే సక్సెస్ అయిన మహిళా ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలను వీడియోల ద్వారా చూపించాం. దళిత మహిళలు లింగ, కుల, సామాజిక, ఆర్థిక అడ్డంకులను దాటుకుని ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు పడుతున్న తపన అభినందనీయం. – దీప్తి రావుల, సీఈవో, వీహబ్ రెండు నెలల్లోనే సంపాదన మార్గంలోకి.. ఇంటర్ వరకు చదువుకున్న నేను పెళ్లయిన తర్వాత డిగ్రీ పూర్తి చేశా. హోమ్ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. దళిత బంధు కింద ఎంపిక కావడంతో ఏ వ్యాపారమైతే బాగుంటుందనేది తెలుసుకునేందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిశాను. నా భర్తకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి కారు కొందామనుకున్నా. వీహబ్ ప్రతినిధులను కలిశాక స్పష్టతకు వచ్చా. వారి తోడ్పాటుతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్ పెట్టి.. రెండు నెలల్లోనే నెలకు రూ.10వేలకుపైగా సంపాదించే దశకు చేరుకున్నా. – నీరటి మౌనిక, దళితబంధు లబ్ధిదారు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థితిలో ఉన్నా.. చాన్నాళ్లు ఇంటికే పరిమితమైన నేను ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్గా మారాను. ఇంట్లోనే ఏర్పాటు చేసిన క్యారీబ్యాగ్స్ తయారీ యూనిట్తో నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి దళితబంధు పథకానికి ఎంపికైన తర్వాత శారీ సెంటర్గానీ, కిరాణా దుకాణంగానీ ఏర్పాటు చేయాలనుకున్నాను. వీ హబ్ భేటీ తర్వాత చేతి సంచుల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఉపాధి వెతుక్కునే దశ నుంచి ఇప్పుడు వేరేవాళ్లకు ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆనందాన్నిస్తోంది. – వేల్పుల శారద, దళితబంధు లబ్ధిదారు, హుజూరాబాద్ -
మాండూస్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం విడుదల
-
యువకులకు ఎంపీ కోమటిరెడ్డి ఆర్థికసాయం
నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఇద్దరు యువకులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండలంలోని శాపల్లి గ్రామానికి చెందిన శ్రీపాద మధు చిన్నవయసులోనే తల్లిదండ్రులు కృష్ణమాచారి, విజయ మృతి చెందారు. అమ్మమ్మ సావిత్రమ్మ అతడిని పెంచి పెద్దచేసింది. అమ్మమ్మ కూడా అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో మధు అనాథ అయ్యాడు. 10వ తరగతి వరకు చదివిన మధు... ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమతలేక కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ వార్డు మెంబర్ శిరిగిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊషయ్యల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం గ్రామానికి వచ్చి మధుకు రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బత్తుల ఊషయ్య, పాశం శ్రీనివాస్రెడ్డి, కొంపెల్లి సైదులు, మదాసు చంద్రశేఖర్, కొమరబోయిన మల్లేషం, శిరిగిరెడ్డి వెంకట్రెడ్డి, కూరా కుల కృష్ణ, మాగి సుజన, నాయకులు ఉడతల వెంకన్న, తదితరులు ఉన్నారు. క్రీడాకారుడికి కూడా.. మండలంలోని కొండపాకగూడేనికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు గుండబోయిన సాయితేజ జాతీయస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 9 నుంచి మహారాష్ట్రలో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సాయికి రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. -
Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, మిగతా వారికి ప్రాధాన్యం దక్కడం లేదని క్షేత్రస్థాయిలో ఆరోపణలున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించే క్రమంలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని దళిత కుటుంబాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఎమ్మెల్యే సిఫార్సుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో మార్పులపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రత్యేక కమిటీ ద్వారా ఎంపిక చేస్తే... లబ్ధిదారులను ఎమ్మెల్యే సూచించిన జాబితా ఆధారంగా కాకుండా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలతోపాటు, ఎమ్మెల్యేల సూచనలు సైతం కోరింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానం పరిధిలో జిల్లా అధికారి లేదా ఆర్డీఓ, సమానస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు సూచించారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేను సైతం భాగస్వామ్యం చేయాలని శాసనసభ్యులు సైతం కోరినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని గ్రామాలన్నీ కవర్ అయ్యేలా ఎంపిక ప్రక్రియ ఉండాలనే సూచనలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దళితబంధు కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఆమోదించినప్పటికీ కోర్టు సూచనలతో నిలిచిపోయింది. -
గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విద్యార్థిని హారికకు గొప్ప సాయం!
హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్ గూడకు చెందిన హారికకు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి కవిత ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్లో రాణించి, వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక అన్నారు. Dare to dream and then never stop working until you achieve them. This is the story of Harika,who passed and excelled in the MBBS exams via YouTube videos. I met her and her mother and extended my support towards her dreams by handing over the first installment of her fees (1/2) pic.twitter.com/8NIUqSk91e — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2022 -
ఫలించని వ్యూహాలు.. గ్రేటర్ మెట్రోకు కొత్త కష్టాలు!
సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న గ్రేటర్ మెట్రోను గట్టెక్కించేందుకు నిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇందుకోసం ఐదేళ్లుగా అమలు చేస్తోన్న సరికొత్త వ్యూహాలు ఆశించినస్థాయిలో సత్ఫలితాన్నివ్వడం లేదు. తాజాగా ప్రాజెక్టులో తమ వాటాను 50 శాతం విక్రయించేందుకు ముందుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో నిర్మాణం చేపట్టేందుకు వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సుమారు 13 వేల కోట్ల రుణాలను సేకరించింది. ఇందులో తమ వాటాను సగానికి తగ్గించుకోవడం ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాలపై వడ్డీ భారాన్ని సైతం ఇటీవల సుమారు 2.5 శాతం తగ్గించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు టిక్కెట్ ఛార్జీల పెంపు ద్వారా రోజువారీగా భారంగా మారిన నిర్వహణ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నినస్తుండడం గమనార్హం. ఇందుకోసం ప్రభుత్వం ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన నగరంలో ప్రభుత్వం నిర్మా ణ సంస్థకు కేటాయించిన సుమారు 69 ఎకరాల విలువైన స్థలాలను క్రమంగా లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో సత్ఫలితాన్నివ్వలేదు. తాజాగా రాయదుర్గంలోని 15 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా మరో వెయ్యికోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. వాటా దక్కించుకునేదెవ్వరో.. ఐదేళ్లుగా నష్టాలతో నెట్టుకొస్తున్న గ్రేటర్ మెట్రోలో నిర్మాణ సంస్థ విక్రయించాలనుకుంటున్న 50 శాతం వాటాను దక్కించుకునేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశం సస్పెన్స్గా మారింది. ఒకవైపు భయపెడుతోన్న నష్టాలు..మరోవైపు కొండలా పేరుకుపోయిన రుణాలు,వాటిపై వడ్డీ చెల్లింపులు భారంగా మారిన తరుణంలో నిర్మాణ సంస్థ వాటాల విక్రయం అంత సులభం కాదని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్, లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన తమకు రూ.3 వేల కోట్ల మేర వడ్డీలేని సాఫ్ట్లోన్ను మంజూరు చేయాలని నిర్మాణ సంస్థ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. అనుకున్నదొక్కటి... - నగరంలో ఎల్బీ నగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులోకి వచ్చింది. - ప్రస్తుతం ఈ రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ అంచనాల మేరకు ఈ మూడు రూట్లలోనిత్యం 16 లక్షలమంది జర్నీ చేస్తారని ఐదేళ్ల క్రితం అంచనా వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. - పార్కింగ్ కష్టాలు, లాస్ట్మైల్ కనెక్టివిటీ లేకపోవడం తదితర అంశాలు మెట్రోకు శాపంగా మారాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు కనీస ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి..గరిష్ట ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.60 నుంచి రూ.100కు పెంచేందుకు ప్రయత్నినస్తునట్లు సమాచారం. -
కన్స్ట్రక్షన్ వర్కర్స్కు నెలకి రూ.5వేలు.. సీఎం కీలక నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో కొత్త నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో వందల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితమైన నిర్మాణ రంగ కార్మికులందరికీ ఆర్థిక సాయం అందించాలని కార్మిక శాఖ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించారు. ‘కాలుష్యం కారణంగా ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. నిషేదం తొలగించే వరకు నిర్మాణ రంగంలోని కార్మికులకు ఒక్కొక్కరికి నెలకి రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని లేబర్ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించాం.’అని ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయిన క్రమంలో అక్టోబర్ 30న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. Pollution के ख़िलाफ़ लड़ाई में CM @ArvindKejriwal का बड़ा फ़ैसला‼️ 🔹Construction पर लगी रोक के मद्देनज़र Construction मज़दूर को ₹5000-₹5000 आर्थिक मदद देने का फ़ैसला लिया। 🔹 दिल्ली में निर्माण पर पाबंदियां रहने तक मज़दूरों को आर्थिक सहायता दी जाएगी। AAP की सरकार-आप के साथ। — AAP (@AamAadmiParty) November 2, 2022 ఇదీ చదవండి: ‘అప్పుడు ఆజాద్.. ఇప్పుడు గెహ్లట్.. మోదీ ప్రశంసలు ఆసక్తికరం’.. పైలట్ సంచలన వ్యాఖ్యలు -
కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
సాక్షి, కోవూరు: తనను నమ్ముకొన్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అండగా నిలిచారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇటీవల అకాల మరణం చెందారు. అశోక్కుమార్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న పార్టీని, తనను నమ్ముకున్న ఆ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ప్రసన్న సోమవారం పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష వంతున నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాధను తెలుసుకుంటూ ప్రసన్న కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కంట కన్నీరు గమనించిన పార్టీ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని పలువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ సతీష్ రెడ్డి, వెంకయ్య, శేషు, చరణ్, మస్తాన్ ఉన్నారు. -
‘నాడు-నేడు’ను గుర్తించిన వరల్డ్ బ్యాంక్.. ఆర్థిక సాయం ప్రకటన
ఏపీ ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ప్రపంచం బ్యాంకు గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన చదువులు అందించే ‘నాడు-నేడు’కు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది. 250 మిలియన్ డాలర్లతో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 250 మిలియన్ డాలర్ల నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ సాయంతో మొత్తం ప్రపంచ బ్యాంకు నిధులతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన ఇది తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల ఖర్చు చేసింది. ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.19,617 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. వచ్చే ఇదేళ్లలో ఈ నిధులను ఉపయోగించుకుని జరిగే అభివృద్ధి ని ప్రోగ్రాం ఫర్ రిజల్ట్స్ కింద చూడనున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది. చదవండి: విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు 14, 15 న దక్షిణాది రాష్ట్రాల సదస్సు పాఠశాల విద్యలో ఉత్తమ పద్ధతులు, సంస్కరణలే ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యం పెంచాలనే ఉదేశ్యంగా దక్షిణాది రాష్ట్రాల యుడిఐఎస్ఈ సదస్సును విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా సంస్కరణలను చర్చించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకంపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. -
దేవిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి/కరప : కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల కూరాడ గ్రామంలో హత్యకు గురైన దేవిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. దేవిక హత్య ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్.. దిశ చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు. దోషి రెడ్ హేండెడ్గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని, తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల సాయాన్ని దేవిక కుటుంబ సభ్యులకు రెండు రోజుల్లో అందజేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కరపలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని కూరాడ సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ, పీఏసీఎస్ అధ్యక్షుడు రావుల ప్రసాద్, ఇతర నాయకులకు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరు ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి కాదా దేవికను హత్య చేసిన నిందితుడు గుబ్బల వెంకట సూర్యనారాయణను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరు పరచి, రిమాండ్కు తరలించారు. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాస్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కాదా రాంబాబు కుమార్తె దేవిక.. కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. అదే గ్రామంలో మేనమామ ఇంటి వద్ద ఉండే గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా దేవికను వేధిస్తున్నాడు. అందుకు నిరాకరించిందన్న అక్కసుతో శనివారం ఆమెను పెదపూడి మండలం కాండ్రేగుల–కూరాడ గ్రామాల మధ్య కత్తితో అతి దారుణంగా నరికి హతమార్చిన విషయం విదితమే. నిందితుడు వెంకట సూర్యనారాయణను కాకినాడ రూరల్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి నివాసంలో ఆమె ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి ఈ నెల 21వ తేదీ వరకూ రిమాండ్ విధించగా, అతడిని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. చదవండి: (కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..) -
2.17లక్షల మందికి షాదీముబారక్!
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో షాదీముబారక్ కింద 2.17లక్షల మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,751 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2022–23 వార్షిక ఏడాదిలో ఈ పథకం కోసం రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించింది. షాదీముబారక్ పథకంతో మైనార్టీ వర్గాల్లో బాల్యవివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ శాఖ నివేదికలో పేర్కొంది. విద్యాభివృద్ధికోసం గురుకులాలు మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గురుకుల విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 12 పాఠశాలలు మాత్రమే ఉండగా...ఇప్పుడు వాటి సంఖ్య 206కు చేరిందని తెలిపింది. ఈ పాఠశాలల్లో మొత్తం 1.14లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ ఉన్నతవిద్య పథకం కింద ముఖ్యమంత్రి ఉపకార వేతనాల కింద ఇప్పటివరకు రూ.6.30 కోట్ల ఆర్థిక సహకారాన్ని మైనార్టీ విద్యార్థులకు అందించామని, 2022–23 ఆర్థిక ఏడాదికి గాను రూ.100 కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది. రూ.40కోట్లతో నాంపల్లిలో అనీస్ –ఉల్ –గుర్బా అనాథ శరణాలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు వివరించింది. మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే 10 వేలమంది ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేలచొప్పున గౌరవవేతనం అందిస్తోందని, రంజాన్ కానుకగా 4.65లక్షల మందికి, క్రిస్మస్ పండుగకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నట్లు ఆ శాఖ వివరించింది. -
ఇచ్చిన మాటకు కట్టుబడి.. జాహ్నవికి రూ.50లక్షల సాయం
సాక్షి, పశ్చిమగోదావరి: ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల సాయం అందజేయడంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి ఆనందం వ్యక్తం చేసింది. జగనన్న మేలు మర్చిపోలేనిదని పేర్కొంది. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల సమయంలో సీఎం రాజమండ్రి వచ్చినప్పుడు కలిశానని, ‘‘నీ విద్యకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు.. నీకు ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తా’’ అంటూ అప్పుడు ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది. సీఎం భరోసాతో ఆస్ట్రోనాట్గా అవ్వాలన్న తన ఆశలు మరింత పెరిగాయంది. బుధవారం అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ప్రభుత్వం అందించిన రూ. 50 లక్షల చెక్కును జాహ్నవి అందుకుంది. చదవండి: (Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు) -
ఆ చిన్నారులకు ప్రభుత్వం బాసట
రాజమహేంద్రవరం సిటీ/కంబాలచెరువు : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతుల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వేధింపులు, ఒత్తిళ్లకు గురిచేసి.. దంపతుల ప్రాణాలను బలిగొన్న లోన్ యాప్ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. తల్లిదండ్రుల మృతితో ఏకాకులైన చిన్నారులు తేజస్వి నాగసాయి (4), లిఖిత శ్రీ (2) భవిష్యత్ దృష్ట్యా తీవ్రంగా చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. అమ్మమ్మ గార్డియన్గా చిన్నారుల పేరుతో ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో వారి జీవనం సాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకం వర్తింప చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, తదితరులు.. చిన్నారుల తాత, అమ్మమ్మ దూలం యేసు, పద్మలు ఉంటున్న ఆనంద్ నగర్లోని ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రభుత్వ సాయానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం చిన్నారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కఠిన చర్యలు తప్పవు ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా పోలీసులకు íఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు. ఇందుకు మహిళా కమిషన్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. లోన్ యాప్లను బ్యాన్ చేసే విధంగా పార్లమెంట్లో ప్రస్తావించామని, త్వరలో కఠిన చర్యలు తప్పవన్నారు. చిన్నారులు ఉన్నత చదువులు చదివేలా తాను అంండగా నిలుస్తానని ప్రకటించారు. ఐసీడీఎస్ సహకారంతో చిన్నారుల చదువుకు పూర్తి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. నిందితుల కోసం మూడు బృందాలు దంపతుల ఆత్మహత్యకు కారణమైన లోన్ యాప్ బాధ్యులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఏఎస్పీలు ఎం.రజనీ, జి.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. దుర్గారావు పలు రుణ యాప్ల ద్వారా రూ.50 వేల వరకు రుణం తీసుకున్నారని తెలిపారు. లోన్ యాప్ల వారు ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అశ్లీల ఫొటోలు, వీడియోలుగా మార్చి.. లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్ నంబర్లకు పంపిస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నారన్నారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
Gland Pharma: పవర్ లిఫ్టర్ చంద్రకళకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఏషియన్ పవర్ లిఫ్టర్ చంద్రకళకు విశాఖపట్నానికి చెందిన గ్లాండ్ ఫార్మా సంస్థ మంగళవారం రూ.2 లక్షల ఆర్థికసాయం అందించింది. విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చంద్రకళ ఇప్పటివరకు మూడు ఏషియన్ గేమ్స్లో ఏడు పతకాలు సాధించింది. జూన్లో కోయంబత్తూర్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో చాంపియన్గా నిలిచిన ఆమె డిసెంబర్లో జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు గ్లాండ్ ఫార్మా తరఫున సీనియర్ మేనేజర్ కె.గణేష్కుమార్ రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు ఆర్థికసాయం అందజేసిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ యజమాని కెప్టెన్ రఘురామ్కి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి) -
Jagananna Videshi Vidya: అర్హులందరికీ విదేశీవిద్యకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీవిద్య పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగనన్న విదేశీవిద్య పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విదేశీవిద్య పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీవిద్యను అందుబాటులోకి తెస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
అందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి..
న్యుఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమనేది సమ్మిళిత వృద్ధి సాధన దిశగా కీలక అడుగని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడగలదని పేర్కొన్నారు. ప్రజలందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నిర్మల ఈ విషయాలు తెలిపారు. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 46 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవగా, ఆ అకౌంట్లలో రూ.1.74 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆమె వివరించారు. జేఏఎం (జన ధన – ఆధార్ – మొబైల్) ద్వారా బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సత్వరం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు. -
గంజి నాగప్రసాద్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, ద్వారకాతిరుమల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని, అతడి కుటుంబాన్ని ఆ పార్టీ విడిచిపెట్టదని చెప్పడానికి గంజి నాగప్రసాద్ కుటుంబానికి అందించిన చేయూతే ఒక ఉదాహరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో మూడునెలల కిందట వైఎస్సార్సీపీ నేత గంజి నాగప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన కొవ్వూరులో జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్కు ఆయన రూ.15 లక్షల చెక్కు అందించారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్కును మిథున్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ భరత్రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మిథున్రెడ్డి, రాజీవ్కృష్ణ, జీవీ, చెలికాని రాజబాబు, ప్రతాపనేని వాసు తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వైఎస్సార్సీపీకి తాము రుణపడి ఉంటామని చెప్పారు. (క్లిక్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు) -
నాగరాజు కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేసిన వైఎస్ షర్మిల
సాక్షి, నారాయణపేట జిల్లా(గరిడేపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!)