M Venkaiah Naidu
-
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
‘భారతీయన్స్’ మూవీ ప్రెస్ మీట్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు (ఫోటోలు)
-
శ్రీ సాంస్కృతిక కళాసారథి వార్షికోత్సవం: భారత మాజీ ఉప రాష్ట్రపతికి సత్కారం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షిక విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగపూర్ పర్యటనలో ఉన్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, సంతోష్ జులూరి, ఇతర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, శశిధర్ రెడ్డి, నడికట్ల భాస్కర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి విజయోత్సవ సభలో సొసైటీ తరపున జ్ఞాపక అందజేసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి ని భావితరాలకు అందజేయడం లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ లను అభినందించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సింగపూర్ తెలుగు కళాకారుల సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీని ప్రత్యేకంగా ఆహ్వానించిన కవుటూరు రత్న కుమార్కు ప్ర త్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్గా 2018 మేలో సియాచిన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??
-
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాగును లాభసాటిగా మార్చాలి
ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. వెంకయ్య శనివారం రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–ఎన్ఏఏఆర్యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్న్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. It has been an honour raising issues relating to Andhra Pradesh's welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022 చదవండి: (అఖిలేష్కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్తో సమావేశమయ్యానని ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు. చదవండి: (కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్బై!) -
ఒక రోజు ముందే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్తో సమావేశమయ్యారు. అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్కు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్కు హాజరైన సీఎం జగన్) -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్ప్రదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
76వ వసంతంలోకి రాష్ట్రపతి: ప్రధాని మోదీ, సీఎంలు జగన్, కేసీఆర్ విషెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. చదవండి: నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని.. Birthday greetings to Rashtrapati Ji. Due to his humble personality, he has endeared himself to the entire nation. His focus on empowering the poor and marginalised sections of society is exemplary. May he lead a long and healthy life. @rashtrapatibhvn — Narendra Modi (@narendramodi) October 1, 2021 ఉప రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు రాష్ట్రపతి కోవింద్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Warm greetings to Hon'ble President Shri Ram Nath Kovind Ji on his birthday. May the Almighty bless him with a long & healthy life in the service of our nation. @rashtrapatibhvn — YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2021 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఏపీ రాజ్భవన్ ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం పొందాలని.. దేశానికి ఇంకొన్నాళ్లు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. CM Sri KCR conveyed birthday greetings to Hon'ble President Sri Ram Nath Kovind Ji on behalf of Telangana Government and its people. "May God bless Sri Ram Nath Kovind Ji with good health and long life for serving the nation for many more years", CM wished.@Rashtrapatibhvn — Telangana CMO (@TelanganaCMO) October 1, 2021 -
వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపొందాలి
శంషాబాద్ రూరల్: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష పాల్గొన్నారు. -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకర’’మన్నారు. ( జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’ ) ఎస్పీ బాలు మరణవార్త కలవరపరిచింది : కిషన్ రెడ్డి ‘‘గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త కలవరపరిచింది. 16 భారతీయ భాషలలో 40,000 పాటలను అందించిన బహుముఖ గాయకుడిని కోల్పోయాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ -
నెల్లూరు వైద్యకళాశాలకు ఎంసీఐ గుర్తింపు
సాక్షి, ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీంతో కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.ఎంసీఐ అనుమతుల గురించి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయింది. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. (భారత్ బంద్ : 20 రైతు సంఘాల మద్దతు) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చొరవతీసుకొని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. (రెండేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినా!) -
ముగిసిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు ఆమోదం అనంతరం లోక్సభను బుధవారం సాయంత్రం స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల మౌన నిరసన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్ ఫార్మర్స్’, ‘సేవ్ వర్కర్స్’, ‘సేవ్ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. ‘ఇవి భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
పెద్దల సభలో రగడ : ఉన్నతస్ధాయి భేటీలో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో జరిగిన గందరగోళంపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నివాసంలో ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విపక్ష ఎంపీల తీరుపై ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్పై 12 విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై కూడా ఈ భేటీలో చర్చించారు. రైతులకు ప్రధానమంత్రి భరోసా విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర వ్యవస్థతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేసేందుకే తామున్నామని, వారికి వీలైనంత సాయం చేసేందుకు అన్ని చర్యలూ చేపడతామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని ప్రధాని స్వాగతిస్తూ ఇది భారత వ్యవసాయ రంగ చరిత్రలో కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. కోట్లాది రైతుల సాధికారతకు ఇది ఊతమిస్తుందని అన్నారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యం : నడ్డా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా పెద్దల సభలో ప్రతిపక్షాల ప్రవర్తనను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యమని, ప్రజాస్వామ్యాన్ని వారు అపహాస్యం చేశారని మండిపడ్డారు. చదవండి : పెద్దల సభలో పెను దుమారం -
పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభను హుందాతనానికి ప్రతీకగా మలిచే క్రమంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీని మరింత బలోపేతం చేశారు. ఎంపీల ప్రవర్తనపై వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులకు అధికారాలను కట్టబెట్టారు. ఎథిక్స్ కమిటీ మరింత బాగా పనిచేసేలా పలు చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయించారు. పెద్దల సభలో ఎంపీలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాజ్యసభ సభ్యులకు 14 సూత్రాల ప్రవర్తనా నియమావళిని నిర్ధేశిస్తూ పార్లమెంటు గౌరవాన్ని భంగం కలిగించేలా ఎంపీలు వ్యవహరించరాదని నియమావళిలో పొందుపరిచారు. ప్రశ్నోత్తరాల సమయం, ఎంపీ ల్యాడ్స్ నిధులు, బ్యాంకు రుణాల ఎగవేత అంశాలపై ఎంపీలపై ఫిర్యాదులను ఎథిక్స్ కమిటీ విచారించింది. కాగా, బీజేపీ ఎంపీ శివప్రతాప్ శుక్లాను రాజ్యసభ ఎథిక్స కమిటీ చీఫ్గా ఇటీవల నియమితులయ్యారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు ఎంపీలను ఎథిక్స్ కమిటీలో రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావులు ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్ సహా 11 మందికి చేరింది. చదవండి : ఏ న్యాయానికి ఈ మూల్యం! -
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్లైన్లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. -
కరోనా కాలంలో అన్నదాతల పాత్ర అనిర్వచనీయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కష్టకాలంలో అన్నదాతలు పోషించిన పాత్ర గొప్పదని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రైతుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యరాలేదని తెలిపారు. అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఎక్కువగానే దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. శుక్రవారం ఎం.ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్,న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్స్’ సదస్సును వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతీయ అన్నదాతల శక్తిసామర్థ్యాలు, అంకితభావం, సంప్రదాయ వ్యవసాయపద్ధతులపై వారికున్న పరిజ్ఞానం అభినందనీయమని ప్రశంసించారు. వారి కృషికి రైతులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా.. రైతు బిడ్డగా ఇందుకు గర్విస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. (‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్లకు పైగానే’ ) భారతీయ సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి ఆధునిక సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు తోడైతే భారతదేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. ఆహారంలోని పోషకాహార విలువలను పొందే విధంగా ప్రాసెసింగ్ పద్ధతులపై దృష్టిపెట్టడంతోపాటు ఆహారధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా పురుషులతో పాటు మహిళలను సమానంగా ప్రోత్సహించడం గొప్పవిషయమని అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో మరింత ప్రగతి జరగాల్సిన అవసరం ఉంని..ఆకలి, పౌష్టికాహారలోపం, శిశు మరణాల రేటు తగ్గించే విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడారు. నూతన విద్యావిధానంలో.. పాఠశాలల్లో చిన్నారులకు చక్కటి పోషకాహార అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. ఎస్ స్వామినాథన్తో పాటు శ, విదేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. (మానవ తప్పిదమే; బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్ట్) -
కరోనా ఒక ‘సంస్కరణ కర్త’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై ప్రజలం తా ఆత్మశోధన చేసుకోవాలని, ఈ సమయంలో సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అం చనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్య అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా అన్నది తరచి చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కోవిడ్–19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్బుక్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘కరోనా కాలంలో జీవిత భావనలు’అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పది ప్రశ్నలను సంధించారు. ‘ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్–19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమై గత 4 నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. కరోనా మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదు, మన జీవనశైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’గా చూడాల్సిన అవసరం ఉంది’అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆతృతకు తావులేకుండా.. ఎలాంటి ఆతృతకు తావులేని జీవనవిధానానికి ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వంటి సూచనలను పొందుపరిచారు. వైపరీత్యాలకు గల కారణాలను గురించి ప్రస్తావించారు. ‘మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మనుషులు పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది’ అని అన్నారు. తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారన్నారు. ‘మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమా నత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది’అని అభిప్రాయపడ్డారు. -
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్కు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉభయసభల సెక్రెటరీ జనరల్స్ అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ ఈ సమావేశాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్ ప్రాంగణంలోని ఆయా సభల్లోనే జరిగే వీలుందని వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. అయితే, ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించాలో ఇంకా తేదీలు నిర్ణయించలేదు. వాస్తవానికి సెప్టెంబర్ 22వ తేదీలోగా ప్రారంభించాల్సి ఉంది. -
ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. -
రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 37 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. రాజ్యసభకు 55 సీట్లు ఖాళీ కాగా 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్డౌన్ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్ ఒక అడ్వైజరీలో సూచించారు. కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి సభలో తన స్థానంలో కూర్చోవాలి. అయితే, ఇందుకు కాలపరిమితి అంటూ ఏదీ లేదు. -
'దేశాభివృద్ధి నైతిక విలువలపైనే ఆధారపడి ఉంది'
సాక్షి,వరంగల్ : వరంగల్లోని ఏవివి విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం ఉత్సవాలను భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యవసాయక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసిల్లింది. 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ.. ఇంత గొప్ప విద్యాసంస్థను స్థాపించిన చందా కాంతయ్యను మనమంతా గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్కు పెద్ద బలం. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి. అయితే దీనికి కావాల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే. దేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నా' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ లక్ష్మికాంత రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని సుప్రీం బెంచ్లు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. బుధవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘విభిన్న రంగాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. కక్షిదారుల వ్యయప్రయాసలను తగ్గించేందుకు, సత్వర న్యాయం అందే దిశగా, దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల విషయంలో వేగం అవసరం. ఫిరాయింపులకు పాల్పడినవారిపై పరిమిత కాలంలో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యసభలో సభ సజావుగా జరగని సందర్భాల కంటే నిర్మాణాత్మక చర్చలను మీడియా చూపించాలి’ అని పేర్కొన్నారు. -
ఆలోచనలో మార్పు రావాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో జరిగిన దిశ అత్యాచార ఘటనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలి. శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదు. పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది. ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు. దోషులను బహిరంగంగా శిక్షించాలి జయాబచ్చన్, ఎంపీ దిశ అత్యాచారం, హత్య లాంటి ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నా. రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులను దేశం ముందు తలదించుకునేలా చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల ఓ అత్యాచార ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. అప్పీల్కు వెళ్లిన దోషులు జీవితఖైదు పొందారని, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. హత్యాచార ఘటన జరిగిన 15–20 రోజుల్లోనే విచారించి దోషులను శిక్షించాలని ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి సూచించారు. టీఎంసీ ఎంపీ డా.సంతను సేన్, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్, అన్నాడీఎంకే ఎంపీ విజలా సత్యనాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్కుమార్ ఝా, డీఎంకే ఎంపీ పి. విల్సన్, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడారు. ఏకతాటిపైకి రావాలి గులాం నబీ ఆజాద్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు యావత్ దేశం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అత్యాచారం, హత్య ఘటనల నిరోధానికి చట్టాలు చేసినా, వాటి ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. మహిళలపై ఇలాంటి దాడులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కోరుకోరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్!
సాక్షి, చెన్నై: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని, ఈ నిర్ణయం అమలు, దీని ప్రభావం విషయాల్లో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు జీవితంలో ఎంత ఎత్తకు ఎదిగినా.. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎక్కడిని వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం తనకు అలవాటని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానంపై ‘లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్’ పేరుతో వెంకయ్య పుస్తకం రాశారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డెమోక్రసి గుండెల్లో 370 బుల్లెట్!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడం వల్ల జరగబోయే పరిణామాలు, పర్యవసనాలేమిటీ? లాభ నష్టాలేమిటీ? అన్న అంశాలతోగానీ, ప్రభుత్వ ఎజెండాతోగానీ తమకు సంబంధం లేదని, అయితే ఇందుకోసం అనుసరించిన ప్రక్రియనే ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉందని పలువురు ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. అటు కశ్మీర్ ప్రజల అభిప్రాయాలనుగానీ ఇటు మిగతా భారతీయుల అభిప్రాయంగానీ తెలుసుకోకుండా వ్యవహరించిన విధానం ముమ్మాటికి ప్రజాస్వామ్య విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ‘కేంద్ర బలగాలకు చెందిన 35 వేల మంది సైనికుల నిఘా మధ్య కశ్మీర్ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి, వారి సెల్యులార్, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్ ఫోన్లను కట్ చేసి, ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసి, వారి నాయకులను గృహంలో నిర్బంధించడం ద్వారా ఆర్టికల్ 370 రద్దు బిల్లును తీసుకురావడం ఏమిటీ? కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోకుండా, కేవలం రాష్ట్ర గవర్నర్ ఆమోదాన్ని తీసుకోవడం ఏమిటీ? ప్రజల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఏర్పాటయ్యే అసెంబ్లీ లేనప్పుడు, ప్రజల అభిప్రాయానికి ఎన్నికలతో సంబంధం లేని గవర్నర్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభలోనూ అంతే... ‘కొత్త చట్టానికి సంబంధించిన ఏ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టినా రెండు రోజుల ముందు సభ్యులకు నోటీసు ఇచ్చి ఆ బిల్లు ప్రతి సభ్యులకు అందజేయడం సభ సంప్రదాయం. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అంతకు వారం ముందునుంచే ప్రజలకు అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. సభా సంప్రదాయాలకు, ఆనవాయితీలకు తాను కట్టుబడి ఉంటానని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తొలినాళ్లలో పలుసార్లు చెప్పారు. మరి అలాంటిదేమీ లేకుండా అనూహ్యంగా బిల్లును సభలో ప్రవేశపెట్టడం, మొక్కుబడిగా చర్చకు అవకాశం ఇచ్చి, త్వరితగతిన బిల్లును ఆమోదించేసుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడవడం కాదా?’ -
రిపీట్ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్!
న్యూఢిల్లీ : పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్ కుమార్ బలయాన్పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘ మంత్రి గారు.. మొన్నటి ఎజెండాలో మీ పేరు ఉంది. కానీ మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి’ అని బలయాన్తో వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన మంత్రి గైర్హాజరీ పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు. -
‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయుక్తంగా కుల, మతాలకు అతీతంగా అంతిమ సంస్కారాన్ని కేవలం రూపాయి ఖర్చుతో ముగించేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) తీసుకున్న నిర్ణయానికి జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తున్నా యి. ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి బంధువులు శ్మశానవాటికలో రూపాయి చెల్లించి రసీదు తీసుకుంటే అంతిమ సంస్కారానికి అవసరమైన సామగ్రిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఆఖిరి సఫర్ ముగిసిన తరువాత 50 మంది బంధువులకు రూ.5కే భోజన ఏర్పా ట్లు కూడా కార్పొరేషనే చేయనుంది. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం ప్రకటించిన ఈ పథకం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును ఆకర్షించింది. ఈ పథకం కోసం రూ.1.5 కోట్లు కేటాయించినందుకు మేయర్ రవీందర్సింగ్ను ట్విట్టర్ ద్వారా అభినందించారు. 50 మంది కుటుంబసభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ పథకంపై స్పందిస్తూ కరీంనగర్ మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ఇది తమ ఆప్తులకు అంతిమ సంస్కారాలు చేసే పేదలకు ఎంతో ఉపశమనమని పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్తో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వేగంగా స్పందించారు. తక్షణమే మున్సిపాలిటీల్లో కరీంనగర్ తరహాలో ‘అంతిమ సంస్కారం’ పథకం అమలుకు ప్రయత్నించనున్నట్లు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎగ్జిట్ పోల్సే.. ఎగ్జాట్ పోల్స్ కాదు
సాక్షి, గుంటూరు : ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 1999 నుంచి వస్తోన్న ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయన్నారు. శాంతి విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడైన ఆయనకు ఆదివారం గుంటూరులోని క్లబ్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 42 ఏళ్ల తర్వాత తొలిసారి తాను లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ఎగ్జిట్ పోల్స్ హడావుడి సహజమే అన్నారు. అయితే వీటికి ఎలాంటి బేస్ ఉండదని.. ఎగ్జాట్ పోల్స్ కోసం చూడాలని వెంకయ్య హితవు పలికారు. మే 23 న అసలైన ఫలితాలు వచ్చేవరకు గెలుపు పట్ల అన్ని పార్టీలు నమ్మకంగానే ఉంటాయన్నారు వెంకయ్య నాయుడు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అన్నింటికన్నా ప్రధానమన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంటే.. ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాక నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన సూచించారు. క్యారెక్టర్.. క్యాండిడేట్.. క్యాలిబర్.. కెపాసిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేయాలి. కానీ ప్రస్తుత రాజకీయల్లో క్యాష్, క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని వెంకయ్యా నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు పెడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవహేళన చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉచిత విద్యుత్ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు. అభివృద్ధికి విద్యుత్ అవసరం దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్.. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
సాక్షి, తిరుపతి : భారతీయ విద్యాభవన్ 29వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... నేటి విద్యార్థులు రేపటి తరానికి భవిష్యత్తని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే భారతీయ విద్యాభవన్ ఎంతో గొప్పదని కీర్తించారు. ఉన్నతమైన సంకల్పంతో కె.ఎన్. మున్షీ భారతీయ విద్యాభవన్ను స్థాపించారని తెలిపారు. భారతీయ విద్యాభవన్కు టీటీడీ సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్చుకోవాలని సూచించారు. స్వశక్తితో సొంతకాళ్లపై ప్రతి ఒక్కరూ నిలబడాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు. విద్యావిధానంలో మార్పుకోసం విద్యావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
హ్యాపీ బర్త్డే మోదీజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయనకు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రత్యర్థులతో పాటు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు ట్విటర్లో ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేడుకల్ని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు. ‘ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుస్సుతో, మరెంతో కాలం దేశ ప్రజల సేవకు ఆయన అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కోవింద్ ట్వీట్ చేశారు. మాల్టా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తన సందేశంలో రాహుల్ పేర్కొన్నారు. కొద్దిసేపు టీచర్ అవతారమెత్తిన మోదీ 68వ పుట్టినరోజు వేడుకల్ని తన లోక్సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ జరుపుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ దాదాపు 30 నిమిషాల పాటు పూజలు నిర్వహించారు. డెరెకా ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూలు పిల్లలతో ముచ్చటించారు. టీచర్ అవతారమెత్తి వాళ్లకు పలు అంశాల్ని బోధించారు. ప్రశ్నించేందుకు విద్యార్థులు ఎన్నడూ భయపడవద్దని.. నేర్చుకోవడంలో అదే కీలకమని వారికి చెప్పారు. ‘విశ్వకర్మ జయంతి రోజున నేను మీ పాఠశాలకు వచ్చాను. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ శుభాకాంక్షలు’ అని ప్రధాని పేర్కొన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో 568 కిలోల లడ్డూను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు ఢిల్లీలో ఆవిష్కరించారు. షికాగోలో 13,000 ఎత్తులో విమానం నుంచి దూకి మోదీకి శుభాకాంక్షలు చెబుతున్న స్కైడైవర్ శీతల్ మహాజన్ -
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి
కృష్ణాజిల్లా , గన్నవరం: దేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు వంటివని, అటువంటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న గ్రామీణ ప్రజలంతా పట్టణాలకు వలస వెళ్తుండడం వల్ల భవిష్యత్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని అదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో స్నేహభావంతో పాటు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. దేశ జనాభాలో 35 శాతం మంది ఉన్న యువతను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతోనే స్వర్ణభారత్ ట్రస్ట్ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రైవేట్ సంస్థల సాయంతో నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శిక్షణ, వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో ట్రస్టును స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు, యువత, రైతుల ప్రాధాన్యతను గుర్తించి వారిలోని నైపుణ్యాభివృద్ధికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రముఖ సినీనటుడు వెంకటేష్ మాట్లాడుతూ కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి ట్రస్ట్లో సేవాలందించాలని ఉందన్నారు. అనంతరం ఒమేగా హస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్, సీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు మహాసభలు ఆరంభ వేడుకలు
-
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
-
ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
విజయవాడ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు స్వరాష్ట్రానికి వచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వచ్చిన వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసిహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. -
ఉపరాష్ట్రపతిగా నేడు వెంకయ్య ప్రమాణం
-
ఆ పాపం బడాబాబులదే: వెంకయ్య
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిల పెరిగిపోవడానికి కారణం సంపన్న కార్పొరేట్లే తప్ప పేదలు కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తీసుకున్న రుణాల చెల్లింపులో పేదల ట్రాక్ రికార్డు చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల వారిపై బ్యాంకులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇది మరింతగా మారాలి. అల్లయ్యలు.. మల్లయ్యలకే (మాల్యాలు) కాదు.. ఊళ్లల్లో .. చిన్న చిన్న పట్టణాల్లో ఉండే పుల్లయ్యలకు కూడా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పేదల వల్ల రాలేదు.. దీనికి కారణం చాలా చాలా పెద్దోళ్లే. స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు 98–99 శాతం దాకా కట్టేస్తూనే ఉన్నారు‘ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ చట్టం రెరా అమలుకు అవసరమయ్యే యంత్రాంగాన్ని జూలై 30 నాటికల్లా సిద్ధం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్లు నేషననల్ హౌసింగ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. -
త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నాం..
టీనగర్: కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉందని, అదే సమయంలో హిందీ నేర్చుకోమని ఎవరినీ బలవంతపెట్టమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మాతృభాష, ఆంగ్లంతోపాటు హిందీ నేర్చుకుంటే మంచిదని అన్నారు. తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ను త్వరలో నియమిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. చెన్నైలో ఆదివారం రామానుజర్ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా సమతా పాదయాత్ర , తమిళనాడు చలనచిత్ర వాణిజ్యమండలి, నిర్మాతల కౌన్సిల్, శ్రీరామచంద్ర యూనివర్సిటీలో 25వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య చికిత్సలందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే 24 గంటలపాటు ప్రజలు వైద్యులతో అందుబాటులో ఉండేందుకు నేషనల్ హెల్ప్లైన్ ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. వర్సిటీ స్నాతకోత్సవంలో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ బహూకరించారు. ఎంబీబీఎస్లో ఆల్రౌండ్ మెరిట్ సాధించిన డాక్టర్ ఉమా రవిశంకర్కు ఐదు గోల్డ్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్సలర్ వీఆర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
2 లక్షల ఇళ్లకు రేపే ముహుర్తం
అందరికీ ఇళ్లు అనే పథకం కింద రెండు లక్షల అందుబాటులోని గృహాలు రేపు లాంచ్ కాబోతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో క్రెడాయ్ నిర్వహిస్తున్న అందుబాటులోని గృహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేపట్టబోతున్నారు. అందరికీ అందుబాటులో గృహాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తమ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ డెవలపర్లు, వారి అసోసియేషన్లతో కలిసి ఈ పథకాన్ని చేపడుతోంది. అందుబాటులో గృహాలను ప్రమోట్ చేయడానికి కేంద్రప్రభుత్వం వివిధ రకాల చర్యలను కూడా చేపడుతోంది. బడ్జెట్ లో చౌక గృహాల నిర్మాణానికి మౌలిక హోదా కూడా కల్పించింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళుతుండటంతో, కనీసం చౌక గృహ నిర్మాణం వరకైనా మౌలిక హోదా ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు కోరడంతో బడ్జెట్ లో దీన్ని ప్రకటించింది. కాగ, అందుబాటులోని గృహాల గరిష్ట సైజు 643 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 900 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు సమానంగా ఉంటుంది. సిటీలు, ప్రాంతాల ఆధారంగా ఈ ప్రాజెక్టుల ధర రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షలుగా ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలను కొనుగోలుదారులకు చేరేలా కృషిచేస్తామని క్రెడాయ్ పేర్కొంది. -
వెంకయ్య కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మత ఛాందసవాదశక్తులతో చేతులు కలపబోమని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ మేన్ ఎంటర్ ప్రైజెస్ గా మారిందని దుయ్యబట్టారు. బీసీల కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు సంబంధించి త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు పెడతామని వెల్లడించారు. బీఎస్పీ, ఎంఐఎం, సమాజ్ వాదీ పార్టీలో యూపీఏలో భాగమన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించారు. అమాయకులకు శిక్ష పడరాదని, సత్యం బాబు కేసు విషయంలో పునః విచారణ చేపట్టాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. -
‘ఐదుసార్లు గెలవడం చిన్న విషయం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాము ఎంపిక చేసిన యోగి ఆదిత్యనాథ్ సచ్ఛీలుడని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనను ఎవరూ వేలెత్తి చూపించలేరని పేర్కొన్నారు. ఒకే నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందడడం మామూలు విషయం కాదన్నారు. గోరఖ్పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ ఐదు పర్యాయాలు గెలిచిన సంగతి తెలిసిందే. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం సరైందేనని వెంకయ్యనాయుడు అన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బహిరంగంగా తనను ఆదిత్యనాథ్ కోరారని వెల్లడించారు. మీరు ముగ్గురు మంచి కాంబినేషన్ అవుతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
వర్గీకరణ చేసి తీరుతాం : వెంకయ్య
-
వర్గీకరణ చేసి తీరుతాం
అప్పుడే మాదిగ కులాలకు న్యాయం ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం సాక్షి, హైదరాబాద్ ‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు. నోట్ల సమస్య పెద్దగా లేదు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ప్రతి అంశాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పెద్దనోట్లను రద్దు చేశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సమస్య పెద్దగా లేదని, సమస్య ఉంటే ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేవారే కారన్నారు. దేశ ప్రజల ఆశలు త్వరలో ఫలిస్తాయని... ఒకేసారి వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పాసయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాదిగ కులాలు చేస్తున్న వర్గీకరణ ఉద్యమం న్యాయమైందని, ఈ అంశంపై ప్రధానికి వివరిస్తానన్నారు. కేంద్ర సర్వీసుల్లో మాదిగ కులాలకు అన్యాయం జరుగుతోందని కొందరు తనను ప్రశ్నించారని, వర్గీకరణ అమలైతే ఈ సమస్య ఉండదని చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైంది: సురవరం ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీంతో మాదిగ ఉపకులాల్లో మూడు తరాలకు పైగా నష్టపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు మద్దతిస్తాయని ఆయన తెలిపారు. దళితులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. వర్గీకరణకు మాల కులాలు మద్దతుగా నిలవాలని, దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటే ఇతర వర్గాలు లాభపడతాయని, దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్కు నాపై కోపం వచ్చినట్టుంది..: మందకృష్ణ ‘‘ఈ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించేందుకు పలుమార్లు ప్రయత్నించా. ఈ రోజు మధ్యాహ్నం కూడా ట్రై చేశా. కానీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో చాలా ప్రయత్నం చేశా. కానీ వీలు చిక్కలేదు. నాపై ఎందుకు ఇంతటి కోపాన్ని పెంచుకున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణకు దళితుడ్ని సీఎంగా చేస్తానని ఆయన అన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడిగా. అందుకు ఆయనకు నాపై కోపం వచ్చినట్లుంది. కోపముంటే నాపై చూపాలి. కానీ మా మాదిగ కులాల ఆశయాలపై రుద్దొద్దు..’అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఢిల్లీలో ఓ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశా. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చూశా. కానీ నాకు ఎవరి వద్ద బానిసత్వం చేయాల్సిన పనిలేదు. వర్గీకరణ కోసం గత 22 ఏళ్లుగా వెంకయ్యనాయుడు నాకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపించారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల అధ్యక్షులతో మద్దతుగా లేఖలు ఇప్పించారు. నా మాదిగ కులాల ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా’’అని పేర్కొన్నారు. వెంకయ్య తనకు పెద్దన్న లాంటివారని, ఆయనకు పాదాభివందనం చేస్తే తప్పులేదని అన్నారు. సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభ పక్షనేత జానారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్రెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, ఆనంద్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారు. -
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
-
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
న్యూఢిల్లీ: హిందీ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ ఇండియాపై ఒకరోజు నిషేధం విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ చానెల్పై నిషేధం విధించినట్టు పేర్కొంది. ‘ దేశ భద్రత, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ చానెల్ను ఒకరోజు ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేశారంటూ.. అందుకు శిక్షగా వచ్చే బుధవారం ఒకరోజుపాటు ప్రసారాలు నిలిపివేయాలని ఎన్టీటీవీని కేంద్రం ఆదేశించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో దేశభద్రతను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇదివరకే ఉన్న నియమనిబంధనలు, సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ, ఇది కొత్తగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్య కాదని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో రాజకీయ ప్రేరణతోనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీటీవీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఎమర్జెన్సీ తర్వాత మీడియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని ఎన్డీటీవీ యాజమాన్యం నిరసన తెలిపింది. -
వెంకయ్య నాలుకకు నరం లేదా?: నారాయణ
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ హర్షం వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుల్లో ఆదివారం సీపీఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రను జాతీయ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్దాల కోరు అని, ఆయనకు తనను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానన్న వెంకయ్య నాలుకకు నరం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆశలు, భ్రమలు కల్పించి మోసం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. -
హోదా ఇచ్చే అవకాశం లేదు: వెంకయ్య
-
హోదా ఇచ్చే అవకాశం లేదు: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని ఆయన అంగీకరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చలేదని తెలిపారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పారు. విభజనతో జరిగిన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని సరిదిద్దాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రత్యేక హోదాతో ప్రతి ఊరు ఆరు నెలల్లో హైదరాబాద్ అయిపోతుందని చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. ప్రత్యేక హోదాతో ఏవైతే ప్రయోజనాలు కలుగుతాయే వాటిని ఏపీకి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నూటికి నూరుశాతం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని హామీయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటివరకు మంజూరు చేసిన సంస్థలు, ఆర్థిక ప్రయోజనాలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మరోసారి ఉటంకించారు. -
‘స్మార్ట్ గంగా సిటీ’ షురూ
న్యూఢిల్లీ: ‘స్మార్ట్ గంగా సిటీ’ కార్యక్రమాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు, ఉజ్జయిని నుంచి జల వనరుల మంత్రి ఉమాభారతి ప్రారంభించారు. గంగానదీ పరీవాహక ప్రాంతాల్లోని పది నగరాలలో ఈ కార్యక్రమాన్ని తొలి విడతలో ప్రారంభించారు. మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలుచేయనున్నారు. తొలి విడతకు హరిద్వార్, రిషికేష్, మథుర, వారణాసి, కాన్పూర్, అలహాబాద్, లక్నో, పట్నా, షాహీబ్గంజ్, బారక్పూర్ను ఎంపిక చేశారు. ఈ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం 40 శాతం మూలధన నిధులు ఇవ్వనుంది. మిగతా 60 శాతం నిధులను 20 సంవత్సరాల్లో విడతల వారిగా ఇవ్వనున్నారు. గతంలో 70 శాతం మాత్రమే కేంద్రం భరించేదని ఇప్పుడు కేంద్రమే 100 శాతం నిధులను ఇస్తుందని ఉమ చెప్పారు. -
భావోద్వేగానికి గురైన మంద కృష్ణ
న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేసిన మంద కృష్ణ ధర్నాలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలోని ఆటుపోట్లను, కుట్రలను ఆయన వివరించారు. ‘తినడానికి తిండిలేని జాతి. ప్రయాణానికి ఖర్చులు లేని జాతి. ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని బాధలు భరిస్తే ఈరోజు ఢిల్లీకి వేలాదిగా తరలిరాగలిగిందో అర్థం చేసుకోవాలి. మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే.. మీరు వర్గీకరణకు సహకరించి మాకు మరో అంబేడ్కర్గా నిలవాలి..’ అంటూ వెంకయ్య నాయుడికి విన్నవించారు. వర్గీకరణపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తా: వెంకయ్య షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన మంత్రికి వివరించినట్టు తెలిపారు. ‘మీ కోరిక అసాధారణమైనది కాదు. అన్యాయమైనదీ కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాల్సిందే. వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలతో ఈ అంశం మాట్లాడాను. అందరూ ఈ డిమాండ్ సహేతుకమని అన్నారు. వర్గీకరణపై అధ్యయనం జరుగుతోంది. ఒకసారి అడుగు ముందుకు పడితే మళ్లీ వెనక్కి రావడం ఉండదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. దళితులపై దాడులు, ఇతర సమస్యలను రాజకీయ కోణంలో చూడకండి. ఇది సామాజిక రుగ్మత. కులాలను ఓటు బ్యాంకుగా చూడరాదు. సమాజంలో వెనకబడి, ఆఖరి వరుసలో ఉన్న వారిని ముందు పైకి తేవాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను. ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో చర్చిస్తున్నాం. రాజకీయాలకతీతంగా వర్గీకరణ జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లోని 59 కులాలకు మేలు జరుగుతుందని, దీన్ని గ్రహించి మాలలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. మావంతు ప్రయత్నం చేస్తాం... కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై ప్రధానితో మాట్లాడుతాను. యూపీఏ హయాంలో వర్గీకరణకు అనుకూలంగా ఉషామెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చినా వర్గీకరించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ గడ్డపై ఎవరూ సాహసించని, ఎవరూ చేయని దీక్షలు ఎమ్మార్పీఎస్ చేయగలిగింది.. ఈ దీక్షలు ఫలితాన్ని ఇస్తాయి..’ అని పేర్కొన్నారు. మాదిగలకు మంద కృష్ణ మాదిగ దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. వర్గీకరణ చేస్తే బీజేపీ వెంట నిలబడతామని హర్యానా వర్గీకరణ ఉద్యమ నేత స్వదేశ్ కబీర్ పేర్కొన్నారు. వర్గీకరణతోనే మాదిగలకు స్వాతంత్య్రం లభిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ మహాధర్నాకు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాటి సత్యం సభాధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, నేతలు మందకుమార్, నాగయ్య, బ్రహ్మయ్య, బి.ఎన్.రమేశ్, కోళ్ల వెంకటేశ్, తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది మనువాదుల కుట్ర: చెన్నయ్య
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలను వర్గీకరించేందుకు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, మనువాదులు కుట్ర పన్నారని మాల మహానాడు-టీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. దళితులపై బీజేపీ హయాంలోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడి జంతర్మంతర్లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద కుట్రలతో, విభజించు-పాలించు అన్న సూత్రంతో లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు. వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆ దిశగా కేంద్ర మంత్రులు ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆధిపత్య కులాల ఆధీనంలో రాజకీయ అధికారం ఉన్నంత కాలం పీడిత వర్గాలకు న్యాయం జరగదని చరిత్ర నిరూపించిందని ఆందోళన వ్యక్తంచేశారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో దళితులపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. -
ప్రత్యేక హోదా సర్వరోగ నివారిణి కాదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, అయినంతమాత్రాన అది సర్వరోగ నివారిణి కాదు, సంజీవని అంతకంటే కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారతి ట్రస్టులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో ప్రత్యేక హోదా అంశంపై ఆచితూచి మాట్లాడారు. ఈ విషయంలో తనపై వచ్చే విమర్శలకు జవాబు చెప్పబోనని అంటూనే ప్రస్తుతం జరుగుతున్న చర్చకు వివరణ ఇచ్చారు. ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో సందిగ్ధత నెలకొని ప్రత్యేకహోదా సమస్య తలెత్తిందన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేవలం హోదా వల్లే అంతా జరిగిపోతుందని భావించకూడదన్నారు. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని, రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను మంజూరుచేసిందని చెప్పారు. విభజనతోపాటే హోదా కూడా చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా సమస్య తలెత్తి ఉందేది కాదని చెప్పారు.దేశమంతటా ఒకే విధంగా పన్నుల విధానాన్ని అమలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నానన్నారు. తిరంగా యాత్ర భావితరాలకు దేశభ క్తిని ప్రబోధించేందుకు, స్వాతంత్య్రోద్యమ చారిత్రక ఘాట్టాలను గుర్తు చేస్తూ ఆగస్టు 15 నుంచి తిరంగాయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు వెంకయ్య చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన ప్రదేశం నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. మీడియా సమావే శంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వెంకయ్యకు ఎయిర్ ఇండియా క్షమాపణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) క్షమాపణ చెప్పింది. ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆలస్యం కావడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఆయన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. ఎయిర్ ఇండియా నిర్వాకంతో ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని ట్విటర్ ద్వారా వెంకయ్య వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేసింది. పైలట్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్ పోర్టుకు రాలేకపోయాడని ఏఐ అధికార ప్రతినిధి తెలిపారు. 'గుర్గావ్, సెక్టార్ 21లో నివసిస్తున్న పైలట్ ను తీసుకురావడానికి ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 9.45 గంటలకు కారు పంపించాం. ట్రాఫిక్ చిక్కుపోవడంతో మరో కారు చూసుకోవాలని పైలట్ కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో వాహనంలో ఎయిర్ పోర్ట్ కు బయలు దేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ జామ్ కారణంగానే పైలట్ ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడ'ని ఏఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
బాబు, వెంకయ్యల నైతిక ఓటమి : కత్తి పద్మారావు
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడకపోవడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదని, ఈ విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైతికంగా ఓటమి చెందారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు నేడు కేంద్రంలో కీలక పాత్రలో ఉండి మొండిచెయ్యి చూపించడం ఆశ్యర్యానికి గురిచేస్తుందన్నారు. తెలుగుజాతిని ఐక్యం చేసి అఖిలపక్షంలో పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వామపక్ష సభ్యులందరూ తెలుగువారే అయినప్పటికీ, వారందర్నీ కలుపుకొని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎందుకు యుద్ధంచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో వామపక్షాలతో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడెందుకు వారితో కలిసి వెళ్లరని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడంతో అపకీర్తిపాలైన చంద్రబాబు ప్రత్యేకహోదా రాకపోవడంతో చరిత్రహీనుడయ్యే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రాంతీయ, కుల, మతాలను రెచ్చగొడుతుందని, అందులోభాగమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమన్నారు. ఇందులో మొదటి ముద్దాయి వెంకయ్యనాయుడు కాగా, రెండవ ముద్దాయి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరిగా ఇవ్వాలని, అన్ని రాజకీర పార్టీలు ఈ డిమాండ్ను కొనసాగించాలని పద్మారావు సూచించారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ
హైదరాబాద్: కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ, శాసనసభ కార్యదర్శులతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై చర్చించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో 225, తెలంగాణలో 153 వరకు శాసన సభ స్ధానాలను పెంచే విషయంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా చర్చించి నట్టు వెంకయ్య తెలిపారు. తెలంగాణ నుంచి స్థానాల పెంపుపై కరీంనగర్ ఎంపీ వినోద్ సోమవారం తనతో సమావేశమైనట్టు వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు అవసరం లేదంటే విభజన చట్టంలోని సెక్షన్ 26 లో సీట్ల పెంపుపై పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని హోంశాఖకు నివేదిస్తుందన్నారు. సవరణ బిల్లును హోంశాఖ పార్లమెంట్ ముందకు తీసుకొస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
కాంగ్రెస్ మొండివైఖరిపై ఎన్డీఏ ప్రచారం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభను స్తంభింపజేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీరుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మోదీ సర్కారు భావిస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం పంజాబ్, జమ్మూకశ్మీర్ ఎంపీలతో సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ మొండివైఖరిపై ప్రచారం నిర్వహించాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలను వెంకయ్య కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున కీలక బిల్లులు పాసవకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని, ప్రధాన విపక్షం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిపాయి. -
'ప్రత్యేక హోదా కావాలని నేనూ కోరుకుంటున్నా'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని శుక్రవారం లోక్ సభలో చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని వెల్లడించారు. దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిల్లో పెట్టుకుని రాష్ట్రాలు వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నందునే ప్రత్యేక హోదా అడుగుతున్నామని వివరించారు. -
'ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్నారు'
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అంబేడ్కర్ అస్పృశ్యత, అసమానతలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని ఉద్బోధించారని గుర్తు చేశారు. సామాజికంగా, నైతికంగా ప్రజలు ఎదగాలని ఆయన కోరుకున్నారన్నారు. మనుషులంతా సత్ప్రవర్తనతో మెలగాలని, విద్యతోనే అది అలవడుతుందని రాజ్యాంగ నిర్మాత భావించారని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేడ్కర్ గట్టిగా ఆకాంక్షించారని అన్నారు. -
వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షిద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో చర్చలు పునరుద్ధరిస్తే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాలని అయ్యర్ అన్నారు. వీరి వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ వ్యాఖ్యలను ఖండించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. -
పటేల్కు న్యాయం జరగలేదు
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్కు చరిత్రలో న్యాయం జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశ సమైక్యతకు, సంస్థానాల విలీనానికి, స్వాతంత్య్రానంతరం దేశంలో శాంతి నెలకొల్పేందుకు పటేల్ చేసిన కృషిని నేడు దేశం స్మరించుకుంటోంది. దేశ తొలి ప్రధానిగా పటేల్ అయి ఉంటే దేశ ప్రగతి వేరేలా ఉండేదని దేశ ప్రజల భావన. పటేల్ పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం. చరిత్రలో చాలా మంది నాయకులకు తగిన గుర్తింపు లభించలేదు. దేశం కోసం కృషిచేసిన నాయకులను దేశానికి ప్రస్తుతం తెలియపరుస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. ఆయన జాతీయ నాయకుడు. పటేల్ జయంతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..’ అని పేర్కొన్నారు. -
శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కార ం
టీనగర్: శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కె.వెంకయ్య నాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం అంటూ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు శనివారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల సమస్యలో శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దీనికి సంబంధించి ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. అక్కడ శాశ్వత పరిష్కారం లభించాలంటే రాజీవ్-జయవర్దనే ఒప్పందం ప్రకారం 13వ చట్ట సవరణను శ్రీలంకలో పూర్తిగా అమలు జరపాలన్నారు. అలా జరిగిన పక్షంలో అక్కడి తమిళులు సమాన హక్కులు, హోదాతో జీవించే ఆస్కారం ఉంటుందన్నారు. అం దువల్ల 13వ చట్ట సవరణను ఖచ్చితంగా అమలు జరపాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. భారత జాలర్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి అంతర్జాతీయ విచారణ జరపాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి ప్రస్తుతం చెప్పలేమని, తగిన సమయంలో మోడీ సరైన నిర్ణయాన్ని తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ మొసలి కన్నీరు: రైతు సంక్షేమం పేరిట కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇటీవలి ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైందని, విదేశీ పారిశ్రామికవేత్తలు పలువురు దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. దీంతో దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అదే విధంగా అనేక మంది స్వదేశీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు జరుపుతోందన్నారు. వారి పరిశ్రమల స్థాపనకు విస్తారమైన స్థలాలు కావాలని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆసక్తితో ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆంధ్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో వ్యవ సాయ భూములను ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్నారన్నారు. అటువంటి కాంగ్రెస్ నే డు రైతుల కోసం మొసలికన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని, సేతు సముద్ర పథకాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. -
సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పరిశ్రమలకు రాయతీ తదితర అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను వెల్లడిస్తామన్నారు. -
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
-
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను. కానీ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మాట్లాడుతున్నా. నేను రాష్ట్రానికి వస్తే ఓ ప్రాజెక్టు వస్తుంది. నేను రాకపోతే ఏమిరాదో వారికే తెలుసు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంకురార్పణ చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగా కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ‘దయచేసి నినాదాలివ్వొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ సందర్భంలోనే పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము పదవిలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామనీ, అయినప్పటికీ ఇంకా ఏదో చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్ర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను తీసుకొస్తామని చెప్పారు.అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉందని, తుది నిర్ణయం కోసం అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. మోదీ మెడలు వంచుతారా.. అదేం భాష.. అన్నిదేశాల అధిపతులు, ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే.. మోదీ మెడలు వంచుతామంటూ ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విశ్వగురు చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ‘టూరిస్ట్ మోదీ’ అని ఆక్షేపిస్తున్నారని విమర్శించారు. ప్రధానంటే నూతిలో కప్పలా ఒకేచోట కూర్చుని అరుస్తుండాలా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే వారసత్వం కాదనీ, జవసత్వాలు కావాలని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ హబ్గా ఏపీ: చంద్రబాబు యువత భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలో విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపు మహిళలకు అప్పగిస్తామని చెప్పారు. వచ్చే పంద్రాగస్టుకల్లా ప్రతి స్కూల్లో టాయిలెట్లు: స్మృతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లను మంజూరు చేసిందని, తాడేపల్లిగూడెంలోని నిట్కు రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే పంద్రాగస్టు నాటికి దేశంలోని ప్రతి స్కూల్లోనూ మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చొరవ తీసుకుని 100 శాతం విజయం సాధించాలని కోరారు. -
ఊసులన్నీ చెబుతాడు... కానీ
ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు వారికే కాదు దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దేశప్రజలకు పరిచయం అక్కర లేకుండానే తెలిసిన పేరు. ఇంకా చెప్పాలంటే 'కమల దళపతుల్లో' తలలో నాలుక. వాజ్పేయి... నరేంద్ర మోదీ... ఇలా ఎవరు ప్రధానిగా ఉన్నా వెంకయ్య మాత్రం ఆయా ప్రభుత్వాల్లో వాషింగ్ పౌడర్ 'వీల్ చక్రం' కంటే స్పీడ్గా తన హవాను కొనసాగిస్తారు. దాంతో వెంకయ్యే కమలనాధులకే నాధుడుగా మారిపోయారని ఆ పార్టీలోని వర్గాలు సీరియస్గా చెప్పుకుంటారు. అయితే వెంకయ్య ఎక్కడ ఏ సభలో అయినా... వేదిక ఎక్కి ఏ అంశంపై ప్రసంగం మొదలు పెట్టినా... అక్కడ ఆసీనులైన పెద్దలే కాదు.... సభకు వచ్చిన చిన్న చితక మొత్తం ఆయన ఊదే 'నాద స్వరం' కి తలకాయలు తాటికాయల్లా ఊపాల్సిందే. అంతటి వాక్ పటిమ గల మాటల ఘనాపాటి వెంకయ్య. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్ని దేశాలు తిరిగారు.... ఆయా దేశాల నుంచి భారత్కు ఎలా లబ్ది చేకూరుతోంది.... సదరు దేశాలు మన దేశంలో ఎన్ని కోట్ల రూపాయిల్లో పెట్టుబడులు పెడుతున్నాయో అంకెలతో సహా వివరించ గల సత్తా ఉన్న నేత. మోదీ వాక్ ప్రవాహంలో పడి భారత ప్రజలు ఆయన్ని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. వెంకయ్య వాగ్ధాటికి ముగ్దుడైన మోదీ మాత్రం ఆయనకి అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఏరి కోరి కట్టబెట్టారు. ఈ విషయం అందరికి తెలిసందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య ..రైల్వే జోన్... ఏపీ ఎక్స్ప్రెస్ రైలు వేగం పెంపు.... అవీ ఇవీ అన్నీ తెస్తామని ఊసులు చెప్పారు. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేదు. అయితే పార్లమెంట్లో విభజన బిల్లు చర్చ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ అయిదేళ్లంటే...కాదు కాదు పదేళ్లంటూ చెప్పిన నాటి ప్రతిపక్షంలోని వెంకయ్య...అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్ని సెటైర్లు వేసిన కూడా ప్రత్యేక హోదా అంశంపై మాత్రం వెంకయ్య ఏమీ స్పందించకుండా ...ఒకటో క్లాస్ పిల్లోడులా నోటి మీద వ్రేలు వేసుకోకుండా వైట్ అండ్ వైట్ డ్రస్లో గుడ్ బాయిలా కనిపిస్తుంటారు. అయినా ప్రత్యేక హోదా తన సొంత రాష్ట్రానికి తీసుకురావాలంటే వెంకయ్య తలుచుకుంటే ఎంత పని... కానీ ఆయన తలుచుకోవడమే లేదు. అంతే. -
రైల్వే ఫ్లైఓవర్ని ప్రారంభించిన వెంకయ్యనాయుడు
నెల్లూరు: దేశంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం నెల్లూరు జిల్లా మనుబోలులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, శిద్ధా రాఘవరావుతోపాటు జెడ్పీ ఛైర్మన్ రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్లో కిసాన్ సమ్మేళనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. -
'రెండు హైకోర్టులు ఉంటే మంచిదే'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు లోక్ సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశం కోర్టులో ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు హైకోర్టులు ఉడడం మంచిదే అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ లోక్ సభలో పేర్కొన్నారు. హైకోర్టులో కేసు పరిష్కారం అయిపోయిందని తెలిపాడు. రాష్ట్రపతి హైకోర్టును నోటిఫై చేయడానికి కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. -
వర్సిటీలో ఐబీఎస్ సెంటర్
ఏఎన్యూ: ఆంధ్రా సుగర్స్ సంస్థ ఆర్థిక సహకారంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ (ఐబీఎస్) సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీలో జరిగింది. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీలోని విద్యావిషయక భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఐబీఎస్ శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం డైక్మెన్ ఆడిటోరియంలో మంత్రి విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రాబిర్లాగా పేరొందిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ పేరుతో నూతన రాజధానిలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమెరికాలో టాప్టెన్ డాక్టర్లలో ఐదుగురు మన దేశం వారైతే వారిలో సగం మంది తెలుగు వారు ఉంటున్నారని, ఇది మన మేధస్సుకు నిదర్శనమని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యాపారవేత్తలకు ఆదర్శం హరిశ్చంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన సంస్థల్లో ఒక్క రోజు కూడా బంద్ జరగలేదన్నారు. ఏఎన్యూ ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్కుమార్ ప్రసంగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, శాసనమండలి మాజీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, ఏఎన్యూ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.శివరాం ప్రసాద్, ఆంధ్రాసుగర్స్ జేడీ పి.అచ్యుతరామయ్య, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశేష్ఠ త్రిపాఠి, పలువురు ఏఎన్యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
సౌ‘భాగ్యనగరం’గా తీర్చిదిద్దుదాం
టి.ప్రతినిధుల బృందానికి కేంద్రమంత్రి వెంకయ్య పిలుపు వ్యర్థం వినియోగంపై కేంద్రం దృష్టి కంటోన్మెంట్పై పారికర్తో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలతో సంబంధం లేకుండా భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా తీర్చిదిద్దుదామని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందానికి పిలుపునిచ్చారు. కేంద్రరాష్ట్రాలు ఉమ్మడిగా ఈ పనిని పూర్తిచేసి భాగ్యనగరానికి సార్థకత చేకూర్చుదామని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలోని టి.ప్రజాప్రతినిధుల బృందం సోమవారం కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ అయింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ పేరిట చేపట్టిన కార్యక్రమాలను ఎంపీ కేశవరావు మంత్రికి వివరించారు. మురికివాడలను బంజారాహిల్స్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయలో చెరువుల మరమ్మతులు, శిథిల వ్యర్థాల పునర్వినియోగానికి చేపడుతున్న కార్యాచరణను తెలియజేశారు. స్వచ్ఛ హైదరాబాద్, వ్యర్థాల వినియోగం, గోదావరి పుష్కరాల నిర్వహణ తదితర కార్యక్రమాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వ్యర్థం నుంచి విద్యుత్, ఎరువులు, శిథిలాల నుంచి బ్రిక్స్, ఇసుక తయారీపై రాబోయే రోజుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి దృష్టి సారించనున్నట్టు చెప్పారు. వ్యర్థం నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు. చెరువులు, కుంటల పరిరక్షణతోపాటు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా నిబంధన అమలు చేయాలని సూచించామన్నారు. రక్షణ మంత్రితో భేటీ.. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. కంటోన్మెంటు రహదారి మూసివేత, అక్కడి సమస్యలపై నివేదించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తొలుత ప్రతినిధి బృందం ఢిల్లీలోని వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతున్న జిందాల్ పవర్ ప్లాంట్ను, జహంగీర్పూర్లోని డంపింగ్ యార్డులను సందర్శించింది. బృందంలో ఎంపీలు కేశవరావు, ఏపీ జితేందర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, కొత్తా ప్రభాకర్రెడ్డి, మల్లారెడ్డి, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. -
వచ్చే ఐదేళ్లలో తిరుగులేని ఆర్థిక శక్తిగా భారత్
2022 నాటికి అందరికీ ఇళ్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్: వచ్చే అయిదేళ్లలో భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా మారి చైనాను అధిగమించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో‘ 56వ నేషనల్ కాస్ట్ కన్వెన్షన్-2015’ సదస్సుకు ఆయన ముఖ్యతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధికి పదేళ్లు హాలిడే ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చైనా 3.7 శాతం వృద్ధిని సాధిస్తోందని వచ్చే అయిదేళ్లలో భారత్ 7 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలువనుందని అశాభావం వ్యక్తం చేశారు. దేశం మొత్తం జనాభాలో 60 శాతం మంది యువకులేనని, 25 నుంచి 35ఏళ్ల మధ్య వయస్సు కల్గిన యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశంలో 58 శాతం మంది ప్రజలకు బ్యాంక్ ఖాతాలు లేవని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన ‘జనధన్ యోజన’ ద్వారా 21 కోట్ల మందికి ఖాతాలు తెరిచారని చెప్పారు. మెడికల్ హబ్గా హైదరాబాద్ మారుతుందని భవిష్యత్లో అమెరికా ప్రజలు సైతం చికిత్స కోసం ఇక్కడి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు ఉండేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సదస్సు సావనీర్, జర్నల్, సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు ఎ.ఎస్.దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు సీఎంఏ బట్టాడ్, ప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ పీఠం బీజేపీదే కార్యక్రమం అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ త్వరలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోనుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, ఆప్కీ పెద్ద తేడా లేదన్నారు. ఉత్తమ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీ రాజకీయాలలో చేరాలనుకున్నప్పుడు ఆమె బీజేపీనే ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం మార్పుపై మీడియా ప్రశ్నించగా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట ప్రకారం ఏర్పాటు చేసుకుంటుందన్నారు. -
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరం
ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు కార్యక్రమానికి హాజరైన వారిలో అమిత్షా, అద్వానీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూపంలో చేసుకుంటారన్నారు. ‘సంక్రాంతి అనేది ప్రకృతి పండుగ. సూర్యుడి గమనాన్ని అనుసరించి చేసుకునేది. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరాలన్న సందేశాన్ని ఇచ్చేది సంక్రాంతి. ఈ సందర్భంగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, ధర్మేంద్రప్రధాన్, బండారు దత్తాత్రేయ, అశోక్గజపతిరాజు, హర్షవర్ధన్, అనంతకుమార్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్రసింగ్ థోమర్, జితేందర్ సింగ్, నజ్మాహెప్తుల్లా, డిప్యూటీ స్పీకర్ తంబిదొరై, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మాడ్గుల నాగఫణిశర్మ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు, ఢిల్లీ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు వంటకాలతో ఇచ్చిన తేనీటి విందును ఆస్వాదించారు. వెంకయ్య ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ఆయన ఇంట్లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో ఏటా పాల్గొంటున్నానని అద్వానీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆహూతులను అలరించాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి.. సమాజంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలని, కొత్త ఏడాది అందరికీ శుభం తెస్తుందని వెంకయ్య ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీలోని తెలుగువారితోపాటు దేశంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు. ‘దేశంలో అభివృద్ధి పర్వం మొదలైంది. 2015 ఏడాదిలో అభివృద్ధి ఫలా లు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల వారికీ చేరుకోవాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
ఇక ఏ క్షణంలోనైనా క్రమబద్ధీకరణ
న్యూఢిల్లీ:రాజధాని నగరంలోని అనధికార కాలనీలవాసులకు శుభవార్త. నగరంలో 1,200కు పైగానున్న అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ఢిల్లీలో అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియను అతిత్వరలో ప్రారంభిస్తామని తెలిపింది. జాతీయ గృహ నిర్మాణ ప్రణాళిక రూపకల్పన చివరి దశలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ప్రణాళిక కింద మురికివాడల పునరావాసానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, అందరికీ గృహ వసతి కల్పించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఈ విషయాన్ని తమ ప్రభుత్వం క్రియాశీలకంగా పరిశీలిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి అంకంలో ఉందని అన్నారు. ఈ కాలనీల్లో నివసిస్తున్న వారికి విద్యుత్, నీరు, ఇతర సదుపాయాలు అందుతున్నాయని, అయితే రికార్డుల్లో మాత్రం అవి అనధికార కాలనీలుగానే ఉన్నాయని చెప్పారు. కాలనీవాసులు తమ ఆస్తులను ఇతరులకు బదలాయించలేకపోతున్నారని, ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఏ రోజైనా, ఏ క్షణంలోనైనా అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని వెంకయ్య చెప్పారు. జాతీయ రాజధాని ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండో సవరణ బిల్లు, 2014పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ చట్టం ద్వారా ఢిల్లీలోని అనధికార కాలనీల్లో కూల్చివతేలను మూడేళ్లపాటు వాయిదా వేయవచ్చు. నేడు దేశంలో ప్రతి ఒక్కరికి గృహ వసతి కల్పించడం అతిపెద్ద సవాలు అని వెంకయ్య పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గృహ పథకాలను అధ్యయనం చేశామని అన్నారు. జాతీయ గృహ నిర్మాణ ప్రణాళికను రూపొందించే ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పారు. ‘అందరికీ గృహ వసతి’ ప్రణాళికను రూపొందించే ముందు వివిధ నగరాలలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. క్రమబద్ధీకరణపై ఐక్యమైన అధికార, విపక్షాలు మత మార్పిడుల అంశంపై గత వారం పది రోజులుగా పరస్పరం కటువుగా వ్యవహరించిన అధికార, ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో అనధికార కాలనీల క్రమబద్ధీకరణ బిల్లు విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. మురికివాడల్లోని పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లును ఆమోదించేందుకు అందరూ చేతులు కలిపారు. ‘‘ఈ బిల్లుపై పూర్తిస్థాయి చర్చ అవసరం లేదు. ఎందుకంటే దేశమంతటి నుంచి వచ్చే పేదలకు సంబంధించిన అంశం ఇది. వారి ఇళ్లు చెక్కుచెదరకుండా ఉండాలి. ఈ బిల్లుకు మేము మద్దతునిస్తున్నాం’’ అని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలో ఓ కూల్చివేతను అడ్డుకున్నారని ఆజాద్ గుర్తు చేశారు. ఈ శీతాకాలంలో పేదల ఇళ్లను కూల్చివేయకూడదని చెప్పారు. మత మార్పిడుల అంశంపై ప్రధాని సమాధానం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా రాజ్యసభను స్తంభింప చేసిన విపక్షాలు శీతాకాలం సమావేశాలు శుభకరంగా ముగియాలని ఆశించారు. అందుకనుగుణంగానే పేదలకు అనుకూలమైన ఓ బిల్లును ఆమోదించినందుకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఈ బిల్లు వల్ల నగరంలోని 60లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రియన్ అన్నారు. అయితే ఇది క్రిస్మస్ లేదా నూతన సంవత్సర బహుమానం కాదని, అది వారి హక్కు అని అన్నారు. ఈ బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నగరంలో వెలసిన అనధికార కాలనీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. -
'వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్ '
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో వరంగల్ వారసత్వ నగరాలుగా గుర్తించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని.. ఆ బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలోని 12 నగరాలను వారసత్వ నగరాలుగా గుర్తించామని తెలిపారు. 2015, జనవరి నుంచి వారసత్వ పథకం అమలవుతుందని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం రూ. 101 కోట్లు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో రూ. 70 కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే రామగుండంలో 17.75 కోట్లతో 280 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో తమ ప్రభుత్వం లోక్సభలో అత్యధిక బిల్లు ప్రవేశపెట్టామని తెలిపారు. ఒక్క సెషన్లోనే 17 బిల్లులు ఆమోదం పొందిన సంగతిని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాజ్యసభలో మాత్రం 11 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. సభలో ప్రభుత్వానికి సహకరించాలని వెంకయ్యనాయుడు విపక్షాలకు సూచించారు. -
ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం తన ఛలోక్తులతో లోక్సభలో నవ్వులు పూయించారు. ‘నాకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అయినా.. నా భార్య అవేవీ పట్టించుకోదు’ అని అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ’ అని ఓ పాట పాడారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. -
పేదలకు చౌకగా గృహ రుణాలు!
న్యూఢిల్లీ: అల్పాదాయ, పేద ప్రజలకు సబ్సిడీ వడ్డీరేట్లకు గృహ రుణాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచే ప్రణాళికల్లో భాగంగా దీనిపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. రియల్టీ పరిశ్రమ సంఘం క్రెడాయ్ సోమవారమిక్కడ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రియల్టీ అభివృద్ధి, నియంత్రణ బిల్లుకు త్వరలోనే కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉందని.. వచ్చే బడ్జెట్ సెషన్నాటికి దీనికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాల(ఎల్ఐజీ)కు గృహ రుణాల్లో వడ్డీ రాయితీ స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దిగువ మధ్య తరగతి ప్రజలనూ దీని పరిధిలోకి తీసుకొస్తాం’ అని వెంకయ్య తెలిపారు. కాగా, ఎప్పటికల్లా ఈ రాయితీ అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు... త్వరలో మేం ప్రారంభించనున్న కొత్త గృహనిర్మాణ విధానంలో వడ్డీ రాయితీ పథకం భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. సొంతింటి కలకు రూ. 14 లక్షల కోట్లు కావాలి.. అధిక వడ్డీరేట్లు, స్థిరాస్థి ధరల పెరుగుదల కారణంగా రియల్టీ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోందని వెంకయ్య పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతులు ఇవ్వాలన్న రియల్టర్ల డిమాండ్పై స్పందిస్తూ... వైమానిక, పర్యావరణ సంబంధ అనుమతులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయడంతోపాటు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక 2022 కల్లా దేశవాసులందరికీ సొంతింటి కలను సాకారం చేయాలంటే సుమారు రూ.14 లక్షల కోట్ల భారీ నిధులు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. అందుకే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. -
సీశాట్ పై అభిప్రాయాలు తెలపండి: కేంద్రం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లోగా అభిప్రాయాలు వెల్లడించాలని ఆదివారం విజ్ఞప్తి చేసింది. సీశాట్ పై అన్ని కోణాల్లో సమీక్ష జరుపుతామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్ లో ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు. యూపీఎస్సీ ప్రవేశపెట్టిన సీశాట్ వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
'తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరు'
విజయవాడ: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే బీజేపీ విధానమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మావోయిస్టులు తుపాకీ తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని నిరూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సహకారంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేసేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. -
'స్మార్ట్ సిటీస్ గా విజయవాడ, విశాఖ'
విజయవాడ: విశాఖపట్నం, విజయవాడలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు సర్వీసు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీస్ అభివృద్ధి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా బెజవాడ, వైజాగ్ లను స్మార్ట్ నగరాలు తీర్చిదిద్దుతామని చెప్పారు. వీటిలో నిరంతర మంచినీరు, విద్యుత్ సరఫరా, రవాణా, వైద్యసదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. స్మార్ట్ సిటీస్ పై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. -
బాజ్పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య
న్యూఢిల్లీ: ముస్లింలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అంగీకరించబోమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. లక్ష్మీకాంత్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేశారు. రేప్, తీవ్రవాదానికి మతం లేదని అన్నారు. అత్యాచారం, తీవ్రవాదం నేరాలని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన పురుషులు వేరొక మతానికి చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారని లక్ష్మీకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంగీకరించబోరని వెంకయ్య నాయుడు అన్నారు. -
'యూపీఏ కంటే మెరుగ్గా నడిపిస్తాం'
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. లోక్సభ 27 రోజులపాటు పనిచేసిందని తెలిపారు. యూపీఏ హయాం కంటే మెరుగ్గా సభాకార్యక్రమాలు నడిపిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం, జడ్జీల నియామక బిల్లు వంటి కీలక అంశాలను పార్లమెంట్ లో చర్చించామని తెలిపారు. రాజ్యసభలో తమకు మెజార్టీ లేకపోయిన ఇన్సూరెన్స్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించామని అన్నారు. అయితే తన వాగ్ధాటితో నెగ్గుకు వచ్చే వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో కోపం తెచ్చుకున్నారు. అప్రంటైసెస్ సవరణ బిల్లును స్థాయీసంఘానికి పంపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో లోక్సభలో కాంగ్రెస్నేత మల్లిఖార్జున్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజింగ్ పదం పదేపదే ఉపయోగించడం మంచిది కాదంటూ ఖర్గేకు సూచించారు. -
కేసీఆర్పై నిప్పులు చెరిగిన వెంకయ్య
హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పదం ఫాసిజం అని ఆయన అన్నారు. ఫాసిస్టు అన్న పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేసీఆర్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒట్టెందుపోకడలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో శాంతిభద్రతల అంశం గవర్నర్ పరిధిలోకి వస్తుందని 2014 ఏపీ పునర్విభజన బిల్లులో ఉందని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయిన ఏపీ పునర్విభజన బిల్లు గత ప్రభత్వమే ఆమోదించిందని చెప్పారు. పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే... తాము స్వాగతిస్తున్నామంటూ సంబరాలు చేసుకున్నప్పుడు తెలియలేదా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. రాజకీయ వివాదాలు దేశానికి అంతమంచిది కాదని కేసీఆర్కు హితవు పలికారు. తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ చౌకబారు మాటలకు తన స్థాయి విడిచి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
కేసీఆర్పై నిప్పులు చెరిగిన వెంకయ్య
-
ఆ ఘటనలు సమాజానికి మాయని మచ్చ:వెంకయ్య
హైదరాబాద్: నేటి సమాజంలో మహిళలపై, చిన్నారులపై రోజురోజుకూ శృతిమించుతున్ననేరాలను అరికట్టాలంటే పాలనను మరింత పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై, బాలికలపై యధేచ్ఛగా అత్యాచారాలు చోటు చేసుకోవడం నిజంగా సిగ్గు చేటన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి 'మిడ్-కెరీర్ ట్రైనింగ్' శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయడు మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీలో చోటు చేసుకున్న 'నిర్భయ' తరహా ఘటనలు ప్రతీ రోజూ దేశంలో ఏదో మూలన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూర్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజానికి మాయని మచ్చని వెంకయ్య తెలిపారు. మహిళలు ప్రజాజీవితంలో స్వేచ్ఛగా మెలగాలంటే పాలనా పరంగా కూడా మార్పు తీసుకురావాలన్నారు. -
అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. మెట్రో రైలును ప్రోత్సహించడంతోపాటు ప్రయాణికుల సాధక బాధకాలను ఆలకించేందుకు ఆయన సోమవారం ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు స్టేషన్ నుంచి శివాజీ పార్కు స్టేషన్ వరకూ ప్రయాణించారు. వీటి సేవలు ప్రజాదరణ పొందేలా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణ చార్జీల భారం తగ్గించేం దుకు కృషి చేస్తామన్నారు. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోం దంటూఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్పై ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. మెట్రో రైలు వ్యవస్థ బాగుందన్నారు. ‘నిజంగా సకాలంలో, అత్యంత సౌకర్యవంతంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారికి ఇదొక చక్కని ప్రజారవాణా వ్యవస్థ అని నేను భావిస్తున్నా. ఢిల్లీ మెట్రోతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ వ్యవస్థ నవీన భారతానికి సూచిక .మనం కనుక మంచి అవకాశాలు కల్పించగలిగితే వాటిని సద్వినియోగం చేసుకోగల సామర్థ్యం మన ప్రజలకు ఉంది. వారు అద్భుతాలు సృష్టించగలుగుతారు’ అని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య... పలువురు ప్రయాణికులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను ఎంతో ఓపిగ్గా ఆలకించారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ప్రయా ణ చార్జీలు, ఆయా స్టేషన్లలో వెసులుబాట్లు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు తదితర అంశాలపై వారితో ఆయన మాట్లాడారు. ‘ప్రయాణికులతో మాట్లాడేందుకు నాకో సువర్ణావకాశం లభించింది. వారితో అనేక అంశాలపై మాట్లాడాను. చార్జీలు ఎక్కువగా ఉన్నాయని వారు నాతో చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని సంబంధిత అధికారులకు సూచించా. ఢిల్లీ మెట్రో- ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్( డీటీసీ)లను అనుసంధానం చేయడంద్వారా కనె క్టివిటీ పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించా. ఇందువల్ల ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇదంతా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఎల్లకాలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడడం మంచిది కాదు’ అని అన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఏటీఎంలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడంతో ప్రకటనలకు అవకాశం కల్పిస్తే డీఎం ఆర్సీ ఆదాయం పెరుగుతుందన్నారు. ఢిల్లీ మెట్రో సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. జాతీయ రాజధాని నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లకు వెళ్లే ప్రయాణికులకు దీనిని అనువుగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందన్నారు. రాజధానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రతిరోజూ రాకపోకలు సాగించేవారికి ఇది అనువుగా ఉండడమనేది అత్యం త ముఖ్యమన్నారు. రహదార్లపై రాకపోకలు సాగి స్తున్న వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోం దని, దీంతో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెట్రో రైలులో ప్రయాణం వల్ల తనకు 40 నిమిషాల సమయం ఆదా అయిందని తెలిపారు. రహదారులపై ప్రయాణంవల్ల సమయం వృథా అవడమే కాకుండా అలసట కలుగుతుందన్నారు. తన మాదిరిగానే తన సహచర మంత్రులు కూడా దీనిలో ప్రయాణించాలని ఆయన సూచించారు. -
'శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు నన్ను కలిశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తనను కలిశారని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే చర్చించారని వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని కోసం రవాణా, మెట్రోరైలు, లింక్రోడ్డులు అనుకూలంగా ఉన్న ప్రాంతం కావాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, రైల్వే, పెట్రోలియం, పౌరవిమానయాన రంగాల మద్దతుతో కొత్త రాజధాని నిర్మాణం సాధ్యమని కమిటీ తెలిపిందని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి మద్దతిస్తుందని శివరామకృష్ణన్ కమిటీకి హామీ ఇచ్చామని వెంకయ్య నాయుడు తెలిపారు. మెడికల్ సీట్లు తగ్గింపు అంశంపై వైద్యశాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. కాలేజీల్లో తనిఖీలు త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. సీట్ల అంశంపై రెండు ప్రభుత్వాలను సమావేశపరచాలని సూచించామని చెప్పారు. -
'ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రజలు ఎన్నుకోలేదు'
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శలు చేశారు. ఆ పదవి కోసం ప్రజలు ఒక పార్టీని ఎన్నుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పు స్ఫూర్తిని కాంగ్రెస్ ఇంకా అర్థం చేసుకోలేకపోతోందన్నారు. ఓటమిపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఏ పార్టీ అయినా 55లోక్సభ స్థానాలు గెలుచుకుని ఉంటే విపక్షనేత స్థానంపై చర్చే ఉండేది కాదని, ఈ విషయంలో స్పీకర్కు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలను విలేకరులు వెంకయ్యనాయుడు వద్ద ప్రస్తావించగా... బలమైన, స్థిరమైన దేశం కోసం సరైన మార్గంలో సరైన ప్రాధాన్యతలు, సరైన విధానాలను రాష్ట్రపతి ప్రసంగం తెలియజేసిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో వచ్చే రెండు రోజుల్లో చర్చ ఉంటుందని తెలిపారు. -
యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య
హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎన్డీఏ ప్రభుత్వం సమీక్షిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత యూపీఏ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. వీటిని కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. -
'మెజార్టీ లభించకపోయినా మోడీనే ప్రధాని అభ్యర్ధి'
న్యూఢిల్లీ: మెజార్టీ సీట్లు రాకుంటే ప్రధానమంత్రి అభ్యర్ధి మార్చమని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీకి మెజార్టీకి సీట్లు లభించకపోతే ప్రధానమంత్రి అభ్యర్ధిని మార్చవచ్చనే వార్తలను ఆపార్టీ నేత వెంకయ్యనాయుడు ఖండించారు. మీడియాలో వస్తున్న కథనాలన్ని అవాస్తవాలని వెంకయ్య అన్నారు. ప్రధాని పదవికి నరేంద్రమోడీ అభ్యర్ధిత్వమే ఏకగ్రీవమని వెంకయ్య స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో సీనియర్లకు చోటు లభించదనే వార్తల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మురళీ మనోహర్ జోషి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీలో సీనియర్లకు కూడా చోటు ఉంటుందని వెంకయ్య తెలిపారు. -
సీమాంధ్రలో మోడీ పర్యటన ఖరారు!
విజయవాడ: సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ పర్యటనలు బీజేపీ ఖరారు చేసింది. ఏప్రిల్ 30, మే 1 తేదిన సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో సభల్ని ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 తేదిన మోడీ తిరుపతి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఏప్రిల్ 1 తేదిన మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నంలో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారన్నారు. మోడీ సభల్లో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారని వెంకయ్యనాయుడు తెలిపారు. -
మోడీ పీఎం కావడం తథ్యం
వెంకయ్య ధీమా బిజేపీలో అసంతృప్తికి చోటు లేదు కాంగ్రెస్ భూస్తాపితం సాక్షి, చెన్నై : దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రా, కర్నాటకలో మోడీ ప్రభంజనం అధికంగా ఉందని, మోడీ పీఎం కావడం తథ్యమని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అసంతృప్తి అన్న పదానికి చోటు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. టీ నగర్లోని కమలాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఓటును ఆయుధంగా మలుచుకునేందుకు ప్రజలు సిద్ధం అయ్యారన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పాలకులు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు సైతం యూపీఏపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, అనేక రాష్ట్రాల్లో తమ నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధ పడుతున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో 45 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఓ మెగా కూటమి ఆవిర్భవించడం శుభసూచకంగా అభివర్ణించారు. అది కూడా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శమన్నారు. జాతీయ స్థాయిలోనూ, తమిళనాడులోని బీజేపీ కూటమి అత్యధిక సీట్లను కైవశం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపికి 230-240 సీట్లు, మిత్రులతో కలుపుకుంటే 300 సీట్లు సాధించి తీరుతామన్నారు. సీమాంధ్ర, తెలంగాణల్లోను అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలన తీరు అలా ఉంటుందని వివరించారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు సమన్యాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, జాలర్లపై దాడులకు ముగింపు పలుకుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజేపీలో అసంతృప్తి అన్న పదానికి ఆస్కారం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అద్వాని, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సింగ్లను పార్టీ పక్కన పెట్ట లేదని, మోడీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వెంకయ్య నాయుడు సమక్షంలో కృష్ణగిరి, కన్యాకుమారిలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సీనియర్ నాయకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దక్షిణ చెన్నై పార్టీ అభ్యర్థి ఇలగణేషన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో వెంకయ్య నాయుడు ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేశారు. ప్రచారానికి శ్రీకారం: బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలోఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ స్థానం బరిలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
దక్షిణాదిలో మోడీ హవా
సాక్షి, చెన్నై: టీ నగర్లోని కమలాలయంలో ఆదివారం ఎం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు లోక్సభ ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ ఓటును ఆయుధంగా మలుచుకునేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ మీద ప్రజలు ఏ మేరకు ఆవేశంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పాలకులు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు సైతం యూపీఏపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే అనేక రాష్ట్రాల్లో తమ నాయకత్వాన్ని దక్షిణాదిలో మోడీ హవా బలపరిచేందుకు సిద్ధ పడుతున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో 45 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఓ మెగా కూటమి ఆవిర్భవించడం శుభసూచకంగా అభివర్ణించారు. అది కూడా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వలసలు : దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, దక్షిణాదిలోనూ ఆయన ప్రభంజనం రాబోతున్నదని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శమన్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు బయలు దేరడంతో పాటుగా సెలబ్రటీలు, ప్రజాదరణ కలిగిన వాళ్లు సైతం మోడీ పక్షాన నిలబడే దిశగా తమ గూటికి చేరుతున్నారని వివరించారు. దేశ సమగ్రాభివృద్ధి మోడీ ద్వారా సాధ్యమన్న విషయాన్ని యువత గుర్తించిందని, వారు తాము సైతం అని కదులుతున్నారని పేర్కొన్నారు. అత్యధిక సీట్ల కైవశం: జాతీయ స్థాయిలోనూ, తమిళనాడులోని బీజేపీ కూటమి అత్యధిక సీట్లను కైవశం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏర్పడిన కూటమి గెలుపు కూటమి అని, ఈ కూటమి అభ్యర్థులను, మోడీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం ఈ పర్యాయం అన్నాడీఎంకే, డీఎంకేలకు అంత సులభం కాదన్నారు. దేశంలో బీజేపికి 230-240 సీట్లు, మిత్రులతో కలుపుకుంటే 300 సీట్లు సాధించి తీరుతామన్నారు. మోడీ పీఎం కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంటూ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు కీలక భూమిక పోషించడం ఖాయం అని స్పష్టం చేశారు. తమిళనాడులోని తమ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉందన్నారు. బోణీ: తమిళనాడు నుంచి బీజేపీ కూటమి ప్రతినిధులు అత్యక శాతం మంది పార్లమెంట్లో అడుగు పెట్టి తీరుతారని, కేరళలో తాము ఈ సారి బోణీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర, తెలంగాణల్లోను అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, అక్కడి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ చర్యలు తీసుకుంటుందన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధానితో పాటుగా అక్కడి జిల్లాలో అన్ని రకాల అభివృద్ధి, విద్య, వైద్య పరంగా సేవలను మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలన తీరు అలా ఉంటుందని వివరించారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు సమన్యాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, జాలర్లపై దాడులకు ముగింపు పలుకుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజేపీలో అసంతృప్తి అన్న పదానికి ఆస్కారం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నట్టుగా తమ సీనియర్లు ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి తమరికి చెప్పారా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అద్వాని, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సింగ్లను పార్టీ పక్కన పెట్ట లేదని, మోడీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. వెంకయ్య నాయుడు సమక్షంలో కృష్ణగిరి, కన్యాకుమారిలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సీనియర్ నాయకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దక్షిణ చెన్నై పార్టీ అభ్యర్థి ఇలగణేషన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో వెంకయ్య నాయుడు పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేశారు. ప్రచారానికి శ్రీకారం: బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలోఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ స్థానం బరిలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాడ వాడల్లో ఓట్ల వేటలో పడ్డ పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలో హార్బర్ ఏర్పాటు చేస్తానని, విమానాశ్రయం నెలకొల్పుతానని, పర్యాటక కేంద్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడుతానని ఓటర్లకు హామీలు గుప్పించడం విశేషం. -
టీడీపీ లో సర్వం కాంగ్రెస్ మయం: వెంకయ్య నాయుడు
విజయవాడ: టీడీపీ పార్టీపై బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీలో కాంగ్రెస్ నేతల చేరికతో ఆ పార్టీ ఉనికిని కోల్పోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తం కాంగ్రెస్ మయం అవుతుందని ఆయన మండిపడ్డారు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించకోక తప్పదని ఆయన తెలిపారు. శనివారం విజయవాడలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నాయకులు చేరడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు టీడీపీకి మంచివి కావని స్పష్టం చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే అంశంలో అర్డినెన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ దాటవేస్తోందన్నారు. బీజేపీ పొత్తులపై వారంలో స్పష్టత వస్తుందన్నారు.పొత్తులు లేకుంటే ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య
హైదరాబాద్: నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. పొత్తు గురించి బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. పవన్ కళ్యాణ్ తరపున కూడా తమతో ఎవరూ మాట్లాడలేదని వెల్లడించారు. ఈ విషయంపై మీడియాలో వస్తున్నవి వందతులేనని, ఇందులో నిజం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారన్నది కూడా ప్రచారమేనని చెప్పారు. మోడీతో పవన్ భేటీ గురించి తనకైతే ఎలాంటి సమాచారం లేదన్నారు. అపాయింట్మెంట్ ఉంటే మోడీని నేరుగా కలవొచ్చని వెంకయ్య నాయుడు తెలిపారు. తానింతవరకు జనసేన పార్టీ వారితో మాట్లాడలేదని చెప్పారు. -
సీమాంధ్రకు హామీలను అమలు చేయండి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్లోని అంశాలపై ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలను ప్రణాళికా సంఘం, కేబినెట్ ఆమోదించాలని, ఈ ప్రక్రియంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జరగాలని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో 20వ తేదీన సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీల పత్రాన్ని జతపరుస్తూ వినతి పత్రాన్ని అందచేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్తో కలిసి వెంకయ్య నాయుడు గురువారం మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి హామీల అమలుపై చర్చించారు. అనంతరం తన నివాసంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, ఇతర ప్రస్తావిత ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక సంఘం, కేబినెట్ ఆమోదం తీసుకోడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరామన్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని తెప్పిస్తున్నట్టు అహ్లువాలియా చెప్పారన్నారు. పనులన్నీ సూత్రప్రాయంగా ఆమోదిస్తే మా ప్రభుత్వం వచ్చాక మందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇంకా వెంకయ్య ఏమన్నారంటే.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రలో పది, పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ మొహం చూపించే పరిస్థితి లేదు. జన్మలో కాంగ్రెస్ను క్షమించరు. సీమాంధ్రలో జనం బాధ ఆరలేదు. అప్పుడే విశాఖ, తిరుపతి, కర్నూలు.. ఇలా రాజధాని కోసం సంతకాల సేకరణ మొదలు పెట్టారు. దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సోనియా వల్లే ప్రత్యేక హోదా అని జైరాం అంటారు. సోనియా ఇవ్వదలుచుకుంటే లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు రాహుల్, సోనియా, ప్రధాని సభకు ఎందుకు రాలేదు? సభలో చిర్చించి ఉంటే ప్రజలు నమ్మేవారు. -
పాలకుండలో విషంచుక్క వేయొద్దు: యెన్నం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో విభజన చిచ్చు రేగింది. జాతీయ స్థాయి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడుపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడెతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. షరతులులేని తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పి వెనుకా ముందాడడం మంచిదికాదన్నారు. తెలంగాణ కల ఫలిస్తున్న సమయంలో తమ నోటికాడి బుక్క లాగేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దని యెన్నం కోరారు. పొత్తుకోసం, ఓట్లకోసం తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే ఎవరూ సహించరని హెచ్చరించారు. ఈనెల11న పార్లమెంట్లో బిల్లు పెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. టీడీపీతో అంటకాగటం మంచిది కాదని హితవు పలికారు. -
'టీ స్టాల్ ప్రారంభించి.. ఎన్నికల ప్రచారం'
విజయవాడ: బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో బుధవారం టీ స్టాల్ ను ప్రారింభించి ఓ కప్పు తాగారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. తన జీవితంలో తొలిసారి టీ తాగానని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు టీ బాయ్ గా జీవిత ప్రస్థానం ఆరంభించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు టీ స్టాల్ ఆరంభి వచ్చే లోక్ సభ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ మోడీపై విమర్శలు చేయడాన్ని వెంకయ్య తప్పుపట్టారు. మోడీ ఎప్పటికీ ప్రధాని కాలేరని, కావాలంటే కాంగ్రెస్ ప్లీనరీ వద్ద టీ అమ్ముకునేందుకు స్థలం కేటాయిస్తామని అయ్యర్ వ్యాఖ్యానించారు. అయ్యర్ వ్యాఖ్యలు వేలాది మంది టీ అమ్ముకునే వారిని అవమానించడమేనని వెంకయ్య విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు కుంభకోణాల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రజలందరూ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
మోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరు: వెంకయ్య
చెన్నై: దేశంలోని ఏ రాజకీయ పార్టీలోనూ నరేంద్రమోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరని, 2014 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందిరాగాంధీ కాలంనాటి ఎమర్జెన్సీ కంటే ఘోరంగా తయారైందని విమర్శించారు. ఇటీవలి 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం రుజువైందన్నారు. ఈ మేరకు ఇక్కడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా భావించే ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడాపార్టీకి దూరమయ్యూరని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ముస్లింలు సైతం బీజేపీకి అండగా నిలిచారన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రవేశ పెట్టిన ఆధార్ కార్డులు, నగదు బదిలీ, ఆహార భద్రత పథకాలు 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాపాడలేవని జోస్యం చెప్పారు. ‘అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటైన సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిపోలేదా?. కాంగ్రెస్ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ విషయంలో సీబీఐని వాడుకోలేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సోనియా బహుమతి అని, సీమాంధ్ర వారికి బీజేపీ కారణంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు. -
రోజుకో పాలన... రోజుకో లీకు...కాంగ్రెస్ తీరు: వెంకయ్య
10 జిల్లాలతో కూడిన తెలంగాణాకే తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతాపార్టీ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. సీఎం కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన సంగతిని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అర్టికల్ -370పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే కాంగ్రెస్కు వణుకు పుడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రోజుకో పాలన... రోజుకో లీకు... కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మరిందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. -
' మోడీ సారథ్యంలోనే భారత్ పురోగమిస్తుంది'
మోడీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ... ప్రస్తుత అధోగతిలో ఉన్న భారత్ను పురోగతి వైపు మళ్లించే సత్తా గుజరాత్ ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకే ఉందని ఆయన స్ఫష్టం చేశారు. నలుగురు రేప్ నిందితులకు క్షమాభిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీ నేడు తమ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వెంకయ్య వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం అంటూ లేదని ఆయన పేర్కొన్నారు. -
'నరేంద్ర మోడీ '3డి' మంత్రం.. ప్రజలకు సమ్మోహితం'
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం మారాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ '3డి' మంత్రం ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోందని చెప్పారు. మోడీ.. నిర్ణయాత్మకత, దూసుకుపోయే స్వభావం, అభివృద్ధి లక్షణాలు ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాల ప్రజలూ ఇదే అభిప్రాయంతో ఉన్నరన్నారు. యూపీఏ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, చురుగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు. -
మోడీ వస్తే దేశం బాగుపడుతుంది: వెంకయ్య
నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు. మోడీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉందని తెలిపారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని అన్నారు. ఐక్యమత్యాన్ని సాధించే వ్యక్తి అని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్లో మోడీ సాధించిన అభివృద్ధిని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. 10 ఏళ్లుగా పదిశాతం వృద్ధిరేటు సాధస్తున్న రాష్ట్రం గుజరాత్ ఒక్కటేనని వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందాలన్న లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. -
‘బొగ్గు’ ఫైల్స్ పోతే ప్రభుత్వమూ పోయినట్టే: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల కేటాయింపు ఫైళ్లు పోతే కాంగ్రెస్ ప్రభుత్వమూ పోయినట్టేనని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం బరి తెగించిందనే దానికి ఈ ఫైళ్ల గల్లంతే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. వాటిని కావాలనే మాయం చేశారని, అవి దొరక్కపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో దోషే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రకాష్ జైస్వాల్ అయితే ఆయనతో పార్లమెంటుకు జవాబిస్తామనడం దారుణమన్నారు. ప్రధానే దీనిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రక్షా బంధన్ సందర్భంగా బుధవారమిక్కడ ఆయన పార్టీ నేతలు కిషన్రెడ్డి, దత్తాత్రేయ, వై.రఘునాధ్బాబు, మల్లారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైందని, వారం రోజుల్లో మార్కెట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్ట పోయిందని చెప్పారు. రూపాయి తరుగుతోంది, విదేశీ మారక ద్రవ్యం కరుగుతోంది, ప్రభుత్వం నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. డాలర్ ఎస్కలేటర్పైన, రూపాయి వెంటిలేటర్పైన, ప్రభుత్వం ఐసీయూలో ఉందన్నారు. ఇటువంటి అధ్వాన్న, అసమర్థ, బలహీన, అవినీతి ప్రభుత్వం ఎంత త్వరగా పోతే అంతమంచిదని ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు. ఆహార భద్రత బిల్లుకు తాము సూత్రరీత్యా వ్యతిరేకం కాకపోయినా అందులో రైతుకు వనగూరే ప్రయోజనాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్లు పార్లమెంటులో ఉండగానే ఆహార పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పేదలపై అంత ప్రేముంటే ఈ తొమ్మిదిన్నరేళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సహా 18 రాష్ట్రాలకు పెద్దగా లబ్ధి చేకూరదన్నారు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ పరిథిలోనే ప్రజలు ఎక్కువ లాభ పడుతున్నారని చెప్పారు. అయినా ఈ పథకానికి అవసరమైన లక్షా 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన భూ సేకరణ బిల్లు వల్ల ప్రయోజనం ఎవరికో చెప్పాలని కోరారు. చెల్లీ.. ఇదిగో ఉల్లి... బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు వినూత్నంగా జరిగాయి. అక్కా, చెల్లెళ్లు రాకీలు కట్టినప్పుడు అన్నదమ్ములు ఆశీర్వదించి, నోరు తీపి చేయడం ఆనవాయితీ. దీనికి కొంచెం భిన్నంగా ఉల్లిపాయల ధరలతో అక్కచెల్లెళ్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారనే దాన్ని తెలియజేప్పేందుకన్నట్టుగా వెంకయ్య నాయుడు తనకు రాకీ కట్టిన వారికి తలా రెండు ఉల్లిపాయలు పంచారు. కష్టకాలంలో ఆదుకోవడమే రక్షాబంధన్ ఉద్దేశమైనందున తాను ఉల్లిపాయలు పంచి తన సోదరీమణుల కష్టాలను ఒక్క పూటైనా తీర్చాలనుకున్నానని చమత్కరించారు. -
రాష్ట్ర విభజనపై హోంవర్క్ ఏదీ?: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏమాత్రం కసరత్తు (హోంవర్క్) చేయకుండా ప్రకటన చేయడం కాంగ్రెస్ ఏకపక్ష దోరణికి, చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఎటువంటి అపోహలు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం స్థితప్రజ్ఞులు మాత్రమే చేయగలరన్నారు. అటువంటి పని తాము మాత్రమే చేయగలమని చెప్పారు. తెలంగాణలో ఒక మాట, ఏపీలో ఒక మాట చెప్పడం కాంగ్రెస్ చేస్తుందే తప్ప బీజేపీ చేయదన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జాతీయపతాకావిష్కరణ సభ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కులం, మతం, వర్గం, భాష పేరిట ప్రజలను చీలుస్తున్నారన్నారు. తెలంగాణపై జరిగినంత లోతైన చర్చ తన జీవితంలోనే చూడలేదని చిదంబరం చెబుతుంటే ఎక్కడా చర్చే జరగలేదని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చివరకు ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారన్నారు. రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యల్ని అమాయకులు, చదువురాని వారు మాత్రమే తప్పుబడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిజంగా హోంవర్క్ చేసుంటే సీమాంధ్రలో ఈ పరిస్థితి వచ్చుండేది కాదన్నారు. 2004 నుంచి 2013 వరకు ప్రక్రియ మొదలు పెట్టని కాంగ్రెస్ ఇప్పుడు లాభసాటిగా ఉంటుందని చేపట్టిందేమోనని వ్యాఖ్యానించారు. సమస్యలు నాన్చడం కాంగ్రెస్కు అలవాటేనన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడుతుందని చెప్పలేమని, ఇంతవరకు రోడ్మ్యాప్పైన్నే అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ రెండింటికీ చెడ్డ రేవడిగా తయారవుతుందన్నారు. ఆంటోనీ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారో కాంగ్రెస్కు తెలియక కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఓ పార్టీ వేసుకున్న కమిటీకి మరోపార్టీ వాళ్లు అభ్యంతరాలు తెలుపుతారా? అని ప్రశ్నించారు. అహంకార దోరణితోనే ఏకపక్షంగా ఆ కమిటీని వేసిందన్నారు. సీమాంధ్రుల్లో నెలకొన్న భయాందోళనలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తే బాగుండేదన్నారు. తాత్కాలిక లబ్ధికే పాకులాట... నీతి, నిజాయితీ, సిద్ధాంతం, విధానం లేని కొందరు నేతలు భావోద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా దేశంలో మూడో వంతు ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన బతుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న ఆంధ్రప్రదేశ్ నేడు అన్నింటా వెనుకబడిందనారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో కొందరు నేతలు వాడుతున్న చౌకబారు భాష, విమర్శలు కలచి వేస్తున్నాయని, సంయమనం పాటించాలని ప్రజల్ని కోరారు. రాజకీయ ప్రక్షాళనకు యువకులు, మేథావులు పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపిచ్చారు. దేశంలో సుస్థిర పాలన, సమర్ధనాయకత్వాన్ని అందించే పార్టీలనే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ప్రజాజీవనంలో నిర్వహించాల్సిన 15 కర్తవ్యాలను ఆయన ఉద్బోధించారు. దేశంలో ఆంతరంగిక కల్లోలాలు సృష్టిస్తున్న పాక్ ఓ ధూర్తదేశంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఉపయోగించుకుని ప్రజల్ని మభ్యపెడుతోందని కిషన్రెడ్డి చెప్పారు. సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ ప్రకాశ్రెడ్డి, బద్దం బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విభజనను ప్రైవేటు వ్యవహారంలా చూస్తోంది: వెంకయ్య నాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరు.. ‘కేక్ తినాలి. చేతిలోనే ఉండాలి’ అన్న చందంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ ప్రైవేటు వ్యవహారంలా మార్చుకుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధికార విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ‘ప్రక్రియ’ కాంగ్రెస్దని, వచ్చే ప్రభుత్వం ‘క్రియ’ చేస్తుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో తెలంగాణపై అనుమానాలొస్తున్నాయన్నారు. ఆంటోనీ కమిటీపైనా స్పష్టత లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రక్రియపై సుదీర్ఘ చర్చ కొనసాగిన తర్వాత ఆంటోనీ కమిటీ ఎందుకని, దానికున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. -
మోడీ అంటే త్రీడీ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే హైదరాబాద్ సదస్సు దేశానికో వెలుగురేఖ వంటిదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షుభితమైన దేశాన్ని కాపాడి, ఉత్తమ అభివృద్ధి మార్గం వైపు మళ్లించేందుకు తమ పార్టీ చేస్తున్న యత్నంలో భాగమే ఈ సదస్సని చెప్పారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సదస్సు ఏర్పాట్లను ఆయన పార్టీ నాయకులతో కలిసి శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... దేశం యావత్తు మోడీ ఏం చెబుతారోనని ఎదురుచూస్తోందన్నారు. మోడీ అంటే 3డీ (డైనమిక్, డెసెసివ్, డెవలప్మెంట్- ధీరత్వం, నిర్ణయాత్మకం, అభివృద్ధి) అని చెప్పారు. దేశాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ను సాగనంపాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ ఎజెండాతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని, దేశ సమస్యలపై పార్టీ నిర్వహించే వంద సదస్సులో హైదరాబాద్ సభ మొదటిదని తెలిపారు. త్వరలో 542 నియోజకవర్గాల సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. అవినీతి, అరాచకాలపై నరేంద్ర మోడీ దండెత్తుతారని, యువతీయువకులు మోడీయే తమ నాయకుడని భావిస్తున్నారని ఆయన వివరించారు. యువత తరలివస్తోంది: కిషన్రెడ్డి మోడీ సదస్సు రాష్ట్ర యువతకే పరిమితం కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. రాజకీయ అస్థిరత, అసమర్థ నాయకత్వాన్ని పారదోలాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విశాఖపట్నానికి చెందిన పారిశ్రామిక వేత్తలు పి.సాంబమూర్తి, అమూల్ జైన్, ఎల్.శ్రీనివాస్, హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తదితరులు శనివారం పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీ హవాను ఎవ్వరూ ఆపలేరన్నారు. శ్రీకృష్ణ కమిటీయే ఓ పనికి మాలిన కమిటీ అనుకుంటే ఆంటోనీ కమిటీ అంతకుమించినదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అసమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయమే మోడీ అని నాగం జనార్దన్రెడ్డి చెప్పారు. రాష్ట్రవిభజనపై సీఎం కిరణ్ వ్యాఖ్యలు దుర్మార్గమైనవని విమర్శించారు. ఓ ప్రాంత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నందుకు కిరణ్కుమార్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఆచారీ తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతులు, సాధువుల్ని కలవనున్న మోడీ.. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొనే నరేంద్ర మోడీ విద్యార్థులు, మేధావులతో భేటీ అవుతారు. స్టేడియంలో సదస్సు అనంతరం నేరుగా ఆయన అక్కడకు వెళతారు. 15 మంది పీఠాధిపతులు, మరికొంతమంది సాధువులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపి ఆశీర్వాదం తీసుకుంటారని తెలిసింది. -
అధికార పార్టీ సభ్యుల తీరుపై వెంకయ్య ఆగ్రహం
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు వ్యవహారిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఆందోళనలు చేయడమేంటని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్జైట్లీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. సభ్యుల ఆందోళన తీరును నిరసిస్తూ బీజేపీ సభ్యలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తమ ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసనలు తెలిపారు.