MBBS seats
-
మెడికల్ కలపై కత్తి!
సాక్షి, అమరావతి: రెండేళ్లలో ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లు..! కూటమి సర్కారు కక్షపూరిత విధా నాలతో మన రాష్ట్రం నష్టపోతున్న వైద్య సీట్ల సంఖ్య ఇదీ! ఎన్ఎంసీని ఒప్పించి ఒక్కో మెడికల్ సీటు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటిది.. ఇచ్చిన సీట్లను సైతం కాలదన్నే సర్కారును ఏమనాలి? సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు మన విద్యార్థుల వైద్య విద్య కలలను ఛిద్రం చేస్తున్నాయి. ఇప్ప టికే దాదాపుగా సిద్ధమైన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు ‘పీపీపీ’ పాట పాడుతూ మన విద్యార్థులకు తీరని ద్రోహం తలపెడుతోంది. కూటమి ప్రభుత్వం నిర్వాకాలతో ఈ విద్యా సంవత్సరంలో అదనంగా సమకూ రాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లను మన రాష్ట్రం కోల్పోయింది. దీంతో నీట్ యూజీలో ఉత్తమ స్కోర్ చేసినప్పటికీ సీటు దక్కక బీసీ, ఎస్సీ విద్యా ర్థులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త వైద్య కళాశాలల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది. నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్కు అప్పగించడం కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ను నియ మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కూట మి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కళాశాలల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ నిర్మాణాలు దెబ్బ తినకుండా సేఫ్గా క్లోజ్ చేసేందుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా .700 సీట్లకు మోకాలడ్డు..పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు వైద్య కళాశాలలు వైఎస్సార్ సీపీ హయాంలోనే 2023–24లో ప్రారంభం కాగా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో కేవలం 50 సీట్లతో ఒక కళాశాల మాత్రమే అందుబాటులోకి వచ్చింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా లేఖ రాసి అనుమతులు రద్దు చేయించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది.నీట్లో మంచి స్కోర్ సాధించినావైద్య విద్యలో ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా రాష్ట్రంలో సీట్లు పెరగలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం నీట్లో 600 వరకూ స్కోర్ చేసినప్పటికీ ఓసీ విద్యార్థులు, 500 పైబడి మార్కులు సాధించినా బీసీ, ఎస్సీ విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం లభించక అన్యాయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో 2025–26లో అయినా కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే సీట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకుని ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరకుండా చాలా మంది విద్యార్థులు నీట్–2025కు సన్నద్ధం అవుతున్నారు.కానీ కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించేలా చర్యలు తీసుకోకుండా ఇప్పటికే దాదాపుగా సిద్ధమైన వాటిని సైతం ప్రైవేట్ పరం చేసేలా అడుగులు వేయటాన్ని విద్యా రంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.మరో ఏడు కాలేజీల్లోమరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురంలో నూతన వైద్య కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాల్సి ఉంది. వీటితో పాటు ఈ ఏడాది నిలిచిపోయిన మిగిలిన నాలుగు మెడికల్ కళాశాలలు, పాడేరులో సీట్లు పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో ఏకంగా 1,750 సీట్లు చొప్పున మొత్తంగా రెండేళ్లలో మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు.ఏడు నెలల్లో అస్తవ్యస్థం..వైద్య కళాశాలల్లో సౌకర్యాలు లేకుంటే వాటిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అదనపు బడ్జెట్ కేటా యించి ఎంబీబీఎస్ సీట్లు రాబట్టేలా చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా వచ్చిన సీట్లు సైతం వద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. విజనరీ అని చెప్పుకునే నాయకుడు భవిష్యత్తు తరాలకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా పీపీపీ అంటూ పేద, మధ్య తరగతి పిల్లలకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. పీజీ ఫీజులపై స్పష్టత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సీట్ లభించి కళాశాలల్లో చేరిన వారిని ఎంత ఫీజు కట్టాలోననే ఆందోళన వెంటాడుతోంది. ఏడు నెలల పాలనలో రాష్ట్రంలో వైద్య విద్యను అస్తవ్యస్థంగా మార్చారు. – ఈశ్వరయ్య, పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
నలుగురు కూతుళ్ళకు MBBS సీట్లు
-
కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీకి అనుమతులు రావడం గమనార్హం.తాజాగా అందుబాటులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతం రెండో రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 20–25 సీట్లు ఆ కోటాలో ఖాళీగా ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని వెల్లడించాయి.ఇలావుండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 29కి చేరింది. వాటిలో మల్లారెడ్డి గ్రూపునకు చెందిన రెండు మెడికల్ కాలేజీలు ఈ ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. అందులోని సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునే అవకాశముంది. రాష్ట్ర కౌన్సెలింగ్తో సంబంధం ఉండదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించే ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 27కే పరిమితం అయింది. ఈ కాలేజీలన్నీ కలిపి 4,550 సీట్లున్నాయి. -
మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ. బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.14 వరకూ ఫ్రీ ఎగ్జిట్కు అవకాశం ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. -
దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ సీట్లలో దివ్యాంగ కోటాకు కేటాయించిన 121 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విభాగంలో మొత్తం 182 సీట్లు ఉండగా 61 మంది మాత్రమే అర్హులైన విద్యార్థులున్నారు. వీరందరికీ ఆదివారం హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించింది. విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి. మిగిలిపోయిన 121 సీట్లను ఆర్ఓఆర్ ఆధారంగా సాధారణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఆలస్య రుసుము లేకుండానే.. 2024–25 విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా సోమవారం రాత్రి 9 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియగా, శని, ఆది, సోమవారాల్లో ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తొలుత అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము కన్నా ఆలస్య రుసుముతో విధించిన పెనాల్టీ అధికంగా ఉందని అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆలస్య రుసుమును మినహాయించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 8,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎన్ఎంసీ షెడ్యూల్కు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్రకటిస్తామన్నారు. -
ప్రభుత్వ వైద్యమూ.. పేదలకు దూరం!
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్యం.. కూటమి ప్రభుత్వ తీరుతో ఇక క్రమంగా దూరం కాబోతుంది. ప్రభుత్వ వైద్యానికీ, చికిత్సలకు కూడా డబ్బులు కట్టే పరిస్థితులు రాబోతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకుంటూ.. ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేయిస్తూ.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వైద్య విప్లవానికి పూర్తిగా తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేద ప్రజలకు చేరువ చేసేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఏకంగా 17 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలిదశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై మోజుతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి నీట్ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అలాగే బోధనాస్పత్రుల ఏర్పాటుకు అడ్డుపడి పేదల వైద్యానికి గండి కొట్టింది. టెరిషరీ కేర్ బలోపేతమే లక్ష్యంగా..ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని మూడు లేయర్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది. ప్రైమరీ కేర్లో విలేజ్ క్లీనిక్లు, పీహెచ్సీలు, సెకండరీ కేర్లో సీహెచ్ïÜలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్లో బోధనాస్పత్రులు, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. ప్రజలు తీవ్రమైన జబ్బుల బారినపడినప్పుడు మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ కీలక పాత్ర పోషిస్తుంది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి టెరిషరీ కేర్ ఆస్పత్రులను చేరుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తద్వారా అప్పటి వరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలు ఉన్న చోట.. ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రులు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించింది. గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ తదితర రోగాలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు.. వైద్యులు, అధునాత పరికరాలు, సిబ్బందిని సమకూర్చేలా కార్యాచరణ రూపొందించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. విద్య, వైద్యంతో ప్రజలకు మేలు..కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. ఇప్పటివరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు ఉన్న చోట్ల బోధనాస్పత్రులు ఏర్పాటైతే నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్లు సమకూరి.. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఎంబీబీఎస్లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత హౌస్ సర్జన్లుగా అందుబాటులోకి వస్తారు. వీరు నిరంతరం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సేవలు మరింత మెరుగవుతాయి. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరితే.. స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరిగేది. పేదల్లో ఆందోళనచంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానంతో ఉచిత వైద్య సేవలపై పేదల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేట్ వ్యక్తులకు కొత్త మెడికల్ కాలేజీలను అప్పగిస్తే వారి అజమాయిషీలో నడిచే బోధనాస్పత్రుల్లో వైద్య సేవల కోసం ప్రజలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చేరువలోనే మెరుగైన వైద్యసేవలువందల ఏళ్ల చరిత్ర కలిగిన బందరు నగరంలో 2019 ముందు వరకూ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవు. తీవ్ర అనారోగ్యం పాలైన వారు 70 కి.మీ ప్రయాణించి విజయవాడకు వెళ్లేవాళ్లు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీ నెలకొల్పింది. అప్పటి వరకు 300 పడకలుగా ఉన్న జిల్లా ఆస్పత్రిని.. 600 పడకల బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. 60కి లోపు వైద్యులు ఉండే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వంద మంది వరకూ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. స్టాఫ్ నర్సులు, ఇతర సహాయక సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 700 మేర ఓపీలు నమోదు అవుతున్నాయి.వ్యయ ప్రయాసలు తగ్గాయిగతంలో మచిలీపట్నంలో జిల్లా ఆస్పత్రి ఉండేది. కానీ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలకు కూడా విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, ఇతర రోగులు 70 కి.మీ దూరం ప్రయాణించి విజయవాడకు వెళ్లేలోగా ప్రాణాపాయం సంభవించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం బోధనాస్పత్రి ఏర్పాటు చేయడంతో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. గతంతో పోలిస్తే సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్పై మోజుతో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేస్తే పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆస్పత్రి నడిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. – ఎ. గాంధీ, మచిలీపట్నంప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు చేటు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమా జానికి హానికరం. ప్రభుత్వం ఏదైనా కానీ.. ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు, పనులను కొనసాగించాలి.అలా చేయకుండా మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దనడం, కాలేజీల నిర్మాణాలను ఆపేయడం వంటి పనులు హర్షణీయం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఏర్పాటైతే.. అంతగా పేదలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళ్లడం వల్ల.. పేదల ప్రయోజనాలు దెబ్బతింటాయి. చికిత్సలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య,చైర్మన్, రాష్ట్ర ప్రజారోగ్య వేదిక -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాను శుక్రవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. విద్యార్థులు ఆయా క ళాశాలల్లో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూ డు గంటల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. క్యాప్ కోటా జాబితా విడుదలచిల్ర్డన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ (క్యాప్) విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రయారిటీ జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తగ్గించిన నీట్ ఎండీఎస్–2024 కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎండీఎస్ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును అడ్డుకున్న కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. మంగళవారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం బడాబాబుల చేతుల్లో పెట్టేందుకు ప్రయతి్నస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను కార్పొరేట్ విద్యగా మార్చి.. పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో వచ్చే రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు సుమారు 1,750 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తక్షణమే పులివెందుల కాలేజీకి 50 సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ నెల 19న నిర్వహించబోతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ఓ, పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘాలు నేతలు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కలలపై కూటమి కుట్ర: ఎంపీ డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తున్న పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటుపరం చేసి సంపన్నులకే ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయడం దారుణం. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకతో పోల్చిచూస్తే.. ఏపీలో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో సైతం కోత విధిస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచడంతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
'టాప్లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? ⇒ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? ⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? ⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్లకు ఆలోచన చేయడం ఏంటి? ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? ⇒ కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? కోవిడ్లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే ⇒ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు. ⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్సీలకు, పీహెచ్సీలకు, విలేజ్ క్లినిక్స్కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలుగా హోదా తెచ్చుకుని.. ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడమేకాదు.. ఫీజులను ఇష్టారీతిన పెంచుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతులు తెచ్చుకుంటాయి. ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలకు ఈ తీరు దెబ్బకొట్టనుంది. ఇప్పటికే రెండు కాలేజీలకు.. ఇటీవలే మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. అపోలో, సీఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. మున్ముందు మరికొన్ని కాలేజీలు ఇదే బాటన నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ పరిణామాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకుంటూ పోతే ఎలాగని.. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం.. రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా.. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కనీ్వనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో సగం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే. డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కనీ్వనర్ కోటా సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోతాయి. మొత్తం సీట్లన్నీ కాలేజీల చేతిలోకే వెళ్లిపోతాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 200 సీట్లు కనీ్వనర్ కోటాలోకి రావాలి.కానీ వాటికి డీమ్డ్ వర్సిటీ హోదా రావడంతో.. అవన్నీ మేనేజ్మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఇక డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో స్థానిక అభ్యర్థులకు కోటా ఉండదు. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా వచ్చి చేరవచ్చు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం కూడా యాజమాన్యాలకే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలే నిర్వహించుకుంటాయి. అంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తిగా యాజమాన్యాల సొంత రాజ్యాలుగా మారిపోతాయి. కనీ్వనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులే దక్కించుకుంటారు. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండటంతో వారికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ నష్టదాయకమేకావడం ఆందోళనకరం. -
స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఢిల్లీ: స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించవని ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని తెలంగాణ తరఫు సీనియర్ నాయకుడు గోపాల్ శంకర్ నారాయణ సుప్రీం కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.చదవండి: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నీలినీడలు -
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. ముమ్మర ప్రయత్నాలు... ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా.. వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా (ఎంక్యూ) సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు. సీట్ వస్తుందో.. లేదోనీట్ యూజీలో మంచి స్కోర్ సాధించిన వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంక్లు పెరిగిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో, లేదో అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంక్ల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొనసాగుతున్న రెండో విడత పరిశీలన విద్యార్థుల దరఖాస్తులను రెండు విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. రెండో విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది. భారీగా పెరిగిన కటాఫ్.. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సెలింగ్లో భారీగా కటాఫ్ స్కోర్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సెలింగ్లో అన్ రిజర్వుడ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది. ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్కు చివరి సీటు వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చినవారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్కు పైన చేసిన విద్యార్థుల్లో చాలా మంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటా సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. అయితే ఏఐక్యూ కటాఫ్ గణనీయంగా పెరగడం చూసి.. రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్కు మహర్దశ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా వైద్య రంగాన్ని విస్తృతం చేశారు. మారుమూల ప్రజలకు కూడా అత్యాధునిక వసతులతో స్పెషాలిటీ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలల్లో తరగతుల, వైద్యం ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువవడమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కడ 2023–24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా ఏర్పాటైన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద 2019–20 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 1,585 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లోక్ సభలో వెల్లడించింది. 2018–19లో (నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు 4,900 మాత్రమే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్సభలో తెలిపారు. ఆ తర్వాతి ఐదేళ్లలో (వైఎస్ జగన్ హయాంలో) 1,585 సీట్లు పెరిగి 6,485కు చేరినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కనీసం చర్చించని బాబు సర్కారు.. గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్గా సమావేశం నిర్వహించిన ఎన్ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది. అనుమతులు వస్తే 500 సీట్లు..ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది. -
సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీకి ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోశాధికారి నరసింహారావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకూ తెలంగాణ విద్యార్థులకు 36 శాతం సీట్లు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 36 శాతం సీట్లు కూడా మన విద్యార్థులకే కేటాయించాలని కోరారు. అదే విధంగా కొత్త వైద్య కళా శాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల వాగ్ధానం చేసిందని పేర్కొన్నారు. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లోని రాజీవ్గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి కోటా కింద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంబీబీఎస్లో సీట్ల కేటాయింపునకు స్వస్తి పలకాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు ఆదేశాల మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైపోతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు.రెండు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఏపీలో కాలేజీల్లో కూడా ఇదే విధంగా ఉమ్మడి కోటా అమలవుతోంది. అయితే మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడి విద్యార్థులు అక్కడ దరఖాస్తు చేసుకోవడం తక్కువ. కానీ ఏపీ విద్యార్థులు మాత్రం ఉమ్మడి కోటాను ఉపయోగించుకుని ఇక్కడ సీట్లు పొందుతున్నారు. విభజన చట్టం జూన్ రెండో తేదీతో ముగిసిపోనుంది.దీంతో ప్రభుత్వం కూడా ఏపీతో ముడిపడి ఉన్న అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేస్తే, ఇక నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే వస్తాయి. పీజీ మెడికల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఆ ప్రకారం రానున్న కౌన్సెలింగ్లో నిబంధనలు మార్చాలని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. విభజనకు ముందున్న కాలేజీల్లోనే అమలైన కోటారాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా అమలైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే కోటా అమలు చేసింది. ఈ 20 కా>లేజీల్లో కలిపి 1,950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 200కు పైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు చేస్తే ఇక నుంచి ఆ 200 సీట్లు తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి వస్తాయి.తప్పనిసరిగా రద్దు చేయాలనే రూల్ లేదా?మరోవైపు విభజన చట్టం పదేళ్లతో ముగిసినా ఉమ్మడి కోటాను తప్పనిసరిగా రద్దు చేయాల్సిన రూలేమీ లేదని అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రతిపాదనలపై అసలు చర్చే జరగడం లేదని చెప్పడం గమనార్హం. -
నేడు నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ–2024)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.పెన్ అండ్ పేపర్ మోడ్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది, నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు, పలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.24 లక్షల మందికి పైగా..ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. అయితే గతేడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 42,836 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 70 వేల మందికిపైగా పరీక్ష రాసే అవకాశం ఉంది. 706 కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లునీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మరో 500 సీట్లు కొత్తగా సమకూరనున్నాయి.విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు∗ పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.∗ ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.∗ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.∗ ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. -
చంద్రబాబు పేదల ద్రోహి
సాక్షి, అమరావతి: నాటి చంద్రబాబు ప్రభుత్వ పెత్తందారు పోకడలకు కామినేని వ్యాఖ్యలు అద్దంపట్టాయి. విద్య, వైద్యం ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు ప్రయోజనం. ఇందుకోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు వదిలి.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు కొమ్ముకాశారు చంద్రబాబు. ఫలితంగా ఆయన జమానాలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకాకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు కొనలేక వేల మంది పేద విద్యార్థుల వైద్యవిద్య కల కలగానే మిగిలిపోయింది. బాబు సీఎంగా ఉన్న రోజుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుపై చూపిన శ్రద్ధ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఏనాడు చూపలేదు. ఫలితంగా ఆయన పేదల ద్రోహిగా మిగిలిపోయారు. బాబు చూపిన చొరవ శూన్యం.. ‘40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేశా. దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూలేరు’.. అని తరచూ చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు. ఇంత డబ్బా కొట్టుకునే పెద్దమనిషి రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో వైద్య కళాశాలల ఏర్పాటులో చూపెట్టిన శ్రద్ధ మాత్రం గుండుసున్నా. నిజానికి.. 2019లో బాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 కళాశాలలు ఉండగా.. ఆంధ్ర, గుంటూరు వైద్య కళాశాలలు స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటయ్యాయి. టీడీపీ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, కాకినాడ రంగరాయ, తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. అంటే.. టీడీపీ ఆవిర్భవించి ఎన్టీఆర్ సీఎం అయ్యే నాటికే రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలున్నాయి. 1986లో సిద్ధార్థ వైద్య కళాశాలను ఎన్టీఆర్ ప్రభుత్వంలోకి మార్చారు. ఇలా మొత్తంగా 2004 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏడు కళాశాలలు ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్లు ఏర్పాటుచేశారు. నెల్లూరులో ఏసీఎస్సార్ కళాశాల ఏర్పాటుకు వైఎస్సార్ సానుకూలంగా స్పందించగా, ఆయన అకాల మరణం అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కళాశాలను ప్రారంభించింది. ఈ లెక్కన పరిశీలిస్తే మూడుసార్లు సీఎంగా పనిచేసిన బాబు తన జమానాలో ప్రభుత్వ రంగంలో వైద్యవిద్య బలోపేతంపై ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ గెలుపొందింది. కేంద్రంలో భాగస్వామిగా కూడా కొనసాగింది. అప్పుడు కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సాకులు చెప్పి ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చి తన వాళ్ల జేబులు నింపడానికే శ్రద్ధ చూపారు. పేదలకు ద్రోహం చేస్తూ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టారు. దీంతో.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వక మన విద్యార్థులు వైద్యవిద్య కోసం వలసలు వెళ్తున్నా.. చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా రాజగురువు, రామోజీ ఫిల్మ్సిటీ జమిందారు రామోజీ మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించారు. సువర్ణాధ్యాయం లిఖించిన సీఎం జగన్ 2019లో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగంలో ఏకంగా రూ.8వేల కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలని సంకల్పించారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఇందులో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరు కళాశాలలను ప్రారంభించబోతున్నారు. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ సమకూరుస్తున్నారు. వాస్తవానికి.. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కానీ, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా కూడా సీఎం జగన్ ప్రభుత్వం రికార్డుకెక్కింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సీఎం జగన్ వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడానికి కృషిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటైన ప్రైవేట్ వైద్య కళాశాలలు.. -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచి్చనట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచి్చంది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది. ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమరి్పంచని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకలీ్ట, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది. వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
100 ఎంబీబీఎస్ సీట్ల మిగులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 100 వరకు ఎంబీబీఎస్ సీట్లు మిగిలినట్లు అంటున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. వాటికి మాప్ అప్ రౌండ్ నిర్వహించాక మిగిలిన 128 సీట్లను స్ట్రే వేకెన్సీ పద్ధతిలో నింపేందుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన రాలేదని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బీ–కేటగిరీ సీట్లలోనూ కొన్ని సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు 100 వరకు మిగిలినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని కాలేజీలు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు సమాచారం ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఫిజికల్ కౌన్సెలింగ్ రద్దుతో మారిన పరిస్థితి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్కు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లనూ భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ కౌన్సెలింగ్ చేపట్టవద్దని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్లు నిర్వహించాలని, అయినా సీట్లు మిగిలిపోతే వాటిని వదిలేయాలని పేర్కొంది. దీనివల్ల కూడా సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నారు. సహజంగా ఏటా కొన్ని ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుంటాయి. ఎన్ఆర్ఐ సీట్లపై అభ్యర్థుల అనాసక్తి... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. బీ–కేటగిరీ సీట్లలో 85 శాతం వరకు లోకల్కు కేటాయిస్తుండటంతో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్ఆర్ఐలో సీట్లు ఎక్కువగానే ఉన్నా ఫీజులు అధికంగా ఉన్నాయి. బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఎన్ఆర్ఐ కోటా ఫీజులున్నాయి. అంటే ఏటా ఎన్ఆర్ఐ కోటా సీటు ఫీజు రూ. 23 లక్షలకుపైగా ఉంది. దీంతో 723 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లున్నా తక్కువమంది విద్యార్థులే ఆప్షన్లు పెట్టుకున్నారు. చివరకు వెసులుబాట్లు కల్పించినా ఇంకా సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ సీట్లు మిగలడంతో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలు.. డాక్టర్ ‘ఏపీ’!..
సాక్షి, అమరావతి: తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కోరుకుంటున్న వారి కలలు సాకారం కావడంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కావడంతో పేదలకు ఆరోగ్య భరోసా చేకూరుతోంది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీంతో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రావడంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం కొత్త మెడికల్ కాలేజీల్లో 2023–24 ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కేటాయింపు కూడా పూర్తి కానుంది. రిజర్వేషన్ వర్గాలకు భారీ మేలు కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాకు కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ రంగంలోని 12, 18 మైనారిటీ, ప్రైవేట్ కళాశాలల్లో 3,360 కన్వీనర్ కోటా సీట్లు ఉండేవి. ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల ఏర్పాటుతో ఒక్కో చోట 64 చొప్పున 320 సీట్లు కన్వీనర్ కోటాలో అదనంగా వచ్చి చేరాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మెరిట్ విద్యార్థులకు భారీ మేలు చేకూరింది. వలసలకు తెర వైద్య విద్య డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో కజకిస్తాన్, ఉక్రెయిన్, చైనా, రష్యా తదితర దేశాలకు మన విద్యార్థులు వలస వెళుతున్నారు. వీటిని అరికట్టడంతోపాటు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు సీఎం జగన్ రూ.8,480 కోట్ల వ్యయంతో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నారు. ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, ఆ తర్వాత ఏడాది మిగిలిన ఏడు వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా ఏకంగా 2,550 సీట్లు అదనంగా పెరగనున్నాయి. వైద్య విద్య సీట్ల పెరుగుదలతో మన దగ్గర డాక్టర్ చదువులకు అవకాశాలు విస్తృతమై వలసలకు తెర పడనుంది. అన్ని వసతులతో తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం కొత్త ఆస్పత్రుల్లో అన్ని వసతులను కల్పించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రి, కళాశాలలను అభివృద్ధి చేశారు. ఐదు చోట్ల ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చింది. కళాశాలల్లో హైఎండ్ ఏవీ సదుపాయంతో లెక్చర్ గ్యాలరీలు, 3 వేల పుస్తకాలు, ఆన్లైన్, ఆఫ్లైన్ మెడికల్ జర్నల్స్ సేకరణతో సెంట్రల్ లైబ్రరీ, రీడింగ్ ఏరియా, అత్యాధునిక పరికరాలతో ల్యా»ొరేటరీలు, టీచింగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్లలో అన్ని వనరులు సమకూర్చారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు హాస్టళ్లు సిద్ధం చేశారు. భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు ఏ దేశం, రాష్ట్రం అభివృద్ధికైనా విద్య, వైద్య రంగాలు గట్టి పునాదులు. యూరప్తోపాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, క్యూబా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు అనేక రంగాల్లో ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే. దూరదృష్టితో సీఎం జగన్ రేపటి తరాల భవిత కోసం విద్య, వైద్య రంగాలను బలోపేతం వేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నో ప్రయోజనాలు.. ఇన్నాళ్లూ ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు వచ్చినా ఫీజుల భారాన్ని భరించలేక ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కోర్సు పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతోంది. ఇక ఎన్ఎంసీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై హౌస్ సర్జన్ పూర్తి చేసే క్రమంలో రెండు మూడేళ్లు వృథా అవుతోంది. అంతేకాకుండా అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్–లోకల్గా పరిగణిస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం శుభ పరిణామం. ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో పలు ప్రయోజనాలుంటాయి. బోధనాస్పత్రుల్లో అపారమైన క్లినికల్ మెటీరియల్, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉంటారు. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్సలర్, డా. వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్లినికల్ స్కిల్స్ పెరుగుతాయి.. ప్రైవేట్ కళాశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా కొత్త వైద్య కళాశాలల్లో ఎంతో మెరుగైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. 25 ఏళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కళాశాలలు, ఆస్పత్రుల్లో నియమించారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వనరులున్నాయి. దశాబ్దాలుగా సేవలందిస్తున్న జిల్లా ఆస్పత్రులనే బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశాం. దీంతో ఐపీ, ఓపీ, ఇతర సేవలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆస్పత్రులకు అనుసంధానమైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదవడం విద్యార్థులకు ఎంతో మంచిది. విద్యార్థుల్లో క్లినికల్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి భవిష్యత్కు ఎంతో మేలు చేస్తుంది. – డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, చైర్మన్, ఏపీఎంఎస్ఐడీసీ త్వరలో తరగతులు ప్రారంభం ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల 150 ఎంబీబీఎస్ సీట్లకు..
-
ఏపీ విద్యార్థులకే ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు
-
ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే లభించనున్నాయి. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య, దంత కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో వంద శాతం ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ కోర్సుల్లో 100 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లను ఏపీ విద్యార్థులకు కేటాయించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కోరారు. ఈ క్రమంలో మన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డ వైద్య కళాశాలలతోపాటు కొత్తగా మంజూరైన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను సైతం ఏపీ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ కళాశాలల్లో అన్ రిజర్వుడ్ సీట్లు కూడా మనకే దక్కనున్నాయి. ఇప్పటివరకు ఇలా.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటా కింద ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తోంది. కాగా, ఆల్ ఇండియా కోటాకు పోగా మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక, 15 శాతం అన్ రిజర్వుడ్ విభాగాల కింద భర్తీ చేసేవారు. అలాగే ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ఉండేవి. ఈ సీట్లలో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేసేవారు. దీంతో అన్ రిజర్వుడ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులు పోటీపడి సీట్లు పొందుతూ వచ్చారు. ఇక నుంచి ఇలా.. 2014 జూన్ 2 తర్వాత ఏర్పడిన కళాశాలలు, కొత్తగా మంజూరైన సీట్లలో 15 శాతంలోనూ తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే అవకాశం ఉంటుంది. ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలు పొందొచ్చు. దీంతో పాటు వేరే రాష్ట్రంలో చదువుకున్న కాలం మినహాయించి రాష్ట్రంలో పదేళ్లు నివసించిన విద్యార్థులు/పదేళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన పౌరుల పిల్లలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే ప్రైవేటు కళాశాలల్లోని అన్ రిజర్వుడ్ సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. అంటే.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 100 శాతం సీట్లు (ఆల్ ఇండియా కోటా మినహాయించి) ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కనున్నాయి. అన్ రిజర్వుడ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు ఇక అవకాశం ఉండదు. 219 అన్ రిజర్వుడ్ సీట్లు మన విద్యార్థులకే.. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభిస్తోంది. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఉన్నాయి. ప్రతి చోట ఆల్ ఇండియా కోటా 15 శాతం సీట్లు పోగా 128 చొప్పున సీట్లు రాష్ట్ర కోటాలోకి వస్తాయి. వీటితో కలిపి 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కళాశాలల్లో 1,290 సీట్లు రాష్ట్ర కోటాలోకే వస్తాయి. వీటిలో 15 శాతం అంటే 193 సీట్లు అన్ రిజర్వుడ్ విభాగంలో ఉంటాయి. అలాగే 2014 తర్వాత కొత్తగా మంజూరైన సీట్లలో 26కు పైగా సీట్లు అన్ రిజర్వుడ్ విభాగంలోకి వస్తాయి. ఇలా 219 సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మాత్రమే కాకుండా వైద్య విద్య పీజీ సీట్లలోను 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. -
తుది ఉత్తర్వుల మేరకే ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ల అంశంపై తుది తీర్పునకు లోబడే సీట్ల కేటాయింపు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే వారి సర్టిఫి కెట్లను వెరిఫికేషన్ చేయించాలని అధికారులకు చెప్పింది. విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్ ఎలా ఇస్తారని న్యాయ స్థానం సందేహం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు విన్న తర్వాత తేలుస్తామని చెప్పింది. కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థుల కే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జూలై 3న ఇచ్చిన జీవో 72ను కొట్టివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ వైద్య కళాశాలల అడ్మిషన్ నిబంధనలకు సవరణ చేస్తూ ప్రభుత్వం వారం కిత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా జీవోతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన పి.సాయిసిరిలోచనతో పాటు మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టులో పిటిష న్లు దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకో ర్టు విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. -
మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంటే కొత్తగా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది కూడా అందుబాటులోకి వస్తే.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకున్నట్టు అవుతుంది. వీటితో కలిపి రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుతుంది. అంతేకాదు.. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పనుంది. భారీగా పెరిగిన వైద్య సీట్లు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి 3,790కి పెరిగాయి. కొత్తగా రానున్న 8 మెడికల్ కాలేజీల్లో మరో 800 మెడికల్ సీట్లు ఉంటాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,590 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి చూస్తే.. 2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు చేరుకుంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు చేరింది. కొత్త మెడికల్ కాలేజీల సీట్లనూ కలిపితే 9,140 సీట్లకు చేరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల ద్వారా మరికొన్ని సీట్లు రానున్నాయి. అంటే తెలంగాణలో మొత్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా.. సగటున 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2023–24లో దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,118 మెడికల్ సీట్లలో ఒక్క తెలంగాణలోనివే 900 (43 శాతం) కావడం గమనార్హం. ‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ ఇలా.. ► 2014కు ముందు రాష్ట్రంలో గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ (1959), రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఉన్నాయి. ► 2016–17లో మహబూబ్నగర్, సిద్దిపేట జిల్లాల్లో, 2018–19లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటయ్యాయి. ► గత ఏడాది (2022–23)లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ► ఈ ఏడాది (2023–24) కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ► వచ్చే ఏడాది (2024–25)లో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అనతి కాలంలోనే మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను, పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ కావాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అపార అవకాశాలు అందుతున్నాయి. విద్యార్థులు వీటిని సది్వనియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుందనే నినాదానికి ఇదో నిదర్శనం. – హరీశ్రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి -
ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదవాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం, ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ను సవరించారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే సీట్లు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేవి. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉండే సీట్లన్నీ కన్వీనర్ కోటా సీట్లే కాగా, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయాల్సి ఉంటుంది. పాత కాలేజీల్లోనే అన్ రిజర్వుడు కోటా తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతోపాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8,340కి పెరిగాయి. అప్పటి 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి)అందుబాటులో ఉండేవి. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. వీటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం దక్కించుకునేందుకు అవకాశం ఉండటంతో ఆ మేరకు తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోయేవారు. తాజాగా ఈ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు అన్ రిజర్వుడు వర్తించకుండా చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తాయి. గతేడాది నుంచి బీ కేటగిరీలో 85 శాతం తెలంగాణకే... ఇప్పటికే ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా చేయడం (లోకల్ రిజర్వ్) వల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. తాజా నిర్ణయంతో ప్రతి ఏటా మొత్తం 1,820 సీట్లు అదనంగా లభించనున్నాయి. 1,820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. కాగా ప్రతి ఏటా కాలేజీల సంఖ్య పెరిగిన కొద్దీ అదనంగా లభించే సీట్లు పెరగనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు యధాతథంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. రాష్ట్ర విద్యార్థుల డాక్టర్ కల సాకారం చేసే నిర్ణయం ప్రభుత్వం ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు తెలంగాణ బిడ్డలను వైద్య విద్యకు చేరువ చేస్తున్నాయి. మొత్తం 1,820 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేలా ప్రభుత్వం చేసింది. రాష్ట్ర విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హరీశ్రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
2 లక్షల ర్యాంకు దాటినా.. కన్వినర్ సీటు
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంత ర్యాంకుకు ఎంబీబీఎస్లో కన్వినర్ కోటాలో సీటు వస్తుందన్న దానిపై విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. పైగా గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలో 9 కొత్తగా వస్తున్నాయి. అంటే 900 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరుగుతాయి. గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్ సీటు వచ్చే అవకాశం ఉంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో రెండు లక్షలకుపైగా ర్యాంకులు వచ్చి న వారికి కూడా కన్వినర్ కోటాలో సీ ట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చి న వారి కి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు. రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మంగళవారం ‘నీట్’ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చి ంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి నీట్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్రస్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. 15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కేటాయింపు... ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. -
ఎంబీబీఎస్ లో ఫ్రీ సీటు సాధించిన మధుశ్రీ
-
పీజీ వైద్య సీట్ల పంట
సాక్షి, అమరావతి: ఇటు ఎంబీబీఎస్ సీట్లు.. అటు పీజీ సీట్లు! ఒకేసారి కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు అదనంగా 510 పీజీ వైద్య సీట్లతో రాష్ట్ర వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ గేమ్ ఛేంజర్గా అవతరిస్తోంది. ఒక్క ఏడాదిలోనే వీటిని సాధించడం ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర వైద్య విద్యా రంగం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పీజీ సీట్లు పెరుగుతున్నాయి. వైద్య విద్యను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత నాలుగేళ్లలో ఏకంగా 702 పీజీ సీట్లు కొత్తగా సమకూరడం గమనార్హం. అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూనే అప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో వసతులను మెరుగు పరిచారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో వైద్యులు, సిబ్బందిని సమకూర్చడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. ఫలితంగా 1956 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వైద్య సీట్లు పెరిగాయి. పీజీ సీట్లు ఇంకా పెరిగే చాన్స్ రాష్ట్రంలో పది వైద్య కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం వరకూ 966 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్ కళాశాలలో ఒక్క పీజీ సీటు కూడా లేదు. అలాంటిది నాలుగేళ్లలో వరుసగా 2020లో 24 సీట్లు, 2021లో 31 సీట్లు, 2022లో 137 సీట్లు చొప్పున రాష్ట్రానికి అదనంగా పీజీ సీట్లు సమకూరాయి. 2023లో 737 సీట్లు పెంచాలని ఎన్ఎంసీకి ప్రతిపాదించగా ఇప్పటి వరకు 510 సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన సీట్ల పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల ప్రవేశాలకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా మరికొన్ని సీట్లు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగేళ్లలోనే ఏకంగా 702 సీట్లు పెరగడంతో ఇప్పటికే 1,668 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 42.08 శాతం సీట్లు పెరిగాయి. ఏసీఎస్ఆర్ కళాశాల కూడా పీజీ సీట్లలో బోణీ కొట్టింది. ప్రస్తుతం ఆ కళాశాలలోనూ 24 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరాయి. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. పీజీ సీట్లు పెరగడంతో స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు సత్వరమే, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీట్ల పెంపుతో పలు లాభాలు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడం వల్ల చాలా లాభాలుంటాయి. రీసెర్చ్ కార్యకలాపాలు, రోగులకు వైద్యుల అందుబాటు పెరుగుతుంది. మన ఆస్పత్రుల్లో నిత్యం వేల సంఖ్యలో ఓపీలు, ఐపీలు నమోదవుతుంటాయి. వీటిద్వారా రీసెర్చ్ కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వం సైతం రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు. పీజీ సీట్లు పెరగడంవల్ల చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. – కంచర్ల సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ భారీగా పోస్టుల భర్తీ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య సీట్లు పెరగాలంటే ఆయా విభాగాల్లో తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది విధిగా ఉండాలి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కో ప్రొఫెసర్కు 3 పీజీ సీట్లు, అసోసియేట్ ప్రొఫెసర్కు 2 పీజీ సీట్ల చొప్పున ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డీఎంఈలో 106 ప్రొఫెసర్, 312 అసోసియేట్ ప్రొఫెసర్, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కొత్తగా సృష్టించారు. వీటితో కలిపి 1,585 పోస్టులను ఇప్పటివరకూ భర్తీ చేశారు. పదోన్నతుల ద్వారా 500 వరకూ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యాయి. -
ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం: మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర’’ అని మంత్రి రజిని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశాం’’ అనిమంత్రి విడదల రజిని తెలిపారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది -
కొడుకా మంచి మార్కులతోనే పాసయ్యావు కదరా..
వరంగల్: ‘మమ్మి.. డాడీ ఐయామ్ సారీ.. ఎంబీబీఎస్ సీటు రాదేమోనని అనిపిస్తుంది’ అని సూసైడ్ నోట్ రాసి ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న ఓ విద్యార్థి.. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఏ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించగా, కుమారుడి రిజల్ట్ చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండా జీపీ శివారు బోడగుట్టతండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతిల పెద్దకుమారుడైన కృష్ణ ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటరీ్మడియట్(బైపీసీ)చదివి, పరీక్షలు రాసి వచ్చాడు. ఎంబీబీఎస్ సీటు సాధించాలనే లక్ష్యంతో నీట్ ప్రిపేర్ అవుతున్న క్రమంలో, గత నెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో క్రిష్ణ (బైపీసీ సెకండియర్) 892/1000 మార్కులు సా ధించి ఏ గ్రేడ్లో పాసయ్యాడు. కొడుకు రిజల్ట్ చూ సిన అతడి తల్లిదండ్రులు.. ‘కొడుకా నువ్వు మంచి మార్కులతోనే పాసయ్యావు కదరా, తొందరపడి మమ్మల్ని వదిలి పోతివి కదరా..బిడ్డా’ అంటూ జ్ఞాపకాలను తలచుకుంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. -
5 కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది అడ్మిషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వరుసగా మూడేళ్లలో 750, 750, 1,050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వైద్య విద్యా రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 2024–25లో మరో ఐదు కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన.. రానున్న విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిల్లో కొత్త వైద్య కళాశాలల అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నారు. మచిలీపట్నం మినహా మిగిలిన నాలుగు చోట్ల ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరనున్నాయి. అదనపు భవనాలు, పడకలు 2024–25లో అకడమిక్ కార్యకలాపాలు మొదలయ్యే వాటిల్లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలున్నాయి. పాడేరులో ఇప్పటికే 150 పడకల ప్రభుత్వాస్పత్రి ఉండగా మిగిలిన నాలుగు చోట్ల వంద పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే 330 పడకల సామర్థ్యం కలిగిన బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్ది అదనపు భవనాల నిర్మాణం, పడకల పెంపు చేపట్టనున్నారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలు 2025–26లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయనున్నారు. చేరువలో స్పెషాలిటీ వైద్యం కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలపై లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు మొదలవుతాయి. అనంతరం మరో ఐదు కళాశాలల్లో ప్రారంభించేలా కృషి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయడం సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి -
ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ మేటి
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: ఎంబీబీఎస్ సీట్ల విషయమై దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో కర్ణాటక(17), తమిళనాడు(15), గుజరాత్(10), మహారాష్ట్ర(9) సీట్లు ఉన్నాయన్నారు. తలసరి పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, ప్రతి లక్ష జనాభాకు 2.77 మంది పీజీ డాక్టర్లు తయారవుతున్నారని, అతి త్వరలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 929 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు మంత్రి హరీశ్ శనివారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలను అందించాలని, బదిలీల కోసం ప్రయత్నం చేయొద్దని కోరారు. 81 వేల నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారని, మీరే మొదటి రిక్రూట్మెంట్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్య, ఆరోగ్యశాఖలో ఇప్పటివరకు 21,202 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మరో 10వేల ఉద్యోగాలు భర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 17కు చేర్చగలిగామని, ఎంబీబీఎస్ సీట్లను 6,615 సీట్లకు పెంచగలిగామని పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఏడాదికి 8 చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని, దీంతో ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసినట్లు అవుతుందని అన్నారు. తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉంటుందన్నారు. గొప్ప డాక్టర్లుగా పేరుపొందాలి గ్రామీణులకు, పేదలకు మంచి వైద్యం అందించి గొప్ప డాక్టర్లుగా పేరు పొందాలని, ప్రజల మన్నలను పొందాలని మంత్రి హరీశ్ ఆకాంక్షించారు. మెడికల్ సర్వీసెస్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
TS:వైద్య విద్య చరిత్రలో రికార్డు.. 6.50లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో రికార్డు ఇది. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు లక్షలాది ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్లో సీట్లు దక్కుతున్నాయి. గతేడాది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీటు నీట్లో 2.70 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు రాగా, ఈసారి ఏకంగా 6.50 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కడం రికార్డు అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎన్ఆర్ఐ కోటాలోనైతే గతేడాది 9 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి దాదాపు 10 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీటు వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 85% రిజర్వేషన్తో తగ్గిన కటాఫ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వంలో అన్నీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు కనీ్వనర్ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. ప్రైవేట్లో సగం సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. 50 శాతంలో 35 శాతం బీ కేటగిరీ, మరో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయిస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వంలో రూ. 10 వేలు, ప్రైవేట్లో రూ. 60 వేలు ఏడాది ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలు ఏడాదికి, ఎన్ఆర్ఐ ఫీజు బీ కేటగిరీకి రెట్టింపు వరకు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం పెంచిన మెడికల్ కాలేజీలతో మంచి ర్యాంకులు వచి్చన విద్యార్థులకు అందులో కన్వీనర్ కోటా సీట్లు రాగా, మిగిలిన విద్యార్థులకు బీ–కేటగిరీ సీట్లు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బీ–కేటగిరీలో 85% స్థానిక రిజర్వేషన్ తీసుకురావడంతో వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కాయి. అందుకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తక్కువ మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో 6.50 లక్షల ర్యాంకు వచి్చన విద్యార్థులకు కూడా ఈసారి బీ– కేటగిరీలో సీట్లు దక్కా యని చెబుతున్నారు. దీంతో భారీగా కటాఫ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సీట్లు 188.. ప్రస్తుతం అన్ని కేటగిరీలకు చెందిన సీట్లకు మాప్ రౌండ్ వరకు సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో స్పెషల్ రౌండ్ నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి మాప్ రౌండ్తోనే కౌన్సెలింగ్ ముగిస్తారు. కానీ బీ, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల మిగులుతో మరో రౌండ్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కల ప్రకారం బీ,సీ–కేటగిరీల్లో 188 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. గతేడాది 144 ఎంబీబీఎస్ సీట్లు మిగిలా యి. కొందరు చేరాక సీట్లు వదులుకోవడం, కొందరు బ్లాక్ చేయడం, కొన్ని కాలే జీల్లో ఎన్ఆర్ఐ సీట్లకు భారీ ఫీజులు ఉండటంతో చేరకపోవడం ఇందుకు కారణం. చదవండి: విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు.. -
ఎంబీబీఎస్ సీట్లు 87% పెరిగాయ్
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 87%, పీజీ మెడికల్ సీట్లు 105% పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. గురువారం ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం 2014 తర్వాత పలు చర్యలు చేపట్టిందన్నారు. ఫలితంగా, 2014లో 387 మెడికల్ కాలేజీలుండగా, 2022 కల్లా వాటి సంఖ్య 648కి పెరిగిందన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 96%, ప్రైవేట్ కళాశాలల సంఖ్య 42% పెరిగిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 355 ప్రభుత్వ, 293 ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయని తెలిపారు. అదేవిధంగా, 2014లో ఎంబీబీఎస్ కాలేజీల్లో 51,348 సీట్లుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 96,077కు చేరిందన్నారు. 2014లో 31,185 పీజీ మెడికల్ సీట్లుండగా, 2022కు వచ్చే సరికి అవి 63,842కు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచాలనే లక్ష్యంతో 16 రాష్ట్రాల్లోని 58 కాలేజీలకు గాను 3,877 ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఇదే విధంగా, 21 రాష్ట్రాల్లోని 72 మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో 4,058 పీజీ సీట్ల పెంపునకు అనుమతించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) ద్వారా 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు, 75 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. -
2.28 లక్షల ర్యాంక్కు.. ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరగడంతో ఈసారి తక్కువ మార్కులు.. ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా మూడో విడత కౌన్సెలింగ్ ఉంది. అందులో సీట్లు మిగిలితే మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. రెండో విడతలో బీసీ ‘ఏ’కేటగిరీ కింద, నీట్లో 2,28,059వ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఎంబీబీఎస్లో సీటు వచ్చింది. ఆ విద్యార్థికి 360 మార్కులు వచ్చాయి. ఇంత తక్కువ మార్కులకు, ఎక్కువ ర్యాంకుకు సీటు రావడం ఇదే తొలిసారని కాళోజీ వర్సిటీ వర్గాలంటున్నాయి. జనరల్ కోటాలో 451 మార్కులతో 1,25,070వ ర్యాంకు పొందిన విద్యార్థికి కూడా ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడి ర్యాంకుల కంటే ఇక్కడ రెట్టింపు ఉన్నా తెలంగాణలో సీటు రావడం గమనార్హం. పెరిగిన సీట్లతో చిగురించిన ఆశలు రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. అవన్నీ కూడా కన్వీనర్ సీట్లే కావడం గమనార్హం. ప్రభుత్వ కాలేజీల్లో అన్నిసీట్లు, ప్రైవేట్లో సగం సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారు. ప్రైవేట్లో ఏడాదికి రూ.60 వేలు, ప్రభుత్వంలో ఏడాదికి రూ.10 వేల ఫీజు ఉంటుంది. ఇంత తక్కువ ఫీజు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ సీట్లకు గట్టి పోటీ ఉంటుంది. కాగా, గత వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 3,303 ఉండగా, ఈ ఏడాది మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 4,425కు పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ఏకంగా 1,122 సీట్లు పెరిగాయి. దీంతో ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. మరోవైపు బీ కేటగిరీలో స్థానిక రిజర్వేషన్ను 85 శాతం చేయడంతో అదనంగా వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. దీంతో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,021 మందితో తుది మెరిట్ జాబితా విడుదల చేయగా ఇందులో 1,042 మందికి సీట్లు కేటాయించారు. తొలి దశలోనే బీ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇందులో 233 సీట్లలో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించారు. మిగిలిన 809 సీట్లలో కేవలం ఏపీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించాయి. బీఎస్సీ నర్సింగ్లో నేటి నుంచి వెబ్ ఆప్షన్లు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి రెండో దశ వెబ్ కౌన్సెలింగ్కు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. https://ugpostbasic.ntruhs admi ssions.com వెబ్సైట్లో తుది జాబితాలో పేర్లు న్న విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి. రిపోర్ట్ చేయని వారు 208 మంది.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు తొలి దశ కౌన్సెలింగ్లో 3,289 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 208 మంది విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. వీరి వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్ల వివరాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది 14 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య 11 వేల లోపునకే పరిమితమైంది. 10,782 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర కోటాలో 1,865 సీట్లు.. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,185 సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 1,860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు 16 ప్రైవేట్, రెండు మైనార్టీ కళాశాలల్లో 3 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లను బీ, సీ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో 175 సీట్లు ఉండగా 126 రాష్ట్ర కోటాలో, 26 ఆల్ ఇండియా కోటాలో, 23 ఎన్నారై కోటా కింద భర్తీ అవుతాయి. ఇలా మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, ఇతర కళాశాలల్లో మొత్తం 5,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాల కోసం https://ugcq.ntruhs admissions.com/ చూడొచ్చు. అన్ని కౌన్సెలింగ్లకు వన్టైమ్ ఆప్షన్ విధానం.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్లైన్ కౌన్సెలింగ్లో భాగంగా ఆప్షన్ల నమోదుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం (నవంబర్ 8) రాత్రి ఏడు గంటల్లోగా ఆప్షన్లను నమోదు చేయాలి. ఒక్కసారి ఆప్షన్లు నమోదు చేస్తే చాలు.. వీటినే అన్ని విడతల కౌన్సెలింగ్కు పరిగణనలోకి తీసుకుంటారు. రీటెయిన్ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో తొలి దశలోనే సీటు వస్తే.. ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సెలింగ్లకు పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థుల మొగ్గు ఆంధ్రా వైద్య కళాశాలకే.. విద్యార్థుల మొగ్గు విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ రంగరాయ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. గతేడాది ఆంధ్రా కళాశాలలో ఎస్టీ కేటగిరీలో 472 స్కోరుతో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఇక ఎస్సీల్లో 79,876 ర్యాంక్, బీసీ కేటగిరీలో 32,693 ర్యాంక్, ఓసీల్లో 15,824 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్లో 20,137 ర్యాంక్ తుది కటాఫ్ ర్యాంకులుగా నిలిచాయి. ఆప్షన్ల నమోదులో జాగ్రత్త.. విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్లు భర్తీ అయ్యేంత వరకూ మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్లు చేపడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించొచ్చు. – డాక్టర్ శ్యామ్ప్రసాద్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
ప్రైవేటు మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా బీ కేటగిరీ సీట్లలో స్థానికులకు (తెలంగాణ ప్రాంతం వారికి) 85% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా ఉంటుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ శాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా బీ కేటగిరీ కింద 35 శాతం సీట్లు (మైనారిటీ కాలేజీల్లో 25 శాతం సీట్లు) కేటాయిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇందులో 85% తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 ప్రైవేటు మెడికల్ కళాశాలలుండగా, వాటిల్లో 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు లభించనున్నాయి. అదనపు సీట్లు ఇలా.. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లున్నాయి. ఆ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు నీట్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉంది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనలతో బీ కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా 15 శాతం (168) సీట్లకు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే వీలు ఉంటుంది. ఓపెన్ కోటా కాబట్టి ఇందులోనూ తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. ఇతర రాష్ట్రాల వారికి చెక్ ఇప్పటివరకు బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఎక్కువ ఫీజు చెల్లించి ఎన్ఆర్ఐ కోటా సీట్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. బీ కేటగిరీ ఫీజుకు రెండింతలు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు చెల్లించాల్సి వచ్చేది. లేదా ఇతర రాష్ట్రాలకు, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఎక్కువ ఫీజుతో చేరాల్సి వచ్చేది. దీనిపై మంత్రి హరీశ్రావు ఆదేశం మేరకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని బీ కేటగిరీ సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేయడం గమనార్హం. రాష్ట్రంలోనే డాక్టర్ కల సాకారం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ కావాలనే కలను రాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతోమందికి దీనిద్వారా గొప్ప అవకాశం కల్పించింది. – హరీశ్రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
ఎంబీబీఎస్ సీట్లలో రాష్ట్రానికి ఏడో స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో తమిళనాడు 10,725 సీట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాత కర్ణాటకలో 10,145 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో 9,895 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 9,053 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 5,040 సీట్లున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయితే వచ్చే వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Üసంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త కాలేజీలు రానున్న సంగతి తెలిసిందే. తద్వారా మరో 1,200 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వస్తాయి. అయితే జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఈ సీట్లకు అనుమతి ఇస్తున్నట్లు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 91,927 ఎంబీబీఎస్ సీట్లు.. ఇటీవల నిర్వహించిన నీట్– 2022 పరీక్ష ఫలితాలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్లో చేరే విద్యార్థులు ఎక్కడెక్కడ కాలేజీలున్నాయి.. తమకు వచ్చే ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుందనే దానిపై గతేడాది లెక్కల ప్రకారం అంచనాలు వేస్తున్నారు. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2017–18 లో 67,523 సీట్లుంటే.. ఇప్పుడు ఏకంగా 91,927 సీట్లు అందుబాటు ఉండటం గమనార్హం. జిప్మర్, ఎయిమ్స్తోపాటు ఈ సీట్ల సంఖ్యను కేంద్రం ప్రకటించింది. మొత్తం 322 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 48,212 సీట్లుంటే, 290 ప్రైవేట్ మెడికల్ కాలే జీల్లో 43,915 సీట్లున్నాయి. అంటే ప్రైవేట్లో కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ సీట్లున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 11 ప్రభుత్వ మెడికల్ కాలే జీల్లో 1,840 ఎంబీబీఎస్ సీట్లుంటే, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,200 సీట్లున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ సారి కటాఫ్ తగ్గే అవకాశం.. కేంద్రం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 4,058 పీజీ మెడికల్ సీట్లకు అనుమతి ఇవ్వగా, అందులో తెలంగాణలో 279 సీట్లు పెరిగాయి. మరో పక్క ఈసారి నీట్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు అంచనా వేశారు. కాబట్టి గతేడాది కంటే ఈసారి పది మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020 నీట్లో జనరల్ కటాఫ్ 147, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 113 మార్కులకు ఉంది. 2021 నీట్లో జనరల్ కటాఫ్ 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 108గా ఉంది. ఈసారి జనరల్ కటాఫ్ 125–130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్ష ర్యాంకు వరకు వచ్చినా కూడా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. -
వచ్చే ఏడాది నుంచి కొత్తగా 5 వైద్య కళాశాలలు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం 2023–24 నుంచి ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలోని కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం అనుమతిచ్చింది. దీంతో ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లతో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను నియమించారు. ఆయా జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా మార్పు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అఫ్లియేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా కళాశాలలు గురువారం నుంచి ఎన్ఎంసీకి దరఖాస్తు చేయబోతున్నట్టు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన సీఎం జగన్ సర్కార్.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐదు కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు లభిస్తాయి. -
సీట్లు పెంచితేనే సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల రద్దు అంశం జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) పరిధిలో ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీలు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఎన్ఎంసీ నిర్ణయం వెలువడే వరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరింది. రద్దు చేసిన సీట్లకు ప్రత్యామ్నాయంగా ఎన్ఎంసీ సీట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. అనంతరం ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. టీఆర్ఆర్, ఎంఎన్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్ సీట్లను, 100 పీజీ సీట్లను జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎంఎన్సీ) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో తమ ప్రవేశాలను రద్దు చేసిన ఎన్ఎంసీ ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేదంటూ పీజీ మెడికల్ విద్యార్థులు డాక్టర్ మంగమూరి వర్షిణి సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. ఆ సూచనల మేరకు సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘రద్దయిన కాలేజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడానికి ముందు ఎన్ఎంసీ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించాలి. నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో ఎలా సర్దుబాటు చేస్తారో, సర్దుబాటు చేసే కాలేజీల్లోని వసతులు, ప్రస్తుత సీట్లు, వాటి పెంపు వంటి అంశాలపై ఎన్ఎంసీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ఈఎస్ఐసీ కాలేజీ, ఒక మహిళా కాలేజీతో కలిపి 19 ప్రైవేట్ నాన్–మైనారిటీ మెడికల్ కాలేజీలు, ఒక మహిళా కాలేజీతో కలిపి 4 ప్రైవేట్ మైనారిటీ కాలేజీలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన 250 సీట్లున్నాయి. వీటిల్లో సీట్లను పెంచే అవకాశం లేదు. మరో 4 ప్రభుత్వ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కోసం ఇప్పటికే సీట్ల సంఖ్య పెంచారు. మహబూబ్నగర్(గతంలో 150+ కొత్తగా 25), సిద్దిపేట్(150+25), ఆదిలాబాద్(100+20), నిజామాబాద్(100+20) సీట్లు పెరిగాయి. ఇక మిగిలిన రెండు నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రెండేళ్ల క్రితమే మంజూరయ్యాయి. వీటిల్లో 150 చొప్పున సీట్లున్నాయి. వీటిల్లో కొత్త సీట్లు మంజూరు చేసినా ఆ మేరకు సరిపడా వసతులు లేవు. ఎన్ఎంసీ.. సీట్లను సృష్టించిన తర్వాతే సీట్ల సర్దుబాటుకు వీలుంటుంది. అలాగే అదనపు ప్రవేశాలు చేసేందుకు ప్రైవేట్ కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వాలి’అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే.. ఇదే కేసులో ఎన్ఎంసీ కూడా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ప్రమాణాలు, సౌకర్యాలు, అధ్యాపకులు లేకపోతే సీట్లను రద్దు చేసే అధికారం మాకుంది. వసతుల లేమి కారణంగా రద్దయిన మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సీట్ల రద్దు సమయంలో మార్గదర్శకాలను రాష్ట్రానికి, సంబంధిత యూనివర్సిటీకి పంపించాం. రాష్ట్రం అనుమతి ఇచ్చాకే అడ్మిషన్లు జరుగుతాయి. రద్దయిన కాలేజీల్లోని సీట్ల సర్దుబాటు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. విద్యార్థుల నీట్ ర్యాంక్లు, ఇతర కాలేజీల్లో సీట్ల ఖాళీలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీట్లు సర్దుబాటు చేయాలి. ఒకవేళ కాలేజీల్లో సరిపడా సీట్లు లేకుంటే ఈసారికి మాత్రమే సీట్లు పెంచాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసీ అనుమతి ఇస్తుంది. ఎంబీబీఎస్లో 250 సీట్లు మించకుండా చూడాలి. పీజీ సీట్లనూ రాష్ట్ర సర్కారే సర్దుబాటు చేయాలి’అని పేర్కొంది. కాగా, ఈ పిటిషన్లలో తదుపరి విచారణ జూలై 7న జరగనుంది. -
మెడికోలపై పిడుగు.. జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యపై ఆశతో ప్రైవేటు కాలేజీలే అయినా చేరారు. కన్వీనర్, బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటాల్లో అడ్మిషన్ కోసం లక్షల రూపాయలు చెల్లించారు. రోజూ తరగతులకు హాజరవుతున్నారు. తీరా నెల రోజులకే తమ మెడికల్ సీట్లు రద్దు కావడంతో కంగుతిన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన ఈ వైద్య విద్యార్థులు.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్, పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అధ్యాపకుల్ని అవసరం మేరకు నియమించక పోవడం, లేబొరేటరీలు సరిపడా లేకపోవడం వంటి తదితర కారణాలతో మొత్తం 520 సీట్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. అలాగే సంబంధిత ఎంఎన్ఆర్, టీఆర్ఆర్, మçహావీర్ కాలేజీల యాజమాన్యాలకు కూడా లేఖలు పంపించింది. కాగా అడ్మిషన్ల రద్దుపై ఈ 3 కాలేజీలు ఎన్ఎంసీకి అప్పీలుకు వెళ్లాయి. కాలేజీల్లో చేరిన నెల రోజుల్లోపే ఇలా సీట్లకిచ్చిన అనుమతిని రద్దు చేయడం ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదని వైద్యవిద్య వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్తుండగా.. సాధారణంగా మెడికల్ అడ్మిషన్లకు ముందే ఎన్ఎంసీ ఆకస్మిక తనిఖీలు చేసి అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. కానీ 2021–22 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది. తీరా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత, విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్న సమయంలో ఆయా అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్ఎంసీ తెలిపింది. ఎంఎన్ఆర్ (సంగారెడ్డి), టీఆర్ఆర్ (పటాన్చెరు), మహవీర్ (వికారాబాద్) మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీఎస్ సీట్లు ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 450 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంఎన్ఆర్, మహవీర్ కాలేజీల్లో 70 వరకు పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేశారు. ఎంబీబీఎస్ సీట్లల్లో సగం కన్వీనర్ కోటావి ఉండగా, మిగిలిన వాటిల్లో 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. అలాగే పీజీ సీట్లల్లోనూ కన్వీనర్, బీ, సీ కేటగిరీ సీట్లున్నాయి. అలాగే ఇనిస్టిట్యూషనల్ కోటా సీట్లున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం కాలేజీ యాజమాన్యాల తప్పయితే, అడ్మిషన్లు అయిపోయాక వాటి అనుమతిని రద్దు చేయడం ఎన్ఎంసీ తప్పు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరేడేళ్ల క్రితం కూడా రాష్ట్రంలో ఒకసారి ఇలాగే అడ్మిషన్లు అయిపోయాక సీట్లను రద్దు చేస్తే, ఆయా విద్యార్థులను వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఇప్పుడు మూడు కాలేజీలు అప్పీలుకు వెళ్లినందున ఎన్ఎంసీ సానుకూలంగా స్పందిస్తే కొంతవరకు పరవాలేదు. ఒకవేళ ఎన్ఎంసీ రద్దు నిర్ణయానికే కట్టుబడి ఉంటే విద్యార్థులను ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే 450 మంది ఎంబీబీఎస్, 70 మంది పీజీ విద్యార్థులను అడ్జెస్ట్ చేయడమంటే మాటలు కాదని అంటున్నారు. ఎన్ని ఇబ్బందులో..! విద్యార్థులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. బీ, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల్లో పూర్తి కోర్సు పూర్తి ఫీజును చెల్లించినవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఐదేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తే తక్కువ వసూలు చేసిన కాలేజీలు ఉన్నాయి. అటువంటి చోట తిరిగి ఆ ఫీజు వసూలు కాదు. డొనేషన్లు చెల్లించిన చోట్ల కూడా ఆ డబ్బులు తిరిగిరావు. ఎందుకంటే వాటికి రసీదు కూడా ఉండదు. ఎక్కడైనా అడ్జెస్ట్ చేస్తే ఆ ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. మొత్తం మీద ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడు మంత్రి హరీశ్రావు దృష్టికి.. కాగా ఆ మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులను కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లడంతో ఎన్ఎంసీ దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి అకస్మాత్తుగా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లను రద్దు చేయడం వల్ల ఇప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా, వారి భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఎన్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కార్తీక్ నాగుల, అధ్యక్షుడు, జూనియర్ డాక్టర్ల సంఘం విద్యార్థుల జీవితాలతో చెలగాటం నీట్లో మంచి ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్ ద్వారా ఈ కాలేజీలను ఎంచుకుని చేరిన విద్యార్థుల జీవితాలతో ఎన్ఎంసీ చెలగాటమాడుతోంది. ముందుగా వీటికి అనుమతి ఉందని కౌన్సెలింగ్ నిర్వహణకు, విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించి తీరా ఆ ప్రక్రియ ముగిశాక అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. – ఒక వైద్యాధికారి జీవితాలతో చెలగాటం విద్యార్థుల జీవితాలతో ఎన్ఎంసీ చెలగాటమాడుతోంది. ముందుగా వీటికి అనుమతి ఉందని కౌన్సెలింగ్ నిర్వహణకు, విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించి తీరా ఆ ప్రక్రియ ముగిశాక అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. – ఒక వైద్యాధికారి -
ప్రభుత్వ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యకాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిం ది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల కొరత ఉండటం.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసేలా వైద్య విద్య విస్తరణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఐదు ఉండగా, ఇప్పుడు 17 ఉన్నాయి. ఈ సంవ త్సరంలో ఎనిమిది, 2023–24లో మరో ఎనిమిది కొత్త కాలేజీలు రానున్నాయి. సీట్ల విషయానికొస్తే.. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ కాలేజీల్లో 700 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2022 నాటికి 2,840కి పెరిగాయి. వీటిని 2023–24 విద్యా సంవత్సరంకల్లా 5,240కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పీజీ మెడికల్ సీట్లు 2021 నాటికి 967 ఉండగా, వీటిని 2,500కు పెంచాలని నిర్ణయించింది. సూపర్స్పెషాలిటీ సీట్లు 2021 నాటికి 153 ఉండగా, వీటిని వెయ్యికి పెంచాలని నిర్దేశించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. -
మంత్రి హరీశ్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. రుసుము కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేయూత అందించారు. ములుగు జిల్లాకు చెందిన షేక్ షబ్బీర్ తన ఇద్దరు పిల్లలు వైద్యులు కావాలని తపించారు. కానీ గత ఏడాది కరోనాతో ఆయన మరణించారు. అయినా పిల్లలు షేక్ షోయబ్, సానియా ఆత్మ విశ్వాసంతో తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కష్టపడి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. సానియాకు కాకతీయ మెడికల్ కాలేజీలో, షోయబ్కు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. కానీ పిల్లలిద్దరినీ చదివించే స్తోమత లేకపోవడంతో తల్లి జహీరాబేగం దాతలను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అన్నా చెల్లెళ్ల వైద్య విద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జహీరా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుదలతో సీట్లు సాధించినందుకు అభినందిస్తూ.. మంచి వైద్యులై పేదలకు సేవ చేయాలని షోయబ్, సానియాలకు సూచించారు. -
ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు నేటి నుంచి 2వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రెండో విడత కౌన్సిలింగ్ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారని, ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అర్హులని వివరించింది. గత కౌన్సెలింగ్లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు అనర్హులని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs. telangana.gov.in చూడాలని తెలిపింది. -
7 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు చెందిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోటా సీట్ల ఫీజులు పెరిగాయి. తమకు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని ఆయా కాలేజీలు సమర్పించిన ఆడిటింగ్ రి పోర్టులను పరిశీలించిన తెలంగాణ ప్రవేశాలు, ఫీజు ల నియంత్రణ మండలి (ఏఎఫ్ఆర్సీ) ఫీజుల పెం పునకు అంగీకరించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా ఫీజులు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను మాత్రం యథాతథంగా ఉంచారు. పెంచిన ఫీజులు ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ. 60 వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది కూడా యథాతథంగా ఉంచారు. గతం వరకు యాజమాన్య కోటాకు చెందిన బీ కేటగిరీకి ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్నారై కోటా సీట్లకు బీ కేటగిరీ ఫీజుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. అంటే రూ. 23.10 లక్షల వరకు సీ కేటగిరీకి వసూ లు చేసుకోవచ్చు. డెంటల్ ఫీజు రూ. 4.20 లక్షలుండగా, దాన్ని కూడా కొన్ని కాలేజీల్లో పెంచారు. బీ కేటగిరీకి ఏయే కాలేజీలు ఎంత ఫీజు తీసుకుంటున్నాయో ఆ ఫీజుకు 1.25 రెట్లకు మించకుండా సీ కేటగిరీ సీట్లకు ఆయా డెంటల్ కాలేజీల ఫీజులు తీసుకోవచ్చు. కాలేజీ యాజ మాన్యాలు క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయ కూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ► చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ ఫీజును రూ. 13 లక్షలకు పెంచారు. ఆయా కాలేజీల్లో సీ కేటగిరీ కింద చేరే వారు రూ. 26 లక్షల వరకు చెల్లించాలి. ► అపోలో, మల్లారెడ్డి, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 12.50 లక్షలు చేశారు. సీ కేటగిరీ కింద చేరాలనుకునేవారు ఈ కాలేజీల్లో ఏడాదికి రూ. 25 లక్షలు చెల్లించాలి. ► బీడీఎస్ బీ కేటగిరీ సీటు ప్రస్తుతం రూ. 4.20 లక్షలుగా ఉంది. దాన్ని ఎంఎన్ఆర్ కాలేజీ, పనానియా మహావిద్యాలయ డెంటల్ కాలేజీల్లో 5 లక్షలు చేశారు. -
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
రాయదుర్గం: పేదింటి విద్యార్థులు ఇంజినీర్లు...డాక్టర్లు కాబోతున్నారు. ఇంటర్మీడియేట్ విద్యతోపాటు ఐఐటీ, నీట్, ఎంసెట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఐఐటీ, జేఈఈ నీట్, ప్రెప్ అకాడమీ విద్యాలయం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల కష్టపడే తత్వం, క్రమ శిక్షణ, పోటీ పడి చదవాలనే తపనతో వారు ఇంటర్మీడియట్తోపాటు ఉన్నత విద్య కోసం రాసే పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. పక్కాగా టైం టేబుల్.. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ రైతు కూలీ లు, కూరగాయల విక్రయదారులు, రైతులు, ఇతర సామాన్య, పేద వర్గాలకు చెందిన వారి పిల్లలే కావ డం గమనార్హం. రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు టైంటేబుల్ ఆధారంగా చదువుకోవడం, ఏవైనా డౌట్లు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవడం జరుగుతోంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమేగాక, వారు ఏఏ అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు ♦ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలబాలికల కళాశాలల్లో కలిసి 161 సీట్లు సాధించారు. ♦ ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి రౌండ్లోనే 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ♦ కాగా మరో 29 మంది విద్యార్థులు మొదటిసారిగా ఇంటర్మీడియెట్ చదువుతూ నీట్ కోచింగ్ పొంది ఎంబీబీఎస్ సీట్లు పొందడం విశేషం. ♦ బీబీనగర్లోని ఎయిమ్స్లో మొదటిసారిగా మురళీమనోహర్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ సీటు పొందారు. ♦ బి.ప్రవీణ్కుమార్ కేఎంసీ వరంగల్లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు ♦ స్పందన, కావ్య, శామ్యూల్, వేణుమాధవ్తోపాటు 18 మందికి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్లు దక్కాయి. ♦ ఏడుగురు విద్యార్థులకు గాంధీ మెడికల్ కళాశాలలో కూడా సీట్లు పొందడం విశేషం. ♦ 120 మందికి ఐఐటీ, ఎన్ఐటీ కోసం శిక్షణ ఇవ్వగా 87 మందికి ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించడం విశేషం. -
ఈడబ్ల్యూఎస్ కోటా..203 ఎంబీబీఎస్ సీట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021–22 వైద్య విద్య సంవత్సరానికి గాను ఆర్థికపరంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 203 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో 13 సీట్లు మంజూరైనట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే వీటిలో 102 సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన వారితో భర్తీ చేస్తామని, మిగిలిన 101 సీట్లలో 30 ఎస్సీ విద్యార్థులకు, 59 బీసీ, 12 ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి ఈడబ్ల్యూఎస్ సీట్లను మంజూరు చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అఖిల భారత కోటాలోకి 230 సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,285 కన్వీనర్ కోటా సీట్లుండగా, వీటిలో 15 శాతం సీట్లను అంటే సుమారు 230 సీట్లను అఖిల భారత కోటాలోకి ఇవ్వనున్నారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 30 చొప్పున, ఉస్మానియాలో 37, రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ కాలేజీలో 15 చొప్పున, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 22 సీట్ల చొప్పున కేటాయించారు. అఖిల భారత కౌన్సెలింగ్ సందర్భంగా ఈ ఎంబీబీఎస్ సీట్లను నింపుతారు. వీటికి దేశవ్యాప్త విద్యార్థులు పోటీ పడతారు. రెండు కౌన్సెలింగ్లలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. అయినా సీట్లు మిగిలిపోతే, వాటిని తిరిగి రాష్ట్రంలో జరిగే కౌన్సెలింగ్లో భర్తీ చేసుకునే అవకాశం ఇస్తారు. కాగా, రెండ్రోజుల కింద నీట్ ఫలితాలు వచ్చాయి. అయితే రాష్ట్రాల వారీగా ఇంకా ర్యాంకులు ప్రకటించలేదు. త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి రాష్ట్రానికి చెందిన అర్హులైన విద్యార్థుల జాబితా వస్తుందని, అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకులు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో 5,115 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,115 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,350 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని విశ్వవిద్యాలయం ప్రకటించింది. సోమవారం నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి నీట్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. వారంలో ‘నీట్’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఆందోళన చెందొద్దు.. రాష్ట్రంలో చాలామంది జాతీయస్థాయిలో వేలల్లో వచ్చిన ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకు తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో లక్షపైన ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీ చేస్తామని హెల్త్ వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా షెడ్యూల్ రాలేదని చెప్పాయి. అఖిల భారత కోటాకు 15 శాతం సీట్లు.. ఈసారి వైద్య విద్యా సంవత్సరం కరోనా కారణంగా నెలల పాటు వాయిదా పడింది. ఈసారి తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కిందకు వస్తాయి. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆలిండియా కోటాలో సీట్లు వచ్చినా కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తారో లేదోనన్న అనుమానాలను విశ్వ విద్యాలయం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
NEET 2021: నేడు ‘నీట్’.. ఇవి వద్దు, ఇవి తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి సుమారు 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకోనుండగా, 15 శాతం సీట్లు మాత్రం నేషనల్ పూల్(కేంద్ర కోటా)లో భర్తీ అవుతాయి. ఈ 15 శాతం సీట్లు ఏపీ ఇవ్వడం వల్ల.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది. ప్రభుత్వ పరిధిలో 11 వైద్యకాలేజీలుండగా, ప్రైవేటు పరిధిలో 18 వరకు ఉన్నాయి. గంట ముందే రావాలి.. పరీక్షా కేంద్రానికి గంట ముందే వచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30కల్లా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇన్విజిలేటర్కు అడ్మిట్ కార్డు చూపించాలి. 1.45 గంటలకు బుక్లెట్ ఇస్తారు. 1.50కి బుక్లెట్లో వివరాలు నింపాల్సి ఉంటుంది. సరిగ్గా 2 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకే పరీక్షా కేంద్రానికి రావడం వల్ల ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు. తప్పకుండా తీసుకురావాల్సినవి ఇవే.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు.. అంటే పాన్కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. శానిటైజర్(50 ఎం.ఎల్) బాటిల్ తెచ్చుకోవచ్చు. నిషేధిత జాబితా.. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఆభరణాలు తదితరాలు తీసుకురాకూడదని నిబంధనల్లో స్పష్టం చేశారు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్లు, చైన్లు, నక్లెస్లు, పెండెంట్స్ తదితర ఆభరణలేవీ పెట్టుకోకూడదు. అలాగే కాగితాలు, బిట్స్ పేపర్లు, జామెట్రీ బాక్స్లు, పెన్సిల్ బాక్స్లు, క్యాలిక్యులేటర్లు, ప్లాస్టిక్ పౌచ్లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరైజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ తీసుకురాకూడదు. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, స్కార్ఫ్, కెమెరా తదితర వస్తువులన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్.. ఇది ఎంతో మంది విద్యార్థుల కల. వారి కలలను నిజం చేసే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీ కూడా ఇప్పటికే వచ్చేసింది. సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్’ జరగనుంది. గతేడాది కంటే ఈసారి మరింత పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో సీట్లు రాని చాలా మంది విద్యార్థులు.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీటు కోసం పోటీ పడుతున్నారు. దంత వైద్య సీటు వచ్చినా చేరకుండా.. ఎంబీబీఎస్ కోసం వేచిచూస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. గతేడాది దాదాపు 60 వేల మంది రాష్ట్రం నుంచి నీట్కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య 70 వేలకు చేరే అవకాశముంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 4,858 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్టు తేలింది. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185, ప్రైవేటులో 2,673 సీట్లున్నాయి. పద్మావతి మహిళా వైద్య కళాశాల(అటానమస్)లో 152 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ(కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్లో 120 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి కాలేజీలో 10 శాతం.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం 2,185 ఎంబీబీఎస్ సీట్లలో.. 324 సీట్లు నేషనల్ పూల్(ఆల్ ఇండియా కోటా) కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ప్రతి వైద్య కళాశాలలో 10 శాతం చొప్పున మరో 335 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అటానమస్ అయిన పద్మావతి మహిళా వైద్య కళాశాలలోని 152 సీట్ల(ఈడబ్ల్యూఎస్తో కలిపి)లో నేషనల్ పూల్కు 26 కేటాయిస్తారు. మిగిలిన 126 సీట్లు రాష్ట్ర కోటాలోనే భర్తీ చేస్తారు. ‘ప్రైవేటు’ యాజమాన్య కోటాలో 921 సీట్లు.. రాష్ట్రంలోని 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2,673 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 50 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తీసుకునే ఫీజులే.. కన్వీనర్ కోటా సీట్లకు కూడా వర్తిస్తాయి. యాజమాన్య కోటా కింద 921 సీట్లు, ప్రవాస భారతీయ(ఎన్నారై) కోటా కింద 427 సీట్లు భర్తీ చేస్తారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అత్యధిక సీట్లు(250) నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలోనే ఉన్నాయి. తమ ఎంబీబీఎస్ కలను నెరవేర్చుకునేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ నీట్కు సిద్ధమవుతున్నారు. -
దేశవ్యాప్తంగా 83,275 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పీజీ, యూజీ ప్రవేశ పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వివిధ కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కాలేజీలు 289 ఉంటే, వాటిలో 43,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే, 6,515 సీట్లను అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్కు ఇస్తాయి. వాటిని జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగాక, నేషనల్ పూల్లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. ఇదిలావుంటే తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు. 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది. ‘మనూ’ కొత్త వైస్ చాన్స్లర్ ఐనుల్ హసన్ హెచ్సీయూకు బసుత్కర్ జే రావు.. రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) నూత న వైస్ చాన్స్లర్గా ప్రముఖ పర్షియన్ పండితుడు ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా తిరుపతిలోని ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో బయాలజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బసుత్కర్ జే రావు నియమితులయ్యారు. -
కేంద్ర కౌన్సెలింగ్లో చేరలేం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లకు కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ సంక్లిష్టతతో కూడుకున్నదని, కేంద్ర పరిధిలో అమలయ్యే వాటికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజర్వేషన్లకు భిన్నమైన పరిస్థితులున్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. మరోవైపు విభజన చట్టం ఇంకా అమల్లోనే ఉన్నందున 2024 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేమని కమిటీ తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సమ్మతి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్లో చేరితే తలెత్తే సమస్యలపై అధ్యయనం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కూలంకషంగా చర్చించిన అనంతరం కమిటీ తన నివేదికను వెల్లడించింది. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... 371–డి రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయి.. రాష్ట్రంలో 371–డి అనుసరించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్థానిక కోటాను 42ః36ః22 నిష్పత్తి ప్రకారం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేంద్ర కౌన్సెలింగ్లో చేరితే ఈ కోటాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బీసీ రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో ఓబీసీ కోటా లేదు. బీసీ కోటా మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ కేటగిరీకి 29 (బీసీ–ఏ, బీసీ–బి, బీసీ–సి, బీసీ–డి, బీసీ–ఇ కలిపి), ఈడబ్లు్యఎస్ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటితోపాటు స్పెషల్ కేటగిరీ కింద మహిళలకు 33.1, దివ్యాంగులకు 5, సైనికుల పిల్లలకు 1, ఎన్సీసీకి 1, క్రీడాకారులకు 0.5, అమరవీరుల కుటుంబాల చిన్నారులకు 0.25 శాతం రిజర్వేషన్లున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం పలు జీవోలను విడుదల చేసింది. ఇవన్నీ కచ్చితంగా అమలు చేయాలంటే కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేం. ‘ఎంఆర్సీ’ అమల్లో ఉంది.. మెరిట్ ఆఫ్ ఏ రిజర్వ్డ్ కేటగిరీ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఒక రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీకి వెళితే ఆ సీటును అదే కేటగిరీతో వారితో భర్తీ చేయాలి. దీనికోసం 2001లో జీవో 550 ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2019 ఆగస్ట్ 13న జీవో నెం.111 ఇచ్చారు. తిరిగి 2020 నవంబర్ 13న కొద్దిపాటి మార్పులతో జీవో 159 ఇచ్చారు. ఇవన్నీ ప్రక్రియను బట్టి మారుతూ వచ్చాయి. చివరగా మళ్లీ 2020 డిసెంబర్ 4న జీవో 151 ఇచ్చారు. బీడీఎస్, ఎంబీబీఎస్కు విడివిడిగా ఒకేసారి ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించాలని దీని సారాంశం. కేంద్ర కౌన్సెలింగ్లో చేరితే దీనికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నాం. చిన్న సమస్యలకూ ఢిల్లీ వెళ్లాలి.. నీట్ జాతీయ ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం 85 శాతం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. మిగతా 15 శాతం జాతీయ కోటాలో ఇచ్చిన సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పూర్తి సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఏవైనా సమస్యలొచ్చినప్పుడు విద్యార్థులు పదేపదే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్లో చేరే పరిస్థితి లేదని కమిటీ భావిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కేంద్రానికి స్పష్టత ఇస్తుంది. నిపుణుల కమిటీ ఇదే.. చైర్మన్: డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్లర్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.మెంబర్ కన్వీనర్: డా.కె.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సభ్యులు: డా.ఐవీ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్, డా.ఎం రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు, ఎస్.నాగవేణి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఏపీ ఉన్నతవిద్యా మండలి. పీజీ అడ్మిషన్లకూ ప్రత్యేక విధివిధానాలు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో ఒక రకమైన విధానాలుండగా పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో రకమైన ఇబ్బందులున్నాయి. బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు (పీజీ వైద్య సీట్లు) 2013 మార్చి 13న ఇచ్చిన జీవో 43 ప్రకారం నిర్వహిస్తున్నాం. ప్రాంతాలవారీగా నిర్వహిస్తున్నాం. స్పెషాలిటీ పరంగా, కేటగిరీపరంగా చేస్తున్నాం. 2020 మే 29న ఇచ్చిన జీవో 57 ప్రకారం పీజీ కౌన్సెలింగ్లో సవరణలు వచ్చాయి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ సీటుకు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లేందుకు స్లైడింగ్ విధానం ఉంది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం. కేంద్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరితే వీటి అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. -
వైద్య విద్యార్థులకు మరో శుభవార్త..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వైద్య విద్యార్థులకు మరో శుభవార్త. ఎంబీబీఎస్తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను సడలించింది. ఇకపై మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు (అండర్ గ్రాడ్యుయేట్) ఎన్ని ఉంటాయో పీజీ వైద్య సీట్లను కూడా ఆ మేరకు పెంచుకోవచ్చని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యవిద్యా శాఖ పీజీ వైద్య సీట్ల పెంపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లుండగా 910 మాత్రమే పీజీ వైద్య సీట్లున్నాయి. ఇప్పుడు అదనంగా 1,275 సీట్లను పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 308 పీజీ సీట్లకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ జారీచేసింది. అంటే వచ్చే ఏడాది ఈ 308 సీట్లు దాదాపుగా ఖరారైనట్టే. ఇవికాకుండా 967 సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ వైద్య సీటును రూ. కోట్లలో విక్రయిస్తున్న తరుణంలో ప్రభుత్వ కాలేజీల పరిధిలో సీట్లు పెరగనుండటం మెరిట్ విద్యార్థులకు వరం లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యులు, మౌలిక సదుపాయాలు.. కొత్తగా సీట్లు పెరగాలంటే తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు విధిగా అవసరం. దీంతో పాటు మౌలిక వసతులను కూడా మెరుగు పరచాల్సి ఉంటుంది. నర్సులు, పారా మెడికల్ సిబ్బందినీ నియమించుకోవాలి. వీటన్నిటిపైనా వైద్యవిద్యాశాఖ ప్రత్యేక నివేదిక తయారు చేస్తోంది. పెంచుకునే అవకాశం ఉన్న ప్రతి సీటునూ ఎలాగైనా సాధించేలా కసరత్తు చేస్తున్నారు. మంచి అవకాశం.. జాతీయ మెడికల్ కమిషన్ పీజీ సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 308 పీజీ సీట్లకు అనుమతిచ్చింది. మిగతా సీట్లకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల భారీగా ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి’ – డా.రాఘవేంద్రరావు, వైద్యవిద్యా సంచాలకులు చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం -
వైద్య విద్యకు పట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఒకే రోజున 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. దీనివల్ల స్పెషాలిటీ వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలకూ విస్తరించడంతోపాటు వేలాది ఎంబీబీఎస్ సీట్లు, నిరుద్యోగ వైద్యులకు ఉద్యోగాల కల్పన వంటి బహుళ ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది. అంచనా వ్యయం రూ.7,880 కోట్లు స్పెషాలిటీ వైద్యం ఆవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి.. వాటికి నిధులు వెచ్చించడం కంటే ప్రభుత్వ ఆస్పత్రులనే కార్పొరేట్ ఆస్పత్రులుగా మారిస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగానే ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు.. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రమారమి 2 వేల ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. సుమారు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 16 వైద్య కళాశాలలను 2023 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగు సాగుతోంది. అత్యాధునిక వసతులు ఇలా.. – ప్రతి ఆస్పత్రిలో 500 పడకలకు తగ్గకుండా ప్రత్యేక సర్వీసులతో కూడిన ఏర్పాట్లు – ప్రతి వైద్య కళాశాలలో ఐటీ సర్వీసులు, సీసీ కెమెరాల అనుసంధానం – ప్రతి కాలేజీలోనిఅనుబంధ ఆస్పత్రిలో 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు – కేంద్రీకృత ఏసీతో కూడిన ఐసీయూ, ఓపీడీ రూమ్లు, డాక్టర్ రూమ్లు – అన్ని పడకలకు మెడికల్ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాటు – ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులతో పాటు ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్ల నిర్మాణం వైఎస్సార్ హయాంలో 4 కాలేజీలకు.. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకేసారి 4 మెడికల్ కాలేజీలు నిర్మించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్, ఒంగోలు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఒక్క వైద్య కళాశాల కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకాలేజీలు లేకపోయినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ధ్యేయంతో ముందుకెళుతోంది. ప్రభుత్వ పరిధిలో ఇన్ని కాలేజీలు రావడం రికార్డు ప్రభుత్వ పరిధిలో ఒకేసారి 16 కొత్త వైద్య కళాశాలలు రావడం చాలా గొప్ప విషయం. ఇదో రికార్డు. వేలాది మందికి ఎంబీబీఎస్ చదువుకునే అవకాశంతోపాటు లక్షలాది మందికి స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. పేద ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వ పరిధిలో స్పెషాలిటీ వైద్యం అన్ని ప్రాంతాలకై విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల పేద కుటుంబాలకు గొప్ప భరోసా లభిస్తుంది. మరోవైపు వైద్యుల్లోనూ నిరుద్యోగులున్నారు. అలాంటి వారికి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. – డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లు 3,662
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కలిపి 3,662 ఉన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. -
27 నుంచి ఎంబీబీఎస్ ఆలిండియా కౌన్సెలింగ్..
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లను ఆలిం డియా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఎయిమ్స్, జిప్మర్ తదితర జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల సీట్లనూ ఈ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 6,410 ఎంబీబీఎస్ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల నీట్ ఫలి తాలు వెల్లడైన నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 27 నుంచి వచ్చే నెల 2 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. 5న ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రకటిస్తారు. అనంతరం విద్యార్థులు అదే నెల 6 నుంచి 12 వరకు వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ మూడు గంటల వరకు జరుగుతుంది. 25న కాలేజీ సీటు కేటా యింపు ఫలితాన్ని ప్రకటిస్తారు. అదే నెల 26 నుంచి డిసెంబర్ 2 నాటికి కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు చేరాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రాల నుంచి తీసుకున్న 15 శాతం సీట్లలో మిగిలిన వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కు ఇస్తారు. అయితే ఎయిమ్స్, జిప్మర్, కేంద్ర, డీమ్డ్ వర్సిటీ, ఈఎస్ఐసీ వంటి సంస్థల్లో మిగిలిన సీట్లకు మాత్రం మాప్ అప్ రౌండ్లో ఆలిండియా కౌన్సెలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు మాప్అప్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. సీటు కేటాయించిన కాలేజీని అదే నెల 17న ప్రకటిస్తారు. విద్యార్థులు 18 నుంచి 24 నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అప్పటికీ మిగిలిన సీట్లను అదే నెల 28 నుంచి 31 వరకు భర్తీ చేస్తారు. 29న రాష్ట్రంలో మెడికల్ నోటిఫికేషన్ ఆలిండియా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ నెల 29న తెలంగాణలో మెడికల్ ప్రవేశాల నోటిఫికేషన్ ప్రారంభం కానుంది. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. అలాగే జాతీయస్థాయి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, రాష్ట్రంలో రెండో విడత జరుగుతుంది. జాతీయస్థాయి కౌన్సెలింగ్ తర్వాత వెనక్కు వచ్చే సీట్లతో కలిపి రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కాళోజీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మాప్అప్ రౌండ్ నిర్వహిస్తారు. ఈసారి సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదని, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాయి. గతేడాది తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. ఈ నెల 29 నాటికి రాష్ట్రానికి నీట్ ర్యాంకుల డేటా వివరాలు వస్తాయని చెబుతున్నారు. అదే రోజు నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో వైద్య విద్య తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు తెలిపారు. వాస్తవంగా జాతీయస్థాయి మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే వచ్చే నెల 15న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తరగతుల ప్రారంభంపై స్పష్టతలేదని అంటున్నారు. -
రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా 150 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రాష్ట్రంలో 2020–21 సంవత్సరానికి మెదక్ జిల్లా పటాన్చెరులో టీఆర్ఆర్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అనుమతించింది. మరో 150 సీట్లు ఈ ఏడాది నుంచి అదనంగా అం దుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్ఐసీసహా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 18 ప్రైవేట్ కాలేజీల్లో 2,750, 4 మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. చదవండి: అఖిల భారత కోటా 6,410 చివరి వారంలో నోటిఫికేషన్ అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న నీట్ ఫలితాలు వచి్చనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా, దరఖాస్తుల స్వీకరణ నోటిíÙకేషన్ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు తెలి పాయి. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మినహాయించి రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం (230) సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు. -
అఖిల భారత కోటా 6,410
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వారం రోజుల్లోగా నీట్ ఫలితాలు వెలువడగానే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు మొదలుకాను న్నాయి. నీట్ అర్హత ద్వారానే అడ్మిషన్లు జరుగుతుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లు జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులూ తమ ర్యాంకును బట్టి ఇష్టమైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముంది. అందుకోసం ఆప్షన్లు ఉంటాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 82,926 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 278 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 42,729 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇక 263 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 38,840 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా మరో 15 ఎయిమ్స్ల్లో 1,367 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయంగా 6,410 ఎంబీబీఎస్ సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. ఈ మేరకు జాతీయస్థాయి కౌన్సెలింగ్ జరగనుంది. ఆ ప్రాతిపదికనే నీట్లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో తమకు ఇష్టమైన మెడికల్ కాలేజీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు నీట్ ర్యాంకు ఆధారంగా కాలేజీలను కేటాయిస్తారు. రాష్ట్రంలో 5,040 ఎంబీబీఎస్ సీట్లు.. ఎంసీఐ లెక్క ప్రకారం రాష్ట్రంలోని 32 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 5,040 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లుండగా, 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3,300 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో 15 శాతం అంటే 261 సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లన్నింటినీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక బీబీనగర్ ఎయిమ్స్లో 50 ఎంబీబీఎస్ సీట్లున్నా వీటన్నింటినీ జాతీయ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత స్థాయిలో దాదాపు 8 వేల సీట్లకు పోటీపడే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిల భారత కోటాలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జాతీయ కోటా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, ఇక మిగిలే సీట్లను ఆయా రాష్ట్రాలకే తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన సీట్లను మాప్ అప్ రౌండ్ పద్ధతి కౌన్సెలింగ్ ద్వారా అన్నింటినీ భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లనూ, ప్రైవేటులోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. 3 నెలలు ఆలస్యంగా అడ్మిషన్లు.. సాధారణంగా మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ జూలైలో ప్రారంభమై ఆగస్టు 31 నాటికి ముగుస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా ప్రవేశాల ప్రక్రియ దాదాపు మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. గతేడాది మాదిరిగానే ఫీజులుండే అవకాశముంది. ఫీజులు పెంచాలన్న డిమాండ్ ఉన్నా కరోనా కారణంగా పెంపుపై ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ.60 వేలు, మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ)లో రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరీ)లో రూ.23 లక్షల వరకు వసూలు చేసుకునే వెసులుబాటుంది. ‘నీట్’కీ విడుదల.. ఈనెల 13న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఆ సమాధానాలను సరిచూసుకోవాలనీ, ఒకవేళ జవాబుల్లో తప్పులు దొర్లినట్లుగా భావిస్తే విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తమ సందేహాలను అధికారిక వెబ్సైట్లో తెలియజేయాలని పేర్కొంది. అందుకోసం అభ్యర్థులు రూ.వెయ్యి ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. సమాధాన పత్రంలో నిజంగానే తప్పులు దొర్లితే, ఆ మేరకు జవాబును సరిదిద్దుకోవడంతో పాటు విద్యార్థికి రుసుమును కూడా తిరిగి చెల్లిస్తామని తెలిపింది. నీట్ నిర్వహణ అనంతరం విద్యార్థులు తాము రాసిన ప్రశ్నలకు ఎంత మేరకు సమాధానాలు సరైనవిగా ఉన్నాయో ప్రాథమికంగా సరిచూసుకొని ఒక అంచనాకు వచ్చారు. అయితే తాజాగా అధికారికంగా సమాధాన పత్రం విడుదల చేయడంతో విద్యార్థులకు తమకు ఎన్ని మార్కులు నీట్లో వస్తాయనే స్పష్టత ఇప్పుడొచ్చింది. దీంతో గతేడాది ఎన్ని మార్కులకు ఎక్కడ సీటు వచ్చిందనే అవగాహనతో ఈ ఏడాది కూడా ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రానున్నారు. ఆ మేరకు విద్యార్థులు కూడా నిపుణుల సలహా తీసుకుంటున్నారు. -
మూడేళ్లలో మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని 2023 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. తద్వారా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పేద రోగులందరికీ స్పెషాలిటీ సేవలను అందించొచ్చని భావిస్తోంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యనూ గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. వైద్య కళాశాలలను అనుకున్న సమయానికే పూర్తి చేయాలని, దీనికయ్యే వ్యయం గురించి ఆలోచించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించి రెండు నమూనాలను సీఎం ఓకే చేశారని అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య కళాశాలలకు ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా మరికొన్ని కళాశాలల నిర్మాణానికి భూములు సేకరిస్తున్నారు. వైద్య కళాశాలలను నిర్మించాలంటే.. ఒక్కో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.450 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ మొత్తం కాకుండా సిబ్బందికి వేతనాల రూపంలో ఏడాదికి రూ.132 కోట్లు వ్యయం. 300 పడకలతో ఉండే ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉంటుంది. –వైద్య కళాశాల నిర్మాణానికి కనీసం 25 ఎకరాలు, నర్సింగ్ కాలేజీకి 5 ఎకరాలు స్థలం అవసరమవుతుంది. –ప్రతి వైద్య కళాశాల రోజుకు 1,000 మంది ఔట్పేషెంట్ రోగులకు వైద్యసేవలు అందించాలనేది లక్ష్యం –ఇప్పటికే పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం కొత్త వైద్య కళాశాలలను అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం. 2023 నాటికి అన్ని వైద్య కళాశాలల నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని నమూనాలను ఓకే చేశారు. అత్యాధునిక వసతులతో కొత్త కాలేజీలు నిర్మిస్తాం. త్వరలోనే వీటికి సంబంధించిన టెండర్లకు వెళతాం. –విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి ఆయన బుధవారం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పర్యటించారు. బందరు మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించాక స్థానిక జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై మెడికల్ కళాశాల ఏర్పాటుపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ► జూలై 8న వైఎస్సార్ చిరునవ్వు పథకం ప్రారంభిస్తాం. దీనికింద రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి ఆరో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందిస్తాం. ► రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కళాశాలలను 27కు పెంచుతాం. పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజీ ► ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏరియా, జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటి ద్వారా నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తాం. ► గుడివాడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తాం. ► రాష్ట్రవ్యాప్తంగా సబ్ సెంటర్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్లుగా తీర్చిదిద్దుతున్నాం. ► ఆస్పత్రులకు కొత్త భవనాల నిర్మాణంతోపాటు 9 వేల వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. ► త్వరలోనే బందరు మెడికల్ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.18 లక్షలు కడితే ఎంబీబీఎస్ సీటు
కోనేరు సెంటర్(మచిలీపట్నం): ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మబలికి, రూ.లక్షలు దండుకున్న ముగ్గురు ఘరానా మోసగాళ్లను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13వ తేదీన బీహార్లో వారిని అదుపులోకి తీసుకుని, ఆదివారం మచిలీపట్నం తీసుకొచ్చారు. జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్లోని నోవాడా జిల్లా అప్పర్ గ్రామానికి చెందిన ఓంకార్ కుమార్, రాకేష్ కుమార్ అన్నదమ్ములు. రణధీర్ కుమార్ వీరికి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన ముగ్గురు ఆన్లైన్ మోసాలకు తెరలేపారు. మచిలీపట్నం మాచవరానికి చెందిన కట్టా మోహన్రావుకు నాలుగు నెలల క్రితం ముగ్గురు ఫోన్ చేశారు. మీ కుమారుడికి కోల్కతాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సిద్ధంగా ఉందని, రూ.18 లక్షలు కడితే చాలంటూ నమ్మించారు. తన కుమారుడిని ఎలాగైనా డాక్టర్ చదివించాలనే ఉద్దేశంతో మోహన్రావు ఆగష్టు 17న రూ.45,000 వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. 21న మరో రూ.4,50,000, 26న రూ.4,50,000 బదిలీ చేశాడు. 30వ తేదీన మళ్లీ రూ.5 లక్షలు పంపించాడు. మొత్తం రూ.14,45,000 వారి ఖాతాలో జమ చేశాడు. సెప్టెంబరు 9న తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడగా, తమ కళాశాలలో సీట్లు లేవని, మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పారు. మోహన్రావు సెప్టెంబరు 11న చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకులు బీహార్లో ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్ 13న బీహార్లోని ఓర్మిలీఘంజ్ బస్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు యువకులు మచిలీపట్నంతో పాటు చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసగించి, రూ.లక్షలు దోచుకున్నట్లు తేలిందని ఏఎస్పీ చెప్పారు. -
నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్ సూర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్గా పరీక్ష రాసి వైద్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్దులు వక్రమార్గాన్ని ఎన్నుకుని ఎట్టకేలకు దొరిపోతున్నారు. తప్పుటడుగులు వేస్తున్న తమ పిల్లలను సరిదిద్దాల్సిన తండ్రులే తప్పిదాలకు పోయి పోలీసులకు చిక్కిపోతున్నారు. నీట్ పరీక్ష మోసంలో తాజాగా ఒక విద్యార్ది, ఇద్దరు విద్యార్దులు తమ తండ్రులతో సహా మొత్తం ఆరుగురు జైలుపాలయ్యారు. దీంతో నీట్ మోసం వ్యవహారంలో అరెస్ట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. కష్టపడి చదివి నీట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పక్కదోవపట్టగా చెన్నైకి చెందిన ఉదిత్ సూర్య అనే విద్యార్దిని, అతడి తండ్రి డాక్టర్ వెంకటేశన్ను సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పోలీసుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ఉదిత్ సూర్య తనలాగ ఎందరో అని చెప్పడం అధికారులను కలవరానికి గురిచేసింది. మరి కొందరు విద్యార్దులు సైతం నకిలీ విద్యార్ది చేత నీట్ పరీక్ష రాయించి వైద్యసీటు సంపాదించారని సీబీసీఐడీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వారు ఎవరెవరో కూడా చెప్పడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నైకి చెందిన విద్యార్దిని అభిరామి, విద్యార్దులు ప్రవీణ్, రాహుల్ సైతం ఉదిత్ సూర్య తరహాలో మరోవ్యక్తి చేత పరీక్ష రాయించి సీటు సంపాదించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. విద్యార్దిని అభిరామి తిరుప్పోరూరు సమీపం అమ్మాపేటలోని సత్యసాయి వైద్య కళాశాలలో, విద్యార్దులు ప్రవీణ్ క్రోంపేటలోని బాలాజీ వైద్య కళాశాలలో, రాహుల్ కాంట్రాకొళత్తూరులోని ఎస్ఆర్ఎమ్ వైద్యకళాశాలలో చదువుతున్నారు. ఉదిత్ సూర్య తండ్రి డాక్టర్ వెంకటేశన్ లాగానే ఈ ముగ్గురు విద్యార్దులు తండ్రులు సైతం తమ పిల్లల కోసం మోసానికి పాల్పడ్డారు. ప్రవీణ్ తండ్రి రూ.23 లక్షలు చెల్లించాడు. మిగిలిన ఇద్దరు రూ.20 లక్షలు చొప్పున ఇచ్చుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్దుల తండ్రులు బ్రోకర్కే డబ్బులు ఇచ్చుకున్నారు. అభిరామి తండ్రి మాధవన్, ప్రవీణ్ తండ్రి శరవణన్, రాహుల్ తండ్రి డేవిస్లను సైతం సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురినీ తేనీ సీబీసీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఆరుగురినీ శనివారం ఉదయం 11 గంటలకు తేనీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. నీట్ మోసం కేసులో ఇప్పటి వరకు నలుగురు విద్యార్దులు, నలుగురు తండ్రులు లెక్కన మొత్తం ఎనిమిది మందిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఉదిత్ సూర్యకు సహకరించిన నీట్ బ్రోకర్ జార్జ్జోసెఫ్ను కేరళలో రెండురోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రబీ, తమిళనాడు వానియంబాడికి చెందిన మహమ్మద్ షఫీ అనే మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసేందుకు సీబీసీఐడీ సిద్దం అవుతోంది. కాగా ఇర్ఫాన్ అనే మరో విద్యార్ది సైతం ఇదే తరహా మోసంతో వైద్యసీటు సంపాదించినట్లు అధికారులకు సమాచారం అందండంతో విచారణ జరుపుతున్నారు. -
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా
అతనో ఉపాధ్యాయుడు, తన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థితిలో ఉండాలని కోరుకున్న ఓ తండ్రి కూడా. అయితే ఆ తండ్రి ఆశను ఓ మోసగాడు అడ్డంగా వాడుకున్నాడు. నీ కొడుక్కి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి లక్షల్లో సొమ్ము కాజేశాడు. భవిష్యత్తులో కొడుకు డాక్టర్ అవుతాడన్న ఆనందంలో అసలు మోసాన్ని గ్రహించలేని ఆ తండ్రి మాయగాడి ఉచ్చులో పడి దశలవారీగా లక్షలకు లక్షలు అతని ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అసలు మోసం తెలిసి ఆవేదనతో అక్కడే కుప్పకూలాడు. మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకుని దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి కోనేరుసెంటర్ (విజయవాడ) : పెడనకు చెందిన కట్టా నాగమోహనరావు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు ఇంటర్ పూర్తి చేసి ఇటీవల ‘నీట్’ రాశాడు. 406 మార్కులు సాధించాడు. ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవటంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. అయితే కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల నుంచి పంకజ్కుమార్శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను మెడికల్ కళాశాలలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నానని నాగమోహన్రావుకు చెప్పాడు. రూ.15 లక్షలు ఫీజు చెల్లిస్తే సీటు కేటాయిస్తామంటూ నమ్మించాడు. దీంతో నాగమోహనరావు దశలవారీగా అతను చెప్పిన 062422010028920 బ్యాంక్ అకౌంట్లోకి సొమ్ము జమ చేశారు. మొదటిగా గత నెల 17వ తేదీన రూ.45 వేలు, 21న రూ.4.50 లక్షలు, 27న మరో రూ.4.50 లక్షలు, 30వ తేదీన మరో రూ.5 లక్షలు జమ చేశాడు. దీంతో పంకజ్కుమార్శర్మ తన కుమారుడికి సీటు కేటాయించినట్లు చెప్పాడు. ఈ నెల 6వ తేదీన కళాశాలలో ప్రారంభమయ్యే తరగతులకు పంపాలని చెప్పాడు. నాగమోహనరావు తన కుమారుడిని వెంటబెట్టుకుని కలకత్తాలోని నేషనల్ మెడికల్ కళాశాలకు వెళ్లి సీటు కోరగా పంకజ్కుమార్శర్మ అనే వ్యక్తి అక్కడ ఎవరూ లేరని తేలింది. గతంలో ఇలానే కొంత మంది అతని చేతిలో మోసపోయినట్లు యాజమాన్యం నాగమోహనరావుకు చెప్పారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న నాగమోహనరావు తిరిగి మచిలీపట్నం వచ్చేశాడు. దర్యాప్తు చేపట్టిన చిలకలపూడి పోలీసులు జరిగిన మోసంపై నాగమోహనరావు బుధవారం రాత్రి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్కుమార్శర్మ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు చూపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. -
మెడికల్ సీట్లలో భారీ దందా
సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లలో భారీ కుంభకోణానికి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెరలేపాయి. నెల రోజులుగా జరుగుతున్న ఈ దందా ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బీ–కేటగిరీలో వివిధ కౌన్సెలింగ్లలో చేరిన పలువురు ఇతర రాష్ట్రాల విద్యార్థులు శుక్రవారం సాయం త్రం తమ సీట్లను రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక మిగిలిపోయిన సీట్లు ఎన్నారై కోటాగా మారిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అటు దళారులు, ఇటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆ ఎన్నారై సీట్లను ఎక్కువ ధరకు సీటు రాని ఇతర విద్యార్థులకు అమ్ముకున్నారు. అలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యార్థులు శనివారం (31 ఆగస్టు)మెడికల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఈ దందాలో అనేక ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములుగా ఉండడం గమనార్హం. తద్వారా అక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు లక్షలకు లక్షలు, దళారులు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అక్రమంగా, అప్పనంగా కోట్ల రూపాయలు దక్కాయి. కర్ణాటకలో ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు రాగా, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండటం పై విమర్శలు వస్తున్నాయి. పెద్ద ముఠాలే ! రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. అందులో నాన్–మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 2,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో బీ–కేటగిరీ 875 సీట్లుండగా, 375 ఎన్నారై సీట్లున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 136 బీ–కేటగిరీ సీట్లు, 84 ఎన్నారై కోటా సీట్లు. ఇక ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. సీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.23.10 లక్షలు. అంటే బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు ఫీజు సీ–కేటగిరీ సీటుకుంది. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సీ–కేటగిరీ ఫీజుతోనే రెట్టింపు లాభం వస్తుంది. బీ–కేటగిరీ సీట్లకు రెండు విడతల కౌన్సిలింగ్, మాప్–అప్ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక మిగిలే సీట్లు ఆటోమెటిక్గా ఎన్నారై కోటా సీట్లుగా మారిపోతాయని గతంలోనే సర్కారు జీవో ఇచ్చింది. ఈ జీవోను ఆధారం చేసుకొనే భారీ కుంభకోణానికి తెరలేచింది. పైగా నీట్ ర్యాంకుల నేపథ్యంలో రాష్ట్రంలోని బీ, ఎన్ఆర్ఐ (సీ) కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో బీ–కేటగిరీకి జరిగిన తొలి, రెండో విడతలతోపాటు మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్ ఇతర రాష్ట్రాల విద్యార్థులను దళారులు చేర్పించారు. అందుకోసం దేశవ్యాప్తంగా అనేక ముఠాలు నడుస్తున్నాయి. ఉచ్చులోకి విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ ముఠాలతో ఒప్పందం చేసుకున్నాయి. నీట్లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దళారులు ఆశ చూపి వారిని ఈ ఉచ్చులోకి లాగారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి నీట్లో మంచి ర్యాంకు వచ్చింది. అతను ఏ ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనైనా లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలోనైనా సీటు సంపాదించాడనుకోండి. అక్కడ అతను చేరుతాడు. అలాగే ఆ విద్యార్థి తెలంగాణలోని ఏదో ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ కౌన్సిలింగ్కు హాజరవుతాడు. అందుకోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొస్తాడు. ఆ రాష్ట్రంలో విద్యార్థి చేరిన కాలేజీలో ఉన్న క్లర్క్లకు దళారులు 10–15వేలు ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్ల కలర్ జిరాక్స్లు తీసుకుంటారు. విచిత్రమేంటంటే కలర్ జిరాక్స్ సర్టిఫికేట్లను ఆ కాలేజీలోనే పెట్టి ఒరిజినల్ సర్టిఫికేట్లు తెలంగాణలోని కౌన్సిలింగ్లకు హాజరవుతారు. ఇక్కడ వచ్చిన సీట్లల్లో చేరిపోతారు. ఇలా ఆ విద్యార్థి రెండు చోట్లా సీట్లు పొంది చేరుతాడు. అన్ని రౌండ్ల కౌన్సిలింగ్లు పూర్తయ్యాక తెలంగాణలో తన సీటును రద్దు చేసుకుంటాడు. అయితే సీటు రద్దు చేసుకున్నందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ.3లక్షలు జరిమానా చెల్లించాలి. అలా చెల్లించి రద్దు చేసుకుంటారు. తిరిగి సొంత రాష్ట్రంలో తాను చేరిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాడు. దీంతో అతను తెలంగాణలో వదిలేసిన బీ–కేటగిరీ సీటు ఎన్నారై సీటుగా మారిపోతుంది. ఇలా రాష్ట్రంలో దాదాపు 100 ఎంబీబీఎస్ సీట్లల్లో దందా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేరకు ఈ దందాలో అనేక కాలేజీలు పాలుపంచుకున్నాయి. ఇక ఎన్నారై సీటును ఎంతకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. డిమాండ్ను బట్టి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఒక యూపీ విద్యార్థి అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో చేరాడు. అతను దళారుల ద్వారా తెలంగాణలో బీ–కేటగిరీ సీటులో చేరాడు. చివరకు శుక్రవారం ఆ సీటును వదులుకున్నందుకు అతనికి రూ.5లక్షలు ముట్టచెప్పారు. దళారులకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు కూడా ఇచ్చారు. ఇలా కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇదంతా గుట్టుగా జరుగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న తంతు శుక్రవారం రాత్రి సీట్ల రద్దుతో ముగిసింది. దీంతో ఈ సీట్లన్నీ ఎన్నారై కోటాగా మారిపోయాయి. శనివారం ఒక్కరోజే ఈ సీట్లలో చేరేందుకు గడువుంది. దీంతో ఒక్క రోజులోనే కోట్లు చేతులు మారనున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రైవేటు కాలేజీలు, దళారులు, విద్యార్థుల మధ్య మొత్తంగా రూ.100 కోట్లు అక్రమంగా చేతులు మారినట్లు అంచనా. ఇక్కడి వారక్కడ.. అక్కడి వారిక్కడ! ఇదిలావుంటే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికక్కడే సీట్లు మార్చుకునేందుకు వీలుండదు. మన రాష్ట్ర విద్యార్థులను దళారులు ఇతర రాష్ట్రాల్లో ఇలా అక్రమాలు చేయడానికి వినియోగించుకున్నారు. మన రాష్ట్రంలో చేయాలంటే నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకంటే ఇక్కడ ఏ కాలేజీలో సీటొచ్చినా.. మరోచోట కలర్ జిరాక్స్ లేదా ఒరిజినల్తోనైనా రెండోచోట చేరడానికి వీలుండదు. ఒకసారి చేరాక మరోసారి కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే తన మొదటి సీటును వదులుకోవాల్సిఉంటుంది. అంటే ఒకేసారి రెండుచోట్ల చేరే అవకాశం సొంత రాష్ట్రాల విద్యార్థులకు ఉండదని వైద్య విద్యనిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కొందరు అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. -
75 కొత్త సర్కారు మెడికల్ కాలేజీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. తద్వారా ప్రస్తుతమున్న ఎంబీబీఎస్ సీట్లకు మరో 15,700 సీట్లు పెరుగుతాయి. 2021–22 విద్యా సంవత్సరం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) మెడికల్ కాలేజీల పెంపుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పాటుచేయనున్న 75 మెడికల్ కాలేజీలను జిల్లా ఆసుపత్రులతోపాటు 200/300 పడకలున్న ఆసుపత్రులకు అటాచ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే మార్కెటింగ్ సంవత్సరంలో 60లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు సంబంధించిన రూ.6,268 కోట్ల సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపింది. ఆ జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యం కొత్తగా కేటాయించే 75 మెడికల్ కాలేజీల్లో ఎక్కువ మొత్తం యాస్పిరేషనల్ (సామాజిక–ఆర్థికాభివృద్ధికి దూరంగా ఉన్న) జిల్లాలకే కేటాయించే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాల్లో వైద్యసదుపాయాల కల్పనను మెరుగుపరచడంతోపాటు వైద్యుల కొరతను అధిగమించడంపైనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ‘జిల్లా, రిఫరల్ ఆసుపత్రులను ఆధునీకరించడం కోసం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయాలన్న’కేంద్ర ప్రభుత్వ పథకం మూడో దశలో భాగంగానే ఈ 75 కాలేజీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.24,375కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) బిల్లుకు పార్లమెంటు చేసిన సవరణలపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు జూలై 17న కేబినెట్ అంగీకారం తెలపగా.. జూలై 29న లోక్సభ, ఆగస్టు 1న రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. చక్కెరకు తీపి కబురు చెరకు రైతులకు మిల్లుల వద్ద భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చేందుకు కేంద్రం మరోదఫా ఉపశమన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు దఫాల్లో చక్కెర మిల్లులపై వరాలు కురిపించిన సర్కారు.. వచ్చే మార్కెటింగ్ సంవత్సరం (ఈ అక్టోబర్లో ప్రారంభం)లో 60లక్షల టన్నులు చక్కెరను ఎగుమతి చేసేందుకు సంబంధించిన రూ.6,286కోట్ల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. తద్వారా.. దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల్లో ఉన్న మిగులు ఉత్పత్తిని వదిలించుకోవడంతోపాటు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు ఈ చర్య ఉపయోగపడనుందని సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కర్ణాటకల్లోని లక్షలమంది చెరకు రైతులకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేకూరనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జాతీయ చక్కెర ఫ్యాక్టరీల సహకార సంఘం హర్షం వ్యక్తం చేసింది. సరైన సమయంలో తీసుకున్న గొప్ప నిర్ణయంగా అభివర్ణించింది. విపత్తు నిర్వహణకు ‘సై’ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ మౌలికసదుపాయాల కూటమి (సీఆర్డీఐ) ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 23న న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో సీఆర్డీఐ ఏర్పాటును ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించనున్నారు. సీఆర్డీఐ కోసం రూ.480కోట్ల నిధిని ఏర్పాటుచేసేందుకు కూడా కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. -
హెల్త్ వర్సిటీ ఎదుట విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుంచి 550 జీవో సక్రమంగా అమలు చేయకుండా, కౌన్సిలింగ్లో అవకతవకలకు పాల్పడి సుప్రీం కోర్టు జడ్జిమెంటును వీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల్లో సైతం సరైన వివరాలను ఇవ్వలేదనీ, వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క రిజర్వేషన్ విద్యార్థికి అన్యాయం జరుగకుండా చూస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తల్లిదండ్రులు స్పందిస్తూ పిల్లల మానసిక క్షోభకు వీసీనే కారణమని, రిజర్వేషన్ ప్రకారం రీ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించాలని కోరారు.