melbourne
-
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
ఆస్టేలియాకు కార్చిచ్చు ముప్పు
మెల్బోర్న్: ఆ్రస్టేలియాను మండే ఎండలు భయపెడుతున్నాయి. మెల్బోర్న్లో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! జనవరిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది ఏకంగా 14 డిగ్రీలు అధికం. ఆగ్నేయ ఆ్రస్టేలియాలో సోమవారం తీవ్ర వడగాల్పులు వీచాయి. దాంతో కార్చిచ్చు ముప్పు పెరిగింది. ఈ నేపథ్యంలో విక్టోరియా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అగి్నమాపక ఆంక్షలు విధించారు. సోమవారం న్యూ సౌత్వేల్స్, సౌత్ ఆ్రస్టేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, క్వీన్స్ల్యాండ్, నార్తర్న్ టెరిటరీ రాష్ట్రాల్లో రెండో అగి్నప్రమాద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వేడి గాలులు పెద్ద మంటలను రేకెత్తించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2019–2020 బ్లాక్ సమ్మర్ తరువాత మళ్లీ ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2020 మంటలు 33 మందితో పాటు లక్షలాది వన్యప్రాణులను పొట్టన పెట్టుకున్నాయి. -
‘మెల్బోర్న్’ జ్ఞాపకాలు షేర్ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్! (ఫొటోలు)
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్స్ట్రాగామ్లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్ను ఓడించింది.ఆరంభ మ్యాచ్లలో విఫలంనాటి మ్యాచ్లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్తో మ్యాచ్లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్సోల్డ్గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
మెల్బోర్న్ టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
‘కుర్రాళ్ల దృక్పథం మార్చరాదు’
మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న భారత్ అందుకు అన్ని విధాలా సన్నద్ధమైంది. నాలుగో టెస్టు మ్యాచ్కు ముందు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆటగాళ్లంతా సుదీర్ఘ సాధనలో పాల్గొన్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్న దశలో ఈ మైదానంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు మంచి అవకాశం ఉంది. 2020–21 పర్యటనలో మెల్బోర్న్లో విజయంతోనే టీమిండియా సిరీస్ గెలుపు దిశగా అడుగు వేసింది. గురువారం ‘బాక్సింగ్ డే’ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత కెపె్టన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తమ సన్నాహాలపై రోహిత్ ఇచ్చిన సమాధానాలు అతని మాటల్లోనే... యశస్వి ప్రదర్శనపై... నాకు తెలిసి జైస్వాల్, గిల్, పంత్ దాదాపు ఒకే తరహా ఆటగాళ్లు. కుర్రాళ్లుగా వారి మానసిక దృక్పథం, ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. తాము ఏం చేయగలమనేది వారికి బాగా తెలుసు. కాబట్టి వాటిని మార్చే ప్రయత్నంతో పరిస్థితులను సంక్లిష్టం చేయదల్చుకోలేదు. జైస్వాల్ ఇక్కడ మొదటిసారి ఆడుతున్నాడు. అతని ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే చూశాం. అతని బ్యాటింగ్ గురించి ఎక్కువగా చర్చించి భారం మోపవద్దు. స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలి. ఆసీస్ బౌలర్లపై కూడా అతనికి మంచి అవగాహన ఉంది. అటాక్తో పాటు అవసరమైతే జైస్వాల్ డిఫెండ్ కూడా చేయగలడు. ఒక్కసారి కుదురుకుంటే ప్రమాదకారిగా మారతాడు. గిల్, పంత్ వైఫల్యంపై... శుబ్మన్ గిల్ గురించి కూడా నేను ఇదే చెబుతాను. ఆరంభంలో 30–40 పరుగులు రాబడితే చాలు ఆపై భారీ స్కోరు సాధించడం ఎలాగో గిల్కు తెలుసు. ఇలాంటివి అతను గతంలో చేసి చూపించాడు. పంత్పై కూడా ఎలాంటి ఒత్తిడీ లేదు. తన బాధ్యతలు పంత్కు బాగా తెలుసు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప ఇతర విషయాల గురించి వీరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. బుమ్రా బౌలింగ్పై... జస్ప్రీత్ బుమ్రాతో మంచి బౌలింగ్ చేయించుకోవాలంటే ఒక్కటే ఉపాయం. అతనికి అసలు ఏమీ చెప్పకుండా ఉంటే చాలు. ఏం చేయాలో, ఎలా చేయాలనే విషయంలో తన బౌలింగ్పై అతనికి చాలా స్పష్టత ఉంది. అతిగా ఆలోచించకుండా తన బౌలింగ్నే అతను నమ్ముకుంటాడు. వికెట్లు దక్కినా... దక్కకపోయినా తన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మ్యాచ్ మధ్యలో కూడా కొత్తగా బుమ్రాకు నేను ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థమైంది. తన గాయం, బ్యాటింగ్ స్థానంపై... నా మోకాలుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతా బాగుంది. జట్టులో నేను ఏ స్థానంలో ఆడతాననే విషయంపై చర్చ అనవసరం. ఏం చేసినా జట్టు మేలు కోరే ప్రణాళికలు ఉంటాయి. గత టెస్టు తర్వాత రెండు బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లు జరిగాయి. ఈ రెండు రోజుల్లో నా ఆట ఎంతగా మారిందో చూడాలి. జోరుగా ప్రాక్టీస్... భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కోహ్లి ఈ సిరీస్లో తనను ఇబ్బంది పెడుతున్న ‘ఫోర్త్ స్టంప్’ సమస్యను అధిగమించేందుకు ప్రయతి్నంచాడు. ఆఫ్స్టంప్ బయట బంతులు వేయమని చెబుతూ హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలకు సూచిస్తూ కోహ్లి బ్యాటింగ్ కొనసాగించాడు. సిరీస్లో ఇదే తరహా బంతులకు అతను వరుసగా అవుటయ్యాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్రతో భిన్నమైన బంతులు వేయించుకొని రోహిత్ సాధన చేశాడు. బుమ్రా సహా ఇతర ప్రధాన బౌలర్లందరినీ ఎదుర్కొంటూ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో మెల్బోర్న్ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో జట్టు ఆడవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కోహ్లి ఫామ్పై...విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు అని అంతా చెబుతుంటారు. అలాంటి ఆటగాళ్లకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. వారు తమకంటూ సొంత దారిని సృష్టించుకుంటారు. లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లడం ఎలాగే వారికి బాగా తెలుసు. -
వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగనున్న నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందే వేడిని పుట్టిస్తోంది. సిరీస్ పరంగా చూస్తే, భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది. దీంతో, సిరీస్ ని 1-1తో సమమైంది. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో మెల్బోర్న్ లో, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతనడంలో సందేహంలేదు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఈ మ్యాచ్ కి ముందే వేడెక్కిస్తున్నాయి.మెల్బోర్న్లో ఓవర్ హీట్..ఈ మ్యాచ్ జరిగే తరుణంలో మెల్బోర్న్ లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు.ఆటగాళ్లకు అవసరమైతే డ్రింక్స్ విరామాన్ని పెంచాలని నిర్ణయించారు. త్వరలో మెల్బోర్న్ లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అయితే ఉష్ణోగ్రత 38డిగ్రీల సెల్సియస్ దాటితే మ్యాచ్లను నిలిపివేస్తారు.అయితే క్రికెట్ లో ఇలాంటి నిబంధనలు లేవు. గతంలో 2018 లో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ లో జరిగిన టెస్ట్ సమయం లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినప్పటికీ మ్యాచ్ ని కొనసాగించారు.చెన్నైలో డీన్ జోన్స్ డబుల్, ఆసుపత్రిపాలు ప్రఖ్యాత ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జోన్స్ 1986 లో చెన్నై లోని చేపక్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 41 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.తన సుదీర్ఘ క్రీడా జీవితంలో 52 టెస్ట్లు, 164 వన్డే మ్యాచ్ లు ఆడి, రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా కూడా ప్రఖ్యాతి వహించిన జోన్స్ 59 ఏళ్ళ ప్రాయంలో ఐపీఎల్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్ లో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2017 -18 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం రూట్ ఆసుపత్రి పాలయ్యాడు, ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 4-౦ తో విజయం సాధించింది. -
ఫ్యాన్స్కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్ఆర్ఎల్ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్స్టాప్గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
Pesto the penguin: బొద్దు సూపర్స్టార్
ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ సీ లైఫ్ ఎక్వేరియంలో డజన్ల కొద్దీ నలుపు, తెలుపు పెంగి్వన్ల మధ్య చాలా పెద్దగా, బొద్దుగా ఉన్న ఏకైక పెంగి్వన్ ఇప్పుడు హాట్ఫేవరెట్గా మారింది. దాని పేరు పెస్టో. జనవరి 31వ తేదీన పుట్టినపుడు కేవలం 200 గ్రాములున్న ఈ పిల్ల పెంగి్వన్ ఈ 7 నెలల్లో విపరీతంగా పెరిగి ఇప్పుడు ఏకంగా 22 కేజీలు తూగుతూ అటూ ఇటూ తల ఎగరేస్తోంది. తల్లిదండ్రులు టాంగో, హడ్సన్ల మొత్తం బరువుకు దీని బరువు ఇది సమానం. చాక్లెట్ రంగు వెంట్రుకలు, పనస పండులాంటి నిలువెత్తు శరీరంతో ఎక్వేరియం అంతా కలియ తిరుగుతూ ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న దీనిని నేరుగా చూసేందుకు ఎక్వేరియం ఎన్క్లోజర్కు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సోషల్ మీడియా రికార్డులను బద్దలుకొడుతూ ఆన్లైన్లో దీని ఫొటోలు, వీడియోలు చూసిన వారి సంఖ్య ఏకంగా 190 కోట్లు దాటిందని ఒక అనధికార అంచనా. సాధారణ జనం దగ్గర్నుంచి కేటీ పెర్రీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీల దాకా అందరూ దీని ఫ్యాన్సే. ఇప్పటికే బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఇది రోజూ 30 చేపలను గుటకాయ స్వాహా చేస్తోంది. అయితే ఇంతటి బరువుతో దీనికి ఎలాంటి సమస్యలు లేకపోవడం విశేషం. ‘‘మరికొద్ది వారాల్లో ఇది యుక్త వయసులోకి వచ్చి 15 కేజీలకుపైగా బరువు సహజంగా కోల్పోనుంది. అప్పుడు మరింత అందంగా తయారవుతుంది’అని ఎక్వేరియంలో దీని బాగోగులు చూసే జసింటా ఎర్లీ చెప్పారు. – మెల్బోర్న్ -
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో రామ్ చరణ్.. భారత జెండా ఎగరేసి (ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్కు అరుదైన గౌరవం.. ఆ వేడుకల్లో పాల్గొననున్న హీరో!
గోబల్ స్టార్ రామ్ చరణ్కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్కు రామ్ చరణ్కు ఆహ్వానం లభించింది. ఈ వేడుకలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గానూ ఈ వేడుకలో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా అవార్డ్ అందుకోనున్నారు. విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 15-25 వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఐఎఫ్ఎం తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు కూడా రామ్ చరణ్ గౌరవ అతిథిగా రానున్నారు. మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024కి వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు రామ్ చరణ్ ఫోటో ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ అవార్డ్ను రామ్ చరణ్కు అందజేయనున్నారు. అంతర్జాతీయ వేదికపై జరుపుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో భాగమైనందుకు నేను చాలా గౌరవంగా ఉందంటూ రామ్ చరణ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.కాగా.. చివరిసారిగా ఆర్ఆర్ఆర్లో కనిపించిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్.. చెర్రీ సరసన కనిపించనుంది. Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu? pic.twitter.com/kFy7Z5zSdA— Indian Film Festival of Melbourne (@IFFMelb) July 19, 2024 -
మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి.. వర్చువల్గా హాజరైన కాకాణి, మోదుగుల
మెల్బోర్న్: ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు వర్చువల్గా హాజరయ్యారాయన. ‘‘వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదు’’ అని కాకాణి అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. అండగా నిలుస్తాం. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జూమ్ కాల్ ద్వారా పార్టీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక.. వైఎస్సార్ జయంతి సందర్భంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, మరియు నాగార్జున పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత
విదేశాలకు వెళ్లిన నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువతి, విమానాశ్రయంలోనే కన్నమూసిన ఘటన విషాదాన్ని నింపింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న మన్ప్రీత్ కౌర్ (24) మెల్బోర్న్ నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్పోర్ట్లో ఉండగా అస్వస్థతకు గురైంది. అలాగే విమానం ఎక్కి కూచుంది. సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ఉండగానే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విమాన సిబ్బంది, అత్యవసర సేవలు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించి నప్పటికీ ఫలితం లేకపోయిందని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చునని భావస్తున్నారు. జూన్ 20న ఈ ఘటన జరిగింది.దీంతో మృతురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె స్నేహితుడు, కౌర్ గ్రామానికి చెందిన గుర్దీప్ గ్రేవాల్ ప్రయత్నిస్తున్నాడు. ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందనీ, తను లేని లోటు తీరనిదంటూ గ్రేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తను చెఫ్ కావాలని కోరుకుందని గుర్తు చేసుకున్నారు. -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ బర్త్డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.వైఎస్ఆర్పీ నాయకులు వెంకట్ మేడపటి,కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా జూమ్ కాల్లో మాట్లాడి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను మళ్లీ గెలిపించి అబివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
పాక్తో రెండో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్
పాకిస్తాన్తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్ను రెండో టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. మోరిస్ బిగ్బాష్ లీగ్లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్ ఎటువంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్లో ఇప్పటికే ఆసీస్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆసీస్ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ -
ప్లీజ్.. నా భర్త మృతదేహాన్ని భారత్కు పంపించండి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రోడ్డు ప్రమాదానికి గురై భారతదేశానికి చెందిన ఖుష్దీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతదేహాన్ని భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరికి చేర్చడానికి అతని భార్య జప్నీత్ కౌర్ హార్థిక ఇబ్బందులు పడుతున్నారు. తన భర్త మృతదేహాన్ని భారత్కు తీసుకువెళ్లడానికి సాయం అందించాలని కోరుతోంది. వివరాళ్లోకి వెళ్లితే.. 26 ఏళ్ల ఖుష్దీప్.. మెల్బోర్న్లో ట్రక్ డ్రైవర్. సోమవారం రాత్రి ఖుష్దీప్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన భార్త మృతదేహాన్ని స్వదేశంలో ఉన్న అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేశారు. అదే విధంగా ఈ విషయం తెలుసుకున్న ఓ భారతీ విద్యార్థి GoFundMe ద్వారా నిధులను సేకరిస్తున్నాడు. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటున్నారు. -
మెల్బోర్న్లో దిగ్విజయంగా ముగిసిన కేసిఆర్ కప్
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో మూడు వారాల పాటు జరిగిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ఆదివారం(సెప్టెంబర్17)తో దిగ్విజయంగా ముగిసింది. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్ లోని అల్కాక్ రిజర్వ్ లోని పెవిలియన్ లో ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నీ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని ఈ టోర్నమెంట్ను నిర్వహించామని" ఆయన తెలిపారు. అదే విధంగా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం పై విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. మరోవైపు కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీని విజయవంతంగా ముగించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందాన్ని పలువురు ప్రశంసించారు. ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్,సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల ,వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ , సూర్య రావు , అశోక్ ,రాకేష్ , అమిత్ , వినోద్ కత్తుల ,విజయ్ నడదూర్ , సతీష్ ,శివ హైదరాబాద్ , హరి పల్ల, కరుణాకర్ నందవరం ,వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చదవండి: IND vs AUS: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. షెడ్యూల్, ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే -
మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్..
-
ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నేడు మెల్బోర్న్లోని పవిలియన్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ సాగనుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గ్రాండ్ ఫైనల్స్ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని, అందుకు క్రికెట్ టోర్నీనే సరైన వేదిక అని నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయి రామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్ష రెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్మనీ ఎంతంటే!
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందుకు జొకోవిచ్ మెల్బోర్న్కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది. జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు. మెల్బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. ప్రైజ్మనీ ఎంతంటే ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. సిట్సిపాస్కిది రెండోసారి సిట్సిపాస్తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లోని నాలుగో గేమ్లో సిట్సిపాస్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. టైబ్రేక్లో జొకోవిచ్ పైచేయి అదే జోరులో తొలి సెట్ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్లో జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్ 7 ఏస్లు 15 3 డబుల్ ఫాల్ట్లు 3 36 విన్నర్స్ 40 22 అనవసర తప్పిదాలు 42 2 బ్రేక్ పాయింట్లు 1 10 నెట్ పాయింట్లు 12 112 మొత్తం పాయింట్లు 94 చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా! ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు 🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT — #AusOpen (@AustralianOpen) January 29, 2023 Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0 — #AusOpen (@AustralianOpen) January 29, 2023 -
Sania Mirza: ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత -
Majestic Princess: విలాస నౌకలో 800 మందికి కరోనా
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్బోర్న్కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్గెరాల్డ్ చెప్పారు. -
విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న తెలుగోడు!
జీవితం ఎప్పుడు ఏ మలుపుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం చేసే కొన్ని పనులు ఆ క్షణంలో చూసేవారికి తప్పుగా అనిపించినా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ వాఖ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ ఆంధ్రా విద్యార్థికి సరిగ్గా సరిపోతాయి. విదేశాలలో ఓ యూనివర్సిటీలో చదివి ఆపై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకి వెళ్లాక ఏం జరిగిందో గానీ చదువుని మధ్యలోనే పక్కన పెట్టాడు. చివరికి అదే అతని జీవితాన్ని ములుపు తిప్పింది. కేవలం ఏడాది వ్యవధిలోనే మిలియన్ డాలర్ల కంపెనీకి యజమానిగా మార్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే.. అందరిలానే ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువు కోసం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో అకస్మాత్తుగా అతను తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి కాలేజ్ డ్రాప్ అవుట్గా పేరు తెచ్చుకున్నాడు. అతను ఉంటున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం కాఫీకి ప్రసిద్ధి. చిన్నప్పటి తనకీ కూడా టీ అంటే మక్కువ ఎక్కువ. ఈ రెంటిని జత కలుపుతూ ఒక ఐడియా అతని మెదడులో మెదిలింది. అప్పుడే‘డ్రాప్అవుట్ చాయ్వాలా’కు పునాది పడింది. అయితే మొదట్లో టీ షాపు అనగానే తన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాడు. తన సంకల్పానికి తోడుగా అస్రార్ అనే ఒక ఎన్ఆర్ఐ తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్ ఇన్వెస్టర్గా మారడానికి ఒప్పుకున్నారు. అలా ‘డ్రాప్అవుట్ చాయ్వాలా’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో అన్ని రకాల కాఫీలు, టీలు సమోసాలు అందుబాటులో ఉంచాడు. అక్కడి రుచులకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు సైతం ఫిదా అయ్యారు. అక్కడి భారతీయులకు ‘బాంబే కటింగ్’ టీ అంటే ఇష్టపడుతుండగా, ఆస్ట్రేలియన్లు ‘మసాలా చాయ్’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ( భారత కరెన్నీ ప్రకారం దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు -
Ind Vs Pak: ఏం మాట్లాడాలో తెలియట్లేదు.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి(82 నాటౌట్-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు. నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్ కాల్కులేషన్తో హరీస్ బౌలింగ్లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా' - మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ. 160 పరుగుల లక్ష్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
మెల్బోర్న్లో టీమిండియాకు అరుదైన గౌరవం..
టి20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు అరుదైన గౌరవం లభించింది. మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న భారత జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఇరుజట్లు మెల్బోర్న్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత జట్టు శుక్రవారం మెల్బోర్న్గవర్నర్ లిండా డెస్సాను మర్యాద పూర్వకంగా కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. మెల్బోర్న్ గవర్నర్ లిండా డెస్సా కూడా తన సోషల్ మీడియాతో టీమిండియాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడం విశేషం.''ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్లో ఆడేందుకు వచ్చిన భారత జట్టుకు హోస్ట్ సిటీగా గవర్నమెంట్ భవనంలో స్వాగత కార్యక్రమం నిర్వహించాం.''అంటూ క్యాప్షన్ జత చేశారు. కాగా శుక్రవారం క్వాలిఫయింగ్ మ్యాచ్లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్లు ప్రారంభం కానుండడంతో అసలు మజా మొదలవనుంది. క్వాలిఫయింగ్ పోరులో రెండు గ్రూఫ్ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12లో అడుగుపెట్టాయి. గ్రూఫ్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్.. గ్రూఫ్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్లు అర్హత సాధించాయి. ఇక గ్రూఫ్-2లో టీమిండియాతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్లు ఉన్నాయి. టీమిండియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. 2007లో తొలి ఎడిషన్ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆ తర్వాత ఈ ట్రోఫీని ముద్దాడలేదు. గతేడాది ఫేవరెట్లుగా బరిలో దిగినప్పటికీ తొలి రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. As the host city for the Indian National Cricket Team during the ICC Men’s T20 World Cup, hosting a welcome reception this afternoon at Government House for the players and support staff @T20WorldCup @cgimelbourne @visitvictoria @BCCI pic.twitter.com/Wb1rruDY76 — Governor of Victoria (@VicGovernor) October 21, 2022 చదవండి: సూపర్-12 మ్యాచ్లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్, వివరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్, పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు.. వారం ముందే ఎలా చెప్తారు!
టి20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న(ఆదివారం) టీమిండియా, పాకిస్తాన్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్కు సంబంధించిన టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే మ్యాచ్కు ఇంకా వారం సమయం ఉన్నప్పటికి ఆరోజు వర్షం పడే అవకాశం ఉందని.. అసలు మ్యాచ్ జరిగే అవకాశం లేదంటూ ఒక వ్యక్తి తన ట్విటర్లో పంచుకున్నాడు. వాతావారణ విభాగానికి చెందిన మ్యాప్ను షేర్ చేసిన ఆ వక్తి.. అక్టోబర్ 23న మెల్బోర్న్లో రోజంతా వర్షం పడే అవకాశం ఉందని తెలిపాడు. మాములుగానే యమ క్రేజ్ ఉండే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉందని ఒక ఆకతాయి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పోస్టు పెట్టిన సదరు వ్యక్తిని ట్విటర్లో ఏకిపారేశారు టీమిండియా అభిమానులు. ''వారం ముందే చెప్పడానికి నువ్వేమైనా దేవుడివా లేక వాతావరణ విభాగం నిపుణుడివా''.. ''సిగ్గుండాలి ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి''.. ''భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎమోషన్స్తో కూడుకున్నది.. మాతో ఆడుకోకు''.. ''మ్యాచ్ పాక్ లేదంటే టీమిండియా గెలవచ్చు.. కానీ మ్యాచ్ జరగాలి.. ఇలాంటి పిచ్చి పోస్టులు పెట్టకు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రపంచకప్ ఆరంభానికి 15 రోజుల ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడింది. తొలి మ్యాచ్లో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో జరిగిన ట్రై సిరీస్ను గెలిచిన పాక్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. ఐసీసీ మేజర్ టోర్నీలో(వన్డే, టి20 ప్రపంచకప్లు) తొలిసారి భారత్పై పాకిస్తాన్ నెగ్గడం విశేషం. మరి ఈసారి జరగనున్న మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలంటే అక్టోబర్ 23 వరకు వేచి చూడాల్సిందే. India Vs Pakistan tickets sold out in just 10 minutes. Weather forecast states that on 23rd October there will be thunderstorms and Rain whole day. 🤷🏻♂️😂😂#INDvsPAK #INDvPAK #Paisabarbaadbc pic.twitter.com/jJm0zVLJGU — Sachin pathankoti (@Sachinpathankot) October 14, 2022 Bro weather pak wins or India but fans want a good match.Plzz dont say this.just pray ky match ho jye🙄❤️ — Abdul Haسeeb (@HaseebBhatti098) October 14, 2022 Ye kesa fazool schedule hai 🥹 esy kese match rakh lete hain ye log — Irum (@Irum_kiyani786) October 14, 2022 -
ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత.. తీవ్ర విమర్శలు
వైరల్: సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. ఉక్రెయిన్-రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్యచిత్రంను(మ్యూరాల్) మెల్బోర్న్(ఆస్ట్రేలియా)నగరంలో ప్రదర్శించారు. పీటర సీటన్ అనే ఆర్టిస్ట్.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి దానిని వేశాడు. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారి వసైల్ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారాయన. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశమే. అది గీసిన ఆర్టిస్ట్కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే యత్నం చేయడం దుర్మార్గం. వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం.. కలలో కూడా ఈ ఊహ సరికాదు. ఉక్రెయిన్ కమ్యూనిటీ సంప్రదించకుండా దానిని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విటర్లో షేర్ చేశారాయన. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్ చేశారాయన. మరోవైపు ప్రముఖ సోషియాలజిస్ట్ ఓల్గా బోయ్చక్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని-బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా గూఢపుఠాణి ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ ఆర్ట్వర్క్కు పాజిటివ్ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారు సీటన్. అంతేకాదు.. దీనిని నెగెటివ్గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు. ఇదీ చదవండి: కత్తి దూసిన ఉన్మాదం.. పదిమంది దారుణహత్య -
భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ మృతి
కోల్కతా: అలనాటి మేటి ఫుట్బాలర్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సమర్ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్గా, సమర్ బెనర్జీ కెప్టెన్గా మెల్బోర్న్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత్ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్... కాంస్య పతక మ్యాచ్లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్బాల్లో విఖ్యాత మోహన్ బగాన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించిన సమర్ బెనర్జీ తన క్లబ్ జట్టుకు డ్యూరాండ్ కప్ (1953), రోవర్స్ కప్ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్ అందించారు. అనంతరం సమర్ కోచ్గా మారి 1962లో బెంగాల్ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్ ట్రోఫీని చేర్చారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమంతకు అరుదైన గౌరవం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్
స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షభంతో రెండేళ్లు వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఆగస్టు 12 నుంచి అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తనకు ఇన్విటేషన్ రావడం పట్ల సామ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్ఎఫ్ఎమ్లో భాగమయ్యాను ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిథిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిద్యం వహించడం నాకు గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరిని ఇలా ఒక్కచోట చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతి'. అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా నాగ చైతన్య నుంచి విడిపోయాక సామ్ కెరీర్ ముగిసినట్లేనని అందర భావించారు. అయితే అలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శాకుంతలం, యశోద అనే రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు, విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’లో నటిస్తున్నారు. -
NRI News: కలలో కూడా ఊహించనిది జరిగింది
ఆస్ట్రేలియాలో ఓ భారత సంతతి కుటుంబం ఒకటి రేసిజం దాడికి గురైంది. మెల్బోర్న్ లిన్బ్రూక్ హోటల్ కార్ పార్క్లో ఆ కుటుంబంపై దాడి జరిగింది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తిని దుండగులు తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో ఒకరోజంతా ఉన్న బాధితుడు.. కోలుకున్నాక ఆ అనుభవాన్ని స్థానిక మీడియాకు వెల్లడించారు. తన సోదరిని రక్షించే క్రమంలో 54 ఏళ్ల లిన్ బామ్ దారుణంగా గాయపడ్డారు. ఆయన్ని కిందపడేసి పిడిగుద్దులు గుద్దడంతో పాటు కాలిలో కడుపులో తన్నారు. ‘జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఊహించలేదు. కిందపడేసి కాళ్లతో తన్నారు’ అంటూ బాధితుడు బామ్ మీడియా ముందు వాపోయారు. కారు దిగి వెళ్తున్న మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచిపొమ్మని బూతులు తిట్టారు. రేసిజం గురించి తెలుసు. కానీ, ఈ స్థాయిలో తమపై దాడి చేయడం ఘోరమని అంటూ బామ్ సోదరి జాక్వెలిన్ ప్రకాశమ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి.. 23 ఏళ్ల కెర్రీ ప్రకాశమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కెర్రీ.. తన తండ్రి కెయిత్, తల్లి జాక్వెలిన్, అంకుల్ లిన్పై ఈ దాడి జరిగిందంటూ ఒక పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 12న రాత్రి ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని ఆరోపిస్తోంది ఆ కుటుంబం. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
మెల్బోర్న్: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్వర్క్ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు. రష్యా దూకుడుకు భారీ మూల్యమే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో భేటీ అయ్యారు. విఫల ప్రయోగం: చైనా క్వాడ్పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
గమ్యస్థానం చేరిన జేమ్స్వెబ్ టెలిస్కోప్
మెల్బోర్న్: మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్ వెబ్ టెలిస్కోపు తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)ను చేరినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఎల్2 పాయింట్ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్లో ఇకపై వెబ్ టెలిస్కోప్ పరిభ్రమణ జరుపుతుంది. నెల రోజుల క్రితం ఈ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపారు. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా దీని నిర్మాణం జరిగింది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్మెంట్) చెందడం వంటి పను లు పూర్తి చేయాల్సిఉంది. లక్ష్యాన్ని చేరడానికి ఒక రోజు ముందే టెలిస్కోప్లోని 18 దర్పణాలు పూరి ్తగా తెరుచుకోవడం విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. -
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
అడవి పందులు అంత డేంజరా?
మెల్బోర్న్: అడవి పందులు.. పంటలకు ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా స్థానిక వన్యప్రాణులకు ఇవి ముప్పుగా మారుతున్నాయి. భూగోళంపై జీవజాతుల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతున్న వాతావరణ మార్పులకు సైతం అడవి పందులు కారణమవుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ట్రాక్టర్లతో నేలను దున్నినట్లుగా అడవి పందులు నేలను తవ్వేస్తుంటాయి. ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అడవి పందులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రతి ఏటా తవ్వుతున్న భూవిస్తీర్ణం ఎంతో తెలుసా? తైవాన్ దేశ విస్తీర్ణంతో సమానం. భూమిలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అడవి పందుల తవ్వకం వల్ల ఏటా 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి వెలువడి వాతావరణంలో కలుస్తోంది. ఇది 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానం. ఒకప్పుడు యూరప్, ఆసియాకే పరిమితమైన అడవి పందులు క్రమంతా ఇతర ఖండాలకు సైతం విస్తరించాయి. ఆస్ట్రేలియాలో 30 లక్షల అడవి పందులు ఉన్నట్లు అంచనా. ఆస్ట్రేలియాలో ఇవి ఏటా 10 కోట్ల డాలర్ల మేర పంట నష్టం కలుగజేస్తున్నాయి. ఇక అమెరికాలో వీటి కారణంగా కేవలం 12 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 27 కోట్ల డాలర్ల విలువైన పంట నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 672 రకాల వన్యప్రాణులు, మొక్కలకు అడవి పందులు పెద్ద ముప్పుగా తయారయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో వీటి ఆవాస ప్రాంతాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వీటి సంతతి పెరిగితే మనుషుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అడవి పందుల వల్ల పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
వైరల్ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!
కాన్బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్కి చెందిన జాక్కి విలియమ్స్(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. దీని పై విలియమ్స్ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్సైట్లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని జాక్కి విలియమ్స్ పేర్కొంది. -
జొకోవిచ్దే ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో మెద్వెదెవ్ తొలి సెట్లో మాత్రమే జొకోవిచ్ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో కెరీర్లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ను.. మొత్తంగా 18వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్స్లామ్స్తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా
మెల్బోర్న్: జపనీస్ టెన్నీస్ స్టార్ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బార్డీ(22వ సీడ్)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్) కెరీర్లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్గా ఆమె కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్(2018, 2020)టైటిల్స్తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్(2019,2021) టైటిల్స్ ఉన్నాయి. కాగా నేటి ఫైనల్ మ్యాచ్లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. 𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉. When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh — #AusOpen (@AustralianOpen) February 20, 2021 -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్లోనే వెనుదిరిగింది. 25వ సీడ్ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్లో ఫుంజుకొని 3-6తో సెట్ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్ను గెలుచుకొని సెమీస్కు ప్రవేశించింది. 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ, అన్సీడెడ్ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ముచోవా సెమీస్లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్లో సొరానా కిర్స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్లో గెలిచి సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వారంటైన్కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని
మెల్బోర్న్ : భారత్లో క్రికెట్ను అభిమానులు ఒక మతంలా చూస్తారు. ఇక టీమిండియా ఆటగాళ్లను ఎంతలా ఆరాధిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో వాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు కలలు కంటారు. అలాంటిది వాళ్లు నేరుగా కళ్ల ముందే ప్రత్యక్షమైతే ఆ అనుభవం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. తాజాగా మెల్బోర్న్లో ఒక ఇండియన్ అభిమానికి అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. బాక్సింగ్ డే టెస్ట్ విజయంతో కాస్త రిలాక్స్ మోడ్లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ న్యూ ఇయర్ సందర్భంగా మెల్బోర్న్లోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. తమకు నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న నవల్దీప్ సింగ్ టీమిండియా క్రికెటర్లు కూర్చున్న టేబుల్కు ఎదురుగా కూర్చున్నాడు. క్రికెటర్లను చూసి మురిసిపోయిన నవల్దీప్ సింగ్ ఆటగాళ్లు భోజనం చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. ఈ సందర్భంగా వాళ్లకు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు.(చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్) క్రికెటర్ల భోజనం పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్దీప్ సింగ్ వైపు చూపించారు దీంతో రోహిత్ శర్మ, పంత్లు నవల్దీప్ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్దీప్ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. 'మీ మీద ఉన్న అభిమానంతోనే బిల్లు చెల్లించానని.. మిమ్మల్ని ఇంత దగ్గర్నుంచి చూడడం సంతోషం కలిగించిదని' చెప్పాడు. అనంతరం తన అభిమాన క్రికెటర్లతో సెల్ఫీ దిగిన నవల్దీప్ను ఈ విషయాన్ని తన ట్విటర్లో పంచుకున్నాడు. 'లంచ్ స్పాన్సర్ చేసినందుకు రోహిత్, పంత్ సహా అందరూ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం పంత్ నా భార్య దగ్గరకు వచ్చి మెల్బోర్న్లో మాకు మంచి లంచ్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ బాబీ అని చెప్పాడు. నా సూపర్స్టార్స్ కోసం చేసిన ఈ చిన్న పని నాకు సంతోషాన్ని కలిగించిందంటూ' ట్విటర్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF — Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021 ఇక నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. మాయాంక్ స్థానంలో రోహిత్ శర్మ చేరికతో టీమిండియా బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కాగా.. మూడో టెస్టుకు విహారి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మెల్బోర్న్ టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో టి. నటరాజన్ను ఎంపిక చేశారు. కాగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. -
రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి
మెల్బోర్న్ : టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే మరో అరుదైన ఘనత సాధించాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో 112 పరుగులతో చెలరేగిన రహానే భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి కావడం విశేషం. (చదవండి : 'క్వారంటైన్ తర్వాత మరింత యంగ్ అయ్యావు') ప్రతిష్టాత్మక హానర్స్ బోర్దులో ఆస్ట్రేలియా గ్రౌండ్ సిబ్బంది తన పేరును చెక్కే వీడియో క్లిప్ను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. 2014లో తొలిసారి రహానే పేరును హానర్స్ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్లో రహానే 147 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇదే మైదానంలో 169 చేసి హానర్స్ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. పర్యాటక జట్లకు చెందిన ఆటగాళ్లు టెస్టు సెంచరీ లేదా కనీసం ఐదు వికెట్లు తీసిన వారి పేర్లను హానర్స్ బోర్డులో చేర్చుతారు. ఇక ఆసీస్, భారత్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి మొదలుకానుంది. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) A look at the Honours Board at the G. .@ajinkyarahane88 scored a Test century in 2014 and here he is today all set to get his name engraved again. Well done, Skip 💯#AUSvIND pic.twitter.com/1YfqQl3DKk — BCCI (@BCCI) December 27, 2020 -
రోహిత్కు టీమిండియా గ్రాండ్ వెల్కమ్
మెల్బోర్న్ : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మెల్బోర్న్ హోటల్ రూంలో బుధవారం సాయంత్రం టీమిండియా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ఫిట్నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన రోహిత్ కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాడు. తాజాగా బుధవారం సాయంత్రం మెల్బోర్న్లోని హోటల్ రూలంలో ఉన్న టీమిండియా జట్టును కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా తదితర ఆటగాళ్లు రోహిత్కు ఘనస్వాగతం పలికారు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రోహిత్తో కాసేపు ముచ్చటించాడు.(చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) అయితే టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి రోహిత్తో అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హాయ్ రోహిత్.. 14రోజుల క్వారంటైన్ ఎలా ఉంది.. క్వారంటైన్ తర్వాత చాలా యంగ్గా కనిపిస్తున్నావు అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ ఆడే అవకాశాలున్నాయి. కాగా నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరోవైపు తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్ అగర్వాల్ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి : రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) Look who's joined the squad in Melbourne 😀 A warm welcome for @ImRo45 as he joins the team 🤗#TeamIndia #AUSvIND pic.twitter.com/uw49uPkDvR — BCCI (@BCCI) December 30, 2020 -
పైన్ అద్భుత క్యాచ్కు పుజారా బలి
మెల్బోర్న్ : ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా కమిన్స్ బౌలింగ్లో పైన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాల్సి వచ్చింది. (చదవండి : సిరాజ్... ఇప్పుడే వద్దులే!) కమిన్స్ వేసిన గుడ్లెంగ్త్ బంతి పుజారా బ్యాట్ను ఎడ్జ్లో తాకుతూ కీపర్ వైపు వెళ్లింది. ఫైన్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 57 ఓవర్లలో 166 పరుగులు చేసింది. రహానే 43, పంత్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) A pearler of a pluck from Paine! And it's the big wicket of Pujara too!@hcltech | #AUSvIND pic.twitter.com/q4rFhCb7Yj — cricket.com.au (@cricketcomau) December 27, 2020 -
మయాంక్ డకౌట్.. ముగిసిన తొలి రోజు ఆట
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. వన్డౌన్లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం చూపించింది. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటింగ్లో వేడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెడ్ 38 పరుగులు చేశాడు. భారత బౌలింగ్లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు టీమిండియా బౌలర్ బుమ్రా తొలి షాక్ ఇచ్చాడు .ఆసీస్ ఓపెనర్ బర్న్స్ను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 136 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. -
అతనికి అరుదైన గౌరవం.. రహానేకే సాధ్యం
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్కు వెళ్లే సందర్భంలో మహ్మద్ సిరాజ్ను జట్టును లీడ్ చేశాడు. ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ విరామం ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రహానే సిరాజ్ వద్దకు వెళ్లి ..నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. టీమ్ మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే తెలిపాడు.(చదవండి : మైండ్గేమ్ ఆడనివ్వండి.. మేం మాత్రం: రహానే) రహానే చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్కుండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే చెల్లింది.. రహానే చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. భారత బౌలర్లు విజృంభించడంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమిన్స్ 2, లయన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్, బుమ్రా చెరో 3, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు) -
క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు
మెల్బోర్న్ : టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్కు పెట్టింది పేరు. ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడిన జడేజా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్ క్యాచ్తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) మిడాన్లో ఉన్న జడేజా క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్ గ్యాప్ రావడంతో మిడాఫ్లో ఉన్న గిల్ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్ను తాకింది. దీంతో క్యాచ్ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్ అవుట్గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ టీ విరామం అనంతరం 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 7, కెప్టెన్ టిమ్ పైన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా బౌలర్ బుమ్రా ఆసీస్ ఓపెనర్ బర్న్స్ను డకౌట్ చేశాడు.దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) Almost disaster! But Jadeja held his ground and held the catch! @hcltech | #AUSvIND pic.twitter.com/SUaRT7zQGx — cricket.com.au (@cricketcomau) December 26, 2020 ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్
మెల్బోర్న్ : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులు, ట్రెవిస్ హెడ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్ల్లో, భారత్ 28 మ్యాచ్ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడి, 12 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. -
బాక్సింగ్ డే టెస్టు : షా అవుట్.. గిల్, పంత్లకు చోటు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ఒకరోజే ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్గా విఫలమైన పృథ్వీ షాను జట్టు మేనేజ్మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానంలో శుబ్మాన్ తుది జట్టులోకి రాగా.. మొదటిటెస్ట్ మ్యాచ్లో గాయపడిన బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో సిరాజ్ను ఎంపిక చేశారు. మొదటి మ్యాచ్లో కీపర్గా విఫలమైన సాహా స్థానంలో రిషబ్ పంత్ను ఎంపికచేయగా .. కేఎల్ రాహుల్కు మరోసారి నిరాశే మిగిలింది. (చదవండి : 'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్కు ఎందుకివ్వరు') ఆసీస్తో జరిగిన తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజాను ఆల్రౌండర్ కోటాలో రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఇక మయాంక్తో కలిసి శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్డౌన్లో పుజారా బ్యాటింగ్ చేయనున్నాడు. అజింక్యా రహానే, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ఇక బుమ్రా ,ఉమేశ్ యాదవ్, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్లు బౌలింగ్ భారం మోయనున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. కాగా మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. (చదవండి : 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా') టీమిండియా తుది జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
రాహుల్ ఫొటోలపై బాలీవుడ్ నటి కామెంట్
మెల్బోర్న్: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సహచరులతో కలిసి మెల్బోర్న్ పుర వీధుల్లో చక్కర్లు కొట్టాడు. వింటర్ సూట్ ధరించిన రాహుల్ అక్కడున్న బెంచీలపై కూర్చుని సేద తీరాడు. ఈ విశేషాలన్నీ ‘మెల్బోర్న్ ఆర్కివ్స్’ అంటూ అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. అభిమానులు స్పందించారు. రాహుల్ ఫ్యాషన్ సెన్స్ బాగుందంటూ కితాబిచ్చారు. బాలీవుడ్ నటి అథియా శెట్టీ కూడా రాహుల్ ఫొటోలు బాగున్నాయని చెప్తు.. హార్ట్ ఎమోజీతో కామెంట్ చేసింది. అథియా, రాహుల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆటవిషయానికి వస్తే.. ఐపీఎల్ 13వ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కెప్టెన్గా కింగ్స్ పంజాబ్ జట్టును ముందుండి నడిచాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు వన్డేల్లో కలిపి 76 పరుగులు, మూడు టీ20ల్లో 81 పరుగులే చేశాడు. ఇక టెస్టు జట్టులోనూ చోటుదక్కించుకున్న రాహుల్ పింక్బాల్ టెస్టులో తుది జట్టులో మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా, అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. తన టెస్టు చరిత్రలోనే 36 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసింది. రేపటి నుంచి మెల్బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టులో రాహుల్ మైదానంలోకి దిగే అవకాశముంది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@rahulkl) -
ఆసీస్కు షాక్ : ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం
మెల్బోర్న్ : ఆ్రస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ అబాట్ రెండో టెస్టుకూ దూరమయ్యారు. గజ్జల్లో గాయంతో వార్నర్, కండరాల గాయంతో అబాట్ తొలి టెస్టు ఆడలేకపోయారు. దీంతోపాటే వీళ్లిద్దరు బయో బబుల్ దాటి బయటికి రావడంతో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టు కూడా ఆడే వీలు లేకుండా పోయింది. పైగా వార్నర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు! ‘సిడ్నీలోని నార్తర్న్ బీచ్ వద్ద కరోనా హాట్స్పాట్ న్యూసౌత్వేల్స్ ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా అక్కడి నుంచే మెల్బోర్న్కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వాళ్లిద్దరిని జట్టుతో కలిసేందుకు అనుమతించడం లేదు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి : ధోని రనౌట్కు 16 ఏళ్లు..) శుబ్మన్కు అవకాశం! మెల్బోర్న్: తొలి టెస్టులో ఎదురైన పరాభవం దృష్ట్యా రెండో టెస్టు కోసం భారత జట్టు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్మన్ గిల్ నెట్స్లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్ వార్మప్ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో 43, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇతని కంటే పృథ్వీ షా అనుభవజ్ఞుడు కావడంతో అతన్నే ఆడించారు. కానీ షా 0, 4 పరుగులతో జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రంజీల్లో పంజాబ్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేసే 21 ఏళ్ల శుబ్మన్వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా నెట్స్లో శ్రమించారు. పేసర్లు సిరాజ్, నవ్దీప్ సైనీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ) -
భారతీయురాలినని బస్సులో నుంచి దింపేశారు
మెల్బోర్న్: తాను కూడా జాతి వివక్షకు గురైన బాధితురాలినేనంటూ విచారం వ్యక్తం చేసింది టీవీ నటి చాందిని భగ్వనాని. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న ఆమె తనకు ఎదురైన చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దీని ప్రకారం.. ఆమె మెల్బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే అక్కడ బస్సు ప్రయాణం ఆమెకు అదే తొలిసారి. బస్సు ఎన్నో మలుపులు తిరుగుతుండటంతో గాబరా పడ్డ ఆమె డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఇది సరైన స్థానానికే వెళ్తుందా? అని అడిగింది. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు సైతం ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే కురిపించగా వారికి సున్నితంగా, గౌరవంగా జవాబిచ్చాడు. ఇంతకుముందు తాను అడిగింది వినలేదేమోనని ఆమె మరోసారి ప్రయత్నం చేయగా నిశ్శబ్ధమే రాజ్యమేలింది. (నా చర్మం రంగు విలువ ఎంత?) దీంతో మరింత కంగారుపడిన చాందిని అసలు ఎందుకు స్పందించడం లేదని అడగ్గానే డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోతూ కసురుగా వెళ్లిపొమ్మన్నాడు. "నేను చాలా మర్యాదగా అడిగాను కానీ అతను వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడు. 'చెత్త భారతీయులారా..ఇక్కడి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. అతనిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాలనేది తోచలేదు. వణుకుతూనే బస్సు దిగిపోయాను. జాతి వవక్ష ఇంకా ఉంది అనడానికి నాకు జరిగిన ఈ అనుభవమే నిదర్శనం" అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయడం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఆమె చివరిసారిగా "సంజీవని" వెబ్సిరీస్లో కనిపించింది. (రేసిజానికి అర్థం మార్చేసింది!) #racism #notcool #ptv #Melbourne smallest act of racism is as serious as another major act of racism pic.twitter.com/aysID8Wg9r — Chandni Bhagwanani (@chandnib21) July 9, 2020 -
టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్
మెల్బోర్న్: రియల్ ఎస్టేట్ మాయలు, జిమ్మిక్కులు ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. తాము డెవలప్ చేసినవి అమ్ముకోవాలన్నా, సొమ్ము చేసుకోవాలన్నా... కొనుగోలు దారుల కంట్లో పడాలని ఆసీస్ వెంచర్ యజమాని మన క్రికెటర్ల పేర్లపై పడ్డాడు. మెల్బోర్న్లోని రాక్బ్యాంక్ ప్రాంతంలో అకొలేడ్ ఎస్టేట్ ఓ వెంచర్ని అభివృద్ధి చేసింది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ వెంచర్ డైరెక్టర్ అక్కడి వీధులకు సచిన్, కోహ్లి, కపిల్ దేవ్ల పేర్లు పెట్టారు. టెండూల్కర్ డ్రైవ్, కోహ్లి క్రెసెంట్, దేవ్ టెర్రస్లతో బోర్డులు పాతాడు. అలాగే విదేశీ ఇతర దేశ అభిమానుల కోసం మిగతా వీధులకు వా స్ట్రీట్, మియందాద్ స్ట్రీట్, ఆంబ్రోస్ స్ట్రీట్, సోబర్స్ డ్రైవ్, కలిస్ వే అనే పేర్లు పెట్టారు. దీనిపై ఆ వెంచర్ డైరెక్టర్ ఖుర్రమ్ సయీద్ మాట్లాడుతూ తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్ వీధులకు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల పేర్లకు ఆమోదం కోసం 60 పేర్లతో స్థానిక మెల్టన్ కౌన్సిల్కు అతను దరఖాస్తు చేశాడు. -
‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’
మెల్బోర్న్ : ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికూనను కాపాడటానికి రెండున్నర మీటర్ల పొడవైన కొండచిలువతో నగ్నంగా పోరాడాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని కునునుర్రాకు చెందిన నిక్ కియాన్స్ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి బెడ్ మీద నిద్రపోతున్నాడు. గార్డెన్లోనుంచి ఏవో శబ్ధాలు రావటంతో నిద్రలోంచి మెలుకున్నాడు. ఏంటా అని చూస్తే.. అతని పెంపుడు పిల్లి కూన లిల్.. కొండ చిలువ బారిన పడి అరుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అతడు బెడ్పై నుంచి నగ్నంగా గార్డెన్లోకి పరిగెత్తాడు. ( కిచెన్లో బయటపడ్డ విషపూరిత పాము ) పిల్లిని పట్టుకుని దాన్ని కొండచిలువ నుంచి తప్పించటానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాము పిల్లిని వదిలేసింది. కానీ, ఆ వెంటనే అతడి చేతిని బాగా కొరికింది. రక్తం ధారలు కడుతున్నా పట్టించుకోకుండా పిల్లి ని కాపాడానన్న ఆనందంలో మునిగిపోయాడు నిక్. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘‘ కొన్ని సంవత్సరాలకు ముందు పాముల్ని పట్టుకోవటంలో శిక్షణ తీసుకోవటం కలిసొచ్చింది. పాము లిల్ను పట్టుకోవటం చూడగానే.. బెడ్పై నుంచి కిందకు దూకి గార్డెన్లోకి పరిగెత్తాను. అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవ’’ని చెప్పాడు. ( కిచెన్లో బాత్రూమ్: ‘ఓనర్ను జైలులో వేయాలి’ ) -
ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహిస్తారా?
మెల్బోర్న్ : స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టి20 ప్రపంచకప్ను నిర్వహించవచ్చంటూ వస్తున్న కొన్ని ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ విస్మయం వ్యక్తం చేశాడు. కోవిడ్–19 కారణంగా టోర్నీ నిర్వహణ సమస్యగా మారడంతో టీవీ ప్రేక్షకుల కోసమే మ్యాచ్లు జరపాలంటూ కొందరు చేసిన సూచనలపై అతను తీవ్రంగా స్పందించాడు. ‘ఖాళీ స్టేడియాల్లో ప్రపంచ కప్ ఆడటాన్ని నేను అసలు ఊహించలేను. అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టోర్నీతో సంబంధం ఉన్నవారంతా దేశం మొత్తం తిరుగుతూ ఆడవచ్చు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా. నాకు తెలిసి ఇది జరిగే అవకాశం లేదు. కరోనా బాధ తగ్గి అంతా సాధారణంగా మారిన తర్వాత దీనిని నిర్వహించండి లేదా దీనిని ప్రస్తుతానికి రద్దు చేసి అవకాశం ఉన్న మరో తేదీల్లో సర్దుబాటు చేయండి’ అని బోర్డర్ సూచించాడు. విధ్వంసక ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు వరల్డ్ కప్ జరుగుతోందని చెబితే ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని అతను అన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా, 61 మంది చనిపోయారు. -
మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు!
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ను ఆసీస్ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెగా కప్ను ఐదోసారి అందుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61 నాటౌట్; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) కాగా, ఈ టీ20 కప్ ఫైనల్ మ్యాచ్లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్కు హాజరయ్యారు. దాంతో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్గా నిలిచింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్ ఈవెంట్ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్ ఇదే. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్కు ఇంతటి విశేష ఆదరణ రావడం ఇక్కడ మరో విశేషం. ఓవరాల్గా చూస్తే మహిళల స్పోర్ట్స్ ఈవెంట్లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్ వరల్డ్కప్ ఫైనల్. 21 ఏళ్ల నాటి మహిళల సాకర్ ఫైనల్ మ్యాచ్కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. (మన వనిత... పరాజిత) -
మహిళల టీ20 వరల్డ్కప్ శ్రీలంకపై భారత్ ఘన విజయం
-
వరల్డ్ టీ20: భారత్ జైత్రయాత్ర
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్కప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించి తమ చివరి గ్రూప్ మ్యాచ్ను అజేయంగా ముగించింది. ఫలితంగా గ్రూప్-ఎలో టాప్ ప్లేస్ను ఖాయం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్లో శ్రీలంక మహిళలు నిర్దేశించిన 114 పరుగుల టార్గెట్ను భారత జట్టు 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక మహిళలు నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేశారు. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. (కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా?) భారత బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా, మరో స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు తలో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టులో ఓపెనర్ స్మృతీ మంధాన(17) మరోసారి నిరాపరిచారు. కాగా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ తన ఫామ్ను కొనసాగించారు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన షఫాలీ అనవసర పరుగు కోసం యత్నంచి రనౌట్ అయ్యారు. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలం కాగా, రోడ్రిగ్స్( 15 నాటౌట్), దీప్తి శర్మ(15 నాటౌట్)లు చివరి వరకూ క్రీజ్లో ఉండి మ్యాచ్ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్కు వరుసగా నాల్గో విజయం. గత మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్లో కూడా గెలుపును అందుకుని తమ తిరుగులేదని నిరూపించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీమిండియా టార్గెట్ 114 పరుగులు
మెల్బోర్న్ : టీ 20 ప్రపంచకప్లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో శ్రీలంక టీమిండియాకు 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో లంక 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక బ్యాట్స్వుమెన్లలో చమారి ఆతపత్తు 33 పరుగులు, కవిషా దిల్హరి 25* పరుగులతో రాణించగా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాదా యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, శిఖా పాండే, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆసాంతం భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్వుమెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా ఇప్పటికే హాట్రిక్ విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి గ్రూఫ్ టాపర్గా నిలవనుంది. ప్రసుత్తమున్న టీమిండియా బ్యాటింగ్ లైనఫ్ చూస్తే 114 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో పెద్దగా కష్టపడనక్కర్లేదనిపిస్తుంది. -
తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..
-
ఎవరైనా నన్ను చంపేయండి!..
మెల్బోర్న్ : మరుగుజ్జు రూపమే ఓ విద్యార్థి బాధలకు కారణమైంది. స్కూల్లో తోటి విద్యార్ధులు అవమానాలకు గురిచేయటం తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ కన్నతల్లి ముందే కన్నీరుపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిస్బేన్కు చెందిన క్వాడెన్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియా అనే మరుగుజ్జుతనం కారణంగా బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లోని తోటి విద్యార్థులు అతన్ని బాగా అవమానించేవారు. అయినా అతడు వారి మాటలను భరించేవాడు. కానీ, వారి అవమానాలు రోజురోజుకు పెరగసాగాయి. గత బుధవారం రోజు కూడా క్వాడెన్ను తీవ్రంగా అవమానించారు. దీంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం తల్లి యర్రాక బైల్స్ అతడ్ని తీసుకెళ్లటానికి స్కూల్ దగ్గరకు వచ్చింది. మౌనంగా కారులోకి వచ్చి కూర్చున్న అతడు ఏడవటం ప్రారంభించాడు. కొడుకు ఏడ్వటం గమనించిన తల్లి ఏమైందని అడిగింది. క్వాడెన్ తనకు జరిగిన అవమానాన్ని తల్లితో చెప్పుకున్నాడు. ‘నాకు తాడు ఇవ్వండి! నేను ఉరివేసుకుంటా. నా గుండెల్లో కత్తితో పొడుచుకుని చనిపోవాలనుంది.. లేకపోతే ఎవరైనా నన్ను చంపేయండి!.. నేను చనిపోవాలి.. నా ఒళ్లంతా గీసుకుంటా..’ అంటూ కన్నతల్లిముందు కన్నీరుమున్నీరయ్యాడు. తల్లి యర్రాకతో క్వాడెన్ కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన యర్రాక దాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో ఉంచింది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో అన్ని వర్గాలనుంచి అతడికి మద్దతు తోడైంది. దీనిపై యర్రాక బైల్స్ స్పందిస్తూ.. ‘‘ మా అబ్బాయి అవమానాల పాలు కావటం కొత్తేమీ కాదు. అవమానాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేశాడు. మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాలను సీక్రెట్గా.. స్కూల్ ప్రిన్సిపల్కు చెప్పి ఊరుకునే దాన్ని. కానీ, ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్తపడాలని నేను వీడియోను పబ్లిక్ ముందు ఉంచాన’ని తెలిపింది. -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
జొకోవిచ్దే ఆస్ట్రేలియా ఓపెన్
-
మళ్లీ జొకోవిచ్దే ఆస్ట్రేలియా ఓపెన్
-
ఒకరు టైటిల్ గెలిస్తే.. మరొకరు మనసులు గెలిచారు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఒకవైపు.. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్ థీమ్ మరొకవైపు. దాంతో పోరు ఏకపక్షమే అనుకున్నారు. కానీ జొకోవిచ్కు థీమ్ ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు నాలుగు గంటల పాటు పోరాడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. చివరి వరకూ పోరాడి ఓడినా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చిన్నచిన్న పొరపాట్లు థీమ్ ఓడేలా చేస్తే.. అనుభవాన్ని ఉపయోగించి కడవరకూ రేసులో ఉన్న జొకోవిచ్ మరోసారి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ రోజు(ఆదివారం) జరిగిన పురుషుల ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో థీమ్పై గెలిచి టైటిల్ను సాధించాడు. ఇది జొకోవిచ్ ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కాగా, ఈ టోర్నీలో థీమ్కు ఇదే తొలి ఫైనల్. తొలి సెట్ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న జొకోవిచ్.. రెండో సెట్ను చేజార్చుకున్నాడు. అద్భుతమైన ఏస్లతో చెలరేగిన థీమ్ రెండో సెట్ను అవలీలగా గెలిచాడు. ఇక మూడో సెట్లో కూడా అదే ఊపును కనబరిచి జొకోవిచ్పై పైచేయి సాధించాడు. దాంతో నాలుగు, ఐదు సెట్లను గెలవాల్సిన పరిస్థితికి జొకోవిచ్కు ఎదురైంది. కీలక సమయంలో ఎదురునిలిచిన జొకోవిచ్ ఎటువంటి పొరపాట్లు చేయలేదు. థీమ్ చేత పొరపాట్లు చేయిస్తూ ఒక్కో పాయింట్ సాధిస్తూ సెట్ను గెలుచుకున్నాడు. ఫలితంగా రేసులోకి వచ్చేశాడు. ఇక మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్లో జొకోవిచ్ మిక్కిలి శ్రమించాడు. ఈ సెట్లో ఇద్దరి స్కోరు సమంగా ఉన్న దశలో జొకోవిచ్ తనలోని అసలైన ఆటను బయటకు తీశాడు. థీమ్ను వెనక్కి నెడుతూ ఆ సెట్తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ అంటేనే తనదనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇది జొకోవిచ్కు ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్ కాగా, ఓవరాల్గా 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ను అత్యధికంగా గెలిచిన రికార్డును జొకోవిచ్ మరోసారి సవరించుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్లో విజేతగా నిలవడం ద్వారా ఎమర్సన్, ఫెడరర్ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్లో జొకోవిచ్ (2020, 2019, 2016, 2015, 2013, 2012, 2011, 2008)ఫైనల్కు చేరిన ఎనిమిది సార్లూ విజేతగా నిలవడం మరో విశేషం. -
హిట్ వికెట్ సెలబ్రేషన్స్.. కానీ నాటౌట్
మెల్బోర్న్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈరోజు మెల్బోర్న్ స్టార్స్-సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో హిట్ వికెట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్మన్ అయిన స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని తప్పించుకునే క్రమంలో వికెట్లను చేతితో పడగొట్టాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న హరిస్ రాఫ్ వేసిన ఒక బంతి బౌన్స్ కాగా, దాన్ని స్మిత్ తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే ఆ క్రమంలోనే స్మిత్ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లడంతో బెయిల్స్ కిందిపడిపోయాయి. దాంతో అప్పటికి ఇంకా పరుగులు ఖాతా ఆరంభించకపోవడంతో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. (ఇక్కడ చదవండి: ఫించ్ సెంచరీ చేస్తే.. స్మిత్ ఓడించాడు!) దీనిపై ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ను సంప్రదించగా అది నాటౌట్గా తేల్చాడు. స్మిత్ వికెట్లను తాకడానికి కంటే ముందుగానే బెయిల్స్ పైకి లేచిపోవడంతో నాటౌట్ ఇచ్చాడు. ఆ సమయంలో గాలి కారణంగా బెయిల్స్ లేచాయని భావించిన థర్డ్ అంపైర్ అది హిట్ వికెట్గా ఇవ్వలేదు. దాంతో మెల్బోర్న్ స్టార్స్ ఆనందం ఆవిరైంది. కానీ స్మిత్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 24 పరుగులు చేసి ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఆ తర్వాత మెల్బోర్న్ స్టార్స్ 99 పరుగులకే ఆలౌట్ కావడంతో పరాజయం పాలైంది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్ ఫైనల్కు చేరగా, మెల్బోర్న్ స్టార్స్ రెండో క్వాలిఫయర్(చాలెంజర్ మ్యాచ్) ఆడటానికి సిద్ధమైంది. Hit wicket? Don't think so! 🙊 The wind has just had a go at getting Steve Smith out! 💨 A @KFCAustralia Bucket Moment | #BBL09 pic.twitter.com/saGREjWJmO — KFC Big Bash League (@BBL) January 31, 2020 -
జొకోవిచ్ జోరు
మెల్బోర్న్: తన జోరును కొనసాగిస్తూ పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ డీగో ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా)పై గెలుపొందాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కెనడాకు చెందిన 32వ సీడ్ మిలోస్ రావ్నిచ్తో జొకోవిచ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రావ్నిచ్ 6–4, 6–3, 7–5తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. ష్వార్ట్జ్మన్తో రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ ఎనిమిది ఏస్లు సంధించి కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ తన సరీ్వస్ను ఒకసారి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో ఏడుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత జొకోవిచ్ కేవలం ఒక సెట్ మాత్రమే కోల్పోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 4–6, 6–1, 6–2, 6–2తో మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)పై గెలుపొందగా... టెనిస్ సాండ్గ్రెన్ (అమెరికా) 7–6 (7/5), 7–5, 6–7 (2/7), 6–4తో 12వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)ని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్తో పోరుకు సిద్ధమయ్యాడు. జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మూడో రౌండ్లో అతికష్టమ్మీద గట్టెక్కిన ఫెడరర్ ఈ మ్యాచ్లోనూ తొలి సెట్ను కోల్పోయాడు. అయితే రెండో సెట్లో తేరుకున్న ఫెడరర్ తన ప్రత్యర్థి ఫుచోవిచ్కు మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా మూడు సెట్లు గెలిచి ఈ టోర్నీ చరిత్రలో 15వ సారి... ఓవరాల్గా తన కెరీర్లో 67వసారి గ్రాండ్స్లామ్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. పోరాడి ఓడిన కోరి గౌఫ్... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా 15 ఏళ్ల టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ పోరాటం ముగిసింది. రష్యా సంతతికి చెందిన అమెరి కా క్రీడాకారిణి, 14వ సీడ్ సోఫియా కెనిన్ 6–7 (5/7), 6–3, 6–0తో కోరి గౌఫ్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. మరోవైపు టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కష్టపడి ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటారు. బార్టీ 6–3, 1–6, 6–4తో 18వ సీడ్ రిస్కీ (అమెరికా)పై, క్విటోవా 6–7 (4/7), 6–3, 6–2తో 22వ సీడ్ సకారి (గ్రీస్)పై గెలిచారు. తొలి అరబ్ మహిళా టెన్నిస్ ప్లేయర్గా... మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ క్రీడాకారిణి ఆన్స్ జెబూర్ (ట్యూనిíÙయా) 7–6 (7/4), 6–1తో 27వ సీడ్ కియాంగ్ వాంగ్ (చైనా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. అంతేకాకుండా ఈ ఘనత సాధించి తొలి అరబ్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ‘మిక్స్డ్’ క్వార్టర్స్లో బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగం రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6–4, 7–6 (7/4)తో నికోల్ మెలిచార్ (అమెరికా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ 6–7 (4/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో స్టార్మ్ సాండర్స్–మార్క్ పోల్మన్స్ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
జారిపడ్డాడు
అనుకోకుండా చేసే పనులు కొన్నిసార్లు ఆపదలోకి నెట్టేస్తాయి. ఇలియట్ బెంచెట్రిట్కు వచ్చింది ఆపద కాకున్నా.. అందుకు సమానమైనదే. అతడి ఇమేజ్ ఆపదలో పడిపోయింది. (గట్టెక్కే ప్రయత్నం చేశాడు లెండి). ఇలియట్ ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతుంటే అక్కడున్నాడు. తన ఆట మధ్యలో విరామం రావడంతో.. పక్కకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అటుగా బాల్ గర్ల్ వస్తే దగ్గరకు రమ్మని ఆ అమ్మాయిని పిలిచాడు. (ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ కొట్టిన బంతిని తెచ్చి ఇచ్చే అమ్మాయిల్ని బాల్ గర్ల్స్ అంటారు). ఆ అమ్మాయి ఇలియట్ దగ్గరికి వచ్చింది. ఆమెకు అరటి పండు ఇచ్చి ఒలిచి ఇమ్మని అడిగాడు. ఆమె ఒలవబోతుంటే.. చెయిర్ అంపైర్ అడ్డుపడ్డాడు. ‘‘బాల్ గర్ల్ ఏమీ నీ బానిస కాదు’’ అని ఇలియట్పై కోప్పడ్డాడు. అతడు నివ్వెరపోయాడు. ‘తప్పేముందీ! నా రెండు చేతులకూ వ్యాక్స్ ఉంది. ఒలుచుకోలేక తనకు ఇచ్చాను’’ అన్నాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ వీడియో వైరల్ అయి నెటిజన్లంతా ‘ఇలియట్ కాదు.. ఇడియట్’ అని తిట్టేస్తున్నారు. దీనికన్నా అరటితొక్క మీద నుంచి జారి పడటమే నయం అని ఇలియట్ అనుకుని ఉండాలి పాపం. -
సానియా రిటైర్డ్ హర్ట్
మెల్బోర్న్: దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభంలోనే తన పోరును ముగించారు. కాలిపిక్క గాయంతో ఈ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడకుండానే తప్పుకున్నారు. ఉక్రెయిన్ పార్టనర్ నదియా కిచెనోక్తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్కగాయంతో సతమతమైంది. దీంతోనే మెగా టోర్నీనుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సానియా.. గురువారం జిన్యున్ హాన్-లిన్ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో వైదొలిగారు. ఈ మ్యాచ్లో సానియా-నదియా 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్లో ఫస్ట్ గేమ్ ఓడి 0-1 వెనుకంజలో ఉండగా సానియా గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె రిటైర్ట్ హర్ట్గా వైదొలిగారు. ఇక మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉండగా తప్పుకున్నారు. -
అరటిపండు తొక్క తీసివ్వు..
మెల్బోర్న్: అరటిపండు తొక్క కూడా తీసిస్తావా అని బాల్గాళ్ను అడిగిన ఫ్రెంచ్ ఆటగాడు ఇలియట్ బ్రెంచెట్రిట్కు చైర్ అంపైర్ చివాట్టు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో భాగంగా ఓ మ్యాచ్లో బ్రేక్ సమయంలో ఇలియట్కు బాల్గాళ్ అరటిపండు ఇచ్చింది. అయితే తొక్క కూడా తీసివ్వవా అని ఆమెను అడిగాడు. దాంతో వెంటనే జోక్యం చేసుకున్న చైర్ అంపైర్ జాన్ బ్లోమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం అరటి పండు తొక్కకూడా తీసుకోలేకపోతున్నావా అంటూ చివాట్లు పెట్టాడు. (ఇక్కడ చదవండి: ఫెడరర్ ఫటాఫట్) ఆ అరటి పండును అతని చేతికే ఇచ్చేయమని సూచించాడు. దాంతో చేసేదిలేక ఆ బాల్గళ్.. ఇలియట్కు అరటిపండు ఇవ్వగా తొక్క తీసుకుని తిన్నాడు. ఈ క్రమంలోనే అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి ఏదో క్రీమ్ రాసుకోవడంతోనే అలా అడిగానని అంపైర్కు ఇలియట్కు చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యక్తిగత పనులకు బాల్గళ్ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమీ అతని పని మనిషి కాదనే విషయం గుర్తుంచుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. So this is the moment where Elliot Benchetrit asks the ballkid to peel his banana. I’m glad the umpire (John Blom) stepped in and told him off. pic.twitter.com/TK1GET68pG — Alex Theodoridis (@AlexTheodorid1s) January 19, 2020 -
భారీ విజయంతో సిరీస్ కైవసం
మెల్బోర్న్: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కివీస్ను 240 పరుగులకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా 247 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఆసీస్ 296 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ రోజు ఆటలో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ను 168/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో 488 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే ఓపెనర్ టామ్ లాథమ్(8) వికెట్ను కోల్పోయింది. ఆపై వెంటనే కేన్ విలియమ్సన్(0) డకౌట్గా నిష్క్రమించాడు. కాసేపటికి రాస్ టేలర్(2) సైతం నిష్క్రమించాడు. దాంతో కివీస్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఓపెనర్ టామ్ బ్లండెల్(121)తో కలిసి నికోలస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. జట్టు స్కోరు 89 పరుగుల వద్ద ఉండగా నికోలస్(33) ఔట్ అయ్యాడు. ఇలా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్ ఓటమి చెందగా, తొమ్మిదో వికెట్గా ఔటైన బ్లండెల్ మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు ఆడుతున్న బ్లండెల్కు ఇది తొలి సెంచరీ కాగా అది వృథాగా మిగిలింది. ట్రెంట్ బౌల్ట్ ఆబ్సెంట్ హర్ట్గా స్టైకింగ్కు రాలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ ప్యాటిన్సన్ మూడు వికెట్లు తీశాడు. లబూషేన్కు వికెట్ దక్కింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 114 పరుగులు చేసిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
స్టార్స్ అందరూ వస్తున్నారు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఈసారీ స్టార్ క్రీడాకారులందరూ బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే ఈ టోరీ్నకి సంబంధించి శనివారంతో ఎంట్రీల తుది గడువు ముగిసింది. మాజీ విజేత అజరెంకా మినహా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో టాప్–50లోని క్రీడాకారులందరూ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నంబర్వన్ నాదల్ (స్పెయిన్)తోపాటు జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్)... మహిళల సింగిల్స్లో టాప్ ర్యాంకర్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), ఏడుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) మెల్బోర్న్కు రానున్నారు. -
అంతిమ సమరంలో సౌరవ్ కొఠారి పరాజయం
మెల్బోర్న్: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్గా నిలిచాడు. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ 967–1307తో పీటర్ గిల్క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన ఈ మ్యాచ్లో మొదటి సెషన్లో కొఠారి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెషన్లో తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాడు. ఒకదశలో 250 పాయింట్లతో వెనుకంజలో ఉన్న గిల్క్రిస్ట్ 313 పాయింట్లు సాధించి 949–917తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే జోరును మూడో సెషన్లోనూ కొనసాగించి పీటర్ విజేతగా నిలిచాడు., -
మెల్బోర్న్లో గణపతి ఉత్సవాలు ముఖ్యఅథిదిగా రోజా
-
మెల్బోర్న్లో బీజేపీ విజయోత్సవం
మెల్బోర్న్ : లోక్సభ ఎన్నికలల్లో బీజేపీ అఖండమెజారిటీతో రెండోసారి విజయం సాధించడం సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఆపార్టీ మద్దతుదారులు విజయోత్సవ సభ నిర్వహించారు. వైందమ్ కౌన్సిల్ మాజీ డిప్యూటీ మేయర్ గౌతమ్ గుప్తా ఆధ్యర్యంలో మెల్బోర్న్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదటగా వందేమాతరం ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఇటీవల కేరళ, కర్ణాటక, తెలంగాణలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తలకు అంజలి ఘటించారు. అనంతరం కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అమరెందర్రెడ్డి కోత, మహేశ్ బద్దం, శ్రీపాల్ బొక్క, రామ్ నీత, వంశీ కొత్తల, దీపక్ గడ్డె, విశ్వంత్ కపిల ఇతర బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. -
బిగ్బాష్ విజేత రెనెగేడ్స్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక బిగ్బాష్ లీగ్ టి20 టోర్నీ టైటిల్ను తొలిసారి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ జట్టు మెల్బోర్న్ స్టార్స్పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్లోని డాక్ల్యాండ్స్ స్టేడియంలో అదే నగరానికి చెందిన రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన తుది పోరులో చివరకు రెనెగేడ్స్దే పైచేయి అయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రెనెగేడ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేయగా... అనంతరం స్టార్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. ముందుగా రెనెగేడ్స్ తరఫున టామ్ కూపర్ (35 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ క్రిస్టియాన్ (30 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్కు అభేద్యంగా 58 బంతుల్లో 80 పరుగులు జోడించి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 91 పరుగులే. అయితే చివరి 5 ఓవర్లలో రెనెగేడ్స్ 54 పరుగులు రాబట్టింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టార్స్కు ఓపెనర్లు బెన్ డంక్ (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్), మార్కస్ స్టొయినిస్ (38 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 77 బంతుల్లో 93 పరుగులు జోడించారు. చేతిలో 10 వికెట్లు ఉండగా... గెలుపు కోసం స్టార్స్ మిగిలిన 43 బంతుల్లో 53 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ దశలో ట్రైమెన్ (2/21), బాయ్స్ (2/30), క్రిస్టియాన్ (2/33) మ్యాచ్ను మలుపు తిప్పారు. వీరి దెబ్బకు స్టార్స్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఆ జట్టు 43 బంతుల్లో 7 వికెట్లు చేజార్చుకొని 39 పరుగులే చేయగలిగింది. ప్రధాన ఆటగాళ్లు హ్యాండ్స్కోంబ్ (0), మ్యాక్స్వెల్ (1), మ్యాడిసన్ (6), డ్వేన్ బ్రేవో (3) విఫలమయ్యారు. క్రిస్టియాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 2011లో ప్రారంభమైన బిగ్బాష్ లీగ్లో ఇది ఎనిమిదో టోర్నీ. వీటిలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. -
మెల్బోర్న్లో వైఎస్సార్ అభిమానుల కోలాహలం
మెల్బోర్న్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్హిట్టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కమిటీ ఆధ్వర్యంలో మెల్బోర్న్లోని బాక్లాట్ స్టూడియోస్, 64 హెగ్ స్ట్రీట్లో యాత్ర చిత్రాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ కౌశిక్ మామిడి, రమణారెడ్డి, లోకేశ్ కాసు, అజయ్ ముప్పలనేని, రమేష్ బొల్ల, రమ్య యార్లగడ్డలతోపాటూ వైఎస్సార్ అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. మహానేత వైఎస్సార్ను ప్రతిబింబించేలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. -
ఫోన్లో ఆ వీడియోలు ఉన్నాయని ..!
మెల్బోర్న్ : ఫోన్లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఓ వ్యక్తికి జైలుశిక్ష వేసిన ఘటన మెల్బోర్న్లో చోటుచేసుకుంది. ఇండియాకు చెందిన మన్ప్రీత్ సింగ్ ఫోన్లో చైల్డ్ పోర్నొగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. ఇది చట్టరిత్యా నేరమని అతడిని కష్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇది నేరమని తనకు తెలియదని కోర్డు ముందు విన్నవించుకున్నాడు. అతని వాదన విన్న కోర్టు.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి కేసులు లేనందున ఏడు నెలల జైలు శిక్షను, ఐదు వందల డాలర్లను ఫైన్గా వేసింది. దీంట్లో రెండు నెలలు మాత్రమే జైలు శిక్ష అని, మంచి ప్రవర్తనతో మెలిగితే.. ఆ తరువాత వెయ్యి డాలర్ల పూచీ కత్తుతో బయటకు రావచ్చని తెలిపింది. అయితే ఆ ఐదు నెలలు కోర్టు పరిధిలోనే ఉండాలని అటు తరువాతే ఇండియాకు పంపుతామని కోర్టు తీర్పునిచ్చింది. -
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
-
మెల్బోర్న్ వన్డే; చాహల్ మ్యాజిక్
మెల్బోర్న్: భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 161 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ ఆరో వికెట్గా అవుటయ్యాడు. టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఆరంభించగానే వరుణుడు అడ్డుతగిలాడు. రెండు బంతులు వేయగానే చినుకులు మొదలయ్యాయి. దీంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆట తిరిగి మొదలయ్యాక ఆసీస్ను టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ గట్టి దెబ్బ తీశాడు. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్కు పంపాడు. ఆసీస్ స్కోరు 8 పరుగుల వద్ద అలెక్స్ క్యారీ(5)ని అవుట్ చేశాడు. 27 పరుగుల వద్ద ఫించ్(14) పెవిలియన్ చేరాడు. తర్వాత ఖవాజా, మార్ష్ జాగ్రత్తగా ఆడి స్కోరును వంద పరుగులకు చేర్చారు. మూడో వికెట్కు 73 పరుగులు జోడించిన ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. ఇద్దరినీ వెంట వెంటనే పెవిలియన్కు పంపాడు. 100 పరుగుల వద్ద ఖవాజా(34) మూడో వికెట్గా అవుటయ్యాడు. తర్వాత షాన్ మార్ష్(39), స్టొయినిస్(10)ను కూడా చాహల్ అవుట్ చేయడంతో ఆసీస్ మరోసారి కంగారు పడింది. వచ్చిరావడంతోనే మ్యాక్స్వెల్ ఫోర్లతో విరుచుకుపడటంతో ఆసీస్ కోలుకున్నట్టుగా కనిపించింది. దూకుడు మీదున్న మ్యాక్స్వెల్ను షమి అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాక్స్వెల్ 19 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 171/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
మూడో వన్డే: టాస్ గెలిచిన టీమిండియా
మెల్బోర్న్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతన్న నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ కాస్త ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఆరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్ సిరాజ్ను తప్పించి అతడికి చోటు కల్పించారు. రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. టి20 సిరీస్ను 1-1తో ముగించి, టెస్ట్ సరీస్లో 2-1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ మ్యాచ్లో నెగ్గి వన్డే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. (మెల్బోర్న్లోనూ మెరిస్తే...) తుది జట్లు: భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, జడేజా, చహల్, భువనేశ్వర్, షమీ. ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, జంపా, స్టాన్లేక్, సిడిల్, రిచర్డ్సన్ -
ఆస్ట్రేలియా ఓపెన్: తొలి రౌండ్లోనే ప్రజ్నేశ్ ఓటమి
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి పాల్గొన్న భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్లో భాగంగా జరిగిన మొదటి రౌండ్ పోరులో 39వ ర్యాంకర్ టియాఫో(అమెరికా) చేతిలో 7-6(9/7), 6-3, 6-3 తేడాతో ప్రజ్నేశ్ పరాజయం చెందాడు. తొలి సెట్లో ప్రజ్నేశ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కడవరకూ పోరాడటంలో విఫలం చెందడంతో ఓటమి తప్పలేదు. ఇరువురి మధ్య జరిగిన తొలి సెట్ టైబ్రేక్కు దారి తీయగా అందులో టియాఫో పోరాడి గెలిచాడు. ఆపై వరుస రెండు సెట్లలో ప్రజ్నేశ్ ప్రతిఘటించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. టియాఫో 88 శాతం నెట్ పాయింట్లు గెలవగా, ప్రజ్నేశ్ 67 శాతం నెట్ పాయింట్లు మాత్రమే గెలవగలిగాడు. మరొకవైపు టియాఫో కంటే ప్రజ్నేశ్ అనవసర తప్పిదాలను ఎక్కువగా చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ప్రజ్నేశ్ భారంగా ఆస్ట్రేలియా ఓపెన్ ముగించి ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లోనే గెలిచిన టియాఫో.. రెండో రౌండ్లో ఐదో సీడ్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు. -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–4, 6–4తో విక్టర్ గాలోవిక్ (క్రొయేషియా)పై గెలుపొందాడు. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రజ్నేశ్ ఆరు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. రెండో రౌండ్లో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్)తో ప్రజ్నేశ్ తలపడతాడు. -
ఇండియన్ ఎంబసీ వద్ద అనుమానిత వస్తువుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని భారత ఎంబసీ వద్ద బుధవారం ఉదయం అనుమానిత వస్తువులు కనబడడంతో కలకలం రేగింది. వాటిని పేలుడు పదార్థాలుగా భావిస్తున్నారు. బాంబు నిర్వీర్య దళం, ఫైర్ ఇంజన్లు, ఎమర్జెన్సీ వాహనాలు ఎంబసీ వద్దకు చేరుకున్నాయి. సిబ్బందిని కార్యాలయం నుంచి ఖాళీ చేయించారు. ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, సెచెల్లెస్, స్విట్జర్లాండ్, క్రోయేషియా, ఈజిప్టు, యూకే, యూఎస్ఏ ఎంబసీల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఓ స్థానిక చానెల్ పేర్కొంది. అక్కడ కూడా అనుమానిత ప్యాకేజీలు బయటపడడంతో భయాందోళనలు మొదయ్యాయని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపింది. -
మెల్బోర్న్లో కత్తి పోట్లు కలకలం
మెల్బోర్న్ : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన మరవక ముందే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో శుక్రవారం కత్తి పోట్లు కలకలం సృష్టించాయి. మెల్బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్లో అకస్మాత్తుగా ఓ కారు మంటల్లో చిక్కుకొనగా.. అక్కడికి వచ్చిన పోలీసులు అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ వ్యక్తి కత్తితో అక్కడున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారి తన గన్కు పనిచెప్పాడు. గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించామని విక్టోరియా పోలీసులు మీడియాకు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నారు. ఇక నిందితుడి కత్తిపోట్లతో ముగ్గురు గాయపడగా.. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడు. రెండో వ్యక్తికి తల భాగంలో గాయమైందని, అతని ఆరోగ్య పరిస్థితి, మూడో వ్యక్తి గాయం గురించి సమాచారం లేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో నిందితుడు పోలీసులపై కత్తితో దాడి చేస్తుండగా.. వారు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అతను వినకపోవడంతో ఓ పోలీస్ అధికారి తుపాకీతో కాల్చేసినట్లు స్పష్టం అవుతోంది. చదవండి: నెత్తురోడిన అమెరికా -
వైఎస్ జగన్పై దాడి పిరికిపంద చర్య
-
వైఎస్. జగన్ పాదయాత్ర అభినందనీయం : సీన్ ఆర్మిస్టెడ్
మెల్బోర్న్ : అస్ట్రేలియా లిబరల్ పార్టీ(విక్టోరియా డివిజన్) ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విలియమ్టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమూరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమ్య యార్లగడ్డ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు తెలపాలని లిబర్ పార్టీ నాయకుడు గౌరి శెట్టి కోరడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా హాజరైన అస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్కు ప్రజల కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని, పాదయాత్ర గురించి ఆయనకు వివరించామన్నారు. అనంతరం సీన్ ఆర్మిస్టెడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం వైఎస్. జగన్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య యార్లగడ్డతో పాటు విక్టోరియా కన్వీనర్ కౌశిక్ మామిడి, సురెందర్ కుమార్ ,పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో వైభవంగా గణేష్ ఉత్సవాలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు, అభిమానుల ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకుడు దినేష్ గోరిసెట్టి, ఎం.టి.ఎఫ్ సంఘం అధ్యక్షుడు వెంకట్ నూకాల హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనా ధీమా వ్యక్తం చేశారు. తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కలిల్ కాట్పల్లి, వినాయక్ కొలపేలతో పాటు దాదాపు మూడువేల మంది ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
-
ఆస్ట్రేలియాలో వైఎస్సార్కు ఘన నివాళి
మెల్బోర్న్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అస్ట్రేలియాలోని ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మెల్బోర్న్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. యార్లగడ్డ రమ్యశ్రీ, రాజేశ్, ఉదయ్, సాయిల ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ.. వైఎస్సార్ తన పాలన కాలంలో ఎన్నో మార్గదర్శకమైన పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్సార్ మిగతా కాంగ్రెస్ నాయకుల్లా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాదని.. ఆయన ప్రజా నాయకుడు అని కొనియాడారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల మనసులు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. పాలనపరంగా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అంతకు ముందు, ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని విధంగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని అన్నారు. మహానేత లోకాన్ని విడిచి వెళ్లి 9 ఏళ్లు అవుతున్నా ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్స చేయించుకున్న వారిలో ఆనందాల్లో, ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన విద్యార్థుల విజయాల్లో ఆయనను చూస్తునే ఉన్నామన్నారు. దురదృష్టావశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో గొప్ప నేతను కొల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజల కోసం పోరాడుతున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినప్పటికీ.. వైఎస్ జగన్ ప్రజల మధ్య ఉంటూ ప్రతిపక్ష నేతగా తనను తాను నిరూపించుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని రమ్య శ్రీ అన్నారు. ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నది కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని.. ఈ విషయంలో ఆయన విజేతగా నిలిచారని గుర్తుచేశారు. మిగతా పార్టీలు ఈ విషయంలో యూటర్న్లు తీసుకున్నా వైఎస్ జగన్ ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం తన సంకల్పాన్ని వదిలిపెట్టలేదన్నారు. ఏపీ ప్రజల బాగుకోసం వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ.. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకవెళ్లి.. 2019లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చెస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
కేన్సర్ కణాలను నిద్రపుచ్చారు!
కేన్సర్పై పోరులో మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేన్సర్ కణాలను శాశ్వత నిద్రలోకి పంపే ఓ మందును సిద్ధం చేశారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందు... కణితి పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా సాధారణ కణాల డీఎన్ఏను ఏ మాత్రం మార్పు చేయకుండా పని చేస్తుంది. రక్త, కాలేయ కేన్సర్ల విషయంలో తాము ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు పొందామని, ఈ మందుతో కేన్సర్ మళ్లీ తిరగబెట్టడమన్నది కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని టిమ్ థామస్ అనే శాస్త్రవేత్త తన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. కేఈటీ 6ఏ, కేఏటీ 6బీ అనే రెండు ప్రొటీన్ల ఉత్పత్తిని నిలిపివేస్తే కేన్సర్కు సమర్థమైన చికిత్స కల్పించవచ్చా? అన్న ప్రశ్న ఆధారంగా తాము పరిశోధనలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ప్రత్యేకమైన మందు సాయంతో కేఏటీ 6ఏ ఉత్పత్తిని నిలిపివేయగానే రక్తపు కేన్సర్లు ఉన్న ఎలుకల ఆయుష్షు నాలుగింతలైందని చెప్పారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు వాడే కీమోథెరపీ, రేడియేషన్ల వల్ల సాధారణ కణాల డీఎన్ఏ లో సరిచేయలేని మార్పులు చోటు చేసుకుంటాయని, దీని ఫలితంగా అనేక సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయని మనకు తెలుసు. తాము సిద్ధం చేసిన మందు మాత్రం కేన్సర్ కణాలు విభజితం కాకుండా అడ్డుకుంటాయని.. ఇంకోలా చెప్పాలంటే కణాలు మరణించవుగానీ.. పునరుత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయని వివరించారు. -
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మెల్బోర్న్ : వైస్సార్ సీపీ కన్వీనర్ కౌశిక్ రెడ్డి మామిడి ఆధ్వర్యంలో మెలోబోర్న్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా కేకు కట్ చేసి ప్రత్యేకంగా రూపోందించిన వైఎస్సార్ ఏవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలోయూత్ ప్రెసిడెంట్ లోకేష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేష్ శాఖమురి మరియు వైస్సార్ సీపీ అడిలైడ్ నుంచి సతీష్ రెడ్డి కొండ పాల్గొన్నారు. లిబరల్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు రాంపాల్ రెడ్డి, ఏటీఏఐ అధ్యక్షుడు అమరేందర్ అత్తపురం, ఆస్ట్రేలియా బీజేపీ నాయకులు శ్రీపాల్ రెడ్డి , ఆస్ట్రేలియా మూవీ యాక్టర్ మురళి పరిశే పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్సార్ 69వ జయంతి వేడుకలు
-
కొండపై సెల్ఫీకి యత్నం.. భారతీయ విద్యార్థి మృతి
మెల్బోర్న్: సెల్ఫీ సరదాకి మరో ప్రాణం బలైపోయింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బెనీ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల అంకిత్ పెర్త్లో విద్యనభ్యసిస్తున్నాడు. తన ఫ్రెండ్స్తో సరదాగా షికారుకు వెళ్లాడు. ఈ ప్రయత్నంలో 40 మీటర్ల ఎత్తైన కొండ రాయిపై సెల్ఫీకి యత్నించి.. జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత అతని మృతదేహాన్ని బయటకు తీశారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం మూసివేసినప్పటికీ తరచూ కొందరు అక్కడికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఆస్ర్టేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్ మారిన్ సిలిచ్పై 6-2, 6-7(5/7), 6-3, 3-6, 6-1తో గెలిపొందాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో ఫెడరరే పైచేయి సాధించాడు. ఈ విజయంతో కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన ఫెడరర్ 6 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుచుకొని నోవాక్ జొకోవిక్, ఆస్ట్రేలియన్ గ్రేటర్ రాయ్ ఎమెర్సన్ల సరసన అగ్రస్థానంలో నిలిచాడు. సెమీఫైనల్లో ఫెడరర్ దక్షిణకొరియా ప్లేయర్ చుంగ్యాన్పై గెలిచి ఫైనల్కి చేరిన విషయం తెలిసిందే. -
మెల్బోర్న్లో కారు బీభత్సం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బిజీగా ఉండే ఫ్లిండర్స్ స్ట్రీట్లో జరిగిన ఈ ప్రమాదంలో 14 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఓ తెల్లని కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని.. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. కారు బీభత్సంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సంఘటనకు సంబంధించి కారు డ్రైవర్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
మెల్బోర్న్లో కారు బీభత్సం
-
దొంగలకు కుక్కపిల్ల ఝలక్!
మెల్బోర్న్ : ఎనిమిది నెలల ఓ కుక్కపిల్ల దొంగలకు ముచ్చెమటలు పట్టించింది. యజమాని ఇంట్లో జరిగిన చోరీలో దొంగలు ల్యాప్టాప్, ఐపాడ్ సహా పప్పీని ఎత్తుకెళ్లగా మూడు రోజుల తర్వాత దొంగల కళ్లుగప్పి తప్పించుకుంది. తన ఫ్రెండ్ పప్పీ లేదని బెంగపెట్టుకున్న నాలుగేళ్ల చిన్నారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబం గత సోమవారం బయటకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. ఆభరణాలు, ల్యాప్టాప్, ఐపాడ్, లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కపిల్ల (సాశా), ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇంటికి రాగానే బాధిత కుటుంబానికి విషయం అర్థమైంది. ఐతే తనఫ్రెండ్ సాశా(కుక్కపిల్ల) ను దొంగలు తీసుకెళ్లారని నాలుగేళ్ల ఓనర్ కూతురు తిండి మానేసి బెంగపెట్టుకుంది. దొంగల్ని పట్టుకుని తమ కుక్కపిల్లను ఇప్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు ఓ ట్వీట్ చేశారు. 8నెలల పప్పీ అనే కుక్కపిల్ల కిడ్నాప్ అయిందని, డిటెక్టివ్స్ దర్యాప్తు చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కుక్కపిల్ల మూడ్రోజుల తర్వాత ఇంటికి వచ్చేసింది. పప్పీ కారణంగా దొరికిపోతామని భయాందోళనకు గురైన దొంగలు ఆ కుక్కపిల్లను ఇంటిదగ్గర వదివెళ్లుంటారని పోలీసులు భావిస్తున్నారు. 'దొంగల నిజాయితీ ఎవడికి కావాలి.. మా పప్పీనే దొంగల కళ్లుగప్పి వచ్చేసింది. దొంగల్ని అరెస్ట్చేసి ఇతర విలువైన వస్తువులు తమకు వచ్చేలా చూడాలని' బాధిత కుటుంబం మరోసారి పోలీసులను కోరింది. -
మెల్బోర్న్ మరో ఘనత
న్యూయార్క్: ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎంపికైంది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వియన్నా, వాంకోవర్ నగరాలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ నగరం టాప్ 10 నుంచి కిందకు పడిపోయింది. చిన్న నగరాలైన అడిలైడ్, పెర్త్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది సిటీల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
మెల్బోర్న్లో ఉగ్రవాది కలకలం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పట్టణంలో కలకలం రేగింది. ఓ అపార్ట్మెంట్లోని బ్లాక్లో పేలుడు సంభవించడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఆ భవనంలో ఎవరో ఒక దుండగుడు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ వద్ద పెద్ద మొత్తంలో అత్యవసర సేవల విభాగం అధికారులు మోహరించారు. కొంతమంది లోపల ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్న ఆ వ్యక్తి కచ్చితంగా ఒక మహిళను బందీ చేసినట్లుందని అధికారులు చెబుతున్నారు. అతడు ఉగ్రవాది అయ్యుంటాడని అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో దాదాపు ఆ అపార్ట్మెంట్ ఉన్న కాలనీలోని షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాఫిక్ సిగ్నల్స్పై ‘ఆమె’చిత్రం!
మెల్బోర్న్: లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోదేశంలో ఒక్కోరకమైన డిమాండ్ వినిపిస్తూనే ఉంది. లింగ వివక్షతను రూపుమాపేందుకు, ప్రజల్లో లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం విభిన్నంగా లింగసమానత్వంపై అవగాహన కల్పించనున్నారు. అక్కడి రహదారులపై ఉండే ట్రాఫిక్ సిగ్నళ్లలో ‘ఆమె’ చిత్రాన్ని పొందుపర్చారు. పాదచారులు రోడ్డు దాటేందుకు చిహ్నంగా వెలిగే లైటులో ఇకపై ‘ఆమె’ వెలిగిపోనుంది. గతంలో కేవలం ‘అతని’ చిత్రాలతో కూడిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లు మాత్రమే ఉండేవి. దీనిని సవాలు చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన 120 ఉద్యమ సంస్థలు పోరాటానికి దిగాయి. కేవలం పురుషులను ప్రతిబింబించే చిత్రాలను మాత్రమే కూడళ్లపై వినియోగంచడం లింగవివక్ష కిందకే వస్తుందని, లింగ సమానత్వాన్ని చాటిచెప్పేందుకు ‘ఆమె’ చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశాయి. ఈ పోరాటానికి విక్టోరియా రాష్ట్ర గవర్నర్ లిండా నేతృత్వం వహించారు. ఫలితంగా మెల్బోర్న్ నగరపాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే ఇప్పుడు నగరవ్యాప్తంగా అన్ని కూడళ్లవద్ద సిగ్నళ్లను మార్చారు. -
మెల్బోర్న్లో యాగానికి లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5, 6 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనున్న ‘శ్రీ యాగం– లక్ష్మీ మహా యజ్ఞం’, ‘ఇంటర్ ఫేయిత్ అండ్ మల్టీ కల్చరల్ కాన్ఫరెన్స్’ కు నందమూరి లక్ష్మీపార్వతిని ప్రత్యేక అతిథిగా జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్–మెల్బోర్న్ చాప్టర్ ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలోని శ్రీ దుర్గ దేవాలయం, జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వానంలో ఫౌండేషన్ మెల్బోర్న్ చాప్టర్ ప్రతినిధి సత్య రామడుగు పేర్కొన్నారు. త్రిదండి చినజీయర్ స్వామి, ఆయన బృం దంతో భారత్ నుంచి మెల్బోర్న్ వరకు నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
షాపింగ్ సెంటర్పై కూలిన విమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో మంగళవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెల్బోర్న్లోని ఓ షాపింగ్ సెంటర్పై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మెల్బోర్న్లోని ఎసెండన్ ఫీల్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న షాపింగ్ సెంటర్పై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. బీచ్కాండి ఎయిర్క్రాఫ్ట్ మెల్బోర్న్ నుంచి కింగ్ ఐలాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విక్టోరియన్ ప్రీమియర్ అధికారి డానియల్ ఆండ్రూస్ వెల్లడించారు. -
షాపింగ్ సెంటర్పై కూలిన విమానం
-
మరో విజయంపై ఆసీస్ దృష్టి
ఉదయం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం మెల్బోర్న్: తొలి టెస్టులో భారీ లక్ష్యం నిర్దేశించినా... పాక్ పోరాటపటిమ ఫలితంగా కష్టపడి గెలిచిన ఆస్ట్రేలియా మరో విజయమే లక్ష్యంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో బరిలోకి దిగనుంది. సోమవారం మొదలయ్యే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని పాకిస్తాన్ పట్టుదలగా ఉంది. బ్రిస్బేన్ డే నైట్ టెస్టులో 490 పరుగుల లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పనిచేసిన పాక్ అదే ఉత్సాహాన్ని మెల్బోర్న్లోనూ కొనసాగించాలని భావి స్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన గత పది టెస్టుల్లో ఓడిపోయిన పాక్... 1981లో చివరి సారి మెల్బోర్న్ వేదికపై విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హాజెల్వుడ్, బర్డ్ చెలరేగితే పాక్ బ్యాట్స్మెన్కు కష్టాలు తప్పవు. బ్రిస్బేన్ టెస్టులో సెంచరీ చేసిన అసద్ షఫీక్తోపాటు యూనిస్ ఖాన్, మిస్బా రాణింపుపైనే పాక్ ఆశలు పెట్టుకుంది. -
సూర్యభగవానుని సౌధం
ఇది ఇన్వెక్టస్ టవర్. ఇన్వెక్టస్ అంటే లాటిన్లో ‘అన్ కాంకరబుల్’ అని, ‘అన్ డిఫీటబుల్’ అని కూడా. అంటే ఎవరూ జయించలేనిది, ఎవరూ ఓడించలేనిది అని అర్థం. బహుశా భవిష్యత్తులో ఎదురవబోయే విద్యుత్ కొరత ఈ టవర్లో ఉండే (ఉండబోయే) నివాస గృహాలపై ఏ విధంగానూ ప్రభావం చూపలేదనే అర్థంలో ఇలా ‘ఇన్వెక్టస్ టవర్’ అని పేరు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే.. కరెంట్ లేకపోయినా, ఈ టవర్ తన సొంత కరెంటును తయారుచేసుకుంటుంది! హౌ? ఎలా? చదవండి. వంద అంతస్తుల భవనాన్ని చూశాం... అంతకంటే పెద్దదైన బుర్జ్ ఖలీఫానూ చూశాం. వాటితో పోలిస్తే ఫొటోలో కనిపిస్తున్న సోల్ ఇన్వెక్టస్ టవర్ పెద్దదేమీ కాదు. అరవై అంతస్తులు మాత్రమే ఉంటుంది ఇది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో దీన్ని నిర్మించనున్నారు. మరి ఏమిటి దీని ప్రత్యేకత అంటున్నారా? చాలా వరకూ ఆకాశహర్మ్యాల మాదిరిగానే దీంట్లోనూ చుట్టూ అద్దాలు కనిపిస్తున్నాయా? నిజానికి అవి అద్దాలు కానేకాదు. సోలార్ ప్యానెల్స్! ఇంకోలా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రతి ఇంటిలో ఒక గోడకు బదులు సోలార్ ప్యానెల్స్ ఉంటాయన్నమాట. సాధారణంగా మనం సూర్యుడి వేడి తగలకుండా కర్టెన్స్ వాడతాం. కానీ సోలార్ ఇన్వెక్టస్ టవర్ను వీలైనంత ఎక్కువ సూర్యరశ్మి తగిలేలా కోడిగుడ్డు ఆకారంలో డిజైన్ చేశారు. భవనం చుట్టూ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ సూర్యుడి వేడి నుంచి రక్షణ కల్పిస్తూనే అదనంగా విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తాయి. భవనం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దీనిపై దాదాపు 400 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే అవకాశముండేది. అయితే అన్నివైపులా ఉన్న ఫసాడ్ (బయటికి కనిపించే అద్దాల గోడ) కూ వీటిని వాడటం వల్ల ఈ విస్తీర్ణం 3500 చదరపు మీటర్లకు పెరిగింది. ఫలితంగా భవన విద్యుత్తు అవసరాల్లో సగానికిపైగా సూర్యుడే అందిస్తున్నట్లు అయింది. పెడెల్ థార్ప్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసిన సోల్ ఇన్వెక్టస్ టవర్ మరో మూడు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. మరింత సమర్థమైన బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోవచ్చునని సంస్థ ప్రతినిధి బ్రూక్ అంటున్నారు. -
ఆన్లైన్ గేమ్స్ అంత ప్రమాదమేమీ కాదట!
పరిపరి శోధన పిల్లలు వీడియో గేమ్స్ ఆడటం వల్ల వారి చదువు చంకనాకిపోతుందని, తెలివితేటలు తెల్లారిపోతాయని, మెదడు మందకొడిగా తయారవుతుందని పరిశోధకులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అయితే రోజూ ఆన్లైన్ గేమ్స్ ఆడే పిల్లల బుర్ర చురుగ్గా తయారవుతుందని, చదువుల్లో ముందుంటారని తాజాపరిశోధనలు చెబుతున్నాయి. నిత్యం ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, మ్యాథ్స్లో, సైన్స్లో మిగిలిన వారి కన్నా ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలు నిర్వహించిన మెల్బోర్న్లోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆల్బెర్టో పోసో అనే విద్యావేత్త మాటల్లో చెప్పాలంటే... ఆన్లైన్ గేమ్స్ ఆడే పిడుగులలో ఏకాగ్రత పెరుగుతుంది. గేమ్లో తర్వాతి స్టెప్ను ఎలా అందుకోవాలా అన్న ఆలోచనతో బుర్రకు పదును పెట్టుకోవడం వల్ల వారిలో జీకే పెరుగుతుంది, లెక్కల్లో, సైన్స్లో పరిణతి పెరుగుతుంది. ఫలితంగా చదువులో చురుగ్గా ఉంటారని దాదాపు 700కు పైగా హైస్కూల్ స్టూడెంట్స్ను అధ్యయనం చేసిన ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పిసా) చెబుతోంది. ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు ఆ గేమ్కు సంబంధించిన నియమనిబంధనలను ఆకళింపు చేసుకోవడం కోసం పేజీలకొద్దీ సమాచారాన్ని చదవడం వల్ల లెక్కలు, సైన్స్లో ముందుండగలుగుతారు. అయితే వీడియోగేమ్స్ వేరు, ఇంటర్నెట్ వేరు. పొద్దస్తమానం ఇంటర్నెట్లో గంటలకొద్దీ గడపకూడదు. అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్ వంటివాటితో తలమునకలుగా ఉండేవారు మాత్రం చదువులో వెనకపట్టులో ఉంటారట. -
ఆస్ట్రేలియాలో కొడుకుతో సహా మహిళ మృతి
హైదరాబాద్ : ఆస్ట్రేలియలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెల్బోర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుప్రజ (31) అనే మహిళ తన ఆరునెలల కుమారుడితో పాటు 30 అంతస్తుల బిల్డింగ్పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల క్రితం (మంగళవారం) 20వ ఫ్లోర్ నుంచి సుప్రజ...కొడుకుతో సహా జారి పడింది. మెల్బోర్న్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గంగాధర్కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్కు హైదదాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం శ్రీనివాస్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండడంతో గతేడాది డిసెంబర్లో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఆర్మూర్కు తిరిగి వచ్చారు. శ్రీనివాస్, సుప్రజలు సైతం ఈ నెలలోనే ఇక్కడకు రావాల్సి ఉంది. ఈలోపే సుప్రజ చనిపోవడం విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా మృతురాలు సుప్రజ మేనమామ గంగాధర్ మాట్లాడుతూ ... ఘటన జరిగిన సమయంలో శ్రీనివాస్ ఆఫీస్కు వెళ్లాడని, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవన్నారు. తమ దగ్గర వీసా, పాస్పోర్టు లేకపోవడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నామన్నారు. మరోవైపు శ్రీనివాస్ తండ్రి గంగాధర్ గత రాత్రే మెల్బోర్న్ బయల్దేరి వెళ్లారు. మరో రెండురోజుల్లో సుప్రజ మృతదేహాన్ని హైదరాబాద్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. -
సముద్రగర్భంలో తీసిన షాకింగ్ వీడియో
ఒకేసారి పెట్టిన వేలాది గుడ్ల ద్వారా ఉద్భవించే పీతలు.. పెరిగేకొద్దీ స్వజాతి జీవులను సహించలేవు. ఆహారం, స్థలం.. అన్నింటికోసం ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. అలాంటి పీతలు క్రమంగా ఒక్కటవుతున్నాయి. పీతల జీవన విదానంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలే బయటికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సముద్రగర్భ శాస్త్రవేత్త షెరీ మారిస్ మెల్ బోర్న్ లోని పోర్ట్ ఫిలిఫ్ బే సముద్ర గర్భంలో యాదృచ్ఛికంగా తీసిన వీడియోలో.. జెయింట్ క్రాబ్(రాకాసి పీత) ఒకటి ముందు నడుస్తుండగా, వేలాది పీతలు దాన్ని అనుసరిస్తూ కనిపించాయి. ఎవరిమీదో దండయాత్రకు వెళుతున్నట్లు లేదా కవాతు నిర్వహిస్తున్నట్లు క్రమపద్ధతిలో సాగిపోయిన పీతల బృందం తనకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు షెరీ చెప్పింది. ప్రాణ రక్షణ, ఆహార సేకరణ వంటి అత్యవసరాలను ఒంటరిగాకంటే బృందంగా ఉంటేనే చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతోనే ఒక్కటయ్యాయని, అవి స్వజాతివైరం వీడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు గుంపులుగా ఏర్పడ్డ పీతలు.. ముందుముందు మనుషులతో పోరాటానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
మెల్బోర్న్లో ఎన్ఆర్ఐలకు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు రాయికల్: బంగారు తెలంగాణసాధనలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్, రఘు, అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'బంగారు తెలంగాణలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి'
- మెల్బోర్న్లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రాయికల్ (కరీంనగర్ జిల్లా) : బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు, ఎన్ఆర్ఐలు సైతం ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఎంపీ కవితకు ఘనస్వాగతం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సోమవారం ఉదయం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నారు. ఎన్ఆర్ఐ జాగృతి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సభ్యులు విమానాశ్రయంలో కవితకు ఘనస్వాగతం పలికారు. జూలై 4వరకు ఆమె ఇక్కడ పర్యటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. -
రిటైరయ్యాకే చురుగ్గా ఉంటారు!
ఉద్యోగం చేసే వారికన్నా పదవీ విరమణ చేసినవారే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు పరిశోధకులు. రిటైర్మెంట్ తర్వాత ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండటం, హాయిగా నిద్రపోవడంతోపాటు, ధూమపానానికి దూరంగా ఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. ఆస్ట్రేలియా ప్రజలపై చేసిన పరిశోధనల్లో ఈ సరికొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తుల జీవనశైలిపై ప్రత్యేక పరిశోధనలు జరిపారు. రిటైర్ అయిన వ్యక్తుల్లో శారీరక శ్రమ, ఆహార, నిద్ర అలవాట్లు, ప్రవర్తన, మద్య సేవనం వంటి అనేక విషయాల్లో పరిశోధనలు నిర్వహించినట్లు అధ్యయనవేత్త మెలోడీ డింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతో పోలిస్తే... రిటైర్ అయిన వారు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గించుకొని, ఎక్కువ సమయం శ్రమించగల్గటం, ధూమపానానికి దూరంగా ఉండటంతోపాటు... శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో చురుగ్గా ఉంటున్నట్లు గమనించారు. అంతేకాక ఎంతో ఆరోగ్యంగా కూడ ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలిందని డింగ్ చెప్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తుల జీవనశైలిలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని, చెడు అలవాట్లకు దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తులు ఎంతో చురుగ్గా ఉండగల్గుతున్నారని, వారానికి 93 నిమిషాల శారీరక శ్రమ పెంచడంతోపాటు, బద్ధకంగా కూర్చునే సమయాన్ని 67 నిమిషాలు తగ్గించారని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. అంతేకాక నిద్రించే సమయం కూడ రోజుకు సుమారు 11 నిమిషాలు పెంచగలిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగినులు 50శాతం మంది రిటైర్మెంట్ తర్వాత ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవనశైలిని ఆరోగ్యంగా మార్చుకునేందుకు కావలసిన సమయం దొరుకుతోందని, ఇది అన్ని తరహాల్లోనూ కీలకపాత్ర పోషించిందని డింగ్ తెలిపారు. అయితే ఈ సమయంలో మద్యపానం, కూరగాయలు, పండ్లు వాడకాల్లో పెద్దగా మార్పులు కనిపించలేదంటున్నారు. ఇదిలా ఉంటే... పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు, అధిక విద్యాస్థాయిలు కలిగినవారు మాత్రం కాస్త ఎక్కువ సమయం ఖాళీగా కూర్చుని సమయం గడుపుతున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ గురించి ప్రజలు సానుకూలంగా ఆలోచించేందుకు ఈ తాజా పరిశోధన సహకరిస్తుందని డింగ్ చెప్తున్నారు. డాక్టర్లకైతే రిటైర్మెంట్ లైఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి పేషెంట్లతో తీరిగ్గా మాట్లాడేందుకు సమయం దొరుకుతుందని ప్రివెంటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో ఆమె తెలిపారు. -
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
మెల్బోర్న్: 'చెంబులో చేయెందుకు పెట్టావ్?' అనే మాట మనల్ని ఇప్పటికీ నవ్విస్తుంటుంది. సరదాగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం. మనలాగే ఆస్ట్రేలియాలో ఓ తండ్రి తన కుమారుడిని ఇలాగే ప్రశ్నించాడు. అయితే చెంబులో అని కాకుండా వెండింగ్ మెషిన్లో చెయ్యెందుకు పెట్టావని. ఆస్ట్రేలియాలో బిస్కట్లు, చాక్లెట్లువంటివాటికి ప్రత్యేక వెండింగ్ మెషిన్లు ఉంటాయి. లోన్ స్డేల్ వీధిలోని ఓ కాంప్లెక్స్ వద్ద బిస్కెట్ల వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన లియో అనే నాలుగేళ్ల పిల్లాడు మెషిన్ లోపలికి చేయిపెట్టాడు. దాంతో అది కాస్త ఇరుక్కుపోయింది. ఎంతకీ భయటకు రాకపోవడంతో ఏడ్వడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ప్రయత్నించారు. ఫలితం లేకుండాపోయింది. ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. చివరకు వెండింగ్ మెషిన్ను కట్ చేసి ఆరు గంటల తర్వాత అతడి చేతిని భయటకు తీశారు. అతడు చిన్నపిల్లాడు కావడం, బిస్కెట్లు చూసి ఆకర్షణకు లోనై తెలియక లోపల చేయిపెట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని బాలుడి తండ్రి చెప్పాడు. -
బిస్కెట్ల కోసం చేయి పెట్టి...
మెల్ బోర్న్: ఎదురుగా బిస్కెట్లు ఊరిస్తుంటే ఆబగా అందుకుందామని వెండింగ్ మెషీన్ లో చేయి పెట్టిన ఆసీస్ చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఆరు గంటల తర్వాత ప్రమాదం నుంచి బయటపెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఈ ఘటన చేసుకుంది. నాలుగేళ్ల లియో బిస్కెట్ల కోసం వెండింగ్ మిషన్ లో చేయి పెట్టాడు. బిస్కెట్లు తీసుకునేలోపు అతడి చేయి మిషన్ లో ఇరుక్కుపోయింది. దీంతో లియో బాధతో విలవిల్లాడు. పెద్దగా కేకలు పెట్టాడు. సమాచారం అందుకున్న మెల్ బోర్న్ అగ్నిమాపక సిబ్బంది లొన్స్ డేల్ స్ట్రీట్ లోని మిషన్ వద్దకు చేరుకున్నారు. 6 గంటల పాటు శ్రమించి చిన్నారికి విముక్తి కల్పించారు. తన కుమారుడు వెండింగ్ మిషన్ ను చూడడం ఇదే మొదటిసారని లియో తండ్రి ఆరోన్ షర్తోవుస్ తెలిపారు. బిస్కట్లు, ఇతర తినుబండారాలు మిషన్ లో కనపడడంతో అందులో చేయి పెట్టి ఉంటాడని పేర్కొన్నారు. లియో పెట్టిన కేకలు వీధంతా వినిపించాయని ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. లియో సురక్షితంగా ఉన్నప్పటికీ ముందుజాగ్రత్త కోసం అతడిని రాయల్ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారని స్థానిక మీడియా తెలిపింది. -
హత్య కేసులో బెయిల్ కోసం బాలుడు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ హత్యకు సంబంధించి బెయిల్ కోసం ఓ పదకొండేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణకు తొలిసారి కోర్టుకు హాజరైన ఆ బాలుడికి ఇదే నెల 17న మరోసారి హాజరు సమయంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరేందుకు దరఖాస్తు చేస్తున్నట్లు ఆ బాలుడి తరుపు న్యాయవాది తెలిపాడు. ఈ నెల 5న ఆస్ట్రేలియాలోని ఓ రైల్వే స్టేషన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో పరస్పరం ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఒక వర్గానికి చేతికి చిక్కగా వారు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ ఘటన అక్కడ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఆ హత్య చేసిన గ్రూపులో పదకొండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దీంతో పోలీసులు బాలుడితో సహా మొత్తం 20మందిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా చట్టం ప్రకారం పదేళ్లు దాటిని వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. గతంలో 2010లో పద్నాలుగేళ్ల యువకుడు ఇలాంటి ఆరోపణల కింద అరెస్టుకాగా, ఆ తర్వాత తక్కువ వయసులో ఉండి హత్యారోపణల కింద ఓ పదకొండేళ్ల బాలుడు అరెస్టు కావడం ఇది రెండోసారి. -
సాకేత్ ప్రత్యర్థి రామ్కుమార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ న్యూఢిల్లీ: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు సోమ్దేవ్ దేవ్వర్మన్, రామ్కుమార్ రామనాథన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెల్బోర్న్లో బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సహచరుడు రామ్కుమార్తో సాకేత్; జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో సోమ్దేవ్ తలపడతారు. క్వాలిఫయింగ్ ‘డ్రా’లో మొత్తం 128 మంది ఉన్నారు. 16 మందికి మెయిన్ ‘డ్రా’లో స్థానం లభిస్తుంది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 18 నుంచి 31 వరకు జరుగుతుంది. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!
మెల్ బోర్న్: పుచ్చకాయ బాలుడు(వాటర్ మెలన్ బాయ్) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు మిచెల్ స్కెహిబెసీ పుచ్చకాయను తొక్కతో సహా ఆబగా తింటూ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016'గా చక్కెర్లు కొడుతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగాడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ మిచెల్ లైవ్ టీవీ కెమెరాకు చిక్కాడు. పుచ్చకాయను తొక్కతో సహా తినేస్తున్న అతడిని చూసి కామెంటేటర్లు అవాక్కయ్యారు. 'అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ లాగించేస్తున్నాడు' అంటూ కామెంట్లు చేయడంతో అందరూ అతడిని ఆసక్తిగా గమనించారు. కెమెరా కంటపడగానే అతడు రెట్టించిన ఉత్సాహంతో పుచ్చకాయను కొరకడం మొదలు పెట్టాడు. ఈ వీడియో వాటర్ మెలన్ బాయ్ హేష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండవుతోంది. ట్విటర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016'గా పీపుల్స్ మేగజీన్ వర్ణించింది. అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని బీబీసీతో మిచెల్ స్కెహిబెసీ చెప్పాడు. చాలా ప్రయత్నం చేసిన తర్వాతే ఇలా తినగలుగుతున్నానని తెలిపాడు. రెండేళ్ల ప్రాయం నుంచే తొక్కతో సహా పుచ్చకాయ తింటున్నానని వెల్లడించాడు. మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే'గా ప్రకటించింది. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు అతడు నిరాకరించాడు. 'నేను నిజంగా హీరోను కాదు. నేనో సాధారణ బాలుడిని' అంటూ మిచెల్ వినయంగా చెప్పాడు. -
రక్త పరీక్షతో.. అకాల మరణాన్ని గుర్తించొచ్చు!
మెల్బోర్న్: ఒక్క రక్త పరీక్షతోనే అకాల మరణానికి గల అవకాశాలను గుర్తించవచ్చని చెబుతున్నారు మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. 10,000 మంది వ్యక్తుల రక్తనమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను గుర్తించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'గ్లిక్-ఏ' అనే మాలిక్యులార్ బై ప్రొడక్ట్ను కొత్తగా గుర్తించారు. రక్తంలో గ్లిక్-ఏ పరిమాణం అధికంగా ఉన్న వారిలో రానున్న 14 సంవత్సరాల కాలంలో వివిధ వ్యాదులు, ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఈ ఇన్ఫెక్షన్లు అకాల మరణానికి దారితీసేంత తీవ్రమైనవిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మైకెల్ ఇనోయ్ మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఈ పరిశోదన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్లిక్-ఏ పై మరింత పరిశోధన జరగాల్సిన అవసంరం ఉందని తెలిపారు. రక్తంలో దీని పరిమాణంను అధిక మోతాదులో గుర్తించినట్లయితే ప్రాణాంతక వ్యాధులకు దగ్గరగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. -
మెల్బోర్న్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎమ్టీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు ఆస్ట్రేలియాలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిచాయి. ఉత్సవాలకు వేదికైన రిక్వెస్ట్ హాల్ తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ముస్తాబైంది. బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో వేదిక హోరెత్తింది. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్టీఎఫ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సాంప్రదాయాలను భావి తరాలకు అందించేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అత్యంత నివాసయోగ్య నగరం.. మెల్బోర్న్
కాన్బెర్రా: ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) అనే సంస్థ ప్రతిఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. సుమారు 140 నగరాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాల ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించింది. ఈ అంశాల ఆధారంగా ఆయా నగరాలకు పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లు సాధించి మెల్బోర్న్ మొదటిస్థానంలో నిలిచింది. వియన్నా(97.4), వాంకోవర్(97.3), టొరంటో(97.2) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-10లో ఆస్ట్రేలియా, కెనడాలకు చెందిన ఏడు నగరాలు ఉండడం విశేషం. -
మెల్ బోర్న్ మరోసారి...
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. ఆవాసానికి అత్యంత అనువైన ప్రపంచ నగరాల్లో అగ్రశేణిలో నిలిచింది. ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన గ్లోబల్ సర్వేలో 140 నగరాలను అధిగమించి మెల్ బోర్న్ మొదటి స్థానం దక్కించుకుంది. విక్టోరియా రాష్ట్ర రాజధాని అయిన మెల్ బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో వైద్యం, విద్య, స్థిరత్వం, సంస్కృతి, పర్యావరణం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 100 పాయింట్లుగానూ మెల్ బోర్న్ కు 97.5 స్కోరు దక్కింది. తక్కువ నేరాలు నమోదు కావడంతో మెల్ బోర్న్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా(97.4), కెనడా నగరాలు వాంకోవర్(97.3), టొరంటో(97.2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో ఆస్ట్రేలియా నగరం అడిలైడ్, కెనడా నగరం కాల్ గారీ సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. టాప్-10లో ఏడు ఆస్ట్రేలియా, కెనడా నగరాలే ఉండడం విశేషం. -
బాలుణ్ణి కాపాడినందుకు అవార్డు
మెల్బోర్న్: మతసంప్రదాయానికి విరుద్ధమని తెలిసినా గాయపడ్డ బాలుడికి కట్టుకట్టడానికి తలపాగా ఉపయోగించిన సిక్కు యువకుడిని న్యూజిలాండ్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. హర్మాన్ సింగ్కు ‘డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికెట్’ను శుక్రవారం మనకావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రదానం చేశారు. బాధితులపై సింగ్ చూపిన సహానుభూతి ప్రశంసనీయార్హమైనదని కౌంటీ పోలీసుశాఖ ఉన్నతాధికారి అన్నారు. డీజన్ పహియా అనే బాలుడు మే 15న నడుచుకుంటూ స్కూలుకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. అతడి తల నుంచి విపరీతంగా రక్తం కారడాన్ని చూసి సింగ్ వెంటనే తలపాగా తీసి కట్టుకట్టి ప్రాథమిక చికిత్స చేశారు. -
భారతీయ విద్యార్థులకు బెదిరింపు కాల్స్
మెల్బోర్న్: న్యూజిలాండ్లో ఉంటున్న భారత విద్యార్థులు బెదిరింపు ఫోన్ కాల్స్తో బెంబేలెత్తిపోతున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల పేరుతో ఫోన్ చేసి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ వీసా ప్రాసెసింగ్లో సమస్యలున్నాయని గానీ లేదా అరైవల్ కార్డు సమాచారంలో లోపాలున్నాయని గానీ చెప్పి బెదిరిస్తున్నారు. దీనికోసం భారత్లోని వెస్ట్రన్ యూనియన్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ‘ది న్యూజిలాండ్ హెరాల్డ్’ ఓ కథనం లో పేర్కొంది. భారత్కు చెందిన సరిత అన్నపురెడ్డి తాను పొదుపుచేసిన రూ. రెండున్నర లక్షలకుపైగా మొత్తాన్ని ఇలాగే పోగొట్టుకున్నారు. ‘తొలుత నాకు ఫోన్కాల్ వచ్చినప్పుడు ఇది నకిలీకాల్గా భావించాను. స్నేహితులెవరైనా సరదగాగా ఆటపట్టిస్తున్నారేమోనని అనుకున్నా. అయితే ఆ ఫోన్నెంబర్ ఆక్లాండ్ ఇమిగ్రేషన్ నంబర్ లాగే ఉండటంతో నిజమనిపించింది. ఇమిగ్రేషన్ నెంబర్కు దీనికి ఒక సున్నా మాత్రమే తేడా ఉంది’ అని సరిత వాపోయారు. అయితే ఇలాంటి ఫోన్కాల్స్ను పరిగణనలోకి తీసుకోవద్దని, ఇమిగ్రేషన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేసి బెదిరించరని ఇమిగ్రేషన్ ప్రతినిధి చెప్పారు. -
మృత్యువుతో పోరాడి ఓడాడు
మెల్బోర్న్: ఓ భారతీయ విద్యార్థి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.... శుక్రవారం మరణించాడు. ఈ సంఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది. భారత్కు చెందిన బుద్దేశ్ పళని (26) న్యూజిలాండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. పళని సోమవారం సముద్రంలో విహారానికి వెళ్లాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మునిగిపోయాడు. అదే సమయంలో సముద్రంలో విహరిస్తున్న నలుగురు యువతియువకులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతడు వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం మరణించాడు. అయితే ఆసుపత్రిలో ఆపస్మారక స్థితిలో ఉన్న పళనిని ఎవరు గుర్తించలేదు. పళని ఫోటోలతో స్థానిక మీడియాలు పలు వార్తా కథనాలు ప్రసారం చేసింది. కథనాల్లో ప్రసారం అయ్యేది పళని అని అతడి స్నేహితులు గుర్తించి... వెల్డింగ్టన్ ఆసుపత్రికి చేరుకున్నారు. పళని ప్రమాదం వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
93,013
మెల్బోర్న్లో ఆదివారం ఫైనల్ చూసిన ప్రేక్షకుల సంఖ్య. ఓ మ్యాచ్ను క్రికెట్ చరిత్ర లో ఇంత మంది చూడటం ఇదే తొలిసారి. 1992 ప్రపంచకప్ ఫైనల్ను 87,182 మంది చూశారు. 2013 యాషెస్ సిరీస్లో తొలి రోజు 91,112 మంది స్టేడియానికి వచ్చారు. ఆ రికార్డును కూడా ఆదివారం మ్యాచ్ అధిగమించింది. 5 ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలవడం ఇది ఐదోసారి. వెస్టిండీస్, భారత్ రెండుసార్ల చొప్పున గెలిచాయి. 400 న్యూజిలాండ్, ఆసీస్ల ఫైనల్ ప్రపంచకప్ చరిత్రలో 400వ మ్యాచ్. ఓవరాల్గా ఇప్పటివరకు 3,646 వన్డేలు జరిగాయి. 547 టోర్నీలో గప్టిల్ చేసిన పరుగులు. న్యూజిలాండ్ తరఫున ప్రపంచకప్లో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్టిల్ 22 టోర్నీలో బౌల్ట్, స్టార్క్ తీసిన వికెట్లు. న్యూజిలాండ్ తరఫున ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బౌల్ట్. 1 ప్రపంచకప్లో వరుసగా ఐదు మ్యాచ్లలో 50కు పైగా స్కోర్లు చేసిన తొలి ఆటగాడు స్టీవ్స్మిత్. -
మహిళలకూ టి20 లీగ్
మెల్బోర్న్: మహిళల క్రికెట్కు కూడా మంచి రోజు లు రాబోతున్నాయి. ఈ దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముందడుగు వేసింది. ఆసీస్ దేశవాళీ టోర్నీ బిగ్ బాష్ ప్రాముఖ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే లీగ్ మహిళల కోసం ఏర్పాటు కానుంది. 2015-16 సీజన్ నుంచి మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యుబీబీఎల్)ను ప్రారంభించనున్నట్టు సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ప్రస్తుతం బీబీఎల్లో ఉన్న 8 జట్లే ఇందులోనూ కొనసాగుతాయి. ‘మహిళల క్రికెట్ మరింత అభివృద్ధి చెందేందుకు ఈ డబ్ల్యుబీబీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడి బాలికలు, మహిళలకు క్రికెట్ నంబర్వన్ గేమ్గా ఉండాలని మా ఉద్దేశం. మా లక్ష్యాన్ని ఈ లీగ్ నెరవేరుస్తుందని అనుకుంటున్నాం. ఫార్మాట్పై ఇంకా చర్చిస్తున్నాం. అత్యుత్తమ పోటీ ఉండేలా చూస్తున్నాం’ అని సదర్లాండ్ చెప్పారు. -
కోహ్లి కొత్త అవతారం...
మెల్బోర్న్: భారత క్రికెటర్లు ప్రతీ మ్యాచ్కు ఒక్కొక్కరు కొత్తగా కనిపించేందుకు సిద్ధమయ్యారేమో. నిన్న శిఖర్ ధావన్ ‘మొహక్’ హెయిర్ స్టైల్తో కనిపిస్తే ఇప్పుడు స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి వంతు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు కొత్త హెయిర్స్టైల్తో విరాట్ బరిలోకి దిగబోతున్నాడు. గురువారం అతను ఇందు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాడు. హోటల్ రూమ్నుంచి బయటికి వచ్చి, మెల్బోర్న్ వీధుల్లో కొద్ది దూరం నడిచి వెళ్లిన అతను, నగరంలోని ప్రఖ్యాత ‘టోనీ అండ్ గై’ సెలూన్కు చేరుకున్నాడు. కొన్ని గంటల అనంతరం కోహ్లి డిఫెరెంట్ లుక్తో బయటికి వచ్చాడు. తలకు రెండు వైపులా జుట్టును తగ్గించి మధ్యలో దువ్వినట్లుగా ఉండే ఈ లుక్ ఇటీవల ప్రఖ్యాత ఫుట్బాలర్ క్రిస్టియానా రొనాల్డో కనిపిస్తున్న ‘సీఆర్7’ స్టైల్ పోలికలతో ఉంది. కోహ్లి కొత్త లుక్ అభిమానులతో పాటు జట్టు సహచరులను కూడా ఆశ్చర్యపరచింది. -
ఆస్ట్రేలియా ఓపెన్
-
ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్
మెల్బోర్న్: ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ క్రిస్ రోజర్స్ అదే జోరును మెల్బోర్న్లో ఈనెల 26న మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ టెస్టులో సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. బ్రిస్బేన్లో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీలు చేసిన 37 ఏళ్ల ఈ వెటరన్ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడతానని చెబుతున్నాడు. ‘నేనిక్కడ రెండోసారి బాక్సింగ్ డే టెస్టు ఆడబోతున్నాను. గతేడాది సెంచరీ చేసినట్టే ఈసారి కూడా అదే రీతిన ఆడాలనుకుంటున్నాను’ అని అన్నాడు. 2013లో ఎంసీజీలోనే ఇంగ్లండ్పై సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
భారత్ను తక్కువ అంచనా వేయం: హాడిన్
మెల్బోర్న్: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్ను తక్కువ అంచనా వేయడం లేదని... రాబోయే మ్యాచ్ల్లో భారత్ జట్టు మరింత దూకుడుగా ఆడుతుందని ఆస్ట్రేలియా వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ‘ఇప్పటికే టీమిండియా సత్తా ఏంటో చూపింది. ఇక నుంచి మరింత దూకుడును చూపిస్తుంది. కాబట్టి మా మిడిల్, లోయర్ ఆర్డర్ బాగా రాణించాల్సిన అవసరం ఉంది. జాన్సన్ మరోసారి తన పవర్ను చూపించాలి’ అని హాడిన్ పేర్కొన్నాడు. గాబాలోని ప్రాక్టీస్ పిచ్పై భారత జట్టు ఫిర్యాదు చేయడాన్ని వికెట్ కీపర్ విమర్శించాడు. పిచ్లలో ఏం లోపం ఉందో చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్ తర్వాత అదే వికెట్పై భారత్ ప్రాక్టీస్ చేసింది. తర్వాత మా బౌలర్లు కూడా దానిపైనే ప్రాక్టీస్ చేశారు. అప్పుడు లేని లోపం మ్యాచ్ తర్వాత ఏం కనబడిందో’ అని హాడిన్ తెలిపాడు. స్మిత్ కెప్టెన్సీకి మద్దతిచ్చిన హాడిన్... సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారన్నాడు. ప్రస్తుతం స్మిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడన్నాడు. ఈ సిరీస్లో తాను పరుగులు చేయలేకపోవడంపై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్ లయోన్పై ప్రశంసలు కురిపించాడు. -
మహీంద్రా విమానాలు వస్తున్నాయ్...
మెల్బోర్న్: మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేసే విమానాలను భారత్లో విక్రయించడానికి ఆమోదం లభించింది. నిబంధనల్లో మార్పు కారణంగా తమ విమానాలకు ఆమోదం లభించిందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. మహీంద్రా జిప్స్ పేరుతో 5 నుంచి 10 సీట్లు ఉన్న ఈ విమానాలను మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేస్తోంది. భారత్లో నలుగురు ప్రయాణించే విమానాలకు మాత్రమే ప్రభుత్వ ఆమోదం ఉంది. దీంతో ఈ విమానాల విక్రయానికి ఆమోదం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. తాజాగా అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రమాణాలకనుగుణంగా నిబంధనలను మార్చామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో మహీంద్రా విమానాలను భారత్లో విక్రయించడానికి ఆమోదం లభించింది. ప్రధాని పనితీరు భేష్ 2009లో మహీంద్రా కంపెనీ రెండు ఆస్ట్రేలియా విమాన సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కోసం విమానాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేసి విక్రయించే యోచనలో భాగంగా మహీంద్రా కంపెనీ ఈ రెండు సంస్థల్లో ఒక్కో దాంట్లో 75 శాతం వాటాను రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. వీటి ద్వారా విమానాలు తయారు చేసి కాలిఫోర్నియాలో విక్రయిస్తున్నామని ఆనంద్ మహీంద్రా చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారానికి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా సందర్శిస్తున్న సీఈఓ ప్రతినిధి బృందంలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. నరేంద్ర మోదీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అడ్డంకులు తొలగిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైతే, భారీ స్థాయిలో ముడి పదార్ధాలు అవసరమవుతాయని ఆస్ట్రేలియాతో వ్యాపార అవకాశాలు అపారంగా పెరుగుతాయని పేర్కొన్నారు. -
కాన్బెర్రా నుంచి మెల్బోర్న్కు మోదీ
మెల్బోర్న్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో కాన్బెర్రా నుంచి మెల్బోర్న్ విచ్చేశారు. అంతకు ముందు కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ ఎబాట్, మోదీ మధ్య మంగళవారం శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక భద్రత, ఖైదీల మార్పిడి, డ్రగ్స్పై పోరు...తదితర అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక, పర్యాటక రంగాలపై కూడా ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. కాగా అబాట్తో చర్చల అనంతరం ఆస్ట్రేలియా పార్లమెంట్నుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని టోనీ ఎబాట్ చారిత్రక రికార్డు పత్రాలను మోదీతో పంచుకున్నారు. మోదీ తన ప్రసంగం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ నేతలను పరిచయం చేసుకున్నారు. కాగా మోదీ రాత్రికి మెల్బోర్న్ నుంచి ఫిజి పర్యటనకు బయల్దేరతారు. ఆయన పదిరోజుల్లో మూడు దేశాల్లో పర్యటించటం విశేషం. -
మెల్బోర్న్లో ఘనంగా బతకమ్మ వేడుకలు
-
ఫైర్ఫైటర్ల కోసం సూపర్ సూట్..
భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమించినా చివరికి అంతా బూడిదైపోయిన తర్వాతే మంటలు అదుపులోకి వస్తుంటాయి. భవనాల వంటివాటిలో ప్రమాదం జరిగితే గనక చాలా మంది సజీవదహనం అయిపోవాల్సిందే. మంటలను ఆర్పేందుకు, బాధితులను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించినా.. అనేక అడ్డంకుల వల్ల వారు అశక్తులుగా మిగులుతుంటారు. అందుకే.. ఎలాంటి ప్రమాదాన్ని అయినా దీటుగా ఎదుర్కొనేలా అగ్నిమాపక సిబ్బందికి ఉపయోగపడే ఈ హైటెక్ ఎక్సోస్కెలిటన్ (బాహ్య అస్థిపంజరం) సూట్ను మెల్బోర్న్కు చెందిన డిజైనర్ కెన్ చెన్ తయారు చేశారు. ఈ ఎక్సోస్కెలిటన్ను ధరిస్తే.. ఇక ఎవరైనా సూపర్ హీరోలేనన్నమాట. 23 కిలోల బరువుండే దీనితో 91 కిలోల బరువుని అలవోకగా మోసేయొచ్చు. రకరకాల పరికరాలు మోసుకుంటూ వేగంగా పరుగెత్తొచ్చు. మెట్లు, భవనాలూ సులభంగా ఎక్కేయొచ్చు. చేతులకున్న వాటర్ క్యానన్లను పవర్ఫుల్గా ప్రయోగించొచ్చు. బాధితులను ఇట్టే భుజాన వేసుకుని తీసుకురావచ్చు. ఇంతా చేసినా.. దీనిని ధరించినవారికి పెద్దగా అలసట అనేదే ఉండదట. ఎందుకంటే.. మొత్తం బరువంతా ఈ ఎక్సోస్కెలిటన్పై, ఆ తర్వాత నేలపైనే పడుతుంది మరి. సెన్సర్లు, యాక్చువేటర్లు, బ్యాటరీలతో పనిచేసే ఈ ఎక్సోస్కెలిటన్ను వీపు భాగంలో ఉండే ఓ కంప్యూటర్ నియంత్రిస్తుందట. ఆక్సిజన్ సిలిండర్, ఫ్లాష్లైట్, ఇతర పరికరాలు కూడా ఈ ఎక్సోస్కెలిటన్కు అవసరాన్ని బట్టి అమర్చుకోవచ్చు. -
మళ్లీ ఇంటివాడైన బ్రెట్ లీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ తన ప్రియురాలు లానా అండర్సన్ను వివాహమాడాడు. అతనికిది రెండో వివాహం. సీఫోర్త్లోని తన నివాసంలో సన్నిహితుల మధ్య గత వారం ఈ పెళ్లి జరిగింది. 2008లో మొదటి భార్య ఎలిజబెత్ కెంప్కు లీ విడాకులిచ్చాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 37 ఏళ్ల లీ గతేడాది నుంచి లానాతో డేటింగ్ చేస్తూ సహజీవనం చేస్తున్నాడు. -
నాటకీయత నడుమ...
ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రి విజేత రోస్బర్గ్ రెండో స్థానం పొందిన రికియార్డోపై అనర్హత వేటు వెటెల్, హామిల్టన్ విఫలం ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లిద్దరూ బోణీ రేసు పూర్తి చేయని ఏడుగురు డ్రైవర్లు మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్ సంచలనాలతో ప్రారంభమైంది. ఊహించని ఫలితాలు... ఆనందం వెంటే నిరాశ... స్టార్ డ్రైవర్ల వైఫల్యం... ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు డ్రైవర్లు రేసు పూర్తిచేయలేకపోవడం.. ఇలా పలు నాటకీయ పరిణామాల నడుమ సాగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్ల రేసును రోస్బర్గ్ (జర్మనీ) గంటా 32 నిమిషాల 58.710 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్బర్గ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా అదే జోరును కొనసాగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) కారు ఇంజిన్లో ఇబ్బంది తలెత్తింది. దాంతో అతను రెండో ల్యాప్లోనే రేసు నుంచి వైదొలిగాడు. వరుసగా 10వ విజయం సాధిస్తాడనుకున్న డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్బుల్)కు తొలి రేసు నిరాశ మిగిల్చింది. కారు ఇంజిన్లో సమస్య కారణంగా వెటెల్ మూడు ల్యాప్ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు. వెటెల్ సహచరుడు, రెడ్బుల్కే చెందిన మరో డ్రైవర్ రికియార్డోకు సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది. గంటా 33 నిమిషాల 23.235 సెకన్లలో రేసును పూర్తిచేసిన రికియార్డో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బహుమతి ప్రదానోత్సవంలో షాంపేన్ విరజిమ్మడంతోపాటు రన్నరప్ ట్రోఫీనీ అందుకున్నాడు. అయితే రేసు సందర్భంగా రికియార్డో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికంటే ఎక్కువ ఇంధనం వాడినట్లు తేలింది. ఐదు గంటల విచారణ అనంతరం ఈ ఆస్ట్రేలియన్ డ్రైవర్పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతని ఫలితాన్ని రద్దు చేశారు. దాంతో మూడో స్థానంలో నిలిచిన కెవిన్ మాగ్నుసన్ (డెన్మార్క్)కు రెండో స్థానం లభించింది. రేసు మొదలైన వెంటనే కొబయాషి (కాటర్హమ్) నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న ఫెలిప్ మసా (ఫెరారీ) కారును ఢీకొట్టాడు. దాంతో ఈ ఇద్దరూ తొలి ల్యాప్లోనే నిష్ర్కమించారు. సాంకేతిక సమస్యలతో గ్రోస్యెన్ (లోటస్) 43వ ల్యాప్లో... మల్డొనాడో (లోటస్) 29వ ల్యాప్లో... మార్కస్ ఎరిక్సన్ (కాటర్హమ్) 27వ ల్యాప్లో రేసు నుంచి వైదొలిగారు. భారత్కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు తొలి రేసు కలిసొచ్చింది. ఇద్దరు డ్రైవర్లూ పాయింట్ల ఖాతా తెరిచారు. హుల్కెన్బర్గ్ ఆరో స్థానంలో నిలిచి ఎనిమిది పాయింట్లు... సెర్గియో పెరెజ్ 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ సంపాదించారు. ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. ఎస్టీఆర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన క్వియాట్ తొమ్మిదో స్థానంలో నిలిచి రెండు పాయింట్లు సాధించాడు. -
రయ్...రయ్...రయ్
నేటి నుంచి ఫార్ములావన్ సీజన్ రేపు ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రి రేసు మెల్బోర్న్: గత నాలుగేళ్లుగా ఎదురులేని డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్బుల్) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా... మాజీ చాంపియన్ హామిల్టన్ పుంజుకుంటాడా... లేదంటే మరో కొత్త విజేత అవతరిస్తాడా... భారత్కు చెందిన ఫోర్స్ ఇండియా గాడిలో పడుతుందా... ఈ సందేహాల నడుమ ఫార్ములావన్ (ఎఫ్1)-2014 సీజన్కు తెరలేవనుంది. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రి రేసుకు మెల్బోర్న్ ఆదివారం ఆతిథ్యమివ్వనుంది. ఈ రేసుకు సంబంధించి క్వాలిఫయింగ్ సెషన్ శనివారం జరుగుతుంది. నవంబరు 23న జరిగే అబుదాబి గ్రాండ్ప్రి రేసుతో 19 రేసుల సీజన్ ముగుస్తుంది. 11 జట్లున్న ఈ సీజన్లో రెడ్బుల్ జట్టే ఫేవరెట్గా కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ వెటెల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నిబంధనల విషయానికొస్తే ప్రతి రేసులో విజేతకు 25 పాయింట్లు, రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానం దక్కితే 15 పాయింట్లు, నాలుగో స్థానం సంపాదిస్తే 12 పాయింట్లు, ఐదో స్థానం పొందితే 10 పాయింట్లు లభిస్తాయి. అయితే గత సీజన్కు భిన్నంగా ఈసారి చివరి రేసులో మాత్రం డ్రైవర్లకు రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఎఫ్1-2014 షెడ్యూల్: ఆస్ట్రేలియా గ్రాండ్ప్రి (మార్చి 16); మలేసియా (మార్చి 30); బహ్రెయిన్ (ఏప్రిల్ 6); చైనా (ఏప్రిల్ 20); స్పెయిన్ (మే 11); మొనాకో (మే 25); కెనడా (జూన్ 8);ఆస్ట్రియా (జూన్ 22); బ్రిటన్ (జూలై 6); జర్మనీ (జూలై 20); హంగేరి (జూలై 27); బెల్జియం (ఆగస్టు 24); ఇటలీ (సెప్టెంబరు 7); సింగపూర్ (సెప్టెంబరు 21); జపాన్ (అక్టోబరు 5); రష్యా (అక్టోబరు 12); అమెరికా (నవంబరు 2); బ్రెజిల్ (నవంబరు 9); అబుదాబి గ్రాండ్ప్రి (నవంబరు 23). -
వార్న్.. మళ్లీ ఒంటరి !
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. బ్రిటిష్ మోడల్, నటి ఎలిజబెత్ హార్లీతో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. ఓ ఆస్ట్రేలియా టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ‘మేమిద్దరం విడిపోయాం. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మా మధ్య ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేకపోయినా మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలుసుకుంటాం’ అని చెప్పాడు. 2010లో భార్య సైమోన్కు విడాకులిచ్చిన తర్వాత వార్న్, హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి వరకు రాలేకపోయారు. మరోవైపు బ్రిటిష్ మోడల్ మిచెల్లీ మోన్తో డేటింగ్ వార్తలపైనా వార్న్ స్పందించాడు. ’నేను ఇప్పుడు ఒంటరిని. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. ’ అని ఈ మాజీ స్పిన్నర్ స్పష్టం చేశాడు. -
ఆసీస్దే టి20 సిరీస్
మెల్బోర్న్: ఫార్మాట్ ఏదైనా తమ ఆటతీరు మారలేదని ఇంగ్లండ్ జట్టు మరోసారి నిరూపించుకుంది. యాషెస్, వన్డే సిరీస్లాగే టి20 సిరీస్ను కూడా ఆస్ట్రేలియాకు అప్పగించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆసీస్ 2-0తో సిరీస్ గెలుచుకుంది. నామమాత్రపు చివరి టి20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు చేసింది. బట్లర్ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఒక్కడే టాప్ స్కోరర్. ఓవర్కో వికెట్ చొప్పున నాలుగో ఓవర్ నుంచి ఏడో ఓవర్ దాకా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. హాజెల్వుడ్కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే 14.5 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. తొలి ఓవర్ నుంచే వైట్ (45 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు) బౌండరీల వరద పారించగా... కెప్టెన్ జార్జి బెయిలీ (28 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు; 3 సిక్స్లు) దూకుడైన ఆటతీరుతో పర్యాటక బౌలర్లను ఆడుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో నమోదైన 3 సిక్స్లు బెయిలీ బ్యాట్ నుంచే వచ్చాయి.