punishment
-
రాముడు విధించిన శిక్ష : శిక్ష తప్పదు!
ఇది రామాయణ ఇతిహాసానికి చెందిన సంఘటన. ఒక రోజు శ్రీరామచంద్రుడు సభలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ శునకం సభకు వచ్చింది. దాని తలకు గాయమై రక్తం కారుతోంది. సభలో ఉన్నవారందరూ దాని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు కూడా దానిని చూశాడు. ‘నువ్విక్కడికి ఏ పని మీద వచ్చావు... ఏం జరిగింది. జరిగిందేదైనా సరే ధైర్యంగా చెప్పుకో. భయ పడకు’ అన్నాడు రాముడు.అప్పుడా శునకం...‘అయ్యా, నేను వీధిలో వెళ్తున్నాను. మార్గ మధ్యంలో వేదశాస్త్రాలు చదువుకున్న ఒక పెద్దాయన ఎదురొచ్చాడు. ఆయన ఏ కారణమూ లేకుండా తన దగ్గరున్న కర్రతో నా తల మీద దెబ్బ వేశాడు. అందువల్ల రక్తం కారుతోంది. ఈ వ్యవహారంలో తగిన తీర్పు ఇవ్వండి’ అంది శునకం. రాముడు వెంటనే తన భటులను పంపించి నిందితుణ్ణి రప్పించాడు. అతడు ‘నేను వీధిలో వస్తుండగా ఈ కుక్క నాకు అడ్డొచ్చింది. అందువల్ల దానిని కొట్టాను. శాస్త్రాలు చదవుకున్నా... నేను హద్దు మీరాను. నాకు మీరు ఏ శిక్ష వేసినా సరే’ అన్నాడు. రాముడు శునకాన్నే అడిగాడు ఏ శిక్ష విధించాలని. అందుకు ఆ శునకం ‘ఆయనను ఏదైనా గుడికి ధర్మకర్తగా నియమించండి. అదే ఆయనకు సరైన శిక్ష’ అన్నది. అది విన్న రాముడు చిరునవ్వు నవ్వాడు. కానీ అక్కడున్న వారికి ఆశ్చర్యమేసింది. ‘అదెలాగూ... తప్పు చేసిన వారికి శిక్ష విధించడమే సముచితం. కానీ అది మానేసి అతనికి ధర్మకర్త హోదా కల్పించమని కోరడమేమిటీ’ అని వారు ఆ శునకాన్నే అడిగారు. దానికి శునకం... ‘నేను క్రితం జన్మలో ఓ ఆలయానికి ధర్మకర్తగా ఉండేదానిని. ఎంతో అప్రమత్తంగానే నా విధులను నిర్వహిస్తూ వచ్చాను. అయినా మానవ సహజమైన కక్కుర్తితో ఆలయ సంపదను తప్పుగా అనుభవించాను. ఫలితంగా మరుజన్మలో కుక్కగా జన్మించి అవస్థలు పడుతున్నాను. ఇవే అవస్థలు ఈ పెద్దమనిషి కూడా పడాలి’ అని పలికింది. హిందువుల్లో తప్పు చేసినవారు ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా శిక్ష అనుభవించాల్సిందే అనే నమ్మకం ఉంది. ప్రజల్లో నైతికత, ధర్మం వర్థిల్లడానికి ఇటువంటి నమ్మకాలు దోహదం చేస్తాయి. సమాజానికి ఈ తరహా నీతి బోధనలు చేయడమే పురాణ కథల లక్ష్యం. – యామిజాల జగదీశ్ -
హెడ్ మాస్టర్ తీశిండు గుంజీలు
-
మిమ్మల్ని మార్చలేకపోతున్నాను.. మన్నించండి.. గుంజీలు తీసిన హెడ్ మాస్టర్
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ లెక్కల మాష్టారే కరెక్ట్ ఆయనైతేనే నీకు చర్మం వలిచేసి బుద్ధి చెబుతాడు.. -ఒక పిల్లాడికి తండ్రి వార్నింగ్ ...మాస్టర్ గారండీ.. ఆ శీనుగాడు మా గుంటడే .. బడి నుంచి వచ్చాక పుస్తకాలు సంచి ఇంట్లో పడేసి బావుల్లోనూ చెరువుల్లోనూ ఈతకని తిరుగుతున్నాడు తప్ప పుస్తకం తీయడం లేదు.. చదవడం లేదు.. మీరు వాణ్ని ఏమాత్రం వదలొద్దు... చేమడాలు వలిచేయండి.. నేనేం అనుకోను.. ముందు వాణ్ని దారిలో పెట్టండి-టీచర్తో ఒక తండ్రి వేడుకోలు..ఒరేయ్ ఇక ఆడింది చాలు.. ఆదివారం కూడా చదూకోమన్నాడు సైన్స్ మాస్టర్.. అయన ఇల్లు ఈ దారిలోనే .. మనం ఇంకా ఈ మామిడి తోటల్లో తిరిగి.. ఆయనకు దొరికిపోతే మాత్రం మనం అయిపోయినట్లే.. ఇక ఇదే ఆఖరాట వెళ్లిపోదాంరా.. నాకు భయమేస్తోంది..-పిల్ల గ్యాంగులో ఒకడి ఆందోళనఒరేయ్ బెల్లం తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పాములు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లాడు వినడం లేదు.. మీరైనా చెప్పండి టీచర్ గారు.. వీడికి మేమంటే భయం లేకపోతోంది.. మీరే వీడికి రెండు వేసి దారిలో పెట్టండి-మాష్టర్ వద్ద ఒక తల్లి విజ్ఞాపనపాతికేళ్ల క్రితం టీచర్ అంటే బడిలోనే కాదు.. ఊళ్ళో.. గుడిలో.. పెళ్ళిలో.. సంతలో.. మార్కెట్లో ఎక్కడ కనిపించినా టీచర్ గానే చూసేవాళ్ళు.. ఎక్కడ ఆయన ఎదురైనా పక్కకు తప్పుకోవడం.. కూడా లేచి నిలబడి గౌరవించడం.. ఇంట్లో భయం లేకపోతే నేరుగా తల్లిదండ్రులే స్కూలుకు వచ్చి టీచరుకు చెప్పి మరీ తమ బిడ్డల్ని దారిలో పెట్టించడం నాటి సమాజపు సంస్కృతి.. స్కూలు టైములోనే కాదు.. తమ జీవితంలో ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ గానే గౌరవించి.. భయభక్తులతో ఉండేవాళ్ళు. కానీ కాలం మారింది.. టీచర్ అంటే జీతం తీసుకుని పని చేసే ఒక పనివాడు.. ఒక ఉద్యోగి.. అంతేతప్ప అయన తమకు ఇంకేం కాడు కాలేడు. అయినా మనను టీచర్ కొట్టడం ఏంది.. కొడితే ఊరుకుంటామా.. ఇదే దారిలో వెళ్తాడు కదా.. సాయంత్రం చూసుకుందాం లే .. అన్నట్లుగా పిల్లల తీరు ఉండగా.. ఏంది టీచర్ మా వాణ్ని కొట్టిర్రట.. వాణ్ని మేమె ఏనాడూ ఏమీ అనలేదు. మీరు కొడితే ఎట్లా .. చదువు చెబితే చెప్పండి.. లేకుంటే లేదు.. వాడికి చదువురాకున్నా ఫర్లేదు.. కొట్టుడు మాత్రం వద్దు.. ఈసారి కొడితే ఊరుకునేది లేదు.. అంటూ టీచర్లకే పేరెంట్స్ వార్నింగ్ ఇస్తున్న కాలం ఇది.అల్లరి చేసినా .. చెప్పినమాట వినకపోయినా చేతులు ఒళ్ళు వాచిపోయేలా టీచర్లు కొట్టినా ఏమీ అనని రోజులు పోయి.. మావాణ్ని కొడితే నీకు పడతాయి మాస్టర్ గారు ఎన్ని వార్నింగ్ ఇస్తున్న రోజులు వచ్చాయి.. పిల్లల్ని దండించడాన్ని అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ వ్యూస్ పెంచుకునే మీడియా లైన్లోకి వస్తుంది.. పిల్లల హక్కుల సంఘాలు సంస్థలు కూడా యాగీ చేయడానికి ఎల్లపుడూ సిద్ధమే.. టీచర్ చేతిలో బెత్తం ఏనాడైతే మూలకు చేరిందో ఆనాడే పిల్లల్లో అల్లరి పెరిగింది.. భయం బాధ్యత స్థానంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.. టీనేజీలోనే దురలవాట్లు.. నేరాలకు సిద్ధం అవుతున్నారు..ఇలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ.. వారిని ఏమీ నిందించలేక.. దండించలేక.. శిక్షించలేక.. అనలేక ఒక హెడ్ మాస్టర్ మనస్తాపంతో కుమిలిపోతూ.. మీరు మారరు.. మిమ్మల్ని నేను మార్చలేను.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు.. మీకు భయం లేదు.. గౌరవం లేదు.. అయినా మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. ఇకపై మీ ఇష్టం అంటూ గుంజిళ్ళు తీశారు.. ఇది అయన ఆవేదన కాదు.. సమాజంలో విద్యార్థులు.. తల్లిదండ్రుల పరిస్థితిని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఆనాడు గురువు గురించి వేమన రాసిన పద్యాన్ని ఒకసారి గుర్తి చేసుకుందాం‘గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో అజునకైనా వాని యబ్బకైన తాళపుచెవి లేక తలుపెట్లు లూడునో విశ్వదాభిరామ వినురవేమ’గురువుతో శిక్ష అనుభవించకుండా చదువు ఎలా వస్తుంది అంటాడు వేమన.. కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు.. ఇప్పుడు దండించకపోతే వారు మున్ముందు మరింతగా రాటుదేలిపోతారన్నది వేమన ఉద్దేశ్యం.. అది నాడు.. నేడు.. ఏనాడైనా చెల్లుబాటు అవుతుంది. అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే స్పష్టం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న. -
డీప్ఫేక్స్ చేసినా.. షేర్ చేసినా.. జైలుకే!
డీప్ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ. ఆ వీడియోకుగానూ ఆమెకు అన్నిరంగాల నుంచి సానుభూతి కనిపించింది. ఆ టైంలో ఈ టెక్నాలజీని కట్టడి చేయాలంటూ ప్రభుత్వాలు సైతం గళం వినిపించాయి. అయితే ఏఐ వాడకం పెరిగిపోయాక.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ఏకంగా సినిమా హీరోయిన్లను.. నచ్చిన అమ్మాయిలను ముద్దు పెట్టుకుంటున్నట్లు, వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో క్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ షార్ట్వీడియోస్ యాప్లలోనూ వదులుతున్నారు.ఒకవైపు మన దేశంలో ఈ తరహా విషసంస్కృతిని కట్టడి చేయలేకపోవడంతో.. ఉన్మాదులు మరింత రెచ్చిపోతున్నారు. మన దేశ ప్రధానిని సైతం కూడా వదలకుండా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందులో సరదా కోణం ఉన్నప్పటికీ.. అశ్లీలత, అసభ్యత లాంటివి కూడా చాలావరకు కనిపిస్తోంది. అయితే ఇక్కడో దేశం డీప్ఫేక్ కట్టడికి కఠిన చట్టం అమల్లోకి తేబోతోంది.ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్లను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Intelligence) ని ఉపయోగించి.. అచ్చం నిజంవాటిలా అనిపించేలా చేసే ప్రయత్నమే డీప్ఫేక్. ఇందులో సరదా కోణం మాత్రమే కాదు.. అచ్చం పోలికలతో ఉండేలా అసభ్యకరమైన వీడియోలను, ఫొటోలను, అలాగే ఫేక్ ఆడియో క్లిప్లను కూడా సృష్టించవచ్చు. అందుకే ఆందోళన తీవ్రతరం అవుతోంది. అయితే..డీప్ఫేక్స్(Deepfakes)ను క్రియేట్ చేసినా.. వాటిని ఇతరులకు షేర్ చేసినా.. ఇక నుంచి తీవ్ర నేరంగానే పరిగణించనుంది బ్రిటన్. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని మృగాలు నెట్టింట రెచ్చిపోతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రకటించింది.వాస్తవానికి 2015 నుంచే డీప్ఫేక్ను తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయాలని బ్రిటన్ ప్రయత్నిస్తూ వస్తోంది. గత కన్జర్వేటివ్ ప్రభుత్వం తీవ్ర నేరంగానే పరిగణించాలని చట్టం చేయాలనుకున్నప్పటికీ.. శిక్షను మాత్రం స్వల్ప జైలు శిక్ష, జరిమానాతో సరిపెట్టాలనుకుంది. అయితే ఆ టైంలో శిక్ష కఠినంగా ఉండాలని పలువురు డిమాండ్ చేశారు. తాజాగా లేబర్ పార్టీ(labour Party) ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. డీప్ఫేక్ను ప్రమోట్ చేసేవాళ్లు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కఠిన శిక్షకూడా పడుతుంది. ‘‘అనుమతి లేకుండా అశ్లీలంగా డీప్ఫేక్ కంటెంట్ తయారు చేసినా.. వైరల్ చేసినా శిక్షార్హులే అని ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. అలాగే మహిళల ప్రైవసీకి భంగం కలిగించే ఈ వ్యవహారాన్ని అత్యవసర పరిస్థితిగానూ పరిగణిస్తామని పేర్కొంది. అతిత్వరలో ఈ చట్టాన్ని పార్లమెంట్కు తీసుకురానున్నట్లు తెలిపింది.యూకేకు చెందిన రివెంజ్పోర్న్ హెల్ప్లైన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2017 నుంచి సోషల్ మీడియాలో ఈ తరహా వేధింపులు 400 శాతం పెరిగిపోయినట్లు తేలింది. అయితే ఇది ఫొటోల రూపేణా ఎక్కువగా కనిపించింది.ఉన్మాదంతో, ఒక్కోసారి ప్రతీకార చర్యలో భాగంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్ను ఉద్దేశపూర్వకంగానే నెట్లో వదులుతున్నారు కొందరు. మన దేశంలోనూ కొందరి డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుండడంతో.. ఆ ప్రైవేట్ వీడియోలు తమవి కావంటూ వాళ్లు ఖండిస్తుండడం చూస్తున్నాం.ఇదీ చదవండి: చొరబాట్లకు మూడు రూట్లు -
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష
విశాఖ–లీగల్: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి అందించిన వివరాలు.పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు. 2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
నా తండ్రిని అవమానించారు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్తో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లా సంక్షోభం, అల్లర్ల అనంతరం షేక్ హసీనా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జులైలో విద్యార్థుల నిరసనల్లో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. దేశ పౌరులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బంగాబంధు స్మారకం వద్ద పూల మాలలు వేసి మృతి చెందినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించండి.గత జూలై నుంచి ఆందోళనలతో విధ్వంసం, హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాత్రికేయులు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఆమె అన్నారు. షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.‘‘ నా తండ్రి, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X....I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r— ANI (@ANI) August 13, 2024 -
అటవీ భూమిని దున్నేస్తారా.. రెండొందల మొక్కలు నాటండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ హైదరాబాద్: రెండు ఎకరాల్లో చెట్ల నష్టానికి బాధ్యుడైన పిటిషనర్కు హైకోర్టు అరుదైన(బాధ్యతాయుత) శిక్ష విధించింది. ఎకరానికి 100 చొప్పున రెండు ఎకరాల్లో 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈ మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్ఓకు స్పష్టం చేసింది. ఆర్డర్ కాపీ అందిన నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిటిషనర్కు తెలి్చచెప్పింది. మొక్కలు నాటేందుకు న్యాయస్థానం విధించిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.అయితే, చెట్ల నష్టం కలిగిందని చెబుతున్న కంపార్ట్మెంట్ నం.441ని గుర్తించేందుకు పిటిషనర్కు సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని అటవీ అధికారులను ఆదేశిస్తూ, విచారణ సెపె్టంబర్ 6కు వాయిదా వేసింది. మంచిర్యాలజిల్లా నెన్నెల మండలం నాగారానికి చెందిన మాదె మల్లేశ్ వ్యవసాయదారుడు.కుశెనపల్లి రేంజ్ కంపార్ట్మెంట్ నంబర్ 441లోని అటవీప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్తో భూమిని దున్ని చెట్లు తొలగించారన్న లింగాల సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 2024, జూలై 1న మల్లేశ్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మధ్యవర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు అదే రోజు ట్రాక్టర్ను సీజ్ చేసి బెల్లంపల్లిలోని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు.అటవీ భూమి ఆక్రమణకు యత్నించారుసీజ్ చేసిన తన ట్రాక్టర్ను తిరిగి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదె మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పిటిషనర్ ఎలాంటి తప్పు చేయలేదని, భూమి దున్న డానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యవసాయ పనుల నిమి త్తం ట్రాక్టర్ను మరో ఇద్దరి(ఏ–1, ఏ–2)కి అద్దెకు మాత్రమే ఇచ్చారని మల్లేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అలవాటైన నేరస్తుడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోందని చెప్పారు. పిటిషనర్తోపాటు మరికొందరు బృందంగా ఏర్పడి తరచూ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాక్టర్ విడుదలకు గతంలో ఇదే కోర్టు ఇచి్చన ఉత్తర్వులను పాటించాలన్నారు. రూ.50 వేల బాండ్తోపాటు ఇద్దరు పూచీకత్తు సమరి్పంచాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ట్రాక్టర్ను అమ్మడంగాని, వేరొకరి పేరు మీదకు మార్చడంగాని చేయనని అఫిడవిట్ ఇవ్వాలని.. అధికారులు ఆదేశించినప్పుడు ట్రాక్టర్ వారి వద్దకు తీసుకురావాలని.. ఈ ఉత్తర్వుల కాపీ అందిన నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు అందజేయాలని పిటిషనర్ను ఆదేశించారు. అనంతరం ట్రాక్టర్ను విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. చెట్లకు నష్టం కలిగించినందుకు.. అదే అటవీ ప్రాంతంలో 200 మొక్క లు నాటాలని పిటిషనర్కు తేలి్చచెప్పారు.కాగా, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప అటవీశాఖ మొక్కలు సరఫరా చేయదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కలు సరఫరా చేయాలని సూర్యాపేట డీఎఫ్ఓను ఆదేశించారు. నెలరోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పిటిషనర్ మాదె మల్లేశ్ కోర్టు తీర్పుపై ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎకరం భూమి దున్నితే రూ.2వేలు వస్తాయని కిరాయి(అద్దె)కి ట్రాక్టర్ను ఇస్తే, తనకు ఊహించని వి«ధంగా తీర్పు వచి్చందన్నారు. మరోవైపు జిల్లా అటవీ అధికారులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
ఫలించిన నిరీక్షణ
సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు. 2006లో దుబాయ్లో నేపాల్కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు. వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఫోన్లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
దుబాయ్ బందీలకు విముక్తి
సిరిసిల్ల: దుబాయ్లోని అవీర్ జైల్లో 18 ఏళ్లుగా ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వలసజీవులు ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈనెల 21న జైలు నుంచి విడుదలై భారత్కు రానున్నారు. దుబాయ్ జైలు నుంచి నేరుగా భారత్కు వచ్చేందుకు విమాన టికెట్లు సిద్ధమయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి(45) అన్నదమ్ములు. కోనరావు పేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్(48), చందుర్తికి చెందిన నాంపల్లి (గొల్లెం) వెంకటి(43), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(51), కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం బతుకుదెరువు కోసం దుబాయ్కి వెళ్లారు. వీరిలో కరీం మినహా ఐదుగురు ఓ సెక్యూరిటీగార్డు హత్య కేసులో 18 ఏళ్లుగా దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దుబాయ్ వెళ్లి ప్రయత్నం చేశారు. ఐదుగురు ఎన్నారై ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, దుబాయ్ కాన్సుల్ జనరల్ రామ్కుమార్, ఈ కేసు వాదిస్తున్న అరబ్ న్యాయవాదితో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయతి్నంచాలని కోరారు. ఆ దౌత్యం ఫలించి ఎట్టకేలకు మల్లేశం, రవి, హన్మంతు విడుదలవుతున్నారు. నాలుగు నెలల కిందట దుండుగుల లక్ష్మణ్ విడుదలయ్యారు. వెంకటి విడుదలకు కొంత సమయం పడుతుందని తెలిసింది. ఇదీ కేసు నేపథ్యం 2006లో దుబాయ్లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్కు చెందిన దిల్ ప్రసాద్రాయ్ అనే సెక్యూరిటీగార్డు హత్య కు గురయ్యాడు. అక్కడ టన్నుల కొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్ తీగలను పది మంది కలిసి దొంగిలించేందుకు యత్నించారని, అడ్డుకున్న ప్రసాద్రాయ్ని హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసు నింది తుల్లో ఆరుగురు తెలంగాణ వారుకాగా, నలుగురు పాకిస్తానీయులు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ.. పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, సయ్యద్ కరీం విడుదలయ్యారు. మిగిలిన వారికి హత్యకేసులో క్షమాభిక్ష లభించినా.. దొంగతనం, దేశం విడిచివెళ్లే ప్రయత్నం చేసిన కేసుల్లో జైల్లో ఉన్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష జైల్లో ఉన్న ఐదుగురి విడుదల కోసం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ఆ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. హైకోర్టులో ఈ కేసులు విచారించిన ధర్మాసనం ఈ హత్యను క్రూరమైనదిగా పరిగణించింది. మల్లేశం, రవి, వెంకటి, హన్మంతు, లక్ష్మణ్లకు కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో యావజ్జీవ కారాగార శిక్షకు పెంచింది. నేరం నుంచి తప్పించునేందుకు కత్తిని పూడ్చిపెట్టడంతోపాటు, అక్రమంగా దేశం దాటేందుకు ప్రయత్నించారని.. ఇవన్నీ తీవ్రమైన నేరాలని ధర్మాసనం పేర్కొంది. దీంతో దోషుల విడుదల ఆలస్యమైంది. అయితే, నాడు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. -
‘హిట్ అండ్ రన్’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. చైనా చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటన్ యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్కు ఒక పాయింట్ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడా కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ హాంకాంగ్లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది. -
చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు!
‘చంద్రబాబు శాశ్వతంగా జైలు పక్షిగా మారక తప్పదు. ఒకట్రెండ్రోజులు ఆలస్యం కావచ్చు తప్ప, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రం పక్కా’ అని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఒక్కో కేసులో విడివిడిగా యావజ్జీవ కారాగార శిక్ష, పీసీ యాక్ట్ 13(బి) కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.కోటి ఫీజు చెల్లిస్తూ.. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు తీసుకువచ్చే న్యాయవాదులతో కేసు విచారణను కాస్త జాప్యం చేయగలరేమోగానీ నేరం నుంచి మాత్రం తప్పించలేరని స్పష్టం చేస్తున్నారు.భారీ అవినీతి కుంభకోణాల కుట్రదారు, లబ్దిదారులు.. చంద్రబాబు, ఆయన కుటుంబం, సన్నిహితులు, బినామీలేనని డాక్యుమెంటరీ ఆధారాలు, న్యాయ స్థానాల్లో నమోదు చేసిన కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై అభియోగాలతో ఏకీభవిస్తూ ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడటానికి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.అనారోగ్య కారణాలతో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ ఇస్తున్నప్పుడు గానీ.. తాజాగా మూడు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ సందర్భంగా గానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. తద్వారా చంద్రబాబు, లోకేశ్తోపాటు సహచర కుట్రదారులైన టీడీపీ ప్రభుత్వంలో మంత్రులది కూడా జైలు దారేనన్నది స్పష్టమవుతోంది. స్కిల్ కార్పొరేషన్, ఫైబర్నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఎంతగా బరితెగించిందనే విషయం చర్చనీయాంశమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కిల్ కార్పొరేషన్, ఫైబర్నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ గత ముఖ్యమంత్రి చంద్రబాబే అని సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతో వెల్లడి కావడంతో ఆయనకు ఏ రకంగా చూసినా జీవిత ఖైదు తప్పదని న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన సర్వం తానై కుట్ర పన్నారు. అందుకోసం కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేశారు. స్కిల్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్, బినామీల పేరుతో అసైన్డ్ భూములు పొందిన వారికి భూ సమీకరణ ప్యాకేజీ, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ పన్ను.. జీఎస్టీ ఎత్తివేత, ఉచిత ఇసుక విధానం.. ఇలా అన్ని కుంభకోణాలకు మార్గం సుగమం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆ జీవోకు కూడా కేబినెట్ ఆమోదం లేకపోవడం చంద్రబాబు కుట్రను వెల్లడిస్తోంది. ఆ జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను కూడా మాయం చేయడం గమనార్హం. మాయం చేసిన నోట్ ఫైళ్లను సీఐడీ అధికారులు రిట్రీవ్ చేసి వెలుగులోకి తేవడంతో అన్ని కుంభకోణాల కుట్రలకు కీలక ఆధారాలు లభించాయి. చంద్రబాబు ముఠా గల్లంతు చేసిన అమరావతిలో అసైన్డ్ భూముల రికార్డులను సీఐడీ వెలికి తీసింది. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లలో కొల్లగొట్టిన నిధులు చంద్రబాబు నివాసానికే చేర్చిన అవినీతి నెట్వర్క్ను బ్యాంకు ఖాతాల వివరాలతోసహా ఛేదించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట నివాసం పొందడం, హెరిటేజ్ ఫుడ్స్కు భూములు దక్కడం, చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట భూ సమీకరణ ప్యాకేజీ పొందడం మొదలైనవన్నీ రికార్డులతో సహా వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్, నారాయణల పాత్రను స్పష్టం చేస్తూ పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. మరోవైపు ఈ కుంభకోణాలన్నింటికి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. అది కూడా 164 సీఆర్సీపీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఫైబర్నెట్, స్కిల్ స్కామ్లలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని కీలక అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు. షెల్ కంపెనీల ప్రతినిధులు కూడా అప్రూవర్గా మారి అదే విషయాన్ని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కన్సల్టెన్సీ కంపెనీ, స్కిల్ స్కామ్కు సంబంధించి సీమెన్స్ కంపెనీ కూడా 164 సీఆర్సీపీ కింద వాంగ్మూలాలు నమోదు చేశాయి. ఈ విధంగా అన్ని కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్దిదారు అనేదానికి అటు డాక్యుమెంటరీ ఆధారాలు, ఇటు కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసా«ద్యమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును రిమాండ్కు పంపడమే తార్కాణం ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలానే చంద్రబాబు పాల్పడ్డ ఇన్ని కుంభకోణాలలో ఒక్క స్కిల్ స్కామ్ను పరిశీలిస్తే చాలు.. ఆయన అవినీతి బాగోతం తెలిసిపోతోంది. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరు పరిచింది. ఆ సందర్భంగా దాదాపు 10 గంటలపాటు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ఆయనకు జ్యుడిషి యల్ రిమాండ్ విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. దాంతోనే చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇక సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించ లేదు. ముందస్తు బెయిల్పై ఎల్లో మీడియా వక్రీకరణ ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆ సందర్భంగా కూడా ఆయన అవినీతికి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్ప లేదు. కేసు పూర్వాపరాల్లోకి ఇంకా తాము వెళ్లడం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం షరతులతోనే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని.. విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా చెప్పింది. కానీ హైకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించినట్టుగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా హడావుడి చేయడం విస్మయ పరుస్తోంది. సీఐడీ సేకరించిన ఆధారాలతో నేరం రుజువు కావడం ఖాయమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరం నిరూపితమైన తర్వాత ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయనపై సీఐడీ నమోదు చేసిన వివిధ సెక్షన్ల తీవ్రత, కేసుల విచారణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు వీరే ♦ నారా చంద్రబాబునాయుడు ♦ నారా లోకేశ్, పొంగూరు నారాయణ ♦ కింజరాపు అచ్చెన్నాయుడు ♦ దేవినేని ఉమామహేశ్వరరావు ♦ కొల్లు రవీంద్ర, పీతల సుజాత ♦ చింతమనేని ప్రభాకర్ తవ్వేకొద్దీ అవినీతే ♦ స్కిల్ స్కామ్లో రూ.241 కోట్లు చంద్రబాబు నివాసానికి చేరాయని సీఐడీ ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చింది. ♦ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ను నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ టెండరు అప్పగించారు. నాసిరకం పనులు చేసినాసరే పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.244 కోట్లు చెల్లించగా అందులో రూ.144 కోట్లు చంద్రబాబు నివాసానికే చేరాయి. ♦ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్, నారాయణ భారీ భూ బాగోతానికి పాల్పడ్డారు. తమ బినామీ అయిన లింగమనేని కుటుంబానికి చెందిన భూములను ఆనుకుని నిర్మించేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. కృష్ణా నదికి ఇటూ అటూ కూడా లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 355 ఎకరాల సమీపం నుంచి నిర్మించేలా రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేశారు. అందుకోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవకుండా నామినేషన్పై కట్టబెట్టారు. అనంతరం అదే అలైన్మెంట్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చేలా ముందుగానే షరతు విధించి మరీ రాజధాని మాస్టర్ ప్లాన్ డెవలపర్ను నిర్ణయించారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు, లింగమనేని, నారాయణ భూముల మార్కెట్ విలువ మొత్తం రూ.177.50 కోట్లు ఉండగా.. అలైన్మెంట్ ఖారారుతో ఏకంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచిన తర్వాత అమాంతంగా రూ.2,130 కోట్లకు పెరుగుతుందని స్పష్టమైంది. అంటే అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.2 వేల కోట్ల అక్రమ లబ్ధికి పచ్చముఠా కుట్ర పన్నింది. ♦ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన అమరావతిలోని అసైన్డ్ భూముల దందా దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీగా రికార్డు సృష్టించింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా కేంద్ర అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. అందుకోసం అమరావతి పరిధిలో అసలు 1954 తర్వాత అసైన్డ్ భూములే ఇవ్వలేదంటూ భూ రికార్డులు తారుమారు చేశారు. అసైన్డ్ భూములను జిరాయితీ భూములుగా రికార్డుల్లో కనికట్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని రైతులను భయపెట్టారు. అందుకోసం మొదట జీవో నంబర్–1 జారీ చేశారు. ఆ జీవోను బూచిగా చూపిస్తూ తమ ఏజంట్ల ద్వారా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్–41 జారీ చేశారు. తద్వారా భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.3,737.30 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల భూములుగా చూపిస్తూ ఏకంగా 328 ఎకరాలను కొల్లగొట్టారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లు విలువైన స్థలాలు పొందారు. ♦ పేరుకు ఉచిత ఇసుక అని చెప్పి.. చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మాత్రమే ఉచితంగా ఇసుక కొల్లగొట్టి బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయించేలా చక్రం తిప్పారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ♦ తమ అస్మదీయ, బినామీ కంపెనీలకు మద్యం కొనుగోళ్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న మద్యం దుకాణాలు, బార్లపై ఉన్న ప్రివిలేజ్ ట్యాక్స్.. జీఎస్టీని తొలగిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఆరు కేసుల్లోనూ శిక్ష తప్పదు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిలో అత్యంత కీలకమైనది సెక్షన్ 409. ఆ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇతర సెక్షన్లు సరేసరి. ఈ ఆరు కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్షలు పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే బాబుకు 73 ఏళ్లు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓసారి నేరం నిరూపితమై ఒక్కో కేసులో ఐపీసీ 409 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టం 13(2) కింద గరిష్టంగా పదేళ్ల కారాగార శిక్ష పడితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ కూడా నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సీఎంగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడిన ఉదంతాన్ని ఉదాహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే.. 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) 409 సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 13 (2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
డీప్ఫేక్లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్ఫేక్ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. డీప్ఫేక్ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. డీప్ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. అనంతరం అశ్విన్ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్ఫేక్లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్ఫేక్ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్ఫేక్ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. (ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు ) కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్బా నృత్యం చేస్తున్నట్టు వచ్చిన నకిలీ వీడియోతోపాటు, సినీ హీరోయిన్లు రష్మికా మందాన, కాజోల్ పేరుతో కొన్ని అభ్యంతర వీడియోలు నెట్టింట హల్ చేసిన నేపథ్యంలో ఐటీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. -
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
ఖతార్లో అత్యాచారానికి విధించే శిక్ష ఎంత కఠినం?
ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్లో అమలయ్యే వివిధ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఖతార్లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట. కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్యపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’ -
మీ బాస్కి బుద్ధి లేదు,వాడో శాడిస్ట్.. టార్గెట్ రీచ్ కాలేదని బలవంతంగా..ఛీ!
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత పనిని చేయించు కోవాలనుకుంటాయి. ఇక కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు టార్గెట్ల పేరుతో వేధిస్తుంటాయి. తాజాగా ఓ బాస్ తన ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష వేశాడు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితో సంతృప్తి లేదని వెరైటీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అందులో ఒక ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ బాస్ బండారం బయటపడింది. ఈ వింత ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. అదో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కంపెనీ. పేరు సుఝౌ దనావ్ ఫాంగ్చెంగ్షీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు బలవంతంగా చేదు కాకరకాయల్ని బలవంతంగా తిన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చాలా మంది ఉద్యోగులు పచ్చి పొట్లకాయ తింటున్నారు. కంపనీలో చేరే ముందు వారి పని తీరు సంతృప్తిగా లేకపోతే ఇలాంటి పనిష్మెంట్కి ఉద్యోగులు అంగీకరిస్తూ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అది రివార్డ్, పనిష్మెంట్ స్కీమ్ అని పేర్కొంది. ఇలా ఎందుకు చేశారని చైనా మీడియా ఆ సంస్థ ప్రతినిధిని అడగగా.. వారు మొండిగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు కఠినంగా, హార్డ్ వర్క్ చేస్తారని అన్నారు. తద్వారా మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వగలరని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కంపెనీ బాస్పై మండిపడుతున్నారు. ఇదేం స్కూల్ కాదు ఇలాంటి శిక్షలు వేయడానికి.. ఆ బాస్ బుద్ధిలేదు, వాడో శాడిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే.. -
చిన్న శిక్షతో సరిపెడతారా?
సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది. రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్ను ధర్మాసనం ఆదేశించింది. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
బీఎస్పీ ఎంపీకి నాలుగేళ్ల జైలుశిక్ష
-
భారత సంతతి తంగరాజును ఉరితీసిన సింగపూర్.. కేసు ఇదే..
సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు. వివరాల ప్రకారం.. సింగపూర్కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది. ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. కాగా, సింగపూర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa — Al Jazeera English (@AJEnglish) April 26, 2023 -
విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు
కాకినాడ లీగల్: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు. గతేడాది అక్టోబర్ 8న కాండ్రేగుల – కూరాడ మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థతో సత్ఫలితాలు విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు. ఇందుకు కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు. -
గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా! ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. పరిశోధనలేం చెప్పాయి? ► కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్ జోయ్ పి జోన్స్ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. ► ఫిలిప్పీన్స్కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సూయ్ గుంజిలపై పరిశోధన ద్వారా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్ అవుతుందని తేల్చాడు. ► మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట నిజామాబాద్కు చెందిన అందె జీవన్రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్ బ్రెయిన్ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్ ట్రైనర్గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలోని ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలోని ఎస్సీఈఆర్టీకి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సూపర్ బ్రెయిన్ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు. చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు! -
సతీ భూదేవి
యముడితో పో రాడి భర్తప్రా ణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ మనకు తెలుసు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భర్తను పరాయి దేశం నుంచి విడిపించుకుని రావడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది ఈ భూదేవి. నేడు వేలంటైన్స్ డే. ప్రేమకు పట్టం కట్టే రోజు. భర్త పట్ల భార్యకు ఎంత ప్రేమ ఉంటుందో... అతని శ్రేయస్సు కోసం ఆమె ఎంత తపన పడుతుందో ఈ రోజున ఈ ఘటన ద్వారా కాకుండా మరెలా తెలుసుకుంటాం? భార్య ప్రేమకు శక్తి ఉంటే అది ఇంత బలంగా ఉంటుంది. ఇంత అచ్చెరువొందేలా కూడా ఉంటుంది. తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ‘రోజా’ సినిమాలో హీరోయిన్ తెగువను ఆస్వాదించాం. అచ్చం అలాంటి కథను పో లిన నిజజీవిత ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాగంధం ఏమంతగా అంటని మాకూరి భూదేవి మరణశిక్ష ఖరారైన తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపో రాటం చేసి విజేతగానే కాదు, వార్తలలో కూడా నిలిచింది. భూదేవి 14 ఏళ్లుగా చేసిన న్యాయపో రాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఇప్పుడు భూదేవి, ఆమె కుమారుడు రాజు, భర్త శంకర్ ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అసలేం జరిగిందంటే... మెండోరాకు చెందిన మాకూరి శంకర్కు సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ కూలి పని చేస్తే పెద్దగా సంపా దించుకోవడం కష్టం అనుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్కు వెళ్లిపో యాడు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఫోర్మెన్ (సూపర్వైజర్)గా చేరాడు. అతనికింద పని చేస్తున్న రాజస్థాన్కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు భవనం ఆరో అంతస్థుపై నుంచి పడి చనిపో యాడు. ఫోర్మెన్గా ఉన్న శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాజస్థాన్ వాసి మరణించాడని దుబాయ్ పో లీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్య కేసుగా నమోదు చేసిన అక్కడి పో లీసులు శంకర్ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేసి పుజీరా జైలులో పెట్టారు. కోర్టు విచారణలో రామావతార్ కుమావత్ మృతికి తను బాధ్యుణ్ణి కాదని, అతను ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్ ఎంత మొరపెట్టుకున్నా దుబాయ్ కోర్టులో చెల్లలేదు. పో లీసుల విచారణ నివేదిక ప్రకారం శంకర్ను దోషిగా తేల్చిన కోర్టు 2013లో మరణశిక్షను ఖరారు చేసింది. చదువులేకపో యినా... ఈ ఘటన 2009లో చోటు చేసుకుంది. మాకూరి శంకర్కే కాదు అతని భార్యకు కూడా చదువు రాదు. ఎవరిని సంప్రదించాలో, తమకేవిధంగా న్యాయం జరుగుతుందో తెలియదు. పుజీరా జైలులో ఉన్న శంకర్కు తన భార్య భూదేవితో నెల రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడేందుకు జైలు పో లీసులు అవకాశం కల్పించారు. ‘‘అప్పుడు ఆయన నా గురించి, మా అబ్బాయి గురించి అడిగి ఏడ్చేవాడు. తాను బతికి బట్టకట్టాలంటే రాజస్థాన్ వాసి రామావతార్ కుమావత్ కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించాలని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కుటుంబం అడ్రస్ తెలియదు. మా ఊళ్లో పెద్దలందరికీ ఈ విషయం చెప్పాను. కనపడినవారికల్లా మా కష్టం చెప్పాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఏడ్వనిరోజు లేదు. రోజూ దిగులుగా ఉండేది. అలాగే నెలలు, ఏళ్లు గడిచిపో తున్నాయి. కానీ, దిగులుగా కూర్చుంటే అయ్యే పనులు కావు. నేనూ, నా బిడ్డ బతకాలి. కూలి పనులు చేసుకుంటూ బిడ్డను పో షించుకుంటూ వచ్చాను. గతంలో ఆర్మూర్ మండలం దేగాం వాసులు ముగ్గురు దుబాయ్లో మరణశిక్ష నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారని తెలిసింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్ కృషి చేశారని తెలిసింది. గంపెడాశతో వెళ్లి యాదాగౌడ్ను సంప్రదించి ఎలాగైనా నా భర్తను మరణశిక్ష నుంచి తప్పించాలని వేడుకున్నాను..’ అని ఇన్నేళ్ల తన కష్టాన్ని వివరించింది భూదేవి. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి... ‘మా ఆయనకు ఫోన్ చేసినప్పుడల్లా ఊళ్లో విషయాలు, నేను చేస్తున్న పనుల గురించి, మా అబ్బాయి క్షేమం గురించి చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెబుతూ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేదాన్ని. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలని కానీ, వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలియదని యాదాగౌడ్ను కలిసినప్పుడు చెప్పాను. అతను అన్ని వివరాలు కనుక్కొని, రాజస్థాన్ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు ఆర్థికసాయం రూ.5 లక్షలు అందించాలంటే అందరినీ బతిమాలుకున్నాను. కూలీ చేసుకొని బతికేదాన్ని, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది. మా ఊరి వాళ్లు, ఇంకొంతమంది దయగలవాళ్లు తమకు తోచినంత ఇచ్చారు. అలా వచ్చిన డబ్బును రాజస్థాన్లోని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశాం. మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు’ అని తెలిపింది భూదేవి. అలా వారు సంతకాలు చేసిన పత్రాలను యాదాగౌడ్ ద్వారా న్యాయవాది అనురాధ సహకారంతో భూదేవి దుబాయ్లోని కోర్టుకు పంపించింది. దుబాయ్ కోర్టు ఈ పత్రాలను పరిశీలించి మరణశిక్షను రద్దు చేయడమేకాకుండా అతన్ని విడుదల చేస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో మరణశిక్షను తప్పించుకున్న శంకర్ ఇంటికి చేరుకున్నాడు. కథ సుఖాంతమైంది. మా వాళ్లను చూస్తానని అనుకోలేదు నేను దుబాయ్కు వెళ్లే సమయంలో నా భార్య గర్భవతి. కొన్ని నెలలకే కొడుకు పుట్టాడు. ఈ సంతోష వార్త వినే సమయంలో నా భార్యకు చెప్పాను ‘త్వరలోనే వస్తాను’ అని. కానీ, అది సాధ్యం కాదని తర్వాత తెలిసింది. రాజస్థాన్ వ్యక్తి మరణించడంతో నేను ఈ ఘటనలో అరెస్టు అయ్యి జైలుపా లు కావడం, ఆ తరువాత మరణశిక్ష పడటం వరుసగా జరిగాయి. ఇక నా వాళ్లను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా భార్యతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ నాకు ఎంతో ధైర్యం చెప్పేది. జైల్లో ఎంతో మనోవేదనతో ఉన్నా నా భార్య మాటలు నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాయి. నా విడుదల కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. – మాకూరి శంకర్ – ఎన్.చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్, నిజామాబాద్ -
Mancherial: మందు బాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష
సాక్షి, మంచిర్యాల: శిక్షల విధించడంలోనూ ఈమధ్య కొందరు న్యాయమూర్తులు వైవిధ్యతను కనబరుస్తున్నారు. నేరానికి తగ్గట్లు శిక్ష విధించి.. వాటికి పాల్పడుతున్నవాళ్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. తాగి ఊగితే పర్వాలేదు. కానీ, రోడ్ల మీదకు చేరి పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడుతుంటారు కొందరు. అలా తాగి రచ్చ చేసిన 13 మందికి.. వాళ్ల రిమ్మ దిగిపోయేలా జిల్లా పస్ట్ క్లాస్ కోర్టు భలే శిక్ష విధించింది. రెండు రోజుల హాస్పిటల్ క్లీన్ చేయాలని, అలాగే మాతాశిశు ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది. దీంతో వాళ్లు కంగుతినగా.. ఆదేశాలను పాటించని పక్షంలో.. జైలు శిక్ష, జరిమానా తప్పదని వారించినట్లు తెలుస్తోంది. -
జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
ములకలపల్లి: కుల పెద్దలు విధించిన జరిమానా కట్టలేదనే నెపంతో ఓ కుటుంబాన్ని బహిష్కరించడమే కాక తాగునీటి పైపులైన్ తొలగించి, వారి ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. రాచ న్న గూడెంకు చెందిన గిరిజనుడు పెనుబల్లి శ్రీనివాస్.. తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాత పోతరాజుతో కలసి ఉంటున్నాడు. ఆయనకు దమ్మపేట మండలం ఎర్రగుంపు గ్రామా నికి చెందిన శారదతో వివాహం జరిగింది. అయితే, భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలతో శారద ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, నెల క్రితం శ్రీనివాస్ కూడా అక్కడికే వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 10వ తేదీన శ్రీనివాస్ తాత కన్ను మూయగా.. భార్య శారదతో కలసి అతను రాచన్నగూడెంలోని ఇంటికి వచ్చాడు. కుల పెద్దలకు చెప్పకుండా భార్య వద్దకు వెళ్లడం, ఏడాది క్రితం వెళ్లిపోయిన ఆమెను తీసుకువచ్చాడని శ్రీనివాస్ తాత అంత్యక్రియలు ముగియగానే కులపంచాయితీ పెట్టారు. శ్రీనివాస్ రూ.1.5 లక్షల జరిమానా కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. కానీ పేదలమైనందున రూ.20 వేలు చెల్లిస్తామని శ్రీను తెలపడంతో కులపెద్దల సమక్షంలోనే కొందరు అతని కుటుంబీకులపై దాడి చేసి డబ్బు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అలాగే ఇంటి తాగునీటి పైపులైన్ తొలగించారు. కరెంట్ కూడా నిలిపివేస్తామని హెచ్చరించి.. శ్రీను ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. దీంతో బాధిత కుటుంబం బుధవారం పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్కు చెప్పి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ గురువారం చిన్నకర్మ చేస్తుండగా, వచ్చిన గ్రా మస్తులు మళ్లీ నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మరోసారి పోలీస్స్టేషన్కు రాగా, పండుగ తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపించారని శ్రీనివాస్ వాపోయాడు. ఈ విషయమై ఎస్సై సురేశ్ను వివ రణ కోరగా శనివారం విచారణ చేపడతామని తెలిపారు. -
అస్తమానం టీవీ చూస్తున్న పిల్లాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?
బీజింగ్: 8 ఏళ్ల కుమారుడు అస్తమానం టీవీ చూస్తున్నాడని కఠిన శిక్ష విధించారు చైనాకు చెందిన తల్లిదండ్రులు. అయితే వీరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అని పలువురు మండిపడ్డారు. సెంట్రల్ చైనా హునాన్ ప్రావిన్స్లో నివసించే ఈ జంట పని మీద బయటకు వెళ్తూ హోం వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత పడుకోమని తమ కుమారుడికి చెప్పింది. అయితే వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ బాలుడు టీవీ చూస్తున్నాడు. అంతేకాకుండా హోం వర్క్ కూడా పూర్తి చేయలేదు. దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఫలితంగా రాత్రంతా టీవీ చూస్తూనే ఉండాలని కుమారుడికి శిక్ష విధించారు. అతడు పడుకోకుండా ఇద్దరూ తరచూ అతడ్ని గమనించారు. అయితే మొదట స్నాక్స్ తింటూ హాయిగా టీవీ చూసిన పిల్లాడికి కాసేపయ్యాక అలసట వచ్చింది. ఫలితంగా తనవల్ల కాదని ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం 5 గంటల వరకు నిద్రపోనివ్వకుండా అతడ్ని టీవీ ముందే కూర్చోబెట్టారు. ఈ తల్లిదండ్రుల పేరెంటింగ్పై చైనాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, పిల్లాడికి ఒకవేళ ఇదే అలవాటై రోజు ఆలస్యంగా పడుకుని, ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తే ఏం చేస్తారని కొందరు ప్రశ్నించారు. చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగి ప్రభుత్వం కొత్త చట్టాన్నే తీసుకువచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. పిల్లలు నేరాలు చేసినా, తప్పుగా ప్రవర్తించినా వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్కు అధికార పార్టీ గుడ్బై.. -
అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని
వేములవాడ అర్బన్: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్ ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి
దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో మాత్రం చాలాదూరం వెళ్లాడు ఇక్కడో టీచర్. అతను పెట్టిన హింసతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ విద్యార్థి. ఐదేళ్ల పిలగాడిని ఓ టీచర్ దారుణాతిదారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఓ కర్రతో పిల్లాడిని బాదిన టీచర్.. అది విరిగిపోయినా ఊరుకోకుండా రెచ్చిపోయాడు. చెంపదెబ్బలు కొడుతూ.. జుట్టు లాగేస్తూ పిడిగుద్దులతో స్టూడెంట్పై విరుచుకుపడ్డాడు. తనని వదలమని ఆ పిలగాడు రోదిస్తూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. కిందపడిపోయిన ఆ స్టూడెంట్ను.. కనికరం లేకుండా హింసించాడు ఆ టీచర్. ఇదంతా మిగతా పిల్లలు భయంభయంగానే చూస్తూ ఉండిపోయారు. స్పృహ తప్పిపోయిన ఆ పిల్లాడిని.. ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన స్థానికులు కోచింగ్ సెంటర్పై పడి టీచర్ చోటూను చితకబాదేశారు. చిన్నతప్పిదానికే అలా హింసించాడని తోటి స్టూడెంట్స్ చెప్తుండగా.. బీపీ వల్లే ఆ టీచర్ అలా దాడి చేశాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సమర్థించడం కొసమెరుపు. బీహార్ రాజధాని పాట్నాలోని Dhanarua బ్లాక్లో.. జయ కోటించ్ క్లాసెస్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సహనంగా పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో అతనికి అర్హత లేదంటూ మండిపడుతున్నారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టీచర్పై చర్యలు తీసుకునేంత వరకు పిల్లల్ని కోచింగ్ సెంటర్కు పంపమని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'शिक्षक' नहीं… ये 'हानिकारक' है! वीडियो देखकर सहम उठेंगे. ये पिटाई नहीं...ऐसा लग रहा है कि ये जान लेने के लिए उतारू है.शख्स धनरूआ में एक कोचिंग चलाता है. आरोप है कि बच्चे ने एक लड़की के साथ गलत हरकत की थी.पुलिस कोचिंग संचालक की तलाश कर रही है. वीडियो- जहानाबाद से रंजीत राजन. pic.twitter.com/KPBLMYxEau — Prakash Kumar (@kumarprakash4u) July 3, 2022 -
కూతురు హోం వర్క్ చేయలేదని కాళ్లుచేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో విలవిలలాడిన బిడ్డ
-
ఎండలో విలవిలలాడిన బిడ్డ.. తల్లి పనే!!
కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో చిన్నారిని పడుకోబెట్టారు. భరించలేక ఆ బిడ్డ విలవిలలాడిపోయింది. చివరికి బాధతో రోదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఈమధ్య ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఢిల్లీ ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెబుతోంది. అయితే ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్ నగర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను చేధించారు. After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares — Delhi Police (@DelhiPolice) June 8, 2022 ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. ఆ తల్లికి కూడా అలాంటి శిక్షే విధించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. -
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కు జైలు శిక్ష
-
8 మంది ఐఏఎస్ అధికారులకు వినూత్న శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని వారిని ఆదేశించింది. నెలలో నచ్చిన ఓ ఆదివారం రోజున ఆ జిల్లాలో ఉన్న ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో సేవ చేయాలని చెప్పింది. ఇలా 12 ఆదివారాలు ఒక్కో వారం ఒక్కో హాస్టల్లో సేవ చేయడంతో పాటు ఆయా హాస్టళ్లలోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న లేదా రాత్రి భోజనాన్ని అందించాలని ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని సొంత జేబు నుంచి భరించాలంది. ఒక్కో అధికారికి ఒక్కో జిల్లాను కేటాయించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పాఠశాలల్లో ఇలాంటి నిర్మాణాలు తగవంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలకు విరుద్దంగా పలు చోట్ల నిర్మాణాలు కొనసాగడంతో అధికారులపై హైకోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యా శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజయ్కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం.నాయక్లను ప్రతివాదులుగా చేర్చింది. తాజాగా గురువారం ఈ ఎనిమిది మంది న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ధిక్కార చర్యల తర్వాతే స్పందించారు.. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు మొదలైన తర్వాతే అధికారులు స్పందించి, దాదాపు 1,371 పాఠశాలల్లో నిర్మాణాలను గుర్తించి, తొలగించారని న్యాయమూర్తి అన్నారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయక పోవడంతో వల్లే.. అఫిడవిట్ దాఖలు చేశాక కూడా పిటిషన్లు పడుతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ ఎనిమిది మందికి రెండు వారాల జైలు శిక్ష, రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో భవిష్యత్లో ఇలా జరగకుండా చూసుకుంటామని అధికారులు కోర్టును బేషరతు క్షమాపణలు కోరారు. క్షమాపణలు ఆమోదించాలంటే సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. దీనికి అధికారులందరూ అంగీకరించడంతో న్యాయమూర్తి తానిచ్చిన జైలు శిక్ష, జరిమానాను మాఫీ చేస్తూ.. వాటి స్థానంలో సామాజిక సేవకు ఆదేశాలిచ్చారు. ఈ అధికారులు హాస్టళ్ల సందర్శన వివరాలు, ఫొటోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు!
లక్నో: అల్లరి పిల్లలను దారిలోకి తీసుకురావడం కోసం రకరకాలుగా బెదిరిస్తాం. అల్లరి గడుగ్గాయిల గురించి తల్లిదండ్రులు కూడా వారి టీచర్లకు ఫిర్యాదు చేస్తారు. ఏదో మాట వరసకు మా పిల్లాడికి భయం చెప్పండి అన్నందుకు.. విద్యార్థికి చుక్కలు చూపించాడు. ఓ ప్రధానోపాధ్యాయుడు. రెండో తరగతి చదువుతున్న ఓ పిల్లాడి కాలు పట్టుకుని కింద పడేస్తాను అంటూ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో.. సదరు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి పేరు సోను యాదవ్. రెండో తరగతి చదువుతున్న సోను యాదవ్.. గురువారం లంచ్ బ్రేక్ సమయంలో పలువురు విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు మనోజ్ విశ్వకర్మ.. సోను కాలు పట్టుకుని లాక్కొచ్చాడు. చేసిన తప్పుకు క్షమాపణ కోరమని.. లేదంటే సోనుని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించసాగాడు. చెప్పడమే కాక సోను కాలు పట్టుకుని బిల్డింగ్ మీద నుంచి కిందకు వేలాడదీశాడు. (చదవండి: ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు) మనోజ్ చర్యతో బిక్కచచ్చిపోయాడు సోను. భయంతో గుక్కపట్టి ఏడవసాగాడు. దాంతో మిగతా స్టూడెంట్స్, టీచర్లు అక్కడకు పరిగెత్తుకువచ్చారు. మనోజ్ చేతి నుంచి సోనుని విడిపించారు. ఇంటికెళ్లిన సోను తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. కొందరు టీచర్లు మనోజ్ చేసిన పనిని వీడియో తీశారు. ఈ క్రమంలో సోను తండ్రి.. మనోజ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సోను తండ్రి మాట్లాడుతూ.. గురువు అంటే విద్యార్థులను ప్రేమగా చూడాలి.. కానీ మనోజ్ రాక్షసంగా ప్రవర్తించాడు అన్నాడు. సోను తడ్రి ఫిర్యాదు మేరకు మనోజ్ను అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అతడి మీద కేసు నమోదు చేశారు. (చదవండి: పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే.. ) మనోజ్ మాట్లాడుతూ.. ‘‘సోను చాలా తుంటరి పిల్లాడు. విద్యార్థులనే కాదు టీచర్లను కూడా కొరుకుతాడు. బుద్దిగా ఉండడు.. ఎవరి మాట వినడు. సోను తండ్రే తనను మార్చమని నాకు చెప్పాడు. విద్యార్థిని భయపెట్టడం కోసం ఇలా చేశాను. అంతే’’ అన్నాడు. భయపెట్టమంటే.. మరీ ఇలా చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ -
కాళ్లు, చేతులు నరకడం శిక్షలు ఆపేదిలేదు: తాలిబన్లు
ఆఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఎట్టకేలకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ గత పరిపాలనలా ప్రస్తుతం ఉండబోదని అఫ్గన్ ప్రజలకు తాలిబన్లు చెప్పిన మొదటి మాట ఇది. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు, తాలిబన్లు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఆ మాట మీద వాళ్లు నిలబడడం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా తాలిబన్ నేత నుంచి వచ్చిన మరో ప్రకటనను చూస్తే అది అర్థమవుతుంది. అఫ్గన్లో తాలిబన్లు మళ్లీ వారి పాత విధానాలనే ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు. 1990లో మాదిరిగానే ప్రస్తుత పరిపాలనలో కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు తేల్చి చెబుతున్నారు. ఈ అంశంపై తాలిబన్ వ్యవస్థాపక సభ్యుడు ముల్లా నూరుద్దీన్ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ చట్టాలు, పరిపాలను ఎలా ఉండాలనేది ఇతర దేశాలు చెప్పకూడదన్నారు. చదవండి: Freshworks Company: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! -
కేన్సర్ బాధితురాల్ని వేధించిన కుమార్తె, తండ్రి అమానుషం
సాక్షి, న్యూఢిల్లీ: పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఆ తరువాత ఉపాధ్యాయులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. అయితే ఏదైనా తప్పు చేసిన చెడుమార్గం పట్టిన వారిని, భయపెట్టో, దండించో దారిలో పెట్టడం చాలా సందర్భంల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న స్నేహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమార్తెకు ఒక తండ్రి విధించిన చర్చకు దారితీసింది. బాధితురాలికి జరిగిన అవమానం బాధ, తన కూతురికి తెలిసి రావాలనుకున్నాడో ఏమో కానీ, ఆమెకు శిక్ష విధించాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కూతురికి విధించిన శిక్ష కూడా అమానుషమని ఇది వేధింపుల కిందికే వస్తుందని మండిపడుతున్నారు. ప్లోరిడాకు చెందిన దంపతులు విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. ఈ క్రమంలో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తోటి విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది 16 ఏళ్ల కుమార్తె. కేన్సర్ చికిత్సలో భాగంగా జుట్టు మొత్తం కోల్పోయిన స్నేహితురాలి పట్ల ఏమాత్రం దయ మానవత్వం లేకుండా అనుచితంగా ప్రవర్తించింది. తలపై విగ్ను లాగి ఎగతాళి చేసింది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి కూతురికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు. అది సరియైంది కాదని, తప్పని వారించాడు. ఆ అమ్మాయితో ప్రేమగా ఉండాలని హితవు చెప్పాడు. అయినా కూతురు తన ప్రవర్తన మార్చు కోలేదు. దీంతో ఆ తండ్రి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. జుట్టుమొత్తం తీయించుకుంటావా? లేక ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేస్తావా అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చాడు. బహుశా సెల్ ఫోన్ వదులుకోలేక గుండే ఎంచుకుంటుందని తండ్రి ఊహించి ఉంటాడు. పక్కాగా తన నిర్ణయాన్ని అమలు చేశాడు. కూతురు జుట్టంతా తీసేసి మొత్తం గుండు చేశాడు. అయితే మంచి పని చేశారు. ఇప్పటికే ఆమె బాధ తెలిసి వస్తుందని అని కొంతమంది అభిప్రాయపడగా మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల ప్రేమగానే కాదు బాధ్యతా ఉండటం కూడా చాలా అవసరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి బదులుగా ఇంత అమనుషంగా వ్యవహరించడం వల్ల వారి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశ ఉందని అభిప్రాయ పడ్డారు. ఆమె చేసింది ముమ్మాటి తప్పే అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు..కానీ అదే తప్పు మీరు చేశారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకంలోనే ఏదో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దుకోండి అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు తండ్రి విధించిన శిక్షపై తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 2016లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఈ ఘటనలో తల్లి అనుచితంగా వ్యవహరించింది. కేన్సర్ పేషెంట్ను అవమానించిన కుమార్తెకు స్వయంగా గుండు చేసిన ఘటన విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్గా మారింది. -
దెబ్బకు మత్తు దిగింది.. తిక్క కుదిరింది
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో చిక్కిన చోదకుల్లో 372 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ తెలిపారు. గత నెల 26 నుంచి 30 వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్ల్లో మొత్తం 621 కేసులు నమోదు చేశారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదు, నడిపిన వాహనం తదితరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 22 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. జైలుకు వెళ్లిన 372 మందిలో 186 మందికి ఒక రోజు, 101 మందికి రెండు రోజులు, 40 మందికి మూడు రోజులు, 18 మందికి నాలుగు రోజులు, 11 మందికి ఐదు రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, అయిదుగురుకి వారం, నలుగురికి ఎనిమిది రోజులు, 10, 12, 16, 18 రోజుల చొప్పున ఒక్కొక్కరికి, మరో వ్యక్తికి 22 రోజుల జైలు శిక్ష పడింది. వీరికి కోర్టులు రూ.15.26 లక్షలు జరి మానా విధించాయి. వీరి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలంటూ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. -
రెండెళ్ల క్రితం చేసిన దారుణానికి జీవిత ఖైదు..
సాక్షి, వరంగల్ లీగల్: చిన్ననాటి నుండి కలిసి చదువుకుంటుండగా ఏర్పడిన స్నేహాన్ని ఆసరాగా చేసుకొని డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరించిన విద్యార్థినిపై పెట్రోల్ పోసి కాల్చిచంపిన ప్రేమోన్మాదికి జీవిత ఖైదు విధించారు. అలాగే, రూ.1.12లక్షల జరిమానా విధిస్తూ గురువారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళి, వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన సాయి అన్వేష్ చిన్ననాటి నుంచి ఒకే పాఠశాలలో నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో కూడా తరచూ కలుసుకునేవారు. 2016లో డిగ్రీ వచ్చిన తర్వాత చిన్ననాటి నుండి ఉన్న పరిచయంతో నిన్ను ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయసాగాడు. దీనికి రవళి నిరాకరించడంతో సాయిఅన్వేష్ బెదిరించాడు. ఇదే క్రమంలో రవళి మరో యువకుడితో చనువుగా ఉంటుందని కోపం పెంచుకున్న ఆయన ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. హత్య చేయాలనే పథకంతో 2019 ఫిబ్రవరి 27న రవళి చదువుతున్న కాలేజీ సమీపంలో హన్మకొండ నయీంనగర్లోని హాస్టల్ వద్దకు సాయి అన్వేష్ వచ్చాడు. మాట్లాడే పని ఉందని చెప్పి, ముందస్తుగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ విద్యార్థిని రవళిపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు రవళి చికిత్స పొందుతూ మృతి చెందింది. హత్యానేరం క్రింద కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు సాయి అన్వేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఐపీసీ సెక్షన్ 302 హత్యానేరం క్రింద జీవితఖైదుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద రూ.1.12లక్షలు జరిమానా విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. -
No Mask: ‘కప్ప నడక’.. బాల్య స్మృతుల్లోకి పారిశ్రామిక దిగ్గజం
ముంబై: మళ్లీ ముదనష్టపు మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తోంది. అయినా కూడా ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ కరోనా జాగ్రత్తలు తీసుకునేలా పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మాస్క్లు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. అలా మాస్క్ లేదని కనిపించిన కొందరికి ముంబై పోలీసులు ‘కప్ప నడక’ శిక్ష విధించారు. ముంబైలోని సముద్రపు ఒడ్డున మాస్క్ లేకుండా వెళ్తున్న యువతను గుర్తించిన పోలీసులు కప్ప మాదిరి కొన్నిసార్లు గెంతాలని చెప్పారు. దీంతో ఆ యువత మాస్క్ ధరించకపోవడంతో కప్ప నడక చేశారు. అయితే ఈ ఘటన పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్ సంస్థ యజమాని ఆనంద్ మహేంద్ర కంటపడింది. వామ్మో అనుకున్నారు. తన జ్ఞాపకాల నిధిని ఈ ఘటన గుర్తు చేసిందని ట్వీట్ చేశారు. తాను చిన్నప్పుడు పాఠశాలలో ఇలాంటి కుప్పి గంతులు శిక్షగా వేశానని గుర్తు చేసుకున్నారు. ఇది నవ్వు తెప్పించేదే కానీ.. శారీరక శ్రమ అని పేర్కొన్నారు. ఇకపై తాను తప్పనిసరిగా మాస్క్ ధరిస్తానని ఆనంద్ మహేంద్ర ఆ వీడియోను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా పోలీసులు వేసిన శిక్ష ఆనంద్ మహేంద్ర దృష్టికి రావడం.. ఆయన బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. “Face mask rule violators at Marine Drive in Mumbai being made to do a “Murga” walk as punishment by Mumbai Police” Received on my ‘SignalWonderbox.’ A common punishment in the boarding school I attended. Comical, but physically taxing.I certainly won’t forget my mask!! pic.twitter.com/GnVY6NfasV — anand mahindra (@anandmahindra) March 30, 2021 -
మరో జాతి వారింట్లో విందు భోజనం చేశారని..
సాక్షి, భువనేశ్వర్ : కులమతాలకు అతీతంగా నేడు వివాహాలు జరుగుతున్నాయి. విందులు, వినోదాలలో అన్ని మతాలు, కులాల వారు ఏ భేదం లేకుండా కలిసి భోజనాలు చేస్తున్నారు. అయితే అవిభక్త కొరాపుట్లో మాత్రం నేటికీ ఈ కుల మత భేదాలు, జాతి పట్టుదలలు కొనసాగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలలో ఒక జాతి వారు మరో జాతి వారి ఇంట్లో భోజనం చేయడం పెద్ద తప్పు. అలా చేస్తే వారిని వెలివేయడమో లేదా వారికి కఠిన దండన విధించడమో చేస్తారు. ఈ దురాచారం నేటికీ కొన్ని ప్రాంతాలలో అమలులో ఉంది. ఒరిస్సా, కొరాపుట్ జిల్లా జయపురం సమితి బదిలిగుడ గ్రామానికి చెందిన అర్జున మాలి ఈ నెల 11 వ తేదీన మరణించాడు. ( మహానదిలో పురాతన ఆలయం) ఆయనకు కుమారులు లేరు. ఉన్నది ఇద్దరు కుమార్తెలు. కొడుకు లేకపోవడం వల్ల తండ్రి దహన సంస్కారాల బాధ్యత ఇద్దరు కుమార్తెల పైన పడింది. అయితే ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల ఒక గదబ సామాజిక కుటుంబం వారి విందులో పాల్గొని భోజనం చేశారని అందుచేత వారు జాతిని కోల్పోయారని మళ్లీ జాతిలో చేరి తండ్రి అంత్యకియలు జరపాలంటే శిక్ష అనుభవించాలని పెద్దలు తీర్పు చెప్పారు. శిక్ష అనుభవించాక దహన సంస్కారాలు అందుకు అక్కాచెల్లెళ్లు అంగీకరించారు. పెద్దల తీరానం మేరకు ఆ ఇద్దరి యువతులకు గుండు గీశారు. గుండు గీసిన అనంతరం గ్రామ పెద్దలు వారి తండ్రి దహన సంస్కరాలు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ సంఘటనపై అవిభక్త కొరాపుట్ జిల్లా మాలీ సమాజ్ వికాస్ పరిషత్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు నవరంగపూర్ సబ్ కలెక్టర్ భాస్కర్ రౌత్ను కలిసి సంఘటనపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
లాక్డౌన్ ఉల్లంఘనులకు వినూత్న శిక్ష
జైపూర్: లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రాజస్తాన్ అధికారులు వినూత్న శిక్ష విధిస్తున్నారు రాజస్తాన్లోని జున్జున్ ప్రాంత అధికారులు. ‘ఏ పనీలేకుండా రోడ్లపైకి వచ్చే వారిని అరెస్టు చేయడం, లాఠీలతో కొట్టడం చేయరాదని నిర్ణయించుకున్నాం. అందుకు బదులుగా వారిని జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు సేవలందించేందుకు పంపిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. (ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!) ‘ఇదేమీ తమాషా కాదు. ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత బాగా ఉంది. అందుకే ఉల్లంఘనుల ద్వారా రోగులకు సేవలందించనున్నాం. రోడ్లపై చిల్లరగా తిరిగే వారిని గుర్తించి మాకు ఫొటోలు పంపితే, అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్లలో సేవలకు వినియోగించుకుంటారు’ అని సామాజిక మాధ్యమాల్లో అధికారులు ప్రజలకు సందేశాలు పెడుతున్నారు.(భయం వద్దు.. మనోబలమే మందు) -
ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరణను అరికట్టడంలో భాగంగా జనతా కర్ఫ్యూను పాటించాల్సిందిగా అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ఆదివారం అక్షరాల అమలు చేసిన ప్రజలు సోమవారం నాడు అదే స్ఫూర్తిని కొనసాగించలేక పోతున్నారు. దీనిపై నరేంద్ర మోదీ అసంతప్తి వ్యక్తం చేయగా, జనతా కర్ఫ్యూను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారం నాటి కర్ఫ్యూను ఈ నెల 31వ వరకు పొడిగిస్తున్నామని, దీన్ని కచ్చితంగా అమలు చేయడం కోసం ఈ ఉత్తర్వులను ‘ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్ ఆఫ్ 1897’ కింద నోటీఫై చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. (లాక్డౌన్ : ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి) కరోనా వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో భాగంగా ఈ చట్టంలోని రెండవ సెక్షన్ను ప్రయోగించాల్సిందిగా మార్చి 11వ తేదీన కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలోని రెండవ సెక్షన్ కింద ప్రభుత్వాధికారులకు ప్రత్యేక అధికారాలు సిద్దిస్తాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రేవులు, విమానాశ్రయాలు, రైల్వే, బస్సు స్టేషన్లలోనే కాకుండా ఆయా ప్రయాణ సాధనాల్లో ప్రయాణికులను తనిఖీ చేయవచ్చు, రోడ్లపై తిరక్కుండా నియంత్రించవచ్చు. ఆంక్షలు విధించవచ్చు. అనుమానితులను నిర్బంధంగా వైద్య పరీక్షలకు, ఆ తర్వాత వైరస్ నిర్ధారితులను నిర్బంధ వైద్య శిబిరాలకు తరలించవచ్చు. వైరస్ బాధితుల చికిత్స విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవచ్చు. (కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ) అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తులపై, సంస్థలపై ఐపీసీ (1860)లోని 188వ సెక్షన్ కింద శిక్షలు విధించవచ్చు. ఆరు నెలల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇతన సముచిత శిక్షలు విధించే హక్కు సంబంధిత మేజిస్ట్రేట్లకు ఉంటుంది. ‘ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ఆఫ్ 1897’ కింద అధికారాలకు లభించే ప్రత్యేక అధికారాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. ఈ విషయంలో న్యాయ విచారణ నుంచి అధికారులకు చట్టం పూర్తి మినహాయింపు ఇస్తోంది. దీనిర్థం అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఐపీసీలోని 188వ సెక్షన్ కింద శిక్షార్హులవుతారు. (భారత్లో 8కి చేరిన కరోనా మరణాలు) ‘ఎపిడమిక్ డిసీసెస్ ఆఫ్ 1897’ను గుజరాత్లో కలరా నియంత్రణకు 1918లో, చత్తీస్గఢ్లో మలేరియా, డెంగ్యూ నియంత్రణకు 2015లో, పుణేలో స్వైన్ ఫ్లూ నియంత్రణకు 2009 ప్రయోగించారు. ఈ చట్టం స్వాతంత్య్రానికి పూర్వందైనా పటిష్టంగా పనికొస్తుందికనుక దీన్ని సవరించాల్సిన అవసరం రాలేదని రాజ్యాంగ నిపుణులు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయపడ్డారు. (కరోనాపై చైనా గెలిచిందిలా..!) -
హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు
థానె: హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు తీయమని విద్యార్థిని ఆదేశించిన టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలోని మీరా రోడ్డు ఏరియా శాంతినగర్కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక థానె జిల్లా పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఆమె తన ట్యూషన్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ను పూర్తి చేయలేకపోయింది. దీంతో టీచర్ ఆ విద్యార్థినిని ఏకంగా 450 గుంజీలు తీయమని ఆదేశించింది. బాలిక సరిగ్గా నడవలేకపోతుండటంతో పాటుగా రెండు కాళ్లు వాచిపోయి ఉండటాన్ని తల్లి గుర్తించింది. దీంతో ఆమె తల్లి పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం టీచర్పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోహెల్ పఠాన్ తెలిపారు. -
నా అనుమతి అక్కర్లేదా?!
సాక్షి, భీమారం(చెన్నూర్): తన అనుమతి లేకుండా జిల్లా స్థాయి క్రీడల్లో ఎందుకు పాల్గొన్నారని మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ విద్యార్థులను దండన విధించాడు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్ఎంతో వాగ్వివాదానికి దిగారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులను శనివారం రేచినిలో జరిగిన హ్యాండ్ బాల్ పోటీలకు పీఈటీ విఠల్ తీసుకెళ్లారు. పోటీలకు హాజరైన విద్యార్థులు సోమవారం పాఠశాలకు యథావిధిగా హాజరయ్యారు. అయితే ప్రార్థన అనంతరం పోటీలకు వెళ్లిన విద్యార్థులను దాదాపు 3 గంటల సేపు ఎండలో నిలబెట్టారు. దీంతో పాఠశాలలో జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్థానిక నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లి హెచ్ఎంను నిలదీశారు. ఆటల పోటీలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. ఆటల పోటీలకు వెళ్లేందుకు తాను అనుమతిని ఇవ్వలేదని, పీఈటీ విఠల్ కొందరు విద్యార్థులను తీసికెళ్లాడని తెలిపారు. విద్యార్థులను మందలించానని, ఎండలో నిలబెట్టలేదని హెచ్ఎం తెలిపాడు. హెచ్ఎం అనుమతితోనే క్రీడలకు విద్యార్థులను తీసుకువెళ్లానని పీఈటీ చెప్పారు. పాఠశాలలోని గ్రూప్ తగాదాలే ఈ గొడవకి కారణమన్నారు. -
మా బిడ్డలూ ఆడబిడ్డలే కదా..
పంజగుట్ట: దిశ ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. ‘‘దిశ’ జరిగిన అన్యాయాన్ని మేం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిందితులకు వారం రోజుల్లోనే శిక్ష విధించారు. మరి మా బిడ్డలు కూడా ఆడబిడ్డలే కదా.. ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. మా బిడ్డలను అతి క్రూరంగా చంపిన వారికి శిక్ష విధించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు’ అని పలువురు బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి ఆవేదన వెల్లడించారు. అగ్రవర్ణాలు అని తెలిస్తేనే ప్రచారం: మంద కృష్ణమాదిగ దేశంలో ప్రతినిత్యం ఎక్కడోచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని, అయితే బాధితులు అగ్రవర్ణాలు అని తెలిస్తేనే సమాజం మొత్తం రోడ్డుపైకి వచ్చేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ అన్నారు. దేశంలో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నా ఢిల్లీ నిర్భయ, శంషాబాద్ దిశ ఘటనలకు మాత్రమే దేశవ్యాప్త ఉద్యమాలు, పార్లమెంట్లో చర్చ, పేర్లు మార్చడం జరిగిందని, ఈ ఇద్దరూ అగ్రవర్ణానికి చెందిన వారే అని ఆయన పేర్కొన్నారు. దళిత మహిళ టేకు లక్ష్మి, బీసీ వర్గానికి చెందిన మానస కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్ష పడాలన్న డిమాండ్లు కూడా ఎవరూ వ్యక్తం చేయకపోవడం చూస్తే ఎంత వివక్ష ఉందో అర్థమౌతుందన్నారు. ఆదివారం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన నిందితులను త్వరగతిన కఠినంగా శిక్షించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ’ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాములునాయక్, దళిత నాయకులు జేబీ రాజు, బాధిత మహిళల కుటుంబ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. దిశ, నిర్భయ ఘటనల్లో వారిద్దరూ అగ్రకులం వారు అని తెలియకుండా నిందితులు వారిపై అత్యాచారం, హత్య చేశారని.. కానీ 99 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై వారు బలహీన వర్గాలు అని తెలిసే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎవరిని చంపితే సమాజం నుంచి స్పందన రాదో వారినే చంపేస్తున్నారని.. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలహీనంగా ఉన్నవారు కావడంతోనే ఎన్కౌంటర్ చేశారన్నారు. హాజీపూర్లో ఓ అగ్రకులానికి చెందిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని అత్యాచారం చేసి, హత్య చేస్తే ఇప్పటికీ శిక్ష విధించలేదన్నారు. వెంటనే ఫస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇదే విషయమై సోమవారం డీజీపీని కలవనున్నట్లు, మంగళవారం హ్యూమన్రైట్స్ను, రాజ్భవన్లో గవర్నర్ను కలిసి జరిగిన అత్యాచారాలన్నింటినీ వివరించి వారి కుటుంబాలను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న దిశకు ఓ న్యాయం మాకు ఒక న్యాయమా అనే నినాదంతో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, వివిధ సంఘాల నాయకులు సాంబన్న యాదవ్, రాజు, రాజ్కుమార్ నాయక్, భాస్కర్, పి.వి.రమణ, మహేష్రాజ్, దీపక్ కుమార్ తదితరులు ఉన్నారు. నేను, నా భార్య టేకు లక్ష్మి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం వెళ్లబోసుకుంటున్నాం. గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా జహినూర్ మండలంలో నా భార్యను వదిలి నేను మరో ప్రాంతంలో బెలూన్లు అమ్ముకునేందుకు వెళ్లాను. ఆ సమయంలో కొందరు దుండగులు నా భార్యను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి, చేతులు విరిచేసి, గొంతుపై తీవ్రగాయం చేసి చిత్ర హింసలు పెట్టి చంపారు. ఘటన జరిగిన వారం వరకు కనీసం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం కాలేదు. 10 రోజులకు విషయం తెలుసుకున్న మంద కృష్ణ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు 12వ రోజున ఎమ్మెల్యే వచ్చి పరామర్శించారు. మేము దళితులమనా మాపై ఈ వివక్ష. నా కొడుకులకు తల్లి లేకుండా పోయింది. నా జీవితమే ఆగమయ్యింది. ఆ నిందితులను కూడా చిత్రహింసలు పెట్టి చంపాలి. వారికి భూమి మీద ఉండే హక్కు లేదు. ప్రభుత్వం చంపకపోతే నేనే చంపేస్తా. – టేకు గోపి, ఆసిఫాబాద్. దిశ ఘటన జరిగే కొన్ని గంటల ముందే నా కూతురు మానస ఘటన జరిగింది. పుట్టినరోజు కావడంతో దేవాలయానికి వెళ్లి వస్తానని చెప్పి బయటికి వెళ్లి శవమై కనిపించింది. మానసను ముగ్గురు కలసి చంపారు. అత్యాచారం చేసి కాళ్లు చేతులు విరిచారు. ఇది ఒక్కడే చేసింది కాదు. ముక్కు, చెవుల నుంచి రక్తం వచ్చింది. చిత్ర హింసలు పెట్టారు. పోలీసులు మాత్రం ఒక్కరే చేశారని అరెస్టు చేశారు. మేము పేదవాళ్లమని, బలహీన వర్గానికి చెందిన వాళ్లమని మాపై వివక్ష చూపుతున్నారా?. ఇప్పటివరకు కనీసం పరామర్శించిన వారూ లేరు. ఒక తల్లికి ఒక న్యాయం, మరో తల్లికి మరో న్యాయమా?. బిడ్డల దగ్గర కులం, మతం ఏమిటి?. – స్వరూప, మానస తల్లి, వరంగల్ మా ఇంటిపక్కన ఒకతను ఇల్లు కట్టుకునేందుకు భూమి చదును చేశాడు. దీంతో మా బాత్రూం గోడ కొద్దిగా కూలింది. నా కూతురు సుద్దాల శైలజ మూత్ర విసర్జనకు వెళ్లడం గమనించిన అక్కడి యువకులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి, సమీపంలోని ఓ పాఠశాలలో సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు వారు తాగిన బీర్ బాటిల్ పగలగొట్టి అతి దారుణంగా పొడిచి, బండరాయితో తలపై మోది, కాళ్లు విరిచి అతి క్రూరంగా చంపారు. 4 రోజులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎవరో పాఠశాలలో ఒక మృతదేహం ఉంది అని చెప్పడంతో వెళ్లి చూడగా నా కూతురు. అప్పుడు పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. నెల రోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో మందకృష్ణ వచ్చి ఆందోళన చేస్తే కేసు నమోదు చేశారు. 17 నెలలు అయ్యింది, ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేరస్తులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అంతే కాకుండా కేసు వెనక్కు తీసుకోవాలని నన్ను భయపెడుతున్నారు. దళితుడిని కదా.. ఎవరూ అడగరని వారి ధైర్యం. –శైలజ తండ్రి వెంకట్, రామకృష్ణాపురం, మంచిర్యాల మా బిడ్డలు చనిపోయి 8 నెలలు అయ్యింది. అందరూ చిన్న పిల్లలే. హాజీపూర్లో పాఠశాలకు వెళ్లే పిల్లల్ని ఎత్తుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపి బావిలో పూడ్చిపెట్టాడు. వాడికి ఇప్పటివరకూ ప్రభుత్వం శిక్ష విధించలేదు. నిందితుడు శ్రీనివాస్రెడ్డి నరరూప రాక్షసుడు. వాడికి భూమి మీద బతికే హక్కులేదు. మా పిల్లలు ఇంకా మా కళ్ల ముందే కనిపిస్తున్నారు. మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి. వాడ్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి అదే బావిలో పూడ్చి పెడతాం. – హాజీపూర్ బాధితులు మనీషా తండ్రి మల్లేష్, కల్పన తండ్రి సదానందం, శ్రావణి తల్లి నాగలక్ష్మి -
స్కూల్లో చిన్నారులను తాళ్లతో కట్టి చిత్రహింసలు
సాక్షి, అనంతపురం: క్లాస్లో అల్లరి చేస్తున్నారనే కారణంతో ముగ్గురు విద్యార్థులను తాళ్లతో బంధించిన ఘటన కదిరి మున్సిపల్ స్కూల్లో గురువారం చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆదేశాల మేరకు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించి ఉంచారు. అయితే అనూహ్యంగా విద్యార్థుల నిర్బంధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపడంతో.. స్కూల్ హెచ్ఎం శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పిల్లలను నిర్బంధం గురించి హైదరాబాద్కు చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్కు(నేషనల్ చైల్డ్ కమిషన్) ఫిర్యాదు చేశారు. -
డ్రంకెన్ డ్రైవర్కు ట్రాఫిక్ విధులు
షాద్నగర్ టౌన్: మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఓ డ్రైవర్కు షాద్నగర్ కోర్టు 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద కడ్తాల్కు చెందిన నర్సింలు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. గురువారం షాద్నగర్ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి అతడికి 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు. -
తప్పు చేస్తే.. ‘మొక్క’ల్సిందే!
సూరత్: విద్యార్థులు ఏ చిన్న తప్పు చేసినా... ఆఖరికి యూనిఫామ్ వేసుకు రాకపోయినా దారుణంగా దండించే స్కూళ్లను మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే గుజరాత్లోని వీర్ నర్మాద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ వినూత్నమైన శిక్షలు వేస్తోంది. ఇక్కడి ఓ ప్రొఫెసర్కు వచ్చిన ఆలోచన ఫలితంగా... విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడల్లా వారి చేత ఓ మొక్కను నాటించేలా శిక్ష విధిస్తున్నారు. దీంతో గత ఎనిమిదేళ్లలో ఈ వర్సిటీలో 550కి పైగా చెట్లు వచ్చాయి. వర్సిటీలోని ఆర్కిటెక్చర్ విభాగంలో ‘బేసిక్ డిజైన్’ సబ్జెక్టును బోధిస్తున్న ప్రొఫెసర్ మెహుల్ పటేల్ (36) ఈ వినూత్న పద్ధతికి తెరలేపారు. క్లాసులకు లేటుగా రావడం, అసైన్మెంట్లు చేయకపోవడం, క్లాసులో ఫోన్ వాడడం వంటి చిన్న చిన్న తప్పులకు మొక్కలను నాటడాన్ని శిక్షగా విధిస్తున్నారు. పచ్చదనం పెరగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు. ‘పర్యావరణానికి నా వంతుగా ఏదోటి చేయాలన్న ఆలోచనతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాను. విద్యార్థులు చేసిన చిన్న చిన్న తప్పులకు మొక్కలు నాటిస్తున్నాను. 8 ఏళ్లలో క్యాంపస్లో 550పైగా మొక్కలు నాటించాను. ముందుగా నాటిన మొక్కలు 20 మీటర్లు ఎత్తు వరకు పెరిగాయి. మొక్క నాటడంతో అయిపోదు. దాన్ని కాపాడేందుకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేస్తుంటాం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సమీపంలో పచ్చదనం బాగా పెరగడంతో పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగల సందడి చేస్తున్నాయ’ని ప్రొఫెసర్ పటేల్ తెలిపారు. మొక్కలకు నీళ్ల కోసం విద్యార్థులు చిన్న కుంట కూడా తవ్వారని వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ను చూసి మన ‘దండో’పాధ్యాయులు చాలా నేర్చుకోవాలేమో!!. -
ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పిల్లలను కొట్టకపోతే చెడిపోతారు’ ఒకనాటి మాట. ‘పిల్లల్ని కొడితే చెడి పోతారు’ ఈనాటి మాట. కాలమాన పరిస్థితులతోపాటు మాటలు, పద్ధతులు మారిపోతుంటాయి. ఒకప్పుడు బళ్లో పిల్లలను కొట్టకపోతే వారికి చదువేరాదని గట్టిగా నమ్మేవారు. అందుకని బడి పిల్లలను భౌతికంగా హింసించేవారు. ఈ పాడు లేదా పాత పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటగా నిషేధించిన దేశం పోలండ్. సామాజిక చైతన్యం వల్ల ఆ దేశంలో 1783లోనే నిషేధం తీసుకొచ్చారు. ఆ తర్వాత 1970 దశకంలో ఇటలీ, జపాన్, మారిషస్ దేశాలు ఈ నిషేధాన్ని తీసుకొచ్చాయి. బడిలో పిల్లలకు ఉపాధ్యాయులు భౌతిక హింసాత్మక శిక్ష విధించడాన్ని నిషేధిస్తూ 2016 సంవత్సరం నాటికి ప్రపంచంలో 128 దేశాలు చట్టాలు తీసుకొచ్చాయి. అయినప్పటికీ అభివద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ శిక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పిల్లల హక్కులకు రక్షణ కల్పిస్తూ ఐక్యరాజ్య సమితి 1990లో ఓ అంతర్జాతీయ ఒప్పందం తీసుకొచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బడిలో పిల్లలను భౌతికంగా హింసించరాదు. అలాంటి హింసను నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. సరైన మార్గదర్శకాలను రూపొందించాలి. అందలో భాగంగానే ప్రపంచలోని పలు దేశాలు నిషేధాన్ని తీసుకొచ్చాయి. ఆ అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికా సంతకం చేయలేదు. నిషేధం విధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాలోని ఏ కోర్టు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించలేదు. పైగా క్రమశిక్షణ కోసం పరిమితి మేరకు బడి పల్లలను భౌతికంగా దండించవచ్చని ‘బ్రిటీష్ కామన్ లా’ను ఉదహరిస్తూ ప్రకటించింది. బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాలన్నింటికీ అప్పుడు ఈ కామన్ లా వర్తించేది. ఈ లా కింద బడి పిల్లలను దండించడం నేరంకాదు. ముఖ్యంగా ఇంగ్లీషును జాతీయ భాషగా అమలు చేస్తున్న అన్ని దేశాలు ఇదే వైఖరిని అనుసరిస్తూ వచ్చాయి. కాలక్రమంలో ఆ దేశాలు కూడా బడి పిల్లల హింసను నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. అమెరికా మాత్రం తీసుకోలేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం నిషేధం విధించాయి. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భౌతిక శిక్ష విధించడం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికీ చట్టబద్ధమే. ఇక ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 48 రాష్ట్రాల్లో భౌతిక శిక్ష చట్టబద్ధమే. ఈ విషయంలో భారత్ కూడా చాలా ఆలస్యంగానే నిర్ణయం తీసుకొంది. ఢిల్లీ పాఠశాలల్లో ఈ శిక్షను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టు 2000లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను పురస్కరించుకొని భారత్లోని పలు రాష్ట్రాలు కూడా నిషేధం విధించాయి. ఆ తర్వాత దేశంలోని అన్ని పాఠశాలల్లో భౌతిక శిక్షను నిషేధిస్తూ 2010, జూలై నెలలో కేంద్ర మహిళా, పిల్లల అభివద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పిల్లలను మొదటి సారి భౌతికంగా కొడితే ఏడాది వరకు జైలు, 50 వేల జరిమానాను నిర్దేశించింది. పునరావృతం అయితే మూడేళ్ల వరకు జైలు, 75 వేల వరకు జరిమానా విధించాలని సూచించింది. దండించే ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వరాదని, ఇంక్రిమెంట్లు కూడా కత్తిరించాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిన బాధ్యతను స్కూళ్ల అధిపతులకు అప్పగించింది. ఇకనైనా అమెరికాలోని అన్ని స్కూళ్లలో ఈ నిషేధాన్ని విధించాంటూ వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఆగస్టు రెండవ తేదీన అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన ఓ ‘విధాన పత్రం’లో వారు సిఫార్సు చేశారు. ఈ విషయమై వారు ప్రపంచంలోని 192 దేశాల్లో పాఠశాలల పరిస్థితులను అధ్యయనం చేసినట్లు చెప్పారు. ప్రపంచంలో మహిళల సారథ్యంలోని ప్రభుత్వాలు ముందుగా బడుల్లో ఈ నిషేధాన్ని తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. మహిళలకు పిల్లల పట్ల సహజంగా ప్రేమ ఉండడమే కాకుండా, వారు అభివద్ధిని కోరుకునే వారవడమే అందుకు కారణమని కూడా వారు విశ్లేషించారు. -
బర్రెనమ్మారని.. గుండు గీశారు
చిన్నచింతకుంట (దేవరకద్ర): జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తమ సొంత బర్రె (గేదె)తోపాటు దూడను స్నేహితుడి సహాయంతో విక్రయించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్కు వెళ్లి జల్సా చేద్దామనుకున్నాడు. ఇంతలో విషయం గ్రామంలో తెలియడంతో సర్పంచ్తోపాటు అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. అయితే అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన సురేందర్రెడ్డి కుమారుడు మహేశ్వర్రెడ్డి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర స్నేహితులు. ఇంటర్ వరకు చదివిన వీరు కుటుంబసభ్యులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే మహేశ్వర్రెడ్డి జల్సాలకు అలవాటుపడి తరచూ తండ్రిని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడు రాఘవేంద్ర సహాయంతో మహేశ్వర్రెడ్డి తాను మేపుతున్న పశువుల నుంచి ఓ బర్రె, దూడను తల్లిదండ్రులకు తెలియకుండా దేవరకద్ర సంతకు వెళ్లి రూ.33వేలకు విక్రయించారు. అనంతరం మహేశ్వర్రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. గ్రామానికి చేరుకున్న రాఘవేంద్రను మహేశ్వర్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి తన కొడుకు ఎక్కడ ఉన్నాడని అడగడంతో జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం గ్రామసర్పంచ్ హరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు మహేశ్వర్రెడ్డిని పిలిపించా రు. గురువారం రాఘవేంద్రను వెంట పెట్టుకుని వెళ్లి అమ్మిన బర్రె, దూడను గ్రామానికి తీసుకువచ్చారు. రాఘవేంద్ర తండ్రి వద్దంటున్నా.. శుక్రవారం గ్రామపెద్దలు, గ్రామస్తుల ఎదుట పంచా యతీ నిర్వహించి యువకులకు గుండు గీయించారు. దీంతో అవమానం భరించలేని రాఘవేంద్ర సూసైడ్ నోట్ రాసి వ్యవసాయ పొలంలోని విద్యు త్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పర్వతాలు తెలిపారు. -
శ్రీశాంత్కు శిక్ష ఎంత?
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన పేసర్ శ్రీశాంత్కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్మన్కు అప్పగించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్ష విషయంలో బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డీకే జైన్ నిర్ణయం తీసుకుంటారని శుక్రవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. దీనిపై అతను కోర్టుకెక్కగా... ఇటీవలే శిక్ష తగ్గించే విషయం ఆలోచించాలని బీసీసీఐకి సుప్రీం కోర్టు సూచించింది. -
ఆ దేశాల్లో ఓటు వేయకుంటే కఠిన చర్యలు
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : మన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయటం ద్వారా మన భవిష్యత్ను మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ మన దేశంలోని ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ఆరవై శాతానికి మించి ఓటును వేయటం లేదు. దీంతో కొన్ని సార్లు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడుతుండడమే కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఒక వేళ ఓటు వేయకపోతే వారిపై కఠిన చర్యలు, శిక్షలను విధిస్తాయి. ఓటు తప్పనిసరి చేసిన దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పిన్స్, సింగపూర్, థాయ్లాండ్, టర్కీ, స్విర్జర్లాండ్, బ్రెజిల్, బొలీలియో వంటి దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఈ దేశాలలోని అర్హులైన పౌరులు ఓటు వేయకపోతే వారిపై పలు రకాల చర్యలు, శిక్షలను, జరిమానాలను విధిస్తారు. బెల్జియంలో.. బెల్జియం దేశంలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే రెండు నుంచి నాలుగు వేల యూరోలు (భారత కరెన్సీలో రూ.3 లక్షలకుపైగా) జరిమానా, రెండోసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది వేల యూరోలు (భారత కరెన్సీలో 8 లక్షలకు పైగా) జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది సంవత్సరాల పాటు వారి ఓటు హక్కును తొలగిస్తారు. అంతేకాకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, సదుపాయాలు, పథకాలను తొలగిస్తారు.భారీగా జరిమానా విధిస్తుంది. సింగపూర్లో.. వేగంగా ఆభివృద్ధి చెందిన దేశాలలో సింగ్పూర్ ఒకటి. ఈ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పని సరి. ఈ దేశంలో ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకోకపోయినా వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా ఓటు హక్కును పునరుద్ధరించాలంటే ఓటు వేయకపోవడానికి సరైన కారణం చూపాల్సి ఉంటుంది. గ్రీస్లో.. గ్రీస్ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఓటు హక్కును వినియోగించుకోని వారి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. అమెరికాలో.. అమెరికా వంటి దేశంలో పోలింగ్ రోజు ఎలాంటి హడావుడి ఉండదు. అంతేకాకుండా పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆఫీసులకు, పాఠశాలలకు సెలవులు ఉండవు. అయినా 75 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుంది. ఇక్కడ కూడా ఓటు వేయకపోతే వారికి కొన్ని పథకాలను తొలగిస్తారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియా ఎన్నికల్లో తొంబై ఆరు శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంది. ఈ దేశంలో ఎన్నికలు మొదలయ్యే కొన్ని నెలల ముందు నుంచే అక్కడి అధికారులు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇక్కడే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేనట్లయితే ఓటు వేయని వారిని గుర్తించి వారికి అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. -
టార్గెట్ పూర్తి చేయలేదని వింత శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు టార్గెట్ తప్పనిసరి. అయితే ఇచ్చిన సమయానికి టార్గెట్ పూర్తవ్వకపోతే ఇచ్చే జీతంలో కోత విధించడం లేదా ఎక్కువ టైం పని చేయించుకోవడం చేస్తారు. ఇంకా కంపెనీ రూల్స్ కొంచెం కఠినంగా ఉంటే జాబ్ నుంచి తీసివేస్తారు. కానీ మీరు ఇప్పుడు చదవబోయే ఈ వార్త వీటన్నింటికి భిన్నం. ఎప్పుడూ ఇలాంటి ఫనిష్మెంట్లేనా అనుకుందేమో కానీ చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది ఓ చైనా కంపెనీ. ఇయర్ ఎండింగ్ టార్గెట్ పూర్తి చేయలేదని తమ కంపెనీ సిబ్బందిని నడి రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. ట్రాఫిక్ మద్యలో సిబ్బంది అంతా మోకళ్లపై కూర్చోని చిన్న పిల్లాల్లా పాకుతూ వెళ్లారు. వారందరిని చూసి పాదచారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా కంపెనీ చర్యను కొంత మంది తప్పుపట్టగా, కొంతమంది ఉద్యోగులను విమర్శిస్తున్నారు. ఉద్యోగులను హింసింస్తున్నారని, వారిని అవమానించేలా కంపెనీ వ్యవహరిస్తుందని కొంత మంది మండిపడుతుండగా, డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని ఉద్యోగులను మరికొంత మంది విమర్శిస్తున్నారు. కాగా వీడియో వైరల్తో యాజమాన్యంపై విమర్శలు రావడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా శిక్షించడం చైనా కంపెనీలకు మొదటి సారేంకాదు. గత ఏడాదిలో కూడా ఓ కంపెనీ ఇలాంటి పనిష్మేంటే ఇచ్చింది. టార్గెట్ పూర్తి చేయలేదని తమ సిబ్బందిని వరుసగా నిలబెట్టి అమ్మాయిలలో చెంపదెబ్బలు కొట్టించారు. కాగా ఇలాంటి అవమానకర ఘటనలు చైనా కంపెనీలలో తరచూ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
ఒక నేరం.. 2 చట్టాలు.. ఒక శిక్ష
న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్ఎస్ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు. కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది. -
బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
భోపాల్ : ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచార ఘటనలో మధ్యప్రదేశ్లోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. జాన్ 26న మంద్సౌర్లో పాఠశాల వద్ద తండ్రికోసం ఎదురుచుస్తున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను అవహరించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందితులు ఇర్ఫాన్ (20), ఆసీఫ్ (24)లకు ఉరిశిక్షను విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పన్నిండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్షను విధిస్తూ ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం నిందింతులను మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి నిషా గుప్తా తీర్పును వెలువరించారు. మంద్సౌర్లో జరిగిన ఈ ఘటనపై కోర్టు 37 మందికి సాక్షులతో సహా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. బాలికను అపహరించిన నిందితులు అత్యాచారం చేసి.. ఆమె చనిపోయిందని భావించిం నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను గమణించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. బాలిక శరీరంపై బలమైన పంటిగాట్లు ఉన్నాయని, ఆమె ప్రైవేటు అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాపంగా ప్రతిపక్షాలతో సహా, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఈ భూమ్మీద నివశించే హక్కులేదని, వారికి మరణశిక్షే సరైనదని అన్నారు. కాగా కేవలం రెండు నెలల్లోనే కోర్టు తీర్పును వెలువరించడం విశేషం. -
రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ముంబై : కీకీ చాలెంజ్ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్. రైల్వే ప్లాట్ఫాంపై డ్యాన్స్ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్ రైల్వే స్టేషన్ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది. -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబాన్ని గ్రామ పెద్దలు తీవ్రంగా అవమానించారు. బులంద్హహర్కు చెందిన ఓ దళితుడు యువకుడు ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గ్రామ కట్టుబాట్లకి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నాడని, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నాకించారు. అంతటితో ఆగని గ్రామస్థులు అతని భార్యని, కుతుర్ని పంచాయతీలో నగ్నంగా నిలుచోపెట్టారు. తన కుమారుడు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు తమను తీవ్రంగా అవమానించి గ్రామం నుంచి వెలివేశారని యువకుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితులకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ డెహత్ తెలిపారు. కాగా, గత ఏడాది బులంద్హహర్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గ్రామస్థుల చేతిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. -
ఎండు గడ్డి.. పచ్చిగడ్డి
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను తన రాజ్యంలోని కొంతమంది మేకల కాపరులను పిలిచి, ‘‘మీ మేకలు పచ్చిగడ్డి తింటాయా.. ఎండుగడ్డి తింటాయా..?’’ అని ప్రశ్నించాడు. ‘‘అయ్యా..! మేకలు పచ్చిరొట్ట మాత్రమే తింటాయి. ఎండుగడి ్డతినవు’’ అని సమాధానం చెప్పారు వారు. అప్పుడు రాజు, మేకలను పచ్చిగడ్డి కాకుండా ఎండుగడ్డి మాత్రమే తినగలిగేలా చేస్తే మీకు మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు. బహుమతి అనగానే అందరికీ ఆశపుట్టుకొచ్చింది.‘‘ప్రభూ.. మాకు నెలరోజుల గడువునివ్వండి. ఈ నెలరోజుల్లో మేము మేకలకు ఎండుగడ్డి తినిపించే ప్రయత్నం చేస్తాము’’ అని అడిగారు. దానికి రాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి కాపరులందరూ తమ మేకలను బయటికి వదలకుండా, నిర్బంధించి ఎండుగడ్డి వేయడం ప్రారంభించారు. ఒకటి రెండు రోజులు మేకలు ఎండుగడ్డి ముట్టకుండా మొరాయించాయి. కాని ఆకలికి తాళలేక మూడోరోజునుండి ఎంగిలి పడడం ప్రారంభించాయి. మెల్లగా అవి ఎండుగడ్డికి అలవాటు పడిపోయాయి. నెలరోజుల తరువాత కాపరులంతా తమ తమ మేకలతో సహా రాజదర్బారుకు హాజరయ్యారు. రాజు సమక్షంలో అందరూ మేకలకు ఎండుగడ్డివేశారు. అవి వెంటనే తినేశాయి. తరువాత రాజు పచ్చిరొట్ట తెప్పించి వాటిముందు వేయించాడు. ఆవురావురుమంటూ అవి పచ్చిరొట్టంతా లాగించాయి. కాని అందులో ఒకమేక మాత్రం పచ్చిరొట్టను కనీసం వాసన కూడా చూడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆ మేకల కాపరిని పిలిచి, ‘‘ఏమిటీ.. నీ మేక పచ్చిరొట్ట తినడంలేదు, అలా ఎలా తర్ఫీదు ఇవ్వగలిగావు?’’ అని ప్రశ్నించాడు. దానికా కాపరి, ‘‘రాజా.. నేను దాని ముందు పచ్చిరొట్ట వేసి బెత్తం పట్టుకొని కూర్చునేవాడిని. అది రొట్ట తిందామనుకున్న ప్రతిసారీ దానిమూతిపై కొట్టేవాడిని. తరువాత ఎండుగడ్డి వేసేవాడిని. అది దాన్ని కూడా తినాలని ప్రయత్నించేది. కాని నేను ఏమీ అనేవాడిని కాదు. జంకుతూ, జంకుతూనే అది ఎండుగట్టి తినడం ప్రారంభించింది. పచ్చిగడ్డి తింటే దానికి దెబ్బలు పడేవి. ఈ విధంగా అది ఎండుగడ్డికి అలవాటు పడిపోయింది’’ అని వివరించాడు. మాట ప్రకారం రాజు ఆ కాపరికి గొప్ప బహుమతినిచ్చి సత్కరించాడు. అంటే, పచ్చిగడ్డి తింటే శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం మేకను ఎండుగడ్డికి అలవాటు చేసింది. అలాగే తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం మనిషిలో ఉంటే దుర్గుణాలు గణనీయంగా తగ్గిపోతాయనే కదా, ఈ ఆరాధనలు. ఉపవాసాలు. – మదీహా అర్జుమంద్ -
ముద్ర చరిత్ర
రామ్గోపాల్ వర్మ చేసిన ‘రక్తచరిత్ర’ లాంటిది కాదు. ఎంత తుడిచినా పోని ముద్రల చరిత్ర ఇది. పగ, ప్రతీకారంతో చేసిన నేరం కాదు. అహంకారంతో లెక్కలేనితనంతో చేసిన నేరం. నేరం దాగదు. నేరాహంకారానికి శిక్ష తప్పదు. 2017 తొలకరి. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం అటవీప్రాంతం. ఉదయం 11. జనం హడావిడికి బెదిరి పురుగూ పుట్రా పక్కకు జరిగిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన చెట్టూ పుట్టా కూడా ఏం జరిగిందా అన్నట్టు కుతూహలపడుతున్నట్టున్నాయి. చుట్టూ జనం. వలయాకారంగా పోగై ఉన్నారు. ఇంకొందరు పరిగెత్తుకొని వస్తుంటే పోలీసులు వెనక్కి నెడుతున్నారు. దూరంగా అదిలిస్తున్నారు. అక్కడ ఏదో దుర్మార్గం జరిగిందని తెలుస్తూనే ఉంది. ఏంటా దుర్మార్గం? ఎవరో తొంగి చూశారు. ఒళ్లు గగుర్పాటు చెందింది. వికారం గుండెల్లో తన్ని వాంతి వచ్చినట్టనిపించింది. అక్కడ చిన్న గొయ్యి. అందులో ఒక యువకుని మృతదేహం. దానికి తల లేదు. కాళ్ళు నరికి వెనక్కి మడిచి గొయ్యిలో పూడ్చిపెట్టారు. గొయ్యి కనపడకూడదని అక్కడి చెట్ల కొమ్మలు నరికి కప్పినట్టున్నారు. అడవిలో తిరిగే వారికి అలా పచ్చి కొమ్మలు నరికి కుప్పగా వేయడం విడ్డూరంగా కనిపించింది. అందుకే పోలీసులకు సమాచారం అందించారు.ఆ దారుణాన్ని చూసిన పోలీసులు ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నారు. ఎస్.ఐ మరోసారి మృతదేహాన్ని పరిశీలించాడు. 25 –30 సంవత్సరాల మధ్య వయసు ఉండచ్చు. తల ఉన్న మృతదేహాల కేసుల్ని పరీక్షించడమే ఒక్కోసారి జటిలం అవుతూ ఉంటుంది. ఇది తలలేని మొండం. ఎవరో ఎలా కనిపెట్టడం. గొయ్యి చుట్టూ పరికిస్తున్నాడు ఎస్.ఐ. గొయ్యిలోనే మృతదేహం పక్కన పగిలిన ఫోన్ ముక్కలు కనిపించాయి. ఆ పక్కనే సిమ్, మెమరీ కార్డులూ దొరికాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని మెమరీకార్డును మరో ఫోన్లో వేసి చూశారు. అందులో ఒక ఫొటో ఉంది. అది హతుడి ఫోటో అయ్యుంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సిమ్కార్డులోని కాల్ డేటాను పరిశీలించారు. హతుడు బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన టైలర్ రాజుగా గుర్తించారు. రాజును ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపడానికి గల కారణం ఏమిటి? తెలియలేదు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకి పంపించారు. మృతుడి తల ఏమైంది అనే విషయం అంతుపట్టలేదు. డాగ్ స్క్వాడ్తో వెదుకులాట కొనసాగించారు. ప్రయోజనం కనిపించలేదు. అంత క్రూరంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు వచ్చింది... పోలీసులకు అంతుపట్టలేదు. క్లూ కోసం మళ్లీ శవం దొరికిన గొయ్యి వద్ద వెదుకులాట మొదలుపెట్టారు. పగిలిన బీరుబాటిల్లోని గాజు ముక్క ఒకటి దొరికింది. ఆ చిన్న గాజు ముక్క కూడా ‘క్లూ’ అవ్వచ్చు. ‘ల్యాబ్కు పంపించి చెక్ చేయించండి’ అన్నాడు ఎస్.ఐ. చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసు కలకలం రేపింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా తల లేని మొండం గురించి, జరిగిన ఘాతుకం గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మృతుని గురించిన విచారణ వేగం చేశారు పోలీసులు. టైలర్రాజుకు మద్యం తాగే అలవాటు ఉంది. కొన్నాళ్ళుగా అతను జంగారెడ్డిగూడెంలో ఉంటున్నాడు. శత్రువులు, గిట్టనివారు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేశారు. అలాంటి వారెవరూ లేరని, అయినవాళ్లు కూడా రాజుకు లేరని తెలిసింది. ల్యాబ్ సిబ్బంది గాజు ముక్కపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఆ వేలి ముద్రలు పాత నిందితులైన ఓ ఇద్దరి వేలిముద్రలతో సరిపోలాయి. గతంలో నేరం చేసి, జైలుకు వచ్చినవారి వేలి ముద్రలు పోలీసుల రికార్డుల్లో ఉంటాయి. దొరికిన వేలి ముద్రలను ఆ ముద్రలతో మేచ్ చేసి చూస్తే నిందితులు ఎవరు? ఎక్కడివారు అనే దిశగా కేసు విడిపోతుందని భావించారు. రెండు రోజుల తర్వాత ఒక మధ్యాహ్న సమయం. పోలీస్ స్టేషన్కు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. ‘సార్.. 16వ తేదీ రాత్రి జేపీ సెంటర్లో ఉన్న బ్రాందీ షాప్ ముందు నుంచి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు బలవంతంగా ఆటోలో తీసుకువెళ్లడం చూశా’నని చెప్పి పెట్టేశాడు. ఫోన్ చేసినవాడు తన వివరాలు మాత్రం చెప్పలేదు. వెంటనే పోలీసులు జేపీ సెంటర్కు చేరుకుని పరిశీలించారు. 16వ తేదీ రాత్రి జరిగిన ఘటనలపై ఆరా తీశారు. సమాచారం అస్పష్టంగా ఉంది. ఇదే సమయంలో సెక్యూరిటీ కోసం జేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాపై ఎస్.ఐ దృష్టి పడింది. ఫుటేజీని పరిశీలిస్తే ఒక ఆటోలో ఒకతన్ని ఎవరో బలవంతంగా ఎక్కిస్తున్నట్టు కనిపించింది. వెంటనే ఆ ఆటో గురించి వివరాలు సేకరించారు. ఆటోను నడిపిందెవరు... ఎవరు ఎక్కారు... ఎక్కడి వరకు ఆటో వెళ్ళింది అనే విషయాలను తెలుసుకున్న ఎస్.ఐ వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం మొదలు పెట్టారు. వచ్చిన సమాచారం విని విభ్రాంతికి గురయ్యారు. 2017 జూలై 16, రాత్రి. టైలర్ రాజు పనులు ముగించుకుని జేపీ సెంటర్లో ఉన్న వైన్ షాపుకు వెళ్లి అక్కడ మద్యం కొనుకున్నాడు. సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో అజయ్కుమార్ అనే ఆటో డ్రైవర్ తన స్నేహితులతో వైన్ షాప్కి వచ్చాడు. వాళ్లు కూడా మద్యం కొనుక్కుని ఆ ఖాళీ ప్రాంతంలో కూర్చున్నారు. ఒక పక్కన టైలర్ రాజు.. మరో పక్క వీరంతా... ఉన్నట్టుండి ఈ గ్రూపులోని ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం రాజు కూర్చున్న వైపు వచ్చాడు. ‘దూరం పో అన్నా’ అని రాజు అతణ్ణి అదిలించాడు. చిన్న మాట. కాని తగాదా పెరిగిపోయింది. అప్పటికే రెండు వర్గాలకు మత్తు తలకెక్కిపోయి ఉంది. రాజు ఒక్కడు. వాళ్లు ఆరుగురు. ఆరుగురూ రాజును తీవ్రంగా కొట్టారు. రాజు అక్కడే పడిపోయాడు. అయినా కోపం తీరని వారంతా రాజును ఆటోలో ఎక్కించుకుని మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకుపోయారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెట్టు కొమ్మను విరిచి మళ్లీ తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకే రాజు మరణించాడు. హత్యకేసు బయటకు రాకూడదని రాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారు. వారిలో పవన్కుమార్కు నేరప్రవృత్తి ఉంది. అప్పటికే ఇతనిపై తూర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాలో కేసులు కూడా ఉన్నాయి. ఇక శ్రీనుపై కూడా జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో రౌడీ షీటర్కేసు ఉంది. హత్యకేసు తప్పించుకునేందుకు పవన్కుమార్ తన ఆటోలో జంగారెడ్డిగూడెంలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోని కూరగాయలు కోసే చాకు, చేతిగునపం తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ చాకుతో హతుడు రాజు గొంతును కోసి తలను వేరుచేశారు. తీసిన గొయ్యి సరిపోకపోవడంతో మృతుడి కాళ్ళను వెనక్కి విరిచి పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా చెట్ల ఆకులు, కొమ్మలు పడవేశారు. వేరుచేసిన తలను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి దారిలో మూసేసి ఉన్న ఇస్త్రీ బండిలో నుంచి ఒక చీరను తీసుకుని తలను చీరలో కట్టారు. చీరకు మరో పక్క రాయి కట్టి జంగారెడ్డిగూడెం సమీపంలోని రజక చెరువులో పడవేశారు. ఆ తరువాత ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇదంతా విన్న పోలీసులు హతాశులయ్యారు. చిన్నపాటి ఘర్షణ ఇంత దారుణమైన క్రూర హత్యకు దారి తీస్తుందా అని ఆశ్చర్యపోయారు. కేసును రోజుల వ్యవధిలో చేధించిన పోలీసు బృందానికి అవార్డు వరించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్కుమార్కు కోర్టు 18 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. మిగిలిన వారిపై కేసు రుజువు కాలేదు. ఉన్మాదంలో, అహంకారంలో నేరం చేసి ఏం కాదు అనుకునేవారికి ఇదో కనువిప్పు. – డి.వి.భాస్కరరావు సాక్షి, జంగారెడ్డిగూడెం -
అన్యాయం.. బాధితురాలినే శిక్షించారు
జైపూర్ : బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వారికే శిక్ష విధించిన సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. రాజస్థాన్ చిత్తోర్ఘడ్కు చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందు ఇచ్చి ఆమెను అసభ్యకర రీతిలో వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి బాధుతురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిని పంచాయతీ పెద్దలు వత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో బాధితురాలి కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లడవద్దని, వారికి ఎటువంటి సహాయం చేయవద్దని కనీసం తిండి గింజలు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాక పంచాయతీ తీర్పును పాటించనందుకు గాను బాధితురాలి కుటుంబానికి 11 వేల రూపాయల జరిమాన విధించారు. పంచాయతీ జారీ చేసిన ‘దిక్తిత్’ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం తమకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించుకుంది. ఈ విషయంలో బాధితులకు రక్షణ కల్పించి, గ్రామస్తుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ తెలిపారు. -
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు పనిష్మెంట్
సాక్షి, ముంబై : ఐపీఎల్-11లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లకు మరిన్ని శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సమయపాలన, నిబంధనలు పాటించని ఆటగాళ్లకు జట్టు మేనేజ్మెంట్ ఫన్నీ పనిష్మెంట్ విధిస్తోంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కూడిన ఎమోజీలు ఉన్న జంప్ సూట్ను వేసుకోవాలి. దీంతో ఈ సీజన్లో తొలిసారిగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, అనుకూల్ రాయ్, రాహుల్ చహర్లు ఈ పనిష్మెంట్ భారిన పడ్డారు. ఈ జంప్సూట్లు వేసుకున్నారంటే వాళ్లు ఏదో తప్పు చేశారని మిగతావారికి అర్థమైపోతుంది. ఈ ప్లేయర్స్ ఎమోజీ సూట్లు వేసుకున్న వీడియోను ముంబై ఇండియన్స్ తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘రెండు రోజుల క్రితమే జిమ్ సెషన్ ఉందని చెప్పినా మరిచిపోవటంతో ఈ సూట్ వేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్లో సన్గ్లాసెస్ తీయలేకపోయాను. ఎవరి కళ్లలోకి చూడలేకపోయాను. ఏదో తప్పచేసిన భావన కలిగింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటాను’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్కు సమయానికి రానందుకు ఈ పనిష్మెంట్కు గురయ్యానని రాయ్ తెలిపాడు. ఫిజియో రూమ్కు సమయానికి రాలేకపోయినందుకు ఈ స్పెషల్ కిట్ ధరించాల్సి వచ్చిందని రాహుల్ చహర్ వివరించాడు. -
ప్రాక్టీస్ సెషన్కు సమయానికి రానందు..
-
లెక్కలు చేయలేదని విద్యార్థి గొంతులోకి ...
అహ్మద్నగర్, ముంబై : లెక్కలు సరిగా చేయలేదనే ఆగ్రహంతో విద్యార్థి గొంతులో కర్ర ముక్క (బెత్తం) ను దూర్చాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన మహారాష్ట్ర కర్జత్ జిల్లాలోని పింపల్గాన్ జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. రోహన్ డీ జంజీర్(8) జిల్లా పరిషత్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో లెక్కల మాష్టారుగా పని చేస్తున్న చంద్రకాంత్ సోపాన్ షిండే ఓ లెక్క చేయమని రోహన్కు ఇచ్చాడు. కానీ రోహన్ ఆ లెక్కను చేయలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చంద్రకాంత్.. రోహన్ నోటిలోకి కర్రను దూర్చాడు. దాంతో రోహన్ ఆహార, వాయు నాళాలు దెబ్బతిన్నాయి. నొప్పిని తట్టుకోలేని రోహన్ నేలమీద పడిపోయాడు. విద్యార్థి నోటి నుంచి రక్తం కారసాగింది. ఇది చూసిన పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడ కింది పడివున్న రోహన్ని స్కూల్ యాజమాన్యం హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆస్పత్రి వారు రోహన్ని పూణేకి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం అతడు పూణెలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. రోహన్ తల్లి సునితా జంజీరే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఉపాధ్యాయుడిని అరెస్టు చేయలేదు. రోహన్ కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని తీసుకుని, ఆ తర్వాత ఉపాధ్యాయుడిని అరెస్టు చేస్తామని కర్జత్ పోలీసు స్టేషన్ అధికారి ఎస్బీ మిత్రే తెలిపారు. -
అక్షరంపై ఆగ్రహం
-
యావజ్జీవ శిక్షే.!
జగిత్యాలజోన్ : మహిళలను నేరుగా ఎదుర్కోని కొందరు, తమకు దక్కనిది ఇంకొక్కరికి దక్కొద్దనే దురాలోచనతో ఉన్నవారు.. మహిళలపై, విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, యాసిడ్ దాడులకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్భయ చట్టం–2013 ద్వారా యాసిడ్ దాడులకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు ఉండేలా.. ఐపీసీ326 చట్టానికి సవరణలు చేసి.. ఐపీసీ326(ఏ), ఐపీసీ326(బీ) అనే కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు. వీటితో పాటు మరిన్ని క్రిమనల్ చట్టాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాది ఎడ్మల నిరోషా వివరించారు. తీవ్రమైన హాని చేస్తే.. అగ్ని, విష ప్రయోగం, వేడితో మరిగిన పదార్థాలు, యాసిడ్, పేలుడు పదార్థాలు, రక్తంలో కలిసిపోయే తీవ్రమైన హానికర పదార్థాలు, జంతువులు, కత్తి వంటి సాధానాల ద్వారా ఒక మనిషికి మరణం కలిగించే విధంగా.. ఉద్దేశపూర్వకంగా తీవ్రగాయాలు చేస్తే ఐపీసీ326 కింద నేరంగా పరిగణించబడుతోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేయవచ్చు. లేదా కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా వేసే అవకాశముంటుంది. యాసిడ్ వంటి పదార్థాలతో గాయపర్చడం.. ఎవరైనా ఎదుటి వ్యక్తిపై యాసిడ్ దాడి చేయడం లేదా ఇతర విధాలుగా దాడులు చేయడాన్ని ఐపీసీ326(ఏ)సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ దాడుల ద్వారా సదరు వ్యక్తికి శాశ్వత లేదా పాక్షికంగా నష్టం లేదా శరీర భాగాలు వైకల్యం పొందడం లేదా అందవిహీనంగా తయారవడం జరుగుతోంది. ఇలాంటి నేరానికి పాల్పడితే జీవితకాల శిక్ష విధించే అవకాశముంది. కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల కాల వ్యవధితో జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ఇలాంటి కేసుల్లో ముద్దాయిలకు వేసే జరిమానాలు బాధితుల వైద్య ఖర్చులకు సరిపడే విధంగా న్యాయబద్దంగా ఆలోచించి కోర్టులు నిర్ణయిస్తుంటాయి. యాసిడ్ విసిరి శాశ్వత నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో.. ఒక వ్యక్తికి శాశ్వతమైన లేక పాక్షికమైన నష్టం లేదా అంగవైకల్యం లేదా తీవ్రమైన గాయం చేయాలనే ఉద్దేశ్యంతో యాసిడ్ను విసిరినా లేదా యాసిడ్ను విసురుటకు ప్రయత్నించినా ఐపీసీ326(బీ) సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఆస్తిని పొందేందుకు గాయపర్చితే.. ఏదైనా ఆస్థిని లేదా విలువైన పత్రాలను బాధితుడి నుంచి బలవంతంగా లేదా బెదిరించడం, చట్టవిరుద్ధగా చేసే చర్యల వల్ల గాయాలైతే ఐపీసీ327 కింద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. విషంతో హాని కలిగిస్తే.. ఎవరైనా ఒక వ్యక్తికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం లేదా సృహ కోల్పోయే మత్తుమందును తాగించిన లేదా తాగించేలా చేసిన ఐపీసీ328 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. తీవ్రంగా గాయపర్చితే.. ఎవరినైనా ఉద్దేశ్యపూర్వకంగా బలవంతం చేసి, తీవ్రమైన గాయాలు చేస్తే ఐపీసీ329 కింద శిక్షలు కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా, ఏదైనా ఆస్తిని బాధితుడి నుంచి బలవంతంగా లాక్కునేందుకు బెదిరించినా నేరమే. ఈ నేరానికి పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా కేసును బట్టి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. -
ప్లీజ్.. తక్కువ శిక్ష విధించండి: లాలూ
రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. -
పక్క తడుపుతోందని..
హైదరాబాద్ , అడ్డగుట్ట: పక్క తడుపుతుందని ఓ చిన్నారికి కన్నతండ్రే విచక్షణారహితంగా అట్లకాడతో వాతలు పెట్టిన సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి....అడ్డగుట ఏ సెక్షన్ ప్రాంతానికి చెందిన రాజు కారు డ్రైవర్గా పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి(8) స్థానిక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు నిద్రకు ఉపక్రమించగా కూతురు వైష్ణవి పక్కలో మూత్రం చేసిందని కొట్టాడు. అక్కడితో ఆగకుండా సరాతం(అట్లకర్ర)తో ఒంటిపై వాతలు పెట్టాడు. దీంతో ఆమె కాళ్లు, వీపుపై తీవ్రగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు నార్త్జోన్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డీసీపీ తుకారాంగేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి, వాతలు తేలిన దృశ్యం -
టెర్రరిజం ఫైనాన్షియర్లకు ఇక కఠిన శిక్షలు
మాస్కో: తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారిపై ఇకపై మరింత కఠిన చర్యలు ఉండనున్నాయి. ఈమేరకు క్రిమినల్ లా సవరణలకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. ఈ సవరణలను రష్యా అధికారిక వెబ్సైట్లో శుక్రవారం ప్రచురించారు. దీని ప్రకారం తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేసినా, తీవ్రవాదులను నియామకం చేసుకున్నా 8 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 లక్షల రూబుల్స్ (5,172 డాలర్లు) నుంచి 7లక్షల రూబుల్స్ వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతకుముందు పదేళ్ల శిక్ష మాత్రమే ఉండేది. టెర్రరిజాన్ని ప్రచారం చేసినా క్రిమినల్ లా కిందకు వస్తుందని, అలాంటివారికి 5 నుంచి 7 ఏళ్ల జైలుశిక్షతోపాటు 3 లక్షల నుంచి ఒక మిలియన్ రూబుల్ వరకు జరిమానా విధిస్తారు. -
విద్యార్థినికి శిక్ష: టీచర్పై కేసు నమోదు
సాక్షి, కొల్హాపూర్ : హోం వర్క్ చేయలేదని టీచర్ రాక్షసుడిగా మారాడు. పసిపల్ల అని చూడకుండా దారుణ శిక్ష విధించాడు. హోంవర్క్ చేయకుండా స్కూల్ వచ్చినందుకు 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని చంద్గఢ్ తహసీల్దార్ పరిధిలోని కానూర్ బుద్రిక్ గ్రామంలో జరిగింది. ఆలస్యంగా జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే శ్రీ భువనేశ్వరి సందేష్ విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నవంబర్24న స్కూల్ వెళ్లింది. అయితే ఆ రోజు ఇంట్లో విద్యార్థిని టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్ అశ్వనీ అశోక్ దేవన్ అనే ఉపాధ్యాయుడు.. 300 గుంజిళ్లు తీయాలంటూ ఆదేశించాడు. విద్యార్థిని కొన్ని గుంజిళ్లు తీసిన తరువాత స్పృహ తప్పి పడిపోయింది. తరువాత విద్యార్థినికి నడిచేందుకు కూడా కాళ్లు సహకరించలేదు. దీంతో ఆమెను.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. పనిష్మెంట్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా హింసించిన అశోక్ దేవన్పై తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. సదరు టీచర్కు పాఠశాల యాజమాన్యం దీర్ఘకాలిక సెలవును మంజూరు చేసింది. అశోక్ దేవన్ తీసుకున్న నిర్ణయం.. విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని జిల్లా విద్యాశాఖాధికారి స్పస్టం చేశారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోంవర్క్ చేయలేదన్న చిన్నారికి ఒక టీచర్ స్కూల్లో దారుణ శిక్ష విధించాడు. విద్యార్థిని స్పృహ తప్పి పడిపోవడంతో.. టీచర్పై కేసు నమోదు చేశారు. -
అరుణాచల్ప్రదేశ్లో దారుణం
-
విద్యార్థి షూ వేసుకునిరాలేదని పనిష్మెంట్
-
కొడుకు పరిస్థితి చూసి రగిలిపోయిన ఓ తండ్రి...
సాక్షి, ముంబై : తన కొడుకును ఓ టీచర్ కొట్టాడన్న వార్త తెలియగానే ఆ తండ్రి కోపంతో రగిలిపోయాడు. నేరుగా స్కూల్కి పరిగెత్తి గల్లా పట్టి అతన్ని బయటకు గుంజుకొచ్చాడు. ఆపై చితకబాదుతూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ముంబైలోని విరార్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జయదీప్ విద్యా మందిర్లో ఆరో తరగతి చదువుతున్న నితిన్ శర్మ(11) అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడన్న కారణంతో దినేశ్ షిండే(31) అనే ఉపాధ్యాయుడు దండించాడు. అయితే అది కాస్త శ్రుతి మించటంతో నితిన్ కళ్లు తిరిగి పడిపోయాడు. ఊపిరి అందక అవస్థ పడుతున్న విధ్యార్థిని దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించగా.. కాసేపటికి అతను కోలుకున్నాడు. అయితే ఆస్పత్రి బెడ్ మీద తన కొడుకు అపస్మారక స్థితిలో ఉండటం చూసిన తండ్రి నర్సింగ్ శర్మ కోపంతో ఊగిపోతూ స్కూల్కి వచ్చాడు. దినేశ్ను లాక్కుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు. ఈ క్రమంలో అతనికి కొందరు స్థానికులు కూడా తోడయ్యారు. ఆపై వీరార్ పోలీస్ స్టేషన్లో ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఈ విషయంలో ఫిర్యాదు చేయబోమని రాతపూర్వక హామీ తీసుకుని వదిలేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగుపడిందని.. మెడకు మాత్రం స్వల్ఫ గాయమైందని వైద్యులు వెల్లడించారు. పిల్లలను దండించటంలో తప్పు లేదని.. అయితే అది మరీ మితిమీరటంతోనే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని నర్సింగ్ చెబుతున్నారు. -
ఇతడేం తండ్రి.. పాపం చిన్నారి ఎటువెళ్లిందో..
ఆస్టిన్, టెక్సాస్ : డల్లాస్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాలు తాగనందుకు మూర్ఖంగా మూడేళ్ల కూతురుకు పనిష్మెంట్ ఇచ్చిన ఓ తండ్రికి దిగ్బ్రాంతి ఎదురైంది. ఆ పాప కనిపించకుండాపోయింది. పాలు తాగలేదనే కోపంతో భారత సంతికి చెందిన మూడేళ్ల తన కూతురు షెరిన్కు వెస్లీ మాథ్యూస్ అనే(37) ఓ తండ్రి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ రాత్రి బయటనే నిల్చోవాలని బయటకు పంపాడు. ఆ తర్వాత పాప కనిపించకుండాపోయింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఓ బాండ్పై విడుదల చేశారు. దీనిపై మాథ్యూస్ స్పందించేందుకు నిరాకరించాడు. అయితే, పోలీసులు నమోదు చేసుకున్న అఫిడవిట్ ప్రకారం ఆ పాప పాలు తాగనందుకు శిక్షగా శనివారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఇంటికి దూరంగా ఉన్న ఓ చెట్టు వద్ద నిల్చోవాలని ఆదేశించాడు. పదిహేను నిమిషాల తర్వాత చూడగా ఆ పాప కనిపించకుండా పోయింది. చాలా సేపు వెతికిన 5గంటల తర్వాత అతడు పోలీసులకు పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. షెరిన్ భారత్లో జన్మించింది. మాథ్యూస్ కుటుంబం ఆ పాపను దత్తత తీసుకుంది. -
13 లక్షల అవినీతి అధికారులకు శిక్ష
బీజింగ్: చైనాలోని దాదాపు 13.4 లక్షల మంది అవినీతి అధికారులను ఆ దేశ ప్రభుత్వం శిక్షించింది. అవినీతిని నిర్మూలించేందుకుగాను ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ప్రారంభించిన ‘స్వీపింగ్ యాంటీ కరప్షన్’ కార్యక్రమంలో భాగంగా అవినీతి అధికారులను గుర్తించి శిక్షించారు. అక్టోబర్ 18న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సీసీడీఐ)కు నేతృత్వం వహిస్తున్న వాంగ్ క్విషాన్ ఈ వివరాలను ఆదివారం వెల్లడించారు. 2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు పేర్కొన్నారు. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అధికార పత్రిక వెల్లడించింది. మిలిటరీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్గా పనిచేసిన జనరల్ జు కైహూతోపాటు జనరల్ జూ బోక్సంగ్ను కూడా శిక్షించారు. -
చుక్కపడితే కటకటాలే!
♦ ‘డ్రంకెన్ డ్రైవ్’తో మందుబాబుల వెన్నులో వణుకు ♦ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 97మందికి శిక్ష ♦ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కృషి ♦ ఏడాదిలో కేసులు 6460, పెండింగ్ 900 గద్వాల క్రైం : మద్యం తాగి వాహనాలను నడిపే మందుబాబులు చుక్కలు చూడా ల్సిందే. తరచూ రోడ్డు చోటుచేసుకోవడంతో పోలీసులు ఆకతాయిల దూకుడు కు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందుకోసమే ఉద్దేశించిన డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తుండడం తో మందుబాబుల వెన్నులో వణుకు మొదలైంది. బ్రీత్ ఎనలైజర్లో నమోదైన ప్రకారం ఆల్కహాల్ శాతం 100లోపు ఉంటే రూ.1500, 100శాతం దాటితే రూ.2500 జరిమానాతో పాటు శిక్షపడే అ వకాశం ఉంది. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2016 అక్టోబర్ 2017ఆగస్టు వరకు 6460మంది పోలీసులకు పట్టుబ డి జరిమానాలు చెల్లించారు. వీరిలో 97మంది ఫైన్ కట్టడంతో పాటు జైలుశిక్షను సైతం అనుభవించారు. మొదటిస్థానంలో నాగర్కర్నూల్ జిల్లా జిల్లాల వారీగా చూస్తే డ్రంకెన్డ్రైవ్ కే సుల్లో నాగర్కర్నూల్ మొదటిస్థానంలో ఉంది. మొత్తం 2230కేసులు నమోదుకా గా, రూ.42.60లక్షలు జరిమానా విధిం చారు. రెండవ స్థానంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండగా, 1670కేసులు న మోదయ్యాయి. వీరినుంచి రూ.33.40లక్షలు, మూడవ స్థానంలో వనపర్తి జిల్లా లో 1492కేసులు నమోదుకాగా రూ. 29.84లక్షలు, మహబూబ్నగర్ జిల్లాలో 1068 కేసులు నమోదు కాగా, వీరికి నుంచి రూ.18.97లక్షలు జరిమానా విధించారు. ఇదిలాఉండగా, ఇప్పటివర కు జోగుళాంబ గద్వాల జిల్లాలో 700 కేసులు, వనపర్తి జిల్లాలో 100కేసులు, నాగర్కర్నూల్ జిల్లాలో 100కేసులు పెండింగ్లో ఉన్నాయి. యువతపైనే ఎక్కువ కేసులు మద్యం తాగి వాహనం నడపడం కొంతమంది యువకులకు ఓ ఫ్యాషన్గా మారింది. అందులోనూ కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. తల్లిదండ్రులు వారికి అడిగినంత జేబు ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జల్సాలకు అలవాటుపడి మద్యం మత్తులో హద్దుమీరుతున్నారని పలు సందర్భాల్లో స్పష్టమైంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై త రచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. నిత్యం పదుల సంఖ్యలో అమాయకులు మృత్యువాతపడుతున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టిసారింది. గ్రామీణ, పట్టణ, రాష్ట్ర, జాతీయ రహదారులపై విస్తృతం గా తనిఖీలు చేపడుతోంది. వాహనదారుల్లో మార్పునకు కృషి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఎక్కువగా ప్రధాన రహదారులపైనే మద్యం మత్తులో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ చేపడుతుండడంతో ప్రమాదాలు జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే పూర్తిస్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు.– రోహిణి ప్రియదర్శిణి, వనపర్తి జిల్లా ఎస్పీ శిక్ష అనుభవించిన వారు.. ♦ డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వారిలో జైలుశిక్ష అనుభవించిన వారిలో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సుడ్రైవర్ బుచ్చయ్య యాదవ్కు కోర్టు 15రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. అత్యధికంగా 77 మంది జైలుశిక్షను అనుభవించిన వారిలో నాగర్కర్నూల్ జిల్లావాసులే ఉన్నారు. ♦ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏప్రిల్లో ఓ యువకుడు మద్యం తాగి పట్టుబడితే పట్టణంలో రెండు రోజులు ట్రాఫిక్ విధులు నిర్వహించేలా కోర్టు తీర్పు వెలువరించింది. -
స్కూల్ యూనిఫాం వేసుకోలేదని..దారుణం
-
టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం త్వరలో కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేసేందుకు జిల్లాలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా వైఎస్సార్సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానుందన ప్రజలు కసితో రలిగిపోతున్నారని, ఎన్నికలెప్పుడొస్తాయా? ఎప్పుడు ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీకి ప్రజల్లో గుర్తింపు లేదని, తీవ్ర వ్యతిరేకత మధ్య అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అభ్యర్థులు దొరకకే మిత్రపక్షమైన బీజేపీకి అధిక సంఖ్యలో డివిజన్లు కేటాయిస్తుందని, ఆ పార్టీ బలహీనతకు ఇదే నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు. -
ముగ్గురు ఖాకీలపై వేటు
మట్కాబీటర్లతో దోస్తీ ఫలితం.. – గోరంట్ల హెడ్కానిస్టేబుల్ సస్పెన్షన్ – మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వీఆర్కు అనంతపురం సెంట్రల్: మట్కా బీటర్లతో జతకట్టిన ఖాకీలపై ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ కొరఢా ఝుళిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గోరంట్ల పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ మల్లేష్ను సస్పెండ్ చేస్తూ.. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ రవినాయక్, రామకృష్ణలను వీఆర్కు పంపారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయంతో పోలీసు అధికార వర్గాల్లో కలకం రేపుతోంది. గోరంట్లలో పోలీసుల సహకారంతో మట్కా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని లోతుగా విచారించిన అనంతరం జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. గతంలో కూడా మట్కా, బెట్టింగ్ రాయళ్లతో జతకట్టిన పోలీసులపై వేటు పడింది. అయినా కూడా కొంతమందిలో మార్పు రాలేదు. ఈ విషయాన్ని ఎస్పీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదనే సంకేతాలు పంపినట్లైందని పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. -
50మంది పోలీసులకు జైలు శిక్ష
కైరో(ఈజిప్టు): సాధారణంగా ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. ఈజిప్టులో మాత్రం, తప్పు చేస్తే జైలులో పెట్టాల్సిన పోలీసులే జైలుపాలయ్యారు. తమ సెలవు దినాలను తగ్గించారని నిరసనకు దిగారు. అధికారులను బండ బూతులు తిట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెకు దిగిన 50 మంది పోలీసులకు ఈజిప్టులోని ఓ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సెలవు దినాల తగ్గింపుపై 50 మంది దిగువ తరగతి పోలీసు సిబ్బంది జనవరిలో సమ్మెకు దిగారు. దీంతోపాటు వీరు ఉన్నతాధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అంశాలను సీరియస్గా తీసుకున్న దక్షిణ సినాయ్ ప్రొవిన్షియల్ కోర్టు వీరందరికీ మూడేళ్ల జైలుశిక్షతోపాటు 330 డాలర్ల చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించారని ప్రభుత్వ అల్-అహ్రాం వెబ్సైట్ వెల్లడించింది. -
విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్
-
విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్
ముంబై: పాఠశాల నిబంధనలు పాటించలేదన్న కారణంగా విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది హెయిర్ కట్ చేసి తీవ్ర విమర్శల పాలైంది. ఈ వివాదానికి సంబంధించి ముగ్గురు పాఠశాల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబై శివారులోని విఖ్రోలిలో జరిగింది. బాధిత విద్యార్థుల్లో 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారు ఉన్నారు. పాఠశాల నిబంధన ప్రకారం విద్యార్థులంతా పొట్టి జుత్తుతో ఉండాలని కొద్ది రోజుల కిందట పీఈటీ ఆదేశించారు. దాదాపు 25 మంది విద్యార్థులు రూల్స్ పాటించకుండా.. పొడవైన జుత్తుతో పాఠశాలకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన పాఠశాల డైరెక్టర్ గణేష్ బాతా, వ్యాయామ ఉపాధ్యాయుడు మిలింద్ జంకె, ఆఫీసు అసిస్టెంట్ తుషార్ గోరె వీరికి బలవంతంగా జుత్తు కత్తిరించారని పోలీసులు తెలిపారు. ఈ సామూహిక జుత్తు కత్తిరింపులో కొందరు బాలురు కత్తెర కారణంగా గాయాలపాలయ్యారు. ఈ సంఘటనపై కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదుపై శుక్రవారం అర్ధరాత్రి పాఠశాల డైరెక్టర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు చెప్పారు. -
రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలేంటో?
నిబంధనలు పాటించని డెవలపర్లు, ఏజెంట్లకూ జరిమానాలు, జైలు శిక్షలు కూడా మహారాష్ట్ర రెరాలో నమోదు చేయకుండా ప్రకటనలు చేసిన ఓ సంస్థ ∙ రూ.1.2 లక్షల జరిమానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొస్తుంది! మాయమాటలతో కొనుగోలుదాలుదారులను మోసం చేసే డెవలపర్లకు కళ్లెం వేస్తుంది!! .. వంటి ఉపోద్ఘాతాలు కాసేపు పక్కన పెడితే.. అసలు రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే డెవలపర్లకు ఎలాంటి శిక్షలుంటాయి? రెరా వద్ద నమోదు చేయకుండా ప్రకటనలు గానీ విక్రయించడం గానీ చేస్తే ఏమవుతుంది? – సాక్షి, హైదరాబాద్ ప్రాజెక్ట్ను రెరాలో నమోదు చేయకపోతే? నివాస, వాణిజ్య సముదాయాలతో పాటూ ఓపెన్ ప్లాట్లను, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లనూ రెరా వద్ద 90 రోజుల్లోగా నమోదు చేయాల్సిందే. లేనిపక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ఏజెంట్లకైతే ప్రతి రోజూ రూ.10 వేలు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం వరకు పెనాల్టీ ఉంటుంది. నమోదు చేయకుండా విక్రయిస్తే? రెరాలో నమోదు చేయకుండా ఏ స్థిరాస్తినైనా సరే విక్రయించడం గానీ ప్రకటనలు చేయడం గానీ చేయకూడదు. ఒకవేళ చేసిన పక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకూ జరిమానా ఉంటుంది. అయినా కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాతో పాటూ 3 ఏళ్ల వరకూ జైలు శిక్ష తప్పదు. రెరా నిబంధనలు పాటించకపోతే? డెవలపర్లు, ఏజెంట్లు ఎవరైనా సరే రెరా నిబంధనలను లేదా ఆర్డర్లను పాటించకపోతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా ఉంటుంది. ఆర్డర్లను ఉల్లంఘిస్తే? అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను, నిర్ణయాలను దిక్కరించినా లేదా ఉల్లంఘించినా డెవలపర్లకైతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష. లేదా రెండూ విధింవచ్చు. ఏజెంట్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రూ.1.2 లక్షల జరిమానా దేశంలోనే తొలిసారిగా రెరా శిక్షలు మహారాష్ట్రలో మొదలయ్యాయి. చెంబూర్కు చెందిన సాయి ఎస్టేట్ కన్స్ల్టెన్స్.. స్థానిక రెరా వద్ద నమోదు చేయకుండా పలు నివాస ప్రాజెక్ట్లను 12 రోజుల పాటు ప్రకటనలు చేసింది. ఇందుకుగాను మహారాష్ట్ర రెరా సంబంధిత సంస్థకు రూ.1.2 లక్షల జరిమానా విధించింది. రెరా నిబంధనల ప్రకారం.. కొత్త ప్రాజెక్ట్లే కాదు నిర్మాణంలోని ప్రాజెక్ట్లూ రెరా వద్ద నమోదు చేయకుండా విక్రయించడం కాదు కదా కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు. -
నిజాయితీని భయపెట్టిన శిక్ష
ఆలోచనం ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏ పనీ చెయ్యలేదని అర్థం. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరిగిన పొరపాటు శిక్షార్హం కాకూడదు. కొద్దిరోజుల క్రితం నా కూతురు అడిగిన ఒక ప్రశ్నకు నేను, నాకెంతో ఇష్టమయిన చైనా తత్వవేత్త లావో త్సు మాటలు కోట్ చేశాను. ‘నీ ఆలోచనలపై శ్రద్ధపెట్టు ఎందుకంటే అవే నీ మాటలవుతాయి, నీ మాట లపై శ్రద్ధ ఉంచు, అవే నీ చేతలు, నీ చేతలపై శ్రద్ధ ఉంచు అవే అలవాట్లవుతాయి, నీ అలవాట్లను గమనించు, అవే నీ వ్యక్తిత్వంగా మారుతాయి, నీ వ్యక్తిత్వంపై శ్రద్ధ పెట్టు ఎందుకంటే అదే నీ విధిని నిర్ణయిస్తుంది’’ అని. మన ఆలోచనలు నిష్కల్మషంగా ఉంటే మన విధి బాగుంటుందని బొగ్గుగనుల శాఖ మాజీ సెక్రటరీ హరీష్ చంద్ర గుప్తాకి సీబీఐ కోర్టు శిక్ష విధించే వరకు నేను దృఢంగా విశ్వసించేదాన్ని. నిజాయితీపరుడిగా ఖ్యాతిగాంచిన ఈ అధికారి ‘‘నా దగ్గర లాయర్ ఫీజులు ఇచ్చుకునేంత డబ్బు కూడా లేదు’’ అని కన్నీటి పర్యంతం కావడం, అతను వారణాసి వున్న యూపీకి చెందినవాడు కావడం, అతని పేరు సత్య హరిశ్చంద్రని జ్ఞాపకం తెస్తూ ఉండటం చేతననుకుంటా నాకు పదే పదే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్రీయంలోని... తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్సాగిరావేరి కేరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం కరుడే రాజగు రాజే కింకరుడగున్గాలానుకూలంబుగన్’’ అనే పద్యం మదిలో మెదులుతూ, విధి ఎవరికేది రాసి ఉంచిం దో దానినెవరమూ తప్పించజాలం అనే హిందూ కర్మ సిద్ధాంతం వైపునకు నా మనసునుlలాగుతూ ఉంది. నిజానికి కాగ్ మొదట బొగ్గుగనుల కేటాయింపుల గురించి మాట్లాడినపుడు, ఇప్పుడు అనుసరించిన పద్ధతి కాకుండా వేలం పద్ధ తిని అనుసరించి ఉంటే దేశానికి ఇన్ని లక్షలకోట్ల లాభించి ఉండేవని అన్నదేకానీ ఇందులో వీరు అనుమానితులు అని ఎక్కడా అనలేదు. కేసు సీబీఐకి వెళ్లిన తరువాత ప్రస్తుత బీజేపీ పరిపాలనా కాలాన, కోర్టు హెచ్ఎస్ గుప్తా తదితరులకు జైలు శిక్షను ఖరారు చేసింది. చిదంబరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నపుడు రూపొందిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఛీ)(111) ప్రకారం అధికారులు తీసుకున్న చర్యల వల్ల ఎవరైనా ఆర్థిక లాభం పొందితే ఆ అధికారి లంచం తీసుకోకపోయినా అది నేరపూరిత చర్య అవుతుంది. ఐ్కఇలో నేరాన్ని రుజువు చేయడానికి మెన్స్ రియా (mens rea–అపరాధ భావన) ముఖ్యప్రాతిపదిక కాగా ఈ అవినీతి నిరోధక చట్టంలో మెన్స్ రియా లేకపోయినప్పటికీ శిక్ష పడిపోతుంది. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్ఎస్ గుప్తా ఈ చట్టం క్రింద శిక్షార్హుడవటం ఆయన సహచరోద్యోగులను తీవ్రంగా కలతపరిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పనివిధానాలు, అధికారుల బాధ్యతలు, అవి నీతి నిరోధక చట్టం గురించి వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూ ఉంది. కేబినెట్ సెక్రటరీ ర్యాంకులో రిటైర్డ్ అయిన బీకే చతుర్వేది, నరేష్ చంద్ర వంటి వారు హరీష్ చంద్ర సత్యసంధతను ప్రస్తావిస్తూ కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడం గుర్తించాల్సిన విషయం. నరేష్ చంద్ర పెట్రోల్ పంపులు, ఎల్పీజీ కేటాయింపులలో అవకతవకలను గుర్తించి కోర్టు 2002లో అలాటి 3,760 కేటాయింపులను రద్దు చేసిందని, కానీ ఆయా బోర్డుల చైర్మన్లను అరెస్ట్ చేయలేదని, ఆ చైర్మన్లలో చాలామంది రిటైర్డ్ జడ్జీలని ఈ సందర్భంలో జ్ఞాపకం చేశారు. ఒక కార్యానికి నాయకత్వం వహించే వ్యక్తి బాధ్యత అనే కాడెను భుజాన వేసుకుని కార్యరంగంలోకి దిగుతాడు. నాయకుడు దార్శనికుడై ఉండటమే కాదు గోడమీది పిల్లిలా కాకుండా అవసరమొచ్చినపుడు కష్టనష్టాలను అంచనావేసి రిస్కు తీసుకోగల ధీరత్వం కలవాడు కూడా అయి ఉండాలి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ సమయంలో ప్రమాదభరితమయిన పర్వతాలను ఎక్కడమూ, గుర్రపు స్వారీ చేయడమూ, రివర్ రాఫ్టింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. దాని అర్థం వారు అప్పుడప్పుడూ సరదాగా గుర్రపు స్వారీ చేసుకోమని కాదు అవసరమొచ్చినప్పుడు ప్రజారక్షణార్ధం అన్ని విధాలా సిద్ధంగా వుండాలని. నా భర్త జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు గంగానది పోటెత్తి ఊళ్లని ముంచుతూవుంటే ఒక చిన్న తెప్పమీద వరద గంగపై చిన్న దీవి ప్రాంతానికి వెళ్లడం నాకు ఇప్పటికీ ఒళ్లు జలదరించే జ్ఞాపకం. అట్లాగే ఇంతకు ముందు ఎటువంటి విధివిధానాలు రాసి పెట్టి ఉండని బొగ్గుగనుల కేటాయింపులోని నిర్ణయాత్మక స్థానంలో నిలబడిన హరీష్ చంద్ర అతని కార్యవర్గం ఆ నిర్ణయాలను తీసుకున్నారు. ఏ లాభమూ లేని చోటుకి వ్యాపారి రాడు. గనుల కేటాయింపుల్లో వ్యాపారికి లాభం జరిగి ఉండొచ్చు, కానీ దాని కోసమని ఏ గుప్తా లంచం తీసుకున్నట్లు అభియోగాలు కానీ, ఆధారాలు కానీ లేవు. అంతే కాదు, ఆయన ఉద్యోగ చరిత్రలో ఎక్కడా మచ్చ లేదు అయినా కోర్ట్ శిక్ష విధించింది. సంస్కృత న్యాయ సూక్తి కోశంలో ఒక మాట ఉంటుంది ‘‘కాకాక్షి న్యాయము’’ అని కాకి ఒకవైపు మాత్రమే చూడగలదు. అందుకని అది ఏం చూడదలచుకుంటుందో అటువైపే చూస్తుంది. కోర్టు హరీష్ చంద్ర సత్యసంధత చరిత్రను లెక్కలోకి తీసుకోకుండా శిక్షవిధించడం కాకాక్షి న్యాయం కిందికే వస్తుందని ప్రజలు అనుకోవడంలో తప్పులేదు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో అవసరమయినపుడు, చురుకుగా నిర్ణయాలు తీసుకునే అధికారుల అవసరం ఎంతయినా ఉంది. ఏ క్షణం ఏమొస్తుందో, ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం మరో పదేళ్లకు జైలు శిక్ష కాటేస్తుందేమో అనే భీతి అధికారులలోకి ప్రవేశిస్తే వారు రిస్క్ చేయడానికి పూనుకోరు. నిజాయితీ పరుడయిన హరీష్ చంద్ర ప్రస్తుత స్థితి సివిల్ సర్వీస్ అధికారులలో ఈ భయానికి బీజం వేసింది. యూఎస్ఏ 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ "The only man who never makes a mistake is the man who never does anything'' అన్నారు నిజం కదా అసలు ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏపని చెయ్యలేదని అర్థం. హెచ్ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరి గిన పొరపాటు శిక్షార్హం కాకూడదు. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
మలబార్ గోల్డ్పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష
హైదరాదాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందనే ఫొటోలను ప్రచారం చేసిన వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. కోర్టు అది తప్పుడు ప్రచారమని పేర్కొంటూ.. ఈ పనికి పాల్పడ్డ బినిష్ పున్నాకల్ ఆరుముగన్కి బహిష్కరణతోపాటు రూ.44.68 లక్షల జరిమానా విధించిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోషల్ మీడియాను ఉపయోగించుకొని సంస్థలు/వ్యక్తుల కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం. ప్రతివాది మమల్ని క్షమాపణ కోరిన వెంటనే మేం కేసును వెనక్కు తీసుకున్నాం. కానీ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసును కొనసాగించింది. తక్కువ వ్యవధిలో ఉత్తమమైన తీర్పు వెలువరించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎండీ షామ్లాల్ అహ్మద్ పేర్కొన్నారు. -
యాహూ సీఈవోకు బోనస్ కట్
శాన్ఫ్రాన్సిస్కో: సీఈఓ మెరిస్సా మేయర్కు చెల్లించాల్సిన బోనస్లో యాహూ కంపెనీ కోత విధించింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్ అయిన ఘటన నేపథ్యంలో దానిపై విచారణ చాలా ఆలస్యం అయింది. హ్యాకింగ్పై జరిగిన విచారణలో యాహూ ఉద్యోగుల తప్పిదాలేవి లేవు. కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు పలువురు ఉద్యోగులపై యాహూ చర్యలు తీసుకుంది. తాజాగా కంపెనీ సీఈవోకు ఒక ఏడాదికి అందాల్సిన రెండు మిలియన్ డాలర్ల బోనస్ను కట్ చేస్తున్నట్లు యాహూ బోర్డు పేర్కొంది. కంపెనీ బోర్డు నిర్ణయంపై స్పందించిన మెరిసా.. హ్యాకింగ్పై జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలడంతో పొరపాటుకు బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది బోనస్తో పాటు ఈక్విటీ గ్రాంట్ను వదులుకుంటున్నట్లు తెలిపారు. తన బోనస్ను కంపెనీలో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పంచాలని చెప్పారు. మెరిస్సా 2012 నుంచి యాహూ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. వెరిజాన్ సంస్థ గత ఏడాది యాహూను 4.48 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
చిరంజీవి అశ్వత్థామ!
పురానీతి కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి, దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. భీముడు చివరకి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. తొడలు విరిగి, చచ్చిన పులిలా పడున్న దుర్యోధనుడిని చూసి అమితంగా బాధపడ్డాడు. ‘‘ఎలాగైనా సరే, నీకు సంతోషాన్ని కలిగిస్తాను’’ అని శవసాక్షిగా ప్రతిజ్ఞ చేసి, వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లాడు. శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేసి, ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించి, ్రÔ¶ ద్ధాంజలి ఘటించాడు. తెల్లవారింది. ఉపపాండవుల మరణవార్త వ్యాపించింది. పాండవుల శిబిరాలన్నీ దుఃఖంతో గొల్లుమన్నాయి. పాండుపుత్రుల తల్లి ద్రౌపది తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, కుప్పకూలిపోయింది. అర్జునుడు ముందుగా తనను తాను దిటవు పరచుకున్నాడు. తర్వాత మెల్లగా ద్రౌపదిని లేపి, ‘‘పాంచాలీ! సుక్షత్రియ వంశంలో పుట్టి, వీరాధివీరులైన పాండవులకు పత్నిగా ఉన్న నీవు ఇంతగా దుఃఖించడం తగదు. దుర్మార్గుడైన అశ్వత్థామ అర్ధరాత్రప్పుడు దొంగచాటుగా శిబిరంలో దూరి పసిబిడ్డలైన ఉపపాండవులను మరచి తన పొట్టన పెట్టుకున్నాడు. ఇందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నేను ఇప్పుడే వెళ్లి, ఆ ధర్మభ్రష్టుని శిరస్సును ఖండించి తీసుకు వచ్చి, నీ కాళ్లముందు పడవేస్తాను. నువ్వు ఆ నీచుని తలను నీ కాళ్లతో తొక్కి, ఛిద్రం చేసి, నీ శోకాన్ని బాపుకో’’అని ఓదార్చాడు. అర్జునుడి మాటలు విన్న ద్రౌపది మనస్సు కొద్దిగా ఊరట పొందింది. బలంగా ఒక నిట్టూర్పు విడిచి, పక్కనే ఉన్న శ్రీకృష్ణుని వంక భావగర్భితంగా చూసింది. అప్పుడు కృష్ణుడు రథాన్ని సిద్ధం చేసి, అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకుని, ఆ రథానికి పూన్చిన గుర్రాలను అదిలించాడు. దూరంగా వస్తున్న పార్థుడి రథాన్ని చూడగానే అశ్వత్థామ ప్రాణభయంతో పరుగెత్తి సమీపంలోనే ఉన్న ఓ నీటిమడుగులో దాక్కున్నాడు. దిక్కుతోచని స్థితిలో ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనటువంటి మహా శక్తిమంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం వింతకాంతులు చిమ్ముకుంటూ శరవేగంగా అర్జునుడిని సమీపించసాగింది. కృష్ణుడు ‘‘పార్థా! ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనిని ఎదుర్కొనాలంటే తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలి.’’ అని చెప్పాడు. నిప్పులు కక్కుతూ తనమీదకు దూసుకొస్తున్న ఆ అస్త్రాన్ని నిలువరించేందుకు తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ రెండు అస్త్రాలూ ఒకదానినొకటి ఢీకొనడంతో భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు శబ్దాలు వచ్చాయి. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్రమైన అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఉపసంహార మంత్రం పఠిస్తూ ఆ అస్త్రానికి భక్తితో ప్రణమిల్లాడు. వెంటనే రెండు అస్త్రాలూ శాంతించి, అర్జునుడి అమ్ములపొదిలో చేరిపోయాయి. నోరు వెళ్లబెట్టి ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయిన అశ్వత్థామ మీదకు సింహంలా లంఘించి, అతణ్ణి తాళ్లతో బంధించి, రథానికి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ద్రౌపది ముందు పడేశాడు. ‘‘ద్రౌపది అతనికి చేతులు జోడించి, ‘‘శిశువులను చంపడానికి పచ్చినెత్తురు తాగే రాక్షసులు సైతం వెనకాడతారే, అలాంటిది గురుపుత్రులు, ధర్మాధర్మాలు తెలిసిన వారయి ఉండీ కాస్తంత అయినా కనికరం లేక అమాయకులైన పసిబిడ్డలను చంపడానికి మీకు చేతులెట్లా వచ్చాయి? మీ గుండె అంత బండరాయిగా ఎలా మారింది..’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ద్రౌపదిని వారిస్తూ, ‘‘ఉచ్చనీచాలు మరచిన పాషాణం లాంటి ఈ దుర్మార్గుడితో ఇంకా మాటలెందుకు?’’ అంటూ కత్తిదూసి అశ్వత్థామను చంపబోయాడు పార్థుడు. అప్పుడు ద్రౌపది ‘‘వీరాధివీరులైన మీరు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతణ్ణి చంపితే ఇక మీకూ అతనికీ తేడా ఏముంది? దయచేసి వదిలేయండి’’ అంటూ దణ్ణం పెట్టింది. ‘‘మరి నా ప్రతిజ్ఞ ఎలా....’’ అంటున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు, ‘‘పార్థా! ఇతని తల గొరిగి, అతన్ని క్షమించి వదిలెయ్’’ వీరుడికి అది శిరచ్ఛేదంతో సమానం’’ అని చెప్పి, అశ్వత్థామవైపు తిరిగి, ‘‘ఓరీ! నీవు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావుకోసం ఎదురు చూస్తూ ఈ యుగమంతా ఇలాగే జీవిస్తావు’’ అని శపించాడు. అశ్వత్థామ ఆ విధంగా చిరంజీవి అయ్యాడు. నాటినుంచి కురుక్షేత్రంలో చావలేక, చావురాక, క్షణ క్షణం చస్తూ బతుకుతున్నాడు. అయినా, చావుకన్నా అదే సరైన శిక్ష కదా అశ్వత్థామకు. – డి.వి.ఆర్.భాస్కర్ -
కన్నమేస్తే అంతేమరి!
జుహై నగరం: అదో ఎలుక.. ప్రతిరోజు పిల్లిలా శబ్ధం చేయకుండా వచ్చి ధాన్యపు బస్తాలకు కన్నమేసి తినేస్తోంది. దీంతో యజమాని ఉచ్చు బిగించి దాన్ని పట్టుకున్నాడు. అంతటితో సరిపెట్టలేదు. ఆ ఎలుకకి శిక్ష అమలు చేశాడు. ఎవరైనా అదే చేస్తారు. కానీ, అతను కాస్త విచిత్రంగా చేశాడు. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టుకున్న ఎలుక చేసిన నేరాన్ని దాని మెడలో బోర్డులా తగిలించాడు. ఈ ఫోటోలను నెట్లో పోస్టు చేయడంతో నెటిజన్లు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. జుహై నగరంలోని తన కిరాణాదుకాణంలో ఓ ఎలుక ధాన్యపు బస్తాల నుంచి బియ్యం కాజేయడంపై యజమానికి ఆందోళన చెందాడు. తన స్నేహితుడి సాయంతో మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు. దాని మెడలో ఓ బోర్డు తగిలించాడు. మొదటి ఫొటోలో ’నన్ను కొట్టిచంపినా.. బియ్యాన్ని దొంగిలించానన్న నిందను మాత్రం ఒప్పుకోను’ అని ఎలుక దృష్టితో యజమానిని తిడుతున్నట్టు రాయగా.. మరో ఫొటోలో ‘ఇలాంటి సాహసం మళ్లీ వదిలిపెట్టండి’ అని వేడుకుంటూ కామెంట్ రాసి పెట్టారు. వినోదాన్ని పంచుతున్న ఈ పోస్టులను చైనీయులు తెగ షేర్ చేసేస్తున్నారు. -
‘వికీలీక్స్’ మన్నింగ్కు శిక్ష తగ్గించిన ఒబామా
వాషింగ్టన్: అమెరికాకు చెందిన కీలక దౌత్య సమాచారాన్ని లీక్ చేసిన చెల్సియా మన్నింగ్ శిక్షను అమెరికా అధ్యక్షుడు ఒబామా తగ్గించారు. అమెరికా ట్రాన్స్జెండర్ సైనికురాలైన మన్నింగ్(29) ఆ దేశపు కీలక దౌత్యసమాచారం కలిగిన 7,50,000 పేజీలతోపాటు వీడియోలను అపహరించి వికీలీక్స్కు లీక్ చేసింది. ఈ కేసులో 2013లో ఆమెకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీనిప్రకారం ఆమె 2045 వరకు జైలు జీవితాన్ని గడపాల్సి ఉంది. కానీ మన్నింగ్ జైలు శిక్షను తగ్గిస్తూ అధ్యక్షుడు ఒబామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె ఈ ఏడాది మే 17న జైలు నుంచి విడుదల కానుందని అమెరికా శ్వేతసౌధం వర్గాలు బుధవారం వెల్లడించాయి. -
నరేంద్ర మోదీకి ఏ శిక్ష విధించాలి?
న్యూఢిల్లీ: ‘ఒక్క 50 రోజులు ఉపేక్షించండి. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పని తేలితే, ఈ దేశం ఏ శిక్ష విధించినా అనుభవించేందుకు నేను నగర కూడలిలో నిలబడతా. నేను పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే నేను చెప్పా. డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రజలకు సమస్యలు తప్పవని, చెప్పాలేదా? నల్ల కుబేరులను, అవినీతి పరులను శిక్షించేందుకు 50 రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తే, పడలేమా?’ నవంబర్ 13వ తేదీన గోవాలో జరిగిన బహిరంగ సభలో పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భావోద్వేగంతో అన్న మాటలివి. ‘పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 50 రోజుల వరకు తప్పవు. ఒకప్పటికంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉంది. నేను లెక్కలు వేశా. 50 రోజులకు పరిస్థితిలో ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు’ డిసెంబర్ పదవ తేదీన గుజరాత్లో జరిగిన బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలివి. గోవాలో చేసిన వ్యాఖ్యలకు, గుజరాత్లో చేసిన వ్యాఖ్యలకు జాగ్రత్తగా గమనిస్తే ఎంత తేడా ఉందో గ్రహించవచ్చు. 50 రోజుల్లో కష్టాలు తీరిపోతాయని గోవా సభలో అన్నారు. గుజరాత్ సభలో మరో 50 రోజులపాటు ఉంటాయని చెప్పారు. అలా చెప్పడం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో తనకే తెలియదన్నట్లు చెప్పకనే చెప్పారు. భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా మోదీ 50 రోజుల గడువు మాటలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ‘ప్రజల కష్టాలు 50 రోజుల వరకు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి’ అన్నది మోదీ ఉద్దేశమని పార్టీ అధికార ప్రతినిధి శాంబిట్ పాత్ర డిసెంబర్ 30న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. మోదీ గోవాలో చేసిన ప్రసంగ పాఠం ఆయనకు వినిపించగా, హిందీలో అలాగే మాట్లాడుతారని, పలు ఆంగ్ల ఛానళ్లకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్ల మోదీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కూడా ఆయన చర్చాగోష్ఠిలో దబాయించారు. ఏదీ ఏమైనా మోదీ ముందు చెప్పిన గడువు శుక్రవారంతోనే ముగిసింది. నిన్న రాత్రి కూడా దేశంలో మూడింట రెండొంతుల ఏటీఎంలను పనిచేయలేదు. పనిచేస్తున్న ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిచ్చాయి. బ్యాంకుల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. సామాన్యులు, చిల్లర వ్యాపారులు, రైతుల కష్టాలు ఇప్పట్లో తీరుతాయన్న గ్యారెంటీ లేదు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత నల్ల డబ్బు వెలుగులోకి వచ్చింది ? ఎంత మంది నల్లకుబేరుల జాబితాలు బయటపడ్డాయి? ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఎంత మంది రేపు జైలు కెళతారు? ప్రాణ త్యాగాలతో పాటు ఇంతకాలం ఇన్ని కష్టాలు అనుభవించిన ప్రజలకు రేపు ఏం ఒనగూరనుంది? కచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే. లేకపోతే అంతకుఅంత శిక్ష అనుభవించేందుకు మోదీ తానే స్వయంగా చెప్పినట్లు నిజంగా నగరం నడి బజారులో నిలబడతారా? –––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
కింది కోర్టు శిక్షను తగ్గించిన జిల్లా కోర్టు
నరసరావుపేట టౌన్: కిందికోర్టు ఖరారు చేసిన శిక్షను జరిమానాగా సవరిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.జయకుమార్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఆగస్టు 13వ తేదీన గుంటూరు రోడ్డులోని బాపూజీ లెబరేటరీపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయిస్తుండటాన్ని గుర్తించారు. సంబంధిత దుకాణ యజమాని షేక్ ఖాదర్మస్తాన్పై కేసు నమోదుచేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువుకావటంతో మూడేళ్ల జైలు, రూ.55 వేలు జరిమానా విధిస్తూ 2013 ఫిబ్రవరి 19వ తేదీన తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకోగా, వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రూ.1.30 లక్షల జరిమానా విధించి శిక్షను రద్దు చేశారు. -
చెల్లని చెక్కు కేసుల్లో నిందితుడికి జైలు
విజయవాడ లీగల్ : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు, రూ.రూ.2,60, 000 జరిమానా విధిస్తూ ఒకటవ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. నగరంలోని రామలిం గేశ్వరనగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద అదే ప్రాంతానికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి 2013, డిసెంబర్ ఒకటో తేదీన రూ.2,50,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే క్రమం లో శ్రీనివాసరెడ్డి 2014, మే 8వ తేదీన రూ. 2.50లక్షలకు చెక్కు ఇచ్చాడు. అయితే అతని బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కు చెల్లలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. మరో కేసులోనూ శ్రీనివాసరెడ్డికి శిక్ష మరొకరికి కూడా చెల్లని చెక్కు వచ్చిన కేసులో గుర్రాల శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడం తో ఆరు నెలలు జైలుశిక్షతోపాటు రూ.2,30, 000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సూర్యారావుపేటకు చెందిన బి.రాజు వద్ద శ్రీనివాసరెడ్డి 2013, మే 5న రూ.2.50లక్షలు అప్పు తీసుకున్నాడు. అతనికి కూడా చెల్లని చెక్కు ఇచ్చాడు. రాజు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువైంది. న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
భార్యాభర్తలకు ఏడాది జైలు
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్టీఐగా పనిచేస్తున్న ఎం.రజనిపై దౌర్జన్యంచేసి విధులకు ఆటంకం కలిగించిన మహిళా కండక్టర్కు, ఆమె భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ తీర్పుచెప్పారు. ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చి 13న డిపోలో విధులు నిర్వహిస్తున్న ఎస్టీఐ రజనిపై మహిళా కండక్టర్ కంకిపాటి వాణిశ్రీ, ఆమె భర్త గండ్రపు వెంకటేశ్వరరావు దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై రజనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ అనంతరం సోమవారం మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ తీర్పునిస్తూ వాణిశ్రీ, వెంకటేశ్వరరావుకు ఏడాది జైలు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎన్.ప్రగతి వాదించగా కోర్టు కానిస్టేబుల్ ఎ.రమేష్కుమార్ సహకరించారని ఎస్సై చెప్పారు. -
ఎంసెట్ దోషులు తప్పించుకోలేరు : ఎమ్మెల్సీ కర్నె
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ కేసులో దోషులు ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకోలేరని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ప్రతీ అంశాన్ని అంటగట్టి వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. శనివారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత పాలకులు పెంచి పోషించిన లీకేజీ మాఫియా అవశేషాలు ఇంకా వెంటాడుతున్న కారణంగానే ఎంసెట్-2 లీకేజీ జరిగిందని, దీనికి కాంగ్రెస్ కూడా కారణమేనని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. దోషులను కఠినంగా శిక్షించడానికి పీడీ చట్టం కింద కేసులు నమోదు చే యాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఎంసెట్ -2 లీకేజీ వ్యవహరానికి ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని మానుకోవాల ని కర్నె ప్రభాకర్ హితవు పలికారు. -
లీకేజీ ఎన్నాళ్ల నుంచో బయటపడాలి : ఎంపీ వినోద్
కరీంనగర్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో బయటపడబోతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేనిది త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. -
అల్లరి చేశాడని అడవిలో వదిలేశారు!
కారడవిలో ఏడేళ్ల పిల్లాడు.. చుట్టూ క్రూర మృగాలు.. నిద్రాహారాలు లేకుండా ఏడు రోజులు.. వాడి జాడ కోసం 200 మంది సాయుధుల వేట..! పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు తిడతారు లేదా కొడతారు. కానీ వీణ్ని మాత్రం క్రూరమృగాలు తిరిగే అడవిలో వదిలేశారు. ఏడు రోజుల పాటు కారడవిలో దిక్కుమొక్కూ లేకుండా తిరిగిన ఆ ఏడేళ్ల బాలుడ్ని ఎట్టలేకలకు ప్రాణాలతో కనిపెట్టగలిగారు. పేరెంట్స్ పిల్లలకిచ్చే పనిష్మెంట్ లో పరాకాష్టలాంటి ఈ సంఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.. జపాన్ లోని హొక్కయిదో దీవికి చెందిన యమతో తనూక ఏడేళ్ల కుర్రాడు. అందరిలాగే అల్లరి చేసే యమతో ఈ మధ్య కాస్త శృతిమించాడు. రోడ్డుపై వెళ్లేవాళ్లపై, ఆగిఉన్న కార్లపై రాళ్లు విసిరేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో పేరెంట్స్కు చిర్రెత్తుకొచ్చింది. దండనతో గానీ దారికిరాడని యమతోను తీసుకెళ్లి ఎలుగుబంట్లు, హైనాలు సంచరించే కారడవిలో వదిలేశారు. అలా ఏడు రోజులుగా కనిపించకుండా పోయిన పిల్లాడి కోసం ఏకంగా ఆర్మీయే రంగంలోకి దిగింది. భారీ ఆయుధాలతో అడవిలో అణువణువూ గాలించారు. చివరికి అడవిలోని ఓ పాడుబడ్డ ఇంట్లో జవానుకు దొరికాడు యమతో. భయపెట్టాలని భయపడ్డారు.. కొడుకును భయపెట్టాలని అడవిలో వదిలేసిన తల్లిదండ్రులు యమతో అదృశ్యం కావడంతో భయాందోళనకు గురయ్యారు. మొదట.. అడవి పండ్ల కోసం వెళ్లగా తప్పిపోయాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన యమతో పేరెంట్స్ .. చివరికి తాము చేసిన తప్పుడు పనిని పోలీసులకు చెప్పి, ఎలాగైనా కొడుకును కాపాడాలని వేడుకున్నారు. దీంతో ఆర్మీ విభాగమైన సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. 200 మంది సైనికులు ఆరు రోజులపాటు గాలించి సురక్షితంగా ఉన్న యమతోను కనిపెట్టి, ఆసుపత్రికి తరలించారు. బుద్ధి చెప్పడానికని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశామని, ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే యమతో అదృశ్యమయ్యాడని, చుట్టుపక్కల వెదికినా కనిపించలేదని చెప్పుకొచ్చారు అతని తల్లిదండ్రులు. తప్పనిసరైతే పిల్లలను దండించవచ్చేమోగానీ మరీ ఇలా అడవిలో వదిలేయడం లాంటి క్రూరదండనలు మాత్రం సరికాదని హితవు పలికారు ఆర్మీ అధికారులు. -
స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి
కర్నూలు: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఓ వ్యక్తికి బాధితులు దేహశుద్ధి చేశారు. కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్నగర్కు చెందిన హరినాథ్ అలియాస్ శ్రీకాంత్ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరఫున సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా 50 మంది నుంచి నగదు వసూలు చేశాడు. దీంతో లక్ష్మీనగర్ వాసులు ఆదివారం మధ్యాహ్నం అతడ్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
మహిళలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బ్రూక్ఫీల్డ్: అమెరికా అధ్యక్షబరిలో దిగినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారారు. మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భస్రావం చేయించుకునే మహిళలకు శిక్ష వేయాలని అన్నారు. అబార్షన్లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష మాత్రం పడాలని చెప్పిన ఆయన ఆ శిక్ష ఏమిటనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. విస్కాన్సిన్లోని ఓ చర్చా మందిరంలో క్రిస్ మాథ్యూతో చర్చ సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. అయితే, అది ఏ శిక్ష ఎంత తీవ్రతతో ఉండాలని అనే విషయం మాత్రం చెప్పలేదు. ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ గమనించాలని, వాటిని తలుచుకుంటేనే భయంకరంగా, చెత్తగా ఉన్నాయంటూ మండిపడ్డారు. -
బట్టలు విప్పించి బయట నిలబెట్టారు
ముంబయి: ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపనిచేయలేదని ఇద్దరు విద్యార్థులకు ఏ ఉపాధ్యాయులు వేయకూడని శిక్షను వేశారు. ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి తరగతి గదుల బయట నిలబెట్టించారు. అంతేకాకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్ లో కూడా పెట్టారు. ఈ విషయం కాస్త ముంబయి పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు పెట్టారు. ముంబయిలోని మాల్వానికి చెందిన ఓ ట్యూషన్ క్లాస్ కు రెండు, మూడు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు వెళుతున్నారు. వారు తమ టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. దీంతో వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. -
లంచగొండులపై ఉక్కుపాదం:3 లక్షల మందికి శిక్షలు
క్రమశిక్షణా పరిశీలన కమిటీ.. ఈ పేరు వింటేచాలు ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏటా దాదాపు 3 లక్షల మంది లంచగొండి ఉద్యోగుల్ని వల వేసిపట్టుకుని శిక్షలు విధిస్తున్నది ప్రభుత్వం.. అదృష్టవశాత్తు అవి మన ప్రభుత్వాలుకావనుకోండి.. చైనాలో! ప్రభుత్వ పథకాల అమలు, సాధారణ పనుల్లో అవినీతిని రూపుమాపేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కమిటీ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్ పెక్షన్(కేంద్ర క్రమశిక్షణా పరిశీలన సంఘం) సోమవారం వెల్లడించిన నివేదికలో అవినీతి అధికారులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదిలో అవినీతికి పాల్పడిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను పట్టుబడ్డారని, వారిలో 2 లక్షల మందివి చిన్నస్థాయి నేరాలు కావడంతో సాధారణ శిక్షలతోపాటు జరిమానా విధించినట్లు, మరో 80 వేల మందిపై మాత్రం తీవ్రమైన శిక్షలు విధించినట్లు పరిశీలనా సంఘం తన నివేదికలో పేర్కొంది. అవినీతిని విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల కదలికలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సాధారణ శిక్షలు పూర్తిచేసిన్న 2 లక్షల మంది ఉద్యోగులు ఇటీవలి పార్లమెంట్ సమావేశాల సమయంలో విడుదలయ్యారు. ఇంకా జైళ్లలోనే ఉన్న 80 వేల మందిలో పలువురికి మరణశిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ చైనా అధికారిక మీడియాలో ప్రతిరోజూ అవినీతి వార్తలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం. -
మళ్లీ శిక్ష విధించుకున్న హరిబాబు
అద్దంకి: ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మరోసారి తనను తాను శిక్షించుకున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం జడ్పీ హై స్కూల్లో హరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో 15 మంది టీచర్లకు గాను 5 మంది మాత్రమే హాజరయ్యారు. సమయానికి టీచర్లు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ల గైర్హాజరుకు నైతిక బాధ్యత వహిస్తూ పది నిమిషాలు ఎండలో నిలబడి తనకు తాను శిక్షను విధించుకున్నారు. కాగా గతంలో కూడా హరిబాబు ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని జడ్పీ సభ్యులు ఆరోపించడంతో స్పందించిన ఆయన ఎండలో నిలబడి శిక్ష విధించుకున్నారు. ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా తాను తప్పు చేశానని చెబుతూ, అందుకే తనకు తాను శిక్ష వేసుకుంటున్నట్టు అప్పట్లో తెలిపారు. -
డ్రంకెన్ డ్రైవ్ లో 23 మందికి శిక్షలు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : మద్యం మత్తులో వాహనాలు నడిపిన 23 మందికి న్యాయస్థానం శిక్షలు విధించింది. అతిగా మద్యం తాగిన ఒకరికి 72 గంటలపాటు జైలు శిక్ష విధిస్తూ మేడ్చల్ మెట్రోపాలిటన్ సెవెన్త్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అల్వాల్ ట్రాఫిక్ సీఐ నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శని, ఆది, సోమవారాల్లో పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్, సుచిత్ర చౌరస్తా, అల్వాల్ రోడ్డు, ఎన్సీఎల్ సుభాష్నగర్ పైపులైన్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా 23 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిని మంగళవారం మేడ్చల్ కోర్టుకు తరలించగా అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తికి 72 గంటల జైలు శిక్ష, రూ. 3,500 జరిమానా విధించింది. అదే విధంగా మరొకరికి రూ.2,500 జరిమానా, రెండు గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మరో 21 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించి కౌన్సెలింగ్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. -
కాలేజీకి రాలేదని గుంజీళ్లు: ఆస్పత్రిపాలైన విద్యార్థి
పలమనేరు (చిత్తూరు జిల్లా) : రెండు రోజులు కళాశాలకు రాలేదని ఆగ్రహించిన అధ్యాపకుడు విద్యార్థితో 150 గుంజీళ్లు తీయించాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భానుప్రసాద్ గంగవరంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ కళాశాలకు హాజరు కాలేదు. కళాశాల యాజమాన్యం విద్యార్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. కాగా గత శనివారం విద్యార్థి కళాశాలకు వచ్చాడు. దీంతో అధ్యాపకుడు విద్యార్థిని 150 గుంజీళ్లు తీయాలని ఆదేశించాడు. బాలుడు 75 గుంజీళ్లు తీసి కిందపడిపోయాడు. అనంతరం తల్లిదండ్రులు అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతని నడుము పనిచేయక నడవలేకపోతున్నాడు. తిరిగి మూడు రోజుల క్రితం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కళాశాల యాజమాన్యం మాత్రం తమకు జ్వరం విషయం తెలియదని, పిల్లలు బాధ్యతగా ఉండాలనే గుంజీళ్లు తీయించమని చెప్పి ఉంటారని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబుతోంది. -
చేతులకు రక్తం వచ్చేలా..
గ్వాంగ్ డాంగ్: క్రమశిక్షణ పేరిట చిన్నారుల విషయంలో చైనా టీచర్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఏవో కారణాలమూలంగా తరగతులకు హాజరుకాలేని చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సాధారణంగా కాళ్లతో నడవడం అందరు చేస్తే పాఠశాలకు రావడం లేదనే ఆగ్రహంతో ఆ చిన్నారులను చేతులతో నడిపిస్తున్నారు. ఎంతలా అంటే రక్తాలు కారేంతగా.. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్లోని జిజియాంగ్ మిడిల్ స్కూల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడా స్కూల్ క్షమాపణలు చెప్పి వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్ధమైంది. అయితే, తమ పాఠశాలలో అంత కఠిన శిక్షలు అస్సలు విధించమని, విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టడం వల్లే కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటాం తప్ప వారిని వేధించాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. అక్కడి స్థానికులు అధికారులు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. -
పురుషాంగం తొలగించేలా చట్టం తేవాలి
చెన్నై: 'నేను సూచించే శిక్ష ఆటవికమని కొందరు భావిచవచ్చు, కానీ తాము మనుషులమనే విచక్షణ మరిచి క్రూర మృగాల్లా వ్యవహరించే వారికి ఇలాంటి శిక్ష సరైందే. మానవ హక్కులు.. నేరస్తులకు రక్షణ కవచాలు కావనే వాస్తవాన్ని వివిధ సంఘాల నేతలు గ్రహించాలి' అని వ్యాఖ్యానిస్తూ, లైంగిక దాడులకు పాల్పడి చిన్నారుల జీవితాలను చిదిమేసేవారి పురుషాంగాలను తొలగించేలా చట్టం తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్.. కేంద్రానికి సిఫారసు చేశారు. అలాగే ఉన్నత విద్యాబోధనలో సెక్స్ ఎడ్యుకేషన్ను ఒక నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చడంపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 'సంచలన సిఫార్సు'కు నేపథ్యం.. 2011లో తమిళనాడులోని ఓ అనాథ బాలుర శరణాలయాన్ని బ్రిటిష్ జాతీయుడు ఒకయన సందర్శించారు. ఆ శరణాలయంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని ఎంపిక చేసుకుని, లండన్ లో ఉన్నత చదువులు చదివిస్తానని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఢిల్లీలోని వైఎస్సీఏ పర్యాటక గృహంలో ఆ బాలుడిని నిర్బంధించి లైంగికదాడి జరిపి.. తనదారిన తాను ఇంగ్లాండ్ పారిపోయాడు. 2011 ఏప్రిల్ 15వ తేదీన ఈ సంఘటన జరిగింది. బాధిత బాలుడు అందించిన సమాచారం ఆధారంగా 'ఐస్టీస్ అండ్ కేర్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ.. సదరు విదేశీ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదయింది. అయితే.. తనపై కేసు కొట్టేయాలని నిందితుడు బ్రిటన్ నుంచే అప్పీలు చేసుకున్నాడు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ముందుకు ఇటీవల ఈ కేసు విచారణకు వచ్చింది. నిందితుడి అభ్యర్థనను తోసిపుచ్చిన ఆయన.. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ఒక లేఖ రాశారు. చిన్నారులపై లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి తగిన శిక్ష విధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు చాలవని, మరింత కఠిన శిక్షలు అవసరమని పేర్కొన్నారు. ఘాతుకాలను చూస్తూ మౌనంగా ఉండకూడదని, చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన వారికి శస్త్రచికిత్స ద్వారా పురుషాంగాన్ని తొలగించే చట్టాన్ని తీసుకువచ్చేలా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. -
బండరాయితో ఫోన్లు పగలగొట్టించారు
బ్యాంకాక్: నిబంధనలు అతిక్రమించి ఫోన్ తీసుకొచ్చినందుకు థాయ్ నావీ అధికారులు... శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ఓ విచిత్రమైన శిక్ష విధించారు. కాలేజీలు, కార్యాలయాల్లో ముఖ్యంగా ఫోన్ వాడకం విషయంలో మనమైతే... ఎన్ని రకాల రూల్స్ పెట్టినా ఏదో ఒక రకంగా వాటిని బ్రేక్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ రూల్స్ ను పాటించకుండా.. పని వేళల్లో ఫోన్ మాట్లాడితే....ఫోన్ లాక్కొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చేస్తారు. అలానే ఏమౌతుందిలే అనుకున్న థాయ్ లాండ్ నావీలో ట్రైనీలు కూడా పై అధికారులు పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి ఫోన్లు వాడాలనుకున్నారు. అయితే వారికి అధికారులు చుక్కలు చూపించే శిక్ష విధించారు. ఎంతో ఇష్టపడి కొనుకున్న ఫోన్ను బండరాయితో మోది పగలగొట్టాలని.. అధికారులు ఆదేశించడంతో పాపం వేరేదారి లేక అయిష్టంతో వారు ఆ పని చేశారు. అయితే వాళ్లందరూ ఫోన్లను బండతో పగలగొడుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అని అందరూ అనుకుంటుంటే, దీని పై అక్కడ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. 'అంతర్గతంగా మాకు మేమే కొన్ని నిబంధనలు పెట్టుకున్నాము..ఎవరైతే కావాలని రూల్స్ అతిక్రమిస్తారో..వాళ్లతో కావాలనే వారి ఫోన్లను బద్దలు కొట్టిస్తాం' అంటూ బదులు ఇచ్చారు. T -
రేప్ చేస్తారన్న భయంతో...
న్యూఢిల్లీ: ''ప్రేమే నేరమా ? మా అన్న, అగ్రవర్ణ యువతి ప్రేమించుకోవడం పాపమా ? అందుకు మేము బలి పశువులం అవుతున్నాం. 15 ఏళ్ల చెల్లిని, నన్నూ రేప్ చేయాల్సిందిగా మా ఊర్లో ఖాప్ పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఊరికి దూరంగా దిక్కులేని వాళ్లుగా మేమూ, మా కుటుంబం బతుకుతోంది. ప్రేమించిన పాపానికి.... మా అన్న చేయని నేరానికి అరెస్టై జైల్లో బతుకుతున్నాడు. మేము ఊరెళ్లాలంటే ఎక్కడ రేప్ చేస్తారేమోనని అణుక్షణం భయంతో చస్తున్నాం. ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఊరికెళితే మాకు రక్షణ లేదు. రేప్ చేసే మూకలు మా కోసం కాచుకు కూర్చున్నాయి. వారి కంటపడితే ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేస్తారు. వారి కట్టుబాటు, సంస్కారం అలాంటిది. ఇక్కడ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల్లా గుట్టు చప్పుడు కాకుండా ఎంతకాలం బతకాలి, ఎలా బతకాలి? మా పరిస్థితి, మా నరక యాతన గురించి ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి, మానవ హక్కుల కమిషన్కు, షెడ్యూల్డ్ కులాల కమిషన్కు లేఖలు రాశాం. ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు రక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. కేసు విచారణలో ఉంది'' అని 23 ఏళ్ల మీనాక్షి కుమారి తన గోడును మీడియా ముందు వెల్లబోసుకుంది. ఆమెది దళిత కుటుంబం. వారిది ఉత్తరప్రదేశ్లోని భాగ్పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామం. ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామంలో జాట్లు ఏడువేల మంది ఉండగా, దళితులు 250 మంది ఉన్నారు. మీనాక్షి అన్న 25 ఏళ్ల రవి కుమార్ రెండేళ్ల క్రితం జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల కృష్ణ గాఢంగా ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటే జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన రవి కుమార్ కుటుంబం అందుకు వారించింది. వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన రవి కుమార్ వేరే పెళ్లి చేసుకోవాల్సింది తాను ప్రేమించిన యువతి కృష్ణకు నచ్చచెప్పాడు. వారి ఇంట్లో వాళ్లు కూడా ఆమెను తీవ్రంగా హింసించారు. దాంతో ఆమె హర్యానా రాష్ట్రానికి చెందిన వారి కులస్థుడినే పెళ్లి చేసుకొంది. అతనితో కాపురం చేయలేక కొంతకాలానికి ఊరికి పారిపోయి వచ్చింది. పాత ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసిన జాట్ కులస్థులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసుల చేత రవి కుమార్ను కొట్టించారు. మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మీరట్ జైలుకు పంపించారు. ఊరిలో ఖాప్ పంచాయతీ సమావేశమై రవి కుమార్ ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాలని, వారి మొఖాలకు మసిపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పింది. అదృష్టవశాత్తు అదే సమయంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు మీనాక్షి కుటుంబ సభ్యులందరూ ఢిల్లీకి వచ్చి ఇక్కడే ఉన్నారు. మీనాక్షి పెద్దన్నయ్య సుమిత్ కుమార్ ఢిల్లీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఊరి నుంచి పొరుగింటి వారు ఫోన్ చేసి ఖాప్ పంచాయతీ తీర్మానం గురించి తెలిపారు. ఊరికి రావద్దని సలహా ఇచ్చారు. దాంతో సుమిత్ కుమార్ ఢిల్లీ శివారులో ఓ గుర్తు తెలియనిచోట కుటుంబ సభ్యులను ఉంచారు. మే నెలలో అరెస్టైన రవి కుమార్కు జూన్ 26వ తేదీన బెయిల్ వచ్చింది. బయటకు వస్తే ప్రాణాపాయం ఉండడంతో రవి కుమార్ బెయిల్పై విడుదల కాకుండా మీరట్ జైల్లోనే ఉంటున్నాడు. మీనాక్షి కుటుంబం రక్షణ కోసం న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీం కోర్టులో కేసు వాదిస్తున్నారు. ఖాప్ పంచాయతీలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ వాటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. రవికుమార్పై మోపిన అభియోగాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, అన్యాయంగా వ్యవహరించిన గ్రామ పెద్దలపై, యూపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని తాను కోరుతున్నానని చెప్పారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సుప్రీం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. -
ప్రాణాలు తీస్తున్న పోలీసుల థర్డ్ డిగ్రీ
-
తాగి వాహనాలు నడిపేవారికి ఇదే శిక్ష
-
అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
-
టీచర్ పనిష్మెంట్ ప్రాణం తీసింది
హోంవర్క్ చేయలేదని విద్యార్థినికి రెండు గంటలపాటు శిక్ష ⇒అస్వస్థతకు గురై వారం రోజులకు చిన్నారి మృతి ⇒కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వివేకవర్ధిని పాఠశాల నిర్వాకం ⇒స్కూలు ముందు చిన్నారి శవంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆందోళన ⇒పాఠశాలపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ⇒30లోపు నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు హుజూరాబాద్ టౌన్: హోంవర్క్ చేయని పాపానికి టీచర్ విధించిన శిక్ష ఓ చిన్నారిని బలిగొంది! పసిపాప అని కూడా చూడకుండా ఏకంగా రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించింది ఆ ఉపాధ్యాయురాలు. చిన్నారి బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొలిపాక సమ్మయ్య, రమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అక్షిత(12), అశ్రీత(10). సమ్మయ్య ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తా. రమ రజక వృత్తి చేస్తారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఇద్దరినీ పట్టణంలోని వివేకవర్ధిని అనే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. అక్షిత ఆరో తరగతి, అశ్రీత ఐదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 16న స్కూల్లో గణితం బోధించే కళావతి అనే టీచర్.. హోంవర్క్ చేయలేదంటూ అశ్రీతను రెండు గంటల పాటు కదలకుండా మోకాళ్లపై నిల్చోబెట్టింది. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన అశ్రీత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కొద్దిసేపటికే మోకాళ్ల నొప్పి భరించలేక అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. స్కూలు కరస్పాండెంట్ ప్రసాద్ విద్యార్థిని ఇంటికి వచ్చి వరంగల్లోని ఓ ప్రైవేట్ హోమియోపతి ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో వారు ప్రసాద్ చెప్పిన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేరుుంచారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అశ్రీత గురువారం ఉదయం 7 గంటలకు మృతి చెందింది. అశ్రీత మృతి వార్త తెలియడంతో గురువారం పాఠశాలను తెరవలేదు. మృతదేహంతో స్కూలు ముందు ఆందోళన.. అశ్రీత మృతికి టీచరే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాధానం చెప్పేవారు ఎవరూ లేకపోవటంతో ఆగ్రహంతో తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎనిమిది గంటల పాటు ఆందోళన చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ పాఠశాలకు వచ్చి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. శాంతించిన బంధువులు పోస్టుమార్టం బాలిక మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రతి విద్యార్థికి దండనే? వివేకవర్ధిని పాఠశాలలో హోంవర్కులు చేయకున్నా, సమయానికి రాకున్నా విద్యార్థులకు దండన తప్పడం లేదు. గుంజీలు తీయించడం, గోడ కుర్చీ వేయడం, మోకాళ్లపై నిలబెట్టడం, బెత్తం దెబ్బలు వంటి పనిష్మెంట్ ప్రతి రోజు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 30లోగా నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అశ్రీత మృతికి గల కారణాలను తెలుసుకుని ఈనెల 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవోలకు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. స్కూళ్లల్లో పాఠాలు చెప్పేవారే రాక్షసులుగా మారి పిల్లల ప్రాణాలను బలితీసుకోవడం వంటి చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. -
చెత్త బయట వేస్తే జరిమానా
స్వచ్ఛ భారత్ పటిష్ట అమలుకు కొత్త చట్టం న్యూఢిల్లీ: ఆరు బయట చెత్త వేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తున్నారా? పాన్లు నమిలి రోడ్డుపై ఉమ్మి వేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. లేదంటే జరిమానా, శిక్ష తప్పదు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు న్యాయపరమైన మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు న్యాయ శాఖ బిల్లును తయారు చేస్తోంది. కానీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో చట్టం అమలు సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కేంద్రం వెలుసుబాటు కల్పిస్తోంది. అయితే పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే వాటికి పరిధి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో స్వైన్ఫ్లూ వస్తే అది దేశం మొత్తం వ్యాపిస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అక్కడికక్కడే చలానాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నట్లే దీని విషయంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే జరిమానా వేయనున్నారు. -
శిక్ష పూర్తయినా వీడని ‘చెర’
గుర్తింపు చూపకపోవడంతో పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్న భారత ఖైదీలు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల క్రితం పాకిస్తాన్కు వెళ్లి వివిధ కేసుల్లో అరెస్టయి జైల్లో మగ్గుతున్న ఖైదీలు శిక్ష పూర్తయినా చెరసాలను వీడే అవకాశం రావడం లేదు. తమ జాతీయతను నిరూపించే గుర్తింపు పత్రాలను చూపని కారణంగా అక్కడి అధికారులు వారిని జైళ్ల నుంచి విడుదల చేయడం లేదు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ జైల్లో శిక్ష పూర్తి చేసుకున్న 22 మంది ఖైదీల చిత్రాలను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయ అధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. వీరు శిక్ష పూర్తి చేసుకున్నా...జాతీయతను గుర్తించని కారణంగా ఇంకా జైల్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. కాగా ఖైదీల ఫొటోలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్కు కూడా పంపించారు. ఈ ఫొటోల ఆధారంగా ఎవరైనా తమవారు ఉన్నారని భావిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో పురానాహవేలిలోని ఓల్డ్ కమిషనర్ ఆఫీసులోని స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసును కలవాలని స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ఖాన్కు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష ఖరారవడం నగరవాసుల్లో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ హీరోల్లో బహుశా ఎవరికీ లేనంత అనుబంధం సల్మాన్ఖాన్కి సిటీతో ఉంది. సల్లూభాయ్ నగరానికి వస్తే చాలు అతడిని చూడడానికి ఎగబడతారు. తన సినిమాలను సూపర్హిట్ చేయడంలో రికార్డులు సృష్టించిన జోధ్పూర్ వంటి నగరాలను దాటి సల్మాన్ మన హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి అభిమానులు సల్మాన్ మానియాకు కేరాఫ్గా నిలిచారనేది అధికారికంగా రూఢీ అయిన విషయం. అందుకే.. ‘సల్లూభాయ్ వుయ్ లవ్ యు’ అంటూ సిటీ సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి క్రేజ్కి కేరాఫ్ సల్లూభాయ్ సల్మాన్కి సిటీ అంటే మహా ఇష్టం. హైదరాబాద్లో సినిమా షూటింగ్స్ అంటే ఇష్టపడేవాడని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారు. తెలుగు నటి భూమికాచావ్లాతో నటించిన ‘తేరేనామ్’ ఇక్కడి సిటీ కాలేజ్లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఇంకా ‘వాంటెడ్’ తదితర సినిమాలూ షూటింగ్ జరుపుకున్నాయిక్కడ. మన బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా సల్మాన్కి చాలా ఇష్టం. తన సోదరి అర్పిత పెళ్లి నగరంలోని ఫలక్నుమా ప్యాలెస్లో చేయడం సిటీ మీద సల్మాన్కి ఉన్న అభిమానానికి నిదర్శనం. సల్మాన్ హోస్ట్ చేసిన టీవీ షో ‘బిగ్బాస్’లో తొలి కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ఖాసిఫ్ ఖురేషి నగరవాసే. సిటీలోని సబేరీ కళ్లజోడు షోరూమ్కి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి నడుడికి శిక్ష పడడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందరికీ మంచి చేసే వ్యక్తి.. పలు ఈవెంట్స్తో పాటు అర్పిత మ్యారేజ్కు సల్మాన్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా పనిచేశా. సీసీఎల్ ఆఫ్టర్ పార్టీలో సంతోష్నగర్కు చెందిన బౌన్సర్ రఫీఖ్.. సల్మాన్ని ఆర్మ్ రెజ్లింగ్లో ఓడించాడు. దీనికి ఏ మాత్రం ఫీలవ్వకపోగా, అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రశంసించాడు. తన దగ్గర పనిచేసేవారిని సల్లూభాయ్ బాగా చూస్తాడు. అందరికీ మంచి చేసే వ్యక్తికి శిక్ష పడడం వేదనకు గురిచేసింది. - మహ్మద్ అబ్రార్, సల్మాన్కు సిటీలో సెక్యూరిటీ చాలా మారిపోయాడు.. చాలా బాధగా ఉంది. సిటీకి సల్మాన్ ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూసేవాడిని. తనని చూసే రెగ్యులర్గా బ్రాస్లెట్ వాడుతున్నా. హీరోగా ఎంత మంచి నటుడో.. వ్యక్తిగా అంత సహృదయుడు. ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ వంటి చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఐదేళ్ల ఖైదు వల్ల సినిమాలకు మాత్రమే కాదు.. ఆయన్ను నమ్ముకున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత తను చాలా మారాడు. వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఒక అభిమానిగానే కాకుండా ఆయన కారణంగా సాయం పొందుతున్న వారి తరపున ఆలోచించి బాధపడుతున్నా. - అహ్మద్ఖాన్, ఈవెంట్ కో ఆర్డినేటర్ రియల్ ‘హ్యూమన్’ సల్మాన్ చిన్నప్పటి నుంచీ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు కలవాలనుకున్నా కుదర్లేదు. అతను చేసే చారిటీ కార్యక్రమాలు నాలో మరింత అభిమానాన్ని పెంచాయి. అలాంటిది.. అతనికి ఇలా శిక్ష పడడం చాలా బాధగా అనిపిస్తోంది. తన వల్ల చాలా మంది చిన్నారులు సేవ్ అయ్యారు. దేవుడు అతనికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. - ప్రత్యూష, సిటీ మోడల్ -
భోజనాలకు పిలవలేదని...
చీరాల (ప్రకాశం జిల్లా) : ఆధునిక సమాజంలో ఆటవిక న్యాయమిది. స్వల్ప కారణంతో దురాయి పేరిట కులపెద్దలు వేసే జరిమానాలు చెల్లించలేక పల్లె వాసులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బాయపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు అక్కడికి సమీపంలో ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు చెందిన క్రిస్టల్ సీ ఫుడ్ కంపెనీలో కూలి పనులకు వెళ్తుంటారు. కంపెనీ ప్రారంభం రోజు ఫిబ్రవరి 27వ తేదీన నిర్వాహకులు కంపెనీలో పనిచేస్తున్న 20 మత్స్యకార కుటుంబాలను భోజనాలకు ఆహ్వానించారు. అయితే గ్రామస్తులందరినీ కాకుండా కొందరినే భోజనాలకు పిలవటం కులపెద్దలకు కోపం తెప్పించింది. ఆ ఇరవై కుటుంబాల వారిని కూడా వెళ్లవద్దని తీర్మానించారు. కానీ వారు దాన్ని ధిక్కరించి భోజనాలకు వెళ్లారు. అదే వారి పాలిట శాపమైంది. తమ మాట కాదన్నందుకుగాను పంచాయితీ పెట్టి, అందరికీ కలిపి రూ.10 వేలు దురాయి (జరిమానా) విధించారు. నెల రోజులైనా ఆ సొమ్ము కట్టకపోవడంతో గత గురువారం మళ్లీ కులపెద్దలు వారిని పిలిపించారు. ఇదేమిటని ప్రశ్నించిన కొందరిని కొట్టారు. భయపడిన ఆరుగురు గ్రామస్తులు గ్రామం నుంచి పారిపోయి పక్కనే ఉన్న కఠారివారిపాలెం పెద్దలను కలిసి విషయం వెల్లడించారు. దీంతో ఆ పరిధిలో ఉన్న మత్స్యకార గ్రామాల కులపెద్దలు శుక్రవారం 20 కుటుంబాల వారిని పిలిచి కులపెద్దలు వేసిన జరిమానా సరైనదేనని తేల్చారు. కట్టుబాటును పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.8 వేల చొప్పున 20 కుటుంబాల వారికీ జరిమానా విధించి నెల రోజుల్లో చెల్లించాలని హుకూం జారీ చేశారు. కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే తమకు రూ.8 వేలు చెల్లించే స్థోమత లేదని బాధిత కుటుంబాల వారు వాపోతున్నారు. -
టీచర్ కఠిన దండన : విద్యార్థి తలకు గాయం
పిఠాపురం :ఓ టీచర్ విచక్షణ కోల్పోయి కఠిన దండనకు దిగడంతో ఓ విద్యార్థి తలకు బలమైన గాయమైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురంలో ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న మేకా కామేశ్ (11) అనే విద్యార్థి తలపై టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమైంది. వెంటనే బాలుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్కు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ ప్రారంభించారు. -
స్కూల్కి ఆలస్యంగా వస్తారా ?
హైదరాబాద్: నగరంలో కృష్ణా నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కి ఆలస్యంగా వచ్చిన 25 మంది చిన్నారులపై బుధవారం స్కూల్ యాజమాన్యం ఆగ్రహం ప్రకటించింది. స్కూల్కు ఆలస్యంగా వస్తారా అంటూ చిన్నారులతో గుంజీలు తీయించింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ చిన్నారి విద్యార్థులను టీచర్లు తరగతి గది బైట మూడు గంటలపాటు నిలబెట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో విద్యార్థులు కాళ్ల వాపు, జర్వంతో బాధపడుతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని స్కూల్ యాజమాన్యంతో వాదనకు దిగారు. -
ఈ కాలమ్ మీదే చర్చా వేదిక
పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com కొద్దిమంది కాదు... చా...లా మంది! యువతరం అంటే నిప్పుకణికలా ఉండాలి. శ్రీశ్రీ అన్నట్లు ‘నెత్తురు మండే... శక్తులు నిండే’ వాక్యంలా ఉండాలి. కదులుతున్న ఉద్యమంలా ఉండాలి. కానీ నేటి యువతను చూస్తే బాధగా ఉంది. మారోజుల్లో అయితే... పుస్తకాలు విపరీతంగా చదవడం, వాటి గురించి చర్చించుకోవడం, కొత్త పుస్తకం ఏదైనా వస్తే దాని గురించి ఆరా తీయడం, సామాజిక సమస్యలపై ఉద్యమాలు చేయడం, సృజనాత్మక రచనలు చేయడం... ఇలా ఉండేది. కానీ, ఇప్పటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. నలుగురు యువకులు ఒకచోట కూర్చున్నారంటే... కొత్తగా విడుదలైన సినిమా గురించి మాట్లాడుకోవడం తప్ప ఏమీ ఉండడం లేదు. పుస్తకాలు చదవడం అనేది కలలో మాట. ఇక ‘సామాజిక సమస్యలు’ అనేవి వారికి సంబంధించినవి కావు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఇక సృజనాత్మక రచనల విషయానికి వస్తే... ప్రేమ కవితలు రాయడం, సినిమా కథలు రాయడాన్నే... సృజనాత్మకత అనుకుంటున్నారు. ఈ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ‘కొద్ది మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అన్నారు అప్పుడు శ్రీశ్రీ. ఇప్పుడు ‘కొద్ది’ స్థానంలో ‘చాలా మంది’ అనుకోవాలేమో! ఈ పరిస్థితి మారదా? మారాలంటే ఏం చేయాలి? - వఝల మోహన్రావు, కూకట్పల్లి, హైదరాబాద్ చెట్లను కూల్చేసే చాదస్తాలు అవసరమా? ఈమధ్య కాలంలో చాలామందికి వాస్తుపిచ్చి పట్టుకుంది. ఇది గమనించి రెడీమేడ్గా వాస్తునిపుణులు పుట్టుకొస్తున్నారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ఇంటికి ఎవరినైనా వాస్తు నిపుణుడిని పిలిస్తే... కచ్చితంగా ఏదో ఒక మార్పు చెబుతున్నాడు. సరే, చిన్న చిన్న మార్పులు అంటే ఏదో పోనీలే... అనుకోవచ్చు. వారు చేసే కొన్ని సూచనల వల్ల పచ్చటి చెట్లు నాశనం అవుతున్నాయి. తద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. చాలా కాలం తరువాత మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల ఇంటి దగ్గర్లో పెద్ద వేపచెట్టొకటి ఉండేది. ఆ వేపచెట్టుతో నా బాల్యజ్ఞాపకాలు ఎన్నో ముడిపడి ఉండేవి. అసలు మా పెద్దమ్మ వాళ్ల ఇల్లు అనగానే... ఆ వేపచెట్టు తప్పకుండా గురొస్తుంది. ఇంటి అడ్రస్ చెప్పడానికి కూడా ఆ పెద్ద వేపచెట్టు కొండ గుర్తుగా ఉండేది. కానీ మొన్న చూస్తే... ఆ చెట్టు నరికివేయబడి ఉంది! నాకైతే ఏడుపొచ్చినంత పనైంది. ‘‘ఎందుకిలా చేశారు?’’ అని పెద్దమ్మను ఆవేదనగా అడిగాను. ‘‘అక్కడ చెట్టు ఉంటే అరిష్టమని... వాస్తు చూసే పెద్దమనిషి చెప్పాడురా. నిజంగానే, రెండు సంవత్సరాల నుంచి ఇంటికి శని పట్టుకుంది. అందుకే వేపచెట్టును కొట్టేయించాము’’ అని చెప్పింది. ‘‘ఇదెక్కడి మూఢత్వం? చెట్టు ఏ దిశలో ఉంటే ఏమిటి? అది ఏ దిశలో ఉన్నా... మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు’’ అని నా ఆవేదనను వెళ్లగక్కాను.మా పెద్దమ్మ మాత్రం పెద్దగా స్పందించలేదు. ‘‘మీ చదువుకున్న వాళ్లు అంతా ఇలానే మాట్లాడతారు’’ అన్నది పెద్దమ్మ. ఆమె మాటలు ఎలా ఉన్నా... ఇప్పటికీ ఆ చెట్టు గుర్తుకు వచ్చి దుఃఖం వస్తుంది. మనం ఏ కాలానికి ప్రయాణిస్తున్నాం?!! - డి.ఆర్.అర్జున్కుమార్, అనంతపురం కొంత ‘అతి’ ఉంది... కొంత ‘నీతి’ ఉంది! ఆ మధ్య ‘పీకే’ సినిమాపై చాలా వివాదమైంది. ‘‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అన్నవాళ్లూ ఉన్నారు, ‘‘అలాంటిదేమీ లేదు. ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లు చూపారు’’ అన్నవాళ్లు ఉన్నారు. ఏదీ వాస్తవమో ఏదీ అవాస్తవమో తెలియదు. ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు. ఇక లాభం లేదనుకొని ఒక రోజు సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. అలా... సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడని నేను, వీలు చూసుకొని ‘పీకే’ చూశాను. చాలా పెద్ద హిట్ అయినట్లు ఆ సినిమా గురించి చెబుతున్నారు. నిజానికి కథాబలం పెద్దగా లేని సినిమా. ఇలాంటి వస్తువుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కథనే ప్రామాణికంగా తీసుకుంటే నిజానికి అంత పెద్ద హిట్ కావాల్సిన సినిమా కాదు. స్టార్ డెరైక్టర్, స్టార్ హీరో కాంబినేషన్తో పాటు... వివాదం కూడా ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించాయి. కొన్ని సన్నివేశాలు సూక్ష్మంగా నీతిని బోధిస్తున్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా భక్తిని వ్యాపారం చేసుకునే వారిపై వేసిన చురకలు బాగున్నాయి. అయితే అది ఒక్క మతానికే పరిమితం చేయడం బాలేదు. - రావిపెద్ది అశోక్బాబు, విజయవాడ. కఠిన శిక్షలు ఉండాలి! ధూమపానం అనేది... అది సేవించే వాళ్లకి మాత్రమే ప్రమాదం కాదు... ఆ పరిసరాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రమాదమే. కొందరి వల్ల ఇతరులు అనారోగ్యం పాలు కావడం అనేది ఏ రకంగా కూడా సమంజసం కాదు. సుతిమెత్తగా చెబితే వినే రోజులా ఇవి! అందుకే శిక్షలు కఠినంగా ఉండాలి. ఒక్కసారి సిగరెట్ తాగిన వాళ్లు - ‘‘ఇక జన్మలో సిగరెట్ తాగను బాబోయ్’’ అనే పరిస్థితి తెప్పించాలి. అప్పుడుగానీ పరిస్థితిలో మార్పు రాదు. ఇది నిజం. - డి. సుభాషిణి, శ్రీకాకుళం -
రిటైర్డ పవర్
విశ్రాంత ఉద్యోగులా..మజాకా? అర్బన్ ఠాణాలో అడ్డా అవినీతికి నిలయంగా పోలీస్స్టేషన్ పైసలిస్తేనే ఫైళ్లకు మోక్షం వారంటే అధికారులకు హడల్ డీఎస్పీ స్థారుు వ్యక్తులకు కూడా ముచ్చెమటలు ఎస్పీ దృష్టిసారిస్తే మేలు మచ్చుతునక.. గీసుకొండ ఠాణాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్కు రైల్వేశాఖకు బదిలీ అరుుంది. ఇది ఇష్టం లేని సదరు కానిస్టేబుల్ రిటైర్డ్ ఉద్యోగులను ఆశ్రయించాడు. రూ.10 వేలు తీసుకుని పోస్టింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. మరో స్టేషన్లోని కాని స్టేబుల్ను రైల్వేశాఖకు బదిలీ చేశారు. పోస్టుకో డిమాండ్.. ఇంక్రిమెంట్కు రూ.1000 నుంచి రూ.2 వేలు, పనిష్మెంట్ చార్జిషీట్కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, పేబి ల్స్కు రూ. 2వేల నుంచి రూ.5 వేలు, బదిలీల్లో పోస్టింగ్ డిమాండ్ను బట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. వరంగల్ క్రైం : హన్మకొండ అర్బన్ పోలీసు కార్యాల యం విశ్రాంత ఉద్యోగులకు అడ్డాగా మారిం ది. అవినీతికి ఆలవాలంగా తయారైంది. వారు ఎంత చెబితే అంతే. బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ కావాలన్నా వారి చేయి తడపాల్సిందే. వారు పదవీ విరమణ పొందినా తాత్కాలిక ఉద్యోగులు పవర్ చూపిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జిల్లాలో ‘ఎవర్ విక్టోరియస్’గా ఉన్న పోలీసు సిబ్బందికి కూడా చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి అవిశ్రాంత ఉద్యోగులపై కథనం.. ఠాణాలో 15 మంది.. వరంగల్ అర్బన్ పోలీసు కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి గతంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. డ్రాఫ్టింట్ విభాగంలో వీరిది అందవేసిన చేరుు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయూలి. అపార అనుభవంతో విశ్రాంత ఉద్యోగులు లాబీయింగ్ చేసి కీలక విభాగాల్లో అడ్డా వేశారు. వీరు రావడం అప్పట్లో వివాదాస్పదం అరుునప్పటికీ తర్వాత సద్దుమణగడంతో కొనసాగుతున్నారు. ప్రతీ పనికి పైకం అర్బన్ పోలీసు కార్యాలయంలోని కీలక విభాగాలైన బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ పనికోసం వీరు నియమితులయ్యారు. ఇవి సిబ్బందికి సర్వీసు పరంగా కీలకంగా నిలుస్తాయి. వీటిలో ప్రతీ ఉద్యోగి రిమార్కులు లేకుండా చూసుకోవాలని చూస్తారు. దీనిని ఆసరా చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులు పైలసివ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. 65 నుంచి 70 ఏళ్ల వయసు ఉండి.. నెలకు రూ.40 వేల వరకు పింఛన్ తీసుకుంటున్న ఈ రిటైర్డ్ ఉద్యోగులు కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ, డీఎస్పీ వ్యక్తులు పని కావాలంటే చేరుు తడపాల్సిందే. కాగా, జిల్లాలోని వివిధ ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ పోలీసు కార్యాలయూనికి వచ్చే సరికి రక్షణ లేకుండా పోతుంది. ఎస్సై, సీఐ ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్ చెల్లింపులలో చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసు శాఖను అవినీతికి చిరునామాగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటికైనా అర్బన్ కార్యాలయంలో నెలకొన్ని అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవరసం ఎస్పీ అంబర్ కిషోర్ఝాపై ఉందని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
వారికి కావాల్సింది శిక్ష కాదు..కౌన్సెలింగ్
కతువా: జీవితాన్ని ముగించుకోవాలంటూ తీవ్రచర్యలకు పాల్పడే వ్యక్తులను శిక్షించరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐపీసీ నుంచి ఆత్మహత్యా నేరం తొలగింపుపై ఆయన శనివారమిక్కడ పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారికి కావాల్సింది శిక్ష కాదని, సరైన కౌన్సెలింగ్ అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మహత్యాయత్నం నేరం కాదని ...ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే. -
ఖాకీల కొత్త మార్క్
* విధుల్లో నిర్లక్ష్యంపై ఉక్కుపాదం * సస్పెన్షన్లు, పనిష్మెంట్లతో ప్రక్షాళన * పోలీస్ అక్రమార్కుల్లో వణుకు * పెండింగ్ మిస్టరీలపైనా నజర్ వేయూలని బాధితుల వేడుకోలు * క్రమశిక్షణకు పోలీస్ బాస్ల పెద్దపీట వరంగల్ క్రైం : పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి, రూరల్ జిల్లా ఎస్పీతోపాటు ఇన్చార్జీ అర్బన్ ఎస్పీగా విధుల్లో చేరిన అంబర్ కిషోర్ ఝా తమదైన శైలిలో ముందుకు సాగుతూ ‘కొత్త మార్క్’ను ప్రదర్శిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ సిబ్బందిపై సత్వర చర్యలు తీసుకుంటూ శాఖను గాడిలో పెడుతున్నారు. నవంబర్ 3న డీఐజీగా బి.మల్లారెడ్డి, అక్టోబర్ 30న ఎస్పీగా అంబర్ కిషోర్ఝా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలంగా ఇక్కడే ఓఎస్డీగా పనిచేస్తూ ఎస్పీగా పదోన్నతిపై వచ్చిన కిషోర్ఝాకు జిల్లాలోని పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దీంతోపాటు వరంగల్ జిల్లాలో పనిచేసిన అనుభవం డీఐజీకీ ఉంది. ఈ క్రమంలో వస్తూవస్తూనే జిల్లా పోలీస్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో అర్బన్, రూరల్ ఎస్పీలుగా వెంకటేశ్వర్రావు, కాళిదాసు ఉన్న సమయంలో పోలీస్ శాఖలో ఇరు విభాగాల మధ్య విభేదాలు పొడచూపాయి. అవి తారాస్థాయికి చేరి.. ఒకరి కంటే ఒకరిది పైచేయిగా నిలవాలనే పోటీ నెలకొంది. ఫలితంగా పోలీసు శాఖలో క్రమశిక్షణ కొరవడింది. ఉన్నతాధికారుల మధ్యే పొరపొచ్చాలు ఉండడంతో దాని తీవ్రత కింది స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో జిల్లాలో ముఖ్యంగా రూరల్ విభాగంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. అర్బన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. కొన్నింటిని సమీక్షించడం ద్వారా కొంత మేర కట్టడి చేయగలిగారు. పోలీసు శాఖలో పట్టుతప్పిన క్రమశిక్షణపై డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ కిషోర్ ఝా దృష్టి సారించారు. క్రమశిక్షణకు పెద్దపీట వేసే పనిలో నిమగ్నమై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అక్రమార్కులను సస్పెండ్ చేయడం ద్వారా తాము కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలను సిబ్బందికి చేరవేశారు. ఎస్పీలు బదిలీలు అయి.. విధుల్లో చేరే సమయంలో కిడ్నాపింగ్ ముఠాలు బరితెగించాయి. వరంగల్లో ఒక కిడ్నాప్, హన్మకొండలో ఒక రియల్ఎస్టేట్ వ్యాపారి హత్యకు పథకం రచించి అడ్డంగా పోలీసుకు దొరికిపోయారు. అదేవిధంగా పాలకుర్తిలో ఒక వ్యక్తి హత్యకు కుట్రపన్ని కటకటాలపాలయ్యారు. మార్చి 21వ తేదీన సుబేదారిలో నివసిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్డ్డి కిడ్నాప్ కథలో నిందితులు మొత్తంగా దొరక్కముందే కొన్ని ముఠాలు మళ్లీ కిడ్నాప్లకు పాల్పడడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకున్నారు. డీఐజీ ఇలా.. కరీంనగర్ రేంజ్ క్రైం కంట్రోల్ స్క్యాడ్ సీఐగా పనిచేస్తున్న సాంబయ్య ఇంటర్నెట్ కనెక్షన్ల మరమ్మతుల కోసం వచ్చిన ఇద్దరు యువకులపై దాడి చేశాడు. గతంలో కూడా వివాదాస్పదమైన అధికారిగా పేరొందిన సాంబయ్యను డీఐజీగా మల్లారెడ్డి వచ్చీ రాగానే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎసైగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన రాజును సస్పెండ్ చేశారు. దొంగతనం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సంపేట రూరల్ సీఐ జి.మధును బదిలీ చేశారు. హైదరాబాద్లోని లాడ్జ్లో దొరికిన కరీంనగర్ సీఐ స్వామి, వరంగల్ మహిళా స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిని డీఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఎస్పీ కిషోర్ ఝా ఇలా.. పరకాల పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్పై సమాచారం ఇవ్వని సిబ్బందిపై ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రౌడీషీటర్ సమాచారం ఇచ్చిన కానిస్టేబుల్కు రివార్డు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. గూడూరు పీఎస్ పరిధిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై అక్కడికక్కడే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుబేదారి పీఎస్ పరిధిలోని బాలసముద్రంలో పేకాట ఆడుతూ పట్టుబడిన మహిళా అర్బన్ పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ సారయ్యను సస్పెండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమించుకున్న పలివేల్పుల మాజీ సర్పంచ్పై రౌడీషీట్ నమోదు చేసి భూకబ్జాదారుల్లో వణుకు పుట్టించారు. నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి 11 తర్వాత కనిపించిన వారిని అదుపులోకి తీసుకోవాలని, లాఠీ ఠూళిపించాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. సార్.. వీటిపైనా దృష్టి పెట్టరూ... పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలు పెట్టిన డీఐజీ, ఎస్పీ వరంగల్ అర్బన్లోని పెండింగ్లో ఉన్న కేసులపైని దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపాల్కాలనీలో వివాహిత హత్య జరిగి నెలలు గడుస్తున్నా.. ఎలాంటి క్లూ దొరకలేదు. మిట్టమధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అత్యంత దారుణంగా సర్జికల్ బ్లేడు ఉపయోగించి హత్య చేశారు. తెలిసిన వారే ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఈ కేసులో పురోగతి లేకపోవడం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విషయం. హంటర్రోడ్డులోని నందిహిల్స్లో మిట్టమధ్యాహ్నం సీబీఐ అధికారుల పేరుతో రూ.50 లక్షల దోపిడీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును చేధించడంలో పోలీసులు చతికిలపడ్డారు. ఫ్యామిలీ డ్రామాగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేసినప్పటికీ.. ఆధారాలు కనుగొనడంలో విఫలమయ్యార నే అపఖ్యాతిని సుబేదారి పోలీసులు మూటగట్టుకున్నారు. సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో ఈరెండు కేసులు నెలల తరబడి పెండింగ్లోనే ఉండడం పోలీసుల అసమర్థతకు నిదర్శనంగా మారాయి. వరంగల్ గొర్రెకుంటలోని కొలంబో కాలనీలో వద్ద దంపతుల హత్య జరిగి నెలలు కావస్తోంది. అయినప్పటికీ విచారణలో ఒక్కడుగు ముందుకు పడలేదు. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు గీసుగొండ పోలీసులు నానాతంటాలు పడుతున్నా.. కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి మిస్టరీని పోలీసులు చేధించలేరేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన అధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నర్సంపేట డీఎస్పీపై చర్య తీసుకునేనా.. విధుల నిర్వహణ విషయంలో విమర్శలు, విచారణ ఎదుర్కొంటున్న నర్సంపేట డీఎస్పీ కడియం చక్రవర్తిపై గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు అధికారులు చర్యలకు వెనుకంజ వేసినట్లు తెలిసింది. కడియం చక్రవర్తి తన పరిధిలో చిన్న చిన్న కారణాలు చూపుతూ అనేక మందిని చిత్రహింసలకు గురిచేసిన విషయంపై అప్పటి డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసుకు మానవహక్కుల వేదిక నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు చివరకు చర్యల విషయంలో స్తబ్దుగా ఉండిపోయారు. కొత్తగా వచ్చిన అధికారులు నర్సంపేట డీఎస్పీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పోలీసు వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఉద్యమంలా స్వచ్ఛ భారత్
విద్యారణ్యపురి : అన్ని పాఠశాలల్లోను స్వచ్ఛభారత్ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, సంకల్పమే ఆయుధంగా నిరంతరం దీనిని కొనసాగించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. స్వచ్ఛభారత్ కోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలన్నారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్పీలు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 14వతేదీ నుంచి 19వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 4,807 పాఠశాలల్లో చదువుకుంటున్న ఐదు లక్షల మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. స్వచ్ఛభారత్ తొలుత వ్యక్తిగతంగానే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాలకృత్యాల్లాగే అదికూడ నిత్యకృత్యం కావాలన్నారు. వారానికి కనీసం రెండుగంటలు కేటాయించాలన్నారు. పనిష్మెంట్గా భావించొద్దు స్వచ్ఛభారత్లో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తే దానిని వారు కార్పొరేట్ తరహా పనిష్మెంట్గా భావించకూడదని సూచించారు. జిల్లాలో 2.55లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఎవరూ సరిగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ‘ఆసరా’కింద లబ్ధిపొందేవారి వద్ద కూడా సెల్ఫోన్లు ఉంటున్నాయని, కానీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా నిర్మించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిపై వారికి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ప్రతినెలా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పాఠశాల నిర్వహణ నిధుల నుంచి రూ.పదివేల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. గుడి కంటే బడి గొప్పది గుడి కంటే బడి ఎంతో గొప్పదని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య అన్నారు. బడిలో అన్ని కులాలు, మతాలకు చెందిన విద్యార్థులుంటారన్నారు. తాను కొన్ని పాఠశాలలను పర్యవేక్షించానని, కొన్నింటిలో పరిశుభ్రత పాటిస్తుండగా మరికొన్నింటిలో ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ముల్కలపల్లి పాఠశాలకు తాను తనిఖీకి వెళ్లినప్పుడు స్కూలు వరండాలోనే ఉపాధ్యాయులు తమ వాహనాలను పార్కింగ్ చేశారని, దీంతో అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకుందన్నారు. దీంతో అక్కడి హెడ్మాస్టర్ను సస్పెండ్ చేశానన్నారు. ఉపాధ్యాయులు స్కూలుకు గంట ముందుగా వెళ్లి.. బడి ముగిశాక మరో గంట ఉండి పనిచేస్తే స్వచ్ఛభారత్ విజయవంతం అవడంతోపాటు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అందరినీ భాగస్వాములు చేయాలి హెచ్ఎంలు.. ఉపాధ్యాయులను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను స్వచ్ఛభారత్లో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని ఏజేసీ కృష్ణారెడ్డి అన్నారు. 14వ తేదీన ప్రతి పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని, 15న మధ్యాహ్న భోజనం వండే ప్రాంతంలో శుభ్రం చేయాలని, 17న వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, 18న తాగునీరు, 19న టాయిలెట్లను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సభలో డిప్యూటీ డీఈఓ డి.వాసంతి అందరితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తీగలవేణి హెచ్ఎం మైస శ్రీనివాస్, కోయడ జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సుదర్శన్రెడ్డి, కంఠాయిపాలెం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం కృష్ణమూర్తి తమ పాఠశాలల్లోని సమస్యలను, చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి వివరించారు. భీమారం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంధ్యశ్రీ తమ పాఠశాలలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూలుకు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే తనకు మెసేజ్ చేయాలంటూ తన మొబైల్ నంబర్ ఇచ్చారు. సభలో డిప్యూటీ ఎస్ఎస్ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ వి.మురళి, డిప్యూటీ డీఈఓలు రవీందర్రెడ్డి, కృష్ణమూర్తి, శ్రీరాములు మాట్లాడారు. -
‘జైలు’ కూడు
ఏదైనా శిక్ష పడి, ‘జైలు కూడు’ తినడం లేదు వీళ్లు. అందరూ స్వచ్ఛంద ఖైదీలు! తియాంజిన్ నగరంలో కారాగారపు థీమ్తో రూపొందిన రెస్టారెంటు ఇది. చైనాలో ఇలాంటి థీమ్ రెస్టారెంట్లకు మంచి ఆదరణ ఉంది. చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా మసలుకొమ్మని గుర్తుచేసే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. బతుకు వల ఐక్యరాజ్యసమితి ప్రకారం, అర్ధశతాబ్దిలో ప్రపంచజనాభా 900 కోట్లకు చేరుతుందట! ఇంతలా పెరిగే జనానికి సరిపోయే ఆహారం కాగలిగేదేమిటి? సమాధానం: చేప(ట)! వియత్నాంలోని థన్ ఓయ్ జిల్లాలోని ఒక వరిక్షేత్రం పక్కనే పారుతున్న కాలువలో చేపలు పడుతున్న జాలరిని ఫొటోలో చూడవచ్చు. అశ్వ నాగలి ఫొటోలో ఉన్నది ఒక అమెరికా రైతు. పేరు డాన్ హుయీస్. గుర్రాలను కట్టిన ‘హారో’తో నేలను సాగుచేస్తున్నాడు. ఇది ఏకకాలంలో నేలను పెళ్లగిస్తూ, చదును కూడా చేస్తుంది. ఇంతకీ ఈయన పనిచేస్తుంది గొర్రె పాడిపరిశ్రమ క్షేత్రంలో. ఆవు, గేదె, మేకల్లా గొర్రె పాలకు అంత ప్రఖ్యాతి లేకపోయినా, వాటిని పాలసంబంధిత ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. -
ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!
విచారణ పూర్తయి శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనవసరం లేదు. విచారణకు నోచుకోకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అభాగ్యులకు ఎట్టకేలకు విముక్తి లభించింది! ఏదో అభియోగం మీద అరెస్టు చేసి, అతను నేరం చేశాడా లేదా అని విచారణ చేయకుండా జైల్లో పెట్టేసి, ఇక వారి సం గతి మరచిపోతారు. అరెస్టు ఎందుకు చేశారో అత నికి తెలియదు. తనపై ఉన్న అభియోగం ఏమిటో తెలియదు! తనపై నేరారోపణ ఎవరు చేశారో తెలి యదు! విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలి యదు! తనపై మోసిన అభియోగానికి విచారణ అంటూ జరిపితే ఎంత శిక్ష పడుతుందో తెలియదు! అటువంటి వారికి 5, అక్టోబర్ 2014 నాడు సుప్రీం కోర్టు గొప్ప ఊరట కల్పించింది. వీరి విచారణ ఒక వేళ పూర్తయి, శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దానికి సంబంధించిన అంశాలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 436ఏలోనే ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది. అయితే దానిని పట్టించుకొనే వారెవరు? డబ్బున్న వాళ్లకు, అధికారం ఉన్న వాళ్లకు ఈ బాధలు ఉండవు! ముందే అన్నీ చక్కబెట్టుకుంటారు! ఇటువంటి సౌకర్యం 2005లో సీఆర్పీసీకి సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చినా, దీని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. చట్టం ఉన్నది, ప్రయోజనం ప్రజలకు అందాలి. ఇది వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. కాని చట్ట ప్రయోజనం అందక కొన్ని వేల మంది అభాగ్యులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి అంద వలసిన ప్రయోజనం అందటం లేదని గ్రహించి, వెంటనే అటువంటి ప్రయోజనానికి అర్హత కలిగిన వాళ్లను ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయమన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశం లోని జైళ్లలో సుమారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2.54 లక్షల మంది విచారణ జరగవలసి ఉన్నవారు. ఇందులో వాళ్లపై వచ్చిన అభియోగానికి పడే శిక్షకంటే ఎక్కువ కాలమే వాళ్లు ఏ విచారణా లేకుండా జైళ్లలో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం? ఈ విషయం ప్రభుత్వాలకు గాని, జైళ్ల అధికారులకు గాని తెలియనిది కాదు. అయితే వారు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జైళ్లలో ఈ రకంగా మగ్గిపోతున్న వారు పేదవారు కాబట్టి! ఇంతకుముదు ఒక ప్రయత్నం బీహార్ జైళ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసింది. అనవసరంగా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోతున్న వారిని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే మళ్లీ అటువంటి వారి సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టం వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పుడూ పట్టించుకోవటం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా చట్ట ప్రయోజ నాన్ని ప్రజలకు అందించవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు ఊరుకోలేదు. న్యాయాధి కారులను, అంటే మేజిస్ట్రేట్లను వారానికి ఒకసారి జైలును సందర్శించి, ఈ విధంగా జైళ్లలో ఎంత మంది అనవసరంగా ఉంటున్నారో లెక్కలు తీసి, వారికి పైన చెప్పిన ప్రయోజనం అందవలసి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. ఈ విధంగా మొత్తం రెండు నెలలు ప్రతి వారానికి ఒకసారి మేజిస్ట్రేట్లు జైలుకు వెళ్లి విడుదలకు అర్హులైన వారిని మొత్తంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో న్యాయవాదుల ప్రమేయం ఏదీ ఉండకూడదు. దీనికి సహకరించాలని జైలు అధి కార్లను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సమర్పించాలి. అంటే సుప్రీంకోర్టు కేవలం ఉత్తర్వులు జారీ చేసి కూర్చోలేదు. ఇచ్చిన ఉత్తరువుల అమ లును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలలలో పూర్తయినట్టు తనకు నివేదిక కూడా అందజేయాలని ఆదేశించింది. ఎందుకంటే చట్టం ఉన్నప్పటికీ ఎనిమిది ఏళ్లుగా దాని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏళ్ల తరబడి ముద్దాయిలను పదిహేను రోజులకొకసారి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లటం, మళ్లీ వెనక్కి తీసుకురావటంతోటే అయిపోతున్నది. అందుకని చట్ట ప్రయోజనం ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించే పని పెట్టుకున్నది. అధికార్లు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు నేరుగా ఆ బాధ్యతను కూడా స్వీకరించింది. అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత మేజిస్ట్రేట్లకు, జైలు అధికార్లకు, తన తీర్పు ద్వారా జారీచేసింది. ఈ ఉత్తర్వులు పేద ప్రజలకు ఎంతో గొప్ప మేలు చేశాయి. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లేది వారే! విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోయేది వారే! ఒక అంచనా ప్రకారం నూటికి అరవై మందికి పైగా ఈ ప్రయోజనం అందుతుంది. అయితే మరణశిక్ష పడే కేసుల్లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందదు! ఈ ఒక్కటీ చాలదు! జైళ్ల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం కావా లి. నేర విభాగానికి సంబంధించిన ప్రక్రియలో కూడా మార్పు రావాలి. జైళ్ల పరిస్థితులలో కూడా మార్పు తేవాలి. నేరాలు, శిక్షలు, జైళ్లకు సంబంధించిన సీఆర్పీసీని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారతదేశ ప్రజలపై అజమాయిషీ చేయటానికి, వారిని అదుపులో ఉంచడానికి శిక్షలు వేసి, జైళ్లలో పెట్టి వీరిని భయభ్రాంతులను చేయటానికి తీసుకువచ్చిన చట్టం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సవ రణలు తీసుకువచ్చారు గాని, సమగ్రమైన మార్పులు తేలేదు. ఇప్పుడు తీసుకువచ్చిన ప్రక్రియ పాతదే! అయితే అమలుకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 250 ఏళ్ల క్రితం చేసిన చట్టాలను ఈ నాటికీ పట్టుకు వేలాడటం సిగ్గుచేటు. జైళ్ల విధానం, నిర్వహ ణలో చాలా దేశాలలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. మార్పు అంటే భయపడేది మన దేశమే! ఈ సందర్భాన్ని తీసు కొని కనీసం జైళ్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడానికి ముం దుకు రావాలి! బొజ్జా తారకం సీనియర్ న్యాయవాది -
వేపాలే... నిభకలే... పమీలే!!
నవ్వింత: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్నది లోకాన వాడు. అది అక్షరాలా నిజమే. అయితే ఎలా తప్పిస్తాడు? ఓరోజు నిద్రలేచే సమయానికి నా ఒంటిపై ఎర్రటి పెద్ద పెద్ద దద్దుర్లు కనిపించాయి. కాస్త పరిశీలనగా చూద్దును కదా... మా ఆవిడ ఒంటిపై కూడా. ‘‘పదపద హాస్పిటల్కు వెళ్దాం’’ అన్నాను. ‘‘అక్కర్లేదు’’ అంది మా ఆవిడ. ‘‘ఇంత పెద్దగా ఎర్రగా దద్దుర్లు వస్తే వద్దంటావ్?’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘ఇదంతా మన బుజ్జిగాడి ప్రతాపం. వాడు నరకంలో శిక్షలకు ట్రైనింగ్ క్లాసు ఇప్పిస్తున్నాడు. ఇది ‘మిక్రినజంభో’ శిక్ష’’ ‘‘ఇది అపరిచితుడు సినిమాలోని ఓ శిక్ష కదూ. దాన్ని వీడు మనకెలా వేశాడు? ఎందుకు వేశాడు?’’ మళ్లీ నా ఆశ్చర్యం. ‘‘వీడు పొద్దస్తమానం బెడ్పై కూర్చుని లేస్ అనీ, కుర్కురేలనీ, పిక్నిక్లనీ రకరకాలు తింటుంటాడు కదా. అలాగే కాస్త కాస్త పొడి రాలేలా ఆ చాక్లెట్లు, తీపి పదార్థాలు తింటాడు. దాంతో వాటికోసం చీమలు వచ్చేసి పనిలోపనిగా మనల్నీ కుడతాయి. అలా ‘క్రిమిభోజనం’ శిక్షను భరించగలిగేలా వీడు మనకిప్పుడు కోచింగ్ ఇస్తున్నాడన్నమాట. ఇదొక్కటే కాదు, ఇలాంటివెన్నో శిక్షలు వేస్తూ, అమలు పరుస్తూ ఉన్నాడూ, ఉంటాడు’’ ‘‘ఛ... ఊర్కో. వాడినంతలేసి మాటలెందుకంటావ్. వాడి చేష్టలను మనమెప్పుడైనా శిక్షగా ఫీలయ్యామా?’’ అన్నాను. ‘‘అదే వాడి గొప్పదనం’’ అంటూ... వాడి శిక్షాస్మృతుల్లో కొన్నింటిని వివరించింది మా ఆవిడ. (గమనిక: ఇక్కడ స్మృతి అంటే మా జ్ఞాపకం అని అర్థం. అనగా మావాడు విధించిన శిక్షల తాలూకు జ్ఞాపకాలని తాత్పర్యం). ‘‘వీడు అప్పుడే నా పొట్టలోంచి బయటకు వచ్చాడు కదా. అలా వచ్చినవాడు ఊరుకుంటాడా...? రాత్రి ఏ రెండింటికో, మూడింటికో మేల్కొని ఓ గంటా అరగంటా అడుకుని మళ్లీ పడుకుంటాడు. అమెరికాకు వెళ్లి ఇండియాకు వచ్చిన వారు ఇక్కడి రాత్రిని అక్కడి పగలుగా అనుకుని మెలకువతో ఉండటం, మళ్లీ పగటివేళ అక్కడి రాత్రి అలవాటుతో పడుకోవడం చేస్తుంటారు. వాళ్లకా జెట్లాగ్ ఉన్నట్టే... మన బుజ్జిగాడికి పొట్టలాగ్ ఉంటుందన్నమాట. వాడి మానాన వాడు నిద్రపోవడం లేదా వాడికిష్టమొచ్చినప్పుడు మళ్లీ నిద్రలేవడం చేస్తాడు. అది మనం నిద్రపోయేవేళా లేక మెలకువతో ఉండే వేళా అన్నది వాడికి అనవసరం కదా. అలా వాడెప్పుడు మేల్కొంటాడో అని మనం ఎదురుచూస్తూ... మీరూ, నేనూ వంతుల వారీ వాచ్మేన్ డ్యూటీలు చేసిన విషయం గుర్తులేదా? హు... ఈ లోకంలో ఒబామా అయినా ఒకటే. ఐరాస చీఫ్ అయినా అంతే. బిడ్డను కన్న తర్వాత వాచీతో నిమిత్తం లేకుండా కళ్లు వాచిపోయేలా డ్యూటీలు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులందరినీ ‘వాచ్మేన్ విత్ గోల్డెన్ వాచీ విత్ కళ్లూ ఒళ్లూ వాచి’ అందాం’’ ‘‘దీనికి ఏదైనా పేరుపెట్టరాదూ?’’ ‘‘వేపాలే-నిభకలే-పమీలే అందాం’’ ‘‘అంటే?’’ ‘‘వేళాపాళాలేకుండా నిద్రాభంగం కలిగించేసి పక్కమీది నుంచి లేపేయడం’’ అని జవాబిచ్చింది మా ఆవిడ. ‘‘అన్నట్టు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తూ వస్తూ ఉన్న ఆరోజు మీకు గుర్తుందా?’’ అడిగింది మా ఆవిడ. ‘‘అదెలా మరచిపోగలను చెప్పు. ఆ రోజే కదా మనవాడు నా మీద సూసూ పోశాడు. ఆ తడిసీట్లలోనే కూర్చుని, తడిబట్టలతోనే జర్నీ అంతా చేశాం. అంత తడితో వణుకుతూ పడుకుని మరీ వచ్చాం కదా’’ ‘‘చూశారా... నాకు తెలిసి నిశ్చింతగా నిద్రపోవడాన్ని మీ మగాళ్లంతా కాస్త మొరటుగా ‘తడిబట్టేసుకుని పడుకోవడం’ అంటుంటారు కదా. ఆ నానుడి ఇలాంటి అనుభవం నుంచే పుట్టుకొచ్చిందేమో?! ఇలా కొడుకులందరూ నరకం ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు చూపిస్తారు. అక్కడి శిక్షల్ని ఇక్కడ కొద్ది డోసుల్లో అమలు చేస్తూ మనతో కాస్త రిహార్సల్స్ చేయిస్తారు. దాంతో మనం పున్నామ నరకాన్ని, అక్కడి శిక్షలనూ సులభంగా అధిగమించగలమన్నమాట’’ ఉపదేశించింది మా ఆవిడ. ‘‘అవున్నిజమే కదా’’ అనిపించింది. ఏదో సందర్భంలో ‘‘నరకము కూడా సుఖమే కదా... నీ శిక్షలతో, నీ టార్చర్లతో... నీ కోసమె నే జీవించునదీ’’ అంటూ పేరడీ పాడుతుంటే, ‘ఇదే పాటను మరోలా విన్నానే’ అన్నాడు మావాడు. ‘‘ఆ అసలు పాట నిజమో కాదో గానీ... బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులూ ఏకగ్రీవంగా, ఏకకంఠంతో ఒప్పుకునేది... ఇప్పుడు నేను పాడే పాటే’’ అంటూ బల్లగుద్ది చెప్పేశా. పైగా దీనికి మా ఆవిడ ఒత్తాసుకూడా ఉంది. ఇంక నాకేం భయ్యం? - యాసీన్ -
మైనర్ ఇరిగేషన్ శాఖలో వేటు
సాక్షి ప్రతినిధి, కడప : మైనర్ ఇరిగేషన్ శాఖలో అక్రమార్కులపై వేటు పడింది. నిబంధనలకు పాతర వేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తూ అడ్డగోలుగా కాంట్రాక్టు పనులు అప్పగించిన నేరానికి శిక్ష పడింది. ఇరువురు డీఈలు, నలుగురు ఏఈలు, నలుగురు జేటీఓలను సస్పెండ్ చేస్తూ శుక్రవారంసాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009-12 కాలంలో రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ పనులను ఇబ్బడిముబ్బడిగా, ఇష్టారాజ్యంగా చేపట్టారు. రైల్వేకోడూరు, చిట్వేలి మండలాలలో రూ. 4 కోట్లతో పలు చెక్డ్యామ్లు, కుంటలను అభివృద్ధి పరిచారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడం, నాణ్యతగా పనులు నిర్వహించకపోవడం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వీటిపై అప్పట్లోనే ఆరోపణలు రావడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్ రెండు నెలల క్రితం సస్పెండ్కు గురయ్యారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 103 ఇరిగేషన్ పనులపై విచారణ చేపట్టారు. అందులో నల్గొండ జిల్లాలో 70 పనులు, వైఎస్సార్జిల్లాలో 30 పనుల్లో అవకతవకలకు జరిగినట్లు రూఢీ అయింది. ఈ మేరకే సస్పెన్షన్ ఉత్తర్వులు అందినట్లు సమాచారం. అనుకున్న వారికే కాంట్రాక్టు పనులు మైనర్ ఇరిగేషన్ శాఖలో టెండర్ల ప్రక్రియను తంతుగా నిర్వహించేవారు. అనుకున్న వారికి కాంట్రాక్టులు దక్కేలా పాత తేదీలతో టెండర్లను ఆహ్వానిస్తూ అప్పటికప్పుడు నోటీసు బోర్డులో పొందుపరుస్తూ వచ్చేవారు. ఇరిగేషన్ అధికారులతో టచ్లో ఉన్న వారికి మాత్రమే పనులు దక్కేలా, అలాంటి వారికే టెండరుషెడ్యూల్ అందేలా ముందస్తు వ్యూహంతో వ్యవహరించేవారు. అనుకున్న వారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం, ఆపై పరస్పర సహకారంతో పనులు చేపట్టడంతో నాణ్యతకు తిలోదకాలకు ఇస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో మైనర్ ఇరిగేషన్శాఖ కార్యదర్శినాగిరెడ్డి, చీఫ్ ఇంజినీర్లకు రైల్వేకోడూరు వాసులు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్పై తొలుత వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం డీఈలు రాజా రవీంద్ర, చెంగల్రాయులు, ఏఈలు రెడ్డి సురేష్, లక్ష్మినరసయ్య, వెంకట సుబ్బయ్య, ప్రసాద్, టెక్నికల్ ఆఫీసర్లు సుదర్శన్రెడ్డి, నాయక్, వెంకట సుబ్బయ్యతో పాటు మరొకరిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సీబీసీఐడీచే విచారణ రైల్వేకోడూరు, చిట్వేలి మండలాల్లో 2009-12 కాలంలో చేపట్టిన సుమారు రూ. 4 కోట్ల కాంట్రాక్టు పనులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అందుకు నోడల్ ఆఫీసర్లుగా ప్రస్తుత ఈఈలు సుబ్బరామయ్య, మల్లికార్జునను నియమించారు. అప్పట్లో చోటుచేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఆ మేరకు సుమారు 30 పనులపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మైనర్ ఇరిగేషన్లో 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. -
ఎల్బీనగర్లో ఆకతాయికి దేహశుద్ధి
-
పంచాయతీ తీర్పుతో.. మహిళపై సామూహిక అత్యాచారం
పశ్చిమబెంగాల్ రాష్ట్రం అత్యాచారాలకు రాజధానిగా మారిపోయింది. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 12 మంది పురుషులు ఓ మహిళ (20)పై సామూహిక అత్యాచారం చేశారు. అది కూడా స్థానిక పంచాయతీ ఇచ్చిన ఆదేశాలతోనే! వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు సదరు పంచాయతీ విధించిన శిక్షే.. ఈ సామూహిక అత్యాచారం!! బీర్భూమ్ జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో ఈ ఘోరం సోమవారం జరిగింది. కొంతమంది గ్రామస్థులు ఆ మహిళను ఆమె స్నేహితుడి ఇంట్లో చూశారు. దీంతో వెంటనే గ్రామపెద్ద, మరికొందరు కలిసి పంచాయతీ పెట్టారు. ఇలా సంబంధం పెట్టుకున్నందుకు ఆ మహిళ, ఆమె స్నేహితుడు తలో 25వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు. తాము అంత కట్టలేమని ఆమె కుటుంబసభ్యులు చెప్పడంతో, వెంటనే ఆమెపై 12 మంది సామూహిక అత్యాచారం చేయాలని గ్రామపెద్ద ఆదేశించాడు. ఆమెను అక్కడినుంచి తీసుకెళ్లిపోయి, రాత్రంతా ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అలా ఎన్నిసార్లు చేశారో కూడా తనకు లెక్క తెలియలేదని ఆమె వాపోయింది. చివరకు ఆమె స్నేహితుడి సోదరుడు సదరు 'జరిమానా' కట్టేసి, ఆమెను అక్కడినుంచి తీసుకెళ్లారు. ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ఆస్పత్రిలో విషమపరిస్థితిలో చికిత్స పొందుతోంది. ఎఫ్ఐఆర్లో ఆమె మొత్తం 13 మంది పేర్లు చెప్పింది. వాళ్లంతా ఆమెకు సమీప బంధువులే అవుతారని, కొంతమంది అన్నలు కూడా వారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందినీ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘోరం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఇటీవలే కోల్కతాకు సమీపంలోనే ఓ గ్రామంలో కొంతమంది యువకులు ఓ యువతిపై రెండుసార్లు సామూహిక అత్యాచారం చేసి, ఫిర్ఆయదు వెనక్కి తీసుకోనందుకు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ఇంకా చల్లారక ముందే ఈ దారుణం జరగడం గమనార్హం. -
ప్రాణం తీసిన పనిష్మెంట్
మార్కులు తక్కువ వచ్చాయని కళాశాల చుట్టూ ఆరుసార్లు పరిగెత్తాలన్న లెక్చరర్ మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య మండపేట/తాడేపల్లి, న్యూస్లైన్: తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ విద్యార్థి గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా నదిలో శవమై కనిపించాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే బిడ్డను దూరం చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వీఎస్ఎం డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడైన కరుటూరి భాను సూర్యవంశీ(20) అదే పట్టణంలోని వీఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో అతడితో పాటు మరో ఐదుగురిని సోమవారం కళాశాల చుట్టూ ఆరు రౌండ్లు పరుగెత్తాలని ఒక లెక్చరర్ పనిష్మెంట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన సూర్యవంశీ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తోటి విద్యార్థులను అడగ్గా పనిష్మెంట్ విషయం తెలిసిందని మృతుడి తాతయ్య పెనుమర్తి వెంకట్రావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా నదిలో సూర్యవంశీ మృతదేహం ఉన్నట్టు అక్కడి బంధువుల ద్వారా సమాచారం వచ్చినట్టు తెలిపారు. తన మనవడి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అనుమానాస్పద మృతిగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందన కోసం ప్రయత్నించగా వారు అందుబా టులోకి రాలేదు. కాగా, ఇంజినీర్గా చూడాలనుకున్న ఏకైక తనయుడు విగతజీవిగా మారాడన్న చేదునిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. -
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు
మెదక్ టౌన్, న్యూస్లైన్: ఇద్దరు విద్యార్థులు గొడవపడగా, ఓ విద్యార్థిని గదిలో వేసి ఇద్దరు ఉపాధ్యాయులు కర్రలతో దారుణంగా చితక బాదిన సంఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తండ్రి షాహెద్ అలీబేగ్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కువాత్ ఇస్లాంలో నివాసం ఉండే సోయబ్ అలీ స్థానిక ప్రైవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా సోమవారం పాఠశాలలో తోటి విద్యార్థితో సరదాగా గొడవపడ్డాడు. దీనిని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్, నందీప్లు విద్యార్థి సోయెబ్ అలీని గదిలోవేసి కర్రలతో చితక బాదారు. దీంతో అతని వీపంతా పూర్తిగా కమిలిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి షాహెద్అలీబేగ్ పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విద్యార్థి సోయెబ్ అలీని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బాల్య వివాహం జరిపిస్తే చర్యలు
తల్లాడ, న్యూస్లైన్:బాల్య వివాహం జరిపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఆర్జేడీ ఆర్.సూయజ్ హెచ్చరించా రు. ‘బాల్య వివాహాలు’ అనే అంశంపై తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఆమె మా ట్లాడారు. బాల్య వివాహాలను ప్రోత్సాహిం చిన.. ప్రేరేపించిన.. సహకరించిన వారిపై కూడా చర్య లు తీసుకుంటామని చెప్పారు. పదిమందికన్నా తక్కువ సంఖ్యలో పిల్లలున్న అంగన్వాడీ కేంద్రాన్ని దగ్గరలోని కేంద్రంలో విలీనం చేయనున్నట్టు ఆర్జేడీ ఆర్.సూయజ్ తెలి పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందకపోతే వర్కర్, ఆయాపై చర్య ఉంటుం దని చెప్పారు. కార్యక్రమంలో జేడీ శ్యాం సుం దరి, పీడీ సుఖజీవన్బాబు, సీడీపీఓ వరలక్ష్మి, సూపర్వైజర్లు సత్యావతి, ఇందిరాదేవి, తల్లాడ సర్పంచ్ కోటా అరుణ పాల్గొన్నారు. ‘మన ఊరి పిల్లలు... మన పిల్లలు..’ భావనతోనూ బాల్య వివాహాల నిర్మూలన కొణిజర్ల: ‘మనఊరి పిల్లలంతా.. మన పిల్లలే..’ అని, ప్రతి ఒక్కరూ భావించినప్పుడే బాల్యవివాహ వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని ఐసీడీఎస్ కమిషనరేట్ జాయింట్ డెరైక్టర్ కె.శ్యామసుందరి చెప్పారు. ఆమె బుధవారం ఇక్కడ బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ఐసీడీఎస్ ద్వారా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ‘గ్రామ బాలల సంరక్షణ కమిటీ’ పేరతో ఆరు నెలల క్రితం కమిటీలు కూడా వేశామని అన్నారు. పల్లెల్లోని బాల కార్మికులంతా పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. బడి బయటి పిల్లలంతా బడిలో ఉండేలా చూస్తే.. బాలకార్మికవ్యవస్థ అంతమవుతుందని అన్నా రు. ఐసీడీఎస్ వరంగల్ రీజియన్ జాయింట్ డెరైక్టర్(ఆర్జేడీ) ఆర్.సూయజ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో విసృ్తత ప్రచారం జరగాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జి.సుఖజీవన్బాబు, సీడీపీఓ జ్యోతిర్మయి, ఏసీడీసీఓ సంధ్య, జీసీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.