Revanth redddy
-
TG: కాంగ్రెస్ ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు.. ఎందుకంటే..?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్న సమయంలో సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు.. తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్, పలువురు మంత్రులను ఢిల్లీకి బయల్దేరి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనఏప్రిల్ లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అయితే ఈ లోపే డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు రేవంత్. -
పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు. -
నేనే మెట్రో తెచ్చా అంటున్నారు.. ఆ మెట్రో ఎక్కడుందో?: రేవంత్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సెటైర్లు వేశారు. కిషన్రెడ్డి.. మెట్రో తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో తనకైతే తెలియదంటూ చమత్కరించారు రేవంత్. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా రేవంత్ మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సహకరించడం లేదు. తెలంగాణకు నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్రెడ్డికి తెలియదా?, ఈటల వచ్చారు.. కానీ కిషన్రెడ్డి రాలేదు. మెట్రో నేనే తెచ్చానని కిషన్రెడ్డి అంటారు. నాకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్పిస్తోంది కానీ కిషన్రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది?,రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. అదే ఇవ్వమని అంటున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే. మూసీకి నిధులు తెస్తే కిషన్రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతాను. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదు? అని రేవంత్ ప్రశ్నించారు.ఇక రేవంత్ తన ఢిల్లీ పర్యటనపై కూడా మాట్లాడారు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తాను. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చాను. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయి. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.‘తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. -
సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను కూడా దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు. స్కూల్ యూనిఫామ్ నమూనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర, ఐజీ రమేశ్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 31న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో 50 శాతం సీట్లు యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు. -
సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా: కిషన్రెడ్డి
సాక్షి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని.. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ స్పష్టం చేయాలని కిషన్రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ ఉంటుందని కిషన్రెడ్డి తెలిపారు.14 నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్కు శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించాయి. ప్రజా సమస్యల పోరాటానికి శాసన మండలి వేదిక. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లింలను బీసీ లో చేర్చే కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకం’’ అని కిషన్రెడ్డి చెప్పారు. -
ఐఏఎస్, ఐపీఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
-
గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.వారికి పది లక్షల చొప్పునత్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. తన ఆల్రౌండ్ ప్రతిభతో భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార. ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది. అంతేకాదు.. ఈ లెగ్స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో ఫైనల్లో 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన గొంగడి త్రిష.. మూడు వికెట్లతో మెరిసి భారత్ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవడంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా త్రిష సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో నూ ఈ తెలుగుతేజానికి చోటు దక్కడం మరో విశేషం. భద్రాద్రి అమ్మాయికాగా తెలంగాణలోని భద్రాద్రికి చెందిన త్రిషకు చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ. త్రిష ఈ స్థాయికి చేరడంలో ఆమె తండ్రి రామిరెడ్డిది ప్రధాన పాత్ర. కుమార్తె కోసం ఆయన ఎన్నో కష్టనష్టాలకోర్చి.. తన గారాలపట్టిని క్రికెటర్గా తీర్చిదిద్దారు. అందుకే తాను సాధించిన ప్రతి గొప్ప విజయానికి తండ్రికే అంకితం చేస్తుంది ఈ బంగారుతల్లి.ఘన స్వాగతంమలేషియాలో ఐసీసీ టోర్నీ గించుకున్న త్రిష మంగళవారమే హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అరశనపల్లి జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు భారత జట్టులో సభ్యురాలైన కేసరి ధృతి, టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్, ట్రెయినర్ షాలిని కూడా నగరానికి చేరుకున్నారు. ఈ నలుగురినీ జగన్మోహన్ రావు సన్మానించారు. 19 ఏళ్ల త్రిష తన అద్భుత ఆటతీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఆయన ప్రశంసించారు. త్రిష, ధృతిలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీరికి నగదు బహుమతిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్గా నూషీన్ అల్ ఖదీర్కు, ప్లేయర్గా త్రిషకు ఇది వరుసగా రెండో వరల్డ్కప్ టైటిల్ కావడం విశేషం. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత మాజీ స్పిన్నర్ నూషీన్ హెడ్ కోచ్గా వ్యవహరించగా... త్రిష సభ్యురాలిగా ఉంది. 2025లోనూ నూషీన్ హెడ్ కోచ్గా కొనసాగగా... నిలకడగా రాణించిన త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును సాధించింది. కేసరి ధృతి కూడా విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్నా ఆమెకు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన… pic.twitter.com/0lXZyJpMMg— Telangana CMO (@TelanganaCMO) February 5, 2025 -
కేటీఆర్ ఈడీ విచారణలో వాట్ నెక్స్ట్
-
ఇదేనా రైతురాజ్యం: హరీష్రావు
సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. -
హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్
-
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్ వ్యాక్సిన్ను మన తెలుగువాళ్లే తయారు చేశారన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ మహాసభ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. ఏ దేశానికి వెళ్లిన మన తెలుగు వారు కనిపిస్తారన్నారు.మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్ సూచించారు.పరభాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఇవ్వాలని అంటున్నారు.. రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతు భరోసా (Rythu Bharosa) కింద రైతులకు ఇవ్వలేదు.. రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు కుల గణన డ్రామా చేశారని దుయ్యబట్టారు.‘‘ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఏ ఊళ్లో ఎంత రుణమాఫీ చేశారో లిస్ట్ బయటపెట్టాలి. ఏ ఊళ్లో ఎంతమందికి బోనస్ ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ ఊళ్లో రైతు కూలీలకు ఎంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ కూడా బయటపెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుక్కను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలని.. రైతు బంధు పథకాన్ని కూడా బొందపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. రూ.22 వేల కోట్లు ఎక్కడ దారి మళ్లాయో లిస్ట్ బయటపెట్టాలి. ఈ ప్రభుత్వం పచ్చి దొంగ మాటలు మాట్లాడుతోంది. ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగండి...ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం 17,500, ఊరూరా పోస్టర్లు వేసి మరీ రైతులకు తెలిసేలా చేస్తాం. రైతు బంధును లేకుండా చేయాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుక్కుంటారా అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ ధోరణి ఆలోచన చాలా దారుణంగా ఉంది’’ అని కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు!‘‘రేపటి(శనివారం) నుండి రైతులను చైతన్య పరుస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. వరుసగా 11 సార్లు రైతులకు సమయానికి రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. రూ.73 వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు నేరుగా వేశాము. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద వేయలేదు. కాంగ్రెస్ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతొ బిల్డప్ ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ప్రజా పాలన కింద కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ డిటైల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర వున్నా.. మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు??రైతులు ఏ పంట వేసారో అని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఈ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది.. ప్రమాణ పత్రాలు ఎవ్వరూ ఇవ్వాలి .. ఈ ప్రభుత్వం ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. కౌలు రైతులకు , భూ రైతులకు రైతు భరోసా ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. 22 వేల కోట్లు దుర్వినియోగం అని దొంగ మాటలు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. 22 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయో ఈ ప్రభత్వం చెప్పాలి.. చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా ??’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
సీఎం రేవంత్తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.స్నేహం కోసం చెన్నై.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
కురుమలు నమ్మకానికి మారుపేరు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కురుమలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కోకాపేట్లో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నమ్మకానికి మారుపేరు, మృదుస్వభావులు కురుమ సోదరులు.. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య.. సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప పోరాట యోధుడు అని రేవంత్ కొనియాడారు.‘‘ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్ను ప్రారంభించుకోవడం సంతోషం. కురుమ సోదరులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వ హాస్టల్స్లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తల్లి మన తల్లుల ప్రతిరూపం. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలనే ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం. కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. కుల గణన 98 శాతం పూర్తయింది. ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉంది. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుంది’’ అని రేవంత్ చెప్పారు.గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమ సోదరులకు రెండు, యాదవ సోదరులకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. మీరు కలిసికట్టుగా గెలిపించుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయి. ముఖ్యమంత్రిగా విప్లే నా కళ్లు, చెవులు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్లుగా అవకాశం కల్పించాం.. బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నాడు కాబట్టే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వచ్చిన అవకాశం వదులుకోవద్దు.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుంది. వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుంది.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదు. సినిమా హీరోది వ్యాపారం. డబ్బులు పెట్టాడు.. వసూలు చేసుకున్నాడు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది?. నేను తీసుకునేది ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు.‘‘కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావుడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.. కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్ను ఈ కేసులో ఏ11గా పోలీసులు చేర్చారు...అక్కడ మహిళ ప్రాణం పోయింది? ఎవరు బాధ్యులు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ నేత.. నాకు బంధువు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు...హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసు. చనిపోయిన మహిళ కుమారుడు ఇంకా కోమాలో ఉన్నాడు. సినిమా కోసం డబ్బులు పెట్టారు.. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు.’’ అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా? -
‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’
సాక్షి, ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ‘‘తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిసినీ హీరో అల్లు అర్జున్ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ సాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఈయనని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు. తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశముందని తెలుస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై కేటీఆర్ కామెంట్స్ -
ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారంటూ రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదం అంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వారికి పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు(శనివారం) మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశాం. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?. విగ్రహం తయారు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు’’ అంటూ కవిత నిలదీశారు.జాగృతి తరపున మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. మేధావుల అభిప్రాయం తీసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ సంకుచిత తత్వంతో వ్యవహరిస్తున్నారు. మేము అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాము. సోనియా దగ్గర మార్కుల కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది పిరికి ప్రభుత్వం. కార్యకర్తల నుంచి నేతల వరకు అక్రమ కేసులు పెడుతోంది. మేము అక్రమ కేసులకు భయపడం’’ అని కవిత చెప్పారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై కేటీఆర్ కామెంట్స్ -
లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లడంపై సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులతో ఆరా తీసిన సీఎం. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని రేవంత్ హెచ్చరించారు.ఇదెక్కడి పాలన?: హరీష్రావుమరోవైపు, రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. లగచర్ల రైతు ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగా?. ఇదెక్కడి పాలన అంటూ నిప్పులు చెరిగారు. చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్తారా. రైతుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?. భూములు గుంజుకొని తిరగబడితే అరెస్ట్ చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య. ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?… pic.twitter.com/qJQG14Cbwq— Harish Rao Thanneeru (@BRSHarish) December 12, 2024 -
డ్రగ్స్, గంజాయి కనిపించకూడదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడిందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నామని చెప్పారు.‘‘అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించాం. ఒక నాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి.. కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయి. పోలీస్ శాఖలో దాదాపు 15 వేల నియామక పత్రాలు అందించాం.. పీజీలు, పీహెచ్డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు...సైబర్ క్రైమ్ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ సరఫరా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్, గంజాయి లాంటివి కనిపించొద్దు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.అందుకు సిద్దంగా ఉన్నాం....పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి. డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలి. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. ట్రాన్స్ జెండర్స్పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు. అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది.హోంగార్డుల దినభత్యం పెంపు..ఐపీఎస్ అధికారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు (డిసెంబర్ 6) హోంగార్డ్స్ రైజింగ్ డే...ఈ సందర్బంగా వారికి ఒక శుభవార్త చెబుతున్నాం. హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ వీక్లీ పరేడ్ అలవెన్స్ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోం గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదవశాత్తూ మరణించిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తాం. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అయినా పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లండి. ఆపై ఇంకేమైనా సమస్యలుంటే నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
ఎస్డీఆర్ఎఫ్ వాహనాలను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ స్టాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ లోగోను సీఎం ఆవిష్కరించారు.రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాటుకగా, రాష్ట్ర సర్కార్.. ఎస్డీఆర్ఎఫ్కు రూ.35.03 కోట్లు మంజూరూ చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. -
మొసలి కన్నీరు కార్చొద్దు.. కిషన్రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.‘‘ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది...హైదరాబాద్కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది...40 నుంచి 50 వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్ను మురికి కూపంగా మార్చారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావాల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది.ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి. చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి.నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.10 వేల కోట్లు తీసుకురా.. భూమి నేను చూపిస్తా: భూమి కిషన్రెడ్డికి కౌంటర్మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే ఆయన మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురావాలి.పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా.. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.. మంచి భవిష్యత్ ఇద్దాం. మోదీ గుజరాత్కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?. రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి. నగరంలో మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి. గుజరాత్ మెట్రోకు, చెన్నైకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..?..హైదరాబాద్కు తాగు నీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి రూ.7 వేల కోట్లు కావాలి.. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్.. రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్?. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి.. మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి.. మోదీ గుజరాత్కు తీసుకెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తారా?. మూసీలో పడుకోవడం కాదు.. మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు... పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ..మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు?.. హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలా?. మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా మారుతుంది. ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే.. ఇవన్నీ జరగాలి.. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకరించాలి. మీరు నిధులు తెస్తారా? గుజరాత్కు వలస వెళతారా? తేల్చుకోండి’’ అంటూ కిషన్రెడ్డిపై రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్.. ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ. 5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. నగరంలో రెండో అతిపెద్ద ప్లై ఓవర్(జూపార్క్ టు ఆరాంఘర్)ను సీఎం ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో హెచ్సీఐటీసీ ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ జల మండలి (హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. రూ.669 కోట్ల అంచనాలతో ప్రభుత్వం చేపట్టింది.తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించిన సీఎం.. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్ వేర్ను లాంఛనంగా సీఎం ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. -
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని.. పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు‘‘తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉండేది. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. మేము అధికారంలోకి రాగానే వైట్ పేపర్ విడుదల చేశాం. కాంగ్రెస్పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు, వివరించలేదు.మరింత మెరుగైన పాలన అందిస్తాం....వానాకాలంలో కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెలనెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో తొమ్మిదేళ్లు పాలన కొనసాగిస్తాం.’’ అని రేవంత్ తెలిపారు. రైతు భరోసాపై కీలక ప్రకటనరైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వరికి రూ.500 బోనస్ఇ స్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారువేషంలో వచ్చే మారీచులను నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్న వడ్లు పండించాలి. తెలంగాణ, సోనా, బీపీటి, హెచ్ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
పుష్పరాజ్ వీడియోకు స్పందించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’’ అంటూ విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి పలు హ్యాష్ట్యాగ్స్ను జత చేశారు.సీఎం పోస్టుకు బన్నీ రిప్లై ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అంటూ అల్లు అర్జున్ వీడియో ద్వారా పిలుపునిచ్చారు. -
‘మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయంవారెవా తోడు దొంగల నాటకం!కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024 -
‘రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు’
ఢిల్లీ: రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సృజన్రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, దీనిపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.కలెక్టర్ దాడిపై సైతం సీఎం రేవంత్ స్పందించారు. ‘ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు బిఆర్ఎస్ పార్టీ జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా?, అధికారులపై దాడులను బిఆర్ఎస్ ఎందుకు ఖండించదు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరామర్శలా?, కేటీఆర్ ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయి. అవినీతి పార్టీ అయిన బిజెపిని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బిజెపి నేతలను కలుస్తున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా? ’ అని రేవంత్ ప్రశ్నించారు. -
యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు.కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను మంజూరు చేయాలి’’ అని అధికారులకు రేవంత్రెడ్డి సూచించారు.‘‘ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్తో రావాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు.ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్ -
మాటల సీఎం.. చేతలు శూన్యం
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. -
కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్గా నియమించుకున్నామని రేవంత్ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్తగ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్ వివరించారు.పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. -
రేవంత్ పాపం.. ఆయనకు శాపం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్రెడ్డి పాలిట శాపమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసినా..రైతులకు తప్పని పాట్లు!! అంటూ ట్వీట్ చేశారు.‘‘కాంగ్రెస్ వచ్చి.. మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నాం..రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెట్టింది! రైతు బంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. దీనికంతటికీ కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా?’’ అంటూ నిలదీశారు.‘‘ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు? ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడతారు?. రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు.. ఇదేనా ప్రజా ప్రభుత్వం!! ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు!!. ఆరు గ్యారంటీలకు మాది పూచి అన్న గాంధీ ఫ్యామిలీ ..ఈ రైతుల చావులకు బాధ్యత వహించాలి!!. ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య!!’’ అంటూ దుయ్యబట్టారు. ఇదీ చదవండి: 7 పేజీలు.. 54 ప్రశ్నలు -
రేవంత్, బండి సంజయ్లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
కేటీఆర్,హరీశ్రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్రావు సవాల్ -
ఆ రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయి?: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’’ అని అన్నారు.కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది ! విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ !పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు !ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే..… pic.twitter.com/hqiKkXIFrn— KTR (@KTRBRS) October 15, 2024చదవండి: ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా? -
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం: హరీష్రావు
సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు. రేవంత్రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్రావు ప్రశ్నించారు.జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్ది రైతు గుండె.. రేవంత్ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్రావు మండిపడ్డారు.ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్కి కేవీపీ లేఖ -
సీఎం రేవంత్ బండారం బయటపడింది:కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(అక్టోబర్4)ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారింది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీజీపీఎస్సీ ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం -
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్కు కిషన్రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్రెడ్డి నిలదీశారు. -
పరువు నష్టం కేసు.. విచారణకు సీఎం రేవంత్ గైర్హాజరు
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్రెడ్డిపై పరువునష్టం కేసు విచారణ వాయిదా పడింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు అక్టోబర్16కు వాయిదా వేసింది.పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్రెడ్డికి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో సీఎం తీరిక లేకుండా ఉన్నారని రేవంత్రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పర్సనల్ బాండ్, రూ.15వేల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఇదీ చదవండి: మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ -
మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్లో ఉద్రిక్తత -
హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: సీఎం వార్నింగ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో ఇప్పుడు ఎటు చూసినా.. హైడ్రా పేరే వినిపిస్తోంది. చెరువుల్ని మింగి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లంతా.. నోటీసులు, కూల్చివేతల ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో.. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు అధికారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఫిర్యాదులు వెల్లువెత్తడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అటువంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సీఎంవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు.ఇదీ చదవండి: హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్ -
రవ్వంత చేసి కొండంత డబ్బా
హైదరాబాద్, సాక్షి: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యం అని చెబుతూ.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోంది. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అందుకే.. అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ రైతాంగం రగిలిపోతోంది. రైతులకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతాం అని కేటీఆర్ అన్నారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
ఈసారి అప్పులు రూ.62,012కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో అప్పుల పద్దు అదిరిపోయింది. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువగా, మొత్తం రూ.62,012 కోట్లు రుణ సమీ కరణ జరగనుంది. గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన గణాంకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇక గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీల చెల్లింపు కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,117.60 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం రూ.62 వేల కోట్ల రుణ సమీకరణ చేస్తే,అందులో దాదాపు సగం అంటే రూ.30,846 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని కేటాయింపులు చెబుతున్నాయి. ఇవి పోగా మిగతా రూ.31,166 కోట్ల రుణాలను ఈ ఏడాది వినియోగించుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్నఅప్పులు, చెల్లింపులుఏటేటా అప్పుల చిట్టా పెరిగిపోతుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వస్తే, 2023–24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.62 వేల కోట్లను అప్పుల పద్దు కింద ప్రతిపాదించడం గమనార్హం. అయితే తీసుకునే అప్పుల కంటేచెల్లింపులు ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరంఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూలై 24నాటికి రూ.35,118 కోట్లు అప్పుగాతీసుకుంటే.. గతంలో ఉన్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు కట్టామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ.6,050 కోట్లు అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. హైదరాబాద్అభివృద్ధిపైప్రభుత్వానిదిస్పష్టమైన విజన్నగర అభివృద్ధికికేటాయింపులపై మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షంసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ వార్షిక బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన అనంతరం ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ హైదరాబాద్ వాసుల జీవన నాణ్యతను పెంపొందించడానికి, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ‘మెట్రో విస్తరణ ఓల్డ్ సిటీ–శంషాబాద్ విమానాశ్రయంతో సహా కీలక ప్రాంతాలను కలుపుతుంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్లుగా అభివృద్ధి చేయాలని, కనెక్టివిటీని మరింత పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. లండన్లోని థేమ్స్ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా మార్చడానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. హైడ్రా ఏర్పాటు దేశానికే ఆదర్శం’ అని ఉత్తమ్ తెలిపారు. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో పెండింగ్లో ఉన్న 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు హామీపత్రం: రేవంత్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 వార్షిక బడ్జెట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలకు హామీపత్రంగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని బడ్జెట్కు రూపకల్పన చేశామన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని రూపొందించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవిక లెక్కల బడ్జెట్ ఇది. కేంద్ర వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క, ఆయనబృందానికి నా అభినందనలు’ అని రేవంత్ పోస్ట్ చేశారు. -
నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపడానికి, నిధుల కేటాయింపులో అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రాష్ట్రానికి నిధుల కేటాయింపులో, విభ జన హామీల అమల్లో కక్షపూరిత వైఖరినే అవలంబిస్తున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు విభజన చట్టంలోని అంశాలేవీ అమలు కాలేదు. మేం అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నాం. కేంద్ర పెద్దలను కలసి సాయం కోసం విజ్ఞప్తులు చేశాం. స్వయంగా నేను మూడు సార్లు ప్రధానిని.. 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశా. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా. మేం ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలసి ఓ మెట్టు దిగి.. పెద్దన్నగా సంబోధించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరాను. ప్రధానిని పెద్దన్న అన్నందుకు కొందరు నన్ను విమర్శించారు. నాకు సీఎం పదవి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాలేదు. ప్రజల వల్ల, మా పార్టీ వల్ల, 64 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకోవడం వల్ల వచ్చింది. ఎవరినో పెద్దన్న అన్నందుకు రాలేదు. బడ్జెట్లో అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరేందుకే శాసనసభలో చర్చ లేవనెత్తాం. కానీ కొందరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టాలని, ప్రధాని మోదీని కాపాడాలని ప్రయత్నించడం రాష్ట్రమంతా చూసింది.అది కక్షపూరిత వైఖరిదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. తొలి ప్రధాని నెహ్రూ అభివృద్ధికి బాటలు వేస్తే.. ఆయన స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. తర్వాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఆ హామీల అమల్లో నిర్లక్ష్యం వహించింది. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్షపూరిత వైఖరి.రూపాయి చెల్లిస్తే.. వస్తున్నది 43 పైసలేరాష్ట్రం నుంచి ఒక రూపాయిని పన్నులుగా చెల్లిస్తే కేంద్రం తెలంగాణకు తిరిగిస్తున్నది 43 పైసలే. బిహార్కు రూపాయికి రూ.7.26 అందుతున్నాయి. యూపీకి కూడా అంతే. ఐదేళ్లలో తెలంగాణ నుంచి రూ.3.68లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే.. రాష్ట్రానికి ఇచ్చేది రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. మోదీ ఏమైనా గుజరాత్లోని ఎస్టేట్లు అమ్మి తెలంగాణకు ఇచ్చారా? ఆయన జాగీర్దారు అమ్మి ఇచ్చారా? మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి. ఐదు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22.26 లక్షల కోట్లు అయితే.. కేంద్రం వీటికి తిరిగి ఇచ్చింది రూ.6.42 లక్షల కోట్లు మాత్రమే. అదే యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చినది రూ.3.41 లక్షల కోట్లు అయితే.. కేంద్రం యూపీకి తిరిగిచ్చింది రూ.6.91 లక్షల కోట్లు. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క యూపీకి ఇచ్చినది ఎక్కువ. ఇదీ కేంద్రం వివక్ష కాదా.. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
రాచకొండలో ఫిలింసిటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు ‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం. ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు! ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది. పోటీ పరీక్షల షెడ్యూల్పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్బాబు, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కల్లెంత?..నీళ్లెంత? – గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ అబ్దుల్లాపూర్మెట్: ‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’ ‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్రెడ్డి లష్కర్గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు 2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
సీఎం రేవంత్ కామెంట్స్పై స్పందించిన టీఎప్సీసీ
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచనలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాం అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలతో మాట్లాడని ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ని కలిసి మాట్లాడతామని ప్రకటనలో పేర్కొన్నారు.కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. అలా అయితే టికెట్ ధరలు పెంచుతామని కండీషన్ పెట్టారు. -
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం(జూన్21) కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.వ్యవసాయం దండగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపించాలనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదా పద్ధతుల్లో చేసి రైతు ఆత్మహత్యలకు కారణమయింది. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు భరోసాపై పారదర్శకంగా అందరి సూచనల మేరకే అమలు చేస్తాం.ప్రభుత్వ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించాం. ఉపసంఘంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొంగులేటిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇక నుంచి మీడియాకు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాత్రమే చెప్తారు. వీరిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారం. వీరిని మంత్రివర్గ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాం. రుణమాఫీ అర్హుల ఎంపిక విధివిధాలపై త్వరలోనే జీవో విడుదలవుతుంది’అని రేవంత్రెడ్డి తెలిపారు. -
ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికే ‘మహిళా శక్తి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కలి్పంచేందుకే.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలమన్నారు. ఇందుకు అనుగుణంగా మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడళ్లను అధికారులు గుర్తించాలని సూచించారు. మహిళా సంఘాలను డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళల ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని.. ఆధార్ కేంద్రాలు, మీసేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కలి్పస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.గురువారం రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శక్తి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీపై డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులే ‘మహిళా శక్తి’కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించిన అధికారులను అభినందించారు. ఆగస్టు 15 న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. పీఆర్ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, టీజీఐఆర్డీ సీఈవో కాత్యాయిని, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభంసాక్షి, హైదరాబాద్: సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించనున్నారు. మహి ళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్థిక పురోగతికి కృషి చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి సూచనలకు అనుగుణంగా వీటికి మంత్రి తుదిరూపునిచ్చారు. బిహార్లో అమలు చేస్తున్న దీదీ–కి–రసోయి మోడల్కు అనుగుణంగా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను రూపొందిస్తున్నారు.సచివాలయంతో పాటు కలెక్టర్ ఆఫీస్ కేంద్రాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, ఆర్టీíసీ బస్టాండ్లు, ఇండ్రస్టియల్ పార్కులు, రిజి్రస్టేషన్ ఆఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంకలి్పంచారు. రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున మొత్తం 150 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యాంటీన్లు పెట్టే మహిళాసంఘాలకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో శిక్షణ, వివిధ రూపాల్లో ప్రభుత్వ సహకారాన్ని అందించనున్నారు. క్యాంటీన్ల మోడళ్లను బట్టి ఒక్కో దానికి ఏటా రూ.ఏడున్నర లక్షల నుంచి రూ.12 లక్షల దాకా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
'సీతా కళ్యాణ వైభోగమే' చిత్ర యూనిట్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలే కాకుండా మన నేటివిటీని, మన ఆచార సంప్రదాయాల్ని చూపించే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. కానీ మన ఆచార, సంప్రదాయాలు, మన సంస్కృతిని చాటేలా, మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమాను సతీష్ పరమవేద తెరకెక్కించారు.సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ వద్దకు చిత్రయూనిట్ వెళ్లింది.సీఎం రేవంత్ రెడ్డికి చిత్ర టీజర్, ట్రైలర్ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్ను వీక్షించిన ముఖ్యమంత్రి చిత్రయూనిట్ను ప్రత్యేకంగా నిర్మాతను అభినందించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవ్వాలని, యూనిట్కు మంచి పేరు రావాలని ఆయన అన్నారు అన్నారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు. -
రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
కీరవాణి వివాదంపై సీఎం రేవంత్రెడ్డి రియాక్షన్
ఢిల్లీ, సాక్షి: స్వల్ప మార్పులతో ‘జయ జయహే తెలంగాణ..’ గేయాన్ని రూపకల్పన చేసే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందుకు సంగీత స్వరకల్పన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఎంచుకోవడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పందించారు. హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీరవాణిని ఎంపిక చేసిన వివాదంపై స్పందించారు. ‘‘కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చాం. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని ఆయనకే అప్పగించాం. కీరవాణిని అందెశ్రీయే ఎంపిక చేశారు. సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్రేమీ లేదు. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేశా’’ అని వివరణ ఇచ్చారు. 👉::అత్యంత పారదర్శకంగా నా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలేదు,కోతలు లేవు.. కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు మాత్రం నెలకొన్నాయి. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికల జరిగాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం లో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాం. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ఆరోపణలు ప్రతిపక్షాలు సైతం చేయలేదు.👉::కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటా. దాని ఆధారంగానే ముందుకు వెళతాం. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక్క విరిగిందని నేను ముందే చెప్పాను. గత ప్రభుత్వం ఎత్తిన నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టాం.👉::ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఇంకా రివ్యూ చెయ్యలేదు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదు. ప్రస్తుతం ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాల్సి ఉంది. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించడం లేదు. అలాంటి పనులు కూడా చేయను నేను. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే హరీష్ రావు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది. 👉::తెలంగాణ అంటేనే రాచరికనికి వ్యతిరేకం. త్యాగాలు, పొరటాలు గుర్తొస్తాయి. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం. రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇచ్చాం, ఆయన తెలంగాణ నిజామాబాద్ బిడ్డ. అధికారిక చిహ్నం లో కాకతీయ తోరణం ఉండదు. సమ్మక్క, సారక్క - నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉండనుంది. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుంది. కీరవాణి వివాదంఅందెశ్రీ రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాహిత్యంలో స్వల్ప మార్పుల అనంతరం.. ఈ పాటని స్వర పరిచే అవకాశం కీరవాణికి అప్పగించారు. ఆ తర్వాత రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్రెడ్డి సందర్శించారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. అసలు రచ్చ మొదలైంది. Telangana CM Revanth Reddy held a discussion with Poet Ande Sri & Composer MM Keeravani on 'Jaya Jayahe Telangana' anthem song. To be released on June 2. The muted audio was released by Telangana government sources. #Telangana #Revanth #MMKeeravani pic.twitter.com/1HDJABekZR— Sudhakar Udumula (@sudhakarudumula) May 26, 2024 ఆంధ్రాకు చెందిన కీరవాణి వద్దంటూ.. తెలంగాణ సినీ సంగీత సంఘం ఏకంగా సీఎం రేవంత్కు ఓ లేఖ రాసింది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లాంటి వాళ్లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే ఉన్నట్లు తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది?? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక??ముఖ్యమంత్రి @revanth_anumula గారు,కీరవాణి… pic.twitter.com/yMd2sRVrRl— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 27, 2024 -
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
న్యూఢిల్లీ, సాక్షి: రాజకీయాలతో ముడిపడిన కేసు, పైగా రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గనుకే.. ఓటుకు నోటు కేసు విచారణ ప్రభావితం కాకుండా మరో చోటుకి బదిలీ కోరుతున్నామని సుప్రీం కోర్టులో పిటిషనర్ వాదించారు. శుక్రవారం ఉదయం ఓటుకు నోటు కేసు పిటిషన్కు సంబంధించిన విచారణ జరిగింది.ఈ పిటిషన్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. అయితే రెండు వైపుల నుంచి కౌంటర్ మాత్రం దాఖలు కాలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది బెంచ్ను కోరారు. అయితే.. కౌంటర్ తప్పకుండా వేయాలంటూ తాము ఆదేశించలేమని జస్టిస్ గవాయితో కూడిన త్రిసభ్య ధర్మాసనం, పిటిషనర్కు స్పష్టం చేస్తూ విచారణను జులైకి వాయిదా వేసింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణ భోపాల్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపుతోంది.ఇక.. విచారణ సమయంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో పరిస్థితి శ్రుతి మించడంతో ‘‘ఇంతటి క్రమశిక్షణరాహిత్యాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ జస్టిస్ బిఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ కేసు విచారణను భోపాల్కే ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని బెంచ్ పిటిషనర్ను ప్రశ్నించింది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టే.. బదిలీ కోరుతున్నామని జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది బెంచ్కు తెలియజేశారు.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తున్న పిటిషన్లో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాలు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు పేరెక్కడ?చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు. -
సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడను: సీఎం రేవంత్
సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్కు పంపించి, తనను అరెస్ట్ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
మహబూబ్నగర్: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసమే రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ సీఎం రేవంత్రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలుచేస్తున్నామని, పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డీకే అరుణ పాలమూరుకు చేసిందేమిలేదని, ఆమె మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో మోదీ, పాలమూరులో డీకే అరుణ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మాజీ చైర్మన్ రాధ, నాయకులు బెనహర్, బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రీ, సాయిబాబా, లక్ష్మణ్యాదవ్, ఫయాజ్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు
-
రామగుండం NTPC స్టేజ్ వన్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
-
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీఎం రేవంత్తో బొంతు రామ్మోహన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నగరంలో పట్టు పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్లో చేరగా, తాజాగా.. సీఎం రేవంత్రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, సీఎం రేవంత్ను కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బీఆర్ఎస్పై బొంతు రామ్మోహన్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్లో అసంతృప్తి రగిలింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. లోక్సభ సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్గా మారిందా? -
గ్రూప్-1పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ‘బీఆర్ఎస్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు. అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం. ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9వ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశాం. ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచాం. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ల నాయకున్ని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ అప్పటి పాలకులు టీజీకి బదులు టీఆర్ఎస్ వచ్చేలా టీఎస్ అని పెట్టుకున్నారు. దానిని మార్చాం. రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించాం’ అని రేవంత్ తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1.. వయోపరిమితి 46 ఏళ్లు ‘ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తాం. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైంది. తొందరలోనే పోలీస్ శాఖలో 15వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్సిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషులనే వాళ్లు అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా భాధ్యత. బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చెయ్యను. గతపు ఆనవాళ్లు సమూలంగా ప్రక్షాళన చేసే భాధ్యత నాది. కాళోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లుగా పూర్తి చెయ్యలేదు గత ప్రభుత్వం’ అని రేవంత్ విమర్శించారు. గతంలో ఒకరిది అగ్గిపెట్టె డ్రామా.. ఇప్పుడొకరిది ఆటో డ్రామా ‘తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు 9 నెలల పాటు పడ్డాయి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేశాం. ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు. గతంలో ఒకరు అగ్గిపెట్టె డ్రామాలు ఆడితే...మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు. వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి...కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదు’ అని రేవంత్ బీఆర్ఎస్కు చురకలంటించారు. ఇదీ చదవండి.. ధర్మపురి అర్వింద్కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ -
సీఎం రేవంత్ చిట్చాట్.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్పై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత రేవంత్రెడ్డి గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని, ఆయన ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవడంలేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి, బీఏసీకి కూడా రాలేదంటే కేసీఆర్ చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్షనేతగా ఆయన తన బాధ్యత నిర్వర్తించాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గది మార్పు నిర్ణయం స్పీకర్కు సంబంధించినదని చెప్పారు. బీఏసీ సమావేశానికి రాకుండా హరీశ్రావును తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు. బీఏసీకి వచ్చేవారి జాబితాలో కేసీఆర్ కడియం శ్రీహరి పేరు ఇచ్చారన్నారు. హరీశ్రావుకు బీఏసీకి అనుమతివ్వాలో లేదో స్పీకర్ నిర్ణయిస్తారు. రేపు బీఏసీకి కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సెషన్లో రాష్ట్రంలో కులగణణపై తీర్మానం ఉంటుందని చెప్పారు. టీఎస్పీఎస్సీపై పూర్తి పప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. మరిన్ని అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది అనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చన్నారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టులను అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సీఎంగా తాను ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తానని రేవంత్ అన్నారు. ఇదీ చదవండి.. తెలంగాణలో బీజేపీది ఒంటరి పోరే -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్పై విచారణ వాయిదా -
ఆర్థిక వనరులు పెంచుకోవడం ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్సింగ్ అహ్లూవాలియా శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధుల సమీకరణ, అలాగే ప్రజలపై భారం పడకుండా ఏవిధంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న అంశంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని, అందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని, మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిందని అహ్లూవాలియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాలు, సూచనలు కావాలని కోరా రు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా.. పన్నుల వసూళ్ల గురించి అహ్లూవాలియా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, డిప్యూటీ సీఎం విక్రమార్కకు వివరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. -
అప్పులున్నా.. ఆర్థిక భారమైనా ఉద్యోగాలిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వానికి అప్పులు ఉన్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా.. వాళ్ల కుటుంబానికి ఉద్యోగాలు గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంలా వాళ్ల ఉద్యోగాలను తొలగించారని రేవంత్రెడ్డి అన్నారు. -
బీఆర్ఎస్ చచ్చింది.. బీజేపీతోనే మా పోరు : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పోరు బీజేపీతోనే టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. బావ, బామ్మర్దులు ఇటీవల బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కాంగ్రెస్ను విమర్శించడమే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననడానికి నిదర్శనమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై మంగళవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు గెలవాల్సిందే. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు పరిష్కారం అవుతాయి. పదేళ్లలో విభజన హామీలను కేసీఆర్ అడగలేదు. మోదీ నెరవేర్చలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం. భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాం. మార్చి 3వ తేదీ వరకు ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తాం. ఎన్నికల సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీకి గుజరాత్ నేత జిగ్నేష్ మెవానీ అధ్యక్షత వహిస్తారు. మార్చి 15 నుంచి 20 లోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) లోక్సభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటుంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసే సభతో పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూర్తిస్తాం. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు. కోదండరాంను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునేందుకే కోర్టులో కేసులు వేశారు. కేసీఆర్కు కోదండరాం గొప్పతనం తెలియదు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా అపాయింట్మెంట్ ఇస్తా. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు లకు కూడా సమయం ఇస్తా. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని తీర్మానం చేసి పంపాం. సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరిస్తామని ఆశిస్తున్నాం. బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఉంటాయి. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఇరిగేషన్పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. ఇదీచదవండి.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం -
TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? విస్తరణ ఇప్పటికే ఆలస్యం అయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసిందా? ఇంతకీ ఎవరెవరికి రేవంత్ క్యాబినెట్లో బెర్త్లు కన్ఫాం అయ్యాయి? పదవుల కోసం పైరవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అతి త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా, ఈ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అదిష్టానం సీఎం రేవంత్రెడ్డితో మరోసారి చర్చించి నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత క్యాబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు క్యాబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్రావు బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి వచ్చారు. అందువల్ల మాల కమ్యూనిటీకే చెందిన వివేక్కు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా.. ఆయనకు పోటీగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా..ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే సీఎంతో కలుపుకుని నలుగురు రెడ్డి వర్గం మంత్రులున్నారు. రెడ్డి వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నా..సుదర్శన్రెడ్డి.. మల్రెడ్డిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత క్యాబినెట్లో బీసీ సామాజికవర్గాల్లో మున్నూరు కాపు, గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. అందువల్ల ఇతర బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు విస్తరణలో మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురు బీసీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్లుగా పదవులు పొందారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్.. రజకవర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీల నుంచి సీతక్కకు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఒక మైనారిటీకి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఒక్క మైనారిటీ నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అదిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరినైనా ఆకర్షించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మాదిగ వర్గం నేతకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా తన క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించేలా క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆలోచన ఎంత మేరకు అమలవుతుందో చూడాలి. ఇదీచదవండి.. పార్లమెంట్ సన్నాహాలతో బీఆర్ఎస్ శ్రేణుల చైతన్యం -
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు
-
రాజ్నాథ్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బృందం పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ రోజు రక్షణమంత్రి రాజ్నాథ్తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ.1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు!
నారాయణపేట: ‘కొడంగల్ ఎమ్మెల్యే తనను.. పేట ఎమ్మెల్యేగా పర్ణికారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపితే కొడంగల్, నారాయణపేటలను హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆ విధంగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా. కొడంగల్ అభివృద్ధికి నిధులు ఎలా మంజూరు చేస్తానో.. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గానికి ఇస్తా..’ అని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పేరిట జీఓను విడుదల చేయించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలన్నీ కొత్త సంవత్సరంలో అమలు కావాలని.. పేట అభివృద్ధి పరుగులు తీయాలని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన సంవత్సరంలో అడుగులు వేసి ప్రగతిలో పరుగులు తీయించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, 2023 సంవత్సరంలో జిల్లా అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి పడినట్లయింది. ఇండస్ట్రియల్ పార్క్లు.. జిల్లాలో ఉపాధి లేక ముంబయి, హైదరాబాద్, పూణె, బెంగళూర్ నగరాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. నూతన సీఎం ఎనముల రేవంత్రెడ్డి కావడంతో జిల్లాకు పరిశ్రమలకు పునాదులు పడుతాయని ఈ ప్రాంత వలసజీవులు ఆశాభావంతో ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్కు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని వలసజీవులకు ఇక్కడే జీవనోపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్, ఆత్మకూర్ ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లు చేయాలని జనం ఆకాంక్షించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనం ఎంతో ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. నూతన ఏడాదిలో నారాయణపేట నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు గార్లపాడు, కానుకుర్తి, కోటకొండ మండలాలను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల అవుతుందనే శుభావార్త వినాలని కోరుకుందాం. ఈ ప్రాంతంలో వ్యవసాయంపైనే ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవిస్తుంటాయి. జాయమ్మ చెరువును నింపి సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించాలని రైతులు ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు. కలెక్టరేట్.. జిల్లా ఆస్పత్రికి పునాదులు.. జిల్లాకు ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి రూ.55 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆయా భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను గుర్తించి గతేడాది కలెక్టరేట్కు తాజా మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. కొత్త ఏడాదిలో నూతన ప్రభుత్వంలో పునాదులు పడుతాయని ఆశిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి పనులు పూర్తయి, మెడికల్ కళాశాల ప్రారంభమై, విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
TS: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి తమ వివరాలు కనుక్కుని మరీ సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఇదీచదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. ‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్రావు విమర్శించారు. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో.. ఇంద్రవెల్లి స్తూపంపై ఫోకస్!
సాక్షి, ఆదిలాబాద్: గురువారం ఉదయం 11 గంటల సమయం.. కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులతో ఇంద్రవెల్లి స్తూపం వద్దకు చేరుకున్నారు. మొదట అమరవీరులకు నివాళులర్పించారు. స్తూపం సమీపంలో మొక్క నాటారు. ఆ తర్వాత గ్రామసభలో పాల్గొన్నారు. ఇక్కడ స్మృతివనం ఏర్పాటుకు గ్రామసభ తీర్మానం చేసింది. కలెక్టర్ స్మృతివనం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేవంత్రెడ్డి ఆదేశాలతో.. ఓ వైపు రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. గురువారం ఉదయమే కలెక్టర్ రాహుల్రాజ్కు ఇంద్రవెల్లి స్తూపం వ ద్ద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ చ్చాయి. దీంతో వెంటనే కలెక్టర్ రంగంలోకి దిగి గ్రా మసభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. ఫోకస్ ఎందుకంటే..? సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి స్తూపం వద్ద అభివృద్ధిపై ప్రమాణ స్వీకారం రోజే దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా 2021 జులైలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో దళిత, గిరిజన దండోరా పేరిట సభలు తలపెట్టారు. ఇందులో భాగంగా 2021 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఇంద్రవెల్లిలో స్తూపం సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ రోజు రాష్ట్రంలో అందరి చూపు ఆసభ పైనే ఉంది. లక్ష మందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు కారణం. అన్నట్లుగానే జనసమీకరణ జరగడం, ఇంద్రవెల్లి సభ సక్సెస్ కావడం కాంగ్రెస్లో ఉత్సాహం నింపింది. ఆ రోజు అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించిన రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రధానంగా ఆదివాసులను ఆకట్టుకుంది. 1981 ఏప్రిల్ 20న గిరిజనులు భూమిపై హక్కుల కోసం ఇంద్రవెల్లిలో సమావేశం నిర్వహించగా ప్రభుత్వ ఆంక్షల కారణంగా పోలీసులు వారిపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అప్పటినుంచి ప్రతీ ఏడాది గిరిజనులు ఈ స్థలంలో అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో అక్కడ స్తూపం నిర్మించారు. అయితే గత పాలకులు ఇక్కడ అభివృద్ధి చేపడతామని చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
సీఎం రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ప్రధాని మంత్రి నరేద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తాడని తాను హామీ ఇస్తున్నానని’ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula — Narendra Modi (@narendramodi) December 7, 2023 ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. -
తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్పై రేవంత్ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది గత ప్రభుత్వం.. ప్రజల బాధలు పట్టించుకోలేదు పదేళ్లు బాధలను ప్రజలు మౌనంగా భరించారు తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తా అమరవీరుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది పొన్నం ప్రభాకర్ కామెంట్స్ మంత్రి అవుతానని ముందే ఊహించా ఏ పోర్ట్ పోలీయో ఇచ్చినా సమ్మతమే మంత్రి కావాలనే కోరిక నెరవేరింది మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తాను సాక్షి టీవీతో పొంగులేటి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా పాలన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం గత ప్రభుత్వంలా కక్షపూరితంగా మేం వ్యవహరించం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కామెంట్స్ అబద్ధాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారు కేసీఆర్ రిటైర్ అయ్యి ఫాం హౌస్కే పరిమితమైతే మంచిది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు వికారాబాద్ నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్కుమార్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్న ఉత్తమ్, సీతక్క, పొన్నం ఎల్బీబీ స్టేడియంకు చేరుకున్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 12:10PM, Dec 7, 2023 కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు రాజకీయంగా ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్లకు ధన్యవాదాలు ఈ జీవితం ప్రజలకే అంకితం: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏ మంత్రి పదవి ఇచ్చినా నిజాయితీతో పనిచేస్తా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మరకలేకుండా పని చేశా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన రాబోతుంది ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయబోతున్నాం 11: 35AM, Dec 7,2023 హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియం బయలు దేరిన ఎమ్మెల్యేలు 11: 10AM, Dec 7,2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి 10: 50AM, Dec 7, 2023 భట్టి విక్రమార్క నివాసానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎం గా ఎన్నికైన భట్టికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10: 20AM, Dec 7, 2023 జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం.. మంత్రివర్గంలో పొంగులేటికి చోటుదక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలవడం వెనక కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాలో సైతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ప్రచారం నిర్వహించిన పొంగులేటి 10: 15AM, Dec 7, 2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. 9:50AM, Dec 7, 2023 పొన్నం ప్రభాకర్ కు స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి పొన్నం ఇంట సందడి.. స్వీట్ తినిపించి అభినందించిన కుటుంబసభ్యులు తల్లి మల్లమ్మ ఆశీర్వాదం తీసుకున్న పొన్నం ప్రభాకర్. పొన్నంకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందోత్సవాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ కాబోయే మంత్రులు వివరాలను రాజ్భవన్కు తెలియజేసిన రేవంత్ కాబోయే మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుపుతున్న ఠాక్రే తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు నేటి (గురువారం) మధ్యాహ్నం కొత్త మంత్రివర్గం ప్రమాణం ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న భట్టి 9:15AM, Dec 7, 2023 శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయల్దేరిన రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీల నిర్మాణం ప్రధాన స్టేజీకి ఇరువైపులా రెండు వేదికలు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రమాణీస్వీకారానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞత సభ ఎల్బీ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు 3వేల మందితో భద్రతా ఏర్పాట్లు స్టేడియం లోపల, బయట మెటల్ డిటెక్టర్లు, పోలీస్ జాగిలాలతో తనిఖీలు స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద డిటెక్టర్లు ఏర్పాటు నిజాం కాలేజీ నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకూ వాహనాల పార్కింగ్ హైదరాబాద్కు సోనియా, రాహుల్ నేడు హైదరాబాద్కు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంక ఉదయం 9:30కి హైదరాబాద్ చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వేడుక కోసం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఆరు గ్యారంటీల అమలు ఫైల్పై రేవంత్ తొలి సంతకం చేసే చాన్స్ మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా సచివాలయంలోకి ఎంట్రీ భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఏర్పాట్లు ఇలా.. జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. -
తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. కలిసొచ్చిన ముక్కోణ పోటీ.. నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్లో ఏలేటి మహేశ్వర్రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(బీఆర్ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి. ముథోల్లో బీఆర్ఎస్కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్ఎస్ 22వేల మెజార్టీ సాధించింది. ఎస్టీ స్థానాల్లో బీఆర్ఎస్.. పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్ఎస్కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీకి కొత్త ముఖాలు.. రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిట్టింగ్ల ఓటమి! సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్లో విఠల్రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. -
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్కు రేవంత్రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
చివరికి బకరాలుగా మిగిలేది రేవంత్, హరీష్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బండారాన్ని మోదీ బయట పెట్టారన్న బండి.. అడ్డా మీది కూలీలను తెచ్చి కండువా వేస్తున్న బీఆర్ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా లిస్ట్ ఢిల్లీకి వెళ్లింది.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్కి వెళ్లింది. పెద్ద సార్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్న లిస్ట్. పాపం ఇది రేవంత్కి తెలీదు’’ అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చే అవకాశం లేదు. వీరిద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రేవంత్, హరీష్లు ఇద్దరు బలిచ్చే బకరాలు. కాంగ్రెస్లో బకరా రేవంత్ అయితే, బీఆర్ఎస్లో హరీష్ రావు’’ అని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన -
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూ ప్–1 పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగలేఖ రాశా రు. ‘మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫ లమే ఈ దుస్థితి. మీ అన్యాయమైన, దుర్మార్గ మైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో మీకు శిక్ష తప్పదు. తెలంగాణ ఏర్పా టైన నాటి నుంచి నిరుద్యోగ, విద్యార్థులకు అడుగడుగునా పరాభవమే ఎదురవుతోంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు, సింగరేణి, ఎంసెట్ పేపర్ల లీకేజీ, విద్యుత్ సంస్థల నియామక పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో మోసం పరాకాష్టకు చేరింది. ఏం జరిగినా మీరు పట్టించుకున్న పాపాన పో లేదు. లక్షలాది మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్న ఆలోచన మీకు ఏ కోశానా లేదు. అసలు పరీక్షలు రద్దు కాదు. మీ సర్కారును రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది’ అని ఆ లేఖలో రేవంత్ విమర్శించారు. -
కేసీఆర్ ఖేల్ఖతం.. బీఆర్ఎస్ దుకాణ్ బంద్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి గట్టికౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల వైఖరిని పోలుస్తూ 10 అంశాలను ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, కేసీఆర్ ఖేల్ ఖతం–బీఆర్ఎస్ దుకాణ్ బంద్’అని ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాల్లో గుణాత్మక మార్పునకు డిక్లరేషన్ అని ఆ ట్వీట్లో రేవంత్ స్పష్టం చేశారు. ట్వీట్లో పేర్కొన్న అంశాలు ♦ మా డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం కాదు ళీ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం కాదు ♦ గిరిజన రిజర్వేషన్లు 12 శాతం పెంచుతామని మోసం చేయడం ళీ మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం ళీ నేరెళ్ల ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ♦ కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం ♦ మరియమ్మను లాకప్డెత్ చేయడం లాంటిది కాదు ♦ కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకొని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం కాదు ళీ ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేయడం కాదు ♦ దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తి పడడం కాదు కాంగ్రెస్లో చేరిన నాగర్కర్నూల్, అచ్చంపేట నేతలు జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నాగర్కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ దళిత, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గ్రామ గ్రామాన తిరిగి ప్రతి తలుపూ తట్టాలని, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
TS Election 2023: గీతారెడ్డి ఇంటికి రేవంత్రెడ్డి..
సంగారెడ్డి: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే శనివారం రాత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్తో కలిసి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడం చక చకా జరిగిపోయాయి. తన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు జహీరాబాద్ నియోజకవర్గంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన వారని, భార్య స్వస్థలం జహీరాబాద్ కావడంతో తనకు కలిసివస్తుందని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ నెల 18న కాంగ్రెస్లో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్ పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది. గీతారెడ్డి ఇంటికి రేవంత్రెడ్డి.. మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి జె.గీతారెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి ఎంపీపీ అధ్యక్షుడు ఎన్.గిరిధర్రెడ్డితో కలిసి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల కారణంగా గీతారెడ్డి ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుముఖంగా లేనట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి, లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలనే దానిపై ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తన స్థానంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని, గెలిచే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గీతారెడ్డి సూచించినట్లు వినికిడి. ఈ సందర్భంగా వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు ప్రస్తావనకు రాగా ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2 వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు. చదవండి: లిక్కర్ స్కాం: కల్వకుంట్ల కవిత పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే రేవంత్రెడ్డికి ఎందుకంత ద్వేషం అంటూ మంత్రి జగదీశ్వర్రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందన్నారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్కు ఏడుపెందుకు? అంటూ జగదీశ్వర్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు వెళ్లిపోయిన ఆయన వారసత్వం కొనసాగుతోంది. బాబు పీడకలలు ఇక్కడ ఇంకా కనబడుతున్నాయి. తెలంగాణ వచ్చాక కరెంట్ కోతలు తప్పాయి.. రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ రేవంత్రెడ్డి మాటలతో మళ్లీ పిడుగులు పడ్డాయి. రేవంత్రెడ్డి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు.. ఆనాడు కరెంట్ కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఇవ్వటం లేదని రేవంత్రెడ్డి ధర్నాలో పాల్గొన్నాడని మంత్రి గుర్తు చేశారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
కేసీఆర్ అవినీతిని ఆపితే 55 లక్షల మందికి పింఛన్ ఇవ్వొచ్చు : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కడుపుకు అన్నం తినేవారెవరూ రాహుల్గాంధీ అర్హత గురించి ప్రశ్నించరని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా రాహుల్ ఏ పదవినీ తీసుకోలేదని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీకి తప్ప తెలంగాణలో పర్యటించేందుకు ఇంకెవరికి హక్కు ఉంటుందని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రాహుల్ ప్రకటించిన విధంగా వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో.. బీఆర్ఎస్ నేతలు అంటకాగుతున్న ప్రధాని మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే హక్కు ఉందా అని రేవంత్ నిలదీశారు. ‘రాహుల్గాం«దీని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు అసలు ఏం అర్హత ఉంది? ట్విట్టర్ పిట్ట, సోడా కలిపేటోడు, భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతున్నారు..’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం ప్రారంభించాయని అన్నారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు పన్నిందని, అక్కడి సైకో మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేసినా, కుట్రలను ఛేదించి ఖమ్మంలో సభను విజయవంతం చేశారని అన్నారు. ఇందుకు ఖమ్మం ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అన్ని హామీలు నిలబెట్టుకున్న చరిత్ర మాది దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ దని రేవంత్ అన్నారు. భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ సహా, శ్రీరాంసాగర్, జూరా ల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, లక్షకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, అనేక ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, ఆర్టీఐ, ఆహా ర భద్రతా చట్టాలు, యూనివర్సిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయని చెప్పారు. తాము ప్రాజె క్టులు తెస్తే, బీఆర్ఎస్ నేతలు ఫామ్హౌస్లు తెచ్చారని విమర్శించారు. కాళేశ్వరంపై చర్చకు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు. ఈ విషయంలో చర్చ పెడితే తమ పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులం హాజరవుతామని, మంత్రులు హరీశ్, కేటీఆర్లు సి ద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రాహు ల్ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదన్నారు. బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను రానివ్వబోమని, ఒకవేళ వస్తే మెడలు పట్టి గెంటేస్తామని అన్నారు. రూ.4 వేల పింఛన్ మా తొలి ప్రాధాన్యత రూ.4 వేలు పింఛన్ ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ అవినీతిని ఆపితే మొత్తం 55 లక్షల మంది పింఛన్దారులకు తాము హామీ ఇచ్చిన విధంగా పింఛన్ ఇవ్వొచ్చని చెప్పారు. తెలంగాణ ఇచి్చనట్టే రూ.4 వేల పింఛన్ ఇచ్చి తీరుతామని అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న పింఛన్ను రూ.4 వేలకు పెంచడం పెద్ద కష్టమేమీ కాదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆయా రాష్ట్రాల జనాభా, పార్టీలకుండే ప్రాధాన్యతల మేరకు పథకాలు అమలవుతాయని రేవంత్ చెప్పారు. -
దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్
-
ఆ పార్టీలో రేవంత్ రెడ్డి చిచ్చు ..!
-
బిఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య బూతుల మోత
-
ఆ బూతులేంటి రేవంత్ సార్ ?
-
రేవంత్ రెడ్డి తో గరం గరం ముచ్చట్లు
-
తలసాని తకిడతకిడత..
-
TS: కాంగ్రెస్ ‘నిరుద్యోగ ఉద్యమం’! 50 లక్షల మంది యువత పక్షాన పోరాటం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీలపై నిరసనలతోపాటు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేశాకే పరీక్షల నిర్వహణ, పేపర్ల లీక్ కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్న డిమాండ్లతో నిరుద్యోగులతో కలసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కేంద్రంగా పోరాటం ప్రారంభించనుంది. ఎంజీ వర్సిటీ విద్యార్థులతో కలసి నిరసన చేపట్టిన అనంతరం.. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ నిరుద్యోగ సభలు నిర్వహించనుంది. ఈ మూడు జిల్లాల్లో కార్యక్రమాల అనంతరం హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో భారీగా నిరుద్యోగ సభ నిర్వహించాలని.. దానికి కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకాగాంధీని ఆహా్వనించాలని నిర్ణయించింది. మే నెల మొదటి వారంలో.. ఈనెల 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్లో సభ నిర్వహించిన తర్వాత మే 4న, లేదా 5న సరూర్నగర్ సభ జరపాలని కాంగ్రెస్ భావిస్తోంది. సభ రోజున తొలుత ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించి.. అక్కడి నుంచి ర్యాలీగా సరూర్నగర్ స్టేడియానికి చేరుకోవాలని నిర్ణయించింది. ప్రియాంకాగాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారా? నేరుగా సరూర్నగర్ సభకు హాజరవుతారా? ఆమె ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు? 4, 5 తేదీల్లో ఏ రోజున సభ జరుగుతుందన్న అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ బిజీగా ఉన్నారని.. ఆమె వీలును ఒకరోజు ఇక్కడికి వస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం ఏం చేస్తామనే అంశాలను ఆమె సభలో ప్రకటిస్తారని పేర్కొన్నాయి. ఇక సరూర్నగర్ సభ తర్వాత నాలుగైదు రోజుల విరామం తర్వాత మే 9 నుంచి రేవంత్రెడ్డి రెండో విడత హాథ్సే హాథ్ జోడో యాత్రను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. మంగళవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు: రేవంత్ ‘‘టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో నిరసన వ్యక్తం చేసిన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులను ఐదు రోజులు జైల్లో పెట్టారు. అదే టెన్త్ పేపర్లు లీక్ చేశాడంటూ పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేసిన బండి సంజయ్కు మాత్రం తెల్లారేసరికి బెయిల్ వచి్చంది. ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ తీవ్రంగా పోరాడిన తర్వాత.. బీజేపీ ఏదో ఒక చిల్లర పంచాయితీ చేస్తుంది. దాన్ని పెద్దది చేయడంలో బీఆర్ఎస్ సహకరిస్తుంది. సంజయ్ అరెస్టు, వెంటనే బెయిల్ దీనికి నిదర్శనం. బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కుకు ఇదే ఉదాహరణ’’అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్ మోసం చేశారని.. ఒకేరోజు 2లక్షల ఉద్యోగాలిస్తామని బండి సంజయ్ మోసపు మాటలు మాట్లాడుతున్నారని.. నిరుద్యోగుల పక్షాన క్షేత్రస్థాయి నుంచి పార్లమెంటు వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. సంజయ్ మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని.. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో ఆయనకు తెలుసా? అని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా కలసి రావాలి.. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని రేవంత్ మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. తాను పార్లమెంటులో ఈ విషయమై ప్రశ్న అడిగితే.. ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని వివరించారు. తాము చేస్తున్న పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. 50లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. తమ పోరాటాల్లో విద్యార్థులు సామాజిక బాధ్యతగా పాల్గొనాలని.. నిరసన దీక్షల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఇక కమలనాథుల యాత్రల జాతర -
రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ యాక్సిడెంట్... బెలూన్లు ఓపెన్ కావడంతో..
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. (చదవండి: డీఎల్పీవోపై కొనసాగుతున్న విచారణ) -
పాదయాత్రల్లో బ్యాలెన్స్ తప్పుతున్న నేతలు
తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పాదయాత్రలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పాదయాత్రలను సఫలం చేయడం కోసం, ప్రజలను , కనీసం తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం వారు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ పాదయాత్రలు పోటాపోటీగా సాగుతుంటే, ఆంద్రప్రదేశ్లో ఒక పాదయాత్ర జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాని, ఏపీలో టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ కానీ పదజాలం వాడడంలో బ్యాలెన్స్ కోల్పోతున్నారు. రేవంత్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా పాదయాత్ర చేస్తున్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య పూర్తిగా ఆక్షేపణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ను పేల్చేయాలని ఆయన మావోయిస్టు భాష మాట్లాడడంపై అధికార బీఆర్ఎస్ మండి పడింది. ఆయనపై పిడి చట్టం పెట్టి అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసింది. రేవంత్ పొరపాటున ఈ మాట అని ఉంటే వెంటనే సరిచేసుకునేవారు. కాని ఆయన కావాలనే ప్రగతి భవన్ను పేల్చివేయాలని అన్నారని అర్ధం అవుతుంది. ఎందుకంటే దానిని సమర్ధించుకుంటూ తన ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలను రానివ్వడం లేదని, ఎంపీలు ఎమ్మెల్యేలను అనుమతించడం లేదని అలాంటి ప్రగతి భవన్ ఉంటే ఏమిటి?లేకుంటే ఏమిటి అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ చేయలేదని, నిరుధ్యోగ బృతి హామీని నెరవేర్చలేదని ఇలా పలు కారణాలు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రశ్నించవచ్చు.అలాకాకుండా ఏకంగా ప్రభుత్వ భవనాన్ని పేల్చి వేస్తామని అనడం రేవంత్ రెడ్డి నోటి దురుసుతనానికి నిదర్శనం అవుతుంది. గతంలో కూడా ఆయన ఇలాగే ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారు. ఆయన మరో మాట కూడా అన్నారు. 2000 సంవత్సరం నాటికి కేసీఆర్ కుటుంబం రబ్బరు చెప్పులతో ఉందని , ఇప్పుడు కోట్లకు పడగలెత్తిందని ఆయన ఆరోపించారు. అది వాస్తవం కాదు. 1985 నుంచే కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసగా ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. మంత్రి పదవి నిర్వహించారు. 2000 తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలను తనదారిలోకి తెచ్చుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన అత్యంత ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాదించిన నేతగా గుర్తింపు పొందారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతపై రాజకీయ విమర్శలు చేయవచ్చుకాని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ ఏవైనా ఆరోపణలు చేయదలిస్తే నిర్దిష్ట ఆధారాలతో చేయాలి. రేవంత్ రెడ్డి ఒక రకంగా ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పాలి. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాక జరిగిన ఉప ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.బిజెపి రెండో స్థానంలో ఉంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి బేస్ ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఊహించనిదే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడానికి, అలాగే ప్రజలలో మళ్లీ ఆదరణ పొందడానికి రేవంత్ నానా పాట్లు పడుతున్నారు. ఒకపక్క కాంగ్రెస్ లో వర్గ కలహాలు, మరోవైపు కాంగ్రెస్ నానాటికి దెబ్బతింటున్నదేమోనన్న ప్రచారం నేపద్యంలో ఆయన తొందరపాటుగా మాట్లాడుతున్నారు. రేవంత్ మాటలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమి చేస్తారన్నది పక్కనబెడితే మంత్రి కెటిఆర్ అడిగినట్లు ప్రగతి భవన్ ను పేల్చడం కాంగ్రెస్ విధానమా అంటే దానికి పార్టీ నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. జానారెడ్డి, మల్లు భట్టి వంటివారు దీనిని ఆమోదిస్తారా అని కెటిఆర్ ,హరీష్ రావు ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు. మాటల దాడి చేయడం అన్నిసార్లు కలిసిరాకపోవచ్చు. అది అర్ధవంతమైనది అయితే ఫర్వాలేదు కాని, హింసను ప్రేరేపించేదిలా ఉంటే అది పార్టీకి నష్టం జరుగుతుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఒక పెద్ద సమస్య అవుతుంది. దానిని రేవంత్ గుర్తుంచుకుని డైలాగులు వదలితే మంచిదని చెప్పాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో లోకేష్ చేస్తున్న పాదయాత్ర నిత్యం వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై సభలు నిర్వహించడమే కాకుండా, వద్దని వారించినపోలీసులపై అనుచితంగా లోకేష్ మాట్లాడుతున్నారు.ఒక సభలో లోకేష్ పోలీసులను ఉద్దేశించి వేలు చూపుతూ ,వారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. ఇది ఏ పాటి విజ్ఞతో ఆయనే తెలుసుకోవాలి. అంతేకాదు .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం సరైన విధానం కాదు. అందులోను ఒరేయ్ అంటూ సంభోధించడం దారుణంగా ఉంది. అందువల్లే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సమాధానం ఇస్తూ చంద్రబాబును తాము ఒరేయ్ అంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇరువైపులా ఇలాంటి విషయాలలో సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకేష్ కు ఉనికి సమస్య ఎదురుఅవుతోంది. ఆయన పాదయాత్రకు జనం పెద్దగా రావడం లేదన్న బాధ ఉండవచ్చు. దానికి తోడు పార్టీ ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేత ఒకరితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో కొన్ని చోట్ల లోకేష్ పాదయాత్రకు జనం లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించి చంద్రబాబు బాదపడ్డారని చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలా జనాన్ని పోగు చేయాలో, వాహనాలలో ఎలా చేరవేయాలో వారు చర్చించుకున్నారు. లోకేష్ ముందుగా తన తెలుగు పరిజ్ఞానాన్ని పెంచుకుని, ఆ తర్వాత మంచి భాషతో ప్రసంగాలు చేయడం నేర్చుకుంటే ఆయనకు ఉపయోగం ఉంటే ఉండవచ్చేమో కాని, ఇప్పుడు మాదిరి ఏది పడితే అది మాట్లాడితే ఆయనకే నష్టం. తెలంగాణలో వైఎస్ ఆర్ టిపి నేత షర్మిల, బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ లు కూడా పాదయాత్రలు సాగిస్తూ ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఒక్కోసారి పరిధులు దాటుతున్నారన్న భావన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా నేతలు మరీ రెచ్చిపోకుండా మాట్లాడితే మంచిదని చెప్పాలి. కాని ఇది అత్యాశే అవుతుందా! కొసమెరుపు ఏమిటంటే టీడీపీ నేత జెసి దివాకరరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయానికి వెళ్లి పాదయాత్రల వల్ల ప్రయోజనం లేదని, ఆ రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. అటు రేవంత్కు ఇటు లోకేష్కు దివాకరరెడ్డి ఈ సందేశం ఇస్తున్నారా! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ప్రధాని మోదీకి రేవంత్రెడ్డి లేఖ
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ లేఖ రాశారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎన్డీఆర్ఎఫ్ విస్తరణ, రైతులు, మృతుల బంధువులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని కోరారు. అలాగే వీటితో పాటు రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం తక్షణ సహాయ ప్యాకేజీని రూ.2,000 కోట్లు విడుదల చేయాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. Telangana Congress chief Revanth Reddy writes to PM Modi, requesting to declare Telangana floods a National Disaster, along with NDRF deployment, financial compensation to farmers & kin of deceased & an immediate relief package of Rs 2000cr for repair & construction of roads pic.twitter.com/jissNY9M1x — ANI (@ANI) July 16, 2022 -
అమ్నేషియా పబ్ కేసు: కార్లు ఎవరివి.. ప్రశ్నల వర్షం కురిపించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్ చెప్పలేదు. ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్లు తొలగించింది ఎవరు?. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్ చెప్పడం లేదు. మైనర్ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు: హోం మంత్రి మహమూద్ అలీ -
అమిత్షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్షాకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. అమిత్షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు. మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అంటూ లేఖలో మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకం అని అర్థమైయిందని నిప్పులు చెరిగారు. చదవండి: తెలంగాణ కడుపు కొడుతోంది! లేఖలో రేవంత్ ఏమన్నారంటే? ‘‘అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు వదిలారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపింది మీ ప్రభుత్వం. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా మీ పాలనలో వ్యవసాయంలో గుణాత్మక మార్పు అన్నది జీరో. ఇక తెలంగాణ విషయానికి వస్తే... బీజేపీ-టీఆర్ఎస్లు ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ ఇద్దరూ కలిసి విజయవంతంగా తుంగలో తొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడో సారి మీరు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి మీరు ఇచ్చిన మాట లేదు.. చేసిన పనీ లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే.. మీరు చోద్యం చూస్తున్నారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదు. ఇటీవల మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. మీ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న మీ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని... మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!? తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీరు, కేసీఆర్ కలిసి మొదట ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. యాసంగి (2022) నుండి తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రభుత్వం చేయకూడదు అన్నది ఆ ఒప్పందం. దానికి రైతుకు సంబంధం లేని బాయిల్డ్ రైస్ అని ఒక వంక తెర మీదకు తెచ్చారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతుల వద్ద ధాన్యం కొంటుంటే ప్రభుత్వానికి రూ.7000 కోట్ల నష్టం వచ్చిందని కుంటి సాకులు చెప్పారు. వరి వేస్తే ఉరే అని హెచ్చరికలు చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వబోమని సంకేతాలు పంపారు. ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్ 4న మీ ఆదేశాల మేరకే FCI కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో "కల్లాల్లోకి కాంగ్రెస్" అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. మీ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా!? గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై టీఆర్ఎస్ మౌనందాల్చినా... కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. మీరు స్పందించ లేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు అని మీరు భావిస్తున్నారా!? మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు మీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా!? తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే రిక్తహస్తం చూపిస్తున్నా ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ మీరు అనేక సందర్బాల్లో మద్ధతిస్తూ వచ్చింది. ఇది బహిరంగమే. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన మీ ఇద్దరినీ మేం ఎందుకు నమ్మాలి... మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు? అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా "రామాయణం సర్క్యూట్" పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ పేరిట రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కిలో మీటర్లు సాగే ఈ సర్క్యూట్ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా!? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా!? ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే... అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు? పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడగే బుద్ధి టీఆర్ఎస్ సర్కారుకు లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్ధతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్ధతు.. ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది!? 2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.1052 ఎగబాకాయి. మీరు అధికారంలోకి వచ్చాక దశల వారిగా గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ - టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. మీరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని మీరు డ్రామాలు చేయడం తప్ప... ప్రజలకు ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి? అమిత్ షా గారూ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణకు ఏ మొఖం పెట్టుకుని వస్తారు? మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ - టీఆర్ఎస్ జిత్తులు, ఎత్తులు గ్రహించ లేని అమాయకులా తెలంగాణ ప్రజలు? మా ప్రజలకు ఒపిక ఎక్కువ... దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన తెగువగల ప్రజలు మా వాళ్లు. సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదు’’ అంటూ రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. -
డిసెంబర్లో ప్రభుత్వం రద్దు.. మార్చిలో ఎన్నికలు
పోచారం: ‘వచ్చే డిసెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు, మార్చిలో ఎన్నికలు, ఆపై కేసీఆర్ ఆత్మహత్య ఖాయం. తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుంటాడు’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశదిమ్మరిలా.. కాలు కాలిన పిల్లిలా.. చెట్టు మీద కోతిలా దేశమంతా తిరుగుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు’అని మండిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో తుపాకుల కాల్పులు, మహబూబ్నగర్లో మంత్రులను చంపాలనే కుట్ర వంటి ప్రతి సంఘటనలో టీఆర్ఎస్ నాయకుల పాత్రే ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్లో పంపకాల లొల్లితో ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నారని, కేసీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అప్పనంగా గుంజుకుం టోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములకు యజమానులను చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రగతి భవన్ను అంబేడ్కర్ విద్యా కేంద్రంగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారులో సభ్యులకే తొలి ప్రాధాన్యం లక్షా 30 వేల కాంగ్రెస్ సభ్యత్వాల నమోదుతో మం చిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం మొదటి స్థానం లో, 92 వేలతో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచాయని రేవంత్ చెప్పారు. 30 లక్షల సభ్యత్వాలను డిజిటల్ పద్ధతిలో చేస్తామని సోనియాగాంధీకి చెప్పి 40 లక్షలు చేయగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించగలిగితే 90 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కార్యకర్తలే కథానాయకులవుతారని,చెప్పారు. చివర్లో స్థానిక నాయకులను సత్కరించకుండానే ఆయన సభాస్థలి నుంచి నిష్క్రమించడంతో కొందరు కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యా య వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీవో రద్దు కోసం ఉపాధ్యాయ సంఘా ల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఉద్య మానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతి స్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే టీచర్ల ధర్నాల్లో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఉపాధ్యాయులకు సంఘీభావం తెలపాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. -
సమీక్ష పై మీడియాలో వచ్చిన ఏ కథనం కూడా నిజం కాదు
-
కేసీఆర్పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
-
తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మల్లారెడ్డి
-
కోవర్టులపై వేటు వేద్దాం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టుల విషయంగా కఠినంగా వ్యవహరించాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అలాంటి వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా వేటు వేయాలని తీర్మానించింది. శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన జూమ్ యాప్ ద్వారా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, దళిత–గిరిజన దండోరా అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో కోవర్టుల అంశాన్ని గోపిశెట్టి నిరంజన్ లేవనెత్తారు. కోవర్టులను గుర్తించి ఏరిపారేయాలని సూచించారు. దీనిపై మరికొందరు సభ్యులు కూడా స్పందించారని.. కోవర్టుల వ్యవహారం వల్ల క్షేత్రస్థాయిలోని పార్టీ కేడర్లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని, సన్నిహితులను కూడా నమ్మే పరిస్థితి ఉండదని పేర్కొన్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కోవర్టులను బహిష్కరించాలన్న డిమాండ్ వచ్చినట్టు సమాచారం. ఇక పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాల విషయంలో నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోవాలని సమావేశంలో సభ్యులు సూచించారు. సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటివారిని మరింత దగ్గరికి తీసుకోవాలని కోరారు. దీనిపై రేవంత్రెడ్డి స్పందిస్తూ.. పీసీసీ కార్యక్రమాలన్నీ సమష్టి నిర్ణయంతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా.. ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడం పట్ల పీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ నెల 18న చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోని రావిర్యాలలో తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉపఎన్నికపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. -
రైతు ఉద్యమానికి కేసీఆర్ మద్దతు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా మిగిలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ ఎంపీలు కనీసం రైతులకు సంఘీభావం తెలపలేదని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని కిసాన్ సంసద్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా 15 విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు కేసీఆర్ ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఏ విషయంలో అయినా కేసీఆర్, ప్రధాని మోదీ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ తెస్తున్న చట్టాలకు కేసీఆర్ మద్దతు పలుకుతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే, వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తుందని రేవంత్రెడ్డి చెప్పారు. వ్యవసాయ చట్టాలను చేసి కేంద్రం రైతులను మోసం చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏక వాక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోకాపేట భూముల సందర్శనకు ఈరోజు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులు మొహరించారు. రేవంత్రెడ్డి గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట వేలం భూముల వద్ద నిరసన నేపథ్యంలో వీరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు ప్లాన్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. కోకాపేట భూముల వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు. కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి. -
పగ్గాలు ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి మార్పు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చర్చనీయాంశమవుతోంది. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ విషయంలో ఈసారి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఉత్తమ్ స్థానంలో కొత్త నాయకుడిని నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తుండగా.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీతోపాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని, ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువనాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మేడమ్.. నేను వైదొలుగుతా! హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన అనంతరం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాందీని కలిశారు. రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితులు, హుజూర్నగర్లో ఓటమికి కారణాలను వివరించడం తో పాటు తాను టీపీసీసీ అధ్యక్షుడిగా వైదొలుగుతానని ఆమెకు చెప్పారు. పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనే స్వయంగా అభ్యరి్థంచడంతో టీపీసీసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచి్చనట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ్కు అవకాశమిచ్చి ఒకట్రెండు రాష్ట్రాలకు ఇంచార్జిగా నియమించాలనే యోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. సామాజిక వర్గాలవారీగా సమీకరణలు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఢిల్లీ పెద్దల దృష్టికి ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వెళ్లాయి. ఈ జాబితాలో ఎంపీ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్బాబు, జీవన్రెడ్డి పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి తెరపైకి వచ్చారు. ఆయ న్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అంశా న్ని అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్తోపాటు మాస్లో మంచి ఇమేజ్ ఉన్న రేవంత్, కోమటిరెడ్డిల పేర్లు కూడా అదేస్థాయిలో వినిపిస్తున్నాయి. రేవంత్కు రాష్ట్రంలో ఉన్న క్రేజ్ను బట్టి ఆయన్ను వ్యూహాత్మకంగా ముందుకు తేవాలనే ఆలోచన సోనియా, రాహుల్కు ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డిపై కూడా సోనియా, రాహుల్కు సానుకూలత ఉందని.. ఇద్దరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. సామాజిక వర్గాలవారీగా చూస్తే ఈసారి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే యోచన అధిష్టానానికి ఉందని, ఆ క్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్లను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. గ్రేటర్లోనూ మార్పు.. టీపీసీసీ అధ్యక్షుడితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ స్థానంలో మాజీమంత్రి ముఖేశ్గౌడ్ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్గౌడ్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్తో పాటు పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, మైనార్టీ నేత ఫిరోజ్ఖాన్ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. -
ఉత్తమ్, రేవంత్ తోడు దొంగలు
సాక్షి, హుజూర్నగర్ రూరల్ : ఉత్తమ్, రేవంత్రెడ్డి ఇద్దరు తోడుదొంగలని, వారు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. శనివారం హుజూర్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలతో రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఒకరని, గత ఎన్నికల్లో రూ.3 కోట్లు కారులో కాలబెట్టుకున్న దొంగ మ రొకరని రేవంత్, ఉత్తమ్నుద్దేశించి ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలని.. వారిద్దరూ కలిసి హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలు చెప్పడం, విమర్శలు చేయడమే తప్ప ని యోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి హామీలూ ఇ వ్వలేదన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి గతంలో మా యమాటలు చెప్పి ప్రజలను తనవైపు తిప్పుకున్నారని, ఇప్పుడే జరిగే ఉపఎన్నికల్లో చెప్పడానికి ఏమీ లేక ఆధికారులు, ప్రభుత్వం, ఆభ్యర్థిపై విమర్శలకు దిగాడని విమర్శించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మా పార్టీ అభ్యర్థి ఇక్కడ లేడంటూ, భూకజ్జాలు చేశాడం టూ ఉత్తమ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సైదిరెడ్డి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో ఎవరి వెంట రౌడీలు ఉన్నారో ప్రజలుకు తెలుసన్నారు. 20 ఏళ్లుగా పెంచి పోషించిన ఆ రౌడీలే ప్రజల అస్తులను దోచుకొని, భూములను ఆక్రమించి శాంతిభద్రతలను నాశనం చేశారని ఆరోపించారు. వారి ఆగడాలను భరించలేక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టులో నిజంగా ముం పునకు గురయ్యే వ్యవసాయ భూములను వది లిపెట్టి ముంపునకు గురికాని, 20 ఫీట్లలోతు నీ రు వచ్చిన మునిగిపోని పీక్లానాయక్తండాను తన అనుచరుల కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలను దోచిపెట్టారని విమర్శించారు. డబ్బు, భూ మాఫియాకు పాల్పడేది నువ్వేనని ఉత్తమ్ నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు ఎంతో మంది కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని ఆరోపించారు. ఉత్తమ్ బీజేపీతో మిలాఖత్ అయ్యాడని విమర్శించారు. పద్మావతికి టికెట్ వద్దని, కుటుంబపాలన చేస్తున్నావని విమర్శించిన వ్యక్తితో నేడు ఇక్కడ ప్రచారం చేయిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, మీ దివాళా కోరుతనమే మీ ఓటమి కారణం కాబోతుందని ఎద్దేవా చేశారు. ఈసారి మోసపోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని పే ర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకా రం ప్రచారం పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తీసుకువచ్చి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను ఆపి తనిఖీ చేయించినా బాధ్యత గల పౌరులుగా తాము అధికారులకు సహకరించామని పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదులను తీసుకోకపోయినా చాలా ఓపికగా ఉన్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ తమ వైపే ఉన్నారని అన్నారు. 20 రోజులుగా చేసిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరించిన సమస్యలపై ఆలోచించి టీఅర్ఎస్ ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్య యాద వ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టేట్లో ఫైట్.. సెంట్రల్లో రైట్: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్–బీజేపీల ఫైట్ ఉత్తుత్తిదేనని తాము చెప్తున్న మాటలు గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో రుజువయ్యాయని ఎంపీ రేవంత్రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటుంటే, మొన్నటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ కాళేశ్వరం అద్భుతమంటూ ప్రశంసించడం ఏంటని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
‘సిద్దిపేట, సిరిసిల్లలే మీ పతనానికి సంకేతం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తిరస్కరణ భావం మొదలైందని, లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన కేటీఆర్కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ‘ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికం. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటున్నారు. గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. మీ సొంత గడ్డ సిద్ధిపేట, మీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలలోనే మెజారిటీలు దారుణంగా పడిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్ లో మీ కుటుంబ సభ్యులు ఓడిపోయారు. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతం. మల్కాజ్ గిరిలో నా గెలుపు గురించి మీరు మాట్లాడే మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. 2009లో సిరిసిల్లలో మీ పరిస్థితి ఏమిటి? చావుతప్పి కన్నులొట్టబోయినట్టు స్వతంత్ర అభ్యర్థి పై కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. మల్కాజ్ గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు.’అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు. -
‘మల్కాజ్గిరిలో అనుమానాస్పద ఓట్లు’
సాక్షి, హైదరాబాద్: తాను పోటీ చేస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు చోట్ల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ తరహా ఓట్లపై చర్యలు తీసుకో వాలని బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలించినపుడు పలు చోట్ల ఒకే ఇంటి నంబరుతో అనేక ఓట్లు ఉండటాన్ని తాను గుర్తించానని, ఇది అసాధ్యమని రేవంత్ వివరించారు. ఇలాంటి అనుమానాస్పద ఓట్లపై పరిశీలన జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. -
రేవంత్కు సీపీఐ మద్దతు
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సీపీఐ మద్ధతిచ్చేందుకు అంగీకరించింది. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులతో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్ధతివ్వాలని వారిని రేవంత్ కోరారు. సమావేశం అనంతరం తాము మల్కాజిగిరిలో రేవంత్రెడ్డికి మద్ధతిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. లౌకిక శక్తులకు మద్దతు: చాడ ‘పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వమని రేవంత్ కోరారు. మాల్కాజ్ గిరి లోని సీపీఐ నేతలందరూ రేవంత్ గెలుపు కోసం కృషి చేస్తారు. బీజేపీ హఠావో దేశ్ బచావో అని పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లౌకిక శక్తులకు మద్దతిస్తున్నాం. డిఫీట్ బీజేపీ, డిఫీట్ టీఆర్ఎస్ అనే నినాదంతో ముందుకెళతాం’అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అరాచకాలపై పోరు.. ‘కేసీఆర్ అరాచకత్వంపై పోరాడటానికి సీపీఐ మద్దతు అడిగాను. మాల్కాజ్గిరిలో ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. వారి మద్ధతుంటే తప్పకుండా గెలుస్తా. అరాచకత్వానికి మోదీ, కేసీఆర్ బొమ్మ– బొరుసుల్లాంటి వారు. బీజేపీ చేసిన పనులన్నింటికి కేసీఆర్ మద్ధతిచ్చి ఇప్పుడు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీలో మోదీని, ఇక్కడ కేసీఆర్ను నిలువరించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరం. కేసీఆర్కు వేసిన ప్రతీఓటు మోదీకి వేసినట్టే. సినిమాలో గచ్చిబౌలి దివాకర్ పాత్ర లాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఓ జోకర్’. అని భేటీ అనంతరం చాడ, రేవంత్లు వెల్లడించారు. -
కొడంగల్ ఫలితంపై జోరుగా బెట్టింగ్
సాక్షి, కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ స్థానంపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. రేవంత్రెడ్డి, నరేందర్రెడ్డి అభిమానులతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వేలు, లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. రేవంత్రెడ్డి గెలుస్తారని కొందరు.. లేదు నరేందర్రెడ్డి విజయం సాధిస్తారని మరికొందరు పందేలు కాస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ఎవరూ గెలువలేదు. గతంలో గురునాథ్రెడ్డి రెండు పర్యాయాలు గెలిచినా హాట్రిక్ సాధించలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. మూడోసారి గెలిచి హాట్రిక్ సాధిస్తాననే ధీమాతో రేవంత్ ఉన్నారు. రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షra, పరోక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఓడిపోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆయన ఓటమి చూడలేదు. కాగా, ప్రస్తుతం కొడంగల్ ఎన్నికలు ఫలితం ఎవరికీ అంతుపట్టడం లేదు. నెలరోజుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతోపాటు రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం బరిలోకి దిగి ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. నరేందర్రెడ్డి మంత్రి మహేందర్రెడ్డికి స్వయాన సోదరుడు కావడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొడంగల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గులాబీ అధిష్టానం కంకణం కట్టుకుంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి సహకారం తీసుకున్నారు. గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రేవంత్రెడ్డి సైతం విజయంపై భరోసాతో ఉన్నారు. ఈనెల 11న ఫలితం వెలువడనుంది. ఈనేపథ్యంలో కొడంగల్ ఫలితంపై నేతలు బెట్టింగ్ కాస్తున్నారు. -
నాపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి : రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ను ప్రతివాదులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. తనను టార్గెట్ చేసుకుని పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా రేవంత్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది. -
రేవంత్పై సమాధానం దాటవేసిన దేవినేని
-
రేవంత్పై సమాధానం దాటవేసిన దేవినేని
సాక్షి, విజయవాడ: ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలపై నోరు విప్పాలంటేనే వారు వణికి పోతున్నారు. ఆయన సూటిగా లేవనెత్తిన అంశాలకు వారి దగ్గర సమాధానం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేవంత్ విషయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడానికి వెనకడుగు వేశారు. రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులపై చేసిన ఆరోపణల విషయంలో ఎలా స్పందిస్తారని ప్రశ్నించిన మీడియాకు ఉమ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆయన చేస్తున్న విమర్శలపై సమాధానం దాట వేశారు. రేవంత్ విమర్శలను తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుతుందని ఆయన తప్పించుకున్నారు. -
రేవంత్ ఝలక్.. టెన్షన్.. టెన్షన్
సాక్షి, అమరావతి : ఏపీ టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీ టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏపీ టీడీపీ నేతల వ్యాపార లావాదేవీల చిట్టా విప్పడంతో వారంతా ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడి రూ.2వేల కోట్ల కాంట్రాక్ట్, పరిటాల, పయ్యావుల కుటుంబీకులకు బీర్ల కంపెనీల వ్యవహారాలను రేవంత్రెడ్డి బయటపెట్టడంతో ఏపీ మంత్రులు టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరి లావాదేవీలు రేవంత్ రెడ్డి బయటపెడతారోనని వారు భయపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అసలు నిజాలు బయటపెడితే టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుగానీ, లోకేష్గానీ, మంత్రులుగాని నేరుగా స్పందించలేదు. రేవంత్రెడ్డి తాము విమర్శిస్తే మళ్లీ ఏ విషయం బయటపెడతారో అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రేవంత్ వ్యవహారంపై లోకేష్ ఏమన్నారంటే..?
సాక్షి, అమరావతి : తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ స్పందించారు. లోకేష్ పార్టీ మారుతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. రేవంత్ పార్టీ మారతారని వస్తున్న వార్తలపై లోకేష్ వివరణ ఇచ్చారు. పార్టీ మారుతానని రేవంత్ ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టు పని మీద ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనతో చెప్పారన్నారు. కంభంపాటి రామ్మోహన్రావు రేవంత్ను కలిసిన సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు. మీడియాలో చేసిన హడావుడికి తానెందుకు స్పందించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తనతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని ఓ పక్క రేవంత్రెడ్డి చెప్పినప్పటికీ లోకేష్ ఆ విషయాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. టీఆర్ఎస్తో తెలంగాణ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, ఆ మేరకు చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో లోకేష్ వివరణ ఇచ్చారు. రేవంత్ వ్యవహారంపై వస్తున్న వార్తలపై లోకేష్ వివరణ -
సర్కారును ఇరుకున పెట్టండి
తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, కీలకమైన ప్రజా సమస్యలపై నిలదీయాలని తెలంగాణ టీడీపీ నాయకులకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు. రేవంత్రెడ్డిపట్ల వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్కు లేఖ ఇవ్వాలని భావిస్తున్నారు. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగితే మరిం త తీవ్రంగా స్పందించాలని యో చిస్తున్నారు. స్పీకర్పైన, లేదా ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రతిపాదన చేయగా, పార్టీ అధినేత అది సరికాదని సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అనే అంశంపై టీఆర్ఎస్కు చెందిన బీసీ ఎమ్మెల్యేలు టీడీపీపై ఎదురుదాడికి దిగారు. బీసీనేత స్పీకర్ అయితే టీడీపీ సహించడం లేదన్న వాదనను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూ పాలని, సస్పెండ్ కావడం, గొడవకు దిగడం కూడదని బాబు హెచ్చరించినట్లు తెలిసింది. కలిసి ఉన్నామన్న సందేశాన్ని పంపించాలని బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్కు టీడీపీ నాయకత్వం సూచిం చినట్లు సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం స్పీకర్ను కలిసి తమ హక్కులను కాపాడాలని కోరనున్నట్లు టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. -
కేసీఆర్ పెట్టించే కేసులు.. వెంట్రుక కూడా పీకలేవు
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల పర్వం తారస్థాయికి చేరుకుంది. నాయకులు విమర్శలు, సవాళ్లతో ఎన్నికల వాతావారణాన్ని వేడిక్కిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పెట్టించే అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరని, ఆ కేసులతో వెంట్రుక కూడా పీకలేవని అన్నారు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. మెదక్ ఎన్నికల ప్రచారంలోనే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను మరోసారి సమైక్యాంధ్ర మద్దతుదారులని అంటే చెప్పుతో కొడతామంటూ వ్యాఖ్యానించారు.