salary
-
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
నా పేరు జి.సుధీర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్ నాకు వేరే బ్రాంచ్కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్గా ప్రోసీడ్ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.– జి. సుధీర్, హైదరాబాద్.ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు. అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది. మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్ /లేబర్ కమిషనర్ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్. కమిషనర్ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్కు రాజీనామా లేఖను అందజేయండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!) -
ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది. -
సునీతకు ట్రంప్ సొంత డబ్బు ఇస్తానని ఎందుకు ప్రకటించారు?
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలిపారు.నాసా ఎంత జీతం ఇస్తోందంటే.. నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్ఎస్లో సునీత, విల్మోర్లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్ఎస్లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.కిందటి ఏడాది జూన్లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్గా భూమ్మీదకు తీసుకొచ్చింది. -
Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్లు(butch wilmore) భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్లిద్దరు మార్చి 19 (బుధవారం) భూమ్మీదకు రానున్నారు.ఈ క్రమంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వ్యోమగాముల జీత భత్యాలపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగాఆస్ట్రోనాట్ జీతం ఎంతంటే?అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లో జీఎస్(జనరల్ షెడ్యూల్)-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 136,908 నుంచి 178,156 డాలర్ల వరకు వేతనాలు తీసుకునేవారు. ఆ లెక్కన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ల ఏడాది వేతనం అంచనా ప్రకారం.. 125,133 నుంచి 162,672 డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41కోట్ల వరకు) ఉంటుంది.నాసా అంత చెల్లించదుపరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్లకు నాసా 93,850 డాలర్ల నుంచి 122,004 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం (భారత కరెన్సీలో రూ.81లక్షల నుంచి రూ.1.05 కోట్లు). కానీ, నాసా అంత చెల్లించదని, ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు (రూ.347 )మాత్రమే చెల్లిస్తుందని రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్మన్ తెలిపారు. మరీ ఇంత తక్కువాసునీతా విలియమ్స్ ,బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో 8 రోజులకు బదులు 287 రోజులు గడపాల్సి వచ్చింది. ఆ లెక్కన కేవలం రూ1,148డాలర్లు (రూ.1లక్ష) అదనంగా తీసుకోనున్నారు. ఫలితంగా, అసలు జీతంతో పాటు అదనంగా 1,148 డాలర్లు (సుమారు రూ. 1లక్ష) చెల్లించనుంది. ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 డాలర్ల నుంచి 123,152 డాలర్ల వరకు (సుమారు రూ. 82 లక్షలు - రూ. 1.06 కోట్లు) ఉంటుందని అంచనా. నేటికి 284 రోజులుసునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్లైనర్కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. -
ఈ బ్యాంక్ సీఈఓ జీతం ఎంతో తెలుసా?: ప్రపంచంలోనే..
గురువారం విడుదలైన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్లో.. భారత సంతతికి చెందిన సీఈఓ 'పియూష్ గుప్తా' (Piyush Gupta) వేతనం భారీగా పెరిగింది. 2024 సంవత్సరానికి 56 శాతం వేతన పెంపును పొందారు. దీంతో ఆయన వేతనం 17.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 110 కోట్ల కంటే ఎక్కువ) చేరింది.సింగపూర్కు చెందిన DBS గ్రూప్ హోల్డింగ్స్ సీఈఓ గుప్తా.. 2023లో డిజిటల్ బ్యాంకింగ్ లోపాల కారణంగా 11.2 మిలియన్ సింగపూర్ డాలర్లను వార్షిక వేతనంగా తీసుకున్నారు. ఆ తరువాత ఈయన వేతనం క్రమంగా పెరిగింది. ఇప్పుడు 17.6 మిలియన్లకు చేరింది. కాగా పియూష్ గుప్తా ఈ నెలలో తన పదవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో 'టాన్ సు షాన్' నియమితులయ్యారు. ఈయన మార్చి 28 నుంచి DBS గ్రూప్ హోల్డింగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు.2024 సంవత్సరానికి పియూష్ గుప్తా.. తన ప్యాకేజీలో 6.6 మిలియన్స్ క్యాష్ బోనస్, 2.5 డాలర్స్ ఇతర అలవెన్స్ వంటివి పొందారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. కాగా మొదటి వ్యక్తి.. స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో 'బిల్ వింటర్స్' ఉన్నారు.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..గత 15 సంవత్సరాలుగా.. డీబీఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరుగుతోంది. 2009లో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 35 బిలియన్ సింగపూర్ డాలర్స్ కాగా.. 2024 నాటికి ఇది 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన సింగపూర్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరింది. 2009లో కేవలం 14,000 మంది ఉద్యోగులు మాత్రమే ఈ బ్యాంకులో పనిచేసేవారు. ఈ సంఖ్య 2024కు 41,000 మందికి చేరింది. డీబీఎస్ బ్యాంక్ సీఈఓ జీతం మాత్రమే కాకుండా.. ఇతర సీనియర్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. -
తిరగని బతుకు మీటర్!
అనంతపురంలో పని చేస్తున్న మీటర్ రీడర్(Meter reader) డేవిడ్కు(పేరు మార్చాం) మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇలాగైతే కుటుంబ జీవనం సాగించేదెలా? ఇలాగే ఉంటే మరో రెండు నెలలు వేతనాలు కూడా ఇవ్వరు. దీనిపై కాంట్రాక్టర్లతో గట్టిగా మాట్లాడాలి అంటూ వారి వాట్సాప్ గ్రూప్లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. వేతనాల కోసం గట్టిగా అడిగితే వారి ఖాతా క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తామంటూ కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటర్ రీడర్స్(Meter readers) ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాంలే.. ఉన్న ఉద్యోగం పోతే అంతే సంగతులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనంతపురం టౌన్: విద్యుత్(Electricity) వినియోగదారులకు ప్రతి నెలా బిల్లును తీసి అందించే మీటర్ రీడర్ల బతుకు మీటర్ మాత్రం తిరగడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలు కావొస్తున్నా వేతనాలు మాత్రం అందడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి నెలా తమకు రావాల్సిన బిల్లులను విద్యుత్ సంస్థ నుంచి తీసుకుంటూ మీటర్ రీడర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. వేతనాలపై జీవనం సాగిస్తున్న దాదాపు 220 మంది మీటర్ రీడర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వేతనాలు అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట.. వేతనాల కోసం అడిగితే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారనే వాయిస్ను కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పంపారు. దీంతో వారు వేతనాలు ఇవ్వకపోయినా గట్టిగా అడగలేని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ఏరియాలకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను విద్యుత్ శాఖ అధికారులు పిలిచారు. 250 మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు.విద్యుత్ శాఖ(electricity department) అధికారులు ఏక పక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులకే స్పాట్ బిల్లింగ్ టెండర్లను ఖరారు చేశారు. టెండర్లలో ఎవరు తక్కువకు కోట్ చేశారనే విషయాలను పరిశీలించకుండానే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు వ్యక్తులకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను కట్టబెట్టారని అప్పట్లోనే అప్పటి ఎస్ఈపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ పొంది ఐదు నెలలు కాగా దాదాపు 3 నెలల వేతనం మీటర్ రీడర్స్కు పెండింగ్ పెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకునే వారేరీ?.. మీటర్ రీడర్లకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీటర్ రీడర్ల అధికారికంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేతనాలపై లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో మీటర్ రీడర్లు ఉన్నారు. దీన్ని అసరాగా చేసుకున్న స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మీటర్ రీడర్ల వేతనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.రెండు రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు మీటర్ రీడర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రతి నెలా వారి ఖాతాల్లో 5వ తేదీలోగా వేతనాలు జమ చేసేలా చూస్తాం – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం -
ఇన్ఫోసిస్లో 20 శాతం వరకు వేతన పెంపు
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగులకు వేతన సవరణలను ప్రకటించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 5% నుంచి 20% వరకు ఇంక్రిమెంట్లను అందిస్తూ కంపెనీ వేతన పెంపు లేఖలను విడుదల చేసింది. ఉద్యోగులను మూడు విధాలుగా వర్గీకరించి ఈ పెంపును వర్తింపజేసినట్లు కంపెనీ తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం సంస్థ అంచనాలను చేరుకున్నవారికి 5-7 శాతం పెంపు, ప్రశంసనీయమైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 7-10 శాతం పెంపు, పనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతనాలు పెంచినట్లు తెలిపింది. అయితే గరిష్ఠంగా వేతనాల పెంపు అందుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా ‘అవసరాల మెరుగుదల(నీడ్స్ ఇంప్రూవ్మెంట్)’ కేటగిరీలోని ఉద్యోగులకు ఎలాంటి పెంపు లభించలేదు.పెంపు అమలు తేదీలుసవరించిన వేతనాలు జాబ్ లెవల్ 5 (టీమ్ లీడర్ల వరకు), జాబ్ లెవల్ 6 (మేనేజర్ల నుంచి వైస్ ప్రెసిడెంట్ల కంటే తక్కువ స్థాయి వరకు)లోని ఉద్యోగులకు వర్తిస్తాయి. లెవల్ 5లోని ఉద్యోగులు జనవరి 1 నుంచి పెరిగిన వేతన పరిధిలోకి వస్తారని కంపెనీ తెలిపింది. లెవల్ 6లోని ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. విజేతగా ముఖేష్ అంబానీ!ఉద్యోగుల స్పందనతాజా వేతన పెంపుపై ఇన్ఫోసిస్ ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కంపెనీ బలమైన ఆర్థిక పనితీరు దృష్ట్యా భారీ వేతన పెంపును ఆశించి కొందరు నిరాశకు గురైనట్లు తెలుపుతున్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 11.4 శాతం పెరిగి 800 మిలియన్ డాలర్లకు, ఆదాయం 7.6 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఊహించిన దానికంటే తక్కువ వేతన పెంపు ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ ఆర్థికంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది. -
Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి, మహిళా నేత రేఖా గుప్తా(Rekha Gupta)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఫిబ్రవరి 24న ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎన్నికల్లో ఓటమి పాలయిన కేజ్రీవాల్కు మాజీ సీఎంగా ఎంత పింఛన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి నెలా రూ.1.70 లక్షల జీతం అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని 2023, మార్చి నాటి ఆర్డర్ ప్రకారం నిర్ణయించారు. దీనిలో ఆమె ప్రాథమిక జీతం(Basic salary) రూ. 60,000. వీటికితోడు ఆమెకు పలు భత్యాలు కూడా లభిస్తాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియల్ సహాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి జీతంతో పాటు కారు, బంగ్లా సహా అనేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి తన ప్రైవేట్ కారును ఉపయోగిస్తే, ప్రతి నెలా రూ. 10,000 మొత్తం లభిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసానికి ప్రతి నెలా 5,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు. దీనికితోడు ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రూ.12 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయనకు రూ. 15,000 పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే, ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయినందున ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు లభిస్తాయి. దీనితో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
ఈ ఏడాది సగటున వేతన పెంపు ఎంతంటే..
దేశంలో 2025 ఏడాదిలో ఉద్యోగుల జీతాలు సగటున 9.2 శాతం పెరగనున్నాయని ఏఓఎన్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో కనిపించిన 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే 2025లో వేతనాల పెంపు స్వల్పంగా క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మందగమనం ప్రధాన కారణాలని విశ్లేషించింది.రంగాల వారీగా ఇంక్రిమెంట్లురంగాల వారీగా వేతనాల పెంపులో మార్పులు వస్తున్నాయి. నివేదిక ప్రకారం కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు అధిక వేతన పెంపు ఉంటుంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమోటివ్, వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో అత్యధికంగా 10.2 శాతం వేతన పెంపు ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), రిటైల్ వంటి ఇతర రంగాల్లోనూ గణనీయమైన వేతన పెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.ఆర్థిక స్థిరత్వంఅంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక అవకాశాలు నిలకడగానే ఉన్నాయి. గ్రామీణ గిరాకీ మెరుగవుతోంది. ప్రైవేటు వినియోగం ఊపందుకుంటోంది. ఈ స్థిరత్వం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. 2022లో గరిష్టంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు(ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం) 2024 నాటికి 17.7 శాతానికి పడిపోయింది. టాలెంట్ పూల్ స్థిరపడడాన్ని ఇది సూచిస్తుంది.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’రంగాల వారీగా గతేడాదితో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఇలా..(శాతాల్లో)రంగాలు 2024 2025ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్ 10.1 10.2ఆటోమోటివ్ 10.7 10.2ఎన్బీఎఫ్సీ 10.1 10రిటైల్ 9.6 9.8గ్లోబల్ కేపబులిటీ సెంటర్ 9.4 9.7ఇంజినీరింగ్/మ్యానుఫ్యాక్చరింగ్ 9.7 9.7ఫండ్స్/ అసెట్ మేనేజ్మెంట్ 10 9.7ఫ్రొఫెషనల్ సర్వీసెస్ 8.9 9.5లైప్ సైన్సెస్ 9.5 9.5టెక్నాలజీ ప్లాట్ఫామ్ 9.5 9.4 -
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
టాప్ టెక్ కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infy) 2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇంక్రిమెంట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఎంతశాతం వేతన పెంపు ఉంటుందో మాత్రం కంపెనీ తెలియజేయలేదు. కానీ, సగటు వేతన పెంపు 5% నుంచి 8% మధ్య ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.ఇన్ఫోసిస్ సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దశలవారీ వేతన సవరణలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మొదటి దశను జనవరి 2025 నుంచి, రెండో దశను ఏప్రిల్ 2025 నుంచి పరిగణించనున్నారు. ఇంక్రిమెంట్లతోపాటు ఇన్ఫోసిస్ బ్యాచ్లవారీగా ప్రమోషన్ లెటర్స్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ వారికి 2024 డిసెంబర్లో ప్రమోషన్స్ లెటర్స్ ఇచ్చినట్లు చెప్పింది. మరొక బ్యాచ్కు 2025 ఫిబ్రవరి చివరిలో లెటర్స్ పంపించబోతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి క్యాన్సర్ చికిత్సవచ్చే ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సేవలు పొందే కంపెనీల టెక్నాలజీ మూలధన వ్యయం పెరుగుతుందని పలు ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫోసిస్ వేతన సవరణ చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ జీతాలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు సానుకూల సంకేతం. అయితే, కంపెనీ ఇటీవల మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ప్రకటించిన తర్వాత రెండేళ్లకు కొలువులోకి తీసుకున్నారు. కానీ ఆరు నెలల్లో వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించారని వాదనలున్నాయి. ఈ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ అనైతిక చర్యగా అభివర్ణించింది. -
నెలకు రూ.260 కోట్ల జీతం: ఎవరీ సీఈఓ తెలుసా?
ఎక్కువ జీతాలు తీసుకునే సీఈఓలు ఎవరంటే? టక్కున చెప్పే సమాధానం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్. అయితే వీరి కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఓ వ్యక్తి ఒకరున్నారని బహుశా.. కొంతమందికి తెలిసుండకపోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన జీతం ఎంత? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.యాపిల్, గూగుల్ చీఫ్లు ఒక్కొక్కరు దాదాపు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 646 కోట్లు) ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్బక్స్ (Starbucks) సీఈఓ 'బ్రియాన్ నికోల్'(Brian Niccol) మాత్రం ఏకంగా 96 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. అంటే ఆయన జీతం సుమారు రూ. 827 కోట్లు. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.గత ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కంపెనీలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్.. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల నుంచి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన కంపెనీలో చేరిన నెల రోజుల తరువాత 5 మిలియన్ డాలర్ల సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు. దీంతో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో నికోల్ ఒకరుగా నిలిచారు.సెప్టెంబర్ 2024లో నికోల్ బాధ్యతలు తీసుకున్నప్పుడు.. కంపెనీ ఆయన వార్షిక వేతన ప్యాకేజీ విలువ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే సీఈఓగా చేరిన కేవలం నాలుగు నెలల్లో 96 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. గత ఏడాది స్టార్బక్స్ వరుస నష్టాలను చవి చూసిన సమయంలో.. సంస్థ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించి, ఆ స్థానంలో నికోల్ను నియమించింది.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
మరీ అంత తేడానా..? L&T చైర్మన్ రూ.కోట్ల జీతంపై కామెంట్స్
వారానికి 90 గంటల పనిని సూచిస్తూ లార్సెన్ & టూబ్రో (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన అందుకున్న జీతం (salary) వివరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.సుబ్రహ్మణ్యన్ జీతంసుబ్రహ్మణ్యన్ 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో రూ. 51.05 కోట్లు ఆర్జించారు. ఇది ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు జీతం రూ. 9.55 లక్షలు కంటే 534.57 రెట్లు అధికం. ఎల్అండ్టీ 2023-24 ఇంటిగ్రేటెడ్ వార్షిక నివేదిక ప్రకారం సుబ్రహ్మణ్యన్ అందుకున్న రూ.51.05 కోట్లలో వేతనం రూ 3.60 కోట్లు, అవసరాల కింద రూ 1.67 కోట్లు, పదవీ విరమణ ప్రయోజనాలు రూ. 10.50 కోట్లు, కమీషన్ రూ. 35.28 కోట్లు ఉన్నాయి. ఆయన మొత్తం వేతనం రూ. 51.05 కోట్లు గత సంవత్సరంతో పోలిస్తే 43.11% పెరిగింది.ఆదివారం ఆఫీస్కంపెనీ అమలు చేస్తున్న వారానికి ఆరు రోజుల పని విధానాన్ని సమర్థిస్తూ సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఉద్యోగులకు హితబోధ చేశారు. "నేను మీతో ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీరు ఆదివారాలూ పని చేస్తే నేను మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆదివారం పని చేస్తాను" అంటూ సుబ్రహ్మణ్యన్ మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది."ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు.. ఎంత సేపని భార్యను చూస్తూ ఉంటావు.. ఆఫీసుకు వచ్చి పని చేసుకో" అంటూ వివాదాస్పద వ్యాఖ్య కూడా సుబ్రహ్మణ్యన్ అందులో చేశారు. అమెరికన్లు వారానికి 50 గంటలు పనిచేస్తుండగా తాము వారానికి 90 గంటలు కష్టపడుతున్నామని ఓ చైనా వ్యక్తి తనతో చెప్పినట్లుగా ఆయన వివరించారు. దీన్ని ఉదాహరణగా తీసుకుని "మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే, వారానికి 90 గంటలు పని చేయాలి" అంటూ సెలవిచ్చారు.ఈ వ్యాఖ్యలు విస్తృత విమర్శలను ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులతోపాటు కొందరు ప్రముఖులు సైతం సుబ్రహ్మణ్యన్పై విమర్శల దాడి చేశారు. నటి దీపికా పదుకొణె, బిలియనీర్ హర్ష్ గోయెంకా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.కొంతమంది వినియోగదారులు సుబ్రహ్మణ్యన్ సంపాదన, సగటు ఉద్యోగి జీతం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. మరికొందరు వారానికి 70 గంటల పనిని సూచించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి, ఈయనకు సారుప్యతలను ముందుకు తెచ్చారు."నేను L&T అనే మంచి కంపెనీ అనున్నాను. అందరూ నారాయణ మూర్తి అడుగుజాడలనే అనుసరిస్తున్నారు" అంటూ ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "మనకు ఇలాంటి బిజినెస్ లీడర్లు ఉండటం దురదృష్టకరం" అని మరో యూజర్ కామెంట్ చేశారు. బయటి దేశాల్లో పనిచేసే ఉద్యోగులపై ఇటువంటి పని ఒత్తిడి ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
ప్రముఖ కంపెనీ సీఈఓ వేతనం రూ.48 కోట్లు.. ‘ఇందులో ప్రత్యేకత ఏముంది.. ప్రస్తుతం చాలామంది ఈ రేంజ్ వేతనాన్ని అందుకుంటున్నారు కదా’ అంటారా.. అయితే కేవలం ఈ రూ.48 కోట్లు తన ఒకరోజు సంపాదనే! వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లిస్తాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. రోజు రూ.48 కోట్ల చొప్పున జగ్దీప్సింగ్ వార్షికాదాయం ఏకంగా సుమారు రూ.17,500 కోట్లు. ఇంతకీ ఆయన ఏ కంపెనీలో పని చేస్తున్నారు.. ఎందుకు అంత వేతనం అందిస్తున్నారనే అంశాలను తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగిగా జగ్దీప్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాన్మస్క్ వంటి వ్యక్తుల వార్షిక ఆదాయం ఎక్కువే ఉంటుంది. కానీ వారికి వేతనం, షేర్లు, ఇతర అలవెన్స్ల రూపంలో చెల్లింపులు అధికంగా ఉంటాయి. సింగ్కు నేరుగా అధిక మొత్తంలో వేతనం అందిస్తున్నారు. జగ్దీప్ సింగ్ పెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ప్రపంచంలో పెరుగుతున్న భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు పెరుగుతున్న కొద్దీ ఇన్నోవేటివ్ కంపెనీల్లో లీడర్ల జీతభత్యాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ‘క్వాంటమ్ స్కేప్’ కంపెనీకి సింగ్ నాయకత్వం(సీఈఓ) వహిస్తున్నారు.టెక్నాలజీలో వస్తోన్న పురోగతిజగ్దీప్ సింగ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీటెక్లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలు, ఎంబీఏలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తాను ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఆయన క్వాంటమ్ స్కేప్ను స్థాపించడానికి ముందు పదేళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేశారు. బ్యాటరీ టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక పురోగతిని అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. ఈ అనుభవంతో 2010లో క్వాంటమ్స్కేప్ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లో అగ్రగామిగా నిలుస్తోంది.ఇదీ చదవండి: ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..కంపెనీ ఏం చేస్తోందంటే..క్వాంటమ్ స్కేప్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఘనస్థితి(సాలిడ్ స్టేట్) బ్యాటరీలను అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక శక్తిని, వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని, మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ కంపెనీ టెక్నాలజీ ముందంజలో ఉంది. బిల్ గేట్స్, వోక్స్ వ్యాగన్ వంటి దిగ్గజాలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ స్పేస్లో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. -
ఒక్క నెల ముచ్చటేనా?
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు(Salaries), పెన్షన్లు(pensions) చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)... దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోను మూడో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు.జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు.ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక నెల మాత్రమే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఆ తర్వాత నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలే -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్మార్క్లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు. -
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడుఇలాన్మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.పిటిషన్ తోసిపుచ్చిన కోర్టుడెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్ను తోసిపుచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..మస్క్ ఏమన్నారంటే..డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది. -
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. గుండెపోటుతో వీఆర్వో మృతి
రాజానగరం: తీవ్ర పని ఒత్తిడి, జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఒక వీఆర్వో ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), వీఆర్వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి పెనుమాక గనిరాజు (47) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కడియం మండలం జేగురుపాడుకు చెందిన గనిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పని ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో గనిరాజు గుండెపోటుకు గురై మృతిచెందారని మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్, ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. అధికారులు అనేక పనులు పురమాయిస్తున్నారని తెలిపారు. దీనికితోడు టార్గెట్లు పూర్తిచేసే వరకు జీతాలు కూడా నిలిపేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇంతవరకు అక్టోబర్ నెల జీతాలు రాలేదని తెలిపారు. దీంతో కుమార్తెల ఫీజు, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక ఆవేదనతో ఉన్న గనిరాజు.. నీటిపన్నుల కలెక్షన్ డేటాను త్వరగా ఎంట్రీ చేయాలని అధికారులు ఫోన్లో ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు అదేపనిలో నిమగ్నమై గుండెపోటుకు గురయ్యారని వారు పేర్కొన్నారు. -
జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో జొమాటో ఒకటి. ఈ కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) డాక్యుమెంట్లలో వెల్లడించారు.దీపిందర్ గోయల్ 2021లోనే 36 నెలలు లేదా మూడేళ్లు జీతం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనిని మరో రెండేళ్లు పొడిగించారు. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు (మొత్తం ఐదేళ్లు) గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. జీతం వద్దనుకున్నప్పటికీ గోయల్ జొమాటో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు.దీపిందర్ గోయల్ జీతాన్ని వదులుకున్నప్పటికీ.. ఈయనకు కంపెనీలో భారీ వాటా ఉంది. నవంబర్ 25 నాటికి, జొమాటో ముగింపు షేరు ధర ఆధారంగా కంపెనీలో అతని వాటా విలువ సుమారు రూ.10,000 కోట్లు. జొమాటో షేర్స్ ఈ ఏడాది మెరుగ్గా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది. -
‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’
ఉద్యోగం ఇస్తాం.. కానీ జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు ఉద్యోగార్థులే విరాళంగా చెల్లించాలి.. అవును మీరు విన్నది నిజమే. ఇవి ఏకంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పిన మాటలు. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు దరఖాస్తులు కోరారు. ఈమేరకు చేసిన వినూత్న ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాం. ఈ పొజిషన్లో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగార్థులకు పూర్వానుభవం అవసరంలేదు. తమ స్థానంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది’ అన్నారు.ఉద్యోగి రూ.20 లక్షలు విరాళం‘ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి వేతనం ఉండదు. పైగా ఆ వ్యక్తి రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి కోరికమేరకు జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళం ఇస్తుంది. రెండో ఏడాది నుంచి మాత్రం రూ.50 లక్షలకు తగ్గకుండా ఆ ఉద్యోగికి వేతనం చెల్లిస్తాం’ అని దీపిందర్ తెలిపారు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!రెజ్యూమె అవసరం లేదు‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు రెజ్యూమె పంపాల్సిన అవసరంలేదు. 200 పదాలకు తగ్గకుండా తమ వివరాలు తెలియజేస్తూ కవర్ లెటర్ పంపించాలి. దీన్ని d@zomato.comకు పంపించాలి’ అని చెప్పారు. ఈ పోస్ట్పై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రూ.20 లక్షలు ఫీజు పెట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్మ్యాన్ను దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. -
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గెస్ట్ టీచర్లపై బోధనేతర భారం!
సాక్షి, అమరావతి : గెస్ట్ టీచర్లు అంటే రెగ్యులర్ టీచర్లు కాదు అని అర్థం. వీరి విధులు కూడా పరిమితంగానే ఉంటాయి.. చెల్లించే వేతనాలు కూడా అంతంతే. కానీ, రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉన్న 1,253 మంది గెస్ట్ టీచర్లపై అపరిమితమైన భారం మోపుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కూటమి సర్కారు వచ్చాక మునుపెన్నడూలేని రీతిలో వీరు అవస్థలు పడుతున్నారు. పేరుకు గెస్ట్ టీచర్లు అయినా వీరు చేయాల్సిన విధులు అన్నీఇన్నీ కావు. రాత్రిపూట విధుల నుంచి డిప్యూటీ వార్డెన్ చేసే పనుల వరకు అన్నీ వీరే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. తక్కువ జీతంతో ఎక్కువ పనిభారం మోస్తున్న ఈ గెస్ట్ టీచర్లు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక ఉద్యోగం పోతుందనే భయంతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్న ఇదో రకం శ్రమ దోపిడి. పగలు బోధన.. రాత్రి కాపలా..నిజానికి.. విద్యార్థులకు నిర్ధేశించిన సబ్జెక్టుల వారీగా బోధించడమే గెస్ట్ టీచర్ల విధి. కానీ, అందుకు విరుద్ధంగా పగలు బోధన.. రాత్రి కాపలా అనే రీతిలో వారిపై ప్రభుత్వం అదనపు బాధ్యతలు మోపుతోంది. ఫలితంగా ఉద్యోగ భద్రత, వేతనం, సరైన సౌకర్యాలు లేకుండానే అవస్థలుపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం తాజాగా రాత్రి విధులు అప్పగించడంపట్ల వీరు ఆవేదన చెందుతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కేటాయించిన గురుకులాల్లో ఉండాలని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘డే స్టడీ–నైట్ స్టే’ పేరుతో రోజుకు ఇద్దరు టీచర్లు రాత్రిపూట విద్యార్థులతో కలిసి ఉంటూ వార్డెన్ తరహా బోధనేతర విధులు కూడా అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులకు గురుకులాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాల్సిన ప్రభుత్వం వీటిని కూడా గెస్ట్ టీచర్లకు అప్పగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లు చేయాల్సిన పనులను కూడా ఆ పోస్టులు భర్తీ చేయకుండా వాటిని ఈ గెస్ట్ టీచర్లకు అప్పగించడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వేతనంలేక వెతలు..ఇదిలా ఉంటే.. ఈ గెస్ట్ టీచర్లకు బడ్జెట్ కేటాయింపు జరగకపోవడంతో గతనెల వేతనాలు చెల్లించలేదు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోతే బతికేది ఎలా అంటూ వీరు వాపోతున్నారు. వాస్తవానికి.. రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్కు నెలకు రూ.లక్ష, కాంట్రాక్టు టీచర్కు రూ.50 వేలు, గెస్ట్ టీచర్కు కేవలం రూ.19వేలు వేతనం చెల్లిస్తున్నారు. పైగా.. గెస్ట్ టీచర్కు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా ఉండవు. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.అంబానీ డ్రైవర్ జీతం2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి. -
రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్
ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్లో వెల్లడించారు.నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్లో అడిగారు.ఈ పోస్ట్ రెడ్డిట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.యూరప్లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.ఇదీ చదవండి: చాట్జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓభారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు. -
40 ఏళ్ల క్రితం టీసీఎస్లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ ఇదిగో
ఐటీ సెక్టార్ అనగానే లక్షల్లో జీతాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే 40 ఏళ్ల క్రితం ఐటీ కంపెనీలలో జీతాలు ఎలా ఉండేవని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'రోహిత్ కుమార్ సింగ్' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఆఫర్ లెటర్ చూస్తే.. అప్పట్లో జీతాలు ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోతారు.1984లో టీసీఎస్ కంపెనీలో జీతం రూ.1,300. అప్పట్లో ఇది రాజకుమారులు జీతం అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. రాజస్థాన్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సింగ్, 40 సంవత్సరాల క్రితం టీసీఎస్ సంస్థలో చేరినప్పుడు తన జీతం ఇదేనని పేర్కొన్నారు.భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి సింగ్.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మొదటి ఉద్యోగమని, ఐఐటీ బనారసీ హిందూ యూనివర్సిటిలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా పొందానాని వెల్లడించారు. ఆ తరువాత అతను ముంబైలోని టీసీఎస్లోట్రైనీగా చేరారు. ప్రస్తుతం సింగ్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పట్లో జీతం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఒక నెటిజన్ ఐఏఎస్ ప్రొబేషనర్గా మీ ప్రారంభ జీతం ఎంత? అని అడిగిన ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ.. 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరినప్పుడు నెలకు రూ. 2200 అని వెల్లడించారు. మరొకరు ''టీసీఎస్ నుంచి సివిల్ సర్వీస్ వరకు'' నిజంగానే గొప్ప ప్రయాణం ప్రశంసించారు.A little more than 40 years ago, I got my first job at TCS Mumbai through campus recruitment at IIT BHU. With a princely salary of 1300 Rupees, the ocean view from the 11th Floor of Air India Building at Nariman Point was regal indeed! pic.twitter.com/A9akrhgu7F— Rohit Kumar Singh (@rohitksingh) September 29, 2024 -
దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..
అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగిని కంపెనీ బాస్ తొలగించడమే కాకుండా.. మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా వెల్లడించారు. నేను ఎనిమిది నెలలకు పైగా సంస్థలో పనిచేసాను. కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది. అయితే క్రమంగా పని భారం పెరిగింది. ఒత్తిడి తీవ్రమైంది. ఒక నెల క్రితం ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది. ఆ తరువాత చికెన్పాక్స్ సోకింది.అనారోగ్యంతో బాధపడుతున్న నేను మూడు రోజులు సెలవు కావాలని సీఈఓకు మెయిల్ చేశాను. కానీ సీఈఓ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని వెల్లడించారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ చేయలేనని చెప్పాను. ఆరోగ్యం కుదుటపడాలంటే కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి రాజీనామా చేయాలనీ నిర్ణయించున్నాను. ఆ తరువాత నా రాజీనామాను సీఈఓకు అందించాను. ఒక నెల రోజులు ముందుగా రిలీవ్ చేయాలని అభ్యర్థించాను.సీఈఓ నా రాజీనామాను తిరస్కరించమే కాకుండా.. తప్పకుండా కంపెనీలో పనిచేయాలని చెప్పారు. ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో నాకు ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది. ఆ తరువాత మళ్ళీ ఒకసారి నా రాజీనామా గురించి సీఈఓకు గుర్తుచేశాను. అయినా నా మీద సీఈఓ సానుభూతి చూపలేదు. ఆ తరువాత రెండు రోజులు సెలవు తీసుకున్నాను. అయితే నాకు వారు టెర్మినేషన్ ఇమెయిల్ను పంపారు.ఇదీ చదవండి: అప్పుడు జపాన్లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..వారు టెర్మినేషన్ ఇమెయిల్ పంపిన తరువాత.. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV)లో తప్పుగా రిపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే.. మూడు నెలల జీతం డిమాండ్ చేశారని, ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగారు. దీనికి చాలామంది స్పందిస్తూ మంచి న్యాయవాదిని సంప్రదించాలని, కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని తమదైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఉన్నారు. -
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, డెహ్రాడూన్లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్లో జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది. -
EY సంస్థకో దణ్ణం..రూ.కోటి జీతంతో చేరిన రెండో రోజే గుండెలో నొప్పిగా ఉందంటూ
ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్ కల్చర్పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్ కల్చర్పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్ గ్రోవర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్ గ్రోవర్ మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.It’s baffling to see anyone advocate for a toxic environment. #AnnaPerayil Your views? pic.twitter.com/QhPnCeKhxq— Harsh Goenka (@hvgoenka) September 19, 2024చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు. కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్ గ్రోవర్ అన్నారు. విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
ఫ్రెషర్స్కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు. -
‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ‘ప్రైమ్ రిక్రూట్మెంట్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య వేతనం ఉంటుందని పేర్కొంది.టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తాం. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. కొంతమంది అభ్యర్థులు ‘డ్రీమ్ కేటగిరీ’(ఇష్టమైన జాజ్) ఉద్యోగాలు వస్తే టీసీఎస్ నుంచి సదరు కొలువును ఎంచుకుంటున్నారు. దాంతో కంపెనీకి టాలెంట్ ఉన్న ఇంజినీర్ల కొరత ఎదురవుతుంది. దాన్ని తగ్గించేందుకే ఈ ‘ప్రైమ్’ కేటగిరీను ప్రవేశపెట్టాం. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ కేటగిరీ కింద ఉద్యోగం పొందిన విద్యార్థులు మరొక కంపెనీ నియామక ప్రక్రియకు వెళ్లకుండా కళాశాలలు నిర్ధారిస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలి. టీసీఎస్లో ఐటీ సేవల రంగాన్ని మార్చే వేగవంతమైన సాంకేతిక పురోగతి ఉంది. వ్యూహాత్మక వృద్ధి వ్యాపారాలు, పరిశోధనా విభాగాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లుజూన్ 30, 2024 నాటికి టీసీఎస్లో మొత్తం 6,06,998 మంది ఉద్యోగులున్నారు. 2024-25లో టీసీఎస్ క్యాంపస్ల నుంచి 40,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నారు. డిజిటల్ కేటగిరీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్ అయిన వారికి శిక్షణ తక్కువగా అవసరం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
కోరికలు తీర్చే ‘ఫిష్’!
ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.‘ఫిష్’ థియరీఎఫ్ఐ.ఎస్.హెచ్: ఫిష్..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్ థియరీను మూడు భాగాలుగా విభజించారు.ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ఎస్: సేవింగ్స్హెచ్: హ్యాపీ టు స్పెండ్ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్బ్యాంకు అకౌంట్లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్ బిల్లు, సరుకులు, ఫోన్ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.ఎస్: సేవింగ్స్భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్పాలసీ, టర్మ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథాహెచ్: హ్యాపీ టు స్పెండ్ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు. -
రూ.25 లక్షల జీతం.. ఏమీ మిగలడం లేదు: ట్వీట్ వైరల్
చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలి, సంతోషంగా కాలం గడపాలి అనుకుంటారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన ఉద్యోగంలో చేరిన తరువాత జీవితం మొత్తం ఉరుకులు, పరుగులతో నిండి ఉంటుంది. ఇది పక్కన పెడితే వచ్చే జీతాలు నెల మొత్తం గడపడానికి సరిపోవడం లేదు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.సౌరవ్ దత్త అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు రూ. 25 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని. పొదుపు చేద్దామంటే డబ్బు మిగలడం లేదని వివరంగా పేర్కొన్నారు.వార్షిక వేతనం రూ. 25 లక్షలు. నెలకు రూ.1.50 లక్ష చేతికి వస్తుంది. ఇందులో రూ.1 లక్ష ఈఎమ్ఐ, రెంట్ వంటి వాటికి.. రూ. 25వేలు ఫుడ్, మూవీస్, ట్రిప్స్ వంటి వాటికి, రూ. 25వేలు అత్యవసరానికి/మెడికల్ ఎమర్జెన్సీకి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చు అవుతోంది. ముగ్గురున్న కుటుంబానికి ఇది సరిపోదు అంటూ.. పొదుపు చేయడానికి సాధ్యం కావడం లేదని వెల్లడించారు.ఈ ట్వీట్పై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో కొందరు రూ. 25లక్షలు సంవత్సరానికి సరిపోతాయని చెబుతున్నారు. మరికొందరు మారుతున్న జీవన విధానం వల్ల సరిపోదని అన్నారు. చాలామంది అతని లెక్క సరైంది కాదని విభేదిస్తున్నారు.25LPA is too little for running a family.25 LPA = in hand 1.5L per month.Family of 3 would spend 1L on essentials, EMI / rent.25K for eating out, movies, OTT, day trips.25K for emergency and medical.Nothing left to invest.— Sourav Dutta (@Dutta_Souravd) August 11, 2024 -
ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్ అయ్యారు.ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్లు గత ఏడాది అక్టోబర్లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించిన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు అందుకున్నారు.ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. -
అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు
ఈ ఏడాది జనవరిలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువయ్యాడు. అదిమొదలు అయోధ్యకు భక్తుల తాకిడి అధికమయ్యింది. తాజాగా అయోధ్య రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు శ్రీరాముని సేవలో నిమగ్నమైన సహాయ అర్చకులు, సేవాదార్లకు జీతాలను పెంచారు.రామాలయంలోని ప్రధాన అర్చకుడి జీతం రూ.3500 పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.దీంతో వారికి రామమందిర్ ట్రస్ట్ 15 రోజల పాటు సెలవు ఇచ్చింది. కాగా జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రామమందిరం ట్రస్ట్ ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి వేతనాన్ని రూ.2500 పెంచారు. అదేవిధంగా కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు. -
అడిగినంత జీతం.. ఎంత మంచి సీఈవో!!
శాలరీ నెగోషియేషన్.. అదేనండి జీతాల బేరసారాలు. ఇది ప్రతి ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగమైన, సాధారణమైన, సంక్లిష్టమైన విషయమే. అభ్యర్థి ఎంత ఆశిస్తున్నారు.. కంపెనీ బడ్జెట్ ఎంత అన్నవాటి మధ్య ఈ జీతం చర్చలు జరుగుతాయి. అయితే బెంగుళూరుకు చెందిన ఒక సీఈవో తన కంపెనీలో ఇలాంటి తతంగం ఏమీ లేకుండా అభ్యర్థులు అడిగినంత జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ జోకో సహ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్.వి లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ కంపెనీలో నియామక ప్రక్రియ నుంచి శాలరీ నెగోషియేషన్ దశను తప్పించామని, అభ్యర్థులు అడిగినంత జీతాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణాలను సైతం ఆయన వివరించారు.“నా బృందం కోసం 18 మందికి పైగా నియమించుకున్న తర్వాత, ప్రపంచ స్థాయి ప్రతిభను నిలుపుకునే రహస్యాన్ని నేను కనుగొన్నాను. మేము శాలరీ నెగోషియేషన్ చేయము. వారు అడిగినంత అక్షరాలా చెల్లిస్తాము” అని జోకో సీఈవో అర్జున్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.“ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి సవరిస్తాం. కారణం సింపుల్” అంటూ తన నిర్ణయం వెనుక నాలుగు కారణాలను ఆయన పేర్కొన్నరు. తాను ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే శాలరీ నెగోషియేషన్ చేశానని, అది కూడా అభ్యర్థి అడిగినదాని కంటే పెంచడం కోసమని వివరించారు. అదే ఉద్యోగానికి బయట ఇతర కంపెనీలు ఇస్తున్నదాని కంటే ఆ అభ్యర్థి తక్కువ అడగడంతో తాను మరింత ఆఫర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.సీఈవో అర్జున్ ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి దానికి అనేక స్పందనలు వచ్చాయి. ప్రశ్నలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అభ్యర్థులు అసమంజసమైన జీతాలు అడిగితే ఎలా? అంటూ మరో కంపెనీ సీఈవో ప్రశ్నించారు. అది సరే వార్షిక పెంపు మాటేంటి అని ఏఐ అండ్ అనలైటిక్స్లో పనిచేస్తున్న ఓ యూజర్ అడిగారు. పరిమిత వనరులు ఉన్న స్టార్టప్లు, బల్క్ రిక్రూట్మెంట్ అవసరమయ్యే పెద్ద కంపెనీలకు ఇది సరిపోకపోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు. -
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. పెరగనున్న టేక్ హోమ్ శాలరీ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2013 సెప్టెంబర్ 1తరువాత జాబ్లో చేరిన గవర్నమెంట్ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లలను నిలిపివేయనున్నట్లు (అమౌంట్ కట్ చేయదు) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 2024 జూన్ 21న దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యధావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌట్ డిడక్షన్ అవుతుంది. కాబట్టి 2013 సెప్టెంబర్ 1 తరువాత జాబ్లో చేరిన ఆయా కేటగిరిలో ఉన్న ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనం పొందనున్నారు.2013 సెప్టెంబర్ 1 తరువాత ఉద్యోగంలో చేరినవారికి ఇప్పటి వరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.జీఐఎస్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే?గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (జీఐఎస్) అనేది 1982 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు ప్రమాదాలకు గురైనప్పుడు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. -
గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు 'గౌతమ్ అదానీ' గురించి అందరికి తెలుసు. ఆసియా సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన.. అదానీ గ్రూపులో పనిచేసే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువ జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతదేశంలోని ఇతర పారిశ్రామక వేత్తల జీతాలతో పోలిస్తే.. అదానీ జీతం చాలా తక్కువ. కరోనా మహమ్మారి సమయంలో ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు ఈయన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ. 16.7 కోట్లు వార్షిక వేతనంగా తీసుకున్నారు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన రాజీవ్ బజాజ్, పవన్ ముంజాల్.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ జీతం కూడా అదానీ జీతం కంటే చాలా తక్కువ.అదానీ సంస్థలో పనిచేసే ఏఈఎల్ బోర్డు డైరెక్టర్గా పనిచేస్తున్న వినయ్ ప్రకాష్ వార్షిక వేతనంగా మొత్తం 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ వేతనం రూ.9.45 కోట్లు. దీన్ని బట్టి చూస్తే తన సంస్థలో పనిచేసేవారి జీతం కంటే.. అదానీ తక్కువ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది.2024 మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ తీసుకున్న జీతం రూ. 9.26 కోట్లు. ఈ జీతం భారతదేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తలకంటే తక్కువని తెలుస్తోంది.అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో అదానీ తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు, దీనితో పాటు రూ. 27 లక్షల విలువైన అలవెన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద అదానీ ఎంటర్ప్రైజెస్ ఈయన తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ లిమిటెడ్ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ
ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్హోవ్ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్హోవ్కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్ప్లేస్ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్హోవ్ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్హోవ్కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్హోవ్ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. -
లోక్ సభ ఎంపీ జీతం ఎంత ?
-
ఇన్ఫోసిస్లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఏడాదికి రూ.కోటికి పైగా జీతం తీసుకునే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. కనీసం రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం క్షీణించి 103కు పడిపోయిందని సీఎన్బీసీ-టీవి 18 గణాంకాలు చెబుతున్నాయి. ఈ 103 మంది ఉద్యోగులు మొత్తంగా ఏడాదికి రూ.176 కోట్ల స్థూల వేతనాన్ని అందుకున్నారు.ఈ టెక్ దిగ్గజంలో సుమారు 124 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .221 కోట్ల వేతనం పొందారు. రూ. కోటికి పైగా వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య 2022 ఆర్థిక సంవత్సరంలో 100 మార్కును దాటగా, 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 124 మంది ఉద్యోగుల సంఖ్యతో అదే స్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో కంపెనీ టాప్ 10 ఉద్యోగులు తీసుకున్న వేతన పరిహారాన్ని చేర్చలేదు.(విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్)ఇన్ఫోసిస్కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో నర్సింహారావు మన్నెపల్లి, రిచర్డ్ లోబో, శ్వేతా అరోరా, విశాల్ సాల్వి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ 103 మంది ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది 2000 సంవత్సరం కంటే ముందే ఇన్ఫోసిస్ లో చేరారు. వీరు ఏడాదికి సగటున రూ.1.7 కోట్ల వేతనం తీసుకున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కీ మేనేజిరియల్ పర్సనల్ సహా పురుష ఉద్యోగులందరి సగటు వేతనం రూ .11 లక్షలుగా ఉంది. అదే విధంగా మహిళా ఉద్యోగులు సగటున రూ .7 లక్షలు వార్షిక వేతనం పొందారు. కాగా ఏడాది మధ్యలో 34 మంది ఉద్యోగులను నియమించుకోగా వీరి సగటు వేతనం నెలకు 8.5 లక్షలు.2024 ఆర్థిక సంవత్సరంలో అధిక చెల్లింపులు అందుకున్న ఉద్యోగులలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవికి రాజీనామా చేసిన నీలాంజన్ రాయ్ రూ .10.7 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొత్తగా నియమితులైన సీఎపఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.6.1 కోట్లు, దినేష్ ఆర్, సతీష్ హెచ్ సీలు వరుసగా రూ.4.6 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వేతనం అందుకున్నారు. దినేష్, సతీష్ ఇద్దరూ ఇన్ఫోసిస్ లో ఈవీపీ అండ్ కో-హెడ్ ఆఫ్ డెలివరీగా నియమితులయ్యారు. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే..??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచిందివిప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్రం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 4శాతం పెంచింది. అయితే తాజాగా హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) వంటి నిర్దిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం..త్వరలో హెచ్ఆర్ఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.దీంతో డీఏ 50శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఒకే వేళ విడుదల చేస్తే హెచ్ఆర్ఏలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. హెచ్ఆర్ఏ గణన కోసం జనాభా లెక్కలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా నగరాలను టైప్ ఎక్స్, వై, జెడ్గా వర్గీకరించబడ్డాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జులై 1, 2017 నుండి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ రూ.35,000లలో ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 27శాతం = రూ. 9,450 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 18శాతం అంటే = రూ. 6,300 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 9శాతం అంటే = రూ. 3,150 దీన్ని బట్టి 7వ పే కమీషన్ డీఏ 50శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగికి చెల్లించే బేసిక్ పేలో ఎక్స్ కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 20 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 10 శాతంతో హెచ్ఆర్ఏ రేట్లు సవరించాలని సిఫార్సు చేసింది. దీన్ని బట్టి ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏకి ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 30శాతం అంటే = రూ. 10,500 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 20శాతం అంటే = రూ. 7,000 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 10శాతం = రూ. 3,500 లు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు: హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అన్న ప్రశ్నలకు ఆర్ధిక నిపుణులు మాట్లాడుతూ.. జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ప్రకారం డీఏ 50శాతం దాటిన తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అందువల్ల, మరొక నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమలు చేస్తుందని చెబుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్మెంట్ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్మెంట్ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
రూ.1,600 కోట్లు వేతనం.. సమర్థించుకున్న సీఈవో
టెక్ కంపెనీలు కాస్ట్కటింగ్ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్మన్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. దాంతో రెడ్డిట్ సీఈవో స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేతన ప్యాకేజ్ను హఫ్మన్ అందుకోవడంపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్లో స్పందించారు. తన సామర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. హఫ్మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగులకు బంపరాఫర్, జీతం ఎంత పెరగనుందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం, వరుస లేఆఫ్స్, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. ‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా 2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. కంపెనీలు జూనియర్ మేనేజ్మెంట్కు గణనీయమైన ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది. ఇంక్రిమెంట్లు డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు. బోనస్లు 2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్లు ఇవ్వనున్నట్లు డెలాయిట్ ఇండియా నివేదిక హైలెట్చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది. పదోన్నతులు నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది. -
సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. సైన్యంలోని డాగ్ యూనిట్లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. -
మైండ్ బ్లోయింగ్ శాలరీ.. ఏడాదిలో రూ.7,400 కోట్లు!
Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. బ్లాక్స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్ల రూపంలోనే 777 మిలియన్ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు అందుకున్నారు. స్క్వార్జ్మాన్ వాటాలు, డివిడెండ్లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్మాన్ నెట్వర్త్ 41.8 బిలియన్ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు). -
2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?
దేశంలో 2024లో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది. కరోనా పరిణామాల అనంతరం 2022లో దేశీయంగా అధిక వేతన పెంపు లభించిందని, రానున్న రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వేతనాలు పెంపు ఉంటోందని తెలిపింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. ‘మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తాయి. కొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమవుతాయి’ అని ఎయాన్ ఇండియాలో ట్యాలెంట్ సొల్యూషన్స్కు ముఖ్య కమర్షియల్ అధికారిగా ఉన్న రూపాంక్ చౌదరి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగల దేశాల్లో, వేతన పెంపు అధికంగా ఉంటున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందని సర్వే తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది. 2024లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. మనదేశంలో సిబ్బంది వలసల రేటు 2022లో 21.4% కాగా.. 2023లో 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది. ఇదీ చదవండి: సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉందని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్, వాహన, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్, టెక్నాలజీ కన్సల్టింగ్, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని సర్వే ద్వారా తెలిసింది. -
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
గుంపు మేస్త్రీకి 1.37 లక్షల శాలరీ ఆఫర్!
దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్ బీహార్ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్లో గత కొన్ని నెలలుగా హమాస్తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది. అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది. బీహార్లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్లో పనిచేసే అవకాశం దొరికింది. పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్పూర్లోని నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం జితేంద్ర బీహార్లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు. -
గూగుల్లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. గూగుల్లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఏ రంగంలో తెలుసా..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. ఐఐఎం ఇందోర్లో ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు. ఐఐఎం ఇందోర్లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్మెంట్స్లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెప్పింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు. -
గూగుల్లో శాలరీ తక్కువ.. ‘జాబ్ కంటే జీతం ముఖ్యం!’ మరి మీకు?
మీకు జీతం ముఖ్యమా? శాలరీ ముఖ్యమా? అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జాబ్ కంటే తీసుకునే జీతం ఎంత ఎక్కువైతే మంచిదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు మనలో చాలా మంది. అందుకు మెటాలాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తూ వందల కోట్లలో వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు అతీతులేం కాదు. గతంలో వాళ్లు కూడా జీతం తక్కువైందని పేరున్న కంపెనీలు పిలిచి ఉద్యోగం ఇస్తాంటే సున్నితంగా తిరస్కరిస్తున్న సందర్భాలున్నాయి. మరి మీరూ? ట్యూరింగ్ అవార్డ్ను సొంతం చేసుకుని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ యాన్ లెకున్. ఏఐలో రంగంలో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారంతో సమానమైన ట్యూరింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్గా ఉండే యాన్ లెకున్ తాజాగా ఎక్స్.కామ్లో తనకు గూగుల్ జాబ్ ఆఫర్ ఇస్తే దాన్ని ఎందుకు వదులుకున్నారో తెలిపారు. అనేక కారణాల వల్ల 2002లో గూగుల్లో రీసెర్చ్ డైరెక్టర్ జాబ్ ఆఫర్ను తిరస్కరించినట్లు వెల్లడించారు. వాటిల్లో ప్రధానంగా జీతం తక్కువ కావడమేనని అన్నారు. జాబ్ కన్నా.. జీతం ముఖ్యం ‘‘జీతం తక్కువగా ఉంది. స్టాక్ ఆప్షన్ ఎక్కువే. కానీ నాకు కాలేజీ చదవాల్సిన టీనేజ్ కుమారులున్నారు. డబ్బులు అవసరం. న్యూజెర్సీలో కంటే సిలికాన్ వ్యాలీలో నివాసం ఖరీదైన వ్యవహారం’’ అని అన్నారు. గూగుల్ ఆఫర్ తిరస్కరణ ‘‘ఆ సమయంలో గూగుల్కి 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నాయి. ఆదాయం లేదు. ఆ సమయంలో గూగుల్లో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి సమయాల్లో గూగుల్లో చేరి కార్పొరేట్ వ్యూహం, సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తులు, నిర్వహణ మొదలైన వాటి మెషిన్ లెర్నింగ్, విజన్, రోబోటిక్స్ అండ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ విభాగాల్లో రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టే గూగుల్ ఆఫర్ను తిరస్కరించా’’నని యాన్ లెకున్ అన్నారు. -
ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!
అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్ కాదు. అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు. మహిపాల్ జోథ్పూర్లోని బార్మర్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. అయితే బీటెక్ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా జపాన్లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్ ఆఫర్ అందుకుని రికార్డు సృష్టించాడు. మహిపాల్ ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్ కరెక్ట్గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్ సేజు. (చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్గా కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు! కానీ చివరికి..) -
కొత్త ఏడాదిలో పెరగనున్న జీతాలు.. ఐటీ ఉద్యోగులకు పెరిగే శాలరీ ఎంతంటే?
దేశ వ్యాప్తంగా కొత్త ఏడాది ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్న అన్నీ విభాగాల నిపుణులు భవిష్యత్ గురించి విశ్లేషకుల అభిప్రాయాలు, అంచనాలు వెలుగులోకి వచ్చాయి. 2024లో తొలి ఆరు నెలల కాలంలో 39 లక్షల ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. మరి అదే సమయంలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారి జీత భత్యాల పెరుగుదలపై ఆసక్తి మొదలైంది. ఊహించని పరిణామాలు అయితే ఉద్యోగార్ధులకు 2024 సంవత్సరంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీలకు ఆర్ధికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవని.. వాటి నుంచి సురక్షితంగా ఉండేలా సిబ్బందికి ఇచ్చే బోనస్లు, ప్రమోషన్లకు ప్రభావితం చేసే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉందని సమాచారం. పెరిగే జీతం ఎంతంటే? ఈ పరిణామాల దృష్ట్యా కంపెనీలు ఉద్యోగికి 8 శాతం నుండి 10 శాతం వరకు జీతం ఇంక్రిమెంట్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది అసమానతకు దారి తీస్తుంది అని టీమ్లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ చెప్పారు. 2024లో జీతం పెంపుదల అంచనా గమనిక: ఈ గణాంకాలు బేసిక్ శాలరీ, పెరుగుదల, బోనస్లు, వేరియబుల్ పే లేదా ఇతర ప్రయోజనాలను కలిగి ఉండకపోవచ్చు. ఉద్యోగి అనుభవం, నైపుణ్యం ,కంపెనీ పనితీరు వంటి అంశాల ఆధారంగా ప్రతి సెక్టార్లో జీతం పెంపు ఉండకపోవచ్చని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్ హిల్స్' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు. 2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..! రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఫుల్టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు. -
250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్వాలిడిటేషన్ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.. 'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా అడ్వర్టైజింగ్లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్వేర్ బ్రాండ్లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శన్ మెహతా జీతం ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ 2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం. -
వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పనుందా?
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి. ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది. నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం ‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అసలే ఎన్నికలు అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి. -
మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే!
ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న ఖర్చులు. వెరసి పునర్నిర్మాణం పేరుతో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది తాజాగా, ఆ సంస్థకు చెందిన సోషల్ నెట్వర్క్ లింక్డిన్లోనూ 600 మందికి పింక్ స్లిప్లు జారీ చేసింది. అయితే, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, ఉద్యోగులకు కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలిస్తూ చర్చాంశనీయంగా మారింది. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ శాలరీలను ఎంత మొత్తంలో చెల్లింస్తుందనే డేటా లీకైంది. ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ఏయే డిజిగ్నేషన్కు ఎంత వేతనం చెల్లించాలని తెలిపేలా కొన్ని గైడ్లైన్స్ను తయారు చేసింది. ఈ గైడ్లైన్స్ ఆధారంగా ఆయా డిపార్ట్మెంట్లలో కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు ఎంత జీతాలు ఇవ్వాలనేది మేనేజర్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు అదే జీతాల డేటా ఆన్లైన్లో చక్కెర్లు కొడుతుంది. ప్రాంతాన్ని బట్టే జీతాలు దీంతో పాటు సిబ్బందికి అందించే కాంపన్షేషన్ సైతం ప్రాంతాన్ని బట్టి అందిస్తుంది. మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే న్యూయార్క్,శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే ఉద్యోగులకు కాంపన్షేషన్ కాస్త ఎక్కువ అందిస్తున్నట్లు శాలరీలను వెలుగులోకి తెచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ర్యాంకుల్ని బట్టి శాలరీలు లీకైనా వేతన మార్గదర్శకాల ప్రకారం మైక్రోసాఫ్ట్లో పనిచేసే ఉద్యోగుల ర్యాంకులు బట్టి సంస్థ అందించే జీతాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్లో మీ ర్యాంక్ (leval) 70 ఉంటే మీకు కంపెనీ ఇచ్చే బేసిక్ పే 231,700 డాలర్ల నుంచి 361,500 డాలర్ల వరకు ఉంటుంది. ఇదే ర్యాంక్లో ఖచ్చితమైన శాలరీ అంటే 310,000 నుండి 1.2 మిలియన్ల డాలర్లలోపు పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. 68 ర్యాంక్ ఉన్న వారిని సీనియర్ ఉద్యోగిగా, లెవల్ 63, లెవల్ 65 వరుసగా సీనియర్, ప్రిన్సిపల్ ఉద్యోగులుగా పరిగణించబడతారని నివేదిక హైలెట్ చేసింది. అత్యల్ప స్థాయి అదే కంపెనీలో అతి తక్కువ స్థాయి ఉద్యోగి జీతం 42,500 డాలర్ల జీతం తీసుకుంటారు. ఈ స్థాయిలో ఉన్న ఉద్యోగులు హైరింగ్ బోనస్ లేదా స్టాక్ అవార్డుకు అర్హులు కాదు. ఫీల్డ్ను బట్టి ర్యాంక్లు మారతాయ్ అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంకులు 70 వరకు వెళ్లవు. ఈ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగిని ప్రత్యేక ఇంజనీర్గా భావిస్తారు. అదే సమయంలో, ఇతర ఫీల్డ్లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంక్లు 80కి పైగా ఉంటాయి. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమానురాలు -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్సైట్లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్గా రికార్డ్) -
పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి?
పాకిస్తాన్ భారతదేశానికి పొరుగు దేశం. అయితే పాక్- భారత్ సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేవు. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే.. పాకిస్తాన్కు ఏనాడూ బలమైన ప్రధాని లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి కాకుండా పాక్ ప్రధాని జీతం, అతనికి కల్పించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ఆధారంగా ది న్యూస్ ఇంటర్నేషనల్ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఎంపీలు, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాల సమాచారాన్ని బహిరంగపరిచింది. దీనిలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ప్రధానికి 2,01,574 పాకిస్తానీ రూపాయల జీతం లభిస్తున్నది. (1 పీకేఆర్ = రూ. 0.287429) ఇక ప్రధానికి కల్పించే సౌకర్యాల విషయానిక వస్తే ఒక విలాసవంతమైన ఇంటితో పాటు, భద్రత, సేవకులు లాంటి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే పాక్లో పీఎంకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి పర్యవేక్షణ బాధ్యత అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది. పాకిస్తాన్ ఎంపీల జీతం విషయానికి వస్తే వారికి 1,88,000 పీకేఆర్ జీతం లభిస్తుంది. అయితే భారత ఎంపీలకు లభించినన్ని ప్రత్యేక సదుపాయాలు పాక్ ఎంపీలకు లభించడం లేదు. అక్కడి సీనియర్ ఆఫీసర్ల విషయానికివస్తే వారికి కూడా ఎంపీలకు లభించినంత జీతం లభిస్తుంది. పాక్ ప్రధాన న్యాయమూర్తికి 15,27,399 పాకిస్తానీ రూపాయల జీతం అందుతుంది. మంత్రులు 3,38,125 పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటారు. అయితే గ్రేడ్-2 అధికారులు 5,91,475 పాకిస్తానీ రూపాయల జీతం పొందుతారు. పాకిస్తానీ రూపాయలను భారతీయ రూపాయలతో పోల్చిచూస్తే, వారి జీతం చాలా తక్కువని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది? -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి టీచర్కు రూ.2 లక్షలు, హెల్పర్కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్లందరూ తమ వార్షిక బోనస్ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్గా ఇస్రో చైర్మన్ జీతం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్పోగుతుంది. ఇందుకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా. అవును సోమనాథ్ జీతం విషయాన్ని ట్విటర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించడంతో ఇస్రో చైర్మన్ పేరు తీవ్ర చర్చకు దారితీసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. Chairman of ISRO, Somanath’s salary is Rs 2.5 lakhs month. Is it right and fair? Let’s understand people like him are motivated by factors beyond money. They do what they do for their passion and dedication to science and research, for national pride to contribute to their… — Harsh Goenka (@hvgoenka) September 11, 2023 ఆయన తన ట్వీట్లో ‘ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతం రూ. 2.50 లక్షలు. ఈ జీతం ఆయనకు సరైనదేనా? న్యాయమేనా? సోమనాథ్ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదు.. అంతకు మించిన మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. వారు సైన్స్, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతతో జాతిని గర్వింపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వారి లక్ష్యాన్ని సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!’ అని పేర్కొన్నారు. హర్ష గోయెంకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్లు కూడా కలపాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా ‘ఇస్రోకు సోమనాథ్ లాంటి వ్యక్తుల నిబద్ధత, ఎనలేనిది. డబ్బులతో పోల్చలేనిది. సైన్స్, రీసెర్చ్ పట్ల ఆయనకున్న అంకితభావం దేశాన్ని మరింత ముందుకు నడపుతోంది. ఆయనలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనది’ అని ఓ యూజర్ పేర్కొనగా.. ‘ ఇస్రో చ్మైర్మన్కు నెలకు 25 లక్షలు ఇవ్వాలి. తన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలని మరొకరు చెప్పారు. కాగా ఇటీవల రెండు గొప్ప ప్రయోగాలను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని ప్రవేశించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది. అదే విధంగా సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు తొలిసారి ఆదిత్య ఎల్ల్1 పేరుతో అంతరిక్ష్యంలోకి మరో స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్అనంతరం భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్ పాయింట్ 1 వద్దకు చేరుకొని సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. -
షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లని కీలక పాత్ర. నటీనటులకు, నిర్మాతలకు వాళ్లు వారధుల్లా పని చేస్తుంటారు. హీరో హీరోయిన్ల డేట్స్ మొదలు.. పారితోషికం వరకు అన్ని వాళ్లే దగ్గర ఉండి చూసుకుంటారు. యాక్టర్స్ కూడా మేనేజర్లు ఏది చెబితే అది ఫాలో అవుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు మేనేజర్ల వెంబడి పడుతుంటాడు. మీ హీరోతో మా సినిమా సెట్ చేయడంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రతీది మేనేజర్లే చూసుకోవాలని కాబట్టి.. స్టార్ హీరోహీరోయిన్లు చాలా నమ్మకస్తులను మేనేజర్లుగా నియమించుకుంటారు. వారితో ఏళ్లతరబడి స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఒకరు. షారుఖ్ ఫ్యామిలీతో మంచి అనుబంధం 2012 నుంచి షారుఖ్కు మేనేజర్గా పూజా దద్లానీ పని చేస్తుంది. షారుఖ్ సినిమా వ్యవహారాలే కాకుండా పర్సనల్ విషయాలలో ఆమె సలహాలు ఇస్తుంటారట. దశాబ్ద కాలానికి పైగా షారుఖ్తో కలిసి పనిచేయడంతో వారి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. షారుఖ్ భార్య గౌరీఖాన్... పూజాను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటుంది. పలువురి సెలబ్రిటీల పార్టీలకు పూజాతో కలిసి వెళ్లింది. పూజ కూడా ఆ ఫ్యామిలీ కష్ట, సుఖాల్లో మోరల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించింది. భారీ వేతనం షారుఖ్ ఖాన్ సంపాదన గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ని స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగానే ఆర్జిస్తోంది. షారుఖ్ ఫ్యామిలీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందట. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే పూజా దాద్లానీకి షారుఖ్ భారీ వేతనాన్ని అందిస్తున్నాడట. ఏడాదికి రూ.7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు పూజా వేతనం ఉంటుందని బాలీవుడ్ టాక్. పూజ కేవలం మేనేజర్గానే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారట.ఆమె సంపాదన నికర విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉటుందని సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకుంది. వీరికి రేనా దద్లానీ అనే కూతురు కూడా ఉంది. -
అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
అఫ్జల్గంజ్/సంతోష్నగర్: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు. కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ నారాయణ పరామర్శించారు. రవీందర్ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రవీందర్ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్ అసోసియేష న్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. -
పాన్కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారిపోయాయి. -
ప్రతి నెలా 14న అంగన్వాడీ టీచర్లకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డుల జారీపైనా దృష్టి సారించామని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించా రు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె అంగన్వాడీ యూనియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జికోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్య లు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికెరి, జేడీ సునంద, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, టీఎన్జీవో ప్రతినిధి నిర్మల, మినీ అంగన్వాడీ అధ్యక్షురాలు వరలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్మార్ట్ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్షిప్లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్మార్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్బాద్లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్మార్ట్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
Mukesh Ambani Salary Details: భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట 'ముఖేష్ అంబానీ' (Mukhes Ambani) అని, కావున ఇందులో ప్రస్తుతానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈయన వార్షిక వేతనం ఎంత? ఇతర సౌకర్యాలు ఏవి ఉంటాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ సంస్థకు చైర్మన్గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 2022 నుంచి ఎన్నోన్నో కొత్త ఆలోచనలతో కంపెనీని అత్యన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఈ కారణంగా మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్గా నిర్వర్తించనున్నారు. అయితే ఈ సమయంలో ఆయన వార్షిక వేతనం శూన్యం అని తెలుస్తోంది. అంటే మరో ఐదేళ్ల కాలం పాటు ఆయన జీతం సున్నా రూపాయలు. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! 2019-20 వరకు వార్షిక వేతనం.. నివేదికల ప్రకారం, 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉండేది, ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం గమనార్హం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ తరువాత శాలరీ అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లు.. అదే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! ఇతర అలవెన్సులు.. దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ సంస్థకు అధినేతగా ఉన్నా.. జీతం తీసుకోకున్నా. ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. ఇందులో ట్రావెలింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ వంటి వాటితో పాటు తన కుటుంబానికి అయ్యే భద్రతా ఖర్చు కూడా కంపెనీ భరించనుంది. -
బాబు ఫ్రెండ్ ఈశ్వరన్కు మరో షాక్.. జీతంలో భారీ కోత
చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు. ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ -
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్సీఎల్ కంపెనీ సీఈవో విజయ్కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. -
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా?
HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) 2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్హోల్డర్లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్యుఆర్యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు. కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. -
హెచ్డీఎఫ్సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు. 1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్ హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్లైన్లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా హెచ్డీఎఫ్సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్డ్ డియర్నెస్ అలవెన్స్ రూ. 500. అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ ఆఫర్ లెటర్లో పేర్కొంది. కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్ను నిజమైన టైటాన్గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్కు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది. -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం వేతనాన్ని పెంచుతూ గురువారం ఉతర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆలమూరి విజయభాస్కర్ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
అంబానీ పిల్లలు ఏం చదువుకున్నారు ..? వాళ్ళ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
రిచ్ కిడ్స్: అంబానీ కొడుకులు, కూతురు ఏం పని చేస్తారు.. ఎంత సంపాదిస్తారు?
దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం.. ముఖేష్ అంబానీ కుటుంబం. ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఉత్సాహంగా పనిచేస్తూ కుటుంబానికి విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారి పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు, కూతురు ఏం పని చేస్తున్నారు.. వ్యక్తిగతంగా ఎంత సంపాదిస్తున్నారన్నది ఆసక్తికరం. రిలయన్స్ గ్రూప్నకు అధిపతిగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తన పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఉన్నత చదువులు చదివారు. వారి తండ్రి, తాతలను అనుసరించి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వారు రిలయన్స్ గ్రూప్లో ముఖ్యమైన విభాగాలను చూసుకుంటున్నారు. ఆకాష్ అంబానీ ఆకాష్ అంబానీ యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్లోని ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. వ్యాపారం విషయానికి వస్తే తన తండ్రిని అనుసరించారు. ఆకాష్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్గా ఉన్నారు. ఇందులో టెలికాం సేవలు, జియో సినిమా ఉన్నాయి. ఆకాష్ అంబానీ జీతం ఎంత అనేది వెల్లడించనప్పటికీ, ఆయన నెలవారీ జీతం దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా. ఇషా అంబానీ సోదరుడు ఆకాష్ అంబానిలాగే ఇషా అంబానీ కూడా వ్యాపారంలో మెలకువలు సాధించింది. ఆమె శిక్షణ పొందిన బిజినెస్ అనలిస్ట్ అలాగే సలహాదారు. యూఎస్లోని అగ్రశ్రేణి సంస్థలో కొంతకాలం పనిచేసిన తరువాత ఇషా అంబానీ తన తండ్రి వ్యాపారంలో చేరారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. డివిడెండ్ లాభాలతో కలిపి ఇషా అంబానీ నెలవారీ జీతం రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. అనంత్ అంబానీ ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు, ఆఖరి సంతానం అయిన అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఎనర్జీ వింగ్ హెడ్గా పనిచేస్తున్నారు. జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అంచనాల ప్రకారం.. అనంత్ అంబానీ నెలవారీ జీతం రూ. 35 లక్షలు. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
కన్నకూతురికి అంతేసి ‘జీతం’.. ఎక్కడా ఇలా జరగదేమో!
వైరల్ న్యూస్: అదేదో సినిమాలో హీరో ఓ గొప్పింటి హీరోయిన్ను పెళ్లి చేసుకునేందుకు.. ప్రేమలు, ఆప్యాయతలు మరచిన ఇంట్లో వాళ్లకి డబ్బిచ్చి మరీ నటించమని అడుగుతాడు. అయితే.. తాను చేసే పనితో విసిగిపోయిన కూతురిని.. ఉద్యోగం మానేసి తమతో పాటు ఇంటిపట్టూనే ఉండమని తల్లిదండ్రులు కోరారట. అయితే అందుకు ఆ కూతురు కండిషన్లు పెడితే.. వాళ్లు దానికి సంతోషంగా అంగీకరించారు. నెలవారీగా ఆ కూతురికి ‘జీతం’ ఇస్తూ పోతున్నారు. విడ్డూరంగా ఉందా?.. పెళ్లిపెటాకులకు దూరంగా ఓ న్యూస్ ఏజెన్సీలో పదిహేనేళ్ల పాటు పని చేసిందామె. 2022లో జాబ్లో ప్రమోషనూ దక్కించుకుంది. కానీ, అప్పటి నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగింది. మానసికంగా కుంగిపోతున్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు కరిగిపోయారు. ఈ భూమ్మీద ఎవరూ ఇవ్వని బంపరాఫర్ను ఆమెకు ప్రకటించారు. ‘‘నువ్వెందుకు నీ ఉద్యోగం వదిలేయకూడదు.. నీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తాం’’ అంటూ ఆ తల్లిదండ్రులు చేసిన ప్రతిపాదనను ఆమె స్వీకరించింది. బదులుగా జీతం కింద తమ పెన్షన్లో సగం ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డారు వాళ్లు. దీంతో పూర్తిగా తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమైంది ఆమె. అయితే.. ఆ గడపాన్ని ఒక పనిగానే భావిస్తానని.. వాళ్లు నెల నెలా ఇచ్చే డబ్బును జీతంగా ఆమె ప్రకటించుకుంది. అందుకు తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. చైనాలోని నియానాన్(40) అనే మహిళ.. ఈ ఫుల్ టైం డాటర్ జాబ్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తల్లిదండ్రుల కోసం కేటాయించే షెడ్యూల్ను సైతం ఆమె అక్కడి సోషల్ మీడియా అకౌంట్లలో వివరించింది. బదులుగా నెలకు తమకు వచ్చే 10వేల యువాన్ల నుంచి.. నాలుగు వేల యువాన్లను ‘జీతం’గా తీసుకుంటుందట. ఇది తల్లిదండ్రుల మీద ఆధారపడడం అవుతుందే తప్ప.. ఉద్యోగం ఎలా అవుతుంది?.. ఆమె చేసేది చాలా తప్పు అని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. ఇదీ చదవండి: తెల్లారి లేచి చూస్తే.. ఊరేంటి ప్రపంచమంతా షాక్! -
రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ
Wipro CEO Thierry Delaporte: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'థియరీ డెలాపోర్టే' (Thierry Delaporte) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న సీఈఓలలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా ఈయన ప్రసిద్ధి చెందారు. 2022-23 ఆర్ధిక సంవత్సరం వార్షిక వేతనంలో 5శాతం తగ్గినప్పటికీ భారీ ప్యాకేజి తీసుకునే సీఈఓలలో ఇప్పటికీ ఒకరుగా ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టే 10 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం కలిగి ఉన్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 83 కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈయన వార్షిక వేతనం రూ. 79.66 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈయన వేతనం రోజుకి రూ. 22.7 లక్షలు కావడం కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) గత సంవత్సరంలో డెలాపోర్టే మాత్రమే కాకుండా ఎక్కువ జీతం తీసుకునే భారతీయ సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ. 71.02 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ (రూ. 34 కోట్లు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ 17.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 144 కోట్లు), 'జూలీ స్వీట్' యాక్సెంచర్ (Accenture) సీఈఓ 23 మిలియన్ డాలర్ల జీతం (దాదాపు రూ. 189 కోట్లు) తీసుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ప్రపంచ దేశాల్లో భారత్లో సగటు జీతం, నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?
అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే.. చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్పై లైంగిక వేధింపులు -
పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!
సాక్షి,ముంబై: ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఆమె తన స్టయిల్, ఫ్యాషన్తో అభిమానులను కట్టిపడేస్తారు. (ఇదీ చదవండి: NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!) ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ, తనదైన శైలితో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. జ్యుయల్లరీ, హ్యాండ్బ్యాగ్లు, పాదరక్షలతోపాటు అధునాతన డ్రెస్సింగ్ సెన్స్, మేకప్తో తల నుండి కాలి వరకు పర్ఫెక్ట్గా కనిపించేలా లేడీ. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్, ప్రతి ఈవెంట్లోనూ అందంతో మెస్మరైజ్ చేసే నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) ముఖ్యంగా నీతా బ్యూటీ వెనుక ఉన్న పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ పాత్ర గురించి తెలిస్తే ఔరా అంటారు. పాపులర్ సెలబ్రిటీలకు మేకప్మేన్గా పనిచేసిన మిక్కీ టోక్యో బ్యూటీ పార్లర్లో పని చేసేవారు. చాలా క్లిష్ట సమయంలో నటి హెలెన్ హెయిర్ డ్రస్సర్గా చేస్తూ.. ఆమె సలహా మేరకే చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. అలా హమ్ అప్కే హై కౌన్, దిల్ టు పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, మొహబతేం, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, గుడ్ వంటి బాలీవుడ్ సినిమాలకు మేకప్ మేన్ గా పని చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటీమణుల్లో కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ దాకా మిక్కి క్లయింట్లే కావడం గమనార్హం. కానీ నీతా అంబానీకి మాత్రం మిక్కీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీతో పాటు కోడలు శ్లోకా అంబానీకి కూడా మిక్కీనే మేకప్ వేస్తారు. ముంబైలో తన సేవలకు ఒక్కో వ్యక్తికి రోజుకు లక్షల రూపాయల్లోనే వసూలు చేస్తారు. అంబానీల దగ్గర పనిచేస్తున్న మిక్కీ జీతం పలు కంపెనీల సీఈవోల శాలరీ కంటే ఎక్కువేనట. ఇదే ఇపుడు హాట్టాపిక్గా నిలుస్తోంది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్టీవీ: కేవలం రూ. 5వేలకే) నీతా అంబానీకి తన అందమైన కళ్లను ఆకర్షణీయంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. తన ఐబ్రోస్ ఎపుడూ నీట్ షేప్లో ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడూ మాస్కరాను మర్చిపోరు. ఒక విధంగా అదే ఆమె సిగ్నేచర్ లుక్. అంతేకాదు నీతా అంబానీ కస్టమైజ్డ్ లిప్స్టిక్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. బంగారం, వెండితో తయారు చేసిన ఈ లిప్స్టిక్ బాటిళ్ల ధర దాదాపు రూ.40 లక్షలకు పైమాటే. కాగా కేవలం గ్లామర్ విషయంలోనే కాదు ముంబై ఇండియన్స్ ఓనర్గా, రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేతగా నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేనా.. అంబానీ కుటుంబానీకి చెందిన ప్రతీ ఈవెంట్లోనూ నీతా సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఉండి తీరాల్సిందే. -
23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...?
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కార్మికుల నెలవారీ సగటు జీతాలను తెలియజేస్తూ ఓ జాబితా విడుదల చేసింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో కార్మికులు అందుకుంటున్న సగటు నెల జీతం రూ.లక్షపైనే ఉంది. స్విట్జర్ల్యాండ్లో అత్యధికంగా 6,096 డాలర్లు (రూ4,98,567) నెలవారీ వేతనం అందుకుంటున్నారు. కార్మికులు అత్యధిక జీతాలు అందుకుంటున్న మొదటి పది దేశాల్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567), లక్సంబర్గ్ (రూ.4,10,156), సింగపూర్ (రూ.4,08,030), యూఎస్ఏ (రూ.3,47,181), ఐస్లాండ్ (రూ.3,27,716), ఖతార్ (రూ.3,25,671), డెన్మార్క్ (రూ.2,89,358), యూఏఈ (రూ.2,86,087), నెదర్లాండ్స్ (రూ.2,85,756), ఆస్ట్రేలియా (రూ.2,77,332) ఉన్నాయి. 65వ స్థానంలో భారత్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ 65వ స్థానంలో నిలించింది. దేశంలో వివిధ రంగాల్లో కార్మికులు అందుకుంటున్న నెలవారీ సగటు వేతనం రూ.50వేల కంటే తక్కువే. దేశంలో కార్మికులు నెలకు సగటున 573 డాలర్లు అంటే రూ.46,861 అందుకుంటున్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్ , వెనుజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! Average monthly net salary: 1. Switzerland 🇨🇭: $6,096 2. Luxembourg 🇱🇺: $5,015 3. Singapore 🇸🇬: $4,989 4. USA 🇺🇸: $4,245 5. Iceland 🇮🇸: $4,007 6. Qatar 🇶🇦: $3,982 7. Denmark 🇩🇰: $3,538 8. UAE 🇦🇪: $3,498 9. Netherlands 🇳🇱: $3,494 10. Australia 🇦🇺: $3,391 . 11. Norway 🇳🇴: $3,289… — World of Statistics (@stats_feed) April 30, 2023 -
లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం
న్యూఢిల్లీ: గ్లోబల్గా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. టెక్ దిగ్గజం గూగుల్లో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,854 కోట్లు) పారితోషికం తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) ఆల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించిన ప్రకారం సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది. దీని ప్రకారం గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే దాదాపు 800 రెట్లు పెరిగింది. కాగా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా పరిస్థితుల నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది. ఇది కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్లో 6 శాతానికి సమానం. అలాగే ఈ నెల మొదట్లో లండన్లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్కు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. -
TS: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతన సవరణకు సీఎం సానుకూలత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు వేతన సవరణల్లో ఒకదాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2017, 2021లకు సంబంధించి పీఆర్సీలు పెండింగులో ఉండగా, 2017కు సంబంధించిన వేతనాల ను సవరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుకు ఆర్టీసీ చైర్మన్ తెచ్చినట్టు సమాచారం. విషయంపై చర్చించేందుకు సీఎం అనుమతించటంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఈడీ, సీపీఎం, ఫైనాన్స్ అడ్వయిజర్లు మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్ వెళ్లారు. అయితే మరో ముఖ్యమైన పనిలో సీఎం బిజీగా ఉండటంతో అపాయింట్మెంట్ దక్కలేదు. వారిని బుధవారం రావాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీనిపై సీఎంతో చర్చించిన తర్వాత ఫిట్మెంట్ విషయమై స్పష్టత రానుంది. ఐదేళ్లుగా ఇంటీరియమ్ రిలీఫ్ పైనే.. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే 2015లో ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధికంగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2013కు సంబంధించిన వేతన సవరణను రెండేళ్ల తర్వాత, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్టు అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదు. 2017లో మరోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, సకాలంలో చేయకపోవటంతో అప్పట్లో కారి్మకులు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆ సమయంలో నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కారి్మక సంఘాలతో పలుమార్లు చర్చించిన కమిటీ, వేతన సవరణ చేసేవరకు ఇంటీరియమ్ రిలీఫ్(ఐఆర్) ఇస్తామని తెలిపింది. దీనికి కారి్మక నేతలు అంగీకరించటంతో, ప్రభుత్వం 16 శాతం ఐఆర్ను ప్రకటించింది. ఇప్పటికీ అదే అమలవుతోంది. దానికి మరికొంత కలిపి 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగులు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈలోపు మరో వేతన సవరణ గడువు 2021 దాటిపోయింది. 2013 నాటి వేతన సరవణ బకాయిలు సగం వరకు పెండింగులో ఉండటం, 2017 వేతన సవరణ చేయకుండా ఐఆర్తో సరిపుచ్చటం, 2021 వేతన సవరణ ఊసే ఎత్తకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక వేతన సవరణను ప్రకటించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కోరుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటంతో, చర్చించేందుకు ఆయనను, అధికారులను పిలిచారు. బుధవారం దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. చదవండి: ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది? -
జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా..
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఏప్రిల్ 1 నుంచి జీతాలను సవరించింది. ఏ స్థాయి ఉద్యోగం ఎంత జీతం వస్తోందో తాజాగా వెల్లడైంది. సవరించిన జీతాల ప్రకారం.. ఎయిర్ ఇండియా పైలట్కు నెలకు కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.8.5 లక్షలు జీతం లభిస్తోంది. ఇక క్యాబిన్ సిబ్బందికి కనీసం రూ.25,000 నుంచి సీనియారిటీ, ఇతర అంశాల ఆధారంగా గరిష్టంగా రూ.78,000 జీతం వస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్లు, ఇతర సిబ్బంది జీతాలు ఇలా.. కనిష్టంగా ట్రైనీ పైలట్కు నెలకు రూ.50,000 లభిస్తుంది. లైన్ రిలీజ్ తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ఒక సంవత్సరం వరకూ నెలకు రూ.2.35 లక్షలు వస్తుంది. ఇక ఫస్ట్ ఆఫీసర్లు రూ. 3.45 లక్షలు, కెప్టెన్ రూ 4.75 లక్షలు జీతం అందుకుంటారు. కెప్టెన్ నుంచి అప్గ్రేడ్ అయిన కమాండర్కు రూ. 7.50 లక్షలు వస్తుంది. 4 సంవత్సరాల కంటే ఎక్కువ P1 రేటింగ్ ఉన్న సీనియర్ కమాండర్ నెలకు రూ.8.50 లక్షలు పొందుతారు. జీతంతో పాటు జూనియర్ పైలట్కు గంటకు రూ. 1,500 నుంచి రూ. 1,950 ఫ్లయింగ్ హవర్స్ అలవెన్సులు చెల్లిస్తారు. కమాండర్లు, సీనియర్ కమాండర్లకు నెలకు రూ.75,000, ఇతర వర్గాల పైలట్లకు రూ.25,000 బాడీ అలవెన్స్ ఉంటుంది. ఇదికాక కమాండర్లు, సీనియర్ కమాండర్లకు ఒక రాత్రికి రూ.2,200 చొప్పున డొమెస్టిక్ లేఓవర్ అలవెన్స్ లభిస్తుంది. ఇక ట్రైనీ క్యాబిన్ సిబ్బందికి ఫ్రెషర్కు రూ.25,000, అనుభవజ్ఞులైనవారికి రూ.30,000 స్టైఫండ్ లభిస్తుంది. రెగులర్ క్యాబిన్ సిబ్బందికి రూ.53,000, సీనియర్లకు రూ.64,000, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది నెలకు రూ.78,000 అందుకుంటారు. ఫ్లయింగ్ అలవెన్స్ క్యాబిన్ సిబ్బందికి రూ.375 నుంచి రూ.750 వరకు చెల్లిస్తారు. ఇక సీనియర్ క్యాబిన్ సిబ్బందికి రూ.475 నుంచి రూ.950 వరకు, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది రూ.525 నుంచి రూ.1,050 వరకు ఫ్లయింగ్ అలవెన్స్ అందుకుంటారు. కాగా శాశ్వత క్యాబిన్ సిబ్బందికి సాధారణ భత్యం 0-60 గంటల విమాన ప్రయాణానికి రూ.300, 65-70 గంటలకు రూ.375గా నిర్ణయించారు. సీనియర్ ఉద్యోగులు 0-65 గంటలు ప్రయాణం చేస్తే రూ.400 నుంచి రూ.650, అలాగే 65-70 గంటల వరకు రూ.525 నుంచి రూ.700 వరకు పొందుతారు. ఇదీ చదవండి: వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది! -
జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల వేతనం నుంచి టీడీఎస్ మినహాయించే ముందు పాత, కొత్త పన్ను విధానాల్లో వారికి ఏది సమ్మతమో సంస్థలు తెలుసుకోవాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న పన్ను విధానం పరిధిలోనే టీడీఎస్ వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఏ ఆప్షన్ చెప్పకపోతే, అప్పుడు నూతన పన్ను విధానం కింద టీడీఎస్ మినహాయించాలని కోరింది. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్! -
రిటైరైనా ‘సెటిల్మెంటు’ జరగదాయె!
సాక్షి, హైదరాబాద్: సర్వీసులో ఉన్నంత కాలం ప్రతినెలా జీతం నుంచి సంస్థ మినహాయిస్తూ వచ్చి న సొమ్ముల కోసం ఇప్పుడు వందలాది మంది ఆర్టీసీ పూర్వ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ అయి ఉన్న ఆ మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. ఆ ర్టీసీలో ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం తమ జీతం నుంచి మినహాయించి సహకార పరపతి సంఘంలో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం సీసీఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో సీసీఎస్ భవితవ్యమే గందరగోళమైంది. అయితే ఇప్పటివరకు సీసీఎస్కు సంబంధించి మిగతా వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఉన్నా.. రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్ల విషయంలో మాత్రం లోటు రానివ్వలేదు. కానీ గత ఆగస్టు నుంచి ఈ సెటిల్మెంట్ల విషయంలో కూడా ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ నెల నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటి వరకు ఆ డిపాజిట్ మొత్తాలను ఇవ్వలేదని అంటున్నారు. సగటున ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అలా దాదాపు 500 మంది ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించలేదని చెబుతున్నారు. అధిక వడ్డీ ఆశతో.. సర్వి సులో ఉన్న ఉద్యోగులకు జీతాల నుంచి వచ్చే ఈ మొత్తమే చివరి వరకు ఆయువు పట్టు. అలా ప్రతినెలా జమ అయ్యే నిధులతోనే ఆ సంస్థ ఉద్యోగులకు రుణాలు ఇస్తుంది. ఆ డిపాజిట్ మొత్తాలపై అధిక వడ్డీని ఉద్యోగులకు చెల్లిస్తుంది. దీంతో చాలామంది మధ్యలో డిపాజిట్ మొత్తాన్ని తీసుకోకుండా పదవీవిరమణ వరకు అలాగే కొనసాగిస్తారు. కొందరైతే, రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ అధిక వడ్డీ పొందుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆగస్టు నుంచి ఆర్టీసీ సీసీఎస్కు పెద్దగా నిధులు విడుదల చేయకపోవటంతో పదవీవిరమణ పొందిన వారికి కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. రిటైర్మెంట్ సెటిల్మెంట్లతో రకరకాల ప్రణాళికలు చేసుకుని, ఇప్పుడు ఆ మొత్తం అందని వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. -
కనీస వేతనాలపై మీ వైఖరి ఏమిటి? ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్:కనీస వేతనాలకు సంబంధించి జీవోలు ఇచ్చి.. గెజిట్ ప్రింట్ చేయకపోవడంపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ప్రభుత్వం వెంటనే గెజిట్ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రతివాదులుగా సీఎస్, కార్మిక శాఖ కమిషనర్ తదితరులను పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు!
టెక్ కంపెనీల్లో ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. పని ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నానని ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగిని చెప్పడం తాజాగా అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించి ‘ఇండిపెండెంట్’ అనే ఆన్లైన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! మెటా కంపెనీలో రిక్రూటర్గా పనిచేసిన మాడెలిన్ మచాడో అనే మహిళ.. తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు (దాదాపు రూ. 1.5 కోట్లు) జీతం అందుకున్నట్లు చెప్పారు. 2021లో మెటా కంపెనీలో తన ఆరు నెలల ఉద్యోగ అనుభవాన్ని ఆమె టిక్టాక్ వీడియోలో వెల్లడించారు. రిక్రూటర్గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్ చేయలేదని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో కంపెనీకి రిక్రూట్మెంట్ ఆలోచనే లేకపోవడం అని చెప్పారు. మెటా కంపెనీలో రోజంతా నేర్చుకోవడంలోనే గడిచిపోయేదని, ఆ కంపెనీలో ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి ఇచ్చే శిక్షణ ఉన్నతంగా ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. రిక్రూట్మెంట్లు లేకపోయినప్పటికీ టీమ్ మీటింగ్లు మాత్రం ఎక్కువగా ఉండేవని చెప్పారు. తన టీమ్లోని వారందరూ కొత్తవారే కావడంతో ఎవరూ ఎవరినీ రిక్రూట్ చేసుకోలేదని వివరించారు. ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్వర్క్లో రిలయన్స్ జియో దూకుడు! ఏ పనీ చేయకుండానే జీతమిచ్చారని మచాడో చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత దీనిపై వివరణ ఇస్తూ లింక్డ్ఇన్లో ఆమె పోస్ట్ చేశారు. తాను టిక్టాక్లో పెట్టిన వీడియో తప్పు కోణంలో వైరల్ అయిందని, తన ఉద్దేశం వేరు అని వివరించారు. కాగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మెటా ఇటీవల మరో విడత లేఆఫ్లను ప్రకటించింది. 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు పేర్కొంది. 5,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా వాటినీ ఆపేసింది. తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్లను వాయిదా వేసింది. -
జీతం అడిగిందని మహిళను చితకబాదిన యజమాని
ముంబై: ఓ మహిళకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకున్నాడు యజమాని. తీరా గట్టిగా అడిగేసరికి విచక్షణ మరచి ఆమెను చితకబాదాడు. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూణెలో అకుర్దిలోని వాణిజ్య సముదాయంలోని ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆఫీసులో ఓ మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. అయితే కొన్ని రోజులుగా, అర్షద్ కమల్ ఖాన్ తన సోదరుడికి బదులుగా ఆ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలలుగా ఆ మహిళకు జీతాన్ని చెల్లించడం లేదు. చివరికి ఈ విషయమై ఖాన్ని గట్టిగా ప్రశ్నించగా విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె రక్తస్రావం అయింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసుల కేసు అతడి మీద కేసు నమోదు చేశారు. పూణెలోని నిగ్డి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా అర్షద్ కమల్ ఖాన్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. -
ఉద్యోగులకు బంపరాఫర్!
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో సగటున ఉద్యోగుల జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ- కామర్స్, ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ విభాగాల్లో ఈ వేతనాల పెంపు ఉండనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలిపింది. గత ఏడాది పెరిగిన సగటు ఉద్యోగుల శాలరీలు 10.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2022లో కంటే.. 2023లో జీత భత్యాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలైన మైనింగ్, ఎలక్ట్రసిటీ జనరేషన్, పవర్ పాంట్ల్ ఆపరేషన్స్, ఆయిల్ ఫీల్డ్ వర్క్, రీసైక్లింగ్, డ్రైవింగ్ వంటి ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదించింది. జీతాలు పెరిగే రంగాలు ఇవే దేశంలో మొత్తం మూడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే 2023 రిపోర్ట్ హైలెట్ చేసింది. వాటిలో ఈ-కామర్స్ విభాగంలో 12.5శాతం, ప్రొఫెషనల్ సర్వీసులైన అకౌంటెంట్స్, డాక్టర్స్, న్యాయవాదులుగా పనిచేసే వారికి 11.9శాతం పెరగ్గా.. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. -
ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..!
తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్సైట్ (news.com.au) నివేదించింది. ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అందుకున్న 50 నెలల బోనస్తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటున్నాయి. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! ఈ ఎవర్గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్గ్రీన్లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్ వెబ్సైట్ పేర్కొంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్గ్రీన్ 16.25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది. -
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా శాఖాహారమే తీసుకోవడం గమనార్హం. ఇటీవల అంబానీ డ్రైవర్కు ఇచ్చే జీతం గురించి తెలిసింది, కాగా ఇప్పుడు వంటమనిషికి ఎంత జీతం ఇస్తారన్నది వెలుగులోకి వచ్చింది. చాలా సాధారణమైన ఆహారం తీసుకునే ముకేశ్ అంబానీ ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారని, అంతే కాకుండా అప్పుడప్పుడు సరికొత్త వంటకాలు కూడా రుచిచూస్తారని సమాచారం. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయని చెబుతారు. ముకేశ్ అంబానీకి సాధారణ వంటకాలతో పాటు థాయ్ వంటకాలంటే కూడా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆదివారం రోజు ఇడ్లీ సాంబార్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్న రాత్రి భోజం మాత్రం కుటుంబంతో కలిసి చేస్తారని గతంలో నీతా అంబానీ చెప్పారు. (ఇదీ చదవండి: భారత్లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు) అంబానీ ప్రతి రోజు తీసుకునే ఆహారానికి సంబంధించి కీలక పాత్ర చెఫ్ది (వంట మనిషి) అనే చెప్పాలి. ఎప్పుడు ఏమి తింటారనేది కూడా వారే చూసుకుంటారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకునే వంటమనిషి జీతం భారతదేశంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల జీతంకంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు అంబానీ వంటమనిషి జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
తాప్సీ డైటిషియన్ నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే! స్వయంగా చెప్పిన నటి
సినీ సెలబ్రెటీలది లగ్జరీ లైఫ్. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటులు ఏం చేస్తుంటారు, ఏం తింటుంటారో తెలుసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. సాధారణ ప్రజల కంటే వారి ఆహారపు అలవాట్లు కాస్తా భిన్నంగా ఉంటాయి. అలాగే నటీనటులు కూడా ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్నెస్, గ్లామర్పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వెచ్చించే డబ్బు లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విషయాలు తెలిసినప్పడు అంతా అవాక్కవుతుంటారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ తన ఫిట్నెస్ కోసం పెట్టే ఖర్చు ఎంతో బయటపెట్టింది. ఇది తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు బాడీలో మార్పులు వస్తుంటాయి. చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే.. ఫిట్గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్స్ సలహా చాలా అవసరం. మనం ఎప్పుడు ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వారు సూచిస్తుంటారు. అందుకే ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా డైటిషియన్ను పెట్టుకున్నా. నా డైటిషియన్కే నెలకు లక్ష రూపాయలు పే చేస్తాను. అది నా ప్రోఫెషన్. తప్పుదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్పీ డైటీషియన్ జీతం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ‘ఒక్క డైటిషియన్కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే.. ఇక మిగలిన వాటికి ఎంత చేస్తుందో?’ అంటూ నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు. కాగా తాప్సీ చివరగా తెలుగులో మిషన్ ఇంపాజిబుల్లో నటించింది. -
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్టాపిక్గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్గా, ప్రేమగా ఉండే కృతివాసన్కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఇన్ఫోసిస్కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్కి గుడ్బై చెప్పి కాగ్నిజెంట్కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
‘మీకు నచ్చకపోతే, నా తల తీసుకెళ్లండి’.. ఉద్యోగులపై మండిపడ్డ సీఎం!
డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేని కారణంగా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగుల డీఏ పెంపు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మమతా మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. చాలకపోతే.. నా తల నరకి తీసుకెళ్లండి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇకపై డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా ఎంత కావాలి? ప్రభుత్వం ప్రకటించిన డీఏ పట్ల మీరు సంతోషంగా లేకుంటే నా తల నరికి తీసుకెళ్లండి ”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ విధానం వేరువేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? ’అని మండిపడ్డారు. ఫిబ్రవరి 15న, అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి.. ఉపాధ్యాయులతో సహా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు, ప్రాథమిక వేతనంలో 3% డియర్నెస్ అలవెన్స్గా ప్రభుత్వం ఇస్తోంది. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు సవరించిన డియర్నెస్ అలవెన్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న డియర్నెస్ అలవెన్స్తో (డీఏ) పోలిస్తే పెంపుదల చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వ భావించారు. అందుకే పెంపుపై అసంతృప్తితో నిరసనలు చేపట్టారు. చదవండి: తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే.. -
ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ సాలరీపై సోషల్మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. వామ్మో.. అంత సాలరీ ఎందుకు సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్స్టైల్కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు. వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. కార్మిక శాఖకు ఫిర్యాదు అంతేకాదు ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా విప్రో రూ. 6.5 లక్షల (LPA) ఆఫర్తో ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్ లాంటి సాకులతో వార్షిక వేతనం సగానికి కోత విధించేందుకు నిర్ణయించింది. 3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి యూనియన్తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. -
నెలకు రూ.4 లక్షలు: రెండేళ్లు కష్టపడితే, కోటి...కానీ..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్గా ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే.. నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నా అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఆఫ్షోర్ రిగ్గర్ ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే నాధుడే దాదాపు కనిపించడం లేదట. విషయం ఏమిటంటే స్కాట్లాండ్లో ఈ ఉద్యోగం. అబెర్డీన్లోని నార్త్ సీ తీరంలో పనిచేయాల్సి ఉంటుంది సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటైన రిగ్లో ఆఫ్షోర్ రిగ్గర్ అభ్యర్థి సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫర్దర్ ఆఫ్షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఉద్యోగికి సెలెక్ట్ అయితే రోజుకు 12 గంటల పని. రోజుకు రూ.36 వేల చొప్పున నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. ఒక షిప్ట్ ఒకటి నుండి ఆరు నెలల వరకు ఉంటుంది. కంపెనీ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు,సెలవులు కూడా ఉంటాయి. వారం రోజులు సీక్ లీవ్ కూడా ఉంది. అభ్యర్థి రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉండి, 6-6 నెలల 2 షిఫ్ట్లను పూర్తి చేస్తే, అప్పుడు జీతం £95,420 (రూ. 1 కోటి)కి చేరుకుంటుంది. ఇంత భారీ ప్యాకేజీతో మొత్తం 5 ఖాళీలకుగాను 24 రోజుల క్రితం నోటిఫికేషన్ ప్రకటించగా అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువట. తన ఖచ్చితమైన గుర్తింపును వెల్లడించకుండానే ఎనర్జీ మార్కెట్లో పెద్ద కంపెనీగా చెప్పుకున్న సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. -
సగం జీతానికి పనిచేస్తారా.. ఫ్రెషర్స్కు విప్రో ఝలక్!
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది. (ఇదీ చదవండి: ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు) పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్లో వివరించింది. 2023 బ్యాచ్లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్మెంట్లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: Layoffs: ట్విటర్లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!) -
కూలీ నంబర్ 1
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రాజెక్ట్ హీరో యాప్లో 5 లక్షల మంది వర్కర్లు నమోదై ఉండగా.. ఇందులో హైదరాబాద్ నుంచి 12,285 మంది ఉన్నారు. యాప్లో రిజిస్టరైన 1.4 లక్షల ఉద్యోగ పోస్టింగ్లు, వాటి వినియోగ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మాణ కూలీ 5 నుంచి 8% పెరిగితే.. హైదరాబాద్లో ఏకంగా 20% వృద్ధి చెందింది. నగరంలో పెద్ద ఎత్తున వాణిజ్య, ఆకాశహర్మ్యాల నిర్మాణాలు జరుగుతుండటం అత్యధిక కూలీ చెల్లింపులకు కారణం. పీఎఫ్, ఈఎస్ఐలు దక్కడం లేదు.. దేశంలోని ప్రధాన నగరాలలో ప్రభుత్వం నిర్ధేశించిన దినసరి కూలీ దక్కడం లేదని ప్రాజెక్ట్ హీరో ఫౌండర్ అండ్ సీఈఓ సత్యవ్యాస్ తెలిపారు. కేవలం 8.6 శాతం మంది కూలీలకు మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), 7.1% మందికి ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) కవరేజ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. యూపీ నుంచే వలసలెక్కువ.. ప్రస్తుతం దేశంలో 5.1 కోట్ల మంది నిర్మాణ కూలీలు ఉన్నారు. అత్యధికంగా కూలీలు ఉత్తర్ప్రదేశ్ నుంచి వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి 42% మంది దేశంలోని వివిధ నగరాల్లోని నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వస్తున్నారు. బిహార్ నుంచి 16%, పశ్చిమ బెంగాల్ నుంచి 10%, ఒడిశా నుంచి 9%, మహారాష్ట్ర నుంచి 6% కూలీలు వలస వస్తున్నారు. కరోనా తొలి దశలో నిర్మాణ రంగ కార్మికుల వెతలు, వలసలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. క్రమంగా నిర్మాణ రంగం పుంజుకోవటంతో ఇప్పుడిప్పుడే కూలీలు గాడినపడుతున్నారు. ఈ విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెటరనే చెప్పాలి. ఎందుకంటే కూలీలకు దినసరి వేతనాలు అందుతుంది ఇక్కడే కాబట్టి! నగరంలో భవన నిర్మాణ కార్మికులకు రోజుకు సగటున రూ.584 నుంచి రూ.1,035 మధ్య కూలీ గిట్టుతుంది. చిట్ట చివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.515 నుంచి 925 మధ్య మాత్రమేనని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ యాప్ ప్రాజెక్ట్ హీరో అధ్యయనంలో వెల్లడైంది. సమయానికి వేతనాలు చెల్లిస్తేనే.. గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయడానికే నగర డెవలపర్లు ప్రాధాన్యం ఇస్తారు. అలా చేయాలంటే కూలీలకు, ఉద్యోగస్తులకు సమయానికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా తొలి దశలో దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు నిలిచిపోవటంతో లక్షలాది ని ర్మాణ కూలీలు పొట్టచేత పట్టు కొని సొంతూళ్లకు వెళ్లిపోయా రు. ఆ సమయంలో మా అన్ని ప్రాజెక్ట్లలోని 3 వేల మంది కూలీలను సుమారు 3 నెలల పాటు ఆహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తదితర అవసరాలను సొంతంగా ఏర్పాటు చేశాం. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ -
నువ్వున్నావ్గా! ఇల్లు ఊడ్చడానికి, వంట చేయడానికి,..
నువ్వున్నావ్గా! ఇల్లు ఊడ్చడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి.. పనిమనుషుల్ని పెట్టుకుంటే నా జీతం కూడా సరిపోదు.. -
కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ నియమితులయ్యారు. గ్రోత్కు సంబంధించి మంజి పొజిషన్లో ఉన్న కాగ్నిజెంట్ సీవోగాఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షికవేతనం ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. 2020లో అంబానీ జీతం కంటే నాలుగు రెట్ల అధికం రవి కుమార్ జీతం 2020లో ముఖేశ్ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్ బేసిక్ సాలరీగా ఒక మిలియిన్డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్లను పొందనున్నారు. .కాగా గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ . -
యాపిల్పై షేర్ హోల్డర్ల విమర్శలు, టిమ్కుక్ శాలరీ తగ్గింపు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందించే వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోనుంది. యాపిల్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో టిమ్కుక్ వేతనం తగ్గించాలని చర్చకు వచ్చింది. షేర్ హోల్డర్లతో జరిపిన సమావేశం అనంతరం వేతన తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. పెట్టుబడిదారుల అభిప్రాయం మేరకు తన వేతనాన్ని సర్దుబాటు చేయమని కుక్ స్వయంగా అభ్యర్థించారు.కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దీంతో ఆయన వేతనం 40శాతం పైగా తగ్గించి 49 మిలియన్లను మాత్రమే ముట్టజెప్పనుంది. 2023లో కుక్కు ఇచ్చే శాలరీ మార్పులు, యాపిల్ పనితీరుతో ముడిపడి ఉన్న స్టాక్ యూనిట్ల శాతం 50 నుంచి రానున్న రోజుల్లో 75శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2022లో కుక్ 99.4 మిలియన్ల మొత్తాన్ని శాలరీ రూపంలో తీసుకోగా, ఇందులో 3 మిలియన్ల బేసిక్ శాలరీ, సుమారు 83 మిలియన్లు స్టాక్ అవార్డ్లు, బోనస్లు ఉన్నాయి. కుక్ వేతనంపై యాపిల్ సంస్థ స్పందించింది. సంస్థ అసాధారణమైన పనితీరు, సీఈవో సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని ఫైలింగ్లో పేర్కొంది. కాగా, యాపిల్ సంస్థ టిమ్ కుక్కు ఇచ్చే ప్యాకేజీపై వాటాదారులకు అభ్యంతర వ్యక్తం చేశారు. అదే సమయంలో కుక్ పట్ల యాపిల్ ప్రదర్శిస్తున్న విధేయతపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టిమ్కుక్ శాలరీ విషయంలో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో ప్రముఖ అడ్వైజరీ సంస్థ ఐఎస్ఎస్ (Institutional Shareholder Services) సైతం 2026లో టిమ్కుక్ రిటైర్ కానున్నారు. అప్పటివరకు ఈ ప్రోత్సహాకాలు ఇలాగే కొనసాగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
కొత్త చిక్కుల్లో ఎలాన్ మస్క్.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది!
ట్విటర్ కొనుగోలు తర్వాత అందులో భారీ మార్పులకు పూనుకున్నాడు ఎలాన్ మస్క్. కంపెనీ నష్టాలను తగ్గించుకోవడం కోసం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడం అప్పట్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల తొలగింపు మొదలుపెట్టిన మస్క్ భవిష్యత్తులో వాటి వల్ల ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ప్రస్తుత పరిణామలు చూస్తుంటే ఈ టెస్లా అధినేత తాజాగా మరో చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. మా పరిస్థితి ఏంటి.. ఉద్యోగుల అసహనం నవంబర్ 4న, 2022 కంపెనీ ఎలాన్ మస్క్ నియంత్రణలోకి వచ్చిన వారం తర్వాత, ట్విటర్లో పని చేస్తున్న 7వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఉద్యోగుల నోటీస్ పీరియడ్ ముగిసింది. సంస్థలో తొలగించిన కొందరి ఉద్యోగుల ప్రకారం.. నోటీస్ పీరియడ్ ముగింపు అనంతరం మాకు రావాల్సిన ప్యాకేజీలపై కంపెనీ ఇంత వరకు స్పందించలేదని తెలిపారు. ఈ అంశంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్విటర్ కొత్త యాజమాన్యానికి చట్టపరంగా మరింత చిక్కులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. కాగా.. ‘ తొలగిస్తున్న ఉద్యోగులకు 3 నెలల జీతం అందిస్తామని’ మస్క్ గతంలో ట్వీట్ చేశాడు. అయితే మస్క్ నుంచి కూడా దీని గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. మరో వైపు ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు, సాఫ్ట్వేర్ సేవలు, శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయాలలో అద్దెతో సహా చెల్లించని బిల్లులపై ఇప్పటికే ట్విటర్ అనేక దావాలను ఎదుర్కొంటుంది. చదవండి ట్రైన్ జర్నీ వాయిదా, తేదీని మార్చుకోవాలా?.. ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు! -
ఐటీ కంపెనీల్లో భారీగా పెరిగిన సీఈవోల జీతాలు.. మరి ఉద్యోగుల శాలరీలో
దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సీఈవో స్థాయి అధికారులకు జీతాలు భారీ ఎత్తున పెరిగాయి. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల శాలరీలు అరకొర పెంచితే.. సీఈవో స్థాయి వారికి మాత్రం ఊహించని విధంగా హైక్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 2012తో పోల్చితే 2022లో ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్ జీతాలు 47 శాతం మాత్రమే పెరిగాయి. సీఈవోల జీతాల్లో మాత్రం 1,492 శాతం పెరిగినట్లు తేలింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో, బోర్డు సభ్యుడు టీవీ మోహన్దాస్ పాయ్ మాట్లాడుతూ..‘ఫ్రెషర్ల జీతాల్లో ఎలాంటి మార్పులు లేవు. 10 నుంచి 12 ఏళ్ల క్రితం కంపెనీలు చెల్లిస్తున్నట్లుగా రూ.3.5 నుంచి రూ. 4 లక్షలే చెల్లిస్తున్నారు. అదే సమయంలో మేనేజర్లు, సీనియర్ల జీతం 4,5,7 రెట్లు పెరిగిందని అన్నారు. హెచ్సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నాయర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించకపోవడం నిజంగా దురదృష్టం. ఆయా కంపెనీలు మార్కెటింగ్, ఆఫీస్ నిర్వహణ కోసం చేసే ఖర్చు.. ఉద్యోగులకు శాలరీలుగా ఇస్తే.. 10 రెట్ల రాబడి పొందవచ్చనే విషయాన్ని సంస్థలు గుర్తించలేకపోతున్నాయని చెప్పారు. టీమ్ లీజ్ డిజిటల్ డేటా టీమ్ లీజ్ డిజిటల్ డేటా ప్రకారం.. సీఈవోతో పాటు అదే కంపెనీలు పనిచేస్తున్న ఫ్రెషర్ల మధ్య వేతనాల వ్యత్యాసం భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు ఇన్ఫోసిస్లో ఉద్యోగులు - సీఈవోల మధ్య శాలరీ రేషియో 1973, విప్రోలో 2,111, హెచ్సీఎల్ 1,020, టెక్ మహీంద్రాలో 644, టీసీఎస్లో 619గా ఉంది. శాలరీ వ్యత్యాసానికి కారణం! విద్యార్ధులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటూ చదువు పూర్తి చేస్తున్నారు. కానీ మార్కెట్లోని డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన స్కిల్స్ వారిలో లేకపోవడం కారణమనే అభిప్రాయం వ్యక్తం చేశారు నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్. కార్నిక్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు వారికి (ఫ్రెషర్స్) లేవు. డొమైన్ నైపుణ్యాలు ఉండవు. ఆ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఐటీ పరిభాషలో వీటిని సాఫ్ట్ స్కిల్స్ అని అంటాం. ఆయా టీమ్స్లలో వర్క్ చేయడం, ఏ భాషలోనైనా కమ్యూనికేట్ చేసే టాలెంట్ ఉండాలని సూచించారు. -
కంపెనీలపై మాకు నమ్మకం లేదు దొర.. సంచలన విషయాలు బయటపెట్టిన ఉద్యోగులు
తాము చేస్తున్న పనికి తగ్గ జీతం తీసుకుంటున్నట్లు కేవలం 32 శాతం ఉద్యోగులు మాత్రమే అభిప్రాయపడుతున్నారట. కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల దాదాపు 3500 మందికిపైగా ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. అందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పని, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడం, వర్కింగ్ కల్చర్ సరిగా లేకపోవడం, ఆఫీస్లో ఉద్యోగులకు ఎదురయ్యే పలు అనుభవాలే దీనికి ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజీనామాల పర్వం ఎక్కువగా ఉండడంతో కంపెనీలు కొత్త సిబ్బందిని తీసుకునేవి. ముఖ్యంగా ఈ తరహా ఐటీ రంగంలో ఇలాంటివి చూడవచ్చు. అయితే ఇక్కడ సంస్థలు ఎంతో కాలంగా పని చేస్తున్న సిబ్బంది వేతనం కంటే కొత్తవారికి ఎక్కువ వేతనాలు చెల్లించి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఇది అక్కడ ఉంటున్న ఉద్యోగుల్లో కాస్త అసహనాన్ని రగిలిస్తోందట. వీటితో పాటు ప్రతి ఏటా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ల విషయంలో కొందరికి తక్కువగా చెల్లించడం వంటి కారణాలతో సంస్థపై వారికున్న నమ్మకం సన్నగిల్లుతోంది. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, ఆర్థిక సంక్షోభం ఎదురుకానున్న నేపథ్యంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అందుకే మెటా, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ సిబ్బంది ఇంటికి పంపుతున్నాయి. ఇదే దారిలో ప్రస్తుతం చాలా కంపెనీలు పాటిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కంపెనీలపై ఉండే నమ్మకం క్రమక్రమంగా దెబ్బతింటున్నట్లు సర్వే పేర్కొంది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!
జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. అవేమిటంటే.. ఇలా ఎన్నెన్నో .. యజమాని తన ప్రేమను కాసుల్లో కురిపిస్తే.. ప్రతి కాసు మీద పన్నుకట్టాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంది. మీరు ప్రస్తుతం ఇలాగే పన్ను కడుతున్నారు. ఏ సమస్యా లేదు. కానీ ఈ కింది వారిని ఒకసారి గమనించండి. లెక్కలమాస్టారికి లెక్క లేదు .. నగరంలో నంబర్ వన్ లెక్కల మాస్టారు నగధరరావుగారు. ఉదయం 4 గంటల నుండి ట్యూషన్లు, కాలేజీ టైమింగ్స్ తర్వాత నిశిరాత్రి దాకా కొనసాగుతుంటాయి. కానీ ట్యూషన్ ఫీజుల మీద పన్ను కట్టలేదు. అంతే కాకుండా పేపర్ సెట్టింగ్, వేల్యుయేషన్, ఇన్విజిలేషన్ మీద వచ్చేదీ ఎక్కడా అగుపడదు. డ్రిల్లు మాస్టారు యోగేశ్వర్రావుగారు కూడా అదే బాపతు. ఆయన యోగాలో ఎక్స్పర్టు. నగధరరావు గారిలా కాకపోయినా మూడుబ్యాచ్లు .. అరవై మంది పిల్లలు. ఇలా చిట్టీలు నడిపే చిదంబరం, బుక్స్ అమ్మే బుచ్చిరాజు, ఆవకాయలు .. పచ్చళ్లు పెట్టే అనంతయ్య, జ్యోతిష్యం చెప్పే జోస్యుల, సంగీతం చెప్పే సంగీత రావు, బ్యూటీపార్లరు బుచ్చమ్మ, హోమియో డాక్టర్ హనుమాన్లు, జంతికలు .. వడియాలు అమ్మే జనార్దన రావు, జీడిపప్పు .. కిస్మిస్ అమ్మే జీవనాధం, బట్టలు అమ్మే భుజంగం .. మొదలైనవారంతా మనకు కనిపిస్తూనే ఉంటారు. వీరి మీద మనకేం అసూయ లేదు .. ఏడుపూ ఉండదు. కానీ చట్టాన్ని పక్కన పెట్టి వీరు రాజ్యం ఏలుతున్నారు. ‘‘మేం కష్టపడి సంపాదిస్తున్నాం. తప్పేంటి?’’, ‘‘రెక్కాడితే గానీ డొక్కాడదు’’, ‘‘కష్టేఫలి’’, ‘‘చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడు’’ అంటూ వాదనకు దిగొద్దు. డిపార్ట్మెంట్ వారి దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కృత్రిమ మేథస్సు ద్వారా ఎంతో సేకరించారు. అసలే ‘‘డిజిటలైజేషన్ డేస్’’ .. తగిన జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి సైడు ఆదాయాలన్నింటిపైనా పన్ను చెల్లించండి. -
సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలపు వేతనాలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందుకోబోతున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వారికి ఆ మొత్తం అందబోతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తర్వాత సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీలో వెంటనే అమలు కాలేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా.. సెలవు కాలపు వేతనాన్ని విధుల్లో ఉన్న ఉద్యోగులకే చెల్లించారు. ఆ సమయానికే పదవీ విరమణ పొందిన 8,053 మందికి ఇవ్వలేదు. దీంతో ఆ వేతనం కోసం వారు 11 ఏళ్లుగా పోరాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలతో మంత్రుల చర్చల సందర్భంగా ఈ డిమాండ్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 3 డీఏలు, దసరా పండుగ అడ్వాన్సులాంటి వాటితోపాటు పదవీ విరమణ పొందిన అర్హులకు సమ్మె కాలపు వేతనం కింద రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ పేరుతో సర్క్యులర్ శనివారం జారీ అయింది. చదవండి: కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్! -
పెన్షన్ (సవరణ) పథకం సబబే
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, పెన్షన్ నిధిలో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 2014 నాటి సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పెన్షన్ పథకంలో చేరలేకపోయిన ఉద్యోగులు 6 నెలల్లోగా చేరొచ్చంది. రూ.15,000 వేతనం దాటినవారు 1.16 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలన్న నిబంధన చెల్లదని స్పష్టం చేసింది. -
ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో కేంద్రం, 7వ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళికి కొద్ది రోజులే ముందు, తాజాగా ఉద్యోగుల డీఏను 15 శాతం పెంచింది. ఈ పెంపు 5వ, 6వ పే కమీషన్ కింద జీతాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థ ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపింది. 5వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలను విత్ డ్రా చేసుకునే ఉద్యోగుల డీఏ రేటును 15% మేర 381% నుంచి 396%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా, 6వ వేతన సంఘం ప్రకారం.. తమ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగుల డీఏ రేటును 9% పెంచి బేసిక్ పేలో 203% నుంచి 212%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
కలికాలం అంటే ఇదేనేమో భయ్యా.. నా భర్త జీతం ఎంతో చెప్పండి!
భారత సాంప్రదాయ పద్దతుల్లో భార్యాభర్తల బంధం ఎంతో విలువైంది. ఈ బంధం దృఢంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే లక్షణం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని కానీ.. బయటకు రాకుండా చూసుకోవాలంటారు. అయితే, ఇక్కడ ఓ జంట మధ్య ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ.. తన భర్త జీతం ఎంతో తెలుసుకునేందో ఓ భార్య ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జీతం వివరాల కోసం ఏకంగా ఆర్టీఐRight To Information (RTI)నే ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. సంజూ గుప్తా అనే మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్టీఐ అధికారులు ఊహించని విధంగా షాకిచ్చారు. కాగా, భర్త అంగీకారం లేకుండా ఆదాయ పన్ను శాఖలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీపీఐఓ) వివరాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తపరిచిన సంజూ గుప్తా.. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. వివరాల కోసం అక్కడ అప్పీల్ చేసుకుంది. అనూహ్యంగా అక్కడ కూడా ఆమె చేదు అనుభవమే ఎదురైంది. ఎఫ్ఏఏ కూడా సీపీఐఓ చెప్పిన సమాధానాన్నే సమర్థించింది. ఆ వివరాలు ఇచ్చేలా చూడాలంటూ ఈసారి ఆమె.. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ)కు దరఖాస్తు చేసుకుంది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆమెకు ఎట్టకేలకు సీఐసీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆమె భర్తకు సంబంధించిన జీతం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉన్నప్పటికీ.. సంజూ గుప్తా ఇలా భర్త జీతం వివరాలు ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది మాత్రం తెలియరాలేదు. బహుషా వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. Sanju Gupta filed an RTI application to acquire the details of her husband’s gross and taxable income for two financial years.https://t.co/SwwjXedxZc — News18.com (@news18dotcom) October 3, 2022 -
నకిలీ సంతకాలు పెట్టి జీతం తీసుకుంటున్న అధికారిపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఆఫీస్కు వెళ్లకుండానే ఆరు నెలలుగా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారిపై వేటు వేశారు ఉత్తర్ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్. ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల అందరిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహించే డా.ఇందు బాల శర్మ అనే అధికారిణి ఆర్నెళ్లుగా ఆఫీస్కు వెళ్లడం లేదు. కానీ రిజిస్టర్లో ఫేక్ సంతకాలు చేయించి జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయి తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం ఇప్పటికే డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించింది. జిల్లా అధికారులకు జీతాలు మంజూరు చేసే అధికారి సంతోష్ కుమార్పైనా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరు అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు -
దసరాకైనా ఉద్యోగుల జీతాలు ఇస్తారో లేదో?
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతం ఇవ్వడం లేదని, దసరాకైనా జీతాలిస్తారో.. లేదో? అని ఆందో ళన చెందుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్, నస్తిపూర్, దౌల్తాబాద్, కాసాలా దేవులపల్లి, హత్నూర, కొన్యాల వరకు నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించిన ఘనత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సుపరిపాలనను తిరిగి అందించేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. వైఎస్సార్ టీపీని ఆదరిస్తే రూ.3,000 పింఛన్, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
స్టార్బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: గ్లోబల్ కాఫీ చైన్ స్టార్బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్ లీడర్స్ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్ అతున్నారని వ్యాఖ్యానించారు. ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్బక్స్ సీఈవో ఇన్స్పైరింగ్ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే! 2023 ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్లో స్టార్బక్స్ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్తో పాటు 9.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు) విలువైన ఈక్విటీ గ్రాంట్ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు. కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్బక్స్లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్బక్స్ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్బక్స్లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు. -
మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదా? అయితే ఇలా చేయండి..
మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నా.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)అకౌంట్లోకి డబ్బులు జమ కావడం లేదా? అయితే ఇప్పుడు మీరు ఖాతాలోకి డబ్బులు డిపాజిట్ కావడం లేదని ఈపీఎఫ్ఓకు ఇలా ఫిర్యాదు చేయండి. సంస్థలు ప్రతినెల ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లోకి ప్రావిడెంట్ ఫండ్ను జమ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. గత నెల ఉద్యోగికి చెల్లించిన జీతానికి..15 రోజులలోపు యజమాని ప్రతి నెలా బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్తో కలిపి 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. దీంతో ఆ డిపాజిట్లకు సంబంధించిన సమాచారం క్రమం తప్పకుండా ఎస్ఎంఎస్ల రూపంలో చందాదారులకు అందుతుంది. లేదంటే ఉద్యోగులు సైతం ఈపీఎఫ్వో పోర్టల్లో లాగిన్ అయ్యి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలోకి జమ చేసిన డిపాజిట్లను కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సంస్థలు పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయవు. అప్పుడు ఉద్యోగులు తమకు రావాల్సిన పీఎఫ్ ఇంకా డిపాజిట్ కాలేదని ఎంప్లాయిఫీడ్బ్యాక్@ఈపీఎఫ్ఐఇండియా.జీవోవి.ఇన్కి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు తర్వాత, రిటైర్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ సదరు సంస్థ యజమానిని విచారిస్తుంది. ఈ విచారణలో డిపాజిట్ చేయలేదని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు చెల్లించిన మొత్తం కాలానికి ఈపీఎఫ్ఓ అధికారులు ఉద్యోగి అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి చెల్లించేలా ఒత్తిడి తెస్తారు. -
అధ్యక్షా.. బాస్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. జీతంతో పాటు బోలెడు బెనిఫిట్స్!
న్యూయార్క్: ఉద్యోగులకు సరిపడా జీతం ఇవ్వకుండా వారితో యంత్రాలుగా పనిచేయించుకుంటున్నారు కొందరు యజమానులు. మరొకొందరైతే ఉద్యోగులను జీతం తీసుకుని బానిసలుగా చూస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. తమకు వచ్చిన జాబ్ అని కాకుండా నచ్చిన జాబ్ చేస్తామని అంటున్నారు ఉద్యోగులు. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా ఓ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకోవాలని చెబుతున్నాడు. ఉద్యోగులు చేసే పనికి కేవలం జీతం ఇస్తే సరిపోదని వారికి తగిన గౌరవం కూడా ఇవ్వాలని ఆయన అభిప్రాయం. ఈ విషయాన్నే ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అమెరికాలోని సీటెల్కు చెందిన సీఈఓ తన ఉద్యోగులకు ఏకంగా 80,000 డాలర్లు అంటే రూ 63.7 లక్షల కనీస వేతనం చెల్లిస్తున్నామని చెప్తున్నారు. అంతేనా తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు వారికి నచ్చిన ప్రదేశం నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించామని, మంచి జీతంతోపాటు బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటూ తెలిపాడు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు సౌకర్యాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఉద్యోగుల పనికి సరైన శాలరీ మాత్రం ఇస్తే సరిపోదని, వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉండాలంటున్నాడు. తమ కంపెనీలో ఒక్కో ఉద్యోగానికి తమకు 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని తెలిపాడు. ఉద్యోగులకు సరైన వేతనం, గౌరవం దక్కని చోట పనిచేయాలని ఏ ఒక్కరూ అనుకోరని అన్నారు. ఈ ట్విట్ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లో వైరల్ కాగా నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మీ లాంటి బాస్ ఆధ్వర్యంలో పని చేయడం ఉద్యోగుల అదృషమని యూజర్లు కామెంట్ చేశారు. My company pays an $80k min wage, lets people work wherever they want, has full benefits, paid parental leave, etc. We get over 300 applicants per job. "No one wants to work" is a hell of a way of saying "companies won't pay workers a fair wage and treat them with respect." — Dan Price (@DanPriceSeattle) August 8, 2022 చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ! -
'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!'
మీకు తెలుసా? పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ శాలరీ ఎంతుంటుందో. 44 ఏళ్ల ఎంటర్ ప్రెన్యూర్ జీతం ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022లో అక్షరాల రూ.4కోట్లు. ఇందులో రూ .3.714 కోట్ల జీతం, ఇతర బెన్ఫిట్స్ రూ .28.7 లక్షలు. మొత్తం కలుపుకొని రూ .4 కోట్లని పేటీఎం వార్షిక నివేదిక తెలిపింది. 27 ఏళ్ల వయసులో నా జీతం నెలకు రూ.10వేలు ఉంది. "నేను నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నాని తెలిస్తే నాకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అప్పట్లో నాకు పదివేల జీతమని తెలిసి పిల్లని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. చాలీచాలని జీతంతో నేను నా కుటుంబానికి అనర్హుడైన బ్రహ్మచారిని అయ్యాను" అంటూ నవ్వులు పూయించారు. కానీ కొసమెరుపు ఏంటంటే 2005లో విజయ్ శేఖర్ శర్మ మిృదులను వివాహం చేసుకున్నారు. ఇక పేటీఎం వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వాటాదారులకు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షల కోట్ల నుండి 2022 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి రూ.8.5 లక్షల కోట్లతో Gross merchandise volume (జీఎంవీ)లో వృద్ధిని సాధించినట్లు తెలిపారు. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం రూ.2,396.4 కోట్ల ఏకీకృత నష్టాన్ని నివేదించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,186.8 కోట్ల నుంచి 65 శాతం పెరిగి రూ.5,264.3 కోట్లకు చేరుకుందని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 78 శాతం పెరిగి రూ.4,974.2 కోట్లకు చేరుకుందని పేటీఎం నివేదికలో పేర్కొంది. వేల కోట్లతో సరికొత్త రికార్డ్లు విజయ్ శేఖర్ శర్మ టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించేలా 2000లో వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. రానురాను వన్97.. 2010లో పేటీఎంగా మారింది.అలాంటి కుటుంబ పరిస్థితులను అధిగమించి ఇప్పుడు రూ.18వేల కోట్ల ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే పని చేసినా చేయకపోయినా సమయానికి జీతం తీసుకున్నామా, అందినంత వరకు సంపాదించుకున్నామా అన్నట్లు కొందరు ఉద్యోగులు ప్రవర్తిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఓ యూనివర్శిటీ మాష్టారు తన జీతం ఏకంగా రూ.23 లక్షలను తిరిగి తన పని చేసే కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ నిర్ణయంతో బీహార్లోని ముజఫర్పూర్ ప్రాంతంలోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్తల్లో నిలవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయంపై లాలన్ ఏమంటున్నారంటే.. నితీశ్వర్ కళాశాలలో అతను చేస్తున్న టీచింగ్తో సంతృప్తిగా లేనని తెలిపారు. ఏ మాత్రం తీసుకుంటున్న చేస్తున్న పనికి సమతూకంగా లేదని తన మనస్సాక్షి చెప్పినట్టుగానే తనకు వచ్చిన 33 నెలల జీతాన్ని మొత్తం( రూ. 23 లక్షలు) పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్నాను అని అన్నారు. లాలన్ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే తానేందుకు జీతం తీసుకోవాలి. ఇక 25 సెప్టెంబర్ 2019 నుంచి కళాశాలలో పని చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు. తాను రిజిస్ట్రార్కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు. -
జీతం రూ.50 వేలు.. అకౌంట్లో పడింది రూ.1.42 కోట్లు !
జీతాలు చెల్లించే విషయంలో కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించకుంటే ఇక్కట్లు తప్పవు అనేందుకు తాజాగా ఉదాహారణ మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రమ దోపిడి లేకుండా పనికి తగ్గ జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో చెల్లించడమూ కంపెనీలకు ప్రమాదమే. కావాలంటే చిలీ ఏం జరిగిందో మీరే ఓసారి చూడండి. దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశం ఖనిజ సంపదకు ప్రసిద్ధి. అక్కడ కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే ప్రముఖ మైనింగ్ సంస్థ ఉంది. ఈ కంపెనీలో వేలాది మంది కార్మికులు వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల వేతనాల చెల్లింపు సందర్భంగా ఓ ఉద్యోగికి 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి. తప్పు చేశారు ప్రతీ నెల తనకు వచ్చే జీతం కంటే అనేక రెట్లు ఎక్కువగా వేతనం జమ కావడంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగి పరేషాన్ అయ్యాడు. వెంటనే అకౌంట్స్ విభాగాన్ని సంప్రదించి తనకు 286 రెట్లు అధికంగా జీత పడిందంటూ తెలిపాడు. వెంటనే రికార్డులు పరిశీలించిన అకౌంట్స్ విభాగం తప్పును గుర్తించింది. అధికంగా జమ అయిన సొమ్మును వెంటనే కంపెనీ ఖాతాకు పంపాలంటూ కోరింది. రాజీనామా మరుసటి రోజు మైనింగ్ కంపెనీ అధికారులు ఉద్యోగికి ఫోన్ చేసి అధికంగా పడిన సొమ్ము గురించి వాకాబు చేశారు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల బ్యాంకుకి వెళ్లడం వీలు పడలేదని. కాసేపట్లో బ్యాంకుకు వెళ్తానంటూ వారికి సమాధానం ఇచ్చాడు. కానీ అదే రోజు అతను బ్యాంకుకు వెళ్లకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గాయబ్ రెండు రోజులైన ఉద్యోగికి చెల్లించిన అధిక మొత్తం డబ్బులు తిరిగి కంపెనీ ఖాతాలో జమ కాకపోవడంతో మరోసారి సదరు ఉద్యోగితో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అకౌంట్స్ సిబ్బంది. కానీ ఫోన్, మెసేజ్లకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడు. మరోవైపు ఆఫీసులు రిజైన్ లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. నిర్లక్ష్యానికి మూల్యం యాభై వేల రూపాయల బదులు ఒక కోటి నలభైమూడు లక్షల రూపాయల సొమ్మును అందుకున్న సదరు వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనాయాసంగా తనకు దక్కిన సొమ్ముతో ఊరొదిలి రహస్య ప్రాంతాలకు చేరుకున్నాడు. మరోవైపు అధికంగా సొమ్ము చెల్లించడమే కాకుండా రికవరీలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్ కంపెనీ ఖజానాకు సుమారు ఒక కోటి నలభై ఒక్క లక్ష రూపాయల మేర చిల్లు పడింది. చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్ బోరుకొడుతోంది! -
38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్, ఈఎన్సీల వరకు కొంతకాలంగా హెచ్చరించినా విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన 38 మంది ఇంజినీర్లపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారికి ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ లోకేశ్కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 13 సర్కిళ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు(ఏఈ) వీరిలో ఉన్నారు. డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు ఉన్నారు. గత సంవత్సరం అక్టోబర్లో నాలాల సమస్యలు వర్షాకాల విపత్తులపై అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్, భవిష్యత్లో ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పలు పర్యాయాలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీరియస్గా హెచ్చరించారు. స్పెషల్ సీఎస్ అర్వింద్కుమార్ పూర్తి కావాల్సిన పనులు కాలేదని గత నెలాఖరులో తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తూ జూన్ 5లోగా పనులు పూర్తిచేయాలని మెమో జారీచేశారు. కమిషనర్ లోకేశ్కుమార్, ఈఎన్సీ జియావుద్దీన్లు సైతం పలు సందర్భాల్లో అలర్ట్ చేస్తూ, సీరియస్గా చెప్పినా పనులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో స్వయానా ఈఎన్సీ తోపాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తికాని పనుల ఫొటోలతో సహా పంపిస్తూ కొన్నిరోజులుగా దాదాపు 50 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. పనులు పూర్తిచేసి.. ఫొటోలు జోడించి, తగిన వివరణ ఇచ్చిన వారికి తదుపరి కఠినచర్యలు తీసుకోకుండా జీతంలో కోత విధించారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావతమైతే ఎలాంటి నోటీసు లేకుండానే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. క్రిమినల్ కేసు నమోదుతోపాటు నోటీసుల్లేకుండానే ఉద్యోగం కూడా ఊస్ట్ అవుతుందనే హెచ్చరికలు ఇదివరకే జారీ చేసినా నిర్లక్ష్యం కనబరుస్తున్నవారిపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నందున, ప్రజలకు ప్రాణాంతకంగా ఉన్న ప్రాంతాల్లో నూరుశాతం సేఫ్టీ ఏర్పాట్లు చేయాలన్నా చేయకపోవడంతో తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ ప్రస్తుతానికి ఈ చర్య తీసుకున్నారు. బల్దియా చరిత్రలోనే ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమమని జీహెచ్ఎంసీ వర్గాలంటున్నాయి. ఈ సర్కిళ్లలోని వారికి.. జీతాల కోత పడిన వారిలో అల్వాల్, చందానగర్, శేరిలింగంపల్లి, కాప్రా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, యూసుఫ్గూడ, సంతోష్నగర్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లకు చెందిన ఇంజినీర్లున్నారు. వారిలో.. ఈఈలు.. కేవీఎస్ఎన్టీ రాజు, సి.శ్రీకాంత్, డి.ఆశాలత, ఆర్.ఇందిరాబాయి, ఆర్. లక్ష్మణ్, యు, రాజ్కుమార్, బి.రాములు, టి.లక్ష్మా, బి.నరేందర్గౌడ్, వి.శ్రీనివాస్ (ఎఫ్ఏసీ), డి.గోవర్ధన్గౌడ్ (ఎఫ్ఏసీ), పి. కష్ణచైతన్య, వి.హరిలాల్(ఎఫ్ఏసీ). డిప్యూటీ ఈఈలు.. ఎం.కార్తీక్, ఎస్. స్రవంతి, ఎస్.రఘు, పీసీవీ కష్ణకుమార్, ఈ.లౌక్య, ఎస్. శ్రీరాములు, డి.దేవేందర్, ఎం. వెంకటేశ్వర్లు, బి.శంకర్, ఎస్.శిరీష, బి.భానుచందర్. కె.అరుణ్కుమార్, ఎంవీ శివరామ్ప్రసాద్, సీహెచ్.సునీల్కుమార్, జి.సంతోష్కుమార్రెడ్డి, ఎన్.కౌశిక్, వి.శ్రీనివాసరావు, జి.చరణ్, కె.దివ్యజ్యోతి,ఎండి జమీల్పాషా, ఎస్ఎంఆర్ అన్సారీ, ఎంఏ రహీమ్, ఎల్.బల్వంత్రెడ్డి, టి.సంపత్కుమార్, ఆర్.మల్లారెడ్డి. (చదవండి: సీఐకి రివర్స్ పంచ్) -
టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్, మార్పులు జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్ను రూపొందించింది. -
బోర్ కొడుతుందని రూ.3.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా!
ఏడాదికి రూ.3.5 కోట్ల వార్షిక వేతనం వచ్చే ఉద్యోగం వద్దనుకున్నాడో యువ ఇంజనీర్. కారణం ఏంటంటే ఆ జాబ్ అతనికి బోర్ కొట్టింది. అక్కడ పెద్దగా చేయడానికి ఏమీ లేదట. అందుకే కిక్కు కరువైన చోట ఉండలేనంటూ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. పోనీ వేరే ఎక్కడైనా జాబ్ వెతుకున్నాడా అంటే అదీ లేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. క్రియేటివ్ పీపుల్కి సాహాసవంతులకు ఛాలెంజింగ్ లైఫ్ అంటేనే ఇష్టం. మూస పద్దతిలో పని చేసుకుపోవడానికి ఇష్టపడరు. కాసుల కంటే కిక్కుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఆ కోవలోకే వస్తాడు మైఖైల్ లిన్ అనే యువ ఇంజనీరు. అతని తల్లిదండ్రులు బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ అమెరికాకు వలస వచ్చారు. లిన్ సైతం వారి కలలకు తగ్గట్టే ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. కానీ అక్కడ జాబ్ శాటిస్ఫ్యాక్షన్ లేదంటూ జేబులు నింపే ఉద్యోగానికి జెల్ల కొట్టాడు. తాను ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశాడో చెబుతూ లింకెడ్ఇన్లో సవివరంగా తెలిపారు. ఇప్పుడది నెట్టింట వైరల్గా మారింది. ఎంజాయ్ చేశా మైఖేల్ లిన్ 2017లో నెట్ఫ్లిక్స్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరాడు. అంతుకు ముందు అతడు అమెజాన్లో పెద్ద స్థాయిలో పని చేశాడు. నెట్ఫ్లిక్స్లో చేరిన తర్వాత అక్కడ పని విధానం అర్థం చేసుకోవడం సంస్థ ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడంలో లిన్కో మజా దొరికేది. ఎంబీఏలో ఉన్నప్పుడు చేసే ప్రాజెక్టు వర్కుల తరహాలో ఎంతో ఉత్సాహాంగా నెట్ఫ్లిక్స్లో చేరిన కొత్తలో పని చేసినట్టు లిన్ తెలిపాడు. రూ.3.5 కోట్ల జీతం నెట్ఫ్లిక్స్లో పని చేసే క్రమంలో తనకంటూ ఓ టీమ్, వాళ్లకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పడ్డాయి. అన్నింటా సక్సెస్ అయ్యారు. దీంతో లిన్ వార్షిక వేతనం ఏకంగా 4,50,000 డాలర్లకు (రూ. 3.5 కోట్లు) చేరుకుంది. కరోనా సమయంలో ప్రపంచమంతటా లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో మరింత మందికి నెట్ఫ్లిక్స్ దగ్గరయ్యేలా శ్రమించారు లిన్ అతని బృందం. అలా నెట్ఫ్లిక్స్లో ఓ ఇంజనీరుగా చేయాల్సిందతా చేశానంటున్నాడు లిన్. కిక్కు పోయింది కరోనా ముగిసిన తర్వాత నెట్ఫ్లిక్స్లో జాబ్, లైఫ్ రెండు రోటీన్గా మారాయి అంటున్నాడు లిన్. రోజువారి కార్యక్రమాలతో ఉత్సహాం చచ్చిపోయింది అంటున్నాడు. అది తన పనితీరు మీద కూడా ప్రభావం చూపిందటున్నాడు. 2021 ఏప్రిల్లో తన పనితీరును మదింపు చేసుకున్న తర్వాత.. తాను మారాల్సి చాలా ఉందనే నిర్ణయానికి వచ్చాడు. కానీ పెద్ద జీతం కోసం కిక్కు కరువైన చోట పని చేయడం వేస్టని చివరకు డిసైడ్ అయ్యడు. తలతిక్కనా? జాబ్ బోరుకొడుతోందంటూ నెట్ఫ్లిక్స్లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు మైఖేల్ లిన్. ఏడాదికి రూ. 3.5 కోట్ల జీతం ఉద్యోగం వదులుకుంటే ఎంత కష్టమో తెలిసినా తన నిర్ణయం మార్చుకోలేదు. కనీసం సేఫ్సైడ్గా వేరే చోటుకి రెజ్యూమ్ ఫార్వార్డ్ చేయడమో, ఇంటర్వ్యూలు ఇవ్వడమో చేయలేదు. 2021 మేలో రిజైన్ చేశాడు. అయితే అతను ఎందుకు రిజైన్ చేశాడో.. తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలియక అప్పట్లో నెట్ఫ్లిక్స్ పెద్దలు, అతని కొలీగ్స్ తలలు పట్టుకున్నారు. సరికొత్త ఛాలెంజ్ నెట్ఫ్లిక్స్ను తాను విడిచి పెట్టేందుకు సంస్థ పరమైన కారణాలు ఏమీ లేవని. తనకు అక్కడ బోర్ కొట్టడం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తాజాగా లింక్డ్ఇన్ పోస్టులో లిన్ వెల్లడించాడు. ఇప్పుడు తనకంటూ కొత్తగా ఓ టీమ్ను రెడీ చేసుకున్నానని చెబుతున్నాడు. అతి త్వరలోనే ఉద్యోగిగా కాకుండా యజమానిగా కొత్త పాత్రలో సరికొత్త కిక్కును వెతుకుంటాను అని చెబుతున్నాడు లిన్. చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం -
ఆదాయపు పన్నును ఎలా లెక్కించాలో తెలుసా!
అవును, ప్రస్తుతం ఆదాయపు పన్ను లెక్కించే సాధనం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష ఆదాయపు పన్ను బోర్డ్ పోర్టల్లో ఇది ఉంటుంది. బోర్డు వారే దీన్ని తయారుచేసి, అమల్లోకి తెచ్చారు. నిజానికి బోర్డు వారు ఆదాయపు పన్ను అసెసీలకు సులువుగా, త్వరగా, స్వంతంగా లెక్కించుకునే ఎన్నో సాధనాలు తెచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. ఇది రెండు సంవత్సరాలకు వర్తిస్తుంది. మొదటిది. 01–04–2021 నుండి 31–3–2022తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి..అంటే 2021–22..ఇన్కం ట్యాక్స్ పరిభాషలో చెప్పాలంటే అసెస్మెంట్ 2022–23 సంవత్సరం. దీనికి గాను మీరు రిటర్నులు 31–07–2022 లోపల వేయాలి. ఎవరు వేయాలి? ఏ పరిస్థితుల్లో రిటర్న్ వేయాలి? ఏం ఫారం ఐటీఆర్ దాఖలు చేయాలి .. ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు జవాబులు గతంలో ఎన్నో సార్లు ఇచ్చాం. చదవండి: కొత్త రూల్స్, వీళ్లు తప్పని సరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సిందే! ఇదొక ఆన్లైన్ సాధనం. రెడీమేడ్ కాల్క్యులేటర్. ఇది ఉచితం. సులభమైన సాధనం. తప్పులుండే అవకాశమే లేదు. చాలా త్వరగా అవుతుంది. మీరు మీ వివరాలతో లాగిన్ అయితే.. ఈ సాధనం ఒక మార్గదర్శినిలాగా పని పూర్తి చేస్తుంది. అయితే, ఒక పని చేయాలి. సంబంధిత కాగితాలను మీ ఎదురుగా పెట్టుకుని సంబంధిత సమాచారాన్ని సరైన ఫీల్డులో నింపుతూ ముందుకెళ్లండి. అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వండి. కొన్ని అంశాలు మీకు వర్తించకపోతే ‘‘0’’ అని రాయండి. మీకున్న రెండు ఆప్షన్ల ప్రకారం స్టేట్మెంట్ రెడీ, ట్యాక్స్ లయబిలిటీ రెడీ. ఇన్స్టంట్ ఫుడ్ లాగా అంతా సిద్ధం. మరొక సారి చెక్ చేసుకుని మీరు మీ రిటర్న్ని ఫైల్ చేసుకోవచ్చు. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. సరైన సమాచారం సరిగ్గా నింపి, మీరు సరైన ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక రెండోది. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 01–04–22 నుండి 31–03–23 అంటే 2022–23.. ఇన్కం ట్యాక్స్ వారి పరిభాషలో 2023–24 అసెస్మెంట్ సంవత్సరం విషయం తీసుకుంటే.. ఇది కూడా ఇంచు మించు పైన చెప్పిన విధంగానే ఉంటుంది. మీకెంత ఆదాయం ఉంటుందో, ఎంత వస్తుందో ఊహించి, అంచనా వేసుకుని అంశాలవారీగా సరైన ఫీల్డ్లో నింపాలి. గడిచిన సంవత్సరానికి సంపాదించినది.. నడుస్తున్న సంవత్సరానికి సంపాదించబోయేది.. అంటే వ్యత్యాసం .. గతం .. వర్తమానం .. ఇలా అన్ని విషయాలు సమగ్రంగా పొందుపర్చాకా స్టేట్మెంట్ ‘‘రెడీ’’గా కనిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన వారు ట్యాక్స్ లయబిలిటీ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. మొదటి విడత జూన్ 15. రెండోది సెప్టెంబర్ 15. మూడోది డిసెంబర్ 15. నాలుగోది..ఆఖరుది మార్చి 15. ఇలా నాలుగు విడతల్లో మొత్తం లయబిలిటీని లెక్కిస్తుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఆర్థికంగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు మొదలైనవి ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో మార్పులు వస్తే, ఆ మార్పులతో మళ్లీ లెక్కించుకోవచ్చు. ఏ మార్పుకైనా ఇది అనువుగా ఉంటుంది. చాలా మంచి ఎస్టిమేటర్. చివరగా చెప్పాలంటే ఈ సాధనం ఒకటే .. ఆర్థిక సంవత్సరం మారితే లయబిలిటీని తెలియజేస్తుంది. గడిచిన సంవత్సరం రిటర్న్ వేయటానికి పనికివస్తుంది. నడుస్తున్న సంవత్సరం ప్లానింగ్కి కూడా పనికొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రంగంలోకి దూకండి. -
అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం 88 శాతం పెరిగిందట. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదిలో పరేఖ్ వార్షిక వేతనం రూ. 79.75 కోట్లకు చేరింది. 2020-21లో రూ. 49.68 కోట్ల నుంచి వేతనం 88 శాతం పెరిగిందని ఎక్స్ఛేంజ్ఫైలింగ్లో కంపెనీ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, వాటాదారుల ఆమోదానికి లోబడి కొత్త ఉపాధి ఒప్పందం జూలై 2 నుండి అమలులోకి వస్తుంది. దీంతో భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచారు సలీల్ పరేఖ్. మరో దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. అలాగే కంపెనీ సీఎండీగా సలీల్ పరేఖ్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు (మార్చి 2027 వరకు) పొడిగింపునకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. 2018 జనవరి నుంచి పరేఖ్ ఇన్ఫోసిస్ సీఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్కు ముందు క్యాప్జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో సభ్యుడిగా ఉన్న పరేఖ్ 25 సంవత్సరాల పాటు అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్ 183శాతం పెరిగింది. నీలేకని-పరేఖ్ కాంబోలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 19.7శాతం వృద్ధి రేటును సాధించింది. అలాగే ఆరుగురు కీలకమైన మేనేజ్మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు,88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్లో అత్యధిక వేతనం పొందిన సీనియర్లుగా 37.25 కోట్లతో సీఓఓ యూబీ ప్రవీణ్ రావు, తరువాత 35.82 కోట్లతో ప్రెసిడెంట్ రవి కుమార్ ఉన్నారు. -
ఈ కంపెనీలో జీతంగా బంగారం! ఎందుకంటే?
అతడికేంటీ మంచి కంపెనీలో ఉద్యోగం! బంగారం లాంటి జీతం అంటుంటారు మాటవరసకి. కానీ లండన్లో ఓ కంపెనీ మాటవరుసకే కాదు నిజంగానే బంగారాన్నే జీతంగా చెల్లిస్తోంది. నగదు చెల్లింపులు మంచిది కాదంటోంది. ఇందుకు గల కారణాలను సహేతుంగా వివరిస్తోంది.. ఉద్యోగుల సంక్షేమానికి చాలా కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి. పని చేయించుకున్నాం దానికి తగ్గ వేతనం ఇచ్చేశాం అని ఊరుకోకుండా ఆ డబ్బుకు విలువ ఎలా ఉంటుందో కూడా లెక్కకడుతున్నాయి కొన్ని కంపెనీలు. సోసైటీలో నగదు విలువ తగ్గిపోతుందని భావిస్తే ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఆర్థిక పాఠాలు ఇంగ్లండ్కి చెందిన టాలీమనీ అనే సంస్థ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ ఎంతో మందికి ఆర్థిక సూచనలు అందిస్తూ ఉంటుంది. ఇలా సలహాలు ఇవ్వడమే కాదు మేము కూడా స్వయంగా పాటిస్తామంటున్నాడు ఆ కంపెనీ సీఈవో కెమెరాన్ పెర్రీ. ఇందుకు సంబంధించిన వివరాలను లండన్ కేంద్రంగా వెలువడే సిటీ ఏఎం పత్రిక ప్రచురించింది. పౌండ్ల కంటే బెటర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకి పౌండ్ల విలువ పడిపోతుంది. జీతం తీసుకున్న రోజు నుంచి అది ఖర్చు చేసే రోజుకే పౌండ్ల విలువలో క్షీణత నమోదు అవుతోంది. ఇలా ద్రవ్యోల్బణం కారణంగా తమ కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో సరికొత్త జీతం చెల్లింపులకు శ్రీకారం చుట్టారు మనీలాటీ సీఈవో కెమరాన్ పెర్రీ. విలువ పడిపోదు మనీటాలీలో ఉద్యోగులకు నెలవారీ జీతాన్ని నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. నగదు విలువ రోజురోజుకి పడిపోతుంది. కానీ బంగారం విలువ పడిపోవడం లేదు. పైగా విలువ పెరగడంలో బంగారానికి సాటి రాగలవి లేవు. అందుకే జీతంగా విలువ కోల్పోతున్న నగదు పౌండ్లకు బదులు బంగారాన్ని ఇస్తున్నారు. ముందుగా టాప్ మేనేజ్మెంట్లో ఈ నిర్ణయం అమలు జరిపి సానుకూల ఫలితాలు వచ్చాక ఇప్పుడు కింది స్థాయి సిబ్బందికి కూడా వర్తింప చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఇరవై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. చదవండి: పసిడి డిమాండ్కు ధర దడ -
ఇస్తినమ్మా వేతనం.. పుచ్చుకుంటినమ్మా జీతం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత కొంతకాలంగా సదరం సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర విమర్శల పాలైన వైద్యారోగ్యశాఖ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తోన్న ఓ డాక్టర్ కొంతకాలం క్రితం జిల్లాలోని మరో సివిల్ ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. ఇందుకోసం వైద్యవిధానపరిషత్ నుంచి ప్రత్యేకంగా గతేడాది సెప్టెంబరులో జీవో కూడా తెచ్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడ సదరు డాక్టర్ చేరినట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆసుపత్రికి హాజరవడం, పేషెంట్లకు వైద్యం చేయడం తదితర విధులు నిర్వహించడం లాంటివి చేసిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈమేరకు సదరు బదిలీ జీవో కాపీ సంపాదించిన ‘సాక్షి’ సదరు సివిల్ ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేసింది. అసలు ఆ డాక్టర్ పేరు తాము విననే లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. కానీ, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సదరు డాక్టర్ జీతం తీసుకుంటుండటం విచిత్రం. అసలు ఆసుపత్రికి రాకుండా జీతం ఎలా డ్రా చేస్తున్నారో? ఆ డాక్టర్కే తెలియాలి. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి నేరుగా ఆసుపత్రికి వెళ్లి రిజిష్టర్లో అన్ని రోజులు హాజరైనట్లు సంతకాలు చేసి వెళ్లిపోతుండటం విశేషం. ఈ విషయమై ‘సాక్షి’ సంబంధిత సివిల్ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఇది పెద్దల వ్యవహారమంటూ సమాధానం ఇవ్వకుండా వెనకడుగు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు వేళకు రాకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణించే ఉన్నతాధికారులు కాంట్రాక్టు డాక్టర్ విధులకు రాకున్నా.. వేతనం ఎందుకు ఇస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. -
జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్ నిర్ణయం
సాక్షి, అనంతపురం: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. చదవండి: (ఎప్పటికీ వైఎస్ జగన్కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి)