soldiers
-
జమ్ములో పేలుడు..ఇద్దరు జవాన్ల దుర్మరణం
జమ్ము:జమ్ముకశ్మీర్లో మంగళవారం(ఫిబ్రవరి11) ఐఈడీ(మందుపాతర) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తొలుత తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతాదళాల కూంబింగ్ జరుగుతోంది. -
భారత జాలర్లపై శ్రీలంక జవాన్ల కాల్పులు
న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.అసలేం జరిగింది?మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. -
అటు నలుగురు.. ఇటు 200
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ రెండోదఫా సజావుగా సాగింది. పెద్ద సంఖ్యలో తమ వాళ్లు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలకావడంతో వెస్ట్బ్యాంక్లోని రమల్లా నగరంలో పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులు కరీనా అరీవ్(20), డేనియెలా గిల్బోవా(20), నామా లెవీ(20), లిరి అల్బాగ్(19)లను హమాస్ సాయుధులు విడిచిపెట్టారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ సైతం తమ కారాగారాల్లోని 200 మంది పాలస్తీనియన్లను వదలిపెట్టింది. వెస్ట్బ్యాంక్లోని ఒఫెర్ జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీలను జెరూసలేం, రమల్లా సిటీలకు తరలించారు. విడుదలైన 200 మంది బస్సుల్లో బయల్దేరారు. ఈ 200 మందిలో 121 మంది జీవితఖైదు పడిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా గతంలో ఇజ్రాయెలీలపై దాడులకు పాల్పడ్డ నేరాలకు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. విడుదలైన వారిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు మొహమ్మద్ ఓదేహ్(52), వేయిల్ ఖాసిమ(54) సైతం ఉన్నారు. విడుదలైన 200 మందిలో 70 మందిని బహిష్కరించి ఈజిప్ట్ కు పంపేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంలో ఈజిప్ట్ కీలక మధ్యవర్తిగా ఉన్న నేపథ్యంలో కొందరు ఖైదీలను ఈజిప్ట్ కు తరలించినట్లు అక్కడి ఖహేరీ టీవీ పేర్కొంది. అంతకుముందు ఈ నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులను గాజా సిటీలోని పాలస్తీన్ స్క్వేర్ వద్ద రెడ్క్రాస్ బృందానికి హమాస్ సాయుధులు అప్పగించారు. ఈ మహిళలు పూర్తి ఆరోగ్యంతో, నవ్వుతూ అక్కడి వేలాది మంది స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వీళ్ల రాకను ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగర వీధుల్లో ఎల్ఈడీ స్క్రీన్లపై చూసిన వందలాది మంది స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ‘‘నమ్మలేకపోతున్నా. వాళ్లు అలా విడుదలకావడం చూసి మనసు ఉప్పొంగింది. యుద్ధం శాశ్వతంగా ఆగిపోతే ఎంత బాగుంటుందో’’అని సంబరాలు చేసుకున్న అవీవ్ బెర్కోవిచ్ అనే స్థానికుడు ఆనందం వ్యక్తంచేశారు. ఈ మహిళా సైనికులు సురక్షితంగా తమ ఆర్మీ స్థావరానికి చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ధృవీకరించింది. -
కశ్మీర్లో పేలిన మందుపాతర..ఆరుగురు జవాన్లకు గాయాలు
జమ్ము:జమ్ముకశ్మీర్లోని సరిహద్దు(ఎల్ఓసీ) వద్ద మంగళవారం(జనవరి14) ఉదయం భారీ పేలుడు సంభవించింది. మందుపాతర పేలిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. రాజౌరిలోని ఖంబా ఫోర్టు ప్రాంతంలో గోర్ఖా రైఫిల్స్కు చెందిన జవాన్లు రోజువారి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారి వాహనం వద్ద మందుపాతర పేలింది.పేలుడులో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. జవాన్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు. -
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్తోపాటు అవ్దీవ్కా, సెలిడోవ్, వులేదార్లు రష్యా వశమయ్యాయి. అవ్దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉ.కొరియా సైనికుల మృతి..జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్:రష్యా తరపున యుద్ధం చేసేందుకు వచ్చిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికులపై ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా వారిని యుద్ధరంగంలోకి దించిందని జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతూ గాయపడిన కొందరు ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,అయితే ఆ తర్వాత వారు చనిపోయారని తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఉత్తరకొరియా సైనికులను తాము కాపాడలేకపోయామని జెలెన్స్కీ చెప్పారు. ఉత్తర కొరియా సైనికుడొకరు ఉకక్రెయిన్కు బందీగా చిక్కారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన కొద్ది సేపటికే జెలెన్స్కీ స్పందించడం గమనార్హం.ఎంత మంది ఉత్తరకొరియా సైనికులు తమకు చిక్కి చనిపోయారన్నది మాత్రం జెలెన్ స్కీ వెల్లడించలేదు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపిన దాని ప్రకారం దాదాపు వెయయ్యి మంది దాకా ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ చేతిలో చనిపోయారని తెలుస్తోంది. మొత్తం 3వేల మంది దాకా ఉత్తరకొరియా సైనికులు తమతో యుద్ధంలో పాల్గొని మరణించారని జెలెన్స్కీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. -
Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది.నాటి యుద్ధంలో బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్లెస్ ఆపరేటర్గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్రాజ్కు.. -
ఉ.కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
సియోల్: ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్లో రష్యాకు తరలివెళ్లిన విషయం తెల్సిందే. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా శుక్రవారం ప్రకటించింది. గగనతల రక్షణ క్షిపణులను ఉ.కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్సుక్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్సిక్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీసీ టీవీ కార్యక్రమంలో షిన్ మాట్లాడారు. ‘‘ ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టంచేసింది. -
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం(అక్టోబర్ 26) దాడులు జరిపింది.కొన్ని నెలలుగా తమ దేశంపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు సమాధానంగానే తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ధీటుగా స్పందిస్తామని ఇరాన్ తెలిపింది.ఇదీ చదవండి: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్లోని ఆర్మీ బేస్పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్లో 21 మంది మృత్యువాత లెబనాన్లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
పట్టాలపై లైఫ్లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్ఫామ్పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్లైన్కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్డివిజన్లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
జమ్ముకశ్మీర్లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్కు డిప్యూటేషన్పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
కొరత సృష్టించిన అగ్నిపథ్!
అయిదేళ్ల కాల పరిమితి తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, వారిపై స్పష్టమైన ఒత్తిడి ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు, అగ్నిపథ్ పథకం... సైన్యంలో తీవ్రమైన కొరతకు కూడా దారి తీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్యలో సగాని కంటే కాస్త మాత్రమే ఎక్కువగా అగ్నివీర్లను తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకొంటారు కనుక ఈ లోటు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించలేవనే భావన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.లోపాలను సరిదిద్దడానికి ‘ఫలితానంతర’ చర్యలపై ఆధారపడే వ్యవస్థీకృత మార్పు ఏదైనా సరే అంతర్గతంగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం అలాంటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫీసర్ ర్యాంకుకు కిందిస్థాయిలో ఉన్న సైనికుల నియామక ప్రక్రియను మార్చడానికి అంటూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిపోతున్న రిటైర్డ్ సైనికుల పెన్షన్ బిల్లును తగ్గించడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. సాయుధ దళాలలోని ఇతర ర్యాంకులు యువతతో నిండి వుండేలా ఇది దోహదపడుతుంది. అయితే ఈ పథకం సాయుధ దళాలలో చేరడానికి ఆసక్తి ఉన్న యువత నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష చేయాలంటూ రాజకీయవర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అగ్నిపథ్ ఆలోచన ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే భావన నుండి తీసుకోవటం జరిగింది. ఇది సైనిక సేవ కోసం ఎంపిక చేసేవారి కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశ సైన్యాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. అప్పటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మన సాయుధ దళాలలో ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సైనికులను చిన్న సంఖ్యలలో రిక్రూట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదనను పరీక్షించడం అసలు ఉద్దేశం. అయితే, ఈ పథకం ఏకపక్షంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో నివేదించిన అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకాన్ని సైనిక విభాగాలకు ‘పిడుగుపాటు’గా ఆయన ఈ పుస్తకంలో అభివర్ణించారు.ప్రస్తుతం ఈ పథకం కింద 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉండి 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ‘అగ్నివీర్’లుగా ఆరు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలానికి నియమించారు. వారిలో 25 శాతం మంది మాత్రమే పింఛను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో మరో 15 సంవత్సరాల కాలం కొనసాగేందుకు అర్హులు అవుతారు. దీనికోసం వారిని తిరిగి నమోదు చేసుకుంటారు. ఇక సైన్యం నుంచి విడుదలైన మిగతా 75 శాతం మందికి పరిహారంగా ‘సేవా నిధి’ కింద రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ప్రస్తుతం మొత్తం రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య దాదాపు 24.62 లక్షలు. వీరిలో సాయుధ దళాల సీనియర్లు దాదాపు 19 లక్షలు కాగా, పౌర విభాగ సిబ్బంది 5.62 లక్షల మంది ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లు. ఇందులో పింఛను ఖర్చు రూ.2,07,132 కోట్లు. రక్షణ సిబ్బంది వాటా రూ. 1,19,696 కోట్లు కాగా, పౌర విభాగం వాటా రూ. 87,436 కోట్లు. ఈ రెండో మొత్తం పెన్షనరీ బడ్జెట్లో 40 శాతం వాటాను కలిగి ఉంది.కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా సాయుధ దళాలలో గౌరవప్రదమైన వృత్తిని కోరుకునే వ్యక్తులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) అగ్ర ఎంపికగా ఉండటం వలన ఈ పథకంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఈ ధోరణిని నా సొంత రాష్ట్రమైన పంజాబ్లో చూశాను. సైన్యం నుంచి విడుదలైన అగ్నివీరులలో తాము విస్మరించబడ్డామనే అపకీర్తిని మోస్తున్నట్లు, గర్వించ దగిన అనుభవజ్ఞులుగా తమను చూడరనే సాధారణ భావన కూడా వారిలో ఉన్నట్లు నేను గ్రహించాను. ఇటీవల, అగ్నివీరులు కార్యాచరణ ప్రాంతాల్లో మోహరించినప్పుడు వారు అత్యున్నత త్యాగం చేసిన రెండు సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తి పెన్షన్ కు అర్హులైన సాధారణ సైనికులకు భిన్నంగా వారి బంధువులు ఏకమొత్తంలో మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. ఈ వివక్ష తీవ్రమైన క్రమరాహిత్యంగా నిలుస్తోంది. ఈ రోజు సైనిక విభాగాల్లో రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు అనే రెండు వర్గాలు ఉన్నాయి. అయిదేళ్ల తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే వారి ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పష్టమైన ఒత్తిడి కనిపిస్తోంది. నిజానికి ఇది స్నేహబంధం, సైనికుల మధ్య పరస్పర సహకారం, యూనిట్ కల్చర్, రెజిమెంట్ పునాది వంటివాటికి హానికరమైనది. మెరుగైన ఆయుధాలతో సన్నద్ధమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మన సాయుధ దళాల అత్యాధునిక సామర్థ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికన్లు; గాజాలో ఇజ్రాయెలీలు; రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వైపుల సైనికులు – ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని నిష్ప్రయోజనమైనదిగా గుర్తించారు. మన విషయానికి వస్తే, నేటికీ కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రతిష్టంభన సమయంలో లద్దాఖ్లో చైనా సైన్యం కూడా పేలవంగా పని చేసింది.అగ్నిపథ్ పథకం సైనిక బలగంలో తీవ్రమైన కొరతకు కూడా దారితీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్య 70,000 అయితే, కేవలం 42,000 మంది అగ్నివీర్లను మాత్రమే తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకోవడంతో ఈ లోటు మరింత పెరగనుంది. 39 గూర్ఖా బెటాలియన్ లలోని 60 శాతం సైనికులు ‘నేపాల్ స్థానిక గూర్ఖా’ల నుండి వచ్చినందున గూర్ఖాల నియామకం గరిష్ఠంగా దెబ్బతింది. నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్ను తిరస్కరించడం వల్ల తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గూర్ఖాలను రిక్రూట్ చేయడానికి చైనీస్ సైన్యం చేసిన ప్రకటనలను తోసిపుచ్చలేము. భారతీయ యువత విదేశీ సైన్యంలో చేరడం ఆందోళన కలిగించే ధోరణి. రష్యా సైన్యంలో చేరేందుకు ఆకర్షితులవుతున్న కొంతమంది వ్యక్తుల గురించి వెలువడిన ఇటీవలి నివేదికలు దీనికి ఉదాహరణ.అగ్నిపథ్ పథకాన్ని పునస్సమీక్షిస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. వాటిని బట్టి అగ్నివీరులను నిలబెట్టుకోవడంతో పాటుగా, సేవా సంవత్సరాల పొడిగింపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించవు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, కఠినంగా ఉండేలా మునుపటి వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యం. ఫిట్నెస్ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి వయఃపరిమితిని 32 నుండి 26కి తగ్గించడంతో ఫలితం ఉండదు. సైనికుడిని సర్వతోముఖంగా తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది; వ్యక్తిగత దారుఢ్యం 20ల చివరలో, 30ల ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే వివాదాస్పద సరిహద్దులను 42 ఏళ్లు పైబడిన మధ్యస్థ వయస్సుతో కాపు కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఫిట్నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకపోవడం గమనార్హం. సాయుధ దళాలు, రక్షణ విభాగంలోని పౌర సంస్థల సంఖ్యను సరైన పరిమాణంలోకి తీసుకురావడం ద్వారా పెన్షన్ బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 10,000 మంది కాంట్రాక్టు కార్మికులను, సుమారు 50 పరిశోధన శాలలతో పాటు దాదాపు 30,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. డీఆర్డీఓని పునర్నిర్మించడం, కుదించటం కోసం విజయ్ రాఘవన్ కమిటీ ఇటీవలి సిఫార్సులు సరైన దిశలో ఒక అడుగు. దాదాపు 80,000 మంది కార్మికులు పనిచేస్తున్న 41 ఆర్డినెన్స్ కర్మాగారాలకు ఇదే విధమైన కసరత్తు అవసరం.ఒక వ్యవస్థ స్థితిస్థాపకత... తప్పును సరి చేయగల దాని సామర్థ్యంలో ఉంటుంది. సైనిక విభాగం పెద్దలు అన్ని ఇతర పరిగణనలను పక్కన పెట్టి భారీ సంస్థాగత ప్రయోజనార్థం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాను.జి.జి. ద్వివేది వ్యాసకర్త రిటైర్డ్ మేజర్ జనరల్ -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్టోప్లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్పూర్లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్లోని జో«ద్పూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్ఫోర్స్లో ఫైటర్ పైలట్గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అయ్యారు. 2017లో అకాలీదళ్లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్ఫోర్స్ ఫైటర్గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్ఫోర్స్ చీఫ్గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్లో భారత్కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
పూంచ్లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
తీవ్ర గాయాలతో భారత్లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్ఎల్ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
ఉగ్రదాడులను తేలికగా తీసుకోవద్దు: రాజ్నాథ్ సింగ్
జమ్మూ కశ్మీర్: దేశం కోసం సేవ చేసే ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడు అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో పర్యటించారు. ఉగ్రవాద దాడుల్లో రెండు ఆర్మీ వాహనాల్లో ఉన్న నలుగురు సైనికులు మృత్యువాతపడ్డ పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన జమ్మూ కశ్మీర్లోని భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, సైనికులతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సరిహద్దుల్లో దేశ కోసం పోరాడే ప్రతి సైనికుడిని తమ కుటుంబ సభ్యుడిగా ప్రతి భారతీయుడు భావించాలని అన్నారు. భద్రత, ఇంటలీజెన్స్ విభాగాలు ఉగ్రదాడులను నిలువరించడానికి కృషి చేస్తాయని తెలిపారు. సైనికులకు ఈ విషయంలో ఎటువంటి నిఘా వ్యవస్థ అవసరం పడినా ప్రభుత్వం నుంచి అందిస్తామని పేర్కొన్నారు. భద్రతా బలగాలకు సౌకర్యాలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోవద్దని మంత్రి సూచించారు. ‘మీరు(సైనికులు) అప్రమత్తంగా ఉన్నారని తెలుసు. కానీ ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. మీ ధైర్యసాహసాలు మాకు గర్వకారణం. మీ త్యాగాలను ఎవరూ పూడ్చలేరు. దేశ సరిహద్దుల్లో వెలకట్టలేని సేవ చేస్తున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమం, భద్రత పరంగా అండగా ఉంటుంది’ అని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. చదవండి: ఉత్తరాఖండ్ భూ చట్టాల్లో భారీ మార్పులు ! -
Israel: సైనికులకు దొరికిన ‘అల్లావుద్దీన్’ దీపం !
జెరూసలెం: రెండు నెలలుగా హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు కాస్త ఆటవిడుపు లభించింది. గాజా సమీపంలో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని పోలి ఉన్న ఒక వస్తువు వారికి దొరికింది. దీనిని 1500 సంవత్సరాల కిందటి బైజెంటీన్ కాలం నాటి దీపంగా గుర్తించారు. ‘ఫీల్డ్లో తిరుగుతున్నపుడు కింద ఒక పురాతన వస్తువు దొరికింది. దాని గుండ్రటి ఆకారం నన్ను ఆకర్షించింది. ఆ వస్తువు పై భాగం బురదతో కప్పి ఉంది. దానిని శుభ్రం చేశాను. వెంటనే ఆ వస్తువను ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీ(ఐఏఏ)కి చెందిన ఆర్కియాలజిస్ట్కు అప్పగించాను’ అని సైనికుడు తెలిపాడు. ‘పురాతన వస్తువును పరిశీలించిన ఐఏఏ అది 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన బైజెంటీన్ కాలం నాటి ‘సాండల్ క్యాండిల్’ అని వెల్లడించింది. క్యాండిల్ దొరికిన వెంటనే తమకు ఇచ్చిన సైనికులకు ఐఏఏ ధన్యవాదాలు తెలిపింది. ఇజ్రాయెల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప సంస్కృతి, పురాతన కాలం నాటి విలువైన సంపద ఉందని వెల్లడించింది. ఇదీచదవండి..హౌతీ రెబెల్స్పై అమెరికా కీలక ప్రకటన -
జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్ఎఫ్ చేసినవే. ఈ అటాక్లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్లో పూంచ్లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
జెరూసలేం: హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్లైన్ ఇజ్రాయెల్ దళాలను ప్రధాని బెంజమన్ నెతన్యాహు కలిశారు. తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు.. ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. భూతల దాడి.. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్ ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: అల్ఖైదా కంటే ప్రమాదకరం -
పాక్లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..
ప్రపంచంలో అక్కడక్కడా జనసంచారం లేని ఊళ్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల జనాలు ఆ ఊళ్లను విడిచిపెట్టి, అక్కడి నుంచి వేర్వేరు చోట్లకు తరలిపోయి ఉంటారు. అలాంటి ఊళ్లను ఆసక్తిగా చూడటానికి అప్పుడప్పుడు పర్యాటకులు వస్తుంటారు. ఇంగ్లండ్లోని సాలిస్బరీ మైదాన ప్రాంతంలోని ఇంబర్ గ్రామం కూడా అలాంటిదే! ఎనిమిది దశాబ్దాలుగా ఇక్కడ జనసంచారం లేదు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలోనే ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. మిత్రశక్తులకు చెందిన సైనిక బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ఈ ఊరిని ఖాళీ చేయించారు. యుద్ధంలో అణుబాంబుల వల్ల ఒకవేళ పెనువిపత్తు తలెత్తితే, ఎదుర్కోవడానికి మిత్రశక్తుల సైనికులకు ఈ గ్రామంలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు అణుబాంబులు జపాన్ మీద పడ్డాయి గాని, ఇంగ్లండ్ మీద పడలేదు. యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడి సైనిక శిబిరాలను కూడా ఖాళీ చేసేశారు. ఈ ఊరికి ఒక రైల్వే స్టేషన్ ఉంది. బ్రిటిష్ సైనికులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతుంటారు. నిరంతరం ఇక్కడ సైనికులు కాపలా ఉంటారు. మామూలు సమయాల్లో జనాలు ఇక్కడ అడుగు పెట్టకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఈ ఊరి ప్రవేశమార్గం సమీపంలోనే నిషేధాజ్ఞల హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. అయితే, ఏడాదికి ఒకసారి మాత్రమే ఇక్కడకు జనాలను అనుమతిస్తారు. ఏటా ఆగస్టు 19న ఈ గ్రామ ప్రవేశ ద్వారం జనాల కోసం తెరుచుకుంటుంది. వందల సంఖ్యలో జనాలు ఆ రోజు ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడి శ్మశానవాటికలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ప్రార్థనలు జరుపుతారు. అలాగే, ఈ ఊళ్లోని పురాతనమైన సెయింట్ జైలిజ్ చర్చిలోనూ ప్రార్థనలు జరుపుతారు. ఈ ఒక్కరోజు జనాల రాకపోకలకు వీలుగా వార్మినిస్టర్ పట్టణం నుంచి ఇక్కడకు ప్రత్యేక బస్సులను నడుపుతారు. (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
హాంకాంగ్లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్కు చెందిన ఆమె హాంకాంగ్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి!) -
లోయలో పడిన ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు మృతి
లడఖ్ ఖేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతిచెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా, ఒకరు జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) ఉన్నారు. లేహ్ ప్రాంతానికి సుమారు 150కిమీ దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు మరణించడంతో యావత్ భారతదేశం ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైంది. -
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
పరేడ్లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్
బ్రిటన్లో వార్షిక ట్రూపింగ్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలయమ్స్ ఎదుట సైనికులు పరేడ్ రిహార్స్ల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్లో లండన్లో ట్రూపింగ్ ది కలర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే విలియమ్స్ ఎదుట రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో విలియమ్స్..ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు. Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD — The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023 క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు. కాగా, జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్ III పర్యవేక్షిస్తారు. 💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5 — Reuters (@Reuters) June 10, 2023 (చదవండి: రన్వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు) -
జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
‘నాకేమీ వద్దు ప్లీజ్ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’
దాల్పట్: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇక, నీలంసింగ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది. పక్కనే నిలుచున్న నీలంసింగ్ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. Papa aap ku nhai bol rahe, Papa Aap Ku Humain Chor ker jaa rahey hain, 😢😢 Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. This bloodshed must stop now. How will this daughter live without her father now? I request the governments of India and… pic.twitter.com/dpLawcSr3Q — Mohammed Hussain (@hussain_hrw) May 7, 2023 ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
జమ్ముకశ్మీర్లో విషాదం.. ముగ్గురు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లో కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు బుధవారం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. కాగా, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా చినార్ క్రాప్స్కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడిపోయారు. ఈ క్రమంలో వారు మరణించినట్టు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, ట్రాక్పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగనట్టు అధికారులు చెప్పారు. -
Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం !
కీవ్: దురాక్రమణకు దిగిన రష్యా సేనలను క్షిపణి దాడుల్లో అంతమొందించే పరంపర కొనసాగుతోందని ఉక్రెయిన్ ప్రకటించింది. డోనెట్స్క్ ప్రాంతంలో తమ సేనలు జరిపిన భారీ క్షిపణి దాడిలో ఏకంగా 400 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడిలో మరో 300 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే 63 మంది సైనికులే మరణించారని రష్యా స్పష్టంచేసింది. మకీవ్కా సిటీలో ఆదివారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒక పెద్ద భవంతిలో సేదతీరుతున్న రష్యా సైనికులే లక్ష్యంగా ఉక్రెయిన్ క్షిపణి దాడి జరిగింది. అమెరికా సరఫరా చేసిన హిమార్స్ రాకెట్లను ఆరింటిని ఉక్రెయిన్ సేనలు ప్రయోగించగా రెండింటిని నేలకూల్చామని మిగతావి భవనాన్ని నేలమట్టంచేశాయని రష్యా సోమవారం తెలిపింది. భవనంలోని సైనికులు ఇంకా యుద్ధంలో నేరుగా పాల్గొనలేదని, ఇటీవల రష్యా నుంచి డోనెట్స్క్కు చేరుకున్నారని, అదే భవనంలో యుద్ధంతాలూకు పేలుడుపదార్థాలు ఉండటంతో విధ్వంసం తీవ్రత పెరిగిందని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, డోనెట్స్క్లో దాడి తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి డ్రోన్లకు పనిజెప్పింది. కీలకమైన మౌలిక వ్యవస్థలపై సోమవారం 40 డ్రోన్లు దాడికి యత్నించగా అన్నింటినీ కూల్చేశామని కీవ్ మేయర్ విటలీ క్లిష్చెకో చెప్పారు. కీవ్ ప్రాంతంలో కీలక మౌలిక వ్యవస్థలు, జనావాసాలపై డ్రోన్ దాడులు సోమవారం సైతం కొనసాగాయని కీవ్ ప్రాంత గవర్నర్ కుబేలా చెప్పారు. -
రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావడమే గానీ వెనక్కి రాలేం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్ కాల్స్. రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్ క్రూయిజ్ క్షిపణి కావాలని చెప్పాడు. మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
సైనికుల భార్యలే అత్యాచారాలు చేయమనడం దారుణం!
లండన్: ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ.. రష్యా సైనిక కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ ఒలెనా ఆక్రోశించారు. సంఘర్షణ సమయంలో జరుతుగున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం లండన్లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో ఒలెనా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి రష్యా బలగాలు ఇలా బహిరంగంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. యుద్ధ సమయంలో లైంగిక వేధింపులనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలా మృగంలా పాశవికంగా ప్రవర్తించి తమ గొప్పతనాన్ని చాటుకోవడం అమానుషం అని రష్యా దళాలపై ఒలెనా విరుచుకుపడ్డారు. యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉండదని, ఇదే అదనుగా చేసుకుని మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోవడం అనేది అనైతికం అన్నారు.అంతేగాదు రష్యా బలగాలు దీన్ని ఒక అతిపెద్ద ఆయుధంగా, తమ ఇష్టరాజ్యంగా ఉపయోగిస్తున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా స్పందన రావాలన్నారు. దీన్ని యుద్ధ నేరంగా గుర్తించి, నేరస్తులందర్నీ జవాబుదారీగా చేయడం అత్యంత ముఖ్యం అని ఒలెనా అన్నారు. (చదవండి: యుద్ధ సమయంలో ఆఫ్రికన్ దేశాలకు ఉక్రెయిన్ చేయూత) -
పుతిన్కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు.. ఆయన్ని నిలదీసే పరిస్థితికి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలై తొమ్మిది నెలలు పూర్తైంది. కానీ, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని వాళ్లు సోషల్ మీడియా సాక్షిగా పుతిన్ను నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే కొందరు కుటుంబ సభ్యులు వీడియో పోస్టులు అక్కడి సోషల్ మీడియాలో పెడుతుండడం గమనార్హం. కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్కు కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని కుటుంబాలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సుకనోవా అంటున్నారు. ఆమె తన 20 ఏళ్ల కొడుకు ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. సమారా నగరం నుంచి వోల్గా నది వెంట 900 కిలోమీటర్లు ప్రయాణించి మరీ క్రెమ్లిన్కు చేరుకుంది. అలాగే కొందరు మహిళలు.. పుతిన్ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి ఫిర్యాదు చేయలేదని ఆమె అంటున్నారు. అత్యవసరంగా తమ వాళ్లను యుద్ధం రొంపిలోకి దింపిన అధ్యక్షుడు పుతిన్.. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు రష్యా సైనికుల కుటుంబ సభ్యులు. యుద్ధ సమయంలో సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక అలవెన్సులతో పాటు జీవిత బీమా, పిల్లలకు చదువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చింది క్రెమ్లిన్. అంతేకాదు యుద్ద కాలంలో వాళ్లతో మాట్లాడించేలా ఏర్పాట్లు కూడా చేయిస్తామని తెలిపింది. కానీ, వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు సెప్టెంబర్లో ఉక్రెయిన్ యుద్ధం కోసం లక్షల మంది కావాలంటూ ప్రకటన ఇచ్చి.. అన్ని వయస్కుల వాళ్లను బలవంతపు శిక్షణకు ఆదేశించింది. అయితే.. అందులో వృద్ధులు, పిల్లలు సైతం ఉండడంతో నాలుక కర్చుకున్న క్రెమ్లిన్ వర్గాలు.. ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ సవరణ ప్రకటన ఇచ్చాయి. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ఎలా పుట్టిందో తెలుసా? -
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
సైనిక బలగాల మోహరింపు అట్టర్ ప్లాప్...షాక్లో పుతిన్
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే దాదాపు వెయ్యిమంది రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే దాదాపు 71, 200 మందికి పైగా రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ పేర్కొంది. అదీగాక కేవలం ఒక్క ఆదివారం నాడే సుమారు 950 మంది నెలకొరిగారని వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలు కీలకమైన దక్షిణ నగరంలోని ఖైర్సన్ వైపుగా ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. అదీగాక ఇటీవల పెద్ద సంఖ్యలో సైనిక మొబైలైజేషన్ చేసింది. కానీ ఆ బలగాలు మాస్కో పంపిన రిజర్వ్స్ట్ పరికరాలతో సమస్యలను ఎదుర్కొనడమే గాక పోరాడే సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యూకే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకున్న సైనికులు చాలా పేలవంగా పోరాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మరికొంత మంది రిజర్వ్ బలగాలు ఆయుధాలు లేకుండా మోహరించడం వంటివి చేస్తున్నారంటూ స్వయంగా రష్యా అధికారులే తలలు పట్టుకుంటున్నట్లు పేర్కొంది. అదీగాక మాస్కో బలగాలు 1959 నాటి ఏకేఎం రైఫిల్స్ వాడుతున్నట్లు తెలిపింది. పేలవమైన నిల్వ ఆయుధాల కారణంగానే వేలాదిమంది సైనికులు యుద్ధంలో పోరాడ లేక నెలకొరుగుతున్నట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ రష్యా తన దూకుడును తగ్గించకపోగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు కొనసాగిస్తుండటం గమనార్హం. (చదవండి: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు) -
Russia-Ukraine war: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్లో అమెరికా సేనలతో కలిసి తాలిబన్లపై పోరాడిన ప్రత్యేక దళాల సైనికులు ఇప్పుడు రష్యాకు క్యూ కడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. వీరంతా అమెరికా సైన్యం శిక్షణ ఇచ్చిన కమాండోలు కావడం విశేషం. అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లిన తర్వాత తాలిబన్ల నుంచి ముప్పును తప్పించుకొనేందుకు ఈ కమాండోలు ఇరాన్కు చేరుకున్నారు. వీరిని రష్యా తన సైన్యంలో చేర్చుకొని, ఉక్రెయిన్కు పంపిస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు అఫ్గాన్ మాజీ సైనికాధికారులు స్వయంగా వెల్లడించారు. యుద్ధంలో పాల్గొన్నందుకు గాను ఒక్కో జవానుకు రష్యా ప్రతినెలా 1,500 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తోందని తెలిపారు. నిజానికి ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడం అఫ్గాన్ కమాండోలకు ఇష్టం లేదని, కానీ, వారికి మరో దారి కనిపించడం లేదని అబ్దుల్ రవూఫ్ అనే మాజీ అధికారులు తెలిపారు. -
కార్గిల్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఉక్రెయిన్తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి!
కీవ్: రష్యాతో 240 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 66,750 మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ భీకరు పోరులో శుత్రుదానికి జరిగిన నష్టాన్ని ఓ చిత్రం రూపంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. దాదాపు 9 నెలలు కావస్తున్నా యుద్ధం ఆగే సూచలను కన్పించడం లేదు. ఉక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టం.. చనిపోయిన సైనికులు - 66750 ధ్వంసమైన యుద్ధ విమానాలు- 269 హెలికాప్టర్లు - 263 ట్యాంకులు - 2573 మానవ రహిత విమానాలు - 1325 స్పెషల్ ఎక్విప్మెంట్ - 147 పడవలు - 16 సాయుధ వాహనాలు - 5258 ఆయుధ వ్యవస్థలు - 1648 బహుళ రాకెట్ లాంచర్లు - 372 వాహనాలు, ఇంధన ట్యాంకులు - 4006 యుద్ధ విమాన నిర్వీర్య వవస్థలు - 189 క్రూజ్ క్షిపణులు - 329 2️⃣4️⃣0️⃣ days of full-scale Russia’s war on #Ukraine. Information on #Russian invasion. Losses of #Russia’s armed forces in Ukraine, October 21. pic.twitter.com/SidRhOrGdk — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) October 21, 2022 ప్రపంచానికే సంక్షోభం తెచ్చేలా ఉన్న ఈ భీకర యుద్ధాన్ని ఆపాలని అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని పుతిన్ చెబుతున్నారు. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చలకు ససేమిరా అంటున్నారు. చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్.. ఐదేళ్లు వేటు -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
ఉక్రెయిన్తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా?
కీవ్: రష్యాతో ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి చెందిన 45,550 మంది సైనికులను మట్టబెట్టినట్లు ఉక్రెయిన్ శనివారం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 250 రష్యా బలగాలను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఫేస్బుక్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 2,000 యుద్ధ ట్యాంకులు, 1,045 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3,165 వాహనాలను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ చెప్పిన లెక్కలకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇటీవల బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలేస్ అంచనాలకు ఇవి దాదాపు సమానంగా ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు మొత్తం 80వేల మంది ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. అమెరికాకు న్యూయార్క్ టైమ్స్ నివేదిక మాత్రం యుద్ధంలో 25 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. అలాగే 9000 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పేర్కొంది. రష్యా దాడుల్లో 5,587మంది ఉక్రెయిన్ పౌరులు మరణించి ఉంటారని కచ్చితంగా చెప్పగలమని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తాము ఒకవేళ నాటోలో చేరాలనే ఆలోచన మార్చుకున్నా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. చదవండి: అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన -
ఉక్రెయిన్లోని రష్యా సైనికులపై విష ప్రయోగం!
మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్ కెమికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్ టాక్సిన్ అనేది సైన్స్లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్ బోటులినియమ్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్గా పిలిచేవారు. అయితే, బోటులినమ్ టాక్సిన్ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదీ చదవండి: పుతిన్కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం! -
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్లను లేదా ఫ్లాష్బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
భారతీయతే మన ఐక్యత
కంటోన్మెంట్ (హైదరాబాద్): భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత విభిన్నత ఉన్నా భారతీయతే మన ఐక్యత అని చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాలికి తగిలిన గాయం వల్ల మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. బయటికి వచ్చాక మొదట ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ‘‘నేను ఐటీ, పరిశ్రమల మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి మాట్లాడారు. అధిక జనాభా, వనరులున్న చైనా, భారత్ అన్నింటా పోటీపడటం సహజమే. అయితే విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయి. భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు అన్నింటా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరినీ ఒక్క తాటిపై నిలిపేది మాత్రం భారతీయతే. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలకు తోడు.. మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ని భవిష్యత్లోనూ కొనసాగించాలి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని.. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆకట్టుకున్న లెఫ్టినెంట్ జనరల్ ప్రసంగం పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ అరుణ్కుమార్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వ్యక్తి అయిన ఆయన మన భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్లోనూ మాట్లాడుతూ ఉత్తేజపరిచారు. ప్రసంగం మధ్యలో ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకంతో గగనంలో ఎగురుతూ చేసిన విన్యాసాన్ని తిలకించాల్సిందిగా ఆహుతులను కోరారు. అమర జవానులకు నివాళి పరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ–ఏపీ ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి, మేజర్ పద్మపాణి ఆచార్య సతీ మణి చారులత, కంటోన్మెంట్కు చెందిన లాన్స్నాయక్ రాంచందర్ సతీమణి ఎంఆర్ దివ్యతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్జా, శివలీల, కిరణ్ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్ సుల్తానా తదితరులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఇక ఇటీవల జరిగిన మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, సేవా పురస్కారాలు పొందిన టీఎన్ సాయికుమార్, కల్నల్ సురేంద్ర పోలా, కల్నల్ రాహుల్ సింగ్ తదితరులకు సైతం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారాలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని సందర్శించి, ఆర్మీ విన్యాసాలను తిలకించారు. కలరిపయట్టు, పేరిణి నృత్యాలు, ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలు, బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
‘అగ్నివీరుల’ ఆగమనం!
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్’లు అంటారు. 17.5– 21 ఏళ్ల మధ్యవయస్కులను సైనికులుగా ఎంపిక చేస్తారని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. సాంకేతిక నైపు ణ్యాలు తప్పక అవసరమైన వైమానిక, నావికా దళాలకు ఈ పథకం సాధ్యపడకపోవచ్చు. కనుక ప్రధానంగా సైనికదళంలోనే ఈ ‘అగ్నివీర్’ల ఉనికి ఉంటుందనుకోవాలి. ఈ పథకానికి లభించే ఆదరణనుబట్టి ప్రస్తుత నియామక విధానానికి క్రమేపీ స్వస్తి పలుకుతారు. సైనిక వ్యవస్థలో సంస్కర ణలు తీసుకురావాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కార్గిల్ యుద్ధ సమయం నుంచీ అది తరచు ప్రస్తావనకొస్తూనే ఉంది. కానీ జరిగిందేమీ లేదు. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 2016లో ఒక కమిటీని నియమించింది. ఫలితంగా ఈ ‘అగ్నిపథం’ ఆవిష్కృతమైంది. పరిపాలకు లెలా ఉండాలో, ఆర్థిక రాజకీయ వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో చెప్పిన చాణక్యుడు ఏ పనైనా మొదలెట్టినప్పుడు పాలకులు మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నాడు. ‘ఎందుకు చేస్తున్నాను... ఇలాచేస్తే రాగల ఫలితం ఏమిటి... ఈ కృషిలో విజయం సాధిస్తానా’ అనేవి ఆ ప్రశ్నల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా సైనికరంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతం మాదిరి దీర్ఘకాలిక యుద్ధాలకు ఇప్పుడు పెద్దగా అవకాశం లేదు. చాలా యుద్ధాలు మొదలైనంత వేగంగా ముగిసిపోతున్నాయి. పైగా వీటిలో సాంకేతిక నైపుణ్యానిదే పైచేయి. రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, లక్ష్యంవైపు మారణాయుధాలతో దూసుకుపోగల డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే స్వయంచాలిత ఆయుధాలదే ఇప్పుడు కీలకపాత్ర. అందుకే అమెరికా మొదలుకొని చైనా వరకూ సైనిక రంగంలో సంస్కరణలు మొదలై చాన్నాళ్లయింది. అయితే అమెరికాకైనా, ఇతర పాశ్చాత్య దేశాలకైనా జనాభా తక్కువ గనుక సైనిక రిక్రూట్మెంట్ మొదటినుంచీ సమస్యే. మనకుండే సమస్యలు వేరు. మన త్రివిధ దళాలు సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 14 లక్షలు. ఇందులో పౌర సిబ్బంది దాదాపు 3.75 లక్షలు. మొత్తంగా ఏటా రిటైరయ్యేవారి సంఖ్య 55,000. సంస్కరణలు ప్రతి పాదించే కమిటీలన్నీ సైన్యంకన్నా పౌరసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. కానీ అనేక కారణాలవల్ల కేంద్రంలో ఎవరున్నా వారి జోలికిపోరు. పైగా ఈ పౌర సిబ్బందికి జీతాలు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛన్ అదే క్యాడర్లో సైన్యంలో పనిచేస్తున్నవారికన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే సైన్యంలో కనిష్ఠంగా పదేళ్లకు రిటైర్ కావొచ్చు. పౌరసిబ్బంది దాదాపు మూడున్నర దశాబ్దాల సర్వీసు పూర్తిచేస్తారు. అంకెలు ఘనంగా కన్పించవచ్చుగానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకుంటే 80వ దశకం మధ్యనుంచీ మన రక్షణ కేటాయింపులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం మన జీడీపీలో ఆ రంగం వాటా 1.5 శాతం. ఇందులో గణనీయమైన భాగం జీతాలకూ, పింఛన్లకూ పోతుందంటారు. సంస్కరణలను వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ అవి ఎక్కడ, ఎలా ఉండాలన్నదే ప్రశ్న. కార్గిల్ యుద్ధం ముగిశాక ఆనాటి సీనియర్ అధికారులు మన దగ్గర కాలం చెల్లిన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి అధికమని ఎత్తిచూపారు. ఎన్డీఏ అధికారంలోకొచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఈ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. నిజమే... రాఫెల్ యుద్ధ విమానాలవంటి అత్యంతాధునిక యుద్ధ విమానాలు, అణు క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉండే ఎస్–400 క్షిపణి వ్యవస్థ వంటివి మన రక్షణ అమ్ములపొదిలో వచ్చి చేరాయి. శత్రువును నిలువరించడంలో, మట్టికరిపించడంలో అవి తిరుగులేని అస్త్రాలు. కానీ ఇతరత్రా రక్షణ సామగ్రి మాటేమిటి? సాధారణ సైనికులకు అవసరమైన ఆయుధాల సంగతేమిటి? కాంట్రాక్టు పద్ధతిలో చేర్చుకుంటే పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాలకయ్యే వ్యయం చాలా వరకూ తగ్గుతుందనీ, ఆ మొత్తాన్ని సైనికదళాల ఆధునికీకరణకు ఖర్చు చేయొచ్చనీ ‘అగ్నిపథం’ పథకాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. కానీ ఆమేరకు సామాజిక అశాంతి ప్రబలదా? రిటైరైనప్పుడు వచ్చే మొత్తం మినహా మరేంలేకపోతే కుటుంబాలన్నీ ఎలా నెట్టు కొస్తాయి? అసలు వచ్చింది కొలువో, కాదో తెలియని అయోమయం... నాలుగేళ్ల తర్వాత బయటికి రావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే బిహార్లో నిరసన స్వరాలు వినిపించాయి. నాలుగేళ్లు సైన్యాన్ని నమ్ముకుని పనిచేశాక మళ్లీ కొత్త కొలువు కోసం వేట మొదలుపెట్టాలా అన్నది వారి ప్రశ్న. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే సర్వీసులో కొనసాగిస్తారు. 75 శాతం మంది బయటకి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు వారందరికీ కొత్త ఉపాధి చూపడం సాధ్యమేనా? అక్కడ నేర్చుకున్న విద్యలతో, కొలువుపోయిందన్న అసంతృప్తితో పెడదోవ పట్టేవారుండరా? అసలు ‘అగ్నివీర్’లను సాధారణ సైనికుల మాదిరి పరిగణించి బాధ్యతలు అప్పగించడం ఆచరణలో అధికారులకు సాధ్యమేనా? అనుకోని పరిణామాలు వచ్చిపడితే ఇతర సైనికుల తరహాలో ‘అగ్నివీర్’లు పూర్తి సంసిద్ధత ప్రదర్శించగలరా? కేంద్రం జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలి. -
త్రివిధ దళాల్లో అగ్నిపథ్ నియామకాలు
-
ఉక్రెయిన్ యుద్ధం: ప్రైవేట్ సైనికులు కావలెను.. భారీగా జీతం, బోనస్ ప్రత్యేకం
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. అమెరికా, యూరప్కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు. ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు. వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. వాగ్నర్ VS అకాడమీ ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే. కంపెనీల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి.. చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో! ► అకాడమీ: బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి. ► వాగ్నర్ గ్రూప్ రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన యవ్జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి. ► జీఫోర్ఎస్ ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. ► యూనివర్సల్ ప్రొటెక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు. ► కేబీఆర్ అమెరికాలోని టెక్సాస్కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్ సంభాషణ లీక్!
మాస్కో: ఉక్రెయిన్లో నెలల తరబడి విసుగెత్తిపోయిన రష్యా సైనికులు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి ఉత్తుత్తి పెళ్లిళ్లకు తెర తీస్తున్నారు. నకిలీ శుభలేఖలు సమర్పించి సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఓ ఫోన్ సంభాషణ ద్వారా బయటపడింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసిన ఒక ఫోన్ కాల్ ప్రకారం.. ఉక్రెయిన్లో ఉన్న రష్యా సైనికుడికి, అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ తతంగం బయటపడింది. నకిలీ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని, చాలామంది ఇలాగే చేశారని అతను చెప్పుకున్నాడు. ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గమన్నాడు. చదవండి: రష్యా యుద్ధం.. ఉక్రెయిన్ దళాల వెనుకంజ! -
Ukraine Russia War: 31,000 రష్యా సైనికుల మృతి
Russia has Lost Over 31000 Soldiers in Ukraine: ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 31 వేలు దాటినట్టు సమాచారం. తాజాగా వ్లాదిమిర్ నిగ్మతులిన్ (46) అనే కల్నల్ మరణించడంతో యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్ సంఖ్య 50కి చేరింది. మేజర్ జనరల్ రోమన్ కుజుతోవ్, లెఫ్టినెంట్ జనరల్ బెర్డ్నికోవ్ మరణంతో యుద్ధానికి బలైన రష్యా జనరళ్ల సంఖ్య 12కు చేరింది. మరోవైపు వాగ్నర్ గ్రూప్కు చెందిన వ్లాదిమిర్ ఆండొనోవ్ (44) అనే రష్యా కిరాయి సైనికున్ని ఉక్రెయిన్ స్నైపర్లు మట్టుబెట్టారు. ఇతను క్రిమియా యుద్ధమప్పుడు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలకు నరకం చూపించి ‘తలారి’గా పేరుమోశాడు. చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్ చిక్కారు) -
18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్ ప్రయాణం
మందస: కొండలు దాటారు.. కోనలు దాటారు.. లోయలు చూశారు.. శిఖరాల పక్క నుంచి ప్రయాణించారు... ‘ఏడుగురు అక్కచెల్లెళ్లు’ను పలకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకటా రెండా.. పన్నెండు రాష్ట్రాలు.. పన్నెండు వేల కిలోమీటర్ల దూరా న్ని 18 రోజుల్లో పూర్తి చేశారు. సైని కులు తలపెట్టిన బృహత్తర సాహస యాత్ర ఇది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కోవిడ్, వైద్యంపై అవగాహన కల్పించడానికి 12 మంది సోల్జర్ల బృందం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించా రు. ఈ బృందంలో ఓ సిక్కోలు సైనికుడు కూడా ఉన్నాడు. మందస గ్రామానికి చెందిన డుంకురు సతీష్కుమార్ ఈ సాహస బృందంలో ఓ సభ్యుడు. ఈయన నాయక్ క్యాడర్లో పనిచేస్తున్నారు. సెవెన్ సిస్టర్స్గా ముద్దుగా పిలిచే ఈశాన్య రా ష్ట్రాలో బైక్ రైడింగ్ అంత ఈజీ కాదు. సులభమైన పనులు చేస్తే వారు సైనికులు ఎందుకవుతారు. అందుకే ఈ 12 మంది బృందం ఈ రాష్ట్రాల మీదుగా బైక్లతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ అడావ్ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్లు, నలుగురు ఆర్మీ అధికారులు, నాయక్ కేడర్ కలిగిన ఇద్దరు సైనికులు, హవల్దార్ కేడరు ఇద్దరు మొత్తం 12 మందితో కూడిన బృందం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి ఈ నెల 9న బయలుదేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాంఛల్ రాష్ట్రాల మీదుగా 18 రోజుల పాటు 12వేల కిలో మీటర్లు మోటారు వాహనాలతో సాహస యాత్ర సాగింది. దారిలో 78 ఆర్మీ మెడి కల్ యూనిట్లలో ఈ బృందం అవగాహన కల్పించింది. యాత్ర ఈ నెల 27తో ముగియగా, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బృందాన్ని అభినందించారు. సాహస యా త్రలో పాల్గొ న్న సతీష్కుమార్కు మందస ప్రజలు అభినందనలు తెలిపారు. గర్వంగా ఉంది 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆర్మీ సాహస యాత్ర చేయడానికి నిర్ణయించింది. 12 మందితో కూడిన బృందం, 12 రాష్ట్రాల మీదు గా 18వేల కిలోమీటర్లు యాత్ర చేయడానికి సంకల్పించాం. వివిధ రాష్ట్రాల్లోని వాతావరణాలను తట్టుకున్నాం. నిజంగా సాహసంగానే యాత్ర జరిగింది. పెద్ద లక్ష్యం, రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం. సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించాం. చైనా బోర్డరును దాటాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ యాత్రతో మందసకు పేరు రావడం ఆనందంగా ఉంది. – డుంకురు సతీష్కుమార్, సాహస బృందం సభ్యుడు, మందస -
సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన యంగ్ హీరోలు
వేరీజ్ దట్ మోడ్రన్ హెయిర్ స్టయిల్.. వాటీజ్ దిస్ మీసకట్టు.. వేరీజ్ దట్ లవర్ బోయ్ లుక్ అంటే... కట్ చేశా.. లుక్ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్.. ఆన్ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం. 'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్కు వెళ్లొచ్చారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్లో ఆమిర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్గా కనిపిస్తారు. సినివలో ఓ వార్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్సింగ్ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్ రోల్. మరోవైపు విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సోల్జర్గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్’ (జేజీఎమ్ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ మూవీ ‘లైగర్’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘జేజీఎమ్’. ‘‘ఇండియన్స్ ఆర్ టైగర్స్, ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కేన్ రూల్ దిస్ వరల్డ్.. 'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఏ లెవల్లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్లోనే టైమ్ స్పెండ్ చేశారు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్గా రషి్మకా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ బోర్డర్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సుమంత్ది కూడా సోల్జర్ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ‘ఏజెంట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చదవండి: మందు తాగుతా, ఆ టైమ్లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్ దటీజ్ రామ్చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
ఇలా జరుగుతుందని అనుకోలేదు.. చాలా విషాదకరం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రకటించి నాలభై రోజులు దాటింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా భారీగానే నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వరకు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. దిమిత్రీ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్ బలగాలను కోల్పోయామని, జరిగిన ఘటన చాలా విషాదకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు. ఇక తొందర్లోనే తమ యుద్ధ లక్ష్యాలను చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టి ఆరు వారాల కాగా ఇప్పటికే 4 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ని విడిచి విదేశాలకు వలస వెళ్లారు. అంతేకాకుండా వేలాది మంది గాయపడడంతో పాటు మరణాలతో కీవ్ నగరం మారుమోగింది. దీనికి ప్రతీకాత్మక చర్యగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రష్యాను యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ కౌన్సిల్ నుంచి వైదొలిగింది. ఉక్రెయిన్లో రష్యా జరుపుతున్న దాడులు కారణంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రష్యా గత మూడు దశాబ్దాలుగా రష్యా చూడని అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ అన్నారు. యూఎస్ కాంగ్రెస్ కూడా రష్యాని దాని మోస్ట్ వాంటెడ్ కంట్రీ జాబితా నుంచి తొలగించింది. దీని మూలాన వాణిజ్య పరంగా రష్యాకు మరింత దెబ్బ తగలనుంది. చదవండి: వార్నింగ్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్పై టెన్షన్! -
రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం
Ukrainian woman recalls horror: రష్యా ఉక్రెయిన్పై వైమానిక దాడులతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులకు తెగబడుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది. తొలుత తమ పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత తన భర్తను చంపినట్లు వెల్లడించింది. తదనంతరం రష్యా సైనికులు తన తలపై గన్పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి ఆత్యాచారం చేశారని తెలిపింది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన)