Swiggy
-
Visakha: స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
-
విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు. డెలివరీ ఇచ్చేటపుడు మర్యాదగా మేడం అని పిలవలేదని ఇంట్లో పని మనిషి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సెక్యూరిటీ సిబ్బంది బట్టలు విప్పించి దాడి చేసినట్లు సమాచారం. అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అపార్ట్మెంట్ వద్ద నగరంలో డెలివరీ బాయ్స్గా విధులు నిర్వహిస్తున్న యువకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉపవాసాలు: స్విగ్గీ కొత్త అప్డేట్ చూశారా?
ప్రస్తుత రంజాన్ మాసంతో పాటు నవరాత్రి వంటి ఇతర ఉపవాస సమయాల్లో కస్టమర్లను నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టకుండా ‘ఫాస్టింగ్ మోడ్’ అనే వినూత్న ఎంపికను ‘స్విగ్గీ’ ప్రారంభించింది. ఇది ఉపవాస సమయాల్లో వినియోగదారులు ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్లను పాజ్ చేయడానికి అనుమతించే సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ ఉపవాస సమయాల్లో జోక్యం చేసుకోదు. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రం ఈ వేదిక సిద్ధంగా ఉంచుతుంది. వినియోగదారులు యాప్ నుంచి ఈ సెట్టింగ్ను సులభంగా ప్రారంభించ వచ్చు. అవసరం లేని సమయంలో నిలిపివేయవచ్చు. వినియోగదారులు స్విగ్గీ యాప్ నుండి ఎప్పుడైనా ఫాస్టింగ్ మోడ్ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత.. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండే వినియోగదారులు అందరికీ సహర్ (తెల్లవారుజామున), సాయంత్రం 4 గంటల మధ్య ఫుడ్ నోటిఫికేషన్లు పాజ్ చేయబడతాయి. వినియోగదారుల ఉపవాస సమయం పూర్తయిన తరువాత నోటిఫికేషన్లు తిరిగి ప్రారంభమవుతాయి. మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్విగ్గీ ఆహార పదార్థాలపై 50 శాతం వరకూ తగ్గింపుతో రుచికరమైన వంటకాలు, ప్రత్యేక రంజాన్ భోజనాలను అందిస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్ను సంస్థ సృజనాత్మక భాగస్వామి టాలెంటెడ్ రూపొందించింది. రోబోఆల్–ఇన్–వన్ కిచెన్ వండర్చెఫ్లోపద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్దక్షిణ భారత్లో వండర్చెఫ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు. కొత్తగూడలోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో వండర్చెఫ్ ఔట్లెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది మార్కెట్లో వంట గది వినూత్న పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వండర్చెఫ్ బ్రాండ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని, ఇందులో హైదరాబాద్ మార్కెట్ ముఖ్యమైందని తెలిపారు. వండర్ చెఫ్ వినూత్న ఆవిష్కరణలతో హోమ్ చెఫ్లు ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అధునాతన మౌల్డింగ్ టెక్నాలజీలో కాస్ట్ ఐరన్ వంట సామగ్రి ‘ఫెర్రో’ని ప్రవేశపెట్టింది. కత్తిరించడం, ఆవిరి చేయడం, సాటింగ్, కలపడం, బ్లెండింగ్ చేసేందుకు ఆల్–ఇన్–వన్ కిచెన్ రోబోలా పనిచేస్తుంది. చెఫ్ సంజీవ్ కపూర్ స్వయంగా క్యురేట్ చేసిన 370కి పైగా వంటకాలతో కూడిన గైడ్ సహాయంతో స్క్రీన్లపై చూస్తూ హోమ్ చెఫ్లు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని తెలిపారు. -
20 రాష్ట్రాలు.. 100 స్టేషన్లు: ఫుడ్ డెలివరీలో స్విగ్గీ హవా
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy).. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భాగస్వామ్యంతో దేశంలోని 20 రాష్ట్రాలలో 100 రైల్వే స్టేషన్లకు తన సేవలను విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.నిజానికి రైలు ప్రయాణం అనేది.. భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించిందని.. స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.స్విగ్గీ 2024 మార్చిలో ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. సీటుకు గ్యారెంటీ డెలివరీ (లేదా పూర్తి వాపసు) ప్రకటించింది. తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో.. ముందు స్టేషన్లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడు తాము చేరుకునే సమయానికి ఫుడ్ డెలివరీ అవుతుంది. జొమాటో కూడా ఈ తరహా ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ రెండు సంస్థలు రోజుకు లక్ష కంటే ఎక్కువ ఫుడ్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం. -
స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడి
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ(Swiggy) తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యలో భాగంగా కంపెనీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘స్కూట్సీ(Scootsy)’లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో డిసెంబర్లో రూ.1,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో స్కూట్సీ షేరు విలువ రూ.7,640గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు.స్విగ్గీ క్విక్ కామర్స్ వ్యాపారం ఇన్స్టామార్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర మూలధన వ్యయాలకు ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2018లో స్విగ్గీ కొనుగోలు చేసిన స్కూట్సీ.. రెస్టారెంట్, రుచికరమైన ఆహారం, టాయ్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్ సహా మరెన్నో కేటగిరీల్లో ఇంట్రాసిటీ ఆన్లైన్ డెలివరీ అందించే ప్లాట్ఫామ్. ఇది హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లకు గోదాము నిర్వహణ, వేర్ హౌస్ ప్రాసెసింగ్, ఆర్డర్ ఫుల్ ఫిల్మెంట్, ప్యాకింగ్, షిప్పింగ్ సేవలను కూడా అందిస్తుంది.పెరుగుతున్న టర్నోవర్2024 ఆర్థిక సంవత్సరంలో స్కూట్సీ రూ.5,796 కోట్ల టర్నోవర్ను నివేదించింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,686 కోట్లుగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,580 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సప్లై చెయిన్ సేవల నుంచి స్విగ్గీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1,693 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: వచ్చేవారం యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్క్విక్ కామర్స్లో భారీగా పెట్టుబడులువేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను పొందడానికి స్విగ్గీ, దాని ప్రత్యర్థి జొమాటో రెండూ తమ క్విక్ కామర్స్ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్కూట్సీలో తాజా పెట్టుబడి దాని లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను మెరుగుపరచడానికి, కస్టమర్లకు సమర్థవంతమైన, సకాలంలో డెలివరీలను అందించేందుకు తోడ్పడుతుందని స్విగ్గీ తెలిపింది. -
నిమిషానికి 607 కేకులు: ప్రేమికుల రోజు ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచే..
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా.. భారీగా కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ సీఈఓ 'రోహిత్ కపూర్' వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాలెంటైన్స్ డే రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి.. స్విగ్గీ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. గతంలో ఇప్పటి వరకు పొందనన్ని కేక్స్ ఆర్డర్.. ఆరోజు వచ్చినట్లు పేర్కొన్నారు. నొయిడాకు చెందిన ఒక వినియోగదారు ఏకంగా రూ. 25,335 విలువైన ఆర్డర్ పెట్టారు. ఆర్డర్లో థియోస్ నుండి తొమ్మిది కేకులు, ప్రీమియం పాటిస్సేరీ, చాక్లెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా.. ''ప్రేమంటే ఇదే, దానిని పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది” అని కపూర్ అన్నారు.One user from Noida today bought cakes worth ₹25,335! 9 cakes from Theos. Pyaar ho toh aisa, jitna baatoge utna badhega 🥰— Rohit Kapoor (@rohitisb) February 14, 2025స్విగ్గీ యాప్ నుంచి నిమిషానికి 607 కేక్ డెలివరీ జరిగాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో కేక్ మిల్క్ చాక్లెట్ ఉంది. బెంగళూరులోనే అత్యధికంగా కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రేమ వేడుక చాలా మధురంగా ఉందని అన్నారు.Ludhiana, Amritsar, Shillong, Noida, and Agra are leading the charge with the biggest spikes in food deliveries tonight! Who said celebrating love is only a big city trend? 🧡— Rohit Kapoor (@rohitisb) February 14, 2025లూథియానా, అమృత్సర్, షిల్లాంగ్, నోయిడా, ఆగ్రాలలో వాలెంటైన్స్ డే రోజు ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరిగింది. స్విగ్గీ బోల్ట్ తిరుపూర్లోని ఎన్ఐసీ ఐస్ క్రీమ్స్ నుంచి 3.4 నిమిషాల్లో ఆర్డర్ను డెలివరీ చేసింది. ఈ సందర్భంగా “వేడి వేడిగా ఉంటుంది, చలి చల్లగా ఉంటుంది.. కోరికలు ఎప్పుడూ వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని కపూర్ వ్యాఖ్యానించారు.Fresh, fast, and right on time! Swiggy Bolt’s fastest order today was 3.4 minutes from NIC Ice Creams in Tirupur. Hot stays hot, cold stays cold, and cravings never have to wait. That’s Swiggy Bolt ⚡️— Rohit Kapoor (@rohitisb) February 14, 2025 -
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్టైమ్లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పీక్, నాన్–పీక్ టైమ్లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్విగ్గీ నష్టాలు పెరిగాయ్.. మొబిక్విక్ లాభాలు పోయాయ్..
ఫుడ్, గ్రోసరీ డెలివరీల ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 799 కోట్లను దాటింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 574 కోట్ల నష్టం నమోదైంది.కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,049 కోట్ల నుంచి రూ. 3,993 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,700 కోట్ల నుంచి రూ. 4,898 కోట్లకు పెరిగాయి. స్థూల ఆర్డర్ల విలువ(జీవోవీ) 38 శాతం బలపడి రూ. 12,165 కోట్లను తాకింది. క్విక్ కామర్స్ బిజినెస్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ జీవోవీ 88 శాతం జంప్చేసి రూ. 3,907 కోట్లకు చేరింది. కొత్తగా 96 స్టోర్లను జత కలుపుకోవడంతో యాక్టివ్ డార్క్ స్టోర్ల విస్తీర్ణం 2.445 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. నష్టాల్లోకి మొబిక్విక్ ఫిన్టెక్ కంపెనీ మొబిక్విక్ (Mobikwik) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. పేమెంట్ గేట్వే వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.వన్ మొబిక్విక్ గేట్వే చెల్లింపుల వ్యయాలు మూడు రెట్లు పెరిగి రూ. 144 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 51 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 269 కోట్లను అధిగమించింది. పేమెంట్స్ స్థూల మెర్కండైజ్ విలువ మూడు రెట్లుపైగా జంప్చేసి రూ. 29,400 కోట్లయ్యింది. రిజిస్టర్డ్ వినియోగదారుల సంఖ్య 14 శాతం వృద్ధితో 17.2 కోట్లను తాకింది. పేమెంట్స్ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 196 కోట్లను దాటింది. -
ఐస్క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్క్రీమ్ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్క్రీమ్లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్ విలువ రూ. 1200.Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనకొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు జొమాటో, స్విగ్గీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతుల ద్వారా మార్కెట్ తటస్థతకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్ల మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఎన్ఆర్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్ఆర్ఏఐ ఆందోళనకు కారణాలుప్రైవేట్ లేబులింగ్: ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడానికి జొమాటో, స్విగ్గీలు బ్లింకిట్ బిస్ట్రో(Blinkit Bistro), స్విగ్గీ స్నాక్(Swiggy Snacc) వంటి ప్రత్యేక యాప్లను ప్రారంభించాయి. దీనివల్ల మార్కెట్పై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని భావిస్తున్నాయి. ఇది న్యాయబద్ధమైన పోటీకి వ్యతిరేకం అని విమర్శలున్నాయి.డేటా మానిటైజేషన్: సంబంధిత వినియోగదారుల డేటాను రెస్టారెంట్లతో పంచుకోకుండా పోటీ ఉత్పత్తులను సృష్టించడానికి జొమాటో(Zomato), స్విగ్గీ పకడ్బందీ విధానలు అనుసరిస్తున్నాయి. రెస్టారెంట్ డేటాను మాత్రం తమకు అనుకూలంగా వినియోగిస్తున్నాయని ఎన్ఆర్ఏఐ పేర్కొంది.ఎన్ఆర్ఏఐ స్పందన..రెస్టారెంట్ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. జొమాటో, స్విగ్గీలు మార్కెట్పై గుత్తాధిపత్యం సాధించకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: స్పెక్ట్రమ్ను సమానంగా కేటాయించాలని డిమాండ్జొమాటో బ్లింకిట్ బిస్ట్రోజొమాటో, స్విగ్గీ తమ వినియోగదారులకు భోజనంతోపాటు ఇతర ప్రత్యేక సేవలందించేందుకు కొన్ని యాప్లను ఇటీవల ప్రారంభించాయి. జొమాటో బ్లింకిట్ బిస్ట్రో పేరుతో జనవరి 10, 2025 కొత్త యాప్ను లాంచ్ చేసింది. భోజనం, స్నాక్స్, పానీయాలను 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని తెలిపింది. ప్రిజర్వేటివ్స్, ఫుడ్ ప్రాసెసర్లు, మైక్రోవేవ్ ప్రాసెసింగ్ లేకుండా ఆహారాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చింది.స్విగ్గీ స్నాక్స్విగ్గీ స్నాక్ యాప్ను జనవరి 7, 2025న లాంచ్ చేశారు. స్నాక్స్, పానీయాలు, భోజనాలను 10-15 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ.. స్విగ్గీ కొత్త కార్యక్రమం
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ దేశవ్యాప్తంగా ఆహార వృథాను అరికడుతూ, పేదల ఆకలిని తీర్చేందుకు కొత్తగా ‘స్విగ్గీ సర్వ్స్(Swiggy Serves)’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆహార వృథాను కట్టడి చేసేందుకు మిగులు ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనే స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.స్విగ్గీ సర్వీసెస్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల విస్తృత నెట్వర్క్ నుంచి మిగులు ఆహారాన్ని గుర్తించి, దాన్ని సేకరించేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ సహకారం తీసుకోనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. తినదగిన ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేస్తామని చెప్పింది. పైలట్ దశలో స్విగ్గీ సర్వీసెస్ 126కి పైగా రెస్టారెంట్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ప్రాథమికంగా 33 నగరాల్లో ఈ సర్వీస్ను ప్రారంభించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.ప్రతిష్టాత్మక లక్ష్యాలుఈ కార్యక్రమం ద్వారా తినదగిన ఆహారం వృథా కాకుండా 2030 నాటికి 50 మిలియన్ల మందికి భోజనం అందించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్విగ్గీ(Swiggy), ఆర్హెచ్ఏ తెలిపాయి. ఇది సామాజిక బాధ్యత పట్ల స్విగ్గీ నిబద్ధతను, స్థిరమైన, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి చేసే ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.టెక్నాలజీ అండస్విగ్గీ సర్వీసెస్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. మిగులు ఆహార సేకరణ, పునఃపంపిణీని సమన్వయం చేయడంలో స్విగ్గీ ప్లాట్ఫామ్ కీలక పాత్ర పోషించనుంది. ఆహార మిగులును అంచనా వేయడానికి, ఆహార పునఃపంపిణీ లాజిస్టిక్స్ను ఆప్టిమైజ్ చేయడానికి అధునాతన అల్గారిథమ్లను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. భోజనం అవసరమైన వారికి నాణ్యత ప్రమాణాలతో సమర్థవంతంగా చేరేలా చూస్తుంది.ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ..‘స్విగ్గీ సర్వ్స్తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ఆర్హెచ్ఏ సహకారం కీలకం. ఆహారం వృథాను, ఆకలి సమస్యను ఏకకాలంలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మా రెస్టారెంట్ భాగస్వాముల నుంచి అవసరమైన వారికి ఆహారాన్ని పునఃపంపిణీ చేయడానికి ఆర్హెచ్ఏతో భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరిస్తాం’ అని అన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు నీల్ ఘోస్ మాట్లాడుతూ..‘ఆకలిని తగ్గించే ఈ భాగస్వామ్య మిషన్ కోసం రాబిన్ హుడ్ ఆర్మీ స్విగ్గీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆకలి సమస్యను తీర్చేందుకు ఇతరులను ప్రేరేపించడం మంచి పరిణామం’ అన్నారు.స్విగ్గీ సర్వ్స్లో ఎలా చేరాలంటే..రెస్టారెంట్ భాగస్వాములు స్విగ్గీ ఓనర్ యాప్లోని ఫామ్ను పూరించడం ద్వారా ఈ స్విగ్గీ సర్వ్స్లో చేరవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి సమన్వయం కోసం ఆర్హెచ్ఏ రెస్టారెంట్ భాగస్వాములతో వాట్సప్ సమూహాల ద్వారా కమ్యునికేట్ అవుతుందని తెలిపింది. ఆర్హెచ్ఏ వాలంటీర్లు ఈ భాగస్వాముల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటారు.తలసరి 55 కిలోల ఆహారం వృథాఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 195 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో నాలుగోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు. 2024లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI)లో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా తలసరి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతరాబిన్ హుడ్ ఆర్మీరాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనేది వేలకొద్దీ యువకులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, గృహిణులు, కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా ఉన్న స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థలో వాలంటీర్లను రాబిన్స్ అని పిలుస్తారు. ఈ వాలంటీర్లు రెస్టారెంట్లు/ పెళ్లిల్లు/ ఇవత కార్యక్రమాల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేస్తారు. పదేళ్లలో RHA ప్రపంచవ్యాప్తంగా 406 నగరాల్లో 153 మిలియన్ల మందికి పైగా భోజనాన్ని అందించింది. ప్రస్తుతం 13 దేశాల్లో 2,60,000+ మంది రాబిన్స్ ఉన్నారు. -
లాభాల ‘ఆఫర్లు’.. క్యూకట్టిన ఇన్వెస్టర్లు
సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.మరింత స్పీడ్ డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది. -
2024లో స్విగ్గీ హవా.. హైదరాబాద్లో రికార్డ్ డెలివరీలు
ఫుడ్ డెలివరీ సంస్థగా మొదలైన 'స్విగ్గీ' (Swiggy) నేడు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని డెలివరీ చేస్తోంది. అత్యధిక డెలివరీలతో రికార్డ్ బ్రేక్ చేసి.. అర్ధరాత్రి వరకు కూడా కస్టమర్లను సేవలను అందిస్తూనే ఉంది. హైదరాబాద్లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంది.జూన్ 2021లో ప్రారంభమైన స్విగ్గీ.. రోజువారీ అవసరాలు, బొమ్మలు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, అలంకరణ సామాగ్రి, పండుగల సమయంలో కావాల్సిన వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ (Fast Delivery) చేస్తున్న వాటిలో పాలు, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలు, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయని స్విగ్గీ ఇన్స్టామార్ట్ సీఈఓ 'అమితేష్ ఝా' అన్నారు.హైదరాబాద్ (Hyderabad)లో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకొని డెలివరీ చేసిన ఘనత స్విగ్గీ సొంతం. అంతే కాకూండా.. నగరంలో 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్లకు స్వీకరించింది.లోదుస్తుల కోసం 18,000 కంటే ఎక్కువ ఆర్డర్లు, కండోమ్ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్లను స్విగ్గీ స్వీకరించింది. 2024లో 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది. ప్రజలు ఆర్డర్ చేసిన మ్యాగీ ప్యాకెట్లను ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 25 కిలోమీటర్ల ఎత్తు అవుతుందని సమాచారం. మొత్తం మీదీ అదీ.. ఇదీ అని తేడా లేకుండా ప్రజలకు అవసరమైన వస్తువులను డెలివరీ చేసి అందరికీ అందుబాటులో ఉంది. -
బిర్యానీ క్రేజ్ వేరే లెవల్.. 8.3 కోట్ల ఆర్డర్లు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) కొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుండడంతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘హౌ ఇండియా స్విగ్గీ ఇట్స్ వే త్రూ 2024’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు పంచుకుంది2024లో 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా బిర్యానీ(Biryani) నిలిచింది. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.2.3 కోట్ల ఆర్డర్లతో దోశ టాప్ బ్రేక్ఫాస్ట్గా నిలిచింది. 25 లక్షల మసాలా దోశ ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.డిన్నర్లోనే ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ పెట్టారు. 21.5 కోట్ల ఆర్డర్లతో లంచ్ ఆర్డర్ల కంటే డిన్నర్ సమయాల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది.అర్ధరాత్రి భోజనం చేయాలనుకునేవారికి చికెన్(Chicken) బర్గర్లు టాప్ ఛాయిస్గా నిలిచాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 18.4 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’బెంగళూరు వినియోగదారుడు పాస్తా విందు కోసం రూ.49,900 ఖర్చు చేయగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 250 ఉల్లిపాయ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.స్విగ్గీ డైనౌట్(Dineout) ద్వారా 2.2 కోట్ల మంది వినియోగదారులకు రూ.533 కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. డిస్కౌంట్లలో రూ.121 కోట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.స్విగ్గీ డెలివరీ భాగస్వాములు సమష్టిగా 1.96 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భారతదేశం చుట్టుకొలత కంటే చాలా రెట్లు ఎక్కువ. -
బిర్యానీయే బాస్!
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్తో వార్షిక నివేదికను విడుదల చేసింది.నివేదికలోని విశేషాలు ఇవీ.. ⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. ⇒ బ్రేక్ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. ⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్క్రీం చార్ట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. ⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్. ⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. ⇒ బ్రేక్ఫాస్ట్గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. ⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. ⇒ 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్నైట్ ఆర్డర్లలో టాప్లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది. ⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. -
స్వయంకృషితో ఎదిగిన టాప్ 10 కంపెనీలు
-
స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి. -
స్విగ్గీ నష్టాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 626 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2023–24) ఇదేకాలంలో రూ. 657 కోట్ల నష్టం ప్రకటించింది.మొత్తం ఆదాయం రూ. 2,763 కోట్ల నుంచి రూ. 3,601 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,507 కోట్ల నుంచి రూ. 4,310 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇటీవలే స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్ట్కావడంతో తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.కాగా.. సొంత అనుబంధ సంస్థ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రయివేట్లో రైట్స్ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 1,600 కోట్లకు మించకుండా ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు స్విగ్గీ వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లైచైన్ సర్వీసులు, పంపిణీ బిజినెస్ నిర్వహిస్తోంది. -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్స్టామార్ట్ నెట్వర్క్ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
పోటీ లేకుండా చేస్తున్న స్విగ్గీ, జొమాటో
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్ల భాగస్వాములతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరు సంస్థలు అనైతిక వ్యాపారాలకు పాల్పడినట్లు పేర్కొంది.‘తక్కువ కమీషన్ తీసుకుంటూ జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. తన ఫ్లాట్ఫామ్పై నమోదైతే, వ్యాపారాభివృద్ధికి తోడ్పాడతామంటూ స్విగ్గీ హామీలిస్తోంది. తద్వారా ఇరు సంస్థలు తమకు పోటీ లేకుండా పొటీతత్వ చట్టాలను అతిక్రమించాయి’ అని సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి. -
స్విగ్గీ ఐపీవో ‘డెలివరీ’ ఓకే
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం! ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.‘హైదరాబాద్కు చెందిన సురేష్బాబు అనే కస్టమర్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్షిప్ కార్డును వినియోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్ ఆర్డర్ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్ తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..సురేష్ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్షాట్లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
సాధారణంగా ఉద్యోగం కోసం అప్లై చేయాలంటే.. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తరుణంలో జాబ్ కోసం లెటర్స్ పంపించడం వంటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి. కానీ ఇటీవల ఓ వ్యక్తి ఉద్యోగం కోసం లెటర్ పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఏఐను ఉపయోగించి రెజ్యూమ్లు తయారు చేస్తున్న ఈ కాలంలో.. ఒక వ్యక్తి పోస్ట్ ద్వారా డిజైనర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఓ లెటర్ రాసి స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 'సప్తర్షి ప్రకాష్'కు పంపించారు. లేఖను అందుకున్న తరువాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. లెటర్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. భౌతికంగా ఒక లేఖను స్వీకరించాను. డిజిటల్ యుగంలో స్కూల్ డేస్ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఓపెనింగ్స్ లేదు. కానీ దయ చేసిన నాకు ఈమెయిల్ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్ ఓపెనింగ్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. తెలియజేయండి అంటూ స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ఉద్యోగార్ధుల సృజనాత్మకత & నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్ట్ చేయడం.. చూడటానికి రిఫ్రెష్గా ఉందని ఒకరు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Received a physical letter from a designer wanting to join @Swiggy with a concept. In a digital age, this old-school approach stood outTo the sender: We may not have a role now, but please email me—I’d love to see your idea! 😄If anyone knows of design openings, please share! pic.twitter.com/WSGDaX0fsP— Saptarshi Prakash (@saptarshipr) October 30, 2024 -
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్ఫారమ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్ఫారమ్లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
నవంబర్ 6న స్విగ్గీ ఐపీవో!
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్లో డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్ఫాం ఇన్స్టామార్ట్లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్లో టేబుల్స్ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
స్విగ్గీ కొత్త ఫీచర్: విదేశాల్లో ఉంటూనే..
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంస్విగ్గీ గురించి2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది. -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు
జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.🚨 Swiggy Also Increased Platform Fee To ₹10This Happened Right After Zomato’s HikeFood Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform FeeZomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024 -
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పన్ను?
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపురూ.2 ప్లాట్ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును ఆర్డర్కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి. -
‘సింగం ఎగేన్’ టీమ్తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్లో ఏకంగా 11,000 వడాపావ్ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్హుడ్ ఆర్మీ’ అనే ఎన్జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్తోపాటు రాబిన్హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు. -
స్విగ్గీ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. నిధుల వినియోగమిలా ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. -
ఫుడ్ డెలివరీ వేగంగా రావాలంటే?.. ఇలా చేయండి
ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్ఫామ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మొన్న బిగ్బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు
ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్బీ కుటుంబంబెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. -
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్లో ఉందా?
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్ ఆర్డర్ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్నర్లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్ చేశారు.Bengaluru is in Karnataka or Pakistan @Swiggy ?Your delivery guy is neither speaking nor understanding #kannada ,not even #English. Do you expect us to learn his state language #Hindi in our land? Stop imposing things on us and make sure your delivery persons know #Kannada. pic.twitter.com/smzQ6Mp7SV— Rekha 🌸 (@detached_98) September 12, 2024అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి : ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది -
స్విగ్గీలో ‘సీక్రెట్’ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కంపెనీ స్విగ్గీ పరిశ్రమలో తొలిసారిగా వినూత్న ఫీచర్ను పరిచయం చేసింది. ఫుడ్, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఇన్కాగ్నిటో మోడ్ ద్వారా వినియోగదార్లు ప్రైవేటుగా ఆర్డర్ చేయవచ్చు. అంటే ఆర్డర్ వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంటాయి. ఇన్కాగ్నిటో మోడ్ యాక్టివేట్ చేస్తే చాలు. యాప్ హిస్టరీలో ఆర్డర్ వివరాలు ఎక్కడా కనిపించవు. ఆర్డర్ వివరాలను మాన్యువల్గా డిలీట్ చేసే అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఆర్డర్ తాలూకు ఉత్పత్తులు డెలివరీ అయ్యాక ఏవైనా సమస్యలు ఉంటే మూడు గంటలపాటు ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్లో ఉండేలా నేరుగా మెసేజ్లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
ప్రముఖ కంపెనీ వాటా కొనుగోలు చేసిన బిగ్బీ కుటుంబం?
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసింది. అలాగే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్డియో అగర్వాల్ స్విగ్గీతో పాటు జెప్టోలో వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.స్విగ్గీ ఐపీఓ ద్వారా నిధులు సేకరిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే క్విక్ కామర్స్ బిజినెస్కు పబ్లిక్ మార్కెట్లో పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ప్రముఖులు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. తాజాగా బిగ్బీ కుటుంబానికి చెందిన కార్యాలయం స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్డియో అగర్వాల్ కూడా స్విగ్గీతో పాటు జెప్టోలోనూ వాటాను కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఈ ఆఫర్ ఓ తుఫాన్!రెవెన్యూ ఎలా అంటే..స్విగ్గీ దేశీయంగా దాదాపు 580 నగరాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. రెస్టారెంట్లు, ఆహారప్రియుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్లు తమకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. దాంతోపాటు వినియోగదారుల నుంచి ఆర్డర్లను స్వీకరించడానికి రెస్టారెంట్లుకు అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం కంపెనీ ప్లాట్ఫామ్ ఫీజు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తోంది. ఆన్లైన్ ప్రకటనల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తోంది. స్విగ్గీ కేవలం ఆన్లైన్ ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా ఇన్స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది. -
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
నిశ్చితార్థానికి జంట ‘క్రేజీ డీల్’ : వెడ్డింగ్ డీల్ కూడా మాదే అంటున్న స్విగ్గీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి ఫుడ్ను మన కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్మెంట్ సెర్మనీకి వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై మీమ్స్ ఫన్సీ కామెంట్స్ వైరల్గా మారాయి.ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్కు బదులుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్. ఫంక్షన్లో ఉన్న ఒక టేబుల్పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.ఈ కుర్రాళ్ల కంటే ఉపయోగించినట్టుగా, క్రేజీ డీల్ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకోండి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ ఒకరు, వాళ్ల యూపీఐ క్యూఆర్ పెడతారు అని ఒక కోడ్ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు పన్నీగా కమెంట్ చేశారు.no one has used our Crazy Deals better than these guys 😭😭 shaadi ka khana bhi humse mangwa lena 🥰 https://t.co/XIo2z2TnYX— Swiggy Food (@Swiggy) August 4, 2024 -
స్విగ్గీ ఇన్స్టామార్ట్ సీవోవోగా సాయిరామ్ కృష్ణమూర్తి
క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమితులయ్యారు. తమసీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సాయిరామ్ కృష్ణమూర్తిని నియమించినట్లు కంపెనీ తెలిపింది.కృష్ణమూర్తి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆపరేటింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తారని, ఇందులో డార్క్ స్టోర్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నగర వృద్ధి, విస్తరణ వంటివి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ టెక్, రిటైల్లో సాయిరామ్ కృష్ణమూర్తికి 18 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది.సాయిరామ్ కృష్ణమూర్తి గతంలో మోర్ రిటైల్లో సూపర్ మార్కెట్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడే చీఫ్ మర్చండైజింగ్ ఆఫీసర్గానూ వ్యవహరించారు. ఓలా మొబిలిటీలో ఇండియా సప్లై హెడ్గా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్లో 14 ఏళ్లు సేల్స్, మార్కెటింగ్, ఇన్నోవేషన్లలో పనిచేశారు. -
మద్యం హోమ్ డెలివరీ!.. త్వరలో ఈ రాష్ట్రాల్లో..
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్ డెలివరీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి యోచిస్తున్నారు. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతించాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ విధానంలో మద్యం డెలివరీ చేస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వంద శాతం మంది హైదరాబాద్ వాసులు మద్యం హోమ్ డెలివరీ విధానాలకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.మద్యం హోమ్ డెలివరీ అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, పెద్ద నగరాల్లో మితమైన మద్యం అందించడానికి ఉపయోగపడుతుంది. మహిళలు, సీనియర్ సిటిజన్లు మద్యం కోసం షాప్ ముందు నిలబడాల్సిన అవసరం ఉండదని ఓ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అయితే మద్యం హోమ్ డెలివరీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన ఉందని పలువురు చెబుతున్నారు. -
ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో ఆర్డర్పై రూ.5గా ఉన్న ఛార్జీని రూ.6కి పెంచారు. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. పెరిగిన రుసుమును ప్రాథమికంగా బెంగుళూరు, దిల్లీలో అమలు చేస్తామని రెండు కంపెనీలు చెప్పాయి.ఈ సంస్థలు అందించే లాయల్టీ సర్వీసుల్లో కస్టమర్ ఎన్రోల్మెంట్తో సంబంధం లేకుండా అన్ని ఫుడ్ ఆర్డర్లకు ఈ ఫీజు వర్తిస్తుందని ప్రకటించాయి. ఇది నేరుగా కంపెనీల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. ఒక్కో ఆర్డర్కు తాజాగా పెంచిన రూ.1 ప్రకారం కంపెనీకి రూ.25 లక్షల వరకు అదనపు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును ఆర్డర్కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసింది.ఇదీ చదవండి: ప్యాకేజీపై అన్ని వివరాలు ఉండాల్సిందే..ఇదిలాఉండగా, జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్, స్విగ్గీకి అనుబంధంగా ఉన్న ఇన్స్టామార్ట్ కూడా క్విక్కామర్స్ ఆన్లైన్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. కానీ, ఇవి ఎలాంటి ప్రత్యేక ప్లాట్ఫామ్ ఫీజులను వసూలు చేయడంలేదు. అయితే అదే తరహా సర్వీసులను అందిస్తున్న జొప్టో మాత్రం ఈ సంవత్సరం మార్చిలో రూ.2 ప్లాట్ఫామ్ రుసుమును ప్రవేశపెట్టింది. ఇది రోజూ దాదాపు 5,50,000 ఆర్డర్లను అందిస్తోంది. ఒక్కో ఆర్డర్కు రూ.2 చొప్పున రూ.11 లక్షల అదనపు రోజువారీ ఆదాయం పొందుతుంది. -
‘ఇంట్లో ఏం తింటాం.. బయటికెళ్దాం’.. ఆసక్తికర నివేదిక
దేశంలో ప్రజల ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఈటింగ్ అవుట్, ఫుడ్ డెలివరీలకు సంబంధించిన భారతదేశపు ఫుడ్ సర్వీస్ మార్కెట్పై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బైన్ సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.దేశపు ఆహార సేవల మార్కెట్ వచ్చే ఏడేళ్లలో ఏటా 10–12% వృద్ధి చెందుతుందని, ఇది 2030 నాటికి రూ. 9–10 లక్షల కోట్లకు చేరుతుందని స్విగ్గీ-బైన్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 5.5 లక్షల కోట్లుగా ఉందని, ఏడాది ప్రాతిపదికన ఇప్పటి వరకు ఉన్న 8–9% వృద్ధితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ మార్కెట్లో ఉన్న కస్టమర్ బేస్ ప్రస్తుతం ఉన్న 33 కోట్ల నుంచి 2030 నాటికి 45 కోట్లకు చేరుతుంది.వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీమొత్తం మార్కెట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వృద్ధి గణనీయంగా పెరిగింది. 2019-2023 మధ్య కాలంలో ఇది 8% నుంచి 12%కి పెరిగింది. ఇది 18% రెట్టింపు వార్షిక వృద్ధి రేటుతో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం ఫుడ్ సర్వీస్ మార్కెట్లో 20% ఉన్న ‘ఈటింగ్ అవుట్’ కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు వేగంగా పెరుగుతున్నాయి.స్థూల ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఈ నివేదిక ఉదహరించింది. వేగవంతమైన పట్టణీకరణ, జెనరేషన్ జెడ్ అంటే పాతికేళ్లలోపు యువత కొనుగోలు శక్తి పెరుగుదలతో సహా, బయటి ఫుడ్ తినే ప్రవృత్తి ఉన్నాయి. నెలకు సగటున ఐదుసార్లు బయట తినే భారతీయులు ఎక్కువగా బయటే తినే అమెరికా, చైనా వంటి దేశాలను అనుసరిస్తున్నారని నివేదిక పేర్కొంది. -
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్ఫామ్లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
స్విగ్గీ డెలివరీ బాయ్ కు సోనూసూద్ అండ.. మండిపడుతున్న నెటిజన్లు
-
దొంగతనం చేసిన డెలివరీ బాయ్కు సపోర్ట్.. సోనూసూద్పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్లు టాప్ ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
FASTag: పార్క్ ప్లస్తో చేతులు కలిపిన స్విగ్గీ - 10 నిమిషాల్లో ఫాస్ట్ట్యాగ్..
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్విగ్గీ ఇన్స్టామార్ట్.. పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పది నిమిషాల్లోపు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాస్ట్ట్యాగ్ను స్విగ్గీ ఇన్స్టామార్ట్.. వినియోగదారులకు అందించడానికి ఈరోజు భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ట్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ సౌలభ్యం ప్రస్తుతం 29 నగరాల్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ని నేరుగా వారి ఇంటి వద్దకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ హెడ్ 'ఫణి కిషన్' మాట్లాడుతూ.. ఫాస్ట్ట్యాగ్ని కొనుగోలు చేయడానికి బ్యాంక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తారు. అయితే కార్డు డెలివరీ అండ్ యాక్టివేషన్ కోసం 3 నుంచి 7 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫాస్ట్ట్యాగ్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుందని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అమిత్ లఖోటియా' మాట్లాడుతూ.. మా ప్రధాన లక్ష్యం కారు యజమానికి ఆనందాన్ని కలిగించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేసే వారు త్వరితగతిని డెలివరీ పొందటానికి స్విగ్గీ ఇన్స్టామార్ట్ సహకరిస్తుందని అన్నారు. -
బిజినెస్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో.. గవర్నర్ చర్చ!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో నార్త్బ్లాక్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ సీతారామన్తో సమావేశమయినట్లు మరో పోస్ట్లో ఆర్థికశాఖ పేర్కొంది. ఇవి చదవండి: బిజినెస్ - నష్టాల్లోంచి లాభాల్లోకి.. -
IRCTC తో Swiggy - ఆర్డర్ చేసుకునే విధానం..!
-
IRCTC: ట్రైన్ జర్నీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ యాప్లో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్లో అయితే ఆహారాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్ను స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. -
World Dosa Day: స్విగ్గీలో 29 మిలియన్ దోసెలు ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్కు ఇష్టమైన స్నా క్–టైమ్ డిష్గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్ చేసి.. దేశంలోనే ఛాంపియన్గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం. రంజాన్, క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్లో టాప్గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్ బాజీ నూడుల్స్ పాలక్, షెజ్వాన్ చాప్సూయ్ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు. -
ఆల్మోస్ట్ మీ డెలివరీ బాయ్ కథ ముగిసిపోయేదే: నటుడు
బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీపై విరుచుకుపడ్డాడు. త్వరగా ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆత్రమో, మరేంటో కానీ రాంగ్ రూట్లో వచ్చాడట. కొద్దిలో అతడిని ఢీ కొట్టి ప్రాణాలు తీసేవాడినే అంటూ ఎక్స్(ట్విటర్)లో మండిపడ్డాడు నటుడు. మీ డెలివరీ బాయ్స్కు రోడ్డుపై ఎలా నడుచుకోవాలో కాస్త ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చురకలంటించాడు. ట్రాఫిక్ ఏరియాలో రాంగ్ రూట్లో.. 'చిన్నగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రయాణిస్తున్నంతమాత్రాన రోడ్డుపై ఇష్టారీతిన వెళ్లకూడదు కదా.. అది కూడా ట్రాఫిక్ ఏరియాలో ఇలా రాంగ్ రూట్లో ప్రయాణించడం కరెక్ట్ కాదు. మీరు వారి ప్రాణాలను పట్టించుకుంటారా? లేదంటే కేవలం వ్యాపారానికే పరిమితమవుతారా?' అని ఆక్రోశం వెళ్లగక్కాడు. దీనిపై స్విగ్గీ యాజమన్యం స్పందించింది. తగిన చర్యలు తీసుకుంటాం! మా డెలివరీ పార్ట్నర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తారనే అనుకుంటున్నాం. మీరు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం. మీకు ఇంకా ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పండి. తగిన చర్యలు తీసుకుంటాం అని రిప్లై ఇచ్చింది. కాగా రోనిత్ ప్రస్తుతం బడే మియా చోటే మియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈద్ పండగ సందర్భంగా రిలీజ్ కానుంది. Hey Ronit, we expect our delivery partner to follow all traffic rules and have noted this to be looked into, do share any details if available for the necessary action to be taken. ^Luv — Swiggy Cares (@SwiggyCares) February 25, 2024 చదవండి: వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటాడు.. అలాంటిది..: చిరంజీవి -
రైళ్లలో ఫుడ్.. ఐఆర్సీటీసీ లేటెస్ట్ అప్డేట్
IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. “సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్ఈ ఫైలింగ్లో ఐఆర్టీసీ పేర్కొంది. -
స్విగ్గీ అకౌంట్తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్పూర్కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్ను హ్యాక్ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు. -
కత్తికట్టిన కంపెనీలు.. వందలాది ఉద్యోగులకు ఉద్వాసన!
టెక్ పరిశ్రమలో జోరుందుకున్న లేఆఫ్లు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ వంటి ఇతర పరిశ్రమలకూ విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న వందలాది మంది చిన్నపాటి ఉద్యోగులకూ ఉద్వాసన తప్పడం లేదు. కొత్త ఏడాదిలో ఇప్పటికే లేఆఫ్లను ప్రకటించిన అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సరసన ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా చేరాయి. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లేఆఫ్లు నిధుల కొరతతో సతమతమవుతున్న స్టార్టప్ రంగం కష్టాలను తెలియజేస్తున్నాయి. స్విగ్గిలో 400 మంది! ఖర్చులను తగ్గించుకుని, లాభదాయకత వైపు పయనించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ దాదాపు 350-400 మంది ఉద్యోగులను లేదా దాని వర్క్ఫోర్స్లో దాదాపు 7 శాతం మందిని తొలగించనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. స్విగ్గీలోని టెక్ టీమ్తో పాటు కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే ఉద్యోగుపైనే లేఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. లిస్టింగ్కు సిద్ధమవుతున్న స్విగ్గీలో ఇది రెండో రౌండ్ లేఆఫ్. గతేడాది జనవరిలో స్విగ్గీ 380 ఉద్యోగాలను తొలగించింది. ఫ్లిప్కార్ట్లో 1000 మంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్కార్ట్ పనితీరు ఆధారంగా 1,000 మంది ఉద్యోగులను లేదా 5 శాతం వర్క్ఫోర్స్ను వదులుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కన్నాయి. -
కస్టమర్లకు సైలెంట్ షాకిచ్చిన స్విగ్గీ!
ప్రముఖ ఫుడ్ డెలివరీ దగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. స్విగ్గీని వినియోగిస్తూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్ఫామ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. తాజాగా ఆ ఛార్జీలను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్ను బట్టి రూ.3 ప్లాట్ఫామ్ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా రూ.10 ప్లాట్ఫామ్ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్ చేసిన తర్వాత బిల్లులో ప్లాటఫామ్ ఛార్జీ రూ.10 చూపిస్తుంది. డిస్కౌంట్ ఇస్తున్నామంటూ రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా స్విగ్గీ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్లాట్ఫామ్ ఫీజుల్ని పెంచే ఉద్దేశం లేదన్నారు. కాకపోతే కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఇది కూడా ఓ భాగమేనని అన్నారు. జనవరి 1న,జొమాటో వినియోగదారుల నుంచి ప్లాట్ఫారమ్ రూ.3 నుండి రూ.4 పెంచిందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ కొత్త ఏడాది సందర్భంగా ఎంపిక చేసిన కస్టమర్లకు తాత్కాలికంగా ప్లాట్ఫారమ్ ఛార్జీలను కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్కు రూ.9 వసూలు చేసింది. స్విగ్గీ గత ఏడాది ఏప్రిల్లో ఫ్లాట్ ప్లాట్ఫారమ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించగా జొమాటో ఆగస్టు నుంచి ప్రారంభించింది. రెండు ప్లాట్ఫారమ్లు ఆర్డర్కు రూ.2 రుసుముతో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్విగ్గీ మరోమారు ప్లాట్ఫారమ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?
2024 కొత్త సంవత్సరంలో జొమాటో, స్విగ్గీ, ఓయో వంటి సంస్థలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31న ఒకే రోజు అత్యధిక ఆర్డర్స్ చేసినట్లు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జొమాటో - 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్స్ ఆ ఒక్క రోజులో పొందిన మొత్తం టిప్స్ ఏకంగా రూ. 97 లక్షలు కావడం గమనార్హం. Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯 Excited about the future! — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 స్విగ్గీ - స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలను ఆర్డర్ చేశారు. 200 ప్యాకెట్ల సింగిల్ కెచప్ను సూరత్లో డెలివరీ చేశారు. సుమారు 1.04 లక్షల మంది ప్రజలు ఫుడ్ డెలివరీ చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. గతంలో పోలిస్తే ఈ సేల్స్ చాలా ఎక్కువని చెబుతున్నారు. బిర్యానీ - న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లోనే మొత్తం 4.8 లక్షల బిర్యానీలు డెలివరీ అయ్యాయని చెబుతున్నారు. అంటే ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్స్ బిర్యానీ కోసం వచ్చినట్లు సమాచారం. ఓయో రూమ్ బుకింగ్స్ - న్యూ ఇయర్ సందర్భంగా ఫుడ్ మాత్రమే కాకుండా ఓయో రూమ్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 37 శాతం లేదా 6.2 లక్షల బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 30, 31 వ తేదీల్లో మాత్రమే 2.3 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయని, ఇందులో కూడా ఎక్కువగా అయోధ్యలో ఎక్కువగా 70 శాతం, తరువాత స్థానాల్లో గోవాలో 50 శాతం అని తెలుస్తోంది. this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n — Swiggy (@Swiggy) December 31, 2023 -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
TS: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి తమ వివరాలు కనుక్కుని మరీ సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఇదీచదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
Zomato Orders 2023: వీళ్లు తిన్న నూడిల్స్తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!
పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్ కల్చర్ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ►తన ప్లాట్ఫామ్ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. ►తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. ► మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ లవర్స్ పెట్టిన ఆ నూడిల్స్ ఆర్డర్తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. ►స్విగ్గీలో ఎక్కువగా కేక్లు ఆర్డర్ రావడంతో బెంగళూరు కేక్ కేపిటల్గా అవతరించింది. ఫుడ్ లవర్స్ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్ ఫాస్ట్ను ఆర్డర్ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్ చేసుకున్నారు. ►జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్ ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్లు పెట్టారు. నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో హైలెట్ చేసింది. బిర్యానీకి తిరుగులేదు వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్ ఎండర్ 2023 రిపోర్ట్లో తెలిపింది. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ ఇక దేశీయంగా ఉన్న ఫుడ్ లవర్స్ ప్రతి సెకండ్కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. వారిలో హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్లో ప్రతి 6వ ఆర్డర్ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్ లవర్స్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా.. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
కొత్త పిన్ కోడ్తో బిర్యానీ డెలివరీ.. సిద్దమైన బావర్చి
క్రిస్మస్, న్యూ ఇయర్లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్లో 31 అనే కొత్త పిన్ కోడ్తో అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్రామ్గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు. -
ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో లెక్కకు మించిన యాప్స్ పుట్టుకొచ్చాయి. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిక్స్ వంటివి మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కావాలంటే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని.. ఉన్న చోటుకే తెప్పించుకుంటున్నారు. యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గురుగ్రామ్కు చెందిన 'ప్రణయ్ లోయా' స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొన్ని సరకులను ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టగానే అమౌంట్ కట్ అయినప్పటికీ.. ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు స్టేటస్లో కనిపించింది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఆర్డర్ పెట్టాడు.. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందనుకున్న ప్రణయ్ లోయా ఇంటికి కొంత సమయానికే ఒక్కొక్కటిగా డెలివరీ వచ్చాయి. ఇలా ఒక్కో వస్తువు ఆరు సార్లు డెలివరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇది చూసి లోయా ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకెదురైన ఈ వింత అనుభవాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. దీనికి ఎంత ఖర్చు అయిందనే విషయం స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఇదీ చదవండి: చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ అతడు డెలివరీ చేసుకున్న వాటిలో 20 లీటర్ల పాలు, 6 కేజీల దోశ పిండి, 6 ప్యాకెట్ల ఫైనాపిల్స్ ఉన్నట్లు సమాచారం. ఇన్ని ఎక్కువ సరుకులతో నేను ఏమి చేసుకోవాలి అంటూ ఎక్స్ ఖాతలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Suddenly my phone started ringing with multiple calls from the delivery executives The customer support didn’t respond to a single query and the delivery guys came all the way bringing the orders pic.twitter.com/uiZiwyX8T3 — Praanay Loya (@pranayloya) December 14, 2023 -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్లే కేక్లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్పూర్కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్లు ఆర్డర్ చేశాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్విస్ సీఈఓ
మనం చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారుతుంది. పొదుపు చేయకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ క్రమశిక్షణతో దాన్ని నిజంగా అనుసరిస్తూ ప్రతినెల కొంత మదుపుచేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఎంతోమంది రోజువారీ సంపాదిస్తున్న కొద్దిమొత్తంలోనే ఖర్చు చేసి తోచినంత పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్భాటాలకుపోయి ఉన్నదంతా ఖర్చుచేసి నెలాఖరుకు చేతిలో డబ్బులేక తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’అని ఎడిల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకు అధినేత ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్పాండే ‘ది బార్బర్షాప్ విత్ శంతను’ పేరుతో ఒక పాడ్కాస్ట్ను నిర్వహిస్తున్నారు. ఇటీవల అందులో రాధికా గుప్తా మాట్లాడారు. యువతకు డబ్బు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ‘నెలకు రూ.50వేలు-రూ.60 వేలు సంపాదిస్తున్నవారు అందులో నెలనెలా ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది సరిపడా సంపాదించలేకపోతున్నారు. సంపాదిస్తున్న దానిలో కనీసం రూ.100 క్రమానుగత పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామని చాలామంది చెప్తారు. కానీ వారు నెట్ఫ్లిక్స్ కోసం నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్ఫాంలతోపాటు స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఆ 40 కోట్ల మంది నిత్యం చేస్తున్న ఖర్చులో కొంత మదుపు చేస్తే భవిష్యత్తులో వారి తర్వాతి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’ అని రాధికా గుప్తా అన్నారు. -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్స్లాబ్కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
ఐపీవోకి స్విగ్గీ.. ఎప్పుడంటే?
ప్రముఖ దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఐపీవోని లాంచ్ చేయనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిపుణుల సలహాలు తీసుకుంది. తాజాగా, ఐపీవోకు ఆర్ధికపరమైన సలహాలు ఇచ్చేందుకు స్విగ్గీ ఏడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఏడింటిలో కొటక్ మహీంద్రా కేపిటల్, సిటీ అండ్ జేపీ మోర్గాన్లో పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది ఉన్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే సంస్థకు సంబంధిన రాతపూర్వక డాక్యుమెంట్లను DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) స్విగ్గీ పూర్తి చేసిందని, అన్నీ సవ్యంగా జరిగి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది మార్చి నెలలో ఐపీవోకి వెళ్లనున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. 700 మిలియన్ల ఫండ్ గత ఏడాది జనవరిలో స్విగ్గీ కంపెనీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ సమయంలో సంస్థ వృద్ది కోసం నిధుల సమీకరించింది. రెండు బ్యాక్-టు-బ్యాక్ మార్కెట్ డౌన్ల తర్వాత అట్లాంటాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్కో స్విగ్గిలో చివరి సారిగా 2023 ఏప్రిల్ ముగిసే సమయానికి దాదాపు 5.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇన్వెస్కోతో పాటు బారన్ క్యాపిటల్ 7.3 బిలియన్లు ఇన్వెస్ట్ చేయగా ఆల్ఫా వేవ్ గ్లోబల్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ ప్రోసస్లు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే.. -
స్విగ్గీకి మరో షాక్.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్యక్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. గత మార్చిలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్లోకల్ ఆన్లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్లైన్ స్పేస్లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్మార్కెట్ చైన్ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్ను కార్తీక్ గురుస్వామి భారత్లో ప్రారంభించనున్నారు. కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలను కలిశారు. ఈ వెంచర్ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు. వరుస నిష్క్రమణలు స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇన్స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగాన్ని నిర్వహించే సీనియర్ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ రాఠి కూడా ఫిన్టెక్ కంపెనీ జూపిటర్లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు. -
ఏడాదిలో 42శాతం పెరిగిన కంపెనీ ఇదీ..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది. అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్కు భారత్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ప్రైజ్ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్స్టామార్ట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
జీ20 సమ్మిట్పై స్విగ్గీ ట్వీట్ ఇదే!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సమ్మిట్ నిర్విఘ్నంగా ముగిసింది. ఈ సమావేశం గురించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్విగ్గీ తన క్రియేటివిటీ ప్రదర్శించి ఒక ప్లేట్ మధ్యలో టీ కప్పు.. దాని చుట్టూ పార్లే జీ బిస్కెట్లను అమర్చి, ఆ ఫోటో ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ 'మా పార్లే-జీ సమ్మిట్కు అందరూ ఆహ్వానితులే' అంటూ వెల్లడించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ! ఈ దృశ్యం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది, వేలమంది దీనిని వీక్షించగా.. కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయని, టీతో పార్లే బిస్కెట్ తినటం మంచి అనుభూతి అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా జీ-సమ్మిట్ సమయంలో పటిష్టమైన భద్రతలలో భాగంగా డెలివరీ సంస్థలపై కూడా నిషేధం విధించారు. everyone is invited to my parle-G20 summit 🫰 pic.twitter.com/8ePiIsQAXU — Swiggy (@Swiggy) September 8, 2023 -
ఆ 3 రోజులు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న తరుణంలోకేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల విధింపు సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారని కేంద్రం వెల్లడించింది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా జీ 20 సదస్సు నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజధాని నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నగరంలో క్లౌడ్ కిచెన్, డెలివరీ సేవలకు అనుమతిని నిరాకరించారు. జొమాటో, స్విగ్గీ, అమెజాన్ అన్నీ బంద్ సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితోపాటు బ్లింకిట్, జెప్టో.. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్డీఎమ్సీ ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే.. వాటికి మినహాయింపు అయితే వీటికి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ ఉంటుందని ఆయన తెలిపారు వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 8, 9,10 తేదీల్లో ఢిల్లీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వర్క్ ఫ్రం హోమ్ సెప్టెంబర్ 8 శుక్రవారం ఓజు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయని.. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించింది. -
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. 62 బిర్యానీలు ఆర్డర్ చేసిన మహిళ
వీకెండ్లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు. దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్’(ట్విటర్) (Twitter)లో షేర్ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్-పాకిస్తాన్ మ్యాచ్కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది. స్విగ్గీ పోస్ట్ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్పై కామెంట్ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్లో భారత్ గెలిస్తే ఫుడ్ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు. కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్ నేపాల్తో తలపడనుంది. someone from bengaluru just ordered 62 units of biryanis?? who are you? where exactly are you? are you hosting a #INDvsPAK match watch-party?? can i come? — Swiggy (@Swiggy) September 2, 2023 -
స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..
ఈ రోజుల్లో హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు క్రియేటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్స్టామార్ట్కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది. పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్ చేసిన క్యారమెల్ పాప్కార్న్తో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్ చేసిన కారమెల్ పాప్కార్న్ ప్యాకెట్తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్షిప్ క్యాంపెయిన్గా స్విగ్గీ పేర్కొంది. సాహూ తన ట్విట్టర్ ఖాతాలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ నోట్తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ లెటర్లో ఒక కవితతో పాటు ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్! The weirdest #FriendshipDay campaign ever! 😀 #Swiggy sent me a bitter gourd with the caramel popcorn packets I ordered yesterday.. pic.twitter.com/dc3I9Q1ItO — Paushali Sahu 🎶 (@PaushaliSahu) August 7, 2023 -
బంపర్ ఆఫర్.. ఈ కెడ్రిట్ కార్డ్ ఉండే 10% క్యాష్బ్యాక్, ఇంకా బోలెడు బెనిఫిట్స్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ, ప్రైవేట్రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. బెనిఫిట్స్ ఇవే హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్బ్యాక్తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్బ్యాక్కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్బ్యాక్కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్మైషో ఇంకా మరెన్నో ప్లాట్ఫారమ్లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్లు 5% క్యాష్బ్యాక్ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్షిప్ను పొందగలరు. ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్షిప్లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే? -
వింత రిజిగ్నేషన్ లెటర్.. విస్తుపోతూ, నవ్వును కంట్రోల్ చేసుకోలేక..
నేటి రోజుల్లో చాలామంది వర్క్ కల్చర్లో వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. చివరికి ఉద్యోగానికి రిజైన్ చేసే విషయంలోనూ దానికి వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ అత్యంత విచిత్రమైన రీతిలో రిజిగ్నేషన్ లెటర్ రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్స్టామార్ట్లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది. ఈ పోస్టుకు 90 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.అలాగే లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఈ రిజిగ్నేషన్ లెటర్ చాలామందిని ఆకట్టుకుంది. మరికొందరు దీనిని సీరియస్గా తీసుకుంటున్నారు. రాజీనామా లాంటి సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఈ పోస్టులో చెప్పిన మాదిరిగానే తమన రిజిగ్నేషన్ను సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే.. how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq — Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023 -
ఉద్యోగులకు స్విగ్గీ మరో విడత ఎసాప్ల లిక్విడిటీ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: ఆన్–డిమాండ్ కనీ్వనియెన్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ అర్హులైన ఉద్యోగుల కోసం 50 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ. 410 కోట్లు) ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రామ్ను ప్రకటించింది. గతంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద ఇచి్చన షేర్లను కంపెనీ ఈ ప్రోగ్రాం ద్వారా బైబ్యాక్ చేయనుంది. తమ ఎసాప్స్ను సంస్థకు విక్రయించి నగదు పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు ఈ రూపంలో ఒక ఆప్షన్ ఉంటుందని స్విగ్గీ తెలిపింది. గతేడాది కొనుగోలు చేసిన డైన్అవుట్కి చెందిన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని వివరించింది. ఉద్యోగులకు సంపదను సమకూర్చే ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు స్విగ్గీ హెడ్ (హెచ్ఆర్ విభాగం) గిరీష్ మీనన్ తెలిపారు. సుమారు 2,000 మంది ఈ ప్రోగ్రాంకు అర్హత కలిగి ఉంటారని అంచనా. రెండేళ్ల ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రాం కింద.. స్విగ్గీ గతేడాది కూడా 23 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 180 కోట్లు) ఇదే తరహా ప్రక్రియ నిర్వహించింది. -
స్విగ్గీ చేతికి లింక్స్ లాజిస్టిక్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రిటైల్ పంపిణీ సంస్థ లింక్స్ లాజిస్టిక్స్ లిమిటెడ్(లింక్)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్కో సిమెంట్స్, రామ్కో ఇండస్ట్రీస్ నుంచి లింక్ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్ఫామ్ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది. మరోవైపు లింక్స్ లాజిస్టిక్స్లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్కో సిమెంట్స్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్ టెక్కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను పొందనున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా రామ్కో ఇండస్ట్రీస్ సైతం లింక్స్లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్ టెక్తో షేర్ల సబ్్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్కు చెందిన 22,35,223 సీసీపీఎస్లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్ యూనిట్గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. -
ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు..
ఒక యువకుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అది తానున్న చోటికి కాకుండా ఇంటికి చేరడంతో యువకుడి తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఓ యువకుడు ఆన్లైన్ షాపింగుకు బాగా అలవాటు పడ్డాడో ఏమో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే బాగానే చేశాడు కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడా ప్రబుద్ధుడు. దీంతో ఆ కండోమ్స్ పార్సిల్ కాస్తా తానున్న చోటికి కాకుండా తన ఇంటికి చేరింది. ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది.. Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr — elena (@elena4yo) July 4, 2023 ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది. pic.twitter.com/FGU8tUIyuV — elena (@elena4yo) July 4, 2023 ఇవ్వాళ రేపు ఏమి కొనాలన్నా అంతా ఆన్లైన్లో నడుస్తోంది మరి. మొబైల్ ఆన్ చేసి మీట నొక్కితే చాలు కాళ్ళకు భారం తగ్గి అన్నీ కళ్ల ముందుకు వచ్చి వాలుతున్నాయి. అలాగని అన్నిటినీ ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా కొన్నిటిని వెళ్లి కొనుక్కోవడమే మంచిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే.. -
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా!
Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్మేట్కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. (ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్తో పండగ చేసుకోండి!) నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్, బైజూస్లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. -
షారుక్ ఖాన్ ఇంటికి ఫ్రీ ఫుడ్.. ఇది యాపారం!
కొన్నిసార్లు ఆసక్తికర సంఘటనలు జరుగుతుంటాయి. వాటి గురించి తెలియగానే ఫస్ట్ నవ్వొస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న విషయం తెలిసిన తర్వాత మాత్రం అమ్మో పెద్ద స్కెచ్ వేశార్రోయ్ అనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఏంటి సంగతి? గత కొన్నేళ్లుగా హిట్ లేక అల్లాడిపోయిన షారుక్ ఖాన్ కి 'పఠాన్' సక్సెస్ ఎక్కడలేని జోష్ ఇచ్చింది. ఇదే ఊపులో 'జవాన్', 'డుంకీ' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. షూటింగ్ లేని టైంలో నెటిజన్స్ తో ముచ్చటిస్తూ, సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నాడు. రీసెంట్ గా అలానే 'ఆస్క్ ఎస్ఆర్కే' పేరుతో ట్విట్టర్ లో చిన్న చాట్ సెషన్ నిర్వహించాడు. (ఇదీ చదవండి: ‘పఠాన్’ కోసం షారుఖ్ ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు) ఇందులో భాగంగా ఓ అభిమాని.. షారుక్ ని 'భోజనం చేశావా భాయ్?' అని అడిగాడు. దీనికి రిప్లై ఇచ్చిన బాద్ షా.. 'ఎందుకు బ్రదర్.. నువ్వేమైనా స్విగ్గీ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తావా?' అని ఆటపట్టించాడు. దీంతో సీన్లోకి స్విగ్గీ ఎంటరైంది. వచ్చిందే ఛాన్స్ అన్నట్లు.. షారుక్ ఇంటికి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసేసింది. తమ డెలీవరీ బాయ్స్.. షారుక్ బంగ్లా 'మన్నత్' ముందు ఫుడ్ ఐటమ్స్ తో నిలబడి ఉన్న ఫొటోని షేర్ చేసింది. షారుక్ ఖాన్.. చాట్ సెషన్ లో సదరు డెలివరీ సంస్థ పేరు ఉపయోగించారు తప్పితే.. ఎక్కడా మెన్షన్ చేయలేదు. స్పేస్ లేకపోయినా సరే క్రియేట్ చేసుకోవాలి అని మాటల మాంత్రికుడు గతంలో చెప్పింది విన్నారో ఏమో కానీ.. షారుక్ కి ఫ్రీగా ఫుడ్ పంపి, తనకు తానే ప్రమోషన్ చేసుకుంది స్విగ్గీ. దీన్ని చూసిన నెటిజన్స్.. 'ఇది యాపారం' లాంటి ఫన్నీ మీమ్స్ పెడుతూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) hum swiggy wale hai aur hum dinner leke aagaye 🥰 https://t.co/iMFJcYjUVm pic.twitter.com/swKvsEZYhC — Swiggy (@Swiggy) June 12, 2023 -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
ఐపీఎల్ 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?
సాక్షి, ముంబై: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ను అలరించిన ఐపీఎల్ 2023 గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఎంస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్కే టైటిల్ను కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి కీలక విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ బిర్యానీ గెల్చుకుంది, బిర్యానీ ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ను గెలుచుకుంది అంటూ ట్విట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో బిర్యానీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా నెక్ట్స్ లెవల్ అనిపించుకున్నారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కోల్కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్లతో ఫుడ్ లీడర్ బోర్డ్లో ఆధిపత్యం బెంగుళూరు టాప్లో నిలిచింది.అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474. కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్ను క్యాష్ చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ రకరకాల ట్వీట్లతో సందడి చేసింది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. కొన్నింటిపై ట్రోల్స్ను కూడా ఎదుర్కొంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పదే పదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారబ్బా ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) మరిన్ని బిజినెస్ వార్తలు కోసం చదవండి సాక్షి బిజినెస్ -
మాకు తిరుగులేదు..ఫుడ్ డెలివరీ బిజినెస్లో అదరగొట్టేస్తున్నాం!
న్యూఢిల్లీ: స్విగ్గీ ఫుడ్ వ్యాపారం లాభాల్లోకి ప్రవేశించినట్టు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి ప్రకటించారు. కంపెనీ ఏర్పాటైన తొమ్మిదేళ్ల లోపే ఈ మైలురాయిని చేరుకున్నామని, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కేవలం కొన్ని కంపెనీల్లో స్విగ్గీ ఒకటిగా ఉన్నట్టు తెలిపారు. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల తాము బుల్లిష్గా ఉన్నట్టు బ్లాగ్పోస్ట్లో పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలానికి వృద్ధి సామర్థ్యాల పట్ల స్విగ్గీ ఎంతో ఆశావహంగా ఉందని ప్రకటించారు. ఫుడ్ డెలివరీలో ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తామన్నా రు. ‘‘ఆవిష్కరణలపై మా తీక్షణ దృష్టి, బలమైన నిర్వహణ మరో మైలురాయిని చేరుకోవడానికి తోడ్పడ్డా యి. 2023 మార్చి నాటికి స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయంగా మారింది (అన్ని వ్యయాలు కలిపి చూసుకుంటే)’’అని శ్రీహర్ష వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో సాయపడిన భాగస్వాములు అందరికీ అభినందనలు తెలిపారు. కస్టమర్లతో స్విగ్గీకి బలమైన అనుబం ధం ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమలోనే మెరుగైన రిపీట్, రిటెన్షన్ (కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు పొందడం, కస్టమర్లను నిలబెట్టుకోవడంలో) రేటు ను కలిగి ఉన్నట్టు చెప్పారు. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. స్విగ్గీతో రెస్టారెంట్ భాగస్వాముల అనుభవం కూడా మెరుగ్గా ఉందంటూ, ఇది పరస్పర విజయంగా పేర్కొన్నారు. ఆరంభంలోనే ఉన్నాం: 2014లో స్విగ్గీ ఫుడ్ డెలివరీని ప్రధాన వ్యాపారంగా మొదలు పెట్టినప్పడు, చాలా మంది దీన్ని గిట్టుబాటు కాని వ్యాపార నమూనాగా భావించినట్టు శ్రీహర్ష తెలిపారు. కానీ, ఇంత కాలం తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలైందన్నారు. ‘‘ఈటింగ్ అవుట్ (రెస్టారెంట్లతో తినడం/డైన్ అవుట్), ఫుడ్ డెలివరీ వ్యాపారం భారత్లో ఇంకా ఆరంభ దశలోనే ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే రెండు దశాబ్దాల పాటు వృద్ధి పట్ల ఆశాభావంతో ఉన్నాం. ఫుడ్ డెలివరీ మరింత వృద్ధి చెందేందుకు బాధ్యతాయుత, కావాల్సిన చర్యలు చేపడతాం. దేశంలో ఇంకా సేవలు అందని ప్రాంతాలు, వినియోగ వర్గాలు చాలానే ఉన్నాయి. సరైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించడమే మా లక్ష్యం’’అని శ్రీహర్ష తెలిపారు. క్విక్కామర్స్ వ్యాపారం విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ నేడు క్విక్ కామర్స్లో ప్రముఖ సంస్థగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. ఇన్స్టామార్ట్ను లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మంచి పురోగతి సాధించామని, వచ్చే కొన్ని వారాల్లో తటస్థ స్థితికి చేరుకుంటామన్నారు. డైన్ అవుట్ విభాగంలోనూ తాము లీడర్గా ఉన్నట్టు చెప్పారు. 34 పట్టణాల్లో తమకు 21,000 రెస్టారెంట్ భాగస్వాములు ఉన్నట్టు తెలిపారు. -
స్విగ్గీ జొమాటోలకు మరో షాక్:‘ వాయు’ వేగంతో వచ్చేసింది!
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థలకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన, తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్లైన్ ప్లాట్ఫారమ్ను లాంచ్ చేశాయి. వాయు (Waayu) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, బిజినెస్మేన్ సునీల్ శెట్టి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని ప్రారంభించారు. ఈ యాప్లో అతనికి వాటా కూడా ఉంది. అంతేకాదు ఓఎన్డీసీతో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది. ఫుడ్ డెలివరీకి బిజినెస్కు ఫుల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఇతర అగ్రిగేటర్లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్,పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్పడుతుందని అంచనా. (ఇదీ చదవండి: పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!) టెక్ ఫౌండర్స్ అనిరుధ కోట్గిరే, మందార్ లాండే స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్ట్స్లో వాయు యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్వేర్ యాజ్ఏ సర్వీస్ (SaaS) అనే ప్లాట్ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తిమహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్లతో ఇతర ముంబై రెస్టారెంట్లతో కస్టమర్లను కనెక్ట్ చేస్తుంది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) కానీ ఒక్కో అవుట్లెట్కు నెలకు రూ. 1,000 ప్రారంభ ధరతో నిర్ణీత రుసుము. తరువాత ఇది రూ. రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ యాప్లో ప్రస్తుతం 1,000కి పైగా రెస్టారెంట్ లిస్టింగ్లు ఉన్నాయి. ముంబై మరియు పూణేలో వచ్చే మూడు నెలల్లో 10,000కి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని ఇతర మెట్రో , నాన్-మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది. ఈ వాయు యాప్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. కమీషన్-రహిత మోడల్ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని ఫౌండర్ అనిరుధ కోట్గిరే చెప్పారు. అంతేకాదు సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ, డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో ఉంటుందనీ తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని అనిరుధ తెలిపారు. What a Entry ❤️❤️ Super Cool and Handsome Brand Ambassador @SunielVShetty Sir at the Waayu App launch...❤️❤️@WAAYU_App#sunielshetty #waayu #waayuapp pic.twitter.com/KeNULJBjAI — Suniel Shetty FC (@SunielShetty_FC) May 10, 2023 సునీల్ శెట్టి ఏమన్నారంటే చాలా కాలంగా రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలో భాగస్వామిగా వాయు యాప్ ఒక గొప్ప అవకాశంగా భావించానని, అలాగే హోటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ప్రావీణ్యం సంపాదించానని శెట్టి చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్లు వసూలు చేసే అధిక కమీషన్లు రెస్టారెంట్లు, కస్టమర్లను ప్రభావితం చేస్తున్నాయని, దీనికి పరిష్కారాని టైం వచ్చిందన్నారు. అలాగే రెస్టారెంట్లు వారి స్వంత డెలివరీ భాగస్వాములను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నామనీ, డబ్బావాలాలు (ముంబై) డెలివరీ భాగస్వాములుగా రావాలనేది తన కల అని శెట్టి చెప్పారు. (‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు) వాయు యాప్ను ఎలా వాడాలి? ♦ఇందులో యాప్లో రెండు వెర్షన్లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్ల కోసం వాయు డెలివరీ పార్టనర్, కస్టమర్ల కోసం వాయు యాప్ వినియోగించుకోవచ్చు. ♦ గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ‘వాయు’ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా వెబ్సైట్ కూడా ఉంది. ♦ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్తో సైన్ ఇన్, లాగిన్ చేయాలి. ♦ లొకేషన్ ఎంటర్ చేసి,యాక్సెస్కు అంగీకరించాలి ♦ మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనూల బ్రౌజ్ చేయండి. ♦ ఆర్డర్ చేయాలనుకుంటున్న వంటకాలను ఎంచుకుని, కార్ట్కు జోడించాలి. ♦ ఆర్డర్ని మరోసారి చెక్ చేసుకుని, చెక్అవుట్ పై క్లిక్ చేయాలి. ♦ ఆర్డర్ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు ♦ వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో లేదా క్యాష్ ఆన్ డెలివరీయా సెలెక్ట్ చేసుకోవాలి ♦ అందుబాటులో ఉంటే మీరు ఏవైనా కూపన్ కోడ్లు లేదా డిస్కౌంట్లను కూడా వాడుకోవచ్చు ♦ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక రెస్టారెంట్ నుండి నిర్ధారణ మెసేజ్ వస్తుంది. ♦ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ను ట్రాక్ చేయవచ్చు కూడా ♦ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి. మీ అనుభవం ఆధారంగా రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వొచ్చు. -
ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!
సాక్షి,ముంబై: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోకు పోటీగా ప్రభుత్వ సంస్థ దూసుకుపోతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీ సహా 240 నగరాల్లో తన సేవల్లో దూసుకుపోతోంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకుల రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటేసింది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్క్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది ఏప్రిల్లో కేంద్రం ప్రారంభించింది. ఓఎన్డీసీ ప్రత్యేకత ఏంటి? వాణిజ్య మంత్రిత్వ శాఖకు కెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ప్రవేశపెట్టిన ఓపెన్ ఇ-కామర్స్ ప్రోటోకాల్. థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నెట్వర్క్లోని క్రయ విక్రయ దారులు చేసుకోవచ్చు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం, ఓఎన్డీసీ చిన్న రిటైల్ సంస్థలు పెద్ద టెక్-ఆధారిత ఇ-కామర్స్ కంపెనీల దాడిని తట్టుకుని నిలబడేలా సహాయం చేస్తుంది. అలాగే పేమెంట్ సిస్టంలో సంచలనాలకు యూపీఐ ఎలా ఉపయోగపడిందో ఇ-కామర్స్ రంగంలో ఇది పెను మార్పులకు దారితీయనుంది. కొనుగోలుదారులు వివిధ బ్రాండ్లు, లోకల్ వ్యాపారవేత్తలనుంచి విస్తృత ఉత్పత్తులను సెర్చ్ చేయవచ్చు. కొనుగోలు చేయవచ్చు. ఆహారం, పానీయాలు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హోం డెకరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్తో సహా పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పేటీఎం మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్స్విల్లా మేజిక్ పిన్, పిన్కోడ్, లాంటి ఇతర ఆన్లైన్ స్టోర్లనుండి కూడా కస్టమర్లు ONDC ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్ఫారమ్కు ప్రస్తుతం అంతర్గత డెలివరీ భాగస్వాములు లేరు. eKart, Dunzo, Delhivery మొదలైన థర్డ్ పార్టీల ద్వారా డెలివరీ చేస్తుంది. సోషల్మీడియాలో కస్టమర్ల పోస్ట్లు చక్కర్లు స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఓఎన్డీసీ 3 శాతం కమీషన్ను వసూలు చేస్తుంది. స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్లు 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఓఎన్డీసీని ఎంచుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓఎన్డీసీ ఫుడ్ ఆర్డర్ల ధరలను పోల్చుతూ అనేక పోస్ట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్ట్లలో చాలా వరకు, ఫుడ్ డెలివరీ యాప్లతో పోలిస్తే, తక్కువకే, కొన్ని సందర్భాల్లో సగం రేటుకే లభిస్తోందంటూ యూజర్లు సంబర పడుతున్నారు. సేమ్ ఆర్డర్, సేమ్ ప్లేస్, సేమ్ టైం అంటూ ధరలను కంపేర్ చేస్తుండటం గమనార్హం. ఇది లాభాపేక్ష లేని ప్లాట్ఫారమ్ అని మధ్యవర్తి లేకపోవడం దీనికి పెద్ద ఎసెట్ అని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఓఎన్డీసీ సలహా మండలి సభ్యుడు నందన్ నీలేకని గతం లోనే ప్రకటించారు. నేరుగా విక్రేతకు చెల్లించడం గొప్పవిషయం, యాప్ కమీషన్ లేకపోవడంతో తక్కువ చార్జీలతో కస్టమర్ల ఆదరణ లభస్తుందన్నారు. There are over 29,000+ Merchants from 236 Cities in India on ONDC Seller Network Currently You can search for the Listed Merchants & City here - https://t.co/xelXMQJYTx pic.twitter.com/dZ6JJt4LNq — Ravisutanjani (@Ravisutanjani) May 8, 2023 Now you know the ONDC impact! Same order, same place and same time. The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB — Ankit Prakash (@ankitpr89) May 4, 2023 A very interesting find. Same pizza store but one is 20% cheaper. ONDC 👇 Zomato 👇 pic.twitter.com/pWWPjvHJFt — Udit Goenka (@iuditg) May 3, 2023 -
స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడే తెలుసుకోండి..!
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ టైఅప్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని.. దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ద్వారా రిలయన్స్ జనరల్ అందించనుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద ఔట్ పేషెంట్ చికిత్సలతోపాటు.. ఆస్పత్రిలో చేరినప్పుడు, మేటర్నిటీ కవరేజీ తదితర ప్రయోజనాలు ఈ ప్లాన్లో ఉన్నాయి. ప్రమాద మరణం ఏర్పడితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. లేదా శాశ్వత వైకల్యం పాలైనా పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యం కలిగితే ఆ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రమాదం కారణంగా మొబైల్ ఫోన్ దెబ్బతింటే రూ.5,000 పరిహారం లభిస్తుంది. రూ.31 కోట్ల చెల్లింపులు 2022–23 సంవత్సరంలో స్విగ్గీ తన డెలివరీ భాగస్వాములకు రూ.31 కోట్ల బీమా క్లెయిమ్ల చెల్లింపులకు సాయం అందించినట్టు ప్రకటించింది. 2015 నుంచి స్విగ్గీ తన డెలివరీ ఏజెంట్లకు బీమా కవరేజీ అందిస్తోంది. -
స్విగ్గీలో కొత్త చార్జీలు.. ప్రతి ఆర్డర్పైనా అదనంగా..
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్కు అదనంగా రూ. 2 'ప్లాట్ఫామ్ ఫీజు' పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే ఈ చార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. క్విక్-కామర్స్, ఇన్స్టామార్ట్ ఆర్డర్లపై ఈ చార్జీలను ఇంకా విధించడం లేదు. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు! మరోవైపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో స్విగ్గీ ఈ ఛార్జీలను ఇంకా ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. గత వారంలో దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ చార్జీలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. రూ. 2 తక్కువగానే అనిపించినా స్విగ్గీ ప్రతిరోజు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అంటే భారీ మొత్తంలోనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి తగినంత భారీ కార్పస్ను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! డెలివరీ వ్యాపారం మందగించడమే ఈ కొత్త చార్జీలు వసూలుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక అనిశ్ఛిత పరిస్థితులకు కంపెనీ మినహాయింపు కాదు అని 380 ఉద్యోగాల తొలగింపు సందర్భంగా స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. కాగా మరో ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ఇంకా ఎలాంటి ప్లాట్ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాల పరంగా చూస్తే జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్లతో పోలిస్తే స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లుగా ఉంది. -
Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్లు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు. గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్ ద్వారానే ఇంత ఫుడ్ లాగించేస్తే.. మిగతా యాప్లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. హలీమ్కు గులామ్.. రంజాన్ మాసంలో ఎప్పటిలాగే హలీమ్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్లను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా బిర్యానీకి క్రేజ్ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్ వంటి హలీమ్లు అమ్ముడయ్యాయి. మరిన్ని వంటకాలకూ డిమాండ్ రంజాన్ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్ పెరిగింది. ఈ స్పెషల్ ఐటమ్స్కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. రుచులకు చిరునామాలివీ.. హైదరాబాద్లో బిర్యానీ, హలీమ్ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్ప్లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
హైదరాబాదీ రికార్డు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారాల్లో ఇడ్లీకున్న క్రేజే వేరు. ఆ క్రేజే ఓ రికార్డును సృష్టించింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఈ రికార్డు సృష్టించినట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఆయన ఇడ్లీపై తన ఇష్టాన్ని ఓ రేంజ్లో చూపించాడు. గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడు. తన కోసం, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం.. ఏడాది మొత్తంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. తాను ప్రయాణించిన వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన ఇడ్లీ జపమే చేసినట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. ఇడ్లీ క్రేజ్కు సంబంధించిన ఇలాంటి విశేషాలెన్నో స్విగ్గీ వివరించింది. ఇటీవల ప్రపంచ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీ ఆర్డర్లపై నిర్వహించిన అధ్యయనంతో ఓ నివేదికను సంస్థ విడుదల చేసింది. చాలాచోట్ల డిన్నర్గా కూడా.. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను పంపిణీ చేసినట్టు నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో ఈ వంటకానికి ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్కు ఇది సూచికగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక ఇడ్లీలను ఆర్డర్ చేసిన మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. కొల్కొతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వాసులు డిన్నర్గానూ ఇడ్లీని ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. కారం, నెయ్యి ఇడ్లీకి హైదరాబాద్ జై బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడుతుండగా.. హైదరాబాదీలు కారం పొడి, నెయ్యితో కూడిన ఇడ్లీని ఇష్టపడుతున్నారని తేలింది. ఇక ముంబయి వాసులు ఇడ్లీ..వడ కాంబినేషన్కు జై కొడుతున్నారు. అయితే అల్పాహారాల ఆర్డర్స్లో మసాలా దోశ ఫస్ట్ ప్లేస్లో నిలవగా ఇడ్లీ రెండోస్థానంలో ఉంది. -
Hyderabad: లిఫ్ట్ విషయంలో గొడవ.. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ శాంతకుమార్ గచ్చిబౌలిలోని ఎన్సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్ సర్వీస్ లిఫ్ట్లో వెళ్లానని చెప్పగా, లేదు నువ్వు మెయిన్ లిఫ్ట్లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం! -
యూజర్లకు స్విగ్గీ షాక్.. పాస్వర్డ్ షేరింగ్ కుదరదు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యాజర్లకు షాక్ ఇచ్చింది. స్విగ్గీ వన్ పేరుతో తీసుకొచ్చిన మెంబర్షిప్ ప్రోగ్రామ్కు గరిష్టంగా రెండు ఫోన్లలో మాత్రమే లాగిన్ అయ్యేలా పరిమితి విధించింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కూడా ఇదివరకే ఇలాంటి పాస్వర్డ్ షేరింగ్ పరిమితిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాస్వర్డ్ షేరింగ్ ద్వారా యూజర్లు తగ్గిపోవడమే కాకుండా తమ ఆదాయానికి కూడా గండి పడుతుండటంతో స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ చేసిన మార్పులపై స్విగ్గి తమ యూజర్లందరికీ ఈ-మెయిల్స్ పంపించింది. దీని ప్రకారం స్విగ్గీ వన్ కస్టమర్లు ఒకే అకౌంట్ను రెండు కంటే ఎక్కువ ఫోన్లలో వినియోగించలేరు. స్విగ్గీ వన్ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉద్దేశించిందని, తాజాగా తీసుకొచ్చిన పరిమితితో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ మెంబర్షిప్ ప్లాన్ కోసం కస్టమర్ల నుంచి నెలకు రూ.75లను స్విగ్గీ తీసుకుంటోంది. అదే మూడు నెలలకు అయితే రూ.299, సంవత్సరానికైతే రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!) -
స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు
సాక్షి,ముంబై: ప్రముఖ ఫుడ్ డెలీవరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులపై వేటుకు నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్నిర్మాణం, అంచనాలతో పోలిస్తే తక్కువ వృద్ధి రేటు తదితర కారణాలతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. లాభదాయకత,లక్ష్యాలను చేరుకోనే క్రమంలో మొత్తం పరోక్ష ఖర్చులను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని కంపెనీ సీఈవో శ్రీహర్ష మెజెటీ శుక్రవారం ఉద్యోగులకు అందించిన ఈమెయిల్ సందేశంలో చెప్పారు. 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అందుబాటులో ఉన్నఅన్ని ఎంపికలను అన్వేషించిన తర్వాత ఇంత కష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఈవో తెలిపారు. ప్రొడక్ట్, ఇంజినీరింగ్, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు ఎక్కువు ప్రభావితమైనట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే మీట్ మార్కెట్ను మూసివేయనుంది. అయితే ఇన్స్టామార్ట్ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే హైరింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశాననీ, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందని శ్రీహర్ష వెల్లడించారు. ప్రభావితమైన ఉద్యోగులు అందరికీ మూడు నెలల కనీస హామీ చెల్లింపు, పదవీకాలం, గ్రేడ్ ఆధారంగా 3-6 నెలల నగదు చెల్లింపు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే మూడు నెలల పాటు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్, పునరావాస ఖర్చులు రీయింబర్స్ చేస్తామనీ, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే పనిలో సహాయపడటానికి వారికి కేటాయించిన పని ల్యాప్టాప్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఐపీఓకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు..
దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సంచలనం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్విగ్గీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం పొందాలనుకునే డెలివరీ బాయ్స్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం లేదా ఎస్ఓఎస్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. చదవండి👉 కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు స్విగ్గీ డెలివరీ బాయ్, లేదంటే వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యం లభిస్తుందని స్విగ్గీ తెలిపింది. ఈ సౌకర్యం పొందేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, కేవలం పార్టనర్ ఐడీని చెబితే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. అంతేకాదు స్విగ్గీ అందిస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీతో మా యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ, వారి జీవిత భాగస్వాములు, ఇద్దరు పిల్లలుకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. ఖర్చులో సబ్సిడీ కల్పిస్తాం’ అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అంబులెన్స్ సౌకర్యాన్ని దేశ వ్యాప్తంగా బెంగళూరు, ఢిల్లీ,ఎన్సీఆర్,హైదరాబాద్, ముంబై,పూణే, కోల్కత ప్రాంతాల్లో యాక్టీవ్ డెలివరీ బాయ్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసలు బాటు కల్పించింది. ఇందుకోసం అంబులెన్స్ సర్వీసులు అందించే సంస్థలతో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
పెంపుడు కుక్క దాడి ఘటనలో స్విగ్గీ బాయ్ మృతి
-
స్విగ్గీకి పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టాఫ్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
HYD: నయా సాల్ ధమాకా.. చుక్క-ముక్క దుమ్మురేపాయి
ఢిల్లీ/హైదరాబాద్: నయా సాల్కి రోడ్లపై హడావిడి తక్కువగా కనిపించింది. వేడుకలపై పోలీస్ ఆంక్షలు అందుకు ఒక కారణం. అయితే.. ముక్క, మందుతో గప్చుప్ మజాలో రాష్ట్ర ప్రజలు ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది కంటే అదనంగా ఆల్కాహాల్ బిజినెస్ జరగడం గమనార్హం. కోవిడ్ ఆంక్షలు ఏమాత్రం లేకపోవడం, అమ్మకాలకు అదనపు సమయం ఇవ్వడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్లలో ఎక్కువమందిలో.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 500 ఎంజీ మించి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. ఈ లెక్క నగరంలోని మద్యం బాబులు జనవరి 1 పార్టీ పేరుతో తాగేసింది. రాష్ట్ర ఎక్సైజ్శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన మద్యం డిపోల నుంచి రూ.215.74 కోట్ల విలువైన మద్యం సరఫరా అయ్యింది. చివరి వారం మొత్తంగా రూ.1,111.29 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.మద్యం దుకాణాలకు.. రెండు లక్షలకు పైగా కేసుల లిక్కర్, లక్షా 30 వేల దాకా బీర్ల కేసులు వెళ్లాయి. గతేడాది అదే తేదీన రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. అంటే.. రూ.43 కోట్లు అదనంగా ఆల్కాహాల్ సేల్ జరిగిందన్నమాట. అలాగే.. గతేడాది చివరి వారంలో రూ.925 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే.. రూ.185 కోట్లు అదనంగా అన్నమాట. ఇక.. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో నమోదయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యధికంగా 40,655 లిక్కర్ కేసులు, 21,122 కేసుల బీర్లతో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బిర్యానీ హవా కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలో అత్యధికంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీ హవా స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల దాకా.. ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గీ ప్రకటించుకుంది. అదే సమయంలో.. 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకే ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించుకుంది. లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్లోని ఓ పాపులర్ రెస్టారెంట్ ఏకంగా.. 15వేల కేజీల బిర్యానీని సర్వ్ చేయడం గమనార్హం. -
నయా సాల్ జోష్.. 3.50 లక్షల బిర్యానీలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను జనం బిర్యానీ, పిజ్జాలతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ, 2.5 లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసినట్లు చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ వెల్లడించింది. ట్విట్టర్లో తాము నిర్వహించిన ఓ సర్వేలో 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీ, 14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 శాతం మంది కోల్కతా బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలిందని వివరించింది. హైదరాబాద్లో బావార్చీ హోటల్ పసందైన బిర్యానీకి పేరొందిన హోటల్. కొత్త సంవత్సరం డిమాండ్ను తట్టుకోవడానికి శనివారం ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావార్చీ హోటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 7 గంటల కల్లా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను కస్టమర్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ ఇన్స్టామార్ట్ పేర్కొంది. అలాగే 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను కస్టమర్లకు చేరవేశామని తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12,344 మంది వినియోగదారులు కిచిడీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేయడం మరో విశేషం. -
జొమాటో షాకింగ్ రిపోర్ట్: రూ.28 లక్షల పుడ్ ఆర్డర్ చేసిన ఏకైక కస్టమర్!
కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తమ వార్షిక నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. ఈ యాప్లో కూడా ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ వ్యక్తి 3000 ఫుడ్ ఆర్డర్లను ఇచ్చినట్టు పేర్కొంది.ఇదే కాక మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటో వాటిపై ఓ లుక్కేద్దాం! నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఢిల్లీకి చెందిన ఓ యూజర్ యాప్ ద్వారా 3300 ఆర్డర్లు చేయగా, మరో యూజర్ యాప్ ద్వారా 1,098 కేక్లను ఆర్డర్ చేశారట. అంతే కాదు, 2022లో మరో కస్టమర్ రూ. 6.96 లక్షల విలువైన తగ్గింపులను పొందగలిగారని కంపెనీ వెల్లడించింది. జొమాటో తమ కస్టమర్లు ఈ సంవత్సరం విలాసవంతంగా ఖర్చు చేశారని, అందులో ఒకరు ఒకే ఆర్డర్లో రూ. 25,000 కంటే ఎక్కువ విలువైన పిజ్జాలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. ఓ పూణే నివాసి ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా పుడ్ కోసం రూ. 28 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఆర్డర్ల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా యాప్లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ వెల్లడిస్తూ, 2022లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా జొమోటో బిర్యానీకి పట్టం కట్టింది. ఈ కంపెనీ ప్రత్యర్థి ప్లాట్ఫారమ్ స్విగ్గి విషయంలో కూడా అలాగే ఉంది. నివేదిక ప్రకారం, బిర్యానీ తర్వాత మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ ఉన్నాయి. చదవండి: సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్ క్లబ్ నుంచి 22 అవుట్! -
Hyderabad: భాగ్యనగర వాసులు చికెన్ లవర్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసులు చికెన్ లవర్స్ అని మరోసారి నిరూపించారు. ఈ విషయంలో గ్రీన్సిటీ బెంగళూరు తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ సిటీ రెండోస్థానంలో నిలిచింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. 2022 తాజా ఆహార ట్రెండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. చికెన్ వెరైటీ ఆర్డర్లు చేసే వారిలో చెన్నై మూడో స్థానంలో నిలిచిందట. ఆ తర్వాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, పుణె, కోయంబత్తూర్ నిలిచినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఫుడ్ ఆర్డర్ల ట్రెండ్ను పరిశీలిస్తే.. చికెన్ ఆర్డర్లు ఈ ఏడాది సుమారు 29.86 లక్షల మేర ఉండడం విశేషం. నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వెల్లువెత్తుతున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు స్విగ్గీలో భాగస్వాములైనట్లు పేర్కొంది. వీటికి భలే డిమాండ్.. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో ఫుడ్ ఆర్డర్ల ట్రెండ్ను పరిశీలిస్తే.. పలు నోరూరించే ఆహార పదార్థాలకు గిరాకీ బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా చికెన్ బిర్యానీ, మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్బిర్యానీ, తందూరీ చికెన్లు అగ్రభాగంలో నిలిచాయి. విదేశీ వంటకాల్లో.. మెట్రో నగరవాసుల జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరిచిన విదేశీ వంటకాల్లో ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్ అండ్ సుషి వంటకాలున్నాయి. వాహ్.. స్నాక్స్.. వినియోగదారుల మనసు దోచుకున్న స్నాక్స్లో సమోసా, పాప్కార్న్, పావ్భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్స్టిక్స్, హాట్వింగ్స్, టాకో, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్లున్నాయి. నోరూరించే డెజర్ట్లివే... స్విగ్గీ ఆర్డర్లలో అగ్రభాగాన ఉన్న ఐస్క్రీమ్/ మిఠాయిలలో గులాబ్ జామూన్, రస్మలాయ్, చాకోలావా కేక్, రస్గుల్లా, చాకోచిప్స్ ఐస్క్రీమ్, అల్పా న్సో మ్యాంగో ఐస్క్రీమ్, కాజూకాటిల్, టెండర్ కోకోనట్ ఐస్క్రీమ్, హాట్ చాక్లెట్ ఫడ్జ్లున్నాయి. -
ఆ మూడు సంస్థల ఉద్యోగులకు భారీ షాక్, త్వరలోనే తొలగింపు
ఆర్ధిక మాద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు కాస్ట్ కటింగ్ రూల్ను ఫాలో అవుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 20వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయగా..అడోబ్ సైతం మరో 100 మందిని ఇంటికి సాగనంపనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్విగ్గీ, ఎడ్యూటెక్ కంపెనీ వేదాంతులు’ వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఈ డిసెంబర్ నెలలో 250మంది తొలగించనున్నట్లు సమాచారం. దీంతో పాటు రానున్న నెలల్లో స్విగ్గీకి చెందిన ఫుడ్ గ్రాసరీకి చెందిన వందల మందిపై వేటు వేసే ప్రణాళికల్లో ఉండగా..ఈ తొలగింపులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ పనితీరు ఆధారంగా ఉద్యోగుల్ని ఉంచాలా? తొలగించాలా? అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం చెబుతుంది. సంస్థకు అనుగుణంగా విధుల నిర్వర్తించలేని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అందించింది. ఖర్చుల్ని ఆదా చేసేందుకు కంపెనీ తన ఇన్స్టామార్ట్ ఉద్యోగుల్ని సైతం ఉద్యోగం నుంచి తొలగించనుంది. అదేవిధంగా ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు 385 మంది ఉద్యోగులను తొలగించింది . కంపెనీ తన వర్క్ ఫోర్స్ను 11.6 శాతం తగ్గించినట్లు నివేదించింది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది వేదాంతు దాదాపు 1100 మందికి పింక్ స్లిప్ జారీ చేయగా..ప్రస్తుతం ఈ ఎడ్యుటెక్ కంపెనీలో 3,300 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం,అడోబ్ ఖర్చులను తగ్గించుకోవడానికి సేల్స్ విభాగంలో 100 మందిని తొలగించనున్నట్లు సమాచారం.అడోబ్ ‘కొంతమంది ఉద్యోగులను ఆయా డిపార్ట్మెంట్లకు మార్చింది. విధులకు అవసరమైన వారిని నియమించుటుంది. అవసరానికి మించి ఉన్న వారిని తొలగిస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. -
వణికిస్తున్న ఆర్ధిక మాంద్యం..మరో బిజినెస్ను మూసేసిన స్విగ్గీ
జనాలా చేత డబ్బులు ఖర్చు పెట్టిచ్చే బిజినెస్ చేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ..రెసిషన్ ముంచుకొస్తోంది. డబ్బులు ఆదా చేసుకోండని సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ బెజోస్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే? ఆయన చేసేది కూడా వ్యాపారమే. కానీ వ్యాపార వేత్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్ధిక మాంద్యం దెబ్బకు క్లౌడ్ కిచెన్ బ్రాండ్ ది బౌల్ కంపెనీని షట్ డౌన్ చేసింది.ఎందుకంటే? ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా తన మేజర్ బిజినెస్ ఫుడ్ అండ్ గ్రాసరీ విభాగంలో నష్టాలు పెరుగుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకంటూ, ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకక తప్పలేదని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్విగ్గీ మాత్రం క్లౌడ్ కిచెన్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఊహించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు.కాబట్టే ఢిల్లీ - ఎన్సీఆర్లలో మాత్రమే ఈ బిజినెస్ను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ది బౌల్ కంపెనీని పెట్టుబడులు పెట్టడం,అభివృద్ధి చేయడాన్ని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. బౌల్ కంపెనీతో పాటు, స్విగ్గి బ్రేక్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హోమ్లీ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. ఈ విభాగాల్లో స్విగ్గీ గణనీయమైన లాభాల్ని గడిస్తున్నట్లు తేలింది. గత వారం, కంపెనీలో 33 శాతం వాటాను కలిగి ఉన్న స్విగ్గీ ఇన్వెస్టర్ ‘ప్రోసస్’ 2022 మొదటి 6 నెలల కాలంలో అమ్మకాలు, గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) పరంగా సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పింది. ప్రోసస్ నివేదిక ప్రకారం.. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారం 38 శాతం, జీఎంవీ విలువ 40 శాతం పెరిగింది. క్లౌడ్ కిచెన్ అంటే బ్యాచిలర్లు, కాలేజీ స్టూడెండ్స్, వ్యాపారాలతో తీరికలేని వాళ్లు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్..లాంటి యాప్స్లో ఆర్డర్ పెట్టుకొని నచ్చిన రుచులను ఇంటికే తెప్పించుకుని ఆరగిస్తుంటారు. ఫుడ్ బాగుంటే ప్రతి సారి ఆ హోటల్ నుంచి తెప్పించుకొని తినడమే, లేదంటే వీలైనప్పుడు నేరుగా వెళ్లి తిని వస్తుంటారు. కానీ ఈ క్లౌడ్ కిచెన్ విభాగంలో అలా తినేందుకు వీలుపడదు. పైన మనం చెప్పుకున్నట్లుగా స్విగ్గీ ది బౌల్లాంటి క్లౌడ్ కిచెన్ సంస్థలు దేశంలోని ఆయా ప్రాంతాల్లో వంట చేసేలా పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్లూ, ఫ్రిజ్లూ, ఓవెన్లూ, స్టోర్ రూమ్లూ, వంటసామానూ ఇలా అన్నీ అందుబాటులో ఉండేలా ఈ క్లౌడ్ కిచెన్లను అద్దెకు తీసుకుంటాయి. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ను అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తుంటాయి. దీన్నే క్లౌడ్ కిచెన్ అంటారు. ఒక్క ముక్కలో చెప్పలాంటే మీకు కావాల్సిన ఆహార పదార్ధాలన్నీ దొరుకుతాయి. కానీ రెస్టారెంట్ల తరహాలో కూర్చొని తినేందుకు వీలుండదు. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో ఫుడ్ డెలివరీ బిజినెస్ను షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయా ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో తరహాలో లాభాలు గడించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. 2020 కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో ఇతర నిత్యావసరాల కోసం షాపింగ్ చేయడంతో పాటు అమెజాన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని కస్టమర్లు భావించారు. దీంతో వినియోగదారుల డిమాండ్ మేరకు అమెజాన్ సంస్థ భారత్లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి ‘అమెజాన్ ఫుడ్’ సర్వీసుల్ని ప్రారంభించింది. తొలత ఈ అమెజాన్ ఫుడ్ సేవలు బెంగళూరు కేంద్రంగా ప్రారంభయ్యాయి. అయితే ఇప్పుడు ఆ సేవల్ని అమెజాన్ నిలిపి వేస్తున్నట్లు టెక్ క్రంచ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 29వరకు అమెజాన్ ఒప్పొందం చేసుకున్న రెస్టారెంట్లతో భాగస్వామ్యం కొనసాగించనుంది. అప్పటి వరకు అమెజాన్ ఫుడ్లో బుక్ చేసుకున్న ఆర్డర్లను అందిస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. అమెజాన్ అకాడమీ షట్డౌన్ మరోవైపు భారత్లో ఖర్చుల్ని తగ్గించేందుకు ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తొలగించడం, ఏ మాత్రం లాభసాటి లేని లాభాల్ని మూసేయాలని అమెజాన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొద్దిరోజుల క్రితం అమెజాన్ అకాడమినీ షట్డౌన్ చేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఊపందుకుంది.దీంతో దేశానికి చెందిన పలు స్టార్టప్తో పాటు అమెజాన్ సైతం ఆన్లైన్ ఎడ్యుటెక్ రంగంలోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు యధావిధిగా ఆఫ్లైన్ క్లాస్లు ప్రారంభం కావడంతో ఎడ్యుటెక్ కంపెనీలు భారీ నష్టపోతున్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు అమెజాన్ అకాడమినీ మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ప్రకటించారు. చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్!
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్ను నిలిపివేసింది. తాజాగా ఆఫర్ స్కీమ్ స్థానంలో ‘లాయల్టీ ప్రోగ్రామ్’ను అందించనున్నట్లు జొమాటో సీఎఫ్వో అక్షాంత్ గోయల్ తెలిపారు. ఇటీవల జొమాటో జులై - సెప్టెంబర్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా..యాప్లో ఆర్డర్ ఫీచర్పై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందాయని అక్షాంత్ గోయల్ చెప్పారు.అందుకే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యాప్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్ను నిలిపివేసి.. ఆ స్థానంలో కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా లాయల్టీ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. మరి ఆ లాయల్టీ ప్రోగ్రాం వల్ల కస్టమర్లు ఎలాంటి లబ్ధి పొందనున్నారు? ఆ స్కీమ్ ఎలా ఉంటుందనే అంశంపై జొమాటో ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. స్విగ్గీలో మరో ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ లాయల్టీలో స్కీమ్ కింద స్విగ్గీ ఇన్స్టా మార్ట్ ఆర్డర్లపై కస్టమర్లకు సంస్థ నిర్దేశించిన దూరం వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు అందించనుంది. దీంతో పాటు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం అదనపు సౌకర్యాలు అందించేందుకు 3నెలల సబ్స్క్రిప్షన్ కింద రూ.399, 12నెలల సబ్ స్క్రిప్షన్ కింద రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సబ్ స్క్రిప్షన్ మోడల్ను ( జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్) జొమాటో తొలగించిన విషయం తెలిసిందే. -
కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్స్, రెస్టారెంట్ల మధ్య ఒప్పొందాలు విఫలమయ్యాయి. దీంతో స్విగ్గీకి చెందిన ఫ్రీ టేబుల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ‘డైన్అవుట్’ నుంచి 900 రెస్టారెంట్లు వైదొలిగాయి. కోవిడ్ -19 తర్వాత రెస్టారెంట్లు పుంజుకోవడంతో ఫుడ్ ఆగ్రిగ్రేటర్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో తమకొచ్చే ఆదాయం తగ్గిపోతుందటూ రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. వాటికి పరిష్కార మార్గంగా రెస్టారెంట్ బాడీ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సంస్థ .. జొమాటో, స్విగ్గీలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో చర్చలు జరిపింది. చదవండి👉 ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు డొమినోస్ గుడ్బై? ఈ చర్చల సందర్భంగా ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లకు భారీ ఎత్తున డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో వారు మా రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత డైన్ అవుట్ లేదా జొమాటో పే వంటి యాప్ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఆ చెల్లింపు సమయంలో మేం(రెస్టారెంట్లు) కూడా డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా మా కొచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. 2ఏళ్ల పాటు రెస్టారెంట్లపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం, తిరిగి కస్టమర్లకు రెస్టారెంట్లకు రావడంతో వ్యాపారం పుంజుకుంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నంలో ఇలాంటి ఆఫర్లను దీర్ఘకాలికంగా కొనసాగించడం కష్టమే’నని చెప్పారు. చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! నెల గడువు తర్వాత సెప్టెంబరులో విడుదల చేసిన ఎన్ఆర్ఏఐ నోటిఫికేషన్లో..ఆఫర్లు దీర్ఘకాలంలో మొత్తం రెస్టారెంట్ ఇండస్ట్రీపై ప్రభావాన్ని చూపుతాయి. జొమాటో.. జొమాటో పే, స్విగ్గీ..స్విగ్గీ డిన్అవుట్ పేరుతో పేమెంట్ గేట్వేలను అందుబాటులోకి తెచ్చాయి. ఇది మా కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వడం, 100% క్యాష్ బ్యాక్లు, బ్యాంక్ ఆఫర్లను అందించడం పేమెంట్ గేట్వేలను వినియోగించేలా ప్రోత్సహిస్తుంది. కానీ అలాంటి నిరాధారమైన ఆఫర్లు ఇస్తే..తాము ఫుడ్ ఆగ్రి గ్రేటర్లతో పెట్టుకున్న ఒప్పొందాన్ని రద్దు చేసుకుంటామని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఫుడ్ ఆగ్రిగ్రేటర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో రెస్టారెంట్ల బాడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. చదవండి👉 రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి! -
కాళ్లకు చెప్పులు లేవ్.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’
వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్లు/ఏజెంట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్ఇన్లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్ఇన్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. -
సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్పై వెంటపడి మరీ..
చైతన్యపురి(హైదరాబాద్): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు. చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన.. అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్నగర్లో పట్టుకుని ముందుగా సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్పేటకు చెందిన ఎన్ఆర్ఐ పి.ఆకాష్రాజ్ (26), సైదాబాద్కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. -
స్విగ్గీ డెలివరీ మ్యాన్ విషాదం: తండ్రి అలా, కొడుకు ఇలా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్ల్యక్షం గోలే మార్కెట్కు చెందిన రాహుల్ కుమార్ని బలి తీసుకుంది. దేశ్ బంధు గుప్తా రోడ్డు వద్ద శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ఎంజీ హెక్టార్(ఎస్యూవీ) కారును నడపడంతో అదుపు తప్పి బైక్ను ఢీకొట్టాడు. ఆ తరువాత కారును అక్కడే వదిలేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఫలితంలేదు. చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. బైక్పై వెనుక కూర్చున్న రాహుల్ స్నేహితుడు పవన్ కుమార్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇంటర్ విద్యార్థి, మైనర్ బాలుడు కారును నడుపుతున్నాడు. కారులో నిందితుడితోపాటు, అతని స్నేహితుడు, మరో విదేశీ పౌరుడు కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు కోట్లా రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్టయినట్టు పోలీసుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు, తండ్రి అలా, కొడుకు ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాకినాడ నుంచి స్విగ్గీలో స్వీట్లు ఆర్డర్.. 3 గంటలు డెలివరీ ఆలస్యం కావడంతో
సాక్షి, హైదరాబాద్: కాకినాడ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేసిన స్వీటు.. నానక్రాంగూడకు డెలివరీ ఆలస్యం కావడంతో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా.. కాకినాడలో ఉండే సాయిశ్రీ స్విగ్గీలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వీట్ ఆర్డర్ చేయగా నానక్రాంగూడలో గోల్ప్ ఎడ్జ్ ఫ్లాట్ నెంబర్ 1804లో ఉంటున్న భాస్కర్కు చేరాల్సి ఉంది. స్విగ్గీ డెలివరీ బాయ్గా ఫస్ట్లాన్సర్కు చెందిన షేక్ అమీర్ బైక్పై బయలుదేరాడు. వర్షం పడటంతో రాంగ్ లొకేషన్ చూపించడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి యువతికి ఫోన్ చేయగా డెలివరీ అడ్రస్ లొకేషన్ పంపించింది. దీంతో గోల్ప్ ఎడ్జ్కు చేరుకునే సరికి సాయంత్రం 6 గంటలైంది. డెలివరీ తీసుకోమని స్నేహితుడు చెఫ్ శివ ప్రసాద్కు చెప్పి భాస్కర్ బయటకు వెళ్లాడు. డెలివరీ ఆలస్యమైందని చెఫ్ దురుసుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో శివప్రసాద్ ఇంట్లో నుంచి కత్తి తెచ్చి దాడి చేయగా ప్రతిఘటించిన షేక్ అమీర్ కుడి చేతిపై గాయమైంది. అమీర్ అదే కత్తిలో శివప్రసాద్ మెడ, ఛాతి, చేతిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో చెఫ్ శివప్రసాద్, డెలివరీ బాయ్ షేక్ అమీర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: స్విగ్గీలో ఐస్క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి -
స్విగ్గీలో ఐస్క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి
చెన్నై: ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే స్వయంగా వెళ్లి కొని తెచ్చుకునే వాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, హోం నీడ్స్ ఇలా ప్రతిదీ.. ఫోన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో మన ముందు వాలుతోంది. అయితే అప్పుడు ఆర్డర్లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం లేదా మనం చెప్పినా వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం వంటి పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్ డెలివరీ అయ్యాకి.. పార్శిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్క్రీం, చిప్స్కు బదులు కండోమ్లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! ఇక జరిగిన పొరపాటుపై స్విగ్గీ సంస్థ స్పందించింది. తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది. అయితే ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇలాంటి వస్తువులు డెలివరీ చేయడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. -
Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా?
బిర్యానీ, దోశ, స్వీట్స్.. ఇలా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం.. హా ఇంట్లో వండుకొని తింటాం అంటారా.. కానీ ఇప్పుడంతా ఏమంటున్నారో తెలుసా..? వండుకునేంత టైం లేదండీ ఆన్లైన్లో ఫుండ్ ఆర్డర్ చేసుకొని లాగించడమే అని అంటున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ప్రిపరేషన్, డెలివరీ బాయ్ పికప్, ఆర్డర్ డెలివరీ ఎప్పుడు అవుతుందో ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా డెలివరీ ట్రాకింగ్ ఇంటర్ ఫేస్లో బైక్పై వ్యక్తి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్లు చూపిస్తుంది. తాజాగా స్విగ్గీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ను తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాకింగ్లో డెలివరీ పార్ట్నర్ బైక్ ప్లేస్లో స్విగ్గీ డ్రాగన్గా మార్చింది. చదవండి: Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. స్విగ్గీలో ఆర్డర్ ట్రాకింగ్లో ‘ఆకలితో ఉండకండి. మా డ్రాగన్ మీ ఫుడ్ను డెలివరీ చేస్తాడు’ అనే ట్యాగ్లైన్తో కనిపిస్తోంది. అంటే మన ఆర్డర్ను డ్రాగన్ డెలివరీ చేస్తున్నట్లు కస్టమర్లు ఫీల్ అయ్యేలా ఆలోచన చేసింది. ఇక స్విగ్గీలో కొత్తగా హౌజ్ ఆఫ్ డ్రాగన్ థీమ్ కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆర్డర్ ట్రాకింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్విగ్గీ క్రియెటివిటీని మెచ్చుకుంటున్నారు. చదవండి: చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్పై లీగల్గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి, ఉద్యోగులకు స్విగ్గీ బంపరాఫర్!
ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఉద్యోగులకు మరో బంపరాఫర్ ప్రకటించింది. సంస్థలోనే కాకుండా బయట ఉద్యోగులకు నచ్చిన పనిచేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆర్ధికంగా బలపడొచ్చని చెబుతోంది. స్విగ్గీ సంస్థ ఇటీవలే ఫ్యూచర్ వర్క్ పాలసీలో భాగంగా ఉద్యోగులు శాశ్వతంగా ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్లు రిమోట్గా పనిచేస్తూ ఉండొచ్చని తెలిపింది. తాజాగా మూన్ లైటింగ్ పాలసీ పేరుతో మరో కొత్త పని విధానాన్ని అమలు చేసింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత, లేదంటే వీకెండ్స్లో పనిచేసుకోవచ్చని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు. సాధారణంగా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి మరో సంస్థలో పనిచేసేందుకు ఒప్పుకోవు. కానీ స్విగ్గీ మాత్రం ఆ నిబంధనల్ని సడలించింది. మా సంస్థ స్విగ్గీ ఉద్యోగుల విభిన్న ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలకు అనుగుణంగా విధానాన్ని మార్చేందుకు కృషి చేస్తుంది. ఈ మూన్లైటింగ్ పాలసీతో ఉద్యోగులు వారు చేస్తున్న రెగ్యులర్ జాబ్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వారి అభిరుచిని కొనసాగించేలా ప్రోత్సహిస్తాం. ప్రపంచ స్థాయి 'పీపుల్ ఫస్ట్' సంస్థను నిర్మించే దిశగా మా ప్రయాణంలో మరో అడుగు పడిందని ఈ సందర్భంగా గిరీష్ మీనన్ అన్నారు -
ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్?
డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీలకు భారీ షాకివ్వనుంది. దశల వారీగా జొమాటో,స్విగ్గీల ద్వారా పిజ్జా డెలివరీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త బిజినెస్ వ్యూహాన్ని అమలు చేసింది. డొమినోస్ పిజ్జా సంస్థ 'జూబిలెంట్' జులై 19న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆశ్రయించింది. రెస్టారెంట్ భాగస్వాముల నుంచి దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్లైన స్విగ్గీ, జొమాటోలు పెద్దమొత్తంలో కమిషన్ వసూలు చేస్తూన్నాయంటూ సీసీఐకి ఓ రహస్య ఫైల్లో వెల్లడించినట్లు రాయింట్స్ తెలిపింది. దీంతో సీసీఐ రెస్టారెంట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత.. స్విగ్గీ, జొమాటోలపై చర్యలు తీసుకోనుంది. ఈ తరుణంలో స్విగ్గీ, జొమాటో భాగస్వామ్యం నుంచి విడిపోయేందుకు డొమినోస్ పిజ్జా మాస్టర్ ప్లాన్ వేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన పిజ్జాల కోసం స్విగ్గీ, జొమాటోల్ని ఆశ్రయించే అవసరం లేకుండా నేరుగా డొమినోస్ సెంటర్కు వచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా డొమినోస్ ఫ్రాంఛైజీలో కస్టమర్ ఆరు పిజ్జాలు కొనుగోలు చేస్తే మరో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. డొమినోస్ ఆఫర్పై జూబిలెంట్ సంస్థ సీఎఫ్వో ఆశిష్ గోయాంక్ మాట్లాడుతూ.. మేం దీనిని ఒక ఓమ్నీచానల్ ప్రోగ్రామ్ గా చేస్తున్నాము. తద్వారా కస్టమర్ ఎంట్రీ పాయింట్తో సంబంధం లేకుండా ప్రయోజనాల్ని పొందవచ్చని అన్నారు. -
స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (Work From Anywhere) పాలసీని ప్రకటించింది. దాదాపు ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని తెలిపింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్లు రిమోట్గా పని చేస్తూనే ఉంటాయని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్విగ్గీకి గత రెండేళ్లుగా ప్రొడక్టివిటీ బాగా పెరిగిందట. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది. 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్' విధానం ప్రకారం, కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్ ఫంక్షన్, టెక్నాలజీ విభాగాల ఉద్యోగుల రిమోట్గా పని చేస్తారు. అయితే బేస్ లొకేషన్లలో పనిచేసేవారు మాత్రం వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని తెలిపింది. అలాగే ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమావేశమవుతాయని వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాలని మేనేజర్లు, ఇతర ఉద్యోగుల ఫీడ్బ్యాక్కు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ప్రధాన అంశం ఫ్లెక్సిబిలిటీ, ఉద్యోగులు తమ పనిని చాలా సౌలభ్యంగా చేసుకోవడంపైనే తమ ప్రధాన దృష్టి అని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు. స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ను అందించిన మొదటి కంపెనీలలో స్విగ్గీ ఒకటి. 2014లో దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ , 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలోని 487 నగరాల ఉద్యోగులు చాలావరకు వర్క్ ఫ్రం హోం ద్వారా పని చేస్తున్నారు. -
ఐరన్ లెగ్ మహిమ : జొమాటోకు కోట్లలో నష్టం..ఈయనే కారణమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటో షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. సోమవారం ఎన్ఎస్ఈలో జొమాటో 14శాతం షేర్లు పడిపోయి రూ.46 వద్ద జీవిత కాల కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద ముగియగా..దీంతో నిన్నఒక్కరోజే జొమాటో రూ.1000కోట్లు (అంచనా) నష్టపోయింది.మంగళవారం సైతం ఆ సంస్థకు నష్టాల పరంపర కొనసాగుతుంది. ఇవ్వాళ మార్కెట్ కొనసాగే 2.50గంటల సమయానికి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోయి రూ.42.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. జొమాటో- స్విగ్గీలు మెర్జ్ అయితే జొమాటో షేర్ రాకెట్ వేగంతో రూ.450కి చేరుతుందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్కాగా.. జొమాటో షేర్లు నష్టపోవడానికి అశ్నీరే అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. On the stock market - @letsblinkit served piping hot misery to @zomato in 10 minutes ! Yeh hi agar @Swiggy ko merge kar liya hota to ₹450 ka stock hota !! — Ashneer Grover (@Ashneer_Grover) July 26, 2022 ఐరన్ లెగ్ అశ్నీర్ జొమాటో షేర్ల పతనానికి అశ్నీర్ గ్రోవరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే? ఫినెట్క్ కంపెనీ భారత్ పే'ను స్థాపించిన అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లపై సంస్థ నిధుల్ని కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం... అశ్నీర్, మాధురీ జైన్ కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది. అశ్నీర్ రాజీనామా దీంతో భారత్పే మాధురీ జైన్ను విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశ్నీర్ సైతం భారత్పేలో తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర చేశారని, ఎలాంటి తప్పు చేయలేదంటూ వాదనకు దిగారు. చివరకు చేసేది లేక భారత్ పే నుంచి బయటకు వచ్చిన అశ్నీర్ తన కుటంబ సభ్యులకు చెందిన అమెరికన్ కంపెనీతో కలిసి మరో స్టార్టప్ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పుడు భారత్పే.. ఇప్పుడు జొమాటో ఇక భారత్ పేతో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయట పడేందుకు అశ్నీర్ తన కిరాణ డెలివరీ యాప్ సంస్థ బ్లింకిట్ను జొమాటోకు అమ్మేశారు. జొమాటో రూ. 4,447 కోట్ల డీల్తో షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకుంది. దీంతో బ్లింకిట్ అశ్నీర్ది కావడం, ఇప్పటికే భారత్పే నిధుల్ని కాజేయడం వంటి ఇతర కారణాల వల్ల జొమాటో మదుపర్లు అప్రమత్తమయ్యారు. జొమాటో షేర్లను అమ్మేసిస్తున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. చదవండి: అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! -
స్విగ్గీ బంపర్ ఆఫర్: నెటిజన్ల సెటైర్లు
సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఆర్డర్ పెడుతున్నారా.. ఇంత మోసమా..?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే. ఫుడ్ ఆర్డర్ల విషయంలో కస్టమర్లు జోమాటోతో పాటు ఇతర సంస్థలను ఎంచుకుంటుంటారు. కాగా, జోమాటో ఆర్డర్లపై ఓ కస్టమర్ షాకింగ్ విషయాలు వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. వివరాల ప్రకారం.. రాహుల్ కబ్రా అనే ఒక లింక్డ్ఇన్ యూజర్.. ఆన్లైన్, ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుచూ ఓ పోస్టును పెట్టాడు. అందులో భాగంగా ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేస్తోందని అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండింటి మధ్య ధరల డిఫరెన్స్ను గమనించి ఖంగుతిన్నాడు. ఈ క్రమంలోనే ఛార్జీల పేరుతో డెలివరీ సంస్థలు వినియోగదారులను దోచుకుంటున్నాయని ఆరోపించాడు. కాగా, అతని ఆర్డర్లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. ఆఫ్లైన్ ఆర్డర్ బిల్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీతో కలుపుకుని రూ.512 అయింది. అయితే, ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అది కూడా రూ. 75 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. ఈ సందర్భంగా.. రాహుల్ కబ్రా డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపరిచాడు. డెలివరీ సంస్థల బిల్లులపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరముందన్నాడు. అధిక ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా అందరికీ ఉపయోగం ఉంటుందని తెలిపాడు. భవిష్యత్తులో వినియోగదారులు జోమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులను వినియోగదారులు అర్థం చేసుకుంటారని అన్నాడు. రాహుల్ కబ్రా పోస్టుపై మరో నెటిజన్ స్పందిస్తూ.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్విగ్గి ఆర్డర్పై తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ‘‘నేను సమీపంలోని రెస్టారెంట్ నుండి థాలీని ఆర్డర్ చేయాలనుకున్నాను. స్విగ్గీలో ధరను 120 ప్లస్ డెలివరీ ఛార్జీలుగా చూపింది. కానీ, నేను అదే రెస్టారెంట్ వైపు వెళ్తున్నా కారణంగా ఆన్లైన్లో ఆర్డర్ కాకుండా డైరెక్ట్గా రెస్టారెంట్ నుండి తీసుకున్నాను. దీంతో, అదే థాలీ రూ. 99కి వచ్చింది. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటే.. 40% ఎక్కువ ఉన్న అదే ఆహారం కోసం నేను స్విగ్గీకి దాదాపు 140 చెల్లించాల్సి వచ్చేదని అన్నాడు. కాగా, ఆయన పోస్టుపై రాహుల్ కాబ్రా.. నెటిజన్ల స్పందన ఏమిటో తెలపండి అంటూ కోరాడు. దీంతో, కొందరు నెటిజన్లు.. కంపెనీ ఇస్తున్న సర్వీసు వల్ల కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తే తప్పేంటి, వారు చేస్తున్నదీ వ్యాపారమేగా అని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. మరొక యూజర్ ఈ యాప్లను తన ఫోన్ల నుంచి డిలీట్ చేసి పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినటం మంచిదని బదులిచ్చాడు. ఇది కూడా చదవండి: గూగుల్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
వాట్ ఎన్ ఐడియా.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. వైరలవుతోన్న వీడియో
ముంబై: ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. వారానికి నాలుగు సార్లైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన సమయంలో డెలివరీ బాయ్స్ ఫుడ్ను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఎండలు, వానలతో సంబంధం లేకుంటా టైమ్కు డెలివరీ అవ్వాల్సిందే. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్స్లో డెలివరీ బాయ్స్ సాధారణంగా బైక్ మీద వస్తుంటారు. కానీ ముంబైలో వర్షాలు ఎక్కువగాపడుతుంటంతో ఓ డెలివరీ బాయ్ వినూత్న ఆలోచన చేశాడు. అతను చేసిన పని తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అతనేం చేశాడంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డుపై నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ తీసుకెళ్లడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలో వర్షాలు కురుస్తుండడంతో బైక్పై ప్రయాణించేందుకు రోడ్లు వీలుగా లేకపోవడంతో స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రమెక్కాడు. వెనక బ్యాగ్ తగిలించుకుని ఆర్డర్లు డెలివరీ చేసేందుకు గుర్రంపై వెళ్తున్నాడు. దీనిని వెనకాల ఉన్న వారు వీడియో తీశారు. జస్ట్ ఏ వైబ్ అనే యూట్యూబ్ చానల్లో ఇది పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డెలివరీ ఆలస్యం కాకూడదని భావించిన డెలివరీ బాయ్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా గుర్రాన్ని ఉపయోగించడం మంచి ఆలోచన.. ఏదో ఒక రోజు మనం వీధుల్లో గుర్రాలపై స్వారీ చేస్తామని ఆశిస్తున్నా.. నా కల నిజమైంది.’ అంటూ స్మైలీ, హార్ట్ ఎమోజీలను పంచుకుంటున్నారు. చదవండి: టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి -
మూడు రూపాయలకు కక్కుర్తి పడితే?
ఓవైపు అలసిపోయి ఉన్నాం.. మరోవైపు ఆకలేస్తోంది.. ఇంకే చేస్తాం ఫోన్ ఆన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. నిమిషాల్లో వేడివేడిగా ఆహారం వచ్చేస్తుంది. ఇట్స్ సింపుల్ అనుకుంటున్నారేమో? కానీ ఫుడ్తో పాటు అడ్డగోలు ట్యాక్సులు కూడా మనకు డెలివరీ అవుతున్నాయ్. మన జేబులకు చిల్లులు పెడుతున్నాయ్. డిజిటల్ వాలెట్లకు కన్నం వేస్తున్నాయ్. ఇలాంటే ఘటనకు సంబంధించి అడ్డగోలు ట్యాక్సులపై కన్నెర్ర చేసింది వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ. బిర్యానీ ఆర్డర్ చేస్తే నగరంలోని హిమాయత్నగర్కు చెందిన మురళీ కుమార్ రెడ్డి 2019 సెప్టెంబరు 8న స్విగ్గీ ద్వారా ముషీరాబాద్లో ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. మెనూలో ఆ బిర్యానీ ధర రూ.200లు ఉండగా.. కూపన్ అప్లై చేసిన తర్వాత డిస్కౌంట్ ప్రైస్తో రూ.140కే వచ్చింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధరపై పన్ను విధించాలి. కానీ స్విగీ ఎంఆర్పీపై పన్ను విధించింది. ఇదేం పద్దతి జీఎస్టీ నిబంధనల ప్రకారం బిర్యానీ ధర రూ.140 అయినందున జీఎస్టీగా రూ.7లు పన్ను విధించాలి. కానీ స్విగ్గీ అలాకాకుండా తనకు ఎంఆర్పీ రూ.200లపై జీఎస్టీగా రూ.10 విధించి అదనంగా రూ.3 ట్యాక్స్ వసూలు చేసిందంటూ వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థను ఆశ్రయించాడు మురళీ కుమార్రెడ్డి. వినియోగదారుడిగా తన హక్కులు కాపాడుతూ అధిక జీఎస్టీ వసూలుపై స్విగ్గీని ప్రశ్నించాలని అతను కోరాడు. పరిహారం అనేక వాదప్రతివాదనలు పూర్తైన తర్వాత జీఎస్టీ పన్ను వసూలు విషయంలో స్విగ్గీ తప్పు చేసినట్టుగా వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ భావించింది. దీంతో బాధితుడికి రూ.2000లు పరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది. అదే విధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.1000 కూడా ఇవ్వాలంటూ పేర్కొంది. కాగా ఈ తీర్పుపై తప్పు తమది కాదంటే తమది కాదంటూ ఇటు రెస్టారెంట్, స్విగ్గీలు ఎదుటివారిపై నెపం మోపుతున్నాయి. చదవండి: ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా -
‘మిమ్మల్ని బాగా మిస్సవుతున్నాను’.. వీటినే తలతిక్క పనులు అంటారు!
దేశంలో అనతి కాలంలోనే వటవృక్షంలా ఎదుగుతోంది గిగ్ ఎకానమి. డిగ్రీలు, ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ ఇలాంటివేమీ లేకుండానే వెంటనే నేటి తరం యువత గిగ్ ఎకానమీలో జాబ్లు పొందుతున్నారు. ఫ్లిప్కార్ట్ మొదలు స్విగ్గీ మీదుగా ర్యాపిడో ఎంతో మంది డెలివరీ ఏజెంట్ అవతారంలోకి ఈజీగా మారిపోతున్నారు. అయితే ఇటీవల ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని నెట్టింట సరికొత్త చర్చకు దారి తీసింది. ప్రాప్తి అనే నెటిజన్ ఇటీవల స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ ఏజెంట్ ద్వారా ఫుడ్ను అందుకుంది. కానీ ఆ తర్వాతే కొత్త సమస్య ఎదురైంది. ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి అవాంచిత మెసేజ్లు రావడం మొదలైంది. ‘మీ ప్రవర్త బాగుంది’, ‘మీరు చాలా అందంగా ఉన్నారు’, ‘ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అంటూ వరుసగా మెసేజ్లు రావడం మొదలైంది. ఇవి మరీ శృతి మించిపోవడంతో స్విగ్గీ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసింది. ఇదేం బాగాలేదు ఫిర్యాదు చేసినా స్విగ్గీ నుంచి సరైన స్పందన రాలేదు. మరోవైపు నుంచి డెలివరీ ఏజెంట్ నుంచి మెసేజ్ల దాడి కూడా ఎక్కువైంది. దీంతో తాను పడుతున్న ఇబ్బందనులను ట్విటర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిపింది ప్రాప్తి. డెలవరీ ఏజెంట్ ప్రవర్తనను నిరసిస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. అదే విధంగా సున్నితమైన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్విగ్గీ తీరును కూడా ఖండించారు. క్షమించండి ఎట్టకేలకు స్విగ్గీ దిగి వచ్చింది. ఈ కంపెనీ తరఫున ప్రతినిధులు ప్రాప్తితో మాట్లాడారు. జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఇబ్బందులకు గురి చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పకబ్బంధీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాస్కింగ్ ఫీచర్ ఈకామర్స్ రంగంలో ఉన్న కంపెనీలు సాధారణంగా కస్టమర్లతో వ్యవహారం నడిపేందుకు మాస్కింగ్ ఫీచర్ను ఉపయోగిస్తాయి. ఈ విధానంలో కస్టమర్ నంబర్ డెలివరీ ఏజెంట్కి తెలియకుండా జాగ్రత్త పడతాయి. అయితే గట్టిగా ప్రయత్నిస్తే మాస్క్ ఫీచర్లో కూడా కస్టమర్ల నంబర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మరింత కట్టుదిట్టంగా టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చదవండి: ఏంటీ మీ తొక్కలో సర్వీస్.. ఇలాగైతే కుదరదు మరి.. -
ఏంటీ మీ తొక్కలో సర్వీస్.. ఇలాగైతే కుదరదు మరి..
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ ఇతర ఈ కామర్స్ సంస్థలపై కేంద్రం కన్నెర్ర చేసింది. మీ సర్వీసులు బాగాలేవంటూ మాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయ్. అసలు కస్టమర్ల సమస్యలు పరిష్కరించేందుకు మీరు అవలంభిస్తున్న విధానాలు ఏంటీ ? మరింత మెరుగ్గా సేవలు ఎలా అందివ్వగలరో మాకు తెలపండి అంటూ వాటికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక అందించేందుకు 15 రోజుల గడువు విధించింది. ఈ కామర్స్ సర్వీసుల్లో లోపాలపై గత ఏడాది కాలంలో నేషనల్ కన్సుమర్ హెల్ప్లైన్కి ఏకంగా 3,631 ఫిర్యాదులు అందాయి. ఇందులో జోమాటో, స్విగీపై 2,828 ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసింది కన్సుమర్ ఎఫైర్స్ శాఖ. ఇందులో ముఖ్యంగా సర్వీసుల్లో లోపాలపై స్విగ్గీ, జోమాటోలను నిలదీసింది. ఫుడ్ సర్వీసులపై ఎందుకు ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయంటూ ప్రశ్నించింది. చివరకు ఫిర్యాదుల పరిష్కారం, సేవల్లో లోపాలు సవరించే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కన్సుమర్ ఎఫైర్స్ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఆఫీస్లో కొత్త రూల్.. ఒక నిమిషం లేట్గా వస్తే పది నిమిషాల అదనపు పని! -
ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్లైన్కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్బీవోలు తెలిపాయి. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డెలివరీ బాయ్ అంటే అంత చులకనా..?
నేను పోలీసును.. నేనేం చేసిన ఎవరూ అడ్డుచెప్పరు.. అనే అహంకారంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ను దారుణంగా కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సింగనల్లూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఓ స్కూల్కు చెందిన బస్సు డ్రెవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి.. బైక్లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరం.. బస్సును ఆపి డ్రైవర్ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకున్న సతీష్.. ఏం జరిగింది అని కూడా అడగకుండా.. డెలివరీ బాయ్ చెంపపై పదే పదే కొట్టాడు. అనంతరం అతడి సెల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సతీష్.. మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్ బస్సు ఓనర్ ఎవరో తెలుసా అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్కు బదిలీ చేశారు. "This happened yesterday evening at the fun mall signal and there was a slight traffic block due to this delivery boy and all of a sudden this Cop Started beating up the Delivery person " . #welovecovai . 👉 IG : FB :TW @WELOVECOVAI .#coimbatore #delivery #deliveryboy #traffic pic.twitter.com/OBEwmghc1R — We Love Covai ❤️ (@welovecovai) June 4, 2022 ఇది కూడా చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్పై దుమారం -
Period Leave: లోలోపల మెలిపెట్టే బాధ.. సెలవు బలహీనతేనా.. కానేకాదు!
శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినప్పుడు ఒక వైయక్తిక పర్వతం విస్ఫోటం చెందినప్పుడు నేను బాధని అరచేతిలో పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాను అంటూ కె. గీత అనే కవయిత్రి మహిళల రుతుక్రమ బాధను వర్ణించారు. స్త్రీలకు మాత్రమే అర్థమయ్యే ఈ బాధ, ఇబ్బందికి కాస్త విశ్రాంతితో ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు. గృహిణులకు కొంచెం ఆ వెసులుబాటు ఉండొచ్చేమో కానీ కుటుంబం కోసం ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్న మహిళలకు ఆ విశ్రాంతి ఎలా దొరకుతుంది? సెలవు పెట్టాలంటే జీతం (ఆ రోజులకు) నష్టపోవాలి. పోనీ దానికీ సిద్ధపడి.. ‘నెలసరి వచ్చింది.. సెలవు కావాలి’ అని అడగడానికి ఏదో జంకు.. బిడియం.. భయం.. అర్థం చేసుకుంటారా? వెకిలిగా చూస్తే? కామెంట్ విసిరితే? ఇన్ని సంకోచాల మధ్య సెలవు అడిగే బదులు ఎలాగోలా కొలువుకు రావడమే నయమనే నిస్సహాయ సర్దుబాటు. సగటు మహిళా ఉద్యోగి ప్రతినెలా ఎదుర్కొనే సున్నితమైన సమస్య ఇది. ఇలాంటి స్థితిలో ఆఫీస్ యాజమాన్యాలే అర్థం చేసుకొని నెలసరిలో విశ్రాంతి తీసుకోమని అధికారికంగా ఒక రూల్ పాస్ చేస్తే ఎంత హ్యాపీ! బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటోంది సమాజం. ఆ క్రమంలోనే పీరియడ్ లీవును మంజూరు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.. సిక్ లీవ్, మెటర్నిటీ లీవ్ తరహాలో! అయితే ఈ సెలవు మహిళల అవకాశాలను గండికొట్టడానికే తప్ప ఆమె సామర్థ్యానికి విలువనిచ్చేది కాదు అనే వాదన.. దీని వల్ల మహిళలు తాము శారీరకంగా బలహీనుమలని ఒప్పుకుంటున్నట్టే అనే అసంతృప్తి ఓ చర్చగా మారింది సర్వత్రా! ఆ చర్చనీయాంశాన్ని ఫన్డే కవర్ స్టొరీగా మీముందుకు తెచ్చాం! జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాలు బెణికింది, బ్యాక్ పెయిన్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు లేదనకుండా లీవ్ ఇస్తారు. ఇంట్లో పెద్దలు, పిల్లల అనారోగ్యాలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పిక్నిక్లు, వ్రతాలు, యాత్రలు ఇలా సెలవు ఇవ్వడానికి అన్నీ సకారణాలే. కానీ పీరియడ్స్ను మాత్రం ‘సెలవు తీసుకోవడానికి ఓ వంకలా వాడుకుంటున్నారు మహిళలు’ అన్నట్టుగా చూస్తారు.. ‘అదేమైనా రోగమా రొష్టా సెలవు తీసుకోవడానికి’ అనీ అనుకుంటారు కొందరు మగబాసులు. దీనికి ప్రధాన కారణం శారీరకంగా స్త్రీ, పురుషుల్లో భేదమే. ఇది ప్రతి నెల స్త్రీలకి తప్పనిసరి వ్యవహారం. సృష్టికి ప్రతిసృష్టిని అందించే అమ్మతనానికి ఇదే మూలం. ఒకప్పుడు నెలసరి వచ్చిందంటే అమ్మాయిలు ఓ మూల కూర్చోవాలి. ఎవరినీ ముట్టుకోకూడదు. ఎటూ తిరగకూడదు. నలుగురిలో కలవకూడదు. గుళ్లు, గోపురాలకు వెళ్లకూడదు. ప్రకృతి సహజంగా స్త్రీకి వచ్చే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా ఆమెపై చూపించే వివక్షే. కానీ అందులో అంతర్లీనంగా బహిష్టు సమయంలో మహిళ శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, అందుకే ఈ సంప్రదాయాలు వచ్చాయని వాదించే వారు ఉన్నారు. రోజూ ఇంట్లో గొడ్డు చాకిరి చేసే మహిళకి ఆ మూడు రోజులే విశ్రాంతి దొరికేది. అలా ఎవరికీ కనిపించకుండా మూల కూర్చొనే స్థాయి నుంచి మహిళలు మగవారితో దీటుగా పనిచేయగల సమర్థతను సాధించడం వెనుక ఎంతో పోరాటం ఉంది. మహిళల పట్ల సానుభూతితో కాకుండా ఆ సమయంలో వారిలో కలిగే నొప్పిని, బాధను, మానసికంగా పడే ఆవేదనను కొందరైనా అర్థం చేసుకుంటున్నారు. అయినా మన దేశంలో కేవలం 15 కంపెనీలు మాత్రమే పీరియడ్ లీవ్ మంజూరు చేస్తున్నాయి. ఆ బాధ వర్ణనాతీతం కౌమరంలోకి అడుగు పెట్టి రజస్వల అనే దశను మొదలు కొని అయిదు పదుల వయసులో ఏర్పడే మెనోపాజ్ వరకూ ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా నెల నెల క్రమం తప్పకుండా ఎదుర్కోవలసిన స్థితి నెలసరి. కొంత మంది మహిళల్లో నెలసరి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా గడిచిపోతుంది. కానీ ఎక్కువ మంది మహిళల్లో పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. మరికొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో నరాల్లో రక్తమంతా ఆవిరైపోతున్నట్టు శరీరం వశం తప్పుతూ ఉంటుంది. కాళ్లల్లో సత్తువ ఉండదు. నిల్చోలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఆలోచనలు కుదురుగా ఉండవు. మూడ్ స్వింగ్స్ అసాధారణంగా ఉంటాయి. లోలోపల మెలిపెట్టే బాధని దాచుకునే పరిస్థితులతో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మూడీగా ఉండడం చూస్తుంటాం. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాలంటే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. అధిక రక్త స్రావంతో మరకలు అంటుకుంటే ఎలాగన్న భయం, పదే పదే శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి వాష్ రూమ్కు పరిగెత్తాలంటే ఓ జంకు, నొప్పులు వేధిస్తున్నా పని మీద దృష్టి నిలపలేని నిస్సహాయత ఇవన్నీ మహిళల్ని కుంగదీస్తున్నాయి. దీనికీ వెస్టే ఫస్ట్ పీరియడ్స్ టైమ్లో మహిళలకు సెలవు ఇవ్వాలన్న ఆలోచన పాశ్చాత్య దేశాల్లోనే ముందు మొదలైంది. సంప్రదాయాలకు, హిందూ జీవన విధానాలకు నెలవైన మన దేశంలో ఇలాంటి ఆలోచన చేయడం ఆలస్యంగా మొదలైంది. వందేళ్ల క్రితం 1920–30ల్లో మొట్టమొదటిసారి సోవియట్ రష్యా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడడం కోసం ఈ సెలవు ఇవ్వాలన్న ఆలోచన చేసింది. మహిళలకు బహిష్టు సెలవు ఇవ్వాలని కార్మిక సంస్థలకు సిఫారసు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్.. మహిళల పీరియడ్ లీవ్కి ప్రాచుర్యాన్ని కల్పించింది. 1947లో దీనిపై చట్టం చేసింది. దక్షిణ కొరియా 1953లో ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇస్తూ చట్టం చేసింది. ఇండోనేసియాలో రెండు రోజులు, జాంబియాలో ఒక్క రోజు, తైవాన్లో ఏడాదికి మూడు రోజుల సెలవుతోపాటు ఆ సమయంలో అధికంగా మరో అరగంట బ్రేక్ ఇస్తోంది. ఇటీవల స్పెయిన్ కూడా మూడు రోజుల పాటు సెలవు ఇవ్వడానికి ఆమోదించింది. భారత్లో ఇలా.. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బిహార్. కానీ మహిళల అంశంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడింది. మహిళలకి ప్రతినెల రెండు రోజుల పీరియడ్ లీవ్ మంజూరు చేస్తూ 1992లోనే చట్టం చేసింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అయితే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు నినోంగ్ ఎరింగ్ మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలంటూ 2017 నవంబర్లో ఒక ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుల్లో పని చేసే మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని, అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని, అందుకే వారికి సెలవు మంజూరు చేస్తూ ఒక చట్టం చేయాలని ఆ బిల్లులో కోరారు. అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ బిల్లుపై కనీసం చర్చ కూడా జరగలేదు. సెలవు తీసుకుంటే వెనుకబడిపోతారా ? సమానత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థికవృద్ధిలోనూ తమ వాటా ఉందని నినదిస్తున్నారు. మన దేశంలో దాదాపుగా 43.2 కోట్ల మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. దేశ జీడీపీలో 18% వాటాను మహిళలే అందిస్తున్నారు. మగవారితో సమానంగా మహిళలకూ అవకాశాలు లభిస్తే 2025 నాటికి దేశ జీడీపీలో 58 లక్షల కోట్ల రూపాయలు మహిళల వాటాయే అవుతుందని మెకిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. ఇలా మహిళలు ఎదుగుతున్న వేళ పీరియడ్స్లో మహిళలు విశ్రాంతి కోరుకొని సెలవు తీసుకున్నా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంటి పనుల భారం, బాధ్యత మహిళలే తీసుకోవాలి కాబట్టి అక్కడ పని చేయడం ఎలాగూ తప్పదు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఆఫీసుల్లోకి మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. తీసుకున్నా ఆడవారిపై వివక్ష కొనసాగు తూనే ఉంది. ఈ మధ్య విడుదలైన జాతీయ కుటుంబ సర్వే ప్రకారం గత అయిదేళ్లలోనే రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు వదులుకున్నారు. ఇప్పుడు పీరియడ్ లీవ్ ఇస్తే కంపెనీలు మహిళా ఉద్యోగులను వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణం అవుతుందని వాదించేవారూ ఉన్నారు. ఆ వాతావరణమే లేదు 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇంకా మహిళలు స్వేచ్ఛగా ఈ అంశంపై మాట్లాడే వాతావరణమే మన దగ్గర లేదు. ఇదే అంశంపై ప్రజాభిప్రాయం కోరినప్పుడు సామాన్య మహిళలే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మాట్లాడేందుకు కాస్త తటపటాయించడం, మొహమాటపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రతినెల అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేసినప్పుడు ఎవరికీ కనిపించకుండా నల్ల క్యారీబ్యాగ్లలో ఇస్తూ అదేదో ఎవ్వరికీ తెలియకూడని బ్రహ్మపదార్థంలా దాచేస్తున్నారు. స్త్రీలు తమ శరీరంలో సహజసిద్ధంగా జరిగే మార్పులపై చర్చించడం, మనసు విప్పి మాట్లాడ్డంలో తప్పులేదు. ఇది స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీనిని బలాలు, బలహీనతలు, సమర్థత, అసమర్థత అన్న కోణంలోంచి చూడలేం. మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుంది లేదంటే అభివృద్ధి గతి తప్పుతుంది. అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది అక్షర సత్యం. నెలసరి సమయాల్లో మహిళలకి విశ్రాంతి కల్పించడానికి ఇంటా, బయటా వారి చుట్టూ ఉండే మగవాళ్లు సహకారం అందివ్వాలి. ఇలా చేయడం మహిళలకి చేసే అదనపు సాయం కానేకాదు. ఇది అందరి బాగుకోసమే అన్న అవగాహన పెరగాలి. మహిళలు బహిరంగంగా డిమాండ్ చేసినా చేయకపోయినా పీరియడ్ లీవ్ ఇస్తే లాభమే తప్ప నష్టం లేదు. ఆఫీసుకు వచ్చి కూడా సిగరెట్ బ్రేక్ అని, కాఫీ బ్రేక్ అని, ఇతరులతో పిచ్చాపాటి పేరు చెప్పుకొని మగవారు పని గంటల్ని వృథా చేస్తూనే ఉంటారు. వారు చేసే వృథాతో పోల్చి చూస్తే మహిళలకు ఇచ్చే సెలవు ఏమంత విషయం కాదు. బాధ్యత కలిగిన ప్రజా నాయకులందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఎన్నో దేశాలు పీరియడ్ లీవ్ ఇస్తూ ఉంటే మన దేశంలో అది ప్రైవేటు బిల్లు స్థాయిలోనే ఉండడం, దానిపై చర్చ జరగకుండా డర్టీ థింగ్ అంటూ కొందరు పురుష ఎంపీలు అడ్డుతగలడం అత్యంత విషాదం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే వారి సమస్యలను అర్థం చేసుకుని తదనుగుణంగా చట్టాలు రూపొందించుకోగలుగుతాం. ఇక పీరియడ్ సెలవు వినియోగించుకోవాలా, వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆ స్వేచ్ఛ ఆమెకి అవసరం. మహిళల పడే రుతుక్రమం బాధలపై తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన సోదరుడు కావొచ్చు. కన్న కొడుకే కావచ్చు.. ఆ మహిళతో కలిసి జీవన ప్రయాణం సాగించే ప్రతీ మగవాడు అర్థం చేసుకొని, వారికి అండగా ఉన్నప్పుడే మనందరం కలలు కనే జెండర్ సెన్సిటివిటీ సాకారం కావడానికి ఒక అడుగైనా ముందుకు పడుతుంది. ఎందుకీ నొప్పి వస్తుంది ? డిస్మెనోరియా అంటే తీవ్రమైన నొప్పితో కూడిన రుతుక్రమం. మనలో 30 శాతం మంది మహిళలను సాధారణ స్థాయి నుంచి తీవ్రమైన నొప్పి వేధిస్తూనే ఉంటుంది. 10 నుంచి 15 శాతం మందిని అధిక రక్తస్రావం బాధిస్తుంది. చాలామంది మహిళలు రుతుక్రమానికి ముందు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. 5 నుంచి 10 శాతం మందిలో కుంగుబాటు, మూడ్ స్వింగ్స్, కడుపులో సూదులతో గుచ్చుతున్నట్టుగా, కండరాలు మెలిపెడుతున్నట్లు విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, ఇంకొన్ని జీవన శైలిలో మార్పుల కారణంగా వచ్చేవి. మరికొన్ని పర్యావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు. అధిక బరువు (ఒబేసిటీ) కారణంగా హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, అనీమియా (రక్త హీనత), తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీరియడ్స్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పై లక్షణాలన్నింటికీ ఫలానా కారణమని చెప్పలేం. కొందరికే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ సమాధానం దొరకదు. వారి వారి శారీరక ధర్మాలను అనుసరించి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యత కూడా రుతుక్రమంలో నొప్పికి కారణం కావచ్చు. చాలా మంది మహిళల్లో తొలి ప్రసవం తర్వాత ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఎండోమెట్రియాసిస్ లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా బహిష్టు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అధిక రక్త స్రావంతో బాధపడేవారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు)తో బాధ పడేవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆధునిక జీవన శైలిలో భాగమైన రాత్రివేళ ఎక్కువ సమయాలు మేల్కొని ఉండటం, చదువు వల్ల ఒత్తిడి, ఆఫీస్ పని భారం వంటి సమస్యలు నెలసరిలో ఇబ్బందులకి కారణాలుగా చెప్పవచ్చు. – డాక్టర్ వాణి చెరుకూరి, గైనకాలజిస్ట్, ఇవా వుమెన్ కేర్ క్లినిక్ పీరియడ్స్తో యుద్ధం కవరేజీ : బర్ఖాదత్ 2020లో జొమాటో సంస్థ పీరియడ్ లీవ్ ప్రకటించినప్పుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థ సదుద్దేశంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మహిళలు శారీరకంగా బలహీనులనే వాదనకు బలం చేకూరుతందని ఆమె అభిప్రాయడ్డారు. సైన్యంలో చేరాలని, కదనరంగం కవరేజీ ఇవ్వాలని, యుద్ధ విమానాలు నడపాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటూ ఇంకోవైపు పీరియడ్ లీవ్ అడగడం ఎంతవరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు తాను కార్గిల్ యుద్ధం కవరేజీకి వెళ్లినప్పుడు పీరియడ్స్లో ఉన్నానని , నొప్పికి మాత్రలు వేసుకుంటూ, శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోతే టాయిలెట్ పేపర్లు వాడుతూ యుద్ధ వార్తల్ని ప్రపంచానికి వెల్లడించానన్నారు. బర్ఖా అప్పట్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు పలికిన వారి కంటే వ్యతిరేకించినవారే అధికంగా ఉన్నారు. ఆడవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది ఉరుకుల పరుగుల జీవితంలో మగవారితో సమానంగా పోటీపడి పనిచేస్తున్న మహిళలకు సహజసిద్ధమైన ప్రకృతి నియమం పీరియడ్స్. వృత్తి రీత్యా మహిళా కానిస్టేబుల్స్, కండక్టర్లు మొదలు ఇలా ఎక్కువ సమయం విధుల్లో గడిపేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా వారికి పని చేయక తప్పనిసరి పరిస్థితి ఇంటా బయటా ఉంటుంది. మెటర్నటీ లీవ్ ఎలా ఇస్తారో అదే విధంగా మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడంలో తప్పులేదు. అందరిలోనూ ఈ బాధ ఒకే రకంగా ఉండదు కాబట్టి ప్రతినెల కాకుండా, ఏడాదికి కొన్ని రోజులు సెలవు కేటాయించడం మంచి పని. ఇక ఆ సెలవు తీసుకోవాలా, వద్దా అన్నది మహిళల చాయిస్. – సుమతి, తెలంగాణ డీఐజీ ఆహ్వానించాల్సిన అంశం నెలసరి వచ్చినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఎన్నో ఆఫీసుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు. కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్ లేక శానటరీ ప్యాడ్స్ మార్చుకునే వీలు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడో దూరంగా బాత్రూమ్స్ ఉంటాయి. తలుపులు కూడా సరిగా ఉండవు. అలాంటి చోట్ల మహిళలు చాలా ఇబ్బంది పడాలి. అందుకే పీరియడ్ లీవ్ ఇవ్వాలన్న ఆలోచన ఆహ్వానించాల్సిన అంశం. ఆ సమయంలో సెలవు తీసుకున్నంత మాత్రానా మహిళలు శారీరకంగా బలహీనులమని అంగీకరించినట్లన్న వాదన అర్థరహితం. – కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త ఇప్పటికీ చాలెంజే! ఇప్పుడంటే ఆఫీసులు.. వాటిల్లో టాయ్లెట్స్.. కారవాన్స్ వచ్చాయి కానీ నేను యాంకరింగ్కు వచ్చిన కొత్తల్లో అంటే 1991 ఆ టైమ్లో ఊళ్లకు వెళ్లి షూటింగ్స్ చేయాల్సి వచ్చినప్పడు టాయ్లెట్కైనా పీరియడ్స్ టైమ్లో ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలన్నాæ.. చెట్టు.. పుట్ట.. గట్టే గతి. వాటి చాటుకు వెళ్లి చేంజ్ చేసుకోవడమే. కానీ గంటలు గంటలు నిలబడి చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ఇప్పటికీ చాలెంజే పీరియడ్స్ టైమ్లో. ప్యాడ్స్ చేంజ్ చేసుకునే వీలే ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా నా సౌకర్యం కోసం డార్క్ కలర్స్లో ఇవ్వమని అడగడానికి ఉండదు. ఒక్కోసారి లైట్ కలర్స్లో ఇస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకునే జాగ్రత్త ఒక్కటే ఎవ్రీ థింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ ఉండేట్టు చూసుకోవడమే. పాడ్ మీద పాడ్ .. పాడ్ మీద పాడ్ పెట్టుకుని వెళ్లిన సందర్భాలు, క్లాట్స్, క్రాంప్స్తో విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. – యాంకర్ సుమ ఒక ఇంటర్వ్యూలో బలహీనతగానే పరిగణించాలి పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పుడు మహిళలు పీరియడ్ లీవ్ తీసుకుంటే వారి బలహీనతగానే పరిగణించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో నెలసరి బాధల నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మందులు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటితో ఈ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సెలవు కోసం చట్టం చేయడానికి ముందుకొస్తే అందరితోనూ చర్చించి చేయాలి – సంగీత వర్మ, విద్యావేత్త ఎన్నటికీ బలహీన పరచదు ఈ లీవ్ మహిళల్ని ఎన్నటికీ బలహీన పరచదు. మగవారి కంటే మహిళలే అన్ని పనులు బాధ్యతతో చేస్తారు. ఆ సమయంలో విశ్రాంతి దొరికితే ఆ మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. – కవిత రాజేశ్, ఎంట్రప్రెన్యూర్ స్వాగతించాలి తప్ప.. నెలసరి సమయంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి. అందరిలోనూ ఒకేలా ఉండవు. ప్రభుత్వం వాటిని గుర్తించి సెలవు మంజూరు చేస్తే స్వాగతించాలి. అంతే తప్ప అది మహిళల అసమర్థతగా చూడకూడదు. అయితే ఈ పీరియడ్ లీవ్ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలి. – పి. సౌదామిని, డైరెక్టర్, సీఓడబ్ల్యూఈ, ఇండియా స్విగ్గీ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు ►ఆన్లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థలోని డెలివరీ గర్ల్స్కి నెలకి రెండు రోజులు పీరియడ్ లీవ్ ఇస్తోంది. మహిళల హైజీన్ కోసం ఉత్పత్తుల్ని తయారు చేసే వెట్ అండ్ డ్రై కంపెనీ తమ కంపెనీలో పని చేసే మహిళలకు రెండు రోజులు అదనంగా సెలవు ఇస్తోంది. ►హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇండస్ట్రీ ఆర్క్ తమ సెలవుల్లో పీరియడ్ లీవ్ను కూడా చేర్చింది. ఒకటి, లేదా రెండు రోజులు ఆఫ్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ►మలయాళంలో మాతృభూమి పత్రిక నెలకి ఒక రోజు సెలవు ఇస్తోంది. ►చెన్నైకి చెందిన డిజిటల్ మ్యాగజైన్ మ్యాగ్టర్ నెలకి ఒక రోజు లీవ్ ప్రకటించింది. ►జొమాటో సంస్థ అమ్మాయిలకు ఏడాదికి అదనంగా 10 రోజుల సెలవు కల్పించింది. అవసరమైన వారు ఆ సెలవు వినియోగించుకుంటారని అలా ఇచ్చింది. ►ముంబైకి చెందిన డిజిటల్ మీడియా కంపెనీ కల్చర్ మిషన్ తమ సంస్థలో మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన ఒక్క రోజు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. ►బెంగుళూరుకు చెందిన స్టార్టప్ హార్సెస్ స్టేబుల్ న్యూస్ ఉద్యోగుల్లో 60 శాతం మహిళలే. ఈ సంస్థ నెలకు రెండు రోజులు పీరియడ్ లీవ్ మంజూరు చేసింది. ► ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలకు ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇచ్చింది. ►కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు మహిళలకు నెలసరి సమయంలో ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. చదవండి: Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల! -
20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్ టెక్ ప్లాట్ఫామ్ డైన్ఔట్ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్ గ్రూప్ కంపెనీ అయిన ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. 20 నగరాల్లో 50,000 పైచిలుకు రెస్టారెంట్లలో డిస్కౌంట్స్తోపాటు టేబుల్స్ రిజర్వ్ చేసుకునే సౌకర్యాన్ని డైన్ఔట్ కల్పిస్తోంది. కొనుగోలు తర్వాత కూడా డైన్ఔట్ స్వతంత్య్ర యాప్గానే కొనసాగుతుందని స్విగ్గీ శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక కంపెనీలను టైమ్స్ ఇంటర్నెట్ కలిగి ఉంది. కంపెనీల నిర్వహణ, పెట్టుబడులను కొనసాగిస్తోంది. చదవండి: Infosys: కేంద్రం వర్సెస్ ఇన్ఫోసిస్.. బిగుస్తున్న పీటముడి -
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్!
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్ తగిలింది. పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఆరంభం అదిరేలా గూర్గావ్ కేంద్రంగా జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. కానీ డెలివరీ బాయ్స్ లేక..చెప్పిన టైంకు కస్టమర్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను డెలివరీ చేయడంలో విఫలమవుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమస్యతో స్విగ్గీ సైతం తన 'జెనీ' సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్డర్లు ఆలస్యం అవ్వడంతో ఏం జరుగుతుందో అర్ధం గాక కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. మేం అందుబాటులోకి తెచ్చే పదినిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రపంచంలో ఇంత వరకు ఏ ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు కస్టమర్లకు అందించలేదు. కానీ మేం అందిస్తాం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాం. తొలత ఈ టెన్ మినిట్స్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను గుర్గావ్లో ప్రారంభిస్తున్నాం. తర్వాత దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నామని ప్రకటించి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ గట్టి ప్లానే వేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పది నిమిషాల సంగతి దేవుడెరుగు పది నిమిషాల సంగతి దేవుడెరుగు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ 15 నుంచి 20 నిమిషాలకు కూడా అందడం లేదంటూ జొమాటోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం తాము చెప్పినట్లుగానే జొమాటో ఇన్స్టంట్ ద్వారా పదినిమిషాల్లో ఫుడ్ను కస్టమర్లకు అందిస్తున్నామని చెబుతున్నారు. గూర్గావ్లో జొమాటో ఇన్స్టంట్ ద్వారా టెన్ మినిట్స్ డెలివరీపై ఊహించని రెన్సాన్స్ వచ్చిందని, మే నెలలో బెంగళూరులో సైతం ఈ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. జొమాటో ఇన్స్టంట్ యాప్లో సైతం ఫుడ్ డెలివరీ టైం 15 నుంచి 20నిమిషాల సమయం చూపెట్టడంపై ఫుడ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్కు కొత్త కష్టాలు ఈ నేపథ్యంలో జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..సీఎన్బీసీ టీవీ18 ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం..క్విక్ కామర్స్ (10నిమిషాల్లో ఆర్డర్ అందించడం), జాబ్ మొబిలిటీ (ఉన్న జాబ్ వదిలేసి మరో కొత్త ఫీల్డ్లోకి వెళ్లడం) వంటి అంశాలు స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్స్ గుడ్ బై చెబుతున్నట్లు నివేదించింది. దీంతో పాటు సమ్మర్ సీజన్, ఐపీఎల్, వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్..ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. సేమ్ టూ సేమ్ దీంతో ఇన్ టైమ్లో కస్టమర్లకు ఫుడ్ డెలివరీని అందించకపోవడంతో జొమాటో, స్విగ్గీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్ కారణంగా డిమాండ్కు తగ్గట్లు డెలివరీ బాయ్స్ లేక స్విగ్గీ సంస్థ జెనీ పేరుతో నిర్వహిస్తున్న పిక్ అప్.. డ్రాప్ ఆఫ్ సేవల్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. “క్రికెట్, పండుగల సీజన్ ఫలితంగా ఫుడ్ మార్కెట్ప్లేస్, ఇన్స్టామార్ట్ రెండింటికీ అవసరాల్ని తీర్చడానికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం స్విగ్గీ జెనీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటలో స్విగ్గీ తెలిపింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్లో డ్రైవర్గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్నర్స్గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు!
డెలివరీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఇకపై కస్టమర్లకు కావాల్సిన గ్రాసరీస్ను డ్రోన్ల ద్వారా డ్రోన్ పోర్ట్కు డెలివరీ చేయనుంది. బెంగళూరు కేంద్రంగా స్విగ్గీకి చెందిన గ్రాసరీ సర్వీస్ ఫ్లాట్ ఫామ్ 'ఇన్ స్టామర్ట్'లో ఇన్ని రోజులు కస్టమర్లకు వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని డెలివరీ బాయ్స్తో అందిస్తుండేది. కానీ ఇకపై డెలివరీ బాయ్స్ బదులు..డ్రోన్లు డెలివరీ చేయనున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ డ్రోన్ సర్వీస్లు అందించే నాలుగు సంస్థల భాగస్వామ్యంలో డ్రోన్ డెలివరీ సర్వీస్ ట్రయల్స్ను నిర్వహిస్తుంది. డ్రోన్తో సరుకుల రవాణా డిల్లీ -ఎన్సీఆర్, బెంగళూరులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ డ్రోన్ డెలివరీ ట్రయల్స్ను రెండు సార్లు నిర్వహించనున్నట్లు స్విగ్గీ తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. ముందస్తుగా గరుడా ఏరోస్పేస్ సంస్థ బెంగళూరులో, స్కైఎయిర్ మొబిలిటి సంస్థ ఢిల్లీ- ఎన్సీఆర్'లలో డ్రోన్స్ ద్వారా కస్టమర్లకు కావాల్సిన సరుకుల్ని డ్రోన్ పోర్ట్కు చేరవేయనుంది. తొలిఫేజ్ ట్రయల్స్ను పరిశీలించిన తర్వాత ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు సెకండ్ ఫేజ్లో ట్రయల్స్ జరపనున్నాయి. డ్రోన్లతో సరుకుల్ని కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తుందా? డార్క్ స్టోర్ అంటే రీటైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లేదా అవుట్ లెట్లలో ఉన్న సరుకుల్ని డ్రోన్లే..డ్రోన్లు ఉండే ఏరియా(డ్రోన్ పోర్ట్) కు తీసుకొస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్కు డెలివరీ చేస్తారు. కేంద్ర అనుమతుల్లేవు..కానీ ఈ డ్రోన్ డెలివరీకి కేంద్రం అనుమతులు ఇవ్వులేదు. డ్రోన్ డెలివరీ బి హైండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్స్ (బీవీఎల్ఓఎస్) మీద ఆదారపడి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ గతేడాది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియన్స్ శాఖ కేవలం 20సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో స్విగ్గీతో పాటు ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయ్! మనదేశంలో డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా హెల్త్ కేర్ రంగంలో డ్రోన్ టెక్నాలజీ అవసరం ఏర్పడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో వ్యాక్సిన్లు, కరోనా బాధితులకు కావాల్సిన మెడిసిన్లు డ్రోన్ల సాయంతో డెలివరీ చేసేందుకు ట్రయల్స్ నిర్వహించాయి. ఇప్పటికే మన దేశానికి గుర్గావ్ కేంద్రంగా లాజిస్టిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ డ్రోన్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రోన్లను తయారు చేసే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ డ్రోన్ డెలివరీ యూనిట్ వింగ్ టెక్సాస్, డల్లాస్ వాల్గ్రీన్స్ నుండి మెడిసిన్లను డ్రోన్ డెలివరీ చేసింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు! -
వీళ్లకు న్యాయం దక్కేనా?
అమెజాన్.. ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ..జొమాటో.. ఊబర్.. ఓలా.. అర్బన్ క్లాప్.. బిగ్ బాస్కెట్.. కంట్రీ డిలైట్.. ఒక్కటేంటి.. ఏ పని కావాలన్నా యాప్లే. స్మార్ట్ ఫోన్ టచ్ దూరంలో ఆ సర్వీసులు.. మారిన కాలం అందిస్తున్న సౌకర్యాలు! ఈ డెలివరీ సర్వీసెస్కు కస్టమర్స్ నుంచి రేటింగ్ ఉంది.. యాజమాన్యాల నుంచే భద్రత, భరోసా ఉందా అన్నిరకాలుగా? మేడే సందర్భంగా ఓ కథనం.. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. అరచేతి పట్టే స్మార్ట్ ఫోన్తో అన్నీ అనుకున్న టైమ్లో.. కోరుకున్నట్లుగానే మన చెంతకే వచ్చేస్తున్నాయి. ఉప్పు, పప్పు, పాల దగ్గరి నుంచి ఇంటికి, మనిషికి అవసరమైన ప్రతీది గుమ్మం ముందే వాలిపోతున్నాయి. ఇలాంటి సేవల కోసమే రోజుకో యాప్ స్టార్టప్ పుట్టుకొస్తోంది. యూజర్ల కోసం.. యూజర్ల చెంతకే.. యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందిస్తోంది. పైసా, టైమ్ కలిసొస్తుండడంతో అలవాటు పడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. మరి ఆ సేవలను మోసుకొస్తోంది ఎవరు? డెలివరీ సర్వీస్ ఉద్యోగులు. కొండంత భారాన్ని భుజాన వేసుకుని బయలుదేరే బాహుబలులు వాళ్లు. చదవుకున్నోడు.. చదువులేనోడు, వయసు తారతమ్యం, ఆడామగా తేడా ఉండదు అక్కడ. పార్ట్ టైమ్ కావొచ్చు ఫుల్టైం కావొచ్చు.. మోడర్న్ ఏజ్లో అత్యంత ఈజీగా దొరికే జాబ్లు ఇవి. బడుగు జీవుల నుంచి కాస్త ఉన్నోడి దాకా! అంతా పైసా కోసమే ఉరుకులు పరుగులు. ఎండనక వాననక రేయింబవళ్లు నిబద్ధత చూపించే నైజం వాళ్లది. వందలు కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారు అలాంటి శ్రమజీవులు. సోషల్ మీడియా హీరోలు..షీరోలు డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ప్రతి సేవనూ అందించే డెలివరీ, సర్వీస్ పార్ట్నర్స్తో కంపెనీలకు పని మరింత సులువు అయిపోయింది. ఏ విభాగంలో పని చేసినా ఒక కమిట్మెంట్తోనే సాగుతుంది వీళ్ల ప్రయాణం. ఒకరకంగా కరోనా టైమ్ నుంచి వీళ్ల గొప్పదనం ఏంటో.. మొత్తం ప్రపంచమే గుర్తించింది. ‘అన్నా, సార్, మేడమ్..’ పిలుపు ఏదైనా వాళ్లు కోరుకునేది ఒక్కటే.. తమ సేవలకుగానూ మంచి రేటింగ్ ఇవ్వమని! కాస్త ఆలస్యమైతే ఎంత తిట్టుకుంటారో అనే ఆలోచన.. వాళ్లను స్థిమితంగా ఉండనివ్వదు. కస్టమర్ల అసహనం తప్పించుకునేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎండను ఓర్చుకుంటారు. వానల్ని, వరదల్ని లెక్క చేయరు. చలిని లెక్కచేయరు. పగలు రాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా.. చివరకు ఆకలి, అనారోగ్యాల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే బతుకు జీవులు వీళ్లు. అందుకే మీడియాలో.. సోషల్ మీడియాలో ‘హీరోలు, షీరోలు’గా వీళ్ల కథలను, వ్యథలను చూడగలుగుతున్నాం. వీళ్లకంటూ ఓ పేరుంది, కానీ.. ప్రత్యేక కాల పరిమితితో అంటే పార్ట్ టైమ్ లేదంటే ఫ్రీలాన్స్గా పనిచేసే ఈ ఉద్యోగులను గిగ్స్గా పరిగణిస్తుంటారు. 20వ శతాబ్దంలో ‘జాజ్’ యాస నుంచి గిగ్ అనే పదం పుట్టింది.పేరుకు ‘గిగ్’ సేవా రంగం పరిధిలో ఉన్నప్పటికీ.. వీళ్లు ఉద్యోగులా? కార్మికులా? వ్యాపారులా? భాగస్వాములా? కిందిస్థాయి ఉద్యోగులా? ఇలా వీళ్లకు ఓ గుర్తింపంటూ లేదు. కంపెనీల దృష్టిలో కేవలం డెలివరీ పార్ట్నర్స్ మాత్రమే! ‘అత్యవసరాల’ పేరిట అంతా కలసి అద్భుతాలు చేస్తారు. కానీ, కష్టం వస్తే.. భాగస్వాములు కాదు కదా.. వాళ్లను ఎలా పిలవాలో తెలియని పరిస్థితి మన దేశంలో. జనాలకు బాగా దగ్గరైన వీళ్లకంటూ చట్టాల్లో ఒక నిర్వచనం, ఉద్యోగ భద్రత, హక్కులు లేకపోవడం.. నయా జమానా ఉపాధిగా గిగ్ ఎకానమీ మోసుకొచ్చిన కొత్త చిక్కు. క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారం కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. డెలవరీ సర్వీసుల్లో ఉద్యోగినులు! టూమచ్ వర్క్.. జీతం? ఈ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఒక షిఫ్ట్, ఒక టైమింగ్ అంటూ ఉండదు. జీతం బదులు తమ వాటా కట్ చేసుకుని కమిషన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అంటే గిగ్ వర్కర్లకు.. అవసరం కొద్దీ పని.. అందుకు తగ్గట్లు డబ్బు సంపాదన ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కోసారి అది ఆశించినట్లు ఉండకపోవచ్చు కూడా. టైమ్కు పని జరగకపోతే.. కోతే. జీతం, కమిషన్ల సంగతి పక్కనపెడితే.. ఇతర సౌకర్యాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని స్టార్టప్ యాప్లు(కంపెనీలు). ఫెయిర్వర్క్ లిస్ట్లో ఆయా కంపెనీలకు ప్రతి ఏటా దక్కుతున్న మార్కులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లైఫ్ ఒక రేస్ డెలివరీ బాయ్స్ కాలంతో పాటే పరిగెత్తాలి. కాస్త ఆలస్యమైనా కస్టమర్ల నుంచి తిట్లు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్లు తప్పవు. ఒక్కోసారి ఇది వాళ్లకు దక్కే ప్రతిఫలం(కమిషన్, జీతం..) మీద కూడా పడుతుంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్, సరైన రోడ్లు ఉండవు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. సిగ్నల్స్ జంప్ చేసినా.. వేగంగా వెళ్తే పడే ట్రాఫిక్ చలాన్లు.. అదనపు తలనొప్పులు. వీటికి తోడు వివక్షలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఫలానా కమ్యూనిటీ అనగానే ఫుడ్ క్యాన్సిల్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించొద్దంటూ చిన్నచూపు చూడడం లాంటి ఘటనలు చూస్తున్నవే. వీటికి అదనంగా ‘నిమిషాల్లోనే డెలివరీ..’ అంటూ తమ ప్రకటనలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ స్టార్టప్లు. ఇలాంటివి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. మరి వాళ్ల భద్రతకు ఆయా కంపెనీలు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాయా? అసలు ఇన్సూరెన్స్ల పరిధిలోకి వీళ్లను తీసుకొస్తున్నాయా? లేదు.. చట్టంలో అలాంటిదేం లేదు. కేవలం ఏదో ఒకటి, రెండు ఘటనల్లో మొక్కుబడి సాయం అందుతోంది అంతే. అందుకే పెరుగుతున్న రేట్లు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమ బతుకులూ బాగుపడాలని, తమకేమైనా జరిగితే కుటుంబాలకు భద్రత అందాలని ఆశిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఎర్రటి ఎండలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన దుర్గా మీనాగా శర్మ అనే గ్రాడ్యుయేట్కు క్రౌడ్ ఫండిగ్ ద్వారా బైక్ను అందించాడు ఆదిత్య శర్మ అనే కుర్రాడు. రాజాస్థాన్లో ఇటీవల జరిగిన విషయం ఇది. మార్గదర్శకాలు ఉండాల్సిందే! ఆ మధ్య గురుగ్రామ్లో మానిక్యూర్ నుంచి కార్పెట్ క్లీనింగ్ దాకా సేవలు అందించే ఓ కంపెనీలో.. మహిళా ఉద్యోగులకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. కంపెనీ తెచ్చిన కొత్త నిబంధనలు తమ ఆదాయానికి గణనీయంగా గండి కొడుతున్నాయని ఆఫీస్ ముందే టెంట్లు వేసుకుని నిరసనలకు దిగారు. ఆ సమయంలో సదరు కంపెనీ.. వాళ్లను ఉద్యోగులుగా కాకుండా భాగస్వాములుగా పేర్కొని(భాగస్వాములు కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు కదా!) కోర్టు ఆదేశాలతో ఆ నిరసనలను నిర్వీర్యం చేయించింది. మరి భాగస్వాములుగా వాళ్లకు అందాల్సినవన్నీ అందించిందా? అంటే అదీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో, అంతెందుకు జీడీపీలోనూ ఉడతాసాయంగా వీళ్ల భాగం ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గిగ్ ఎకానమీతో ఆదుకుంటున్నారు కాబట్టే వీళ్ల రక్షణ కోసం మార్గదర్శకాలు కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే క్రమక్రమంగా ఈ రంగానికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ భాగస్వాముల ప్రమాదాలపై స్పందిస్తూ.. ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంట్లో స్వయంగా ఇదే గళం వినిపించారు కూడా. డెలివరీలు చేసేది కంపెనీలు కాదు.. అందులో పని చేసేవాళ్లు. వ్యక్తిగత వాహనాల మీద వెళ్తూ యాక్సిడెంట్లలో గాయపడినా.. చనిపోయినా.. అవి కమర్షియల్ వాహనాలు అనే వంక చూపిస్తూ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి బీమా కంపెనీలు. కాబట్టి, వాళ్ల రక్షణకు మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తు చేశారాయన. తమ హక్కుల కోసం సమ్మెకు దిగిన డెలివరీ సర్వీస్ ఉద్యోగులు.. వానలు, వరదల్లోనూ తప్పని డెలివరీ సర్వీస్ తిప్పలు! కరోనా టైమ్లో కుదేలు కరోనా అనే వైరస్.. వందల కోట్ల మంది బతుకుల్ని మార్చి పడేసింది. చాలామందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఈ చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగులూ ఉన్నారు. లాక్డౌన్లతో ఎందరికో పని లేకుండా పోయింది. పూట గడవక వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో యాజమాన్య యాప్ కంపెనీలు.. మొండి చేయి చూపించాయి. కార్మిక చట్టంలో తమకంటూ ఓ పేజీ లేకుండా పోయేసరికి అభద్రతా భావంలోకి కూరుకుపోయారు వాళ్లు. అందుకే మేల్కొని తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు. ఎందుకు కష్టమవుతోంది? ఎదుగూ బొదుగూలేని జీవితాలు ఎవరికైనా సహిస్తాయా? కనీసం కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని అనుకుంటారు. కానీ, లక్షల్లో ఉన్న గిగ్ వర్కర్లు తమ బతుకులకు ఓ భరోసా.. హక్కులకు కనీస రక్షణ ఉంటే చాలని కోరుతున్నారు. మన దేశంలో ఒక నిర్దిష్టత అంటూ లేని ఉద్యోగుల కోసం అసంఘటిత కార్మికుల సామాజిక సంక్షేమ భద్రత చట్టంఒకటి ఉంది. కానీ, గిగ్ వర్కర్లను ఈ చట్టం కింద చేర్చలేదు. పార్ట్టైమ్ జాబ్లు చేసే వాళ్లు కావడంతో.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన, నిర్దిష్టమైన డేటా ఉండడం లేదనేది ప్రభుత్వాల వాదన. అయినప్పటికీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. నవంబర్ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కింద డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. ఇలాంటి ఉద్యోగులను.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. కానీ, అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు. సాధారణంగా యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఇలాంటి గిగ్ వర్కర్లను నేరుగా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి ఆదుకుంటున్నాయి.మన దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకవేళ వర్తింపచేయాలనుకున్నా.. స్టార్టప్ యాప్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయమని న్యాయ నిపుణలు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ, లేదంటే కనీసం నిబంధనలతోనైనా గిగ్ ఉద్యోగుల భధ్రతకు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సి ఉంది. లక్షల మంది శ్రమ జీవుల ఎదురు చూపులు ఎప్పటికీ ఫలిస్తాయో మరి! -భాస్కర్ శ్రీపతి -
ఎలన్ మస్క్.. ప్లీజ్ స్విగ్గీని కొనేయండి.. శుభ్మన్ గిల్ ట్వీట్ వైరల్!
Shubman Gill Request To Elon Musk Viral: టీమిండియా యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్మన్ గిల్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని ఉద్దేశించి గిల్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చేసిన విజ్ఞప్తి ఇందుకు కారణమైంది. అసలు విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ల అధిపతి అయిన మస్క్.. ఇటీవలే సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తమ సమస్యలు ప్రస్తావిస్తూ ఆయనను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో గిల్ కూడా చేరిపోయాడు. సరైన సమయంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేయడం లేదనీ.. దానిని మీరు కొనుగోలు చేయాలంటూ మస్క్ను గిల్ అభ్యర్థించాడు. కనీసం అప్పుడైనా వాళ్ల పద్ధతి మారుతుందేమోనని ట్విటర్ వేదికగా కామెంట్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన స్విగ్గీ కేర్స్.. ‘‘హాయ్ శుభ్మన్ గిల్. ట్విటర్ ఉన్నా లేకున్నా.. ఒకవేళ మీరు మా పోర్టల్లో ఆర్డర్ చేసినట్లయితే తప్పకుండా సరైన సమయంలో డెలివరీ అయ్యేలా చూస్తాం. మాకు మీరు నేరుగా మెసేజ్ చేయవచ్చు. వెంటనే స్పందించి మీకు సేవలు అందించగలం’’ అని పేర్కొంది. ఇందుకు గిల్ సానుకూలంగా స్పందించడంతో అతడికి కృతజ్ఞతలు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే గిల్ చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరీ ఇంత చిన్న విషయానికే అంత ఎలన్ మస్క్ వరకు వెళ్లాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక స్విగ్గీ పేరిట ఉన్న ఓ ఫేక్ అకౌంట్ యూజర్ గిల్ ఆట తీరును ఉద్దేశించి.. ‘‘నీ టీ20 క్రికెట్ కంటే మేము వేగంగానే డెలివరీ చేస్తాం’’ అంటూ ట్రోల్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘నేను డెలివరీ ఎగ్జిక్యూటివ్ను. కొన్నిసార్లు ట్రాఫిక్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుంది. కావాలని ఎవరూ ఏ తప్పూ చేయరు. పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. మరో ఎగ్జిక్యూటివ్ మాత్రం.. ‘‘నువ్వు ఒక్కసారి మా పొజిషన్లోకి వచ్చి చూడు.. ఎంత తొందరగా డెలివరీ చేస్తావో చూస్తాం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక మరికొంత మంది బయో బబుల్ ఉండి బయటి నుంచి ఆహారం తెప్పించుకుంటున్నావా గిల్ అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ జైత్రయాత్రలో గిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 229 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు- 96. చదవండి👉🏾IPL 2022:గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Elon musk, please buy swiggy so they can deliver on time. @elonmusk #swiggy — Shubman Gill (@ShubmanGill) April 29, 2022 How does #PapaPandya hit the ball so effortlessly? #TitansFAM, you now have the best view possible 🤩 Full Video ▶️ exclusively on our website: https://t.co/M6muWPKFbt#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/lmlggtYJyj — Gujarat Titans (@gujarat_titans) April 30, 2022 -
ర్యాపిడోలో స్విగ్గీ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బైక్ ట్యాక్సీ వేదిక అయిన ర్యాపిడో తాజాగా రూ.1,370 కోట్ల నిధులను సమీకరించింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సేవల్లో ఉన్న స్విగ్గీ పెట్టుబడి పెట్టడం విశేషం. సిరీస్–డి ఫండింగ్లో భాగంగా టీవీఎస్ మోటార్ కంపెనీతోపాటు ఇప్పటికే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వెస్ట్బ్రిడ్జ్, షెల్ వెంచర్స్, నెక్సస్ వెంచర్స్ సైతం తాజా రౌండ్లో నిధులను సమకూర్చాయి. సాంకేతికత మెరుగు, సిబ్బంది సంఖ్యను పెంచుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చించ్చనున్నట్టు ర్యాపిడో తెలిపింది. 100కుపైగా నగరాల్లో డ్రైవర్ పార్ట్నర్స్ ఆదాయాలు పెరిగేందుకు, కస్టమర్ల అనుభూతి మెరుగుపర్చడానికి బైక్ ట్యాక్సీ, ఆటో, డెలివరీ విభాగాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు ర్యాపిడో రూ.990 కోట్లు సమీకరించింది. 100కుపైగా నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. 2.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 15 లక్షల మంది డ్రైవర్ పార్ట్నర్స్తో చేతులు కలిపింది. చదవండి: ఆన్లైన్ గేమింగ్ కోసం.. కేవైసీ ఇవ్వాలి -
ఫుడ్ డెలివరీ ఏజెంట్గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..?
TCS Techie Turns Zomato, సాక్షి, చెన్నై: అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్న క్రమంలో ఓ వారం గ్యాప్ దొరికింది. ఇంతలో ఆ వారం రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పార్ట్ టైమ్ జాబ్ను ఎంచుకున్నాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ బాయ్గా చేయడం ఎంత కష్టమో వివరించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీసీఎస్ మాజీ ఉద్యోగి, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ జయరామన్.. జాబ్కు రిజైన్ చేసి మరో కంపెనీలో చేరాడు. కొత్త కంపెనీలో జాయినింగ్ కోసం ఓ వారం గ్యాప్ తీసుకున్నారు. ఆ వారం రోజులు ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఫుడ్ డెలివరీ ఏజెంట్గా మారాడు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి.. ఇబ్బందుల గురించి లింక్డ్ ఇన్లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పెట్రోల్ ధరలు మొదలుకొని స్పీడ్గా ఫుడ్ డెలివరీ చేయడం వరకు సమస్యల జాబితాను తయారు చేసి వివరించాడు. పోస్ట్ ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కాలంతోపాటు పరుగెత్తాలి. చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్లను కరెక్ట్గా చెప్పరు. లొకేషన్ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్ నంబర్లను అప్డేట్ చేయరు. ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్ వివరించాడు. తరచుగా డెలివరీ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. తాను ఓ సారి ఏకంగా 14 కిలో మీటర్లు ప్రయాణించి డెలివరీ ఇవాల్సి వచ్చిందని తెలిపాడు. గూగుల్స్ మ్యాప్స్ సాయంతో కొన్ని సార్లు అడ్రస్లు సరిగా తెలియవు. ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అది నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని చెప్పాడు. కాగా, ఇటీవలే ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెలివరీ విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేయమని వివరణ ఇచ్చారు. -
దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ సర్వీసులు డౌన్
Zomato And Swiggy Down: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల రెండు యాప్స్ డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్స్ పని చేయలేదు. సరిగ్గా లంచ్ సమయంలో యాప్స్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేసేందుకు గంటపాటు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై పలువురు యూజర్స్ ట్విటర్ వేదికగా పోస్టు చేస్తున్నారు. చాలా మంది జొమాటో, స్విగ్గీ యాప్స్ పనిచేయడం లేదని, ఆర్డర్లు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తున్న సమస్యలను స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్లో షేర్ చేశారు. ఫుడ్ ఆర్డర్లు బుక్ కాకపోవడంపై కస్టమర్ కేర్స్కు ఫిర్యాదు చేశారు. ‘అమెజాన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ట్రాక్ చేస్తుండగా యాప్ క్రాష్ అయ్యింది. ఆర్డర్ను పొందలేకపోతున్నాను’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. అయితే అమెజాన్ వెబ్ సర్వీస్ వల్ల రెండు యాప్లు క్రాష్ అయినట్లు భావిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్విగ్గీ, జొమాటో రెండూ స్పందించాయి. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి జొమాటో, స్విగ్గీ క్షమాపణలు తెలిపాయి. తాము తాత్కాలికంగా సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. తమ టీమ్ పనిచేస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నాయి. How come @swiggy_in @SwiggyCares and @zomatocare stopped working at the same time 😭 — FriesBeforeGuys (blue tick) (@alltimefoodie24) April 6, 2022 Is Zomato down? In this economy? (Second time this is happening to me since yesterday btw) — Sahil Rizwan (@SahilRiz) April 6, 2022 -
జొమాటో, స్విగ్గీలకు షాక్! విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: రెస్టారెంట్ భాగస్వాములతో (ఆర్పీ) వ్యాపార లావాదేవీల్లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు జొమాటో, స్విగ్గీ అనుచిత విధానాలకు పాల్పడుతున్న అభియోగాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిష్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) చేసిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా డైరెక్టర్ జనరల్ (డీజీ)కి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక ఆధారాలు బట్టి చూస్తే ప్లాట్ఫామ్లు తమకు వాటాలు కొన్ని బ్రాండ్లను ప్రోత్సహిస్తుండటం వల్ల మిగతా రెస్టారెంట్లపై పోటీపరంగా పడుతున్న పభ్రావాల గురించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం కనిపిస్తోందని సీసీఐ 32 పేజీల ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. అలాగే జొమాటో, స్విగ్గీల ఒప్పందాల ప్రకారం వాటి ప్లాట్ఫామ్లపై తప్ప ఆర్పీలు తమ సొంత సరఫరా వ్యవస్థలో తక్కువ రేట్లు లేదా అధిక డిస్కౌంట్లు ఇవ్వడానికి లేకుండా విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో ఈ రెండు సంస్థలదే ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో ఈ తరహా ఒప్పందాల వల్ల పోటీ దెబ్బతింటుందని సీసీఐ వ్యాఖ్యానించింది. చదవండి: స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు!
ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు తీరిపోనున్నాయి. వారి కష్టానికి ప్రతిఫలంగా స్విగ్గీ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అర్హతల్ని బట్టి సంస్థలో పని చేసే డెలివరీ బాయ్స్ను ఇకపై మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్ని పొందేందుకు డెలివరీ బాయ్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ను మేనేజర్లుగా నియమించుకుంటుంది. వెలుగులోకి వచ్చిన ఆయా నివేదికల ప్రకారం..స్విగ్గీలో 5,6ఏళ్లుగా డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న ఉద్యోగుల్నిఅర్హతల ఆధారంగా మేనేజర్లుగా ప్రమోషన్లు ఇస్తుంది. ఇందుకోసం కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. కళ్లు చెదిరేలా శాలరీలు గిగ్ వర్కర్లకు అధిక డిమాండ్ ఉన్న సమయంలో స్విగ్గీ నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. సాధారణంగా డెలివరీ బాయ్స్కు నెలజీతం సగటున రూ.15,000 నుండి రూ.18వేల మధ్య ఉంటుంది. ఫెస్టివల్స్ సందర్భాలలో రూ.25,000 దాకా సంపాదించవచ్చు. అయితే ప్రస్తుతం స్విగ్గీ నిర్ణయంతో మేనేజర్లుగా బాధత్యలు చేపట్టే డెలివరీ ఎగ్జిక్యూటీవ్లు కళ్లు చెదిరేలా సంవత్సరానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు శాలరీలు లేదంటే డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ శాలరీలు ఉండొచ్చు. ఏరియా మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అనుభవం ఆధారంగా జీతం సంవత్సరానికి సుమారు రూ.11 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డెలివరీ బాయ్ నుంచి మేనేజర్ వరకు ఈ సందర్భంగా స్విగ్గీలో డెలివరీ బాయ్ నుంచి మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన బెంగళూరు ఏరియా మేనేజర్ శరత్ మాట్లాడుతూ.."డిగ్రీపూర్తి చేశా. కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చు. అర్హతకు తగ్గ జాబ్ దొరక్కపోవడంతో 2017లో స్విగ్గీ డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను. ఇటీవల స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటీవ్లను మేనేజర్లుగా నియమించుకుంటుందని తెలుసుకొని జాబ్ కోసం అప్లయ్ చేశాను. జాబ్ వచ్చింది. ఇప్పుడు డెలివరీ బాయ్ నుంచి మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందంటూ" మేనేజర్ శరత్ సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం -
ఓయో, జొమాటో, స్విగ్గీ !! నిమిషానికి ఎంత నష్టపోయాయో తెలుసా?
ఉదాహరణకు మనకు ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు ఇన్నోవేటీవ్గా పరిష్కారం చూపించే సంస్థల్ని స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్ లో లాభాలు ర్యాపిడ్గా గ్రో అవుతుంటాయి. మిలియన్ సంఖ్యలో యూజర్లు ఉంటారు. కోట్ల టర్నోవర్ జరుగుతుంటుంది. అలాంటి స్టార్టప్స్ కు కోవిడ్ మహమ్మారి వందల కోట్లు నష్టయేలా చేసింది. ►ఇటీవల విడుదల ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021లో స్టార్టప్ కు ఎంత నష్టం వాటిల్లింది. నిమిషానికి నష్టపోయాయో తెలుపుతూ కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►రితేష్ అగర్వాల్ స్థాపించిన స్టార్టప్ ఓయో రూమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 రూ.3943.84 కోర్ల నష్టాలను చవిచూసింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ.76,077కు పైగా నష్టపోయింది. ►ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,314 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ నిమిషానికి రూ.25,347కు పైగా నష్టపోయింది. ►పేమెంట్స్ సర్వీస్ స్టార్టప్ మోబీక్విక్ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.111.3 కోట్లు నష్టపోయింది. అంటే ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్కు నిమిషానికి రూ.2,147 నష్టాలు వచ్చాయి. ►మరో డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 778.5 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే ఈ కాలంలో స్టార్టప్ ప్రతి నిమిషానికి రూ.60,069కి పైగా నష్టపోయింది. ►బీమా ప్లాట్ఫారమ్ పాలసీబజార్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.298 కోట్లు నష్టపోయింది. ఈ కాలంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ. 22,995 నష్టపోతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ► ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో గత త్రైమాసికంలో రూ. 63.2 కోట్ల నష్టాన్ని నివేదించింది. నిమిషానికి రూ. 4,876 నష్టాన్ని నమోదు చేసింది. -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
సంచలనం సృష్టించిన స్విగ్గీ...! కింగ్ మేకర్ అయ్యేందుకు రెడీ..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ సంచలనం సృష్టించింది. ఇన్వెస్కో నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో భారీ నిధులను సేకరించి భారత్లోని మరో డెకాకార్న్ స్టార్టప్గా స్విగ్గీ అవతరించింది. 700 మిలియన్ డాలర్లతో..డెకాక్లబ్లోకి.. ఇన్వెస్కో నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్టర్ల నుంచి సుమారు 700 మిలియన్ డాలర్లను స్విగ్గీ సేకరించింది. దీంతో డెకాకార్న్ స్టార్టప్(10 బిలియన్ డాలర్) క్లబ్లోకి స్విగ్గీ చేరింది. ఈ ఫండింగ్ రౌండ్లో బరోన్ క్యాపిటల్ గ్రూప్, సుమేరు వెంచర్, ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్, కోటక్, యాక్సిస్ గ్రోత్ అవెన్యూస్ ఏఐఎఫ్-1, సిక్సిటింత్ స్ట్రీట్ క్యాపిటల్, ఘిశాలో, స్మైల్ గ్రూప్, సెగంటీ క్యాపిటల్ సంస్థలు పాల్గొన్నాయి. ఇప్పటికే స్విగ్గీకి ఇన్వెస్టర్లుగా ఉన్న అల్ఫా వేవ్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంస్థలు కూడా ఈ రౌండ్లో పాల్గొన్నాయి. ఇప్పటివరకు భారత స్టార్టప్స్లో పేటీఎం, ఓయో, బైజూస్ తరువాత స్విగ్గీ డెకాకార్న్ స్టార్టప్గా అవతరించింది. కింగ్ మేకర్ అయ్యేందుకు రెడీ..! భారత్లోని ప్రముఖ నగరాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను స్విగ్గీ అందించిన విషయం తెలిసిందే. ఫుడ్ డెలివరీ సేవలతో పాటుగా గ్రాసరీ సేవలను ‘స్విగ్గీ ఇన్స్టామార్ట్’ ద్వారా మరింత విస్తృతపరిచేందుకు స్విగ్గీ సిద్దమైంది. తాజాగా సేకరించిన 700 మిలియన్ డాలర్లతో ఇన్స్టామార్ట్ సేవలపై మరింత దృష్టిసారించనుంది. ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో కింగ్మేకర్ అయ్యేందుకు కంపెనీ భారీ ప్రణాళికలను రచిస్తోంది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే మూడు త్రైమాసికాల్లో వార్షిక స్థూల సరుకుల విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని కంపెనీ తెలిపింది. 100 మిలియన్ల మంది వినియోగదారులు నెలకు 15 సార్లు ఉపయోగించగలిగే ప్లాట్ఫారమ్గా స్విగ్గీని మార్చడమే మా లక్ష్యమని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీహర్ష మెజెటీ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: 300 బిలియన్ డాలర్లకు చేరుకొనున్న దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ! -
టీవీఎస్ ఐక్యూబ్పై స్విగ్గీ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలకు టీవీఎస్ తయారీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తారు. ఇరు కంపెనీలు స్విగ్గీ డెలివరీ భాగస్వాముల కోసం స్థిరమైన, సమగ్ర పరిష్కారాలను అన్వేషిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా 2025 నాటికి రోజూ 8,00,000 కిలోమీటర్ల మేర డెలివరీలను చేపట్టాలన్నది స్విగ్గీ లక్ష్యం. -
స్విగ్గీ డెలివరీలు సరికొత్తగా..! ప్రణాళికలు సిద్ధం..!
డెలివరీ విషయంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సరికొత్త ప్రణాళికలకు సిద్దమైన్నట్లు కన్పిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు పావులు కదుపుతోంది స్విగ్గీ. టీవీఎస్ మోటార్స్తో ఒప్పందం..! డెలివరీ సేవల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకుగాను స్విగ్గీ ప్రముఖ దేశీయ టూవీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్తో జతకట్టింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫుడ్ డెలివరీలతో పాటు ఆన్-డిమాండ్ సేవలు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 8 లక్షల కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగేలా ప్రణాళికలను స్విగ్గీ ప్రకటించింది. వీలైనంతా త్వరగా ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ మిహిర్ రాజేష్ షా వెల్లడించారు. వివిధ మొబిలిటీ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని టీవీఎస్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వినియోగదారులకు అవసరమైన స్థాయిలో వాహనాలను అందించడంలో ముందుంది. ఈ ఒప్పందం దేశీయ వాహన మార్కెట్లో ఈవీలకు మరింత ఆదరణను పెంచుతుందని ఆశిస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఫ్యూచర్ మొబిలిటీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మను సక్సెనా చెప్పారు. స్విగ్గీ-టీవీఎస్ మోటార్స్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రధాన నగరాల్లో స్విగ్గీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, పూణె, కొచ్చి, కోయంబత్తూరుతో సహా 33 నగరాల్లో అందుబాటులో ఉంది. చదవండి: బిగ్ బాస్కెట్, జియో మార్ట్లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!