triple talaq
-
ఇది హిందుస్తాన్
ప్రయాగ్రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
మోదీని పొగిడిన భార్యకు తలాక్...
బహ్రెయిచ్: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్లో అయోధ్యకు చెందిన అర్షద్తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్ చివరికామెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్గఢ్లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్కు పాకిస్థాన్కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్ను హనుమాన్ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
విద్యార్థుల ఎదుటే టీచర్కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మైనార్టీలకు దగ్గరవడానికి కార్యక్రమాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎనలేని భద్రత లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళల పురోగతికి తాము చేపడుతున్న చర్యల గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని తనను కలిసిన పార్టీ ఎంపీలకు చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్కు చెందిన బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎంపీలతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. రానున్న రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ వర్గాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న చర్యల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని చెప్పినట్టుగా కొందరు ఎంపీలు వెల్లడించారు. -
భార్యకు ట్రిపుల్ తలాక్
యశవంతపుర: ట్రిపుల్ తలాక్ చెప్పి భర్త తనను మోసం చేశాడని మంగళూరు పట్టణంలోని మంగళాదేవి సమీపంలోని మార్నమికట్టెకు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహమ్మద్ హుసేన్ అనే వ్యక్తి మొదటి భార్యను వదిలేసి భర్తకు దూరమైన శబానా అనేమహిళను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల పాటు సంసారం సాగింది. చేసిన అప్పులు తీర్చటానికి ఆమె వద్దనున్న రూ.10 లక్షల విలువైన బంగార అభరణాలను తీసుకొని ఆమెను పుట్టింటిలో వదిలేశాడు. గర్భిణిగా ఉన్న ఆమెను వేధించి బలవంతంగా మాత్రలిచ్చి అబార్షన్ చేయించాడు. ఇటీవల ఆమె ఇంటికి రాగా చితకబాది మూడు సార్లు తలాక్ చెప్పి గెంటేశాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Triple Talaq: రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు. పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్ సైదా అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్బీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవినాథ్ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు. -
పాతబస్తీలో వెలుగులోకొచ్చిన దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్లో మహిళకు పని కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్కి చెందిన షేక్లకు బస్తీలోని బ్రోకర్లు అమ్ముతున్నారు. విజిటింగ్ వీసాలపై మహిళలను అక్కడక పంపిస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని బ్రోకర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్లో తన భార్యకు అదివలీ అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్లో ట్రిపుల్ తలాక్ చేప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు. -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గడిచిన తొలి ఏడాది పాలనలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చింది. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్యలను తుడిచిపెట్టి దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు, అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) కేంద్రంలో రెండోసారి పాలక పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా.అంటూ మోదీ పేర్కొన్నారు. (ప్రధానితో అమిత్ షా భేటీ) 2014 లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటూ ఓటు వేశారు. అంతకు ముందు అయిదేళ్ళలో పరిపాలనా యంత్రాంగం ఎలా విఫలమైందో దేశం చూసింది. ఆ తరువాత అవినీతికి దూరంగా జరిగి, పరిపాలనను గాడిలో పెట్టటం చూశారు. ’అంత్యోదయ’ స్ఫూర్తి కి పూర్తిగా కట్టుబడి లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రాగలిగాం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. పేదల గౌరవం పెరిగింది. దేశం ఆర్థికంగా అందరినీ కలుపుకోవటం జరిగింది. ఉచిత గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించటంతోబాటు ”అందరికీ ఇళ్ళు" సార్థకమయ్యేలా పురోగతి సాధించాం.సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని చాటుకుంది. అదే సమయంలో శతాబ్దాలుగా సాగుతున్న వన్ రాంక్-వన్ పెన్షన్, వన్ నేషన్ - వన్ టాక్స్ , మెరుగైన గరిష్ఠ మద్దతు ధర లాంటివి సాకారం చేసుకున్నాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ 2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే ఓటు వేయలేదు. భారత్ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు, సమీకృతమయ్యారు. జన శక్తి, రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ వెలిగించాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది. (ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు) నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను, రైతులను, మహిళలను, యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9 కోట్ల 50 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం. మన 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాం. మన దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణ దారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ళు పైబడ్డాక రూ. 3000 వంతున నెలసరి పెన్షన్ క్రమం తప్పకుండా అందే ఏర్పాటు చేశాం. బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా, వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవలే స్వయం సహాయక బృందాలకిచ్చే హామీ లేని రుణాలను అంతకు ముందున్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం. (మోదీ 2.0) గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు, మహిళలకు, దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్టమొదటి సారిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణప్రాంతం వారికంటే 10% ఎక్కువగా నమోదైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న అలాంటి చరిత్రాత్మక చర్యలు, నిర్ణయాల జాబితా ఈ లేఖలో ప్రస్తావించటం సాధ్యం కానంత పొడవైనది. కానీ ఈ ఏడాదిలో ప్రతి రోజూ నా ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలుకోసం రేయింబవళ్ళూ చురుగ్గా పనిచేస్తూ వచ్చింది. అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ నా సహ భారతీయులారా, మన దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన కరోనావైరస్ మనదేశాన్నీ చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు, అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా, మరోవైపు భారీ జనాభా, పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో ఉన్న మన దేశం ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ, సామర్థ్యానికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగలేవని మీరు నిరూపించారు. కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా, భారత సాయుధ దళాలను గౌరవించినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా ఎవరూ, ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ, బాధపడలేదనీ చెప్పటం లేదు. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్న తరహా పరిశ్రమలలోని హస్త కళాకారులు, బండ్ల వ్యాపారులు ఇంకా అలాంటి సోదరులెందరో అనేకానేక కష్టాలనెదుర్కున్నారు. వాళ్ళ సమస్యల తీవ్రత తగ్గించటానికి మనం కలసికట్టుగా పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. అయితే, మనం ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనకు ప్రమాదకర దుర్ఘటనలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన నిబంధనలు, మార్గదర్శకాలు పాటించటం ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన బాధ్యత. ఇప్పటిదాకా మనం ఎంతో ఓపికపట్టాం. దాన్ని అలాగే కొనసాగించాలి. భారతదేశం మిగిలిన అనేకదేశాలకంటే భద్రంగా, మెరుగైన స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఇదొక సుదీర్ఘ పోరాటం. కానీ మనం ఇప్పటికే విజయపథంలో సాగుతున్నాం. విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి, నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాటం ప్రియ మిత్రులారా, ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం. ఆర్థిక పరంగా 130 కోట్లమంది భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటంతోబాటు దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్. ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన, కఠోరశ్రమ, మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది. ప్రియ మిత్రులారా, గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు, ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ, సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మనదేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ. నా పట్టుదలకు మూలకారణమైన బలం మీరూ, మీ మద్దతు, మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించిన ఈ కరోనా మహమ్మారితో వచ్చింది కచ్చితంగా ఒక సంక్షోభ సమయమే. కానీ మన భారతీయులకు మాత్రం మరింత పట్టుదలతో వ్యవహరించాల్సిన సమయం కూడా. 130 కోట్ల ప్రజల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఎలాంటి కష్టాలూ శాసించలేవని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. పురోగతి పథంలో ముందుగు సాగితే విజయం మన వశమవుతుంది. కృతమ్ మే దక్షిణే హస్తే, జయో మే సవ్య ఆహితః అంటారు. అంటే, ఒకచేత కార్యాచరణ, విధి నిర్వహణ ఉంటే, రెండో చేతికి విజయం ఖాయం అని. మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ’’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు. -
మోదీ 2.0
సబ్కా సాథ్ , సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న స్ఫూర్తితో తొలుత అడుగులు బలంగానే పడ్డాయి. ఆత్మ విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలతో అనుకున్నవి సాధించారు ఆరు నెలల్లోనే పట్టు సడలింది. అడుగులు తడబడ్డాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు కేంద్రానికి గట్టిగానే తాకాయి. దాని నుంచి బయటపడకుండానే కరోనా కసిగా కాటేసింది. కొన్ని విజయాలు, మరిన్ని వైఫల్యాలతో మోదీ ఏడాది పాలన సాగిందిలా.. ఆరంభం అదిరిపోయింది. కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన విజయోత్సాహంతో మొదటి ఆరు నెలలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడుకి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. 2019, మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన కుడిభుజమైన అమిత్షాకి హోంమంత్రి పదవి కట్టబెట్టి పక్కా ప్రణాళికతో అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మోదీ అడుగులు వేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కల తీరేలా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరే అవకాశం రావడం, 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన సంస్కరణలు, రైతు ఆదాయం, మహిళా సాధికారత చర్యలు, కార్మిక సంస్కరణలు, ముస్లిం మహిళలకి భారీ ఊరటనిచ్చే ట్రిపుల్ తలాక్ చట్టం వంటివి మోదీ క్రేజ్ను అమాంతం పెంచేశాయి. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా వివాదాస్పద బిల్లులు గట్టెక్కేలా చేసిన వ్యూహరచన మోదీకి రాజకీయంగా ఎదురులేకుండా చేసింది. ఇక గత సెప్టెంబర్లో అమెరికాలోని డల్లాస్లో జరిగిన హౌదీ మోదీ కార్యక్రమం ఆయన ఇమేజ్ను పెంచింది. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవ అతిథిగా హాజరవడమే కాకుండా మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ట్రంప్ భారత్ పర్యటనకు రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. రెండో సగంలో తడబడిన అడుగులు పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజుకున్న ఉద్యమం మోదీ మొదటి వైఫల్యంగా చెప్పుకోవాలి. ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఎన్నార్సీని తీసుకురావడానికి ముందు జరిగే ప్రక్రియగా సీఏఏని తీసుకువచ్చారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆ చట్ట ఉద్దేశాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ, ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్ విఫలమైంది. రోజు రోజుకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటివి ఈ ఏడాది కాలంలో మోదీ వైఫల్యాలే. ఇక రాజకీయంగా రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో పిల్లి మొగ్గలు వంటివి మోదీ క్రేజ్ని తగ్గించాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది. కోవిడ్ను ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజంలో నోటి మాటతో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చింది. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్ అయ్యేలా వ్యూహరచన చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముస్లిం మహిళల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లిం సోదరుల్లో ఒక అభద్రతా భావాన్ని నింపింది. కోవిడ్ వీరుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్కీ పలు సవాళ్లు విసిరింది. భౌతిక దూరం మినహా దీనిని అడ్డుకునే దారి లేకపోవడంతో 130 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించాలన్న అత్యంత సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఆరోగ్య రంగంపై పెనుభారం పడకుండా కాపాడగలిగారు. పల్లెలకి వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో విజయవంతమయ్యారు. మోదీ మాటకి కట్టుబడి దేశం అంతా ఏకతాటిపై నిలుస్తూ తొమ్మిది వారాల లాక్డౌన్కు ప్రజలంతా సహకరించడం ఆయనకున్న బలాన్ని తెలియజేస్తుంది. వలస కార్మికుల తరలింపులో గందరగోళం నెలకొని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వైరస్ విస్తరణను సమర్థవంతంగానే అడ్డుకోగలిగారు. ఇప్పుడు ప్రధాన మెట్రో పాలిటిన్ నగరాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులైతే నమోదు కావడం లేదు. కోవిడ్ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం మోదీ తీసుకున్న కరోనా కట్టడి చర్యల్ని దేశంలో 82 శాతం మంది ప్రశంసించారు. ఈ స్థాయిలో ప్రజాదరణ ప్రపంచ దేశాల్లో మరే నాయకుడికి దక్కలేదు. కోవిడ్తో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించినప్పటికీ దానికి ఆశించినంత సానుకూలత లభించలేదు. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. 2019, నవంబర్ 9న యూపీలో అయోధ్య నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన మూడు నెలల్లోనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్ మందిర నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది. ఆర్టికల్ 370 రద్దు రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కశ్మీర్లో అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి తాను అనుకున్నది విజయవంతంగా అమలు చేశారు. -
భయాలున్నా స్వాగతించారు!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు. ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు. చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి జస్టిస్ లావు నాగేశ్వరరావు చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆన్లైన్ డేటాకూ రక్షణ ఉండాలి వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి. జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం జస్టిస్ ఎన్.వి.రమణ జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి. నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. -
ట్రిపుల్ తలాక్ బాధితులకు ఆర్థిక చేయూత!
లక్నో: ట్రిపుల్ తలాక్ బాధితులు పునరావాసం పొందే వరకు ఆర్థిక సహాయం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బాధితులతో పాటు భర్త నుంచి విడాకులు పొందిన అన్ని మతాలు, వర్గాలకు చెందిన మహిళా బాధితులు వార్షిక సహాయం కింద ఏడాదికి రూ. ఆరు వేలు పొందనున్నారు. ఈ ప్రయోజనాలను బాధితులకు 2020 నుంచి వర్తించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయ సహాయం కూడా అందేలా సీఎం యోగీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. యూపీ రాష్ట్ర మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందడానికి వీలుగా.. సరళరీతిలో ప్రక్రియను రూపకల్పన చేశారు. ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే సదరు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు కేసుకు సంబంధించిన కాపీని ప్రూఫ్ కింద సమర్పించాల్సి ఉంటుంది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది ట్రిపుల్ తలాక్ బాధితులతో సహా దాదాపు 10,000 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు. -
ట్రిపుల్ తలాక్: ఆ వెంటనే మామ గ్యాంగ్రేప్
జైపూర్: రాజస్థాన్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మామ, భర్త సోదరుడితో కలిసి కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అల్వార్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజస్ధాన్ ఆల్వార్కు చెందిన మహిళ(25)కు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన అనంతరం.. బాధితురాలి మామ(భర్త తండ్రి)లోని మృగాడు బయటికి వచ్చాడు. కొడుకు విడాకులు చెప్పిన మరుక్షణమే తమ్ముడితో కలిసి కొడలిపై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ ఉన్మాది. మరుసటి రోజు పుట్టింటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి జరిగిన ఘటన గురించి చేప్పింది. తండ్రితో కలిసి బాధిత మహిళ సోమవారం భివాండి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళకు గత శుక్రవారం తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన కొద్ది గంటలకే.. అతని అన్న తనపై దాడి చేశాడని, అంతేకాక తన మామయ్యతో పాటు అతని తమ్ముడు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని అమెను వైద్య పరీక్షలు నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ ఫిర్యాదుతో ట్రిపుల్ తలాక్, అత్యాచారం కేసు కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ప్రస్తుతం బాధితురాలిని వైద్యపరీక్షల కోసం హస్సీటల్కు పంపించామని పోలీసులు తెలిపారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను చెప్పడం అక్రమం. దీనిని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’ పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. -
ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్పై తుదితీర్పును సైతం చీఫ్ జస్టిస్ గొగోయ్ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి తీర్పును జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. రఫేల్ ఒప్పందం... రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. చౌకీదార్ చోర్హై వివాదం మే 10న సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చోర్హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది. ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. -
తొలి ‘తలాక్’ కేసు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముస్లిం మహిళలకు వివాహ భద్రతను కల్పించే చట్టం అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో తొలి కేసు కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో నమోదైంది. ఈ ఏడా ది జూలై 31న చట్టం అమలులోకి రాగా.. సరిగ్గా 15 రోజులకు తన భర్త అదనపు కట్నం తేలేదనే సాకుతో ట్రిపుల్ తలాక్ చెప్పినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న ఇన్స్పెక్టర్ పి.దామోదర్రెడ్డి కేసు నమోదు చేశారు. పెళ్లయిన మూడేళ్లకే... కరీంనగర్ జిల్లా ఆదర్శనగర్కు చెందిన ముస్లిం మహిళకు 2016లో జగిత్యాలకు చెందిన మీర్ ఖాజా అఫ్సరుద్దీన్తో వివాహమైంది. దుబాయిలో డ్రైవర్గా పనిచేస్తున్న అఫ్సరుద్దీన్కు వివాహం జరిపించారు. మూడు నెలల తర్వాత భార్యను దుబాయికి తీసుకెళ్లాడు. అక్కడ భర్తకు చేదోడుగా ఈ మహిళ కూడా ఉద్యోగం చేసింది. వీరికి 8 నెలల వయసున్న బాబు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లో భార్యతో కలసి అఫ్సరుద్దీన్ జగిత్యాల వచ్చాడు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం అఫ్సరుద్దీన్, అతని కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు కట్నంగా తేవాలని, లేదంటే ‘తలాక్’చెబుతామని బెదిరించారు. కట్నం తేవడానికి మహిళ ఒప్పుకోకపోవడంతో ‘ముమ్మారు తలాక్’ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యంగా ముందుకొచ్చిన ముస్లిం మహిళ మూడేళ్లు కాపురం చేసి అదనపు కట్నం తేలేదనే కారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పి బయటకు పంపడంతో సదరు మహిళ ఆగస్టు 14న కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో అఫ్సరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 498(ఎ), సెక్షన్–4 ఆఫ్ డీపీ యాక్ట్, సెక్షన్ 4 ఆఫ్ ముస్లిం మహిళ వివాహ భద్ర త హక్కు చట్టం కింద కేసులు నమోదు చేశారు. అఫ్సరుద్దీన్ను ఆగస్టు 27న రిమాండ్ చేసి, కుటుంబసభ్యులకు అరెస్టు నోటీస్ జారీ చేశారు. కాగా కరీంనగర్లో నమోదైన ఈ తలాక్ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్కు ప్రతిపాదన పంపినట్లు ఇన్స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. కమిషనర్ అనుమతి రాగానే చార్జిïÙటు దాఖలు చేస్తామని చెప్పారు. మూడేళ్ల వరకు జైలు, జరిమానా ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను వాడడం అక్రమం అని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. తలాక్ చెప్పడంతో చట్టాన్ని ఆశ్రయించా నా వివాహం సమయంలో సంప్రదాయ పద్ధతిలో లాంఛనాలు అందించాం. మా తల్లిదండ్రులు వరకట్నంతోపాటు బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. మరో పది లక్షల రూపాయలు తీసుకురావాలని నా భర్త మీర్ఖాజా అఫ్సరుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు వేధించారు. అడిగిన కట్నం తేనందుకు ముమ్మారు తలాక్ చెప్పడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాను. చట్ట ప్రకారం నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – బాధిత మహిళ తెలంగాణలో తొలి కేసు ముస్లిం మహిళ ఫిర్యాదు మేరకు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించి ‘ముస్లిం మహిళ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) యాక్టు – 2019’ప్రకారం కేసు నమోదు చేశాం. ట్రిపుల్ తలాక్ యాక్టు అమలులోకి వచి్చన తర్వాత నమోదైన మొదటి కేసు ఇది. ముస్లిం వర్గానికి చెందిన బాధిత మహిళలు తమకు అండగా తీసుకొచ్చిన చట్టాలను వినియోగించుకుంటే న్యాయం చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. – పి. దామోదర్ రెడ్డి, మహిళా పోలీస్స్టేషన్, కరీంనగర్ -
రెండో భార్యకు తలాక్.. మొదటి భార్యతో పెళ్లి
కర్ణాటక, కృష్ణరాజపురం (బెంగళూరు): ట్రిపుల్ తలాక్ను కేంద్రం నిషేధించినప్పటికీ కొందరు స్వార్థం కోసం తలాక్ను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో విద్యావంతులూ ఉండడం గమనార్హం. దశాబ్ద కాలం క్రితం తలాక్ చెప్పిన మొదటి భార్యను మళ్లీ పెళ్లాడడానికి ఓ టెక్కీ రెండో భార్యకు తలాక్ చెప్పిన ఘటన బుధవారం బెంగళూరు ఆర్టీ నగరలో వెలుగు చూసింది. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్ చెప్పి విడాకులిచ్చాడు. తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది రెండో భార్యకు పుట్టిన బిడ్డ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందడంతో ఆమెకు కూడా కొన్నిరోజుల కిందట తలాక్ చెప్పేశాడు. మళ్లీ మొదటి భార్యను పునర్వివాహమాడాలని యత్నిస్తున్నాడు. దీంతో రెండో భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. -
అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట
పారిస్: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు. ‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. కాప్– 21 సమ్మిట్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన. ఫుట్బాల్ భాషలో మోదీ ప్రసంగం భారత్తో ఫ్రాన్స్కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్బాల్ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు. ‘ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్కు వెళ్లనున్నారు. -
70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత
న్యూఢిల్లీ: బీజేపీ పట్ల మైనార్టీల మనసుల్లో వ్యతిరేకత 70 ఏళ్లుగా నాటుకుపోయిందని, దాన్ని 70 రోజులు లేదా ఏడేళ్లలో తుడిచివేయలేమని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. బీజేపీ 1980లో ప్రారంభమైనప్పటికీ దాని అనుబంధ సంస్థ జన సంఘ్ 1950 నుంచే కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను దోపిడీ చేయకపోవడం, వివక్ష లేకుండా అభివృద్ధి చేయడం వల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి రక్షణలో ఉన్నట్లు మైనార్టీలు భావిస్తున్నారని శుక్రవారం పీటీఐ ఇంటర్వ్యూలో నఖ్వీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మోదీకి మైనార్టీల్లో ప్రజాదరణ పెరిగిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కేంద్రం తెచ్చిన సంస్కరణ చర్యలని, అవి ప్రజాదరణ కోసం ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాక్ చెప్పి.. కిరోసిన్ పోసి..
సాక్షి, లక్నో: ట్రిపుల్ తలాక్ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. ఇందుకు ఉత్తర ప్రదేశ్లోని శ్రావస్తిలో శుక్రవారం జరిగిన పాశవిక ఘటన సాక్ష్యంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో ఓ గ్రామంలో సయిదా నివాసముంటోంది. ఉపాధి నిమిత్తం ఆమె భర్త ముంబైలో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను సయిదాకు ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పాడు. తన భర్త విడాకులు కోరుతున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకోలేదు. భర్తతో కలిసి ఉండమని చెప్పి పంపించారు. నిస్సహాయ స్థితిలో ఇంటికి వెళ్లిన సయిదాతో ఆమె భర్త వాగ్వాదానికి దిగాడు. వెళ్లిపొమ్మంటూ బెదిరించాడు. పోలీసులను ఆశ్రయించినందుకు ఆగ్రహించిన భర్త ఆమె ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయిదు సంవత్సరాల కన్నకూతురు ముందే ఈ దారుణానికి ఒడిగట్టడంతో బాలిక భయకంపితురాలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు అడ్డుకోకపోగా సహకరించడం గమనార్హం. బాలిక పోలీసులకు చెప్పిన విషయాల ప్రకారం.. ఆమెను చంపడానికి కుటుంబం అంతా కలిసి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె పారిపోకుండా భర్త జుట్టు పట్టుకోగా అతని సోదరీమణులు ఒంటిపై కిరోసిన్ పోశారు. వెంటనే అతని తల్లిదండ్రులు ఆమెకు నిప్పంటించారు. తీవ్ర నరకయాతన అనుభవించిన ఆమె కన్నుమూసింది. పోలీసులు నిందితుడితోపాటు అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే గతంలో ఆగస్టు 6న బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయకపోవటంపై విచారణ జరుపుతున్నారు. -
కోడలిపై అత్తింటివారి అమానుష చర్య..
లక్నో : ట్రిపుల్ తలాక్ కేసును వెనక్కి తీసుకోవడానికి అంగీకరించని కోడలిపై అత్తింటివారు అమానుష చర్యకు పాల్పడ్డారు. ఆమె ముక్కు కోసి.. దారుణంగా హింసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో చోటుచేసుకుంది. వివరాలు...తన భర్త ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పడంతో ఆవేదన చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఓపికగా ఎదురు చూసినప్పటికీ తన భర్తలో మార్పు రాలేదని, అతడి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ ఆమె లొంగకపోవడంతో ముక్కు కోసి అమానుషంగా ప్రవర్తించారు. కాగా ఈ కేసులో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చడానికి గతంలో కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ను క్రిమినల్ చర్యగా పరిగణిస్తారన్న విషయం విదితమే. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఉభయ సభల్లో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోదం తెలపడంతో ఇటీవలే చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ముస్లిం మహిళలనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ముంబై, కోల్కతాల్లోని వేశ్యావాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథి వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేడీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయంపై చర్చిస్తూ సేథి పై విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డులనుంచి సేథి మాటలను తొలగించాలని డిమాండ్చేశారు. దీంతో మళ్లీ సేథి జీరో అవర్లో స్పందించారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్కతాల్లోని రెడ్లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని అన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ట్రిఫుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ట్రిఫుల్ తలాక్ బిల్లును ఆమోదించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 38 దేశాల్లో ట్రిఫుల్ తలాక్ను రద్దు చేశారని వెల్లడించారు. ఈ బిల్లుతో మతానికి సంబంధం లేదని, సామాజిక రుగ్మతను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు దీన్ని ఆమోదించినట్టు ఎమ్మెల్యే బిష్ణు సేథి వివరించారు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ నచ్చజెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను లంచ్ వరకు వాయిదా వేయాల్సివచ్చింది. -
రూ.లక్ష కోసం ట్రిపుల్ తలాక్.. కేసు నమోదు..!
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మథురలో ట్రిపుల్ తలాక్-2019 చట్టం కింద కేసు నమోదైంది. వరకట్నం ఇవ్వడం లేదని ఓ వ్యక్తి భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అత్తింటివారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్, మేవత్కు చెందిన ఇక్రమ్కు కొద్దినెలల క్రితం వివాహమైంది. అయితే, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్ను ఏలుకుంటానని ఇక్రమ్ తేల్చిచెప్పాడు. (చదవండి : తలాక్ తలాక్ తలాక్ అంటే.. ఇకపై నేరమే) అత్తింటివారు నిరాకరించడంతో.. నడిరోడ్డుపైనే మూడుసార్లు తలాక్ చెప్పాడు. భార్యతో తనకు ఏ సంబంధం లేదని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ఇక్రమ్పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పీ షాలాబ్ మాథుర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
తమిళనాడులో బీజేపీకి బానిసలా ఆ పార్టీ !
సాక్షి, చెన్నై: తమిళనాట బీజేపీకి అన్నాడీఎంకే పార్టీ బానిసలా కొనసాగుతుందని తమిళనాడు ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే తమిళనాడు ప్రభుత్వం మాత్రం బీజేపీకి బాజా వాయిస్తుందని మండిపడ్డారు. గురువారం ట్రిప్లికేన్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా వందలాది ముస్లిం మహిళలు మోదీకి బ్లాక్ పోస్ట్ కార్డులను పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలతో పాటు మహిళలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ మతాచారాలపై బీజేపీవి కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమైందన్నారు. ఏళ్ల తరబడి ఖురాన్ను పాటిస్తుంటే దానికి వ్యతిరేకంగా హిందుత్వ కుట్రతో బీజేపీ తమ జాతిని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందనీ, దానికి తమిళ ప్రభుత్వం వంత పాడడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. -
తలాక్ తలాక్ తలాక్ అంటే.. ఇకపై నేరమే
న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం ట్రిపుల్ తలాక్ ఇక నుంచి శిక్షార్హమైన నేరం కానుంది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో జారిచేసిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమల్లోకి వచ్చింది. తలాక్ ఏ బిదత్తోపాటు ఇతర రూపాల్లో ఉన్న సత్వర తలాఖ్ విధానాలు ఇకపై చెల్లబోవు. మహిళలకు తమ భర్తలు వెనువెంటనే విడాకులు ఇచ్చేవిధానం ఇకపై నేరం కానుంది. మౌఖికంగాగానీ, లిఖితపూర్వకంగాగానీ, లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఇచ్చే సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లబోదు, చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ అని పేర్కొంటూ ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తే.. దానిని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు మూడేళ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. విపక్షాల వ్యతిరేకత నడుమ ఇటీవల ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో గట్టెక్కిన సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
చేతులెత్తేసిన ప్రతిపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఆట ఆడకముందే ఓడిపోవడం అంటే ఇదే. రాజ్యసభలో ప్రతిపక్షం చేసిందీ ఇదే. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్, ఆర్టీఐ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయంటే ప్రతిపక్షం చేతులెత్తేయడమే అందుకు కారణం. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు కావాల్సినంత బలం రాజ్యసభలో ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ అలా జరగలేదు. అఖండ మెజారిటీతో తాము అధికారాన్ని చేపట్టినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ కలిగిన ప్రతిపక్షాల వల్ల తమ బిల్లులన్నీ వీగిపోతున్నాయంటూ గతంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ మొత్తుకున్నట్లు ఇంకెవరు ఏడ్వాల్సిన అవసరం లేదు. చదవండి: ట్రిపుల్ తలాక్ ఇక రద్దు వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లును గత లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. ఇంతకుముందు లోక్సభ, నేటి లోక్సభ నాటికి రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయితప్ప, ప్రతిపక్షం మెజారిటీ పెద్దగా పడిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఈ వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. ముస్లిం మహిళలకు మేలుకు ఉద్దేశించిన ఈ బిల్లు వల్ల కీడే ఎక్కువ జరుగుతుందన్నది ప్రతపక్షాల వాదన. ఈ బిల్లును గతవారం రాజ్యసభ 99–84 మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లులోని లోపాలను సవరించేందుకు ఎంపిక కమిటీ పంపించాలంటూ ప్రతిపక్షం ప్రవేశ పెట్టిన తీర్మానం 84–100 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఇక ఆర్టీఐ స్వయం ప్రతిపత్తిని సడలిస్తున్న సవరణ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఎందుకు? ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు వల్ల ఇది జరిగిందా? మరి వారెందుకు గైర్హాజరయ్యారు? ట్రిబుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు నలుగురు కాంగ్రెస్ సభ్యులు, ఆరుగురు సమాజ్వాది పార్టీ సభ్యులు, నలుగురు బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తోపాటు మరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున, డీఎంకే, సీపీఎం, తణమూల్ కాంగ్రెస్ల నుంచి ఒక్కరేసి చొప్పున గైర్హాజరయ్యారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు నిజంగా అనారోగ్య కారణాల వల్ల సభకు హాజరుకాక పోవచ్చు. మరి, ఇంత మంది ఎందుకు గైర్హాజరయ్యారు. రెండోసారి మరింత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఏం చేయలేమనే నిర్లిప్త భావం వారిని అలుముకుందా ? ప్రతిపక్షాల మధ్య సమన్వయం లోపించిందా ? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలనే తపన వారిలో చచ్చి పోయిందా? లేదా అధికార పక్షం ప్రలోభాలకు వారు లొంగిపోయారా? తలాక్ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు అది అవాంఛిత బిల్లని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ముఫ్తీ మెహబూబా విమర్శించారు. అయితే ఆ రోజు సభకు ఆమె పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు కూడా హాజరుకాలేదు. అంటే తమ పార్టీ సభ్యులు హాజరైన అడ్డుకోలేరనా, అదే అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం కొరవడినట్లే. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఆరోజు సభలో కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. ఇతర పార్టీల సభ్యుల గైర్హాజరు పట్లనే అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు కారణంగానే బిల్లులు ఆమోదం పొందినట్లు బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభలో కూడా ఇక ప్రతిపక్షం వీగిపోయినట్లే. పాలకపక్షం ఎలాంటి బిల్లులను తీసుకొచ్చినా చెల్లుబాటు కావడం తప్పదేమో! -
ట్రిపుల్ తలాక్ బిల్లు; కశ్మీర్లో పంచాయతీ..!
శ్రీనగర్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా మధ్య ట్విటర్లో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వైఖరిని ముఫ్తీ తప్పుబట్టారు. ఆగమేఘాల మీద ట్రిపుల్ తలాక్ బిల్లును తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈ బిల్లును చట్ట విరుద్దమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. కేవలం ముస్లింలపై కక్ష సాధించడానికే ట్రిపుల్ తలాక్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెహబూబా ముఫ్తీ జీ.. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలు ఎక్కడున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి మీ పార్టీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోవడానికి, బిల్లు గట్టెక్కడానికి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మీ ఆంతర్యం ఏమిటీ అని’ ప్రశ్నించారు. ముఫ్తీ స్పందిస్తూ.. ‘ఓటింగ్ సమయంలో ప్రభుత్వ తీసుకొచ్చే బిల్లులకు నిరసనగా సంయమనం పాటించడం కూడా వ్యతిరేకించినట్టే. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచింది. 1999లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ పార్టీ సభ్యుడు సోజ్ సాహెబ్ను బహిష్కరించారు. అక్కడే మీ నైతికత ఏంటో తెలిసిపోతోంది’ అన్నారు. దీనిపై ‘మీ పార్టీ వంచనను కప్పిపచ్చుకోడానికి ఇరవై ఏళ్ల సంఘటనను గుర్తుచేశారు. మీ ఎంపీలను రాజ్య సభకు గైర్హాజరు కావాలని ఆదేశించినట్టు అంగీకరిస్తున్నారు. సంయమనం పాటించటం ఓటు కాదు. బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది’ అని ఒమర్ విమర్శించారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంగళవారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో గట్టెక్కింది. -
తలాక్ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలిపి ఒక్కరోజు గడవకుండానే ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన బుధవారం అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భాదితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది . ప్రసుతం సదరు యువతి అహ్మదాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తలాక్ చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మంగళవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) పేరిట తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు వ్యతిరేకించినప్పటికీ, బీజేడీ మద్దతు తెలపడంతో బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేస్తే తక్షణమే ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఇప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పినవారికి మూడేళ్ల జైలు శిక్ష అమలవుతుందని బిల్లులో పేర్కొంది. కేంద్రం గతంలో ఫిబ్రవరి 21న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి రానుంది. -
ట్రిపుల్ తలాక్
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
-
ట్రిపుల్ తలాక్ ఇక రద్దు
న్యూఢిల్లీ : ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని (ట్రిపుల్ తలాక్ లేదా తలాక్–ఏ–బిద్దత్ను) నేరంగా పరిగణించేలా కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్సభ గతవారమే ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యింది. తలాక్–ఏ–బిద్దత్ను ఎస్ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలోనైనా.. ఎలా చెప్పినా ఆ చర్యను ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది. ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ)’ పేరిట తెచ్చిన ఈ బిల్లును ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నా డీఎంకే పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ, తటస్థ పార్టీ అయిన బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్ నిర్వహించగా 99 ఓట్లు అనుకూలంగా, 84 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో రాజ్యసభలోనూ ట్రిపుల్ తలాక్ బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చి, కేంద్రం గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ రద్దవుతుంది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్కు ముందు.. అసలు ఈ బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అన్న దానిపైనా ప్రతిపక్షాల బలవంతంతో ఓటింగ్ నిర్వహించారు. ఎంపిక కమిటీకి పంపవద్దని 100 ఓట్లు, పంపాలని 84 ఓట్లు పడ్డాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వమే తీసుకొచ్చి, లోక్సభలో ఆమోదింపజేసుకున్నప్పటికీ, రాజ్యసభలో అది తిరస్కరణకు గురైంది. దీంతో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఈ బిల్లును మరోసారి తీసుకురాగా, పార్లమెంటు ఆమోదం లభించింది. 20 ఇస్లాం దేశాలు కూడా నియంత్రించాయి బిల్లుపై నాలుగున్నర గంటలు సాగిన చర్చలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ తక్షణ ముమ్మారు తలాక్ను 20 ఇస్లాం దేశాలే నియంత్రించాయనీ, ముస్లిం మహిళల మంచి కోసం ప్రజాస్వామ్య దేశమైన మనం ఎందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు. హిందువుల్లోనూ బహుభార్యత్వం, వరకట్నం తదితర నేరాలకు జైలుశిక్ష ఉందని గుర్తుచేసిన రవిశంకర్.. ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి జైలు శిక్ష విధించడాన్ని సమర్థించారు. ముస్లిం ఇళ్లలో గొడవలు పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఈ బిల్లును తెచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించడంపై రవిశంకర్ సమాధానమిస్తూ, ముస్లిం మహిళల హక్కులను పట్టించుకోనందునే ఆ పార్టీకి 1984 తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ కూడా రాలేదని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధం కాదని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునే తాము ఇప్పుడు ఈ బిల్లు తీసుకురాలేదనీ, వాట్సాప్లో కూడా విడాకులిచ్చే భర్తల నుంచి ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని రవిశంకర్ చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోణంలో చూడాలని కోరారు. టీడీపీ, టీఆర్ఎస్ ఓటింగ్కు గైర్హాజరు బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. బీజేపీ నేత అరుణ్ జైట్లీ సైతం ఓటింగ్కు రాలేకపోయారు. ఇక ఆస్కార్ ఫెర్నాండెజ్తో సహా కాంగ్రెస్కు చెందిన ఐదుగురు, ఎన్సీపీ ఎంపీలు శరద్పవార్, ప్రఫుల్ పటేల్, ఐదుగురు ఎస్పీ నేతలతో సహా మొత్తం 20 మంది ప్రతిపక్ష ఎంపీలూ ఓటింగ్కు గైర్హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన 11 మంది సభ్యుల అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్, ఆర్జేడీకి చెందిన జెఠ్మలానీ ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో మొత్తం 57 మంది సభ్యులు ఓటింగ్కు దూరమైనట్లయింది. ఫలితంగా సభ్యుల సంఖ్య 183కు చేరి బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 92కు పరిమితమయింది. బిల్లులో ఏముంది? తలాక్–ఏ–బిద్దత్(తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పడం)ను ఎస్ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్–ఏ–బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారంట్ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది. చారిత్రక తప్పిదాన్ని సరిచేశాం: మోదీ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా పురాతన, మధ్యయుగ కాలం నాటి నుంచి ముస్లిం మహిళలకు జరుగుతున్న చారిత్రక తప్పిదాన్ని తాము సరిచేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై ట్రిపుల్ తలాక్ చెత్తబుట్టకు పరిమితమవుతుందన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు ఇండియా సంతోషిస్తోంది. సమాజంలో లింగ సమానత్వం సాధనలో ఇదో విజయం. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ధన్యవాదాలు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీల చర్య భారత చరిత్రలో నిలిచిపోతుంది. పురాతన, మధ్యయుగం నాటి విధానమొకటి ఎట్టకేలకు చెత్తబుట్టలోకి చేరింది. ముస్లిం మహిళలు సాధికారత సాధించడంలో, సమాజంలో వారికి సముచిత గౌరవాన్ని సంపాదించుకోవడంలో ఈ చట్టం సహాయపడుతుంది’ అని వివరించారు. ముస్లింలపై దాడుల్లో ఓ భాగం: ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలపడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 2014 నుంచి దేశంలో ముస్లింల పౌరసత్వం, గుర్తింపుపై జరుగుతున్న దాడుల్లో ఈ బిల్లు ఆమోదం ఒక భాగం మాత్రమేనని ఆయన విమర్శించారు. మూకదాడులు, పోలీసుల దురాగతాలు, సామూహిక ఖైదు తమను నిస్సహాయులను చేయలేవని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఉన్న బలమైన నమ్మకంతో అణచివేతకు, అన్యాయానికి, హక్కుల తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. భారత రాజ్యాంగ బహుళత్వం, వైవిధ్యతను కాపాడేందుకు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలకు వ్యతిరేకమనీ, వారిని మరింత దీనావస్థలోకి నెడుతుందని ఒవైసీ అన్నారు. వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్సీపీ బీజేపీకి 114 మంది సభ్యుల బలం ఉన్నా 11 మంది సభ్యులున్న అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్ వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోవటం, మరికొందరు హాజరుకాకపోవటంతో సభ్యుల సంఖ్య 92కు తగ్గింది. ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్సీపీ తొలి నుంచీ కనబరుస్తున్న వైఖరికి తగ్గట్టుగానే ఈ బిల్లును వ్యతిరేకించింది. సభలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. తటస్థ వైఖరితో ఉన్న ఏడుగురు సభ్యుల బిజూ జనతాదళ్ ఆఖరి క్షణంలో ఈ బిల్లుకు మద్దతిచ్చింది. దీంతో మద్దతిచ్చిన సభ్యుల సంఖ్య 99కి చేరింది. దీంతో బిల్లుకు అనుకూలంగా 99 – వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లు గట్టెక్కింది. -
చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇతరులతో పాటు ముస్లిం మహిళ కూడా సమాన హక్కులు కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లుకు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళలపై చూపుతున్న వివక్షకు నేడు సరైన న్యాయం జరిగిందన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం పెరిగిందన్న మోదీ.. ఇది మహిళ విజయంగా వర్ణించారు. కాగా మంగళవారం సాయంత్రం రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల సభ్యులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు. బిల్లు ఆమోదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక దేశంలో ట్రిపుల్ తలాక్ అనే పదమే వినపడదని స్పష్టం చేశారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి అసలైన విజయం నేడు లభించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు. -
ట్రిపుల్ తలాక్కు వైఎస్సార్సీపీ వ్యతిరేకం
-
రాజ్యసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్ ఫిగర్ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. పలువురు సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గడం వల్ల బిల్లు సునాయంగా ఆమోదం పొందింది. సభ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్ పద్దతిలో బిల్లుపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంలో పొందుపరిచిన విధంగా కఠిన శిక్ష అమలు కానుంది. కాగా తలాక్ బిల్లుకు ఈనెల 25న లోక్సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో కూడా గట్టెక్కడంతో రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా.. టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బిల్లుకు బీజేడీ మద్దతిచ్చింది. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి బిల్లును నెగ్గించుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచించింది. అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనలకు సభ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్ను నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 84 మంది ఓటువేయగా.. వ్యతిరేకంగా 100 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో సవరణలకు విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది. -
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడివేడి చర్చ
-
ట్రిపుల్ తలాక్కు వైఎస్సార్సీపీ వ్యతిరేకం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చలో భాగంగా సభలో మాట్లాడిన ఆయన.. పార్టీ వైఖరిని తెలిపారు. బిల్లులోని పలు అంశాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్ సివిల్ కాంట్రాక్ట్ కిందకు వచ్చే అంశమని, వాటికి క్రిమినల్ పనిష్మంట్ ఎలా ఇస్తారని విజయసాయి రెడ్డి సభలో ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారని ప్రశ్నలను లేవనెత్తారు. ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి ఇది వరకే లోక్సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఇదివరకే ఆమోదం పొందగా.. రాజ్యసభలో ప్రస్తుతం చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్తో సహా, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం బిల్లును వ్యతిరేకించగా.. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి. మరో వైపు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. -
‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ బిల్లుతో ముస్లిం కుటుంబాలకు మేలు జరగకపోగా.. అవి విచ్ఛిన్నయ్యే అవకాశాలే అధికంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యభర్తలు చెరో లాయర్ను మాట్లాడుకుని.. ఉన్న కాస్తోకూస్తో ఆస్తిని కోర్టు వ్యవహారాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. మైనారిటీ సోదరసోదరీమణుల మధ్య ట్రిపుల్ తలాక్ చిచ్చుపెడుతుందని హెచ్చరించారు. ఎట్టకేలకు కోర్టు తీర్పు అనంతరం ఆ కుటుంబం దివాళా తీయాల్సిందేనా అని ప్రశ్నించారు. అప్పటికే ఆర్థికంగా నష్టాలపాలు కావడంతో జైలు పాలైన వ్యక్తి జీవితం దుర్భరంగా మారుతుందని చెప్పారు. వారిని ఆత్మహత్య చేసుకునేందుకు.. లేక బందిపోటుగా మారేందుకు ఈ బిల్లు పురిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్: కాంగ్రెస్ ఎంపీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అమిత్ షా సమక్షంలో రేపు బీజేపీ చేరబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని అమేథికి చెందిన సంజయ్ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాజీనామాతో పార్టీ నేతలు షాక్కిగురయ్యారు. -
రాజ్యసభలో ట్రిపుల్ రగడ
న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి ఇస్లామిక్ దేశాలు సైతం త్రిపుల్ తలాక్ ను నిషేధించాయని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఉదంతాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయని తెలిపారు.బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులకు మాత్రమే ట్రిపుల్ తలాక్ పై కేసు పెట్టే అధికారం ఇచ్చామని,ఈ బిల్లు మానవత్వానికి, న్యాయానికి సంబంధించినది మాత్రమేనని, మతంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం ఈబిల్లు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్కు సవాల్గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. -
నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో విపక్షాల నిరసనల నడుమ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభ ముందుకొచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో గట్టెక్కించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సభకు విధిగా హాజరు కావాలని పార్టీ రాజ్యసభ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభలో ఈబిల్లు ఆమోదం ప్రభుత్వానికి అంత సులభం కాదు. పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్కు సవాల్గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. మరోవైపు విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా లింగ సమానత్వం, న్యాయం దిశగా ఈ బిల్లును రూపొందించామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చెబుతోంది. -
స్టాంప్పేపర్పై తలాక్
ఇండోర్: ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదించి రెండు రోజులు కూడా గడువకముందే స్టాంపుపై తలాక్ చెప్పిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. తలాక్ ద్వారా విడాకులు ఇస్తానన్న తన భర్త తిరిగి కావాలంటూ, భోజ్పురి సినిమాల నటి రేష్మా షేక్ (29) పోలీసులను ఆశ్రయించింది. ముదస్సిర్ బేగ్ (34), తాను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమకు ప్రస్తుతం రెండు నెలల పాప కూడా ఉందని, అతడి కోసం నటన కూడా మానేశానని తెలిపారు. అయితే తన భర్త విడాకులు ఇస్తున్నానంటూ రూ. 100ల స్టాంపు మీద తలాక్ పంపాడు. ఈ విడాకులను తాను అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను నివాసం ఉంటున్న చందన్ నగర్ పోలీసులుకు విషయం తెలియజేయగా వారు చర్యలు తీసుకోలేదని అన్నారు. పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ శర్మను ప్రశ్నించగా, అది భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ అని తెలిపారు. పలుమార్లు ముదస్సర్కు ఫోన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తలాక్ ఎ బైన్, ట్రిపుల్ తలాక్తో పోలిస్తే భిన్నమైనదని షరియా నిపుణులు తెలిపారు. -
‘తక్షణ తలాక్’పై ఇంత తొందరేల?
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులిచ్చే దురాచారాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. తలాక్ బిల్లు లోక్సభ ముందుకు రావడం ఇది మూడోసారి. ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్న ఆ సభలో తొలి రెండుసార్లూ బిల్లుకు సులభంగానే ఆమోదముద్ర పడినా, రాజ్యసభలో విపక్షానికి మెజారిటీ ఉండటంతో అక్కడ సాధ్యం కాలేదు. ఇప్పుడైతే రాజ్యసభ ఆమోదం అసాధ్యం కాదన్న విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. మధ్యలో నిరుడు సెప్టెంబర్లో ఒకసారి ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. కానీ తాజా బిల్లును గమనిస్తే ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ప్రధాన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించదల్చుకోలేదని అర్ధమవుతుంది. ముస్లిం మహిళలకు సమస్యగా మారిన తక్షణ తలాక్ విధానం ఉండరాదన్న నిర్ణయంతో ఎవరూ విభేదించడం లేదు. ముస్లిం పర్సనల్ లా గుర్తిస్తున్న తక్షణ తలాక్ విధానం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్లక్రితం తీర్పునిచ్చినప్పుడే చాలామంది దాన్ని హర్షించారు. మన రాజ్యాంగం భిన్న మతాలకుండే వైయక్తిక చట్టాలను (పర్సనల్ లా) గుర్తించింది. కానీ ఏ చట్టమైనా రాజ్యాంగం నిర్దేశించిన స్త్రీ, పురుష సమానత్వానికి లోబడి ఉండాల్సిందే. వివక్షనూ, ఆధిపత్య ధోరణిని ప్రోత్సహించే ఏదైనా చెల్లుబాటు కాదు. ఒకసారి సర్వోన్నత న్యాయస్థానం చెప్పాక ఆ విధానంలో ఎవరైనా విడాకులివ్వడానికి ప్రయత్నిస్తే అది చెల్లుబాటు కాదు. నిజానికి అందుకు చట్టం అవసరం కూడా లేదు. అయినా చట్టం అవసర మని ప్రభుత్వం భావిస్తే కాదనేవారుండరు. కానీ తక్షణ తలాక్ చెప్పడాన్ని దానికదే నేరంగా పరిగ ణించడం సరికాదని బిల్లును వ్యతిరేకిస్తున్నవారంటున్నారు. మొదట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు ఉన్న నిబంధనను ప్రభుత్వం స్వల్పంగా మార్చింది. భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మార్చారు. అలాగే దాన్ని రాజీకి వీలైన నేరంగా కూడా పరిగణిస్తూ ప్రతిపాదించారు. మొదట్లో ఉన్నట్టు ఇది నాన్ బెయిలబుల్ కేసుగానే ఉన్నా విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా తక్షణ తలాక్ను నేరంగా పరిగణించరాదన్న ప్రధాన సూచనను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ వైయక్తిక చట్టమైనా వివాహాన్ని సివిల్ ఒప్పందంగానే పరిగణిస్తుంది. భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో రెండోవారు దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అది లభించని పక్షంలో పరిహారాన్ని కోరవచ్చు. గృహ హింస చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేతప్ప ఉల్లంఘించినవారిని నేరస్తులుగా పరిగణించే విధా నం లేదు. సివిల్ ఒప్పందాన్ని ఉల్లంఘించే ఇతర మతాలవారి విషయంలో లేని నిబంధన ముస్లిం పురుషులకు ఎందుకుండాలన్నది బిల్లును వ్యతిరేకిస్తున్నవారి అభ్యంతరం. ఇది రాజ్యాంగం ప్రవ చిస్తున్న సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధం కాదా? ఇందువల్ల ముస్లిం మహిళలకు కలిగే మేలేమిటో కూడా అర్ధం కాదు. భర్త నిరాదరించిన పక్షంలో ఒంటరైన మహిళ వెంటనే కోరుకునేది జీవనం సాగించడానికి అవసరమైన మొత్తం. న్యాయస్థానం ఆ మొత్తాన్ని భర్త నుంచే ఇప్పించాలి. కానీ ఈ బిల్లు చట్టమయ్యాక భర్త జైలు పాలైతే ఆ పరిహారాన్ని అతను చెల్లించడం ఎలా సాధ్యం? అతడు చెల్లించలేని పక్షంలో ఆమెకు పరిహారం దక్కేదెలా? పైగా వివాహంలో పొరపొచ్చాలు వచ్చిన ప్పుడు సహజంగానే ఇద్దరినీ మళ్లీ ఒకటి చేయడానికి అందరూ ప్రయత్ని స్తారు. తక్షణ తలాక్ చెప్పిన భర్తపై మహిళ ఆవేశంతో కేసు పెట్టి అరెస్టు చేయిస్తే అలాంటి రాజీ యత్నాలకు అసలు వీలుంటుందా? ఈ బిల్లు చట్టమైతే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా తక్షణ తలాక్ చెల్లదని చెప్పిందే తప్ప, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిం చాలని అనలేదు. చర్చ సందర్భంగా బిల్లును వ్యతిరేకించినవారు దాన్ని స్థాయీ సంఘానికి పంపాలని కోరారు. ఆ సూచన ఆహ్వానించదగ్గది. అక్కడైతే బిల్లును సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి, మార్పులు సూచించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీన్ని వెనువెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న మంత్రి అందుకు కారణం చెప్పారు. 2017 జనవరి నుంచి ఇంతవరకూ దేశవ్యాప్తంగా తక్షణ తలాక్తో విడాకులిచ్చిన ఉదంతాలు 547 జరిగాయని వివరించారు. అలాగే సుప్రీంకోర్టు ఇది చెల్లుబాటు కాదని చెప్పాక కూడా 345 ఉదంతాలు చోటుచేసుకున్నాయన్నారు. నిరుడు సెప్టెంబ ర్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన గణాంకాలను ఒకసారి ప్రస్తావించుకోవాలి. వాటి ప్రకారం అప్పటికి తక్షణ తలాక్ ఉదంతాలు 430 జరిగాయి. అంటే ఆ తర్వాత ఇంత వరకూ... అంటే ఈ పది నెలలకాలంలో కొత్తగా 117 ఉదంతాలు జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ముస్లింల జనాభా దాదాపు 17.5 కోట్లు. ఇన్ని కోట్లమందిలో తక్షణ తలాక్ విధానం ఆచరిస్తున్నవారు ఎంత తక్కువమందో మంత్రి చెప్పిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి గనుక తక్షణ తలాక్ రద్దు వద్దని ఎవరూ అనరు. కానీ ఆదరాబాదరాగా తీసుకురావలసిన అగత్యం లేదు. ఒక చట్టం చేయదల్చుకున్నప్పుడు దానిపై అన్ని కోణాల్లోనూ చర్చించడం, ఎలాంటి పర్యవసానాలుండగలవో ఆలోచించడం, అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అప్పుడు మాత్రమే ఏ చట్టమైనా సమ గ్రంగా ఉంటుంది. అసహాయులకు ఆసరాగా నిలుస్తుంది. ఆదరాబాదరాగా తీసుకురావడం వల్ల, సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఆశిస్తున్న ఫలితం రాదు. తాము ముస్లిం మహిళల ఆత్మగౌర వాన్ని కాపాడదల్చుకున్నామని, వారికి అన్యాయం జరగకుండా చూడదల్చుకున్నామని మంత్రి అంటున్నారు. కానీ ఈ బిల్లు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దాఖలా కనబడటం లేదు. కేంద్రం మరోసారి ఆలోచించాలి. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. విపక్షాల నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. బిల్లుపై జరిగిన చర్చలో పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. 2017లో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ను నిషేధించినా ఈ పద్ధతి కొనసాగుతుండటంతో ట్రిపుల్ తలాక్ను నిషేధించే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి సెషన్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీ(యూ), పీడీపీ వంటి పలు పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరినా లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణ దిశగా బిల్లు ఆమోదం అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ జేడీ(యూ), తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు -
స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్ తలాక్?!
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను మీరు శిక్షిస్తున్నారు.. ‘స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ మీరు మాత్రం ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించాలని అనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మీరు సరికొత్త భారతాన్ని నిర్మించాలనే మాటకు కట్టుబడి ఉన్నారా! ట్రిపుల్ తలాక్ సరైంది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. జైలులో ఉన్న భర్త బయటికి వచ్చేదాకా విడాకులు పొందిన ఓ భార్యకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు. భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించి భార్యలను మీరు శిక్షిస్తున్నారు’ అని అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. వాళ్ల కోసమే ఈ బిల్లు.. లోక్సభలో చర్చ సందర్భంగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ స్పందించారు. ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య లేదా కూతురు ఒక్క ఫోన్ కాల్ ద్వారా విడాకులు పొందటాన్ని ఒవైసీ సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ‘ వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారా విడాకులు ఇచ్చే వాళ్ల కోసమే ఈ బిల్లు. పళ్లు సరిగా లేవని, కూరలో తగినంత ఉప్పు వేయలేదని విడాకులు ఇస్తున్న మహానుభావులను చూస్తూనే ఉన్నాం కదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
జైలు శిక్ష అభ్యంతరకరం: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. గురువారం లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినపుడు, దాని పరిణామాలు కూడా సివిల్గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలు శిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని.. విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరమన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా సాధికారికతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మిథున్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
మరో పది రోజులు పార్లమెంట్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు మరో 10 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎంపీలకు తెలిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కీలకమైన పలు బిల్లులు పెండింగ్లో ఉన్నందునే సమావేశాలను పొడిగిస్తున్నట్లు సమాచారం. తదుపరి వివరాలను, తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసే వరకూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని పార్టీ ఎంపీలకు అమిత్షా సూచించినట్లు సమాచారం. కేంద్రం సీరియస్గా తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో ఉంది. -
పెళ్లైన 24 గంటలకే విడాకులు
లక్నో : వివాహం అయ్యి ఓ రోజైనా గడవకముందే నూతన వధువుకు తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జహీంగీరాబాద్లో చోటు చేసుకుంది. వివరాలు.. షాహే అలం అనే వ్యక్తికి ఈ నెల 13న రుక్సానా బానోతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు అలంకు కట్నంలో భాగంగా బైక్ ఇస్తామని చెప్పారు బానో తల్లిదండ్రులు. కానీ పెళ్లి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో బైక్ ఇవ్వలేదు. ఆగ్రహించిన అలం.. రుక్సానాకు ముమ్మార్లు తలాక్ చెప్పాడు. దాంతో రుక్సానా తండ్రి అలంతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రూ. 30 అడిగినందుకు తలాక్
లక్నో : ఓ వైపు ట్రిపుల్ తలాక్ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్ తలాక్ సంఘటన చేసుకుంది. కూరగాయలు కొనేందుకు 30 రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. వివరాలు.. నోయిడాకు చెందిన జైనాబ్(30) కూరగాయలు కొనడం కోసం భర్తతో పాటు స్థానిక రావోజి మార్కెట్కు వెళ్లింది. కురగాయలు కొనే నిమిత్తం రూ. 30 ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. దాంతో ఆగ్రహించిన ఆమె భర్త సబీర్(32) స్క్రూడ్రైవర్తో జైనాబ్ మీద దాడి చేయడమే కాక.. ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ సంఘటన గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘పెళ్లైన దగ్గర నుంచి సబీర్ నా కూతుర్ని హింసిస్తున్నాడు. అతని సోదరులు నా కుమార్తెతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం జైనాబ్ మా ఇంటికి వచ్చింది. ఐదు రోజుల తర్వాత తన అత్త వారింటికి వెళ్లింది. వెళ్లిన దగ్గర నుంచి సబీర్ తనకు విడాకులు కావాలంటూ నా కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కూరగాయల కోసం నా కుమార్తె 30 రూపాయలు అడిగింది. దాంతో సబీర్ నా కుమార్తెకు తలాక్ చెప్పాడ’ని వాపోయాడు. జైనాబ్ తండ్రి ఫిర్యాదు మేరకు సబీర్, అతని కుటుంబ సభ్యుల మీద దాద్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్కు చెక్ : జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు మద్దతు ఇవ్వబోమని బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ స్పష్టం చేసింది. జేడీయూ ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తుందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆ పార్టీ నేత, బిహార్ మంత్రి షయం రజాక్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ సామాజికాంశమని, దీన్ని సమాజమే పరిష్కరించాలని చెప్సారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లును బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను చర్చల ద్వారా లేదా కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించాలని నితీష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకమని నితీష్ స్పష్టం చేశారు. -
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో వేధింపులకు గురై భారత్కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
నేటి నుంచి పార్లమెంటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. గురు వారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, ప్రజా ప్రాతినిథ్య చట్టం–2017 బిల్లు, కంపెనీల చట్టం బల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయితే ఈ బిల్లులపై జేడీయూ సహా పలు మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. అయోధ్య చుట్టూ వివాదాస్పదం కాని స్థలాన్ని యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్రం చెప్పడంపైనా చర్చ సాగే అవకాశముంది. కాగా, తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఈ లోక్సభ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. -
10 నిమిషాలు లేట్గా వచ్చినందుకు విడాకులు..
లక్నో : ట్రిపుల్ తలాక్ నేరం అంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగడం లేదు. భార్య 10 నిమిషాలు ఇంటికి ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఫోన్లోనే విడాకులిచ్చాడు ఓ ప్రబుద్ధుడు. యూపీలో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. బాధితురాలు జబ్బుచేసి ఉన్న తన నానమ్మను చూడ్డానికి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు భర్త సరిగా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన టైం కాన్న ఓ పది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చింది బాధితురాలు. దాంతో బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భర్త నిర్వకం తెలుసుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తారింటికి వస్తే ఆమె మీద దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబసభ్యుల మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాధితురాలు మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆత్మహత్యే దిక్కని బాధపడుతుంది. అంతేకాక పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు చాలా పేదవారిని కట్నం ఇచ్చుకోలేరని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోయింది. కట్నం కోసం తనను కొట్టడమే కాక.. ఇప్పటికే ఒక సారి ఆబార్షన్ కూడా చేయించారని తెలిపింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరింది. -
ఎంసీఐ, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ను కేంద్రం మరోసారి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్ను కేంద్రం మరోసారి ఇచ్చింది. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి హైదరాబాద్: ముస్లిం మహిళలను ఉద్ధరించాలని కేంద్రం తీసుకొస్తున్న ట్రిపుల్ తలాక్ చట్టంతో మహిళలకు లాభం కంటే నష్టం ఎక్కువని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయ్యద్ హమేద్ హుస్సేన్ షుత్తరీ పేర్కొన్నారు. విడాకుల వ్యవస్థ ముస్లిం సమాజంలోనే స్త్రీ, పురుషులిద్దరికీ సమ న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కేంద్ర హరిస్తుందని మండిపడ్డారు. డబీర్పురాలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇతర మతస్తుల కంటే ముస్లింలలోనే విడాకుల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ముస్లిం సమాజంలో భార్యాభర్తలిద్దరూ కలసి జీవించలేనప్పుడు 3 నుంచి 4 నెలల వ్యవధిలో స్వేచ్ఛగా విడిపోయే అవకాశాన్ని ఇస్లామీయా షరియత్ ఇచ్చిందన్నారు. ముస్లిం వివాహాన్ని ఓ సివిల్ కాంట్రాక్టుగా పరిగణించాలని ఆయన కోరారు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త జైలుకు పోతే అతని భార్య, పిల్లల పోషణ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. బిల్లులో మార్పులు చేయాలన్నారు. ముస్లిం మహిళలకు కేంద్రం ఏదైనా మేలు చేయాలని భావిస్తే వారికి ఉచిత విద్యను అందించాలని కోరారు. -
ఓట్ల తక్కెడలో ట్రిపుల్ తలాక్
మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావించి త్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సమాధానంలేని ప్రశ్న. ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికే దాడులూ, హత్యలూ, చివరకు త్రిపుల్ తలాక్ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. తలాక్ తలాక్ తలాక్ ఒకే ఒక్క పదం. మూడు సార్లు ఉచ్చరిస్తే కడదాకా కలిసి నడుస్తానని మాట ఇచ్చిన సహచరిని నడిరోడ్డుమీదికి నెట్టేయొచ్చు. నలు గురు బిడ్డల తల్లినైనా నడిబజారులో నిలబెట్టొచ్చు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పటివరకూ తానే సర్వస్వం అని భావించిన ఓ స్త్రీ జీవితాన్ని నిలువునా కూల్చేసే మతపరమైన హక్కు ఇది. జకియా సోమన్, సైరాబానూ, ఇష్రాత్ జహాన్, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహమాన్, అతియా సాబ్రి ఈ ఐదుగురు మహిళలూ ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రతీక. ఇస్లాంని విశ్వసిస్తూనే ముస్లిం మహిళల హక్కులను గుర్తించాలంటూ, మతానికి లోబడి, రాజ్యాంగపరిధిలో ముస్లిం మహిళల హక్కులు కూడా మానవ హక్కుల్లో భాగమేనని ముస్లిం మహిళా ఆందోళన కారులు భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళలు స్త్రీపురుష అసమానతలను రూపుమాపేందుకు ట్రిపుల్ తలాక్ రద్దు కూడా మార్గమని భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ని 2007, జనవరిలో ముంబాయి కేంద్రంగా స్థాపించారు. స్త్రీపురుష వ్యత్యాసాలుండకూడదని, మతంలోనూ స్త్రీపురుష సమానత్వాన్ని పాటించాలన్నది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ డిమాండ్. స్త్రీ స్వేచ్ఛ అంటే పురుష వ్యతిరేకత కాదు. స్త్రీపురుష సమానత్వం. అలాగే భారత రాజ్యాంగంపైనా మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని కూడా వారు ప్రకటించారు. నిజానికి ఖురాన్లో తొలిదశలో తలాక్ అనే భావనే లేదు. కాలక్రమంలో దాన్ని సృష్టించారు. అయితే దానికి కొన్ని నిబంధనలున్నాయి. కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. అసలు ఖురాన్ లో స్త్రీలపై ఆధిపత్యానికి తావులేదు.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే పెద్దల సమక్షంలో చర్చించుకొని కలిసి ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పింది. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైతే మూడు పర్యాయాలుగా తలాక్ చెప్పా లని చెప్పింది. 90 రోజుల వ్యవధిలో మూడు సార్లు పెద్దల సమక్షంలోనే తలాక్ చెప్పాలి. అలాగే ఆ స్త్రీ ఋతుక్రమంలో ఉండగా, గర్భవతిగా ఉన్నప్పుడు సైతం తలాక్ చెప్పకూడదు. కానీ ఆచరణలో అం దుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. స్త్రీలకు తెలియకుండా కూడా తలాక్ చెప్పేస్తున్నారు. హలాలా... తలాక్తో విడిపోయిన తరువాత ఆ స్త్రీకానీ, పురుషుడు కానీ మనసు మార్చుకొని ఆవేశంలో చెప్పిన తలాక్ని వెనక్కితీసుకునే అవకాశాన్ని హలాలా నియంత్రిస్తోంది. భర్తతో విడిపోయిన తరువాత వాళ్ళిద్దరూ తిరిగికలుసుకోవాలంటే ఆ స్త్రీ మరో పురుషుడిని వివాహమాడిన తరువాతనే రీయూనియన్కి అవకాశం ఉంటుంది. అంతవరకు తలాక్ తీసుకున్న భార్యాభర్తలిద్దరూ ఇష్టపడినా తిరిగి కలిసి ఉండే అవకాశం లేదు. హలాలా ఖాజీలు కేవలం 15 రోజుల్లోనే వివాహం, తలాక్ రెండూ పూర్తి చేసి చిన్నారులను సైతం విదేశీయులకు కట్టబెడుతున్న దుర్మార్గాలు జరుగుతున్నాయన్నది వీరి ఆరోపణ. మెహర్.... ఖురాన్ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కు మెహర్. నిఖానామా(పెళ్ళి)సందర్భంగా స్త్రీలకి కొంత డబ్బో, వస్తువులో లేదా ఇళ్లో, వారి స్థాయిని బట్టి వరుడి తరఫున ఇస్తారు. దాన్ని రికార్డు కూడా చేయాలి. కానీ ఎక్కడా అది రికార్డు చేయడంలేదు. 786 రూపా యలు మాత్రమే స్త్రీల చేతిలో పెడుతున్నారు. దీంతో వీరికి నష్టం జరుగుతోంది. ఖులా... ముస్లిం స్త్రీలకి కూడా భర్త నుంచి విడిపోయే హక్కుంది దాని పేరే ఖులా. అయితే ముస్లిం స్త్రీలు విడిపోవాలనుకున్నప్పుడు కూడా భర్త అనుమతి కావాలంటున్నారు. కానీ ఖులా కోరుకున్న స్త్రీకి దానంతట అది దక్కే పరిస్థితి లేదు. అక్కడేమో స్త్రీల ప్రమేయం లేకుండానే తలాక్ చెప్పేస్తారు. ఇక్కడేమో భర్త అనుమతి లేనిదే ఖులా యివ్వరు. ఇటువంటి ముస్లిం మహిళల ఉద్యమాలూ, ఆందోళనల నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించాలంటూ కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే చట్ట పరంగా ట్రిపుల్ తలాక్ని నిషేధించడం కోసం పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదింపజేసుకున్నది. అయితే బీజేపీ ట్రిపుల్ తలాక్పై అనుసరిస్తున్న వైఖరిపైనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ముస్లిం మహిళల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్న చర్యా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వేసిన ఎత్తుగడా? అనేది గమనించాల్సిన విషయం. మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావిస్తే ట్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది సమాధానంలేని ప్రశ్న. ఇప్పుడున్న లెక్కల ప్రకారం భారత దేశంలో ఇప్పటి వరకు 23 లక్షల మంది మహిళలను వారి భర్తలు ఎటువంటి చట్టపరమైన, న్యాయబద్దమైన విడాకులు లేకుండా వదిలి వెళ్లారు. ఇందులో ముస్లిం మహిళలు కేవలం రెండు లక్షలా 80 వేల మంది మాత్రమే. క్రైస్తవులు 90 వేల మంది. కాగా మిగిలిన వాళ్ళంతా హిందూ మహిళలేనని ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈవిషయాన్ని ధృవపరుస్తూ తమిళనాడులో ధనుష్ కోటి ప్రాంతంలో మత్స్యకారుల మహిళల పరిస్థితిని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఎటువంటి సమా చారం లేకుండానే భర్తలు ఆ ప్రాంతంలోని మహిళలను సునాయాసంగా వదిలించుకుంటున్నారని ఈ సర్వే ఆధారాలతో సహా నిరూపించింది. అంతేకాకుం డా ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఉద్యోగాలు చేస్తోన్న భర్తలు తమ భార్యలను అవలీలగా భారతదేశంలో వదలిపెట్టి, విదేశాలకు పారిపోతున్నారని జాతీయ మహిళా కమిషన్కు 4000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఎన్ఆర్ఐ భర్తల చేతిలో మోసపోతోన్న మహిళలు తమకు న్యాయం చేయా లని కమిషన్ని కోరుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని వందల ఏళ్ళుగా హిందూ సాంప్రదాయం ప్రకారం జోగినీలుగా, దేవదాసీలుగా, మాతమ్మలుగా, దుర్భరమైన జీవితాలను గడుపుతోన్న లక్ష లాది మంది దళిత మహిళల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మనకు తెలియంది కాదు. అంతేకాకుండా హిందూ సమా జంలో మహిళలు ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణింపబడుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలూ, గృహహింస, పరువు హత్యలూ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ముస్లిం మతంలోని మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్న ప్రభుత్వాలు హిందూ మహిళల హక్కులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సి ఉంది. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళల మద్దతును, ఓట్లను బీజేపీ ఆశిస్తున్నదని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఇది పాక్షిక సత్యమే. ఓ పక్క బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, మరోపక్క ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా అదే ముస్లిం కుటుంబాల్లోని మహిళలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందని భావించడంలో పూర్తిగా నిజంలేదు. ఎందుకంటే ముస్లింల మీద గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న దాడులు, హింసా కాండ, అత్యాచారాలు ముస్లిం మహిళలను కూడా ఆలోచింపజేస్తాయి. తమ కన్నబిడ్డల పట్ల, కుటుంబా ల్లోని పురుషులపట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనుసరిస్తోన్న క్రూరమైన విధానాలు, దాడులు ఆ స్త్రీలకు మనశ్శాంతి లేని జీవితాలను ప్రసాదించాయి. గుజరాత్లో జరిగిన మారణకాండను దీని నుంచి విడదీసి చూడలేం. మొత్తం భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలో గత నాలుగైదేండ్లుగా జరిగిన హత్యలను పరిశీలిస్తే 2013లో ముగ్గురు ముస్లింలు మతపరమైన దాడుల వల్ల చనిపోతే, 2018 కి వచ్చేసరికి అది 30 మందికి చేరింది. అంటే ఐదేళ్ళలో ఇది పదిరెట్లు పెరిగినట్టు లెక్క. ఇందులో గోసంరక్షణ నినాదం ఎంతోమంది ముస్లింలపై దాడులకు కారణమైంది. అందువల్ల ముస్లిం మహిళల ఓట్లు బీజేపీ లక్ష్యం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బీజేపీకి అటువంటి ఉద్దేశం లేదు. ముస్లిం సమాజాన్ని భారతదేశంలోని హిందువుల ముందు దోషులుగా నిలబెట్టి, సహజంగా ముస్లింల పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకోవాలని మాత్రమే బీజేపీ భావిస్తోంది. అంతే తప్ప ముస్లింల పట్లగానీ, వారి స్త్రీలపట్లగానీ బీజేపీకి సాను కూలత ఉన్నదనుకోవడం పొరపాటు. ఉత్తరప్ర దేశ్లో 2017 ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన ముస్లిం వ్యతిరేకత హిందూ సెంటిమెంట్ సరిౖయెన ఫలితాలను ఇచ్చింది. భారతీయ జనతాపార్టీ ఆ రాష్ట్ర జనాభాలో 19 శాతానికి పైగా ఉన్న ముస్లిం లకు ఒక్క సీటుకూడా ఇవ్వకపోవడం గమనార్హం. అంటే ఉత్తర భారతంలో ముస్లింల పట్ల చారిత్రకంగా చిరకాలంగా ఉన్న సహజ వ్యతిరేకతను ఉపయోగించుకొని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్ల గొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో దాడులూ, హత్యలూ, చివరకు ట్రిపుల్ తలాక్ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్: 9705566213 -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో అడ్డంకులు
-
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
తలాక్ బిల్లుపై విపక్షాల కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో కేంంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తెలిపారు. అంతకుముందు బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్తో సహా ఇతర విపక్షాలు ఘంటాపథకంగా చెప్పి, ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత తీర్మానంపై 11 పార్టీలు సంతకం చేశాయి. చర్చకు ముందు తీర్మానంపై ఓటింగ్ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలు ఒకవైపు, రాజ్యసభలో అధికార పార్టీకి సంఖ్యాబలం లేకపోవడం మరోవైపు బీజేపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ కీలకమైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితేనే చట్టంగా మారనుంది. ఇదిలావుండగా సోమవారం జరిగి రాజ్యసభ సమావేశాలను సభ్యులందరూ హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ను జారీచేశాయి. -
రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. అధికార బీజేపీ మాత్రం ఓటింగ్ సమయంలో రాజ్యసభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. గురువారం లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మిత్రుల సంఖ్యతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి తప్పకుండా బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. 2018లో దాదాపు పది పార్టీలు ఈ బిల్లును నేరుగానే వ్యతిరేకించాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపడుతోందని, మరింత మెరుగైన అధ్యయనంకోసం బిల్లును పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముస్లిం మహిళల సమానత్వం, గౌరవం కోసం ఉద్దేశించినదని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ముస్లిం కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నదని ఆలిండియా ముస్లిం విమెన్ పర్సనల్ లాబోర్డు అంటోంది. బిల్లుపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించడం వల్ల సమాజంలో అలజడులు చెలరేగే అవకాశముందని విమెన్ పర్సనల్ లాబోర్డు అధ్యక్షురాలు శైస్త్రా అంబర్ చెప్పారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ చేస్తే విడాకులు ఇచ్చిన భర్తకు మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
రేపు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి. లోక్సభలో ట్రిపుల్ తలాక్ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్ జరుగుతుందనే అంచనాతో బీజేపీ, కాంగ్రెస్లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చరాదని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోని సభ్యులను పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్సభ ఆమోదం పొందింది ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లును తాము సూచించిన మార్పులు చేపట్టకుంటే ఆమోదించేది లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. -
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
-
‘తలాక్’ బిల్లుకు లోక్ సభ ఓకే
న్యూఢిల్లీ: తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషుల్ని శిక్షించడమేనని మరో కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఎద్దేవా చేశారు. రాజకీయంతో చూడొద్దు: రవిశంకర్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆక్షేపించారు. ‘రాజకీయ కొలమానంలో ఈ బిల్లును చూడొద్దు. ఇది మానవత్వం, సమన్యాయానికి సంబంధించింది’ అని పేర్కొన్నారు. మరింత అధ్యయనం కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్పై స్పందిస్తూ..సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని ప్రభుత్వం ఇది వరకే పరిశీలించి అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసిందని వెల్లడించారు.2017 జనవరి నుంచి 477 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఓ ప్రొఫెసర్ వాట్సప్లో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ర్యాలీకి హాజరైన భార్యకు వ్యక్తి ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చిన దృష్టాంతాలూ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రసాద్ వివరణ ముగిసిన వెంటనే కాంగ్రెస్, తృణమూల్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇది తలాక్ 2.0 బిల్లు తొలి తలాక్ బిల్లు గతేడాది డిసెంబర్ 28న లోక్సభలో ఆమోదం పొందినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో పెండింగ్లో ఉంది. విపక్షాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో కొన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ సవరణలు చేరుస్తూ తాజాగా తెచ్చిన బిల్లు ప్రకారం..నిందితులకు బెయిల్ ఇచ్చే వెసులుబాటును కల్పించారు. తలాక్ను కాంపౌం డబుల్ నేరంగా ప్రకటించారు. అంటే.. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసును వెనక్కి తీసుకోవచ్చు. బాధితురాలు, ఆమె దగ్గరి సంబంధీకులు ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు చేస్తారు. ఎప్పుడేం జరిగింది? ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వంల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్ల విచారణలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహకారం కోరిన సుప్రీంకోర్టు. విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారా? అని సందేహించిన కోర్టు ► 2016, జూన్ 29: రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం ► 2016, అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు ► 2017, ఏప్రిల్ 16: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తొలిసారి లేవనెత్తిన ప్రధాని మోదీ..ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని హామీ ► 2017, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ► 2017, డిసెంబర్ 28: ట్రిపుల్ తలాక్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్సభ ► 2018, ఆగస్టు 10: రాజ్యసభలో తలాక్ బిల్లు. ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల వ్యతిరేకతతో లభించని ఆమోదం. ► 2018, సెప్టెంబర్ 19: విపక్షాల సూచనల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డినెన్స్ జారీ ► 2018, డిసెంబర్ 27: సవరించిన బిల్లుకు లోక్సభ ఆమోదం. కీ పాయింట్స్ ► మూడు సార్లు వరుసగా తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హ నేరమని సంబంధిత బిల్లులో ప్రతిపాదించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరానికిగానూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించవచ్చు. బాధిత మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ► తాజా ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నాలుగు గంటల పాటు కొనసాగింది. ► ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనివల్ల మహిళలకే నష్టం కలుగుతుందని వాదించాయి. తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించకూడదన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నిందితుడిని బెయిల్పై విడుదల చేసే అధికారం స్థానిక పోలీసు అధికారికి కాకుండా, మేజిస్ట్రేట్ స్థాయి అధికారికే ఉండాలన్న విజ్ఞప్తినీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ► ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్న విపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఈ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించింది. అవి 1. బాధిత మహిళ కానీ, ఆ మహిళ దగ్గరి బంధువు కానీ తక్షణ తలాక్ చెప్పిన భర్తపై పోలీసు కేసు పెట్టాలి. 2. దంపతులిద్దరూ రాజీకి వస్తే ఆ మహిళ కేసును ఉపసంహరించుకోవచ్చు. 3. బాధిత మహిళ వాదన విన్నాకే ఆ భర్తకు బెయిల్ ఇవ్వాలో, వద్దో మేజిస్ట్రేట్ నిర్ణయించాలి. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ ఈ సెప్టెంబర్లో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్లో ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిరంకుశ విధానమని, అది ఇస్లామిక్ సంప్రదాయం కాదని, ఇస్లాం మత విధానాల్లో ట్రిపుల్ తలాక్ భాగం కాదని 3–2 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ బిల్లు ప్రమాదకరం విపక్షాలు, హక్కుల కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ: లోక్సభ ఆమోదించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై ముస్లిం సంస్థలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది ఈ బిల్లును వ్యతిరేకించగా కొందరు మాత్రమే స్వాగతించారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం చేయాలి: ఒవైసీ స్వలింగ సంపర్కం నేరం కాదంటున్న ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ నేరం అని వాదించడం వెనుక గల ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ట్రిపుల్తలాక్ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘అక్రమసంబంధాలు నేరం కాదన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకోకుండా పురుషులను ఆపే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ మాత్రం నేరమని అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కానపుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది? ఈ బిల్లును ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగానే తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని సెక్షన్–377 ప్రకారం లింగపరమైన మైనారిటీలకు హక్కులున్నప్పడు, మతపరమైన మైనారిటీలకు ఎందుకు ఉండవు? మీ విశ్వాసం మీకున్నప్పుడు. మా విశ్వాసం కూడా మాదే అవుతుంది. మీ (ప్రభుత్వం) ఉద్దేశం సరిగా లేదు’ అని అన్నారు. ఎన్నికల దృష్టితో తెచ్చిన బిల్లు: కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తలాక్ బిల్లు తెచ్చిందని లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో మాదిరి కఠిన నిబంధనలు మరే చట్టంలోనూ లేవు. ఈ బిల్లును ఆమోదించటానికి ముందుగా పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి అభిప్రాయం తీసుకోవాలి’ అని కోరారు. నేర పూరితం అనడం తగదు: కారత్ వ్యక్తిగత అంశాన్ని కూడా నేరం అనడం తగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ‘ఏ మతం కూడా ఇలాంటి కారణంపై అరెస్టు చేయాలని చెప్పలేదు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటానికి బదులుగా మైనారిటీల్లో విభేదాలను సృష్టించడమే ఈ బిల్లు వెనుక ప్రభుత్వ వాస్తవ ఉద్దేశం. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మరిన్ని కష్టాలు తప్పవు’ అని ఆమె పేర్కొన్నారు. ఒక్కోమతానికి ఒక్కో చట్టమా? మతాన్ని బట్టి చట్టాలు ఎలా మారుతాయని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. ‘భార్యను వదిలివేయడం వంటి చర్యలకు ముస్లిమేతరులు పాల్పడితే నేరం కానప్పుడు, ముస్లింలైతే నేరం ఎందుకు అవుతుంది’ అని అన్నారు. న్యాయ మంత్రి బదులివ్వలేకపోయారు ‘ఈ బిల్లులోని అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానాలు చెప్పలేకపోయారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆస్మా జెహ్రా ఆరోపించారు. తలాక్ను ప్రభుత్వం లేకుండా చేసినప్పుడు ఇంకా చర్చ ఎందుకని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి మౌలానా మహ్మూద్ దర్యాబా దీ ప్రశ్నించారు. తలాక్ చెప్పిన కారణంగా భర్త జైలుకు వెళితే, ఎలాంటి ఆర్థిక ఆసరాలేని అతని భార్య, సంతానం సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ సంస్థ సభ్యురాలు స్వాగతించారు. బహుభార్యత్వం, చిన్నారుల సంరక్షణ వంటి అంశాల్లో స్పష్టత తెచ్చేందుకు హిందూ వివాహ చట్టం మాదిరిగా ముస్లిం వివాహ చట్టాన్నీ తేవాలన్నారు. సుప్రీం ఏం చెప్పింది? ముస్లింలు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ (తలాక్ ఏ బిద్దత్) సంప్రదాయం చెల్లదనీ, అది రాజ్యాంగవిరుద్ధమని 2017, ఆగస్టు 22న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3–2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ను కొట్టివేసేందుకు అనుకూలంగా జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ తీర్పు ఇవ్వగా, అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. ట్రిపుల్ తలాక్పై ఆర్నేల్లు నిషేధం విధించాలనీ, ఆలోగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరికి ట్రిపుల్ తలాక్ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఖేహర్ 395 పేజీల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ మెజారిటీ తీర్పును వెలువరిస్తూ..‘ట్రిపుల్ తలాక్ ఆచారంలో భాగమైనప్పటికీ అది లోపభూయిష్టమైనది. పునరాలోచనకు ఆస్కారం లేకుండా వెనువెంటనే చెప్పేసే ట్రిపుల్ తలాక్ కారణంగా వివాహబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను ఇది ఉల్లంఘించడమే’ అని ముగ్గురు జడ్జీలు మెజారిటీ తీర్పు ఇచ్చారు. ‘తమకు న్యాయం చేయాలంటూ ముస్లిం మహిళలు న్యాయస్థానం మెట్లు ఎక్కితే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులకు సాధ్యం కాదు. తలాక్ ఎ బిద్దత్ సహా మూడు రకాల విడాకులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం–1937లో చేర్చడంతో పాటు గుర్తింపునిచ్చారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(1) చెబుతోంది. ముస్లిం పురుషుడు ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు తలాక్ ఆస్కారం కల్పిస్తోంది’ అని తన తీర్పులో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ పేర్కొన్నారు. తలాక్ బిల్లుకు సంబంధించి లోక్సభ డిస్ప్లే బోర్డుపై కనిపిస్తున్న ఓట్లు లోక్సభలో బిల్లుపై మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్, మల్లికార్జున్ ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ -
‘ట్రిపుల్ తలాక్’కు మేం వ్యతిరేకం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లి మహిళల (వివాహ హక్కు రక్షణ) బిల్లు – 2018పై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత ఏపీ జితేందర్రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టడం వెనక ప్రభుత్వ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడే విషయంలో ఈ బిల్లు నిరంకుశంగా ఉందని జితేందర్ రెడ్డి విమర్శించారు. మైనారిటీల విశ్వాసాన్ని వమ్ముచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. మత విశ్వాసాలను రాజ్యాంగ పరిధిలో విచారించడం న్యాయస్థానాల పని అని.. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు ఆయన పలికారు. లింగసమానతల విషయంలో టీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టతతో ఉన్నామని.. అయితే, ముస్లిం ల పురుషులకు మూడేళ్ల పా టు జైలుశిక్ష విధించాలన్న నిబంధనకు టీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్ల డిమాండ్లపై.. మహబూబ్నగర్ కేబుల్ ఆపరేటర్స్ సంఘం చేసిన డిమాండ్లను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని సమాచార, ప్రసారశాఖ మంత్రిని జితేందర్రెడ్డి కోరారు. ఎంపిక చేసుకున్న చానెళ్లకే డబ్బులు చెల్లించాలన్న ట్రాయ్ నిబంధన ద్వారా కేబుల్ ఆపరేటర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆపరేటర్లు చానళ్ల ప్రసారాల విషయంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినందున వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ప్రసార కంపెనీలలబ్ధికే ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, వీటి ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, వినియోగదారులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. టీవీ ప్రసార పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేలా మంత్రి చొరవతీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బిల్లుపై గురువారం మధ్యాహ్నం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకోవడంతో ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొనగా మతపరమైన అంశాల్లో జోక్యం తగదని కాంగ్రెస్ నేతృత్వంలో తృణమూల్, ఎన్సీపీ, ఆప్, ఎంఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెడుతూ దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని, మానవతా దృక్పథంతో పరిశీలించాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ను 20 ఇస్లామిక్ దేశాలు నిషేధించగా, భారత్ వంటి లౌకిక దేశాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఎవరైనా కట్నం డిమాండ్ చేయడం, మహిళలను వేధించడం చేస్తే వారి అరెస్ట్లకు అనుమతించే పార్లమెంట్ ట్రిపుల్ తలాక్ను ఎందుకు వ్యతిరేకించదని అన్నారు. ఈ బిల్లు ఏ మతం, వర్గం విశ్వాసాలను దెబ్బతీయదని స్పష్టం చేశారు. ఈ బిల్లు చాలా కీలకమని, దీనిపై లోతైన అథ్యయనం అవసరమని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆయన కోరారు. తృణమూల్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ సైతం ఖర్గే వాదనతో ఏకీభవించారు. -
లోక్సభ ముందుకు ట్రిపుల్ తలాక్ తాజా బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్పై తాజా బిల్లును ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ను ఆరునెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. మోదీ ప్రభుత్వం గతంలో ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా బిల్లును లోక్సభ ఆమోదించగా, ఎన్డీఏకు మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లుపై గందరగోళం చెలరేగింది. దీనిపై పాలక, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. దీంతో ట్రిపుల్ తలాక్పై తాజా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే క్రమంలో గురువారం బిల్లును ప్రభుత్వం లోక్సభ ముందుంచనుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్పష్టంగా వెల్లడించినా ఈ పద్ధతిలో విడాకులు ఇవ్వడం కొనసాగుతోందని తాజా బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మరోవైపు 430 ట్రిపుల్ తలాక్ ఘటనలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయని శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. వీటిలో 201 ట్రిపుల్ తలాక్ ఘటనలు సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం చోటుచేసుకున్నవి కావడం గమనార్హం. -
వాట్సాప్లో ట్రిపుల్ తలాఖ్
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని ఓ మాస్టారు వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతమిది. కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా భర్త వినకపోవడంతో పాఠశాల ముందు బాధితురాలు «ధర్నాకు పూనుకుంది. వివరాలు... హైదరాబాద్ టోలీచౌకీ ఎండీ లైన్స్లో నివాసముండే మొహమ్మద్ ముజామిల్ (29), యూసుఫ్గూడకు చెందిన సుమయ్యబాను దంపతులు. గతేడాది జనవరి 6న వీరి వివాహం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల కట్నకానుకలు ముట్టజెప్పారు. అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహం జరిగిన నెల తర్వాత సుమయ్యబానును అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. గతేడాది ఫిబ్రవరి 20న ముజామిల్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఇంటికి వెళితే దాడులు.. సెప్టెంబర్లో ఆమె తన పాపతో కలసి టోలిచౌకీలోని అత్తారింటికి వెళ్లింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని సూటిపోటీ మాటలనేవారు. కడుపు నిండా తిననివ్వకుండా ఆమె మీద భౌతికంగా దాడి చేయసాగారు. పాలు అందక పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు నవంబర్ 11న వచ్చి తల్లిపిల్లను తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రిపుల్ తలాఖ్ అంటూ విడాకులు.. భర్త, అత్తామామలు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరిది కూడా కట్నంకోసం వేధిస్తుండటంతో నవంబర్ 23న బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామ, మరిదిలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ముజామిల్ నవంబర్ 28న ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. పాపను చూసిన పాపాన పోలేదు: సుమయ్యబాను న్యాయం కావాలంటూ బాధితురాలు సుమయ్యబాను తన భర్త నిర్వహిస్తున్న పాఠశాల వద్ద సోదరుడు ఆదిల్ఖాన్తో కలసి ధర్నా చేసింది. అత్తింటివారు ఏనాడూ తన పాపను చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన తన భర్తలో మార్పు వస్తుందనే ఆశతో రోజూ ఫోన్ చేసి ప్రా«ధేయపడ్డానని చెప్పింది. తన భర్తకు వేరొకరితో ఉన్న అక్రమ సంబంధం గురించి నిలదీసిన నాటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. -
వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాక్
-
‘తలాక్..తలాక్..తలాక్’ ఫోన్ కట్
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. తమ వివాహబంధం నేటితో ముగిసిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. వివరాలు.. యూసుఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలిచౌకికి చెందిన మహ్మద్ మెజిమిల్ షరీఫ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఓ పాప జన్మించిన తర్వాత కలతలు మొదలయ్యాయి. సమియాను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలన్నాడు. నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. టోలిచౌకిలోని ఎం.డి.లైన్స్లో గల జెమ్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసే షరీఫ్ నుంచి సమియాకు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. భర్త మనస్సు మారిందని భావించిన ఈ ఇల్లాలు సంబరపడిపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. అంతలోనే పిడుగులాంటి వార్త. ‘ఇక నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు.. తలాఖ్, తలాఖ్, తలాఖ్’ అంటూ షరీఫ్ ఫోన్ పెట్టేశాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు దర్నాకు దిగింది. భర్త పనిచేసే పాఠశాల ఎదుట కూడా సమియా ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు షరీఫ్. తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని సమియా కోరుతోంది. చట్టరిత్యా ట్రిబుల్ తలాక్ చెల్లదని.. అతనిపై వరకట్న వేధింపులకు సంబంధించి ఐపీసీ 498 ఏ, 406, 506, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. షరీఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
కట్నం ఇవ్వలేదని ఫోన్లోనే తలాక్..
లక్నో : ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన యూపీకి చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇవ్వలేదని తన కుమార్తెను ఆడపడుచులు, అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, సౌదీ అరేబియాలో నివసించే తన అల్లుడు ఫోన్ ద్వారా తన కుమార్తెకు విడాకులు ఇచ్చాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. అత్తింటి వేధింపులతో విసిగిపోయిన తన కుమార్తెను పుట్టింటికి తీసుకువచ్చామని, అయినా వారు కట్నం తీసుకురావాలని వేధిస్తన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ నుంచి తమ అల్లుడు తన కుమార్తెకు ఫోన్లో తలాక్ చెప్పాడని తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితురాలి తల్లి రేష్మా డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల కిందట తనకు వివాహమైందని, కట్నం కింద రూ 50 వేల నగదు, మోటార్ బైక్ తీసుకురావాలని తన అత్త తనను కొడుతోందని బాధితురాలు నూరి వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
‘ఈ ఆర్డినెన్స్తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’
సాక్షి, హైదరాబాద్ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకరావడం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామంటూ గురువారం ప్రకటించింది. పార్లమెంటు ఆమోదం పొందకుండానే ఆర్డినెన్స్ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. చట్టసభలను గౌరవించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందంటూ లా బోర్డు విమర్శించింది. దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు? ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫ్ ఉల్లా రహ్మానీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. అసలు ముస్లిం వర్గాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు హాని కలిగించే విధంగా ఉన్న ఆర్డినెన్స్ను సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై తమ లీగల్ కమిటీ చర్చిస్తోందని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే : అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఓ నాటకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రఫెల్ డీల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉదంతాలు, పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇటువంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కాగా ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గత బుధవారం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్ను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు. -
హడావుడి ఆర్డినెన్స్!
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులివ్వడాన్ని నిషేధిస్తూ, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తక్షణ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాక కేంద్రం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. అనంతరం ఆ బిల్లుకు లోక్సభ ఆమోదాన్ని పొందింది. ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో దీనికి అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడా, వెలుపలా వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్నిటికి చోటిచ్చి తాజా ఆర్డినెన్స్ రూపొందించారు. దానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెల్పడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా పూర్తయ్యాయి. ఈ దురాచారం ముస్లింలలో ప్రబలంగా లేదు. దాన్ని ఆచరించేవారి సంఖ్య స్వల్పం. అయితే బాధి తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్యాయం జరుగుతున్నదనుకుంటే దాన్ని చక్కదిద్దవలసిందే. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అవి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఆ సమావేశాల వరకూ ఆగి బిల్లు ప్రవేశపెడితే... దాని ఆమోదానికి, ఆ తర్వాత చట్టంగా రూపొందడానికి మరో అయిదారు మాసాలు పడుతుంది. కనుక ఆర్డినెన్స్ తప్పనిసరైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు. దానికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఆయన ఏకరువు పెట్టారు. నిరుడు జనవరి మొదలుకొని ఈ నెల వరకూ దేశవ్యాప్తంగా 430 తక్షణ తలాక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వకముందు 229, ఇచ్చాక 201 జరిగాయి. తక్షణ తలాక్ ఆచరణ మన దేశంలో ఎంత స్వల్పమో ఈ లెక్కలే చెబు తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. అంటే దాదాపు 17 కోట్ల 23 లక్షలు. అయితే గతంలో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎదురైన అవాంతరాలకు గల కారణాలనుగానీ, ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలనుగానీ తాజా ఆర్డినెన్స్ పరిగణనలోకి తీసు కున్నట్టు కనబడదు. కనీసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందైనా ఆయా వర్గాలతో, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలతో కేంద్రం మరోసారి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే తక్షణ తలాక్ విధానం పోవాలని కోరుకునేవారు సైతం కొన్ని నిబంధనల విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. లోక్సభ ఆమోదం పొందిన బిల్లు తక్షణ తలాక్ చెప్పటం దానికదే శిక్షార్హమైన నేరంగా పరిగణించి అందుకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చునని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ నిబంధనను స్వల్పంగా సవరించి భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్దేశించారు. దీన్ని రాజీకి వీలైన నేరంగా కూడా మార్చారు. అంటే ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికొచ్చి కేసును ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇది నాన్బెయిలబుల్ కేసు అయినా, విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. గతంతో పోలిస్తే ఇవి మెరుగైన మార్పులే. అయితే లోగడ బిల్లును వ్యతిరేకించినవారు కోరింది ఇవి మాత్రమే కాదు. అసలు తక్షణ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే విధానమే రద్దు కావాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో అహేతుకత ఏమీ లేదు. తక్షణ తలాక్ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది గనుక లేని హక్కును చలాయించటం భర్తకు అసాధ్యం. ఒకవేళ గెంటేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ చట్టవిరుద్ధం గనుక ఆ పెళ్లి రద్దు కాలేదని న్యాయ స్థానం స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో భర్త ఆమె హక్కులు కాలరాయాలని చూస్తే గృహహింస చట్టం కింద ఆమె కేసు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు సైతం తక్షణ తలాక్ చెల్లదని చెప్పింది తప్ప, దాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొనలేదు. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, అవి తీవ్రరూపం ధరించినప్పుడు విడాకుల వరకూ వెళ్తుంది. అయితే ఇతర మతస్తుల విషయంలో దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించనప్పుడు ముస్లింలకు వేరే విధమైన నిబంధన ఎందుకు? ఇది తమ పట్ల చూపిస్తున్న వివక్షలో భాగమని వారనుకునే అవకాశం లేదా? ఆవేశం అవధులు దాటినప్పుడు భార్య లేదా ఆమె తరఫు బంధువులు కేసు పెట్టి తక్షణ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయిస్తే రాజీకి దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన మహిళకు వెనువెంటనే కావాల్సింది భరణం. ఆమె, ఆమెతో ఉండే సంతానం జీవించడానికి అవసరమైన జీవనభృతి జైలు పాలైన భర్త సమకూర్చగలుగుతాడా? అలాంటి సందర్భాల్లో ఆమె మేజిస్ట్రేట్ను ఆశ్రయించవచ్చునని ఆర్డినెన్స్ చెబుతోంది. కానీ ఆ జీవనభృతి ఇచ్చేదెవరో, ఎలా లెక్కేస్తారో ఈ ఆర్డినెన్స్లో లేదు. మారే కాలానికి అనుగుణంగా ఎవరైనా మారక తప్పదు. పౌర హక్కుల భావన లేనికాలంలో మహిళలకు అన్యాయం చేసే పలు సంప్రదాయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రపం చంలోని అన్ని మతాల్లోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ప్రతి మతం లోని పెద్దలూ ఎప్పటికప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకటం అవసరం. అదే సమయంలో ముస్లింల విషయంలో ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ రాకుండా చూసుకోవటం ప్రభుత్వం బాధ్యత. డిసెంబర్లోగా జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తెచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్ తదితర పక్షాలు ఆరోపించాయి. ఎవరినీ సంప్రదించకుండా, ఇప్పటికే వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డినెన్స్ జారీ చేసి ఆ విమర్శలను కేంద్రం నిజం చేసింది. -
‘ట్రిపుల్ తలాక్పై ఖేదం, మోదం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్డినెన్స్ను తీసుకరావడం పట్ల ముస్లింలు, మహిళా హక్కుల కార్యకర్తల్లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఏ రకంగానైనా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లయితే అతనికి మూడేళ్ల వరకు శిక్ష విధించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. 2017, డిసెంబర్లో లోక్సభ ఆమోదించిన ‘ముస్లిం మహిళల పెళ్లి హక్కుల పరిరక్షణ బిల్లు’ స్థానంలో ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు. లోక్సభ ఆమోదించిన ఈ బిల్లులో పలు మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పట్టు పట్టడంతో నాడు రాజ్యసభలో సంపూర్త బలంలేని బీజేపీ ప్రభుత్వం ఆ సభలో బిల్లును ప్రవేశపెట్టలేక పోయింది. చివరకు కేంద్ర కేబినెట్ ప్రతిపక్షాలతోపాటు, పలు ముస్లిం సంస్థలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 9వ తేదీన బిల్లులోని కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు బిల్లులో చేసిన సవరణలను పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా సభా కార్యక్రమాలను స్తంభింపచేయడంతో బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బిల్లు స్థానంలో కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్పై ఆర్డినెన్స్ను తీసుకరావాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ పట్ల ముస్లింలో ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన నేరంగా పరిగణించరాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం వాదిస్తోంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017, అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్లు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. షమీమ్ ఆరా వర్సెస్ ఉత్తర ప్రభుత్వం మధ్య కొనసాగిన కేసులో ట్రిపుల్ తలాక్ చెల్లదని 2002లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 2017, ఫిబ్రవరి నెలలో ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా (భర్త నుంచి విడిపోయి మళ్లి కలుసుకోవాలంటో మరో వ్యక్తినిపెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం)ను వ్యతిరేకిస్తూ ట్రిపుల్ తలాక్ బాధితురాలు షయారా బానో, పలువురు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన నాన్బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల వరకు జైలు, జరిమానా విధించేలా తొలుత బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఫలానా వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ ఎవరైన పోలీసు ఫిర్యాదు ఇచ్చేలా ఆ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు, పలు సంస్థలు గొడవ చేయడంతో కేంద్రం భార్య, లేదా అమె సమీప బంధువలు మాత్రమే ట్రిపుల్ తలాక్పై ఫిర్యాదు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్యను విచారించి హేతుబద్ధంగా భర్తకు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా మరో మార్పు చేయడంతోపాటు, భార్యా భర్తలు అవసరమైతే రాజీకి వచ్చేందుకు కూడా వీలు కల్పిస్తూ ముఖ్యమన సవరణకు చేర్చారు. ఆర్డినెన్స్ను భారతీయ ముస్లిం మైనారిటీ ఆందోళన్ సంస్థ పూర్తిగా సమర్థించింది. సవరణలను కూడా స్వాగతించింది. ఆర్దినెన్స్ పట్ల అసంతృప్తి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్ష పార్టీలతోపాటు కొన్ని మానవ హక్కుల సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి ఎంతో తేడా ఉంది. ముస్లిం మహిళల పేరిట ముస్లిం పురుషులను వేధించేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది’ అని ‘బెబాక్ కలెక్టివ్’ అనే మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు హసీనా ఖాన్ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్కు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి బదులుగా గృహ హింస నేరంగా పరిగణించి గృహ హింస చట్టం కింద విచారించేలా ఉంటే బాగుంటుందని మానవ హక్కుల కార్యకర్త జావెద్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ ఇస్తే భర్త నుంచి భరణం కోరే హక్కును కూడా కల్పించారుగానీ, జైల్లో ఉండే భర్త ఎలా భార్యకు భరణం చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు. మెజారిటీ ముస్లింలలో మగవాళ్లు పనిచేస్తేగానీ కుటుంబం గడవదన్న విషయం తెల్సిందే. -
ఆర్డినెన్స్తో న్యాయం జరగదు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిఫుల్ తలాక్ ఆర్డినెన్స్తో ముస్లిం మహిళలకు న్యాయం జరగదని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర మంత్రి వర్గం ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంపై మండిపడ్డారు. బుధవారం మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మహిళలకు ఆర్డినెన్స్ వ్యతిరేకమని, దానితో మరింత అన్యాయం జరిగే అవకాశమే ఉంటుందని అన్నారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమే అవుతుందన్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా కేసు నమోదైతే మహిళలకు అండగా నిలబడేది ఎవరని ప్రశ్నించారు. కేసుకు గురైన వ్యక్తి జైలుకు వెళ్తూనే భరణం ఎలా చెల్లిస్తారని, శిక్ష పూర్తయి బయటికి వచ్చేవరకు మహిళ చిక్కుల్లో పడాల్సిందేనా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను ఇక్కట్ల పాల్జేసేందుకు మోదీ సర్కార్ ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తోందన్నారు. దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్తే ఆర్డినెన్స్ నిలబడదన్నారు. -
అది రాజ్యాంగ విరుద్ధం : ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తలాక్పై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని, కేవలం ముస్లిం మహిళలకు వర్తించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురాడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇస్లాంలో వివాహం అనేది పూర్తిగా సివిల్ కాంట్రాక్టు. దానిలో శిక్షా నిబంధనలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకం. దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరగదు. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఓవైసీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు లోకసభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్కు కేంద్ర కెబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసేందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తరువాత కోర్టులో 430కిపైగా తలాక్ కేసులు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకే అత్యవస అర్డినెన్స్ను తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది. -
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ట్రిపుల్ తలాక్’పై నరేంద్ర మోదీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకరావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ‘ట్రిపుల్ తలాక్’పై ఆర్డినెన్స్తో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గ నిర్ణయాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు. తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇచ్చేలా ఆర్డినెన్స్ రూపొందించామన్నారు. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 430 ట్రిపుల్ తలాక్ కేసులు సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, రాజ్యాంగపరంగా అత్యవసరం కాబట్టే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకే, వారి గౌరవం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. సోనియా, మాయావతి, మమతా బెనర్జీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు వీడి ఈ బిల్లుకు మద్దతివ్వాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు అంగన్ వాడీ వర్కర్లు, సహాయక సిబ్బంది, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3000 నుంచి రూ.4500కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాఫెల్ ఒప్పందంపై జెపిసి, సీఏజీ విచరణ అవసరం లేదని స్సష్టం చేశారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ఏ నిర్ణయం తీసుకోకుండా పదేళ్లు నానబెట్టారని గత కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు. -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్ని పదేళ్ళ క్రితమే బ్రిటన్లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
‘నన్ను హింసించావు’ అందుకే... మేనల్లుడితో ఇలా
చండీగఢ్ : నిత్యం వేధింపులకు గురిచేస్తూ, విడాకులు ఇస్తానని బెదిరిస్తున్న భర్తకు తగిన బుద్థి చెప్పింది ఓ భార్య. భర్త పెట్టే చిత్రహింసల నుంచి విముక్తి పొందేందుకు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన షాజియాకు అబ్బాస్ అనే వ్యక్తితో నిఖా జరిగింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లైన రెండో రోజు నుంచే అబ్బాస్.. షాజియాను వేధింపులకు గురి చేసేవాడు. రోజూ తాగి వచ్చి తీవ్రంగా హింసించేవాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ట్రిపుల్ తలాక్ చెబుతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన షాజియా.. ‘ నువ్వు నాకు విడాకులివ్వడం కాదు. నేనే నీ నుంచి విడాకులు తీసుకుంటున్నా. నన్ను వేధింపులకు గురి చేసినందుకు నీ తగిన శాస్తి చేయాలనుకున్నాను. తప్పో ఒప్పో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. తలాక్, తలాక్, తలాక్’ అంటూ భర్తకు ఉత్తరం రాసింది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన తన మేనల్లుడితో కలిసి ఊరు విడిచి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించి షాజియా భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల హక్కులకు భంగం కలుగుతోందంటూ ట్రిపుల్ తలాక్ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో షాజియా చర్య గురించి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి -
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్సభలో 71శాతం, 14వ లోక్సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్తలఖ్ బిల్లుకు లభించని పార్లమెంట్ అమోదం
-
రామాయణంపై ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాఖ్పై కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దల్వాయ్ రామాయణాన్ని ఉటంకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లును సభ ముందుంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సైతం సీతను అనుమానిస్తూ విడిచిపెట్డాడని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు.మహిళలను కేవలం ముస్లింలే కాకుండా హిందూ, క్రిస్టియన్, సిక్కు మతాలు సైతం వివక్షకు గురిచేశాయని అన్నారు. ప్రతి సమాజం పురుషాధిక్యతతో కూడుకున్నదని అంటూ శ్రీరాముడు సైతం అనుమానంతో సీతాదేవిని విడిచిపెట్డాని వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవస్థను మనం మార్చాల్సిన అవసరం ఉందని హుసేన్ దల్వాయ్ పేర్కొన్నారు.ముస్లిం మహిళల సంక్షేమంపై మోదీ సర్కార్కు ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు. ముస్లిం మహిళలకు మరిన్ని హక్కులు కల్పిస్తూ సాధికారత ఇస్తామని హామీ ఇవ్వడం కేవలం కంటితుడుపు చర్యని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రిపుల్ తలాఖ్పై తమ పార్టీ వైఖరి సుస్పష్టమని యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. రాఫెల్ డీల్పై కాంగ్రెస్ ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడటంతో శుక్రవారం ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రభుత్వం సభలో చేపట్టలేకపోయింది. -
ట్రిపుల్ తలాక్: బెయిల్ నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ర్టేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ట్రిపుల్ తలాక్కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. తాజా సవరణ ప్రకారం మేజిస్ట్రేట్కు బెయిల్ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదంకోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. పెద్దల సభలో బిల్లు ఆమోదానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళా సాధికారత అంటూ మాటలు చెబుతున్న ప్రధాని మహిళా బిల్లుపై ఎందుకు వెనుకాడుతున్నారని రాహుల్ నిలదీశారు. -
సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు
లక్నో : విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్ తలాఖ్ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాచి పేర్కొన్నారు. ఇటువంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్(బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం గోరఖ్నాథ్ ఆలయాన్ని దర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాధ్వి ప్రాచి.. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) ఈసారి కూడా రాకుంటే కనీసం రాహుల్కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలు చేయడం ఓ ట్రెండ్గా మారింది. ఇలా మాట్లాడి వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అంటూ మండిపడ్డారు. చదవండి : నిఖా హలాల పేరిట నరకం... -
‘గుండు కొట్టి దేశం నుంచి తరిమికొడితే..’
లక్నో: ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిదాఖాన్, ఫర్హాత్ నఖ్వీ లకు గుండు కొట్టి, దేశం దాటేలా తరిమి కొట్టే వారికి బరేలీ ముస్లిం ఎన్జీవో చీఫ్ మొయిన్ సిద్దిఖీ నూరీ నజరానా ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళలకు బుద్ధి చెప్పిన వారికి అక్షరాల 11, 786 రూపాయలు ముట్టజెప్పుతానని ఆలిండియా ఫైజాన్-ఎ-మదీన కౌన్సిల్ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, నిదా ఖాన్, ఫర్హాత్ నఖ్వీలను ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నట్టు నాలుగు రోజుల కిందట బరేలీ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయం.. నిఖా హలాల (మొదటి భర్తను మళ్లీ పొందాలంటే కొన్నాళ్లపాటు మరొకరితో కలిసి ఉండడం) కారణంగా చిత్రవధ అనుభవిస్తున్న సబీనాకు నిదాఖాన్ అండగా నిలిచారు. ఫర్హాత్ నఖ్వీతో కలిసి ట్రిపుల్ తలాక్, నిఖా హలాలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేపట్టారు. దాంతో ఈ ఇద్దరిపై ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేశారు. తాజాగా, బరేలీలోని ముస్లిం ఎన్జీవో సైతం వారిని తరిమి కొట్టిన వారికి నగదు బహుమతి ప్రకటించడంతో దుమారం రేగుతోంది. మరోవైపు బరేలీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఎమెల్యే రాజేష్ కుమార్ మిశ్రా నేతృత్వంలో ఫర్హాత్, నిదాలు శనివారం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఫర్హాత్ నఖ్వీ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సోదరి కావడం గమనార్హం. -
లైవ్ షోలో మహిళపై మౌలానా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్పై ఓ న్యూస్ చానెల్ చేపట్టిన చర్చ తీవ్ర గొడవకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారంలో విచక్షణ కోల్పోయిన ఓ ప్రతినిధి.. ఏకంగా మహిళా లాయర్పై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే మహిళపై దాడి చేసిన సదరు ప్రతినిధిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్లో లేనేలేదని ఓ మహిళ న్యాయవాది వాదించగా.. సహనం కోల్పోయిన ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఆమెపై దాడి చేశాడు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఓ టీవీ ఛానల్ మంగళవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లైవ్గా ప్రసారమైన ఈ చర్చలో భాగంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్ మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందడం ఖురాన్లో లేదని, ట్రిపుల్ తలాక్ ఖురాన్కు విరుద్ధమని వ్యాఖ్యనించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా ఇజా అర్షద్ ఖ్వాసి.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్ షోలోనే దాడికి దిగారు. ఫరాహ్ గత కొంతకాలంగా ముస్లిం మహిళల తరఫున ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. టీవీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎఐఎంపీఎల్బీ సభ్యుడు మహిళ న్యాయవాదిపై దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. A Maulana Amir Kasmi who is a member of AIMPLB hit a woman on a live TV debate. If he does ths on TV, imagine what these people would be doing behind closed doors. The Maulana even used abusive words for women on the panel... Shamefull !!!!#MaulanaSlapsWoman #TalkToAMuslim pic.twitter.com/wXs8fcJqPD — Sourish Mukherjee (@me_sourish) July 17, 2018 -
నిఖా హలాల పేరిట నరకం...
లక్నో : లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న నిఖా హలాల్, బహు భార్యత్వాల చట్ట బద్ధత గురించి చర్చించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి గత మార్చిలో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు పలువురు బాధిత మహిళలు ముందుకొస్తున్నారు. నిఖా హలాల నియమం వల్ల తాము ఎంతటి క్షోభ అనుభవిస్తున్నామో చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు బరేలీకి చెందిన నీదా ఖాన్, షబీనా. నియమం పేరిట నరకం.. బరేలీకి చెందిన షబీనాకు ఓ వ్యక్తితో నిఖా జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆమె భర్త మూడు సార్లు తలాక్ చెప్పడంతో వారి వివాహం రద్దు అయింది. అయితే మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె భర్త, తన తండ్రిని పెళ్లి చేసుకోవాల్సిందిగా షబీనాను ఒత్తిడి చేశాడు. దీంతో భర్తతో విడాకులు పొందిన అనంతరం నిఖా హలాల నియమం ప్రకారం షబీనా ఆమె మామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత భర్త తండ్రితో విడాకులు పొంది, భర్తతో జీవితాన్ని పంచుకోవాలని భావించిన షబీనాకు.. తన సోదరుడిని వివాహం చేసుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఆమె మొదటి భర్త. దీంతో నియమం పేరిట తన జీవితంతో ఆటలాడుకుంటున్నారని గ్రహించిన షబీనా.. నీదా ఖాన్(బరేలీలో ప్రఖ్యాత దర్గా అలా హజ్రత్ కుటుంబానికి చెందిన మహిళ)ను కలిసి తన సమస్యను వివరించింది. నీదా కూడా షబీనా లాగే ట్రిపుల్ తలాక్ బాధితురాలు కావడంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపుతామని బెదిరింపులు.. నీదా ఖాన్, షబీనాలు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేయడాన్ని తట్టుకోలేని ‘పెద్దలు’ చంపుతామంటూ వారిని బెదిరించడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బరేలీ ఇమామ్ ముఫ్తీ ఖుర్షీద్ ఆలం మాట్లాడుతూ... కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే కావాలనే కొందరు ఇస్లాం నియమాలను మంటగలపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందినీ షరియత్ చట్టాల ప్రకారం పని గట్టుకొని బహిష్కరించాల్సిన పని లేదని, అలా మాట్లాడిన మరుక్షణమే వారు ఇస్లాం వ్యతిరేకులుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నియమాల పేరిట ఆటవిక చర్యలకు పాల్పడం సరికాదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
విడాకులు ఇవ్వలేదన్న కోపంతో..
లక్నో: చపాతిని ఎక్కువగా కాల్చిందన్న కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పి, ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహూబ జిల్లాలో చోటుచేసుకుంది. చపాతి ఎక్కువగా కాల్చానన్న కారణంతో రెండు రోజుల క్రితం తన భర్త తలాక్ చెప్పాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన శరీరంపై సిగరెట్లతో కాల్చి గాయలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా యూపీలో ట్రిపుల్ తలాక్కు మరో ముస్లిం యువతి బలైంది. విడాకులు ఇవ్వలేదన్న కోపంతో భార్యకు భోజనం పెట్టకుండా నెల రోజులు గదిలో బంధించాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స తీసుకుంటు ఆమె మంగళవారం మృతి చెందిందని రాయ్బరేలి పోలీసులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఏడాది ఆగస్ట్ 22న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తోందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ట్రిపుల్ తలాక్ హరిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో ప్రస్తుతం బిల్లు చట్టరూపం దాల్చలేదు. Woman from Mahoba's Charkari alleges her husband gave her triple talaq; says, 'I served him food & he refused to eat roti saying it's burnt. He later beat me up, said 'I'm not happy with you', & gave me talaq. I want justice'. Police say, 'probe underway, action will be taken' pic.twitter.com/1aVAnBW2ge — ANI UP (@ANINewsUP) July 11, 2018 -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
‘రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ విందు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా బుధవారం ఇఫ్తార్ విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా బుధవారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుండటంతో.. అందుకు పోటీగానే బీజేపీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై స్పందించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఏవిధంగానూ మేము(బీజేపీ) కాంగ్రెస్తో పోటీ పడటం లేదు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తనకు తానుగా ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న విందు ఇది’ అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ తాజ్ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరవుతారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. -
గాడ్సేపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పుణె : జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ‘నెం1 హిందు రత్న టెర్రరిస్ట్’ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నోటీసులు పంపించే దమ్ము ఎవరికైన ఉందా అని ఆయన ప్రశ్నించారు. పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. ముస్లింలు భారత దేశాన్ని అమ్మాలనుకోవడం లేదని, కానీ గత 70 ఏళ్ల నుంచి దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలంతా పాకిస్తాన్ లేదా సిరియా వెళ్లాలని కొందరంటున్నారని, అలా వెళ్లేవారు ఇప్పటికే పాకిస్తాన్కు వెళ్లారని ఒవైసీ స్పష్టం చేశారు. మా పూర్వీకులు సైతం బ్రిటిష్ వారితో పోరాటం చేశారని, హిందూస్తాన్ జిందాబాద్ అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘మేం ఇక్కడే జీవిస్తాం. ఇక్కడే చస్తాం’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక రాజ్యసభలో ఆగిపోయిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ‘మిస్టర్ మోదీ కళ్లు తెరిచి చూడండి.. మీరు ముస్లిం మహిళల మంచి కోరేవారు కాదు. ముస్లింలకు శత్రువు.’ ఒవైసీ అని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడిన విషయం తెలిసిందే. రాజ్యంగంపై గౌరవంలేని రవిశంకర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
బీజేపీని గెలిపించింది మందిర నిర్మాణానికే
ఔరంగాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికే ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారని, ట్రిపుల్ తలాక్పై చట్టాలు చేయడానికి కాదని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన తొగాడియా..రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం చేయాలన్నారు. ‘ప్రజలు మీకు ట్రిపుల్ తలాక్పై చట్టాలు చేయడానికి ఓట్లేయలేదు. రామ మందిర నిర్మాణం కోసమే పట్టం గట్టారు’ అని ఔరంగాబాద్లో అన్నారు. ట్రిపుల్ తలాక్పై చట్టం చేయడం, చేయకపోవడం ప్రభుత్వ ఇష్టమని, కానీ రామ మందిర నిర్మాణానికి మాత్రం చట్టం రూపొందించాలన్నారు. -
షరియత్ చట్టాల్లో మార్పులను సహించం
సాక్షి, హైదరాబాద్: ఇస్లామీ షరియత్ చట్టాల్లో మార్పుల్ని దేశంలో ప్రతి ముస్లిం మహిళా వ్యతిరేకిస్తోందని ప్రొఫెసర్ అష్రఫ్ రఫీ చెప్పారు. ముస్లిం మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితం కోసం ఖురాన్, మహ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా రూపొందించిందే షరియత్ చట్టమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఖిల్వత్లో ఉర్దూ మస్కాన్లో జమియతుల్ మొమినాత్ మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘షరియత్ చట్టాలు.. ట్రిపుల్ తలాక్’ అంశంపై ఒక రోజు సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా ధార్మికవేత్తలు పాల్గొన్నారు. ట్రిపుల్ తలాక్పై కేంద్రం రూపొందించబోతున్న చట్టంతో మహిళలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పెళ్లి అనేది ఒక పవిత్ర బంధమని.. భార్యాభర్తల మధ్య తగాదాలొస్తే ఇరు పక్షాలవారు సయోధ్య చేయాల్సింది పోయి మరింత జటిలం చేయడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భార్య, పిల్లల జీవనోపాధి ఎలా అని వారు ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటప్పుడు అది నేరమెలా అవుతుందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ముస్లిం మహిళలపై కేంద్రానికి సానుభూతి ఉంటే ముస్లిం మతగురువులతో సంప్రదించి ట్రిపుల్ తలాక్ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. -
ట్రిపుల్ తలాక్పై రాద్ధాంతం వద్దు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్పై కేంద్రం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలను తప్పుదారి పట్టించొద్దని, దేశంలోని ముస్లిం మహిళలు తమ భర్తలు, పిల్లలతో సంతోషంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని ఏజీ కాలనీలో శనివారం రాత్రి ఆలిండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో జల్సా సమావేశాన్ని నిర్వహించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. వివాహ చట్టంలో ముస్లింలకు, హిందువులకు వేర్వేరుగా శిక్షలున్నాయన్నారు. ముస్లింల సమస్యలు, హక్కుల కోసం జల్సా సభలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 11న దారుస్సలాంలో చివరి జల్సా సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రాష్ట్ర కార్యదర్శి రహీముద్దీన్ అన్సారీ, సభ్యులు మునీరుద్దీన్, అక్తర్ జాఫర్పాషా, హుస్సేనీ, హఫీజ్, మౌలానా అక్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా నిఖానామా
లక్నో: ముస్లింలలో ట్రిపుల్ తలాక్ను నిషేధించేలా త్వరలో నిఖానామా(వివాహ ఒప్పందం)లో మార్పులు తీసుకురానున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అధికార ప్రతినిధి మౌలానా ఖలీల్ రెహ్మాన్ చెప్పారు. కొత్త నిఖానామాలో భాగంగా భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వబోనని పురుషుడు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ‘‘కొత్త నిఖానామాలో ‘నేను ట్రిపుల్ తలాక్ ఇవ్వను’ అనే నిబంధనను చేరుస్తున్నాం. ఒక్కసారి దీనికి పురుషుడు ఆమోదం తెలిపితే, ట్రిపుల్ తలాక్ ఇవ్వడం కుదరదు. హైదరాబాద్లో జరగబోయే బోర్డు జాతీయ వార్షిక సమావేశాల్లో ఇలాంటి సమస్యలపై చర్చిస్తాం’’ అని చెప్పారు. సాధారణంగా నిరక్షరాస్యుల్లో ట్రిపుల్ తలాక్ మహమ్మారి అధికంగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. -
బీజేపీకి 'ట్రిపుల్ తలాక్' చెప్పిన మొదటి రాష్ట్రం అదే!
పట్నా: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీపై నిప్పులు చెరిగే ఈ షాట్గన్.. తాజాగా రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించారు. దేశంలో బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థానేనని ఆయన పేర్కొన్నారు. 'బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, అల్వార్: తలాక్, మండల్గఢ్: తలాక్. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికలను గెలుస్తూ.. మనకు ఝలక్ ఇస్తున్నారు' అని శత్రుఘ్న శనివారం ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బీజేపీ మేలుకొని.. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, లేకపోతే త్వరలోనే బీజేపీకి టాటా-బైబై చెప్పాల్సిన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల వెలువడిన రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్గఢ్ అసెంబ్లీ స్థానంలో, అజ్మీర్, అల్వార్ లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలు వసుంధరారాజే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి. -
‘తలాక్’పై రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు వీలైనంత త్వరగా ఆమోదం పొందటం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయకూడదని అన్ని పక్షాలను ఆయన కోరారు. సోమవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 నూతన సంవత్సర కానుకగా ముస్లిం సోదరీమణులకు ఈ బిల్లును కానుకగా ఇవ్వాలన్నారు. అంతకుముందు జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో మోదీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని నిర్మాణం చేయటంలో కృషిచేయాలని కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చను ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్డీయే పక్షాల సభ్యుల పూర్తిస్థాయిలో హాజరవ్వాలని మోదీ కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులను ఆమోదింపజేసుకోవటం కీలకమన్నారు. ముఖ్యమైన అంశాలపై ఈసారి సమావేశంలో చర్చించనున్నందున హాజరు శాతం ఎక్కువగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఆసియాన్ సదస్సుల్లో మోదీ ప్రసంగాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. కాగా సోమవారం ముగ్గురు ఆప్ ఎంపీలు, ఒక బీజేపీ సభ్యుడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. -
దారుణంగా మోసపోయింది
సాక్షి, లక్నో : కొన్ని విషయాల్లో పర్వాలేదు అనిపించినా ఒక్కోసారి గ్రామ పంచాయతీల్లో పరిష్కారం అయ్యే పంచాయితీలు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో ఊహించలేం. కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా సవరించుకోలేని నష్టాన్ని కలిగించొచ్చు. అందుకు ఉదాహరణగా తాజాగా ఓ ముస్లిం మహిళ జీవితంలో జరిగిన సంఘటన అద్దం పడుతోంది. త్వరలో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రానుండగా మరో మహిళ ట్రిపుల్ తలాక్ విధానానికి బలైంది. అది కూడా తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చేతిలోనే.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో ఓ ముస్లిం వ్యక్తి ఓ ముస్లిం మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్కు వెళ్లనివ్వకుండా అదే గ్రామంలో పరిష్కరించాలని నిర్ణయించారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సమస్య తీరుతుందని పంచాయతీ పెద్దలు తీర్పు చెబుతూ ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో చేసిది లేక ఆ బాధితురాలు అతడినే వివాహం ఆడింది. అయితే, పెళ్లి చేసుకున్నప్పటికీ నుంచి అతడు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఆమె తండ్రిని, ఆమెను బలవంతంగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి విడాకుల పత్రాలపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం తలాక్ తలాక్ అంటూ మూడుసార్లు చెప్పేశాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించింది. -
నేటి నుంచే బడ్జెట్ సమరం
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం సాధ్యమైనంత కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కోసం వివిధ పార్టీలతో చర్చిస్తామంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ హౌస్లో ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. బడ్జెట్ సమావేశాలు విజయవంతమయ్యేలా ప్రతిపక్షాలు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అనంత కుమార్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, సింధియా, ములాయం సింగ్ యాదవ్ (సమాజ్వాదీ), డి.రాజా(సీపీఐ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఒబ్రియాన్(తృణ మూల్), తారిక్ అన్వర్ (ఎన్సీపీ) తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమావేశం ఫలవంతంగా సాగింది. బడ్జెట్ సమావేశాల్ని విజయవంతం చేయాలని అన్ని పార్టీల నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీలు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో నిర్మాణాత్మక చర్చ జరిగేలా సహకరించాలని ప్రధాని కోరారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి వీలైనంత మేర ప్రయత్నిస్తాం. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో జీఎస్టీ ఆమోదం పొందినట్లే.. ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది’ అని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై ప్రశ్నించగా.. ‘బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆస్తి. సభే నిర్ణయం తీసుకుంటుంది’ అని సమాధానమిచ్చారు. పార్లమెంటరీ కమిటీల వ్యవస్థను బలోపేతం చేయాలని, జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై స్టాండింగ్ కమిటీలు వాస్తవిక పరిష్కారాలు సూచించాలని పార్టీలకు ప్రధాని సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం రాత్రి విందు సమావేశం ఏర్పాటు చేశారు. సభలో సహకారం ఉంటుందని నేతలు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. అత్యాచారాలు, వర్తకుల దుస్థితిపై నిలదీస్తాం మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. అత్యాచార సంఘటనలు, మహిళలపై అకృత్యాలు, రాజ్యాంగ సంస్థలపై దాడులు, వర్తకుల దుస్థితితో పాటు ఉత్తర ప్రదేశ్లో మత ఘర్షణలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. ఈ అంశాల్ని లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించాలని, సభలో సహకార ధోరణితో వ్యవహరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహరచన కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. ఇక అదే ఎజెండాతో ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గ భేటీ కూడా జరగనుంది. ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన నేడు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. ఎన్డీఏ సర్కారు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ను ఫిబ్రవరి 1న జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెడతారు. తొలిదశ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ మలిదశ సమావేశాలు జరుగుతాయి. -
ముస్లిం సంప్రదాయాలకు అడ్డుతగలొద్దు
తాండూరు: ముస్లిం మత ఆచారాలపై ప్రభుత్వాలు, కోర్టులు కల్పించుకుంటే సహించేది లేదని ఆవర్గం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రిబుల్ తలాక్పై వెలువడిన కోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం, ఆర్ఎస్ఎస్ ముస్లింలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు తమ మతంలో ఇచ్చే గౌరవం.. మరే మతంలోనూ లభించదని తెలిపారు. పలువురు మత పెద్దలు మాట్లాడుతూ.. తాండూరులో 30 వేల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉంటే ఇందులో 3 వేల మంది మాత్రమే తమ మతానికి చెందిన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇత ర పాఠశాలల్లో చేరిన తమ పిల్లలకు మతాచారానికి విరుద్ధంగా వందేమాతరం, సరస్వతీ శ్లోకాలను పఠనం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పిల్లలకు ముస్లిం మతాచారం ప్రకారం విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల మనుగడ కష్టంగా మారిం దని ఆవేదన వ్యక్తంచేశారు. పదివేల మందికి పైగా సభకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు అబుల్ రవూఫ్, జుబేర్లాల, ఖలీల్ పాష, జాఫర్ పాష, ముర్తుజా, కమల్ అత్తార్, సాధిక్, అహద్, ఖాజాపాష, జావేద్, జియావొద్దీన్ ఉన్నారు. -
‘ట్రిపుల్’పై కేకేతో ముస్లిం లా బోర్డు ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎంపీ కె.కేశవరావును ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ తదితరులు మంగళవారం కలిశారు. ఈ మేరకు కేకే నివాసంలో బిల్లుపై కాసేపు చర్చించారు. ఇప్పటికే లోక్సభలో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని పలు అంశాలపై తమకు వ్యతిరేకత ఉందని లా బోర్డు సభ్యులు వెల్లడించారు. తమ అభ్యంతరాలను కేకేకు వివరించారు. రాజ్యసభలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడాలని కోరారు. అయితే దీనిపై కేకే ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ సమావేశంపై కేకే ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లోక్సభలో అనుసరించినట్టుగానే ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు వాకౌట్ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా తెలిసింది. -
కేంద్రంపై అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు
సాక్షి, ఔరంగాబాద్ : ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మరోసారి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ముస్లిం మతానికి చెందిన పురుషులను శిక్షించే వ్యూహంలో భాగంగానే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ముస్లిం మహిళలను రోడ్లెక్కించాలని, పురుషులను మాత్రం జైలుకు పంపాలనే కుట్రతోనే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. సోమవారం రాత్రి ఓ బహిరంగ సభలో ఆయన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. పద్మావత్ సినిమా వివాదం పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటుచేశారు కానీ, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి కమిటీని వేయలేదని చెప్పారు. 'ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా చేసిన కుట్రే ట్రిపుల్ తలాక్ బిల్లు. ముస్లిం మహిళలను రోడ్లపైకి తీసుకురావడానికి, పురుషులను జైళ్లలోకి పంపించడానికి అది ఒక వ్యూహం మాత్రమే' అని ఆయన అన్నారు. మరోపక్క, ఎవరైతే, తలాక్ ద్వారా విడాకులు కోరుకుంటారో వారిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ముస్లిం మహిళల అభివృద్ధికి రూ.2వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఈ బిల్లు రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందలేదు. -
అది సాకు మాత్రమే.. మోదీపై ఒవైసీ ఫైర్
సాక్షి, ఔరంగబాద్: ట్రిపుల్ తలాక్ విషయంలో న్యాయం పేరిట ఇస్లామిక్ చట్టం ‘షరియత్’ను లక్ష్యంగా చేసుకుంటున్నారని అలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ. 15 లక్షలు బ్యాంకులో వేయకపోయినా.. ట్రిపుల్ తలాక్ బాధితులకు కనీసం నెలకు రూ. 15వేలు అయినా ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15 లక్షలు కాదు 15వేలు అయినా ఇవ్వండి మిత్రులారా (పంద్రా లాక్ నహితో పంద్రా హజర్ హి దేదో మిత్రోన్) అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. సత్వర విడాకుల విధానమైన ట్రిపుల్ తలాఖ్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 ఇటీవల లోక్సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిపక్షాల మెజారిటీ ఉన్న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. -
రానున్న బడ్జెట్పై ప్రధాని మోదీ సంకేతాలు
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండకపోవచ్చని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారన్నది ఒక భ్రమ అని, వారు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న వేళ.. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్ కార్డును, భవిష్యత్ పాలన ప్రాథమ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. ‘ఆంగ్ల న్యూస్ చానెల్ ‘టైమ్స్ నౌ’ మోదీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అం శాలపై ప్రధాని స్పందించారు. ఇంటర్వ్యూ సారాంశం ప్రధాని మాటల్లోనే.. జీఎస్టీ... జీఎస్టీ.. పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉ న్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆర్నెల్లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకులూ తొలగిపోతాయి. ఇందుకు అందరూ కలిసి పనిచేయాలి. స్వార్థ రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్ భేటీలో సానుకూలంగా మాట్లాడి.. బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులోనూ అంతే.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. దీనిపై మేమేమీ మాట్లాడబోం. నోట్ల రద్దు కూడా ఒక విజయగాధ. ఉద్యోగకల్పన.. ఉపాధి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో.. ఏడాదిలో 18–25 ఏళ్ల లోపున్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలుపట్టాల నిర్మాణంలోనూ ఉపాధి పెరిగింది. ముద్ర పథకం ద్వారా 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలిచ్చాం. ట్రిపుల్ తలాక్.. ఏ రాజకీయ పార్టీయైనా దేశం కన్నా గొప్పది కాదు. అన్నింటికన్నా ముందు దేశమే. అలాంటి దేశంలో బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తున్నప్పడు దీన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం బాధాకరమే. రాజీవ్ గాంధీ చేసిన పొరపాటు (1985లో షాబానో కేసులో)ను కాంగ్రెస్ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్ తలాక్ బాధితుల కథనాలు బాధాకరం. అలాంటి బాధితులకు సరైన గౌరవం కల్పించటం మా బాధ్యత. కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. బాధితురాలి ఆక్రందనను అర్థం చేసుకోవాల్సిన సమయమిది. సుప్రీం సంక్షోభం.. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వారి అంతర్గత విషయం. ఈ వివాదానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మన దేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పది. దీనిలో భాగస్వాములైన వారంతా చాలా గొప్పవారు, సమర్థులు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. జమిలీ ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. అయితే ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి. బడ్జెట్కు ఓ తేదీ ఉన్నట్లే.. ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీని ఫిక్స్చేయాలి. దీని ద్వారా ఖర్చులు తగ్గుతాయి. చాలా మేలు జరుగుతుంది. రానున్న బడ్జెట్.. మొదటినుంచీ పాపులిజం (ప్రజాకర్షక విధానాలు)కు వ్యతిరేకం. బడ్జెట్ విషయంలో ఆర్థిక మంత్రి, దీనికో బృందం పనిచేస్తుంది. ఇందులో నేను జోక్యం చేసుకోను. సామాన్యప్రజలు ఏవీ ఉచితంగా కోరుకోరు. వారలా కోరుకుంటారనుకోవడం భ్రమ. ప్రజలు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటారు. వ్యవసాయ సంక్షోభం.. అన్నదాతను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింత కృషిచేయాల్సిన అసవరముంది. మా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ చేస్తాం. ఎన్నికల వేళ భవిష్యత్ లక్ష్యాలు.. ఎన్నికలు ఎన్నటికీ నా లక్ష్యం కాదు. ఎన్నికల కోసం నా టైంటేబుల్ను మార్చుకోను. దేశ ప్రజలకు సేవ చేయటం, ఇందుకోసం ముందుగా నిర్ణయించుకున్న పనులు పూర్తి చేయటమే నా లక్ష్యం. సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అంటే రాజకీయంగా ఆ పార్టీని అంతం చేయడం కాదు. అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రజలను మోసం చేయటం వంటి లక్షణాలున్న కాంగ్రెస్ సంస్కృతిని అంతం చేయడం ఆ నినాదం ఉద్దేశం. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సంస్కృతి వేరు. ఆ తర్వాతే వారి ఆలోచనా ధోరణి, సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది. కాస్త అటుఇటుగా అన్ని పార్టీలకూ ఈ ఆలోచన అలవడింది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నానంటే.. అది ఒకపార్టీని ఉద్దేశించినట్లు కాదు. ఆ పార్టీ ఆలోచనలతో నిండిన సంస్కృతిని విమర్శించినట్లు. పాకిస్తాన్తో మన తీరు ప్రపంచ నేతలతో బలమైన సంబంధాలను ఏర్పర్చుకుంటున్నది.. పాకిస్తాన్ను ఏకాకిచేయటానికి కాదు. అసలు మాకు ఆ ఉద్దేశమే లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం. మానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదంపై పోరాటానికి మానవతావాద శక్తులను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. నా దేశం 40 ఏళ్లుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. ఇప్పుడు ప్రపంచానికి ఉగ్ర సెగ తగిలింది. అందుకే కలిసొచ్చే శక్తులను కలుపుకుని ముందుకెళ్తున్నాం. ఇకనైనా భారత్–పాక్లు కలిసి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేయాలి. కలిసి పోరాడితే మరింత త్వరగా విజయం సాధిస్తామని పాక్ ప్రజలకు చెబుతున్నా. -
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
సాక్షి, కర్నూలు: దేశ స్వాతంత్య్రం కోసం మొదటి రక్తబిందువు చిందించింది ముస్లింలేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ ప్రభుత్వం పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ చేయడం మరో డిసెంబరు 6ను తలపింపజేసిందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి కర్నూలులోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘షరియత్’ (మహమ్మద్ ప్రవక్త సూచించిన అంశాల)ను తుడిచి వేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. షరియత్ను కాపాడుకునేందుకు ముస్లింలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఏర్పడిందని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు న్యాయం చేస్తామనే సాకుతో ఇస్లాంలోని ధార్మిక అంశాలను తుడిచిపెట్టాలనుకున్నారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్పై బిల్లు తీసుకురావడం వల్ల నష్టపోయేది మహిళలేననేది మోదీ గుర్తించలేకపోయారని, మహిళలపై అంతగా సానుభూతి ఉంటే ట్రిపుల్ తలాక్కు గురైన వారికి రూ.15 వేల చొప్పున సాయం అందించాలని హితవు పలికారు. షరియత్ గురించి నోరు విప్పే వారిని సైతం ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. అసలు ఇస్లాం ధార్మిక విషయాలపై ఈ ప్రభుత్వానికి గురి ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే మోదీకి.. ఆస్తిలో కూతురికి హక్కు కల్పించేది ఇస్లాం ధర్మమేననేది తెలియదన్నారు. వచ్చే నెల 9,10,11 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ఏఐఎంపీఎల్బీ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జామియా దరుల్ ఉలూంకు చెందిన మౌలానా రహీముద్దీన్, మజ్లిస్ ఉలమె దక్కన్ మౌలానా కుబూల్ పాషా షితరి సాహెబ్, జమాతె ఇస్లామి మౌలానా హామిద్ మహమ్మద్ ఖాన్, జమియత్ అహ్లె హదీస్ మౌలానా షఫి అహ్మద్ మదాని, జమియత్ ఉలమె హింద్ ముఫ్తి గియాజుద్దిన్ రహ్మాని, అమారతె షరియా మౌలానా జఫర్ పాషా, వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బి.ఎ.కె. పర్వేజ్, ఎస్డీపీఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ ప్రసంగించారు. ఆల్ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు జిల్లా అధ్యక్షుడు జాకిర్అహ్మద్ రషాది, సభ్యులు అబ్దుల్మాజిద్, అబ్దుస్సలాం, అబ్దుల్ఖదీర్, ఉమర్నాజిమ్, సులేమాన్నద్వి, ముఫ్తి అబ్దుర్రహ్మాన్, మౌలానా షావలీవుల్లా, ప్రభుత్వ ఖాజీ సలీంబాష ఖాద్రి, అహ్లెహదీస్ తరపున హాఫిజ్ మంజూర్ అహ్మద్, అహ్లె సున్నత్జమాత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఇస్మాయిల్పీర్ ఖాద్రి, సయ్యద్షా షఫిపాషా ఖాద్రితో పాటు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ఎస్.ఎ.అమీర్, గోదాముల అధినేత తాటిపాడు మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. -
తలాక్ చెప్పి భవనంపై నుంచి తోయడంతో..
సాక్షి, ముజఫర్నగర్ : ఓ పక్క దేశవ్యాప్తంగా త్రిపుల్ తలాక్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు చట్టసభల్లో ధుమారం రేగుతుండగా మరోపక్క, ట్రిపుల్ తలాక్ సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు అకారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పడంతోపాటు భవనంపై నుంచి తోసేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు అక్కడి పోలీసులు తెలియజేస్తూ.. ‘బాధితురాలు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎముకలు కూడా విరిగిపోయాయి’ అని చెప్పారు. ఈ నెల (జనవరి) 15న గర్ముక్తేశ్వర్ ఆలయ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నారని వెల్లడించారు. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల రక్షణకోసం మరో ట్రిపుల్ తలాక్ బిల్లును ఇప్పటికే లోక్సభలో ఆమోదించిన విషయం తెలిసిందే. -
‘తలాక్’ వ్యూహంలో కాంగ్రెస్కు పరాభవం
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళల ప్రయోజనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ‘ట్రిపుల్ తలాక్ బిల్లు’ను ఆమోదించకుండానే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఇదివరకే లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని ఎక్కువ బలం ఉన్న ప్రతిపక్షం రాజ్యసభలో పట్టుబట్టడంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది. (సాక్షి ప్రత్యేకం) ఈ మొత్తం వ్యవహారంలో లాభ పడింది పాలకపక్ష భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిల్లులోని అంశాల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించక పోవడం వల్ల కాంగ్రెస్కు నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ముస్లిం మహిళలను ఆకర్శించడంతో పాటు హిందువులను ఏకం చేయడానికి ఈ బిల్లును భారతీయ జనతా పార్టీ ఆశించినంత ఉపయోగించుకుంది. ముస్లిం పురుషులు తమ భార్యలకు ‘ట్రిపుల్ తలాక్’ చెబితే అందుకు వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ముస్లింలను శిక్షించే బిల్లును తెచ్చామని ఇటు హిందువులను మెప్పించడంతోపాటు ట్రిపుల్ తలాక్ వల్ల నష్టపోతున్న ముస్లిం మహిళలను రక్షించడం కోసమే ఈ బిల్లును తెచ్చామని మరోవైపు వారిని ఆకర్షించడం బీజేపీ ఉద్దేశం. (సాక్షి ప్రత్యేకం) తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పారని ఏ ముస్లిం మహిళ ఫిర్యాదు చేసినా సదరు భర్తపై కేసుపెట్టి మూడేళ్ల పాటు జైలుకు పంపించవచ్చు. ఇక్కడ భర్త జైలుకు వెళ్లడం ఇష్టం లేకపోయినా సరే, అంటే భార్య అనుమతి అవసరం లేకుండానే భర్తను జైలుకు పంపిస్తారు. పైగా జైల్లో ఉన్న భర్త తాను జైల్లో ఉన్నంతకాలం భార్య, పిల్లల పోషణార్థం భరణం చెల్లించాలని ఉంది. జైలుకెళ్లిన భర్త భరణం ఎలా చెల్లిస్తాడు? జైలుకెళ్లి వచ్చిన భర్త మళ్లీ భార్యను బాగా ఎలా చూసుకుంటాడు? అన్న వివాదాస్పద అంశాలకు బిల్లులో సమాధానం లేదు. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్ తలాక్ చెల్లదనడాన్నే ముస్లిం కమ్యూనిటీలో మెజారిటీ మగవాళ్లు అంగీకరించడం లేదు. ఇక వారికి శిక్షలు కూడా విధించే చట్టం వస్తే ముస్లిం మహిళలను వారు రాచి రంపాన పెట్టరా? ఈ విషయంలో ముస్లిం మహిళలకు బిల్లులో తగిన రక్షణలు లేవు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు ముస్లిం మహిళలకు ముప్పుతెచ్చే బిల్లులోని అంశాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసి ఉండాల్సింది. ముస్లిం మగవాళ్లను కాని, మహిళలనుగానీ దూరం చేసుకోవడం ఇష్టంలేని కాంగ్రెస్ పార్టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే డిమాండ్పైనే ప్రధానంగా గొడవ చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో అంతగా బలంలేని బీజేపీ ప్రభుత్వం దీన్ని తనకు సానుకూలంగా మలుచుకుంది. ప్రతిపక్షాల డిమాండ్కు తలొగ్గకుండా, ముస్లిం మహిళల మంచి కోసం బిల్లును తెస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతోందంటూ వాదించి తన పబ్బం గడుపుకుంది. మున్ముందు రాజ్యసభలో బలం పెంచుకునే అవకాశం బీజేపీకీ ఎలాగు ఉంది కనుక అప్పుడు బిల్లును ఆమోదించవచ్చు. (సాక్షి ప్రత్యేకం) ఈలోగా పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కర్నాటక రాష్ట్రంలో విజయం కోసం ఎన్నికల ప్రచారంలో ఈ బిల్లును ప్రధాన ఆయుధం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. -
ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న కేంద్రం
నిజామాబాద్ కల్చరల్ (నిజామాబాద్ అర్బన్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని హైదరాబాద్ ఎంపీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును దేశంలోని ముస్లింలంతా తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ఈద్గా వద్ద శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం పర్సనల్ లాలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారని, అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు యత్నించడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
షరియత్లో కేంద్ర జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ చట్టంతో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి, తఫీమే షరియత్ కమిటీ కన్వీనర్ మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మనీ పేర్కొన్నారు. ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయ ఎన్టీఆర్ ఆడిటోరియంలో తంజీమే షరియత్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాద విద్యార్థులు, న్యాయవాదుల సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన మౌలానా మాట్లాడుతూ.. తలాక్కు సంబంధించి భర్తకు మూడేళ్ల జైలు విధించేలా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భార్య, పిల్లల జీవనోపాధి ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం ఇలాంటి చట్టం తీసుకురావడం అంటే షరియత్లో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఈ బిల్లులో ఎన్నో లోపాలున్నాయన్నారు. ముస్లిం మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి సానుభూతి ఉంటే ముందుగా ముస్లిం మత గురువులను సంప్రదించి ట్రిపుల్ తలాక్ నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ శాతం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు ఉన్నారని, దీంతో ముస్లిం షరియత్ ను మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సదస్సులో కమిటీ కో ఆర్డినేటర్ అహ్మద్ఖాన్, కన్వీనర్ జలీసా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభలో పుంజుకోనున్న బీజేపీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభ సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదింపచేసుకుని తన ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేకపోవడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బలం పెంచుకునే అంశంపై బీజేపీ దృష్టి పెట్టిందని ఆ పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి బాలసుబ్రమణియమ్ చెప్పారు. 2018 ద్వితీయార్థానికల్లా రాజ్యసభలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. ప్రస్తుతమున్న 57 మంది సభ్యుల బలం 67కి చేరుతుంది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 98కి చేరువకానుంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఆ పార్టీ లాభపడనుంది. ప్రస్తుతం కాంగ్రెస్కు రాజ్యసభలో 57 మంది ఎంపీలుండగా.. జూలైకు ఆ బలం 48కి పడిపోనుంది. యూపీఏ కూటమి ఎంపీలు 72 నుంచి 63 తగ్గనున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ బలం 58కి పెరగనుండగా.. కాంగ్రెస్ బలం 54కి పడిపోనుంది. కాంగ్రెస్ తర్వాత రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ నష్టపోనుంది. ఆ పార్టీ ఐదు స్థానాలు కోల్పోనుండగా.. ఆర్జేడీ బలం మూడు నుంచి ఐదుకు పెరుగుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలు, ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలపై ఈ మార్పులు చేర్పులు ఆధారపడి ఉన్నాయి. ఇక ఏప్రిల్లో ద్వై వార్షిక ఎన్నికల్లో 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. యూపీలో 10 స్థానాలకు ఎన్నిక జరగనుండగా 8 స్థానాలు బీజేపీ సొంతం కానున్నాయి. -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జవనరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ మేరకు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్పై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వాడీ వేడిగా సాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. డిసెంబర్ 15న సమావేశాలు ప్రారంభంకాగా ఇరు సభలు 13 రోజులు సమావేశమయ్యాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందగా.. రాజ్యసభలో మోక్షం లభించలేదు. ఇరు సభలు 12 బిల్లులకు ఆమోదం తెలిపాయని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలు 29న ప్రారంభమవుతాయని, మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారని చెప్పారు. ఆరోజే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారన్నారు. తొలి దశ సమావేశాలు 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. లోక్సభ 13 రోజుల్లో 61 గంటల 48 నిమిషాలు సమావేశమైందని స్పీకర్ మహాజన్ చెప్పారు. ‘అంతరాయాలు, వాయిదాలతో 15 గంటల సమయం వృథా అయ్యింది. సమావేశాల్లో ప్రభుత్వం 16 బిల్లుల్ని పెట్టింది’ అని స్పీకర్ తెలిపారు. రాజ్యసభలో చివరి రోజు కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎలాంటి చర్చా జరగలేదు. రాజ్యసభ మొత్తం 41 గంటలు సమావేశం కాగా.. అంతరాయాలు, వాయిదాలతో 34 గంటల సమయం వృథా అయ్యింది. ఈ నెలలో పదవీకాలం ముగుస్తున్న సీనియర్లు కరణ్ సింగ్, జనార్దన్ ద్వివేది, పర్వేజ్ హష్మిలకు రాజ్యసభ వీడ్కోలు చెప్పింది. -
‘శీతాకాల’ పార్లమెంటు
సాధారణంగా నవంబర్ మధ్యలో ప్రారంభమై దాదాపు నెల రోజులపాటు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈసారి డిసెంబర్ 15న ప్రారంభమై సెలవు లన్నీ పోగా మొత్తం 13 రోజులపాటు కొనసాగి శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే కీలకమైన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలో మాత్రం దానికి చుక్కెదురైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రధాని ఆధ్వ ర్యంలో అఖిలపక్ష సమావేశం జరగడం... దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించి, వాటి పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని అధికార, విపక్ష సభ్యులు ఏకాభిప్రాయానికి రావడం రివాజు. ఆ తర్వాత ఏదో ఒక సమస్య ముంచుకొచ్చి పెద్ద రగడ జరగడం, వాదోపవాదాలతో సభలు దద్దరిల్లడం కూడా మామూలే. ప్రతిపక్షాలు ప్రతిష్టకు పోయే సమస్య ఏర్పడితే చెప్పనవసరమే లేదు... రోజుల తరబడి నిరవధికంగా సభలు వాయిదాలతో గడిచిపోతాయి. ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఎన్డీయే ప్రభుత్వం ఢిల్లీ వాతా వరణాన్ని కారణంగా చెప్పినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో సహా అధికార పక్ష నేతలందరూ తలమునకలై ఉండటం వల్లనే ఇలా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘దేశద్రోహం’ ఆరోపణలు ఈసారి సమావేశాలను తుడిచి పెట్టేస్తాయన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. సమావేశాల తొలిరోజునే ఆ వివాదం ఉభయసభలనూ కుదిపేసింది. ఒక వారమంతా ఒడిదుడుకుల్లోనే గడిచి పోయింది. మన్మోహన్ పాకిస్తాన్తో కలిసి కుట్ర చేసినట్టు ఆధారాలుంటే అవి బయటపెట్టాలని కాంగ్రెస్ సవాల్ చేసింది. మోదీ క్షమాపణ చెబితే తప్ప శాంతిం చబోమని హెచ్చరించింది. ప్రధానిని మీరు దూషించలేదా అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. బహుశా తలాక్ బిల్లు వంటి కీలకమైన బిల్లును లోక్సభలో ఈ సమావేశాల సమయంలోనే ఆమోదింపజేసుకోవాలన్న సంకల్పం బీజేపీకి లేకపోయి ఉంటే ఈ వివాదం అవిచ్ఛిన్నంగా కొనసాగి ఉండేది. కానీ రెండు ప్రధాన పార్టీలూ తెరవెనక ఎడతెరిపి లేకుండా పరస్పరం చర్చించుకున్నాయి. వివాదంపై ఉభయ సభల్లో తమ తమ పార్టీల తరఫున చెప్పదల్చుకున్నదేమిటన్న అంశాలకు సంబంధిం చిన ముసాయిదాను ఒకరికొకరు అందజేసుకున్నారు. వాటిపై మళ్లీ అభ్యంతరాలు, నచ్చజెప్పుకోవడం వగైరాలు పూర్తయి చివరకు అవగాహన కుదిరాక ప్రభుత్వ పక్షం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ప్రకటనలు చేశాక వివాదం సమసిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్యత ఏర్పడి సభలు సజావుగా సాగడం హర్షించదగిందే. కానీ అందుకు అయిదారు రోజులు పట్టడం విచారకరం. మొత్తంగా ఈ వివాదం వల్ల వరసగా రెండు వారాలపాటు ఉభయ సభలూ సక్రమంగా జరగలేదు. ఏదోవిధంగా ఇదంతా సమసిందని అందరూ ఊపిరిపీల్చుకునేలోగా కేంద్ర మంత్రి అనంత్కుమార్ హెగ్డే లౌకికవాదంపై ఒక కుల సంఘం సభలో చేసిన వ్యాఖ్యలు రోజంతా లోక్సభనూ, రాజ్యసభనూ కుదిపేశాయి. చివరకు తన మాటల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు హెగ్డే చెప్పడంతో పరిస్థితి ఉపశమించింది. మహారాష్ట్రలో ఏటా దళితులు జరుపుకునే భీమా–కోరెగావ్ విజయోత్సవ సభల సందర్భంగా ఘర్షణలు తలెత్తడం, అవి రాష్ట్రమంతా వ్యాపించడం కూడా సమావేశా లపై ప్రభావం చూపింది. పలుమార్లు రెండు సభలూ వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలకూ, శీతాకాల సమావేశాలకూ మధ్య దేశవ్యాప్తంగా ఎందరో రైతులు రుణభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఎప్పటిలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ఈసారి పార్లమెంట్లో చర్చకు రాలేదు. మొత్తంగా సమావేశాల కాలంలో లోక్సభ 91.58 శాతం, రాజ్యసభ మాత్రం 56.29 శాతం పనిచేసిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమావేశాలు సక్రమంగా సాగితే మొదటగా పేరొచ్చేది పాలకపక్షానికే. సమస్యలొచ్చినప్పుడు విపక్షాలతో చర్చిం చడం, వారి వాదనల్లోని సహేతుకతను గుర్తించి తమవైపుగా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే ఆ పని చేయడం, లేనట్టయితే విపక్షాల డిమాండు సరికాదని ఓపిగ్గా నచ్చ జెప్పడం ప్రభుత్వ పక్షం బాధ్యత. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయానికి చోటివ్వా లన్న మౌలికాంశాన్ని పాలకులు గుర్తిస్తే ఏదీ సమస్యగా మారదు. పార్లమెంటు వాయిదాలతో పొద్దుపుచ్చుతుంటే మొదటగా అప్రదిష్ట కలిగేది ప్రభుత్వానికే. ముమ్మారు తలాక్ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన బిల్లుకు లోక్సభలో సులభంగా ఆమోదం లభించినా రాజ్యసభలో అది సాధ్యపడదని ఎన్డీయే ప్రభు త్వానికి తెలుసు. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పిన భర్తను అరెస్టు చేయాలన్న నిబంధన వల్ల దంపతుల మధ్య సామరస్యత కుదిరే అవకాశాలు సన్నగిల్లుతాయని, ఇది అంతిమంగా బాధిత మహిళనే నష్టపరుస్తుందని ఆ పార్టీలు హెచ్చరించాయి. బిల్లుకు కాంగ్రెస్ సవరణలు ప్రతిపాదించినా వాటిపై పట్టు బట్టలేదు గనుక మూజువాణి ఓటుతో అది ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో విపక్షాలదే పైచేయి. సహజంగానే అక్కడ అవరోధాలు ఎదు రయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మవుతాయని శీతాకాల సమావేశాల ముగింపు రోజునే ప్రకటించారు. కనుక ఇప్పుడు తలాక్ బిల్లు ఆమోదం కోసం ఆలోగా ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారా లేక బడ్జెట్ సమావేశాలు ముగిశాక దాని సంగతి ఆలోచిస్తారా అన్నది చూడాలి. తలాక్పై చట్టం తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో దాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేసుకోవాలన్న ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్నట్టుంది. మొత్తానికి పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభ బలప్రదర్శనకు వేదిక కాకూడదన్న అవగాహన ఇరు పక్షాలకూ ఉండాలి. అప్పుడే పార్లమెంటు సమావేశాలు అర్ధవంతంగా సాగుతాయి. అవి ఫలప్రదమవుతాయి. -
గందరగోళం:పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనే ఉండిపోయింది. లోక్సభలో మొత్తం 12 బిల్లులకు ఆమోదం లభించింది. మరికొద్దిరోజుల్లోనే అంటే, ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. -
తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ప్రతిష్టంభన వీడలేదు. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లుపై చర్చను ప్రారంభించాలని ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో గురువారం ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదాపడింది. ట్రిపుల్ తలాక్పై ప్రతిపక్ష సభ్యుల సవరణ తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెల్లనిదిగా ప్రకటించడంతో ప్రతిపక్షం నిరసన కొనసాగించింది. బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం రానట్లయితే చర్చ సాధ్యం కాదని స్పష్టం చేస్తూ సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా నేడే శీతాకాల సమావేశాల చివరి రోజు కావడంతో.. బిల్లు ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ చర్చకు చేపట్టింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, తృణమూల్ ఎంపీ సుఖేందు రాయ్లు బుధవారం ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు నిబంధనలకు అనుగుణంగా లేదని.. దానిని తిరస్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. అయితే తన తీర్మానంపై చర్చించాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఆ తీర్మానం చెల్లదని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం రాకుండా చర్చ సాధ్యం కాదని సభకు కురియన్ స్పష్టం చేశారు. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ లేచి ‘ముస్లిం మహిళలకు ప్రతిపక్షం సాధికారతను కోరుతుంటే ప్రభుత్వం మాత్రం వారిని నిరాశ్రయుల్ని చేయాలని చూస్తోంది’ అని ఆరోపించారు. వెంటనే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ.. ‘ప్రతిపక్షం నిజంగానే మహిళల సాధికారతను కోరుతుంటే.. వెంటనే బిల్లుపై చర్చించాలి’ అని సూచించారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చించకుండానే గురువారం రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు ఉదయం సభ ప్రారంభం కాగానే మహారాష్ట్రలో కుల ఘర్షణల్ని రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. ఘర్షణలపై నిష్పాక్షిక, త్వరితగతి విచారణ నిర్వహించి దోషుల్ని శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. జడ్జీల జీతాల పెంపు బిల్లుకు ఆమోదం సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల జీతాల్ని రెండింతలకు పైగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. మరోవైపు ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(సవరణ) బిల్లు, ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్ట్రప్సీ కోడ్(సవరణ) బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో సవరణలను ఇంతకుముందే రాజ్యసభ ఆమోదించింది. ‘న్యాయవ్యవస్థ పరిధి మీరొద్దు’ శాసన సంబంధ విషయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పరిధులు దాటరాదని లోక్సభ అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ జోక్యాన్ని గనుక నిలువరించకుంటే వచ్చే పదేళ్లలో న్యాయ, శాసస వ్యవస్థల మధ్య సంక్షోభం తలెత్తుతుందని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాల మాదిరిగానే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణలను నేరుగా ప్రసారం చేయాలని కొందరు సూచించారు. చర్చలతో పరిష్కరించుకోండి రాజ్యసభ సజావుగా నడిచేందుకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. పలు అంశాలపై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది సభ ప్రతిష్టను పెంచేందుకేనని, సభ్యులు కూడా అదే విధంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై విభేదాల్ని అధికార, ప్రతిపక్ష సభ్యులు పరిష్కరించుకోవాలని వెంకయ్య సూచించినట్లు సమాచారం. రాజకీయ ఎజెండా కోసం తరచూ సభకు అంతరాయం కలిగించడం, వాయిదా పడటం సరైందా? కాదా? అనే అంశంపై పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రధాన పార్టీలు సభకు అంతరాయం కలిగిస్తూ.. చిన్న పార్టీలకు అవకాశం రాకుండా చేస్తున్నాయని కొందరు సమావేశంలో ఫిర్యాదు చేశారు. -
పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు అంశంలో బీజేపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాల డిమాండ్కు తలొగ్గి పార్లమెంట్ కమిటీకి(సెలక్ట్) సమీక్ష కోసం పంపేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అవి చేసే సూచనలు, ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణించాల్సి ఉంటుంది. అదే జరిగితే వచ్చే పార్లమెంట్ సెషన్స్లోనే బిల్లు మళ్లీ చర్చకు వచ్చే అవకాశాలున్నాయి . కాగా, లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు స్పష్టమైన మెజార్టీతో ఆమోదం పొందగా, రాజ్యసభలోనే కాంగ్రెస్ పార్టీ, విపక్షాల నినాదాలతో చర్చకు కూడా నోచుకోకుండానే పోయింది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ కీలకనేతలు కాంగ్రెస్ పార్టీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసారంగా ట్రిపుల్ తలాక్ బిల్లు లేదని, అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవటం, దీనికితోడు అన్నాడీఎంకే, బిజ్జూ జనతా దళ్ సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనని కోరటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
దద్దరిల్లిన పార్లమెంటు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న ‘కులహింస’ బుధవారం పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఆరెస్సెస్, హిందూత్వ సంస్థలు మహారాష్ట్రలో దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ఈ దాడులపై ప్రధాని మౌనం వహించటంపై మండిపడ్డ లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే.. మహారాష్ట్ర ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ, ఆరెస్సెస్ తిప్పికొట్టాయి. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న కాంగ్రెస్ అసహనంతోనే నోటికొచ్చిన విమర్శలు చేస్తోందని బీజేపీ విమర్శించింది. కాగా, భారత్లో కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ‘బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్’ ప్రయత్నిస్తోందని పరోక్షంగా కాంగ్రెస్ను ఆరెస్సెస్ విమర్శించింది. 2016లో జేఎన్యూలో జాతివ్యతిరేక నినాదాలు చేసిన వారు, వారికి అండగా నిలిచిన వారు ఇప్పుడు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారని ఆరెస్సెస్ ముఖ్యనేత మన్మోహన్ వైద్య ఆరోపించారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బుధవారం లోక్సభ ప్రారంభం కాగానే మహారాష్ట్ర అల్లర్లపై విపక్షాలు ఆందోళన ప్రారంభించాయి. కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ శక్తులు మహారాష్ట్రలో దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘ఈ హింస వెనక ఆరెస్సెస్, ఇతర హిందూ శక్తులున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. దళితుల అంశాల్లో రాగానే ఆయన ‘మౌని బాబా’గా మారిపోతారు’ అని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు ఖండించారు. ‘భీమా–కోరేగావ్ వివాదాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఈ వివాదం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు’ అని పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. అనంతరం కీలకమైన ఓబీసీ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది.అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగటంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదావేశారు. అట్టుడికిన రాజ్యసభ రాజ్యసభ కార్యక్రమాలకూ ‘మహా’ హింస పలుమార్లు అవరోధం కల్గించింది. హింసపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టడంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. బీజేపీ, ఆరెస్సెస్లు దళిత వ్యతిరేకులని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘తలాక్’పై రాజ్యసభలో.. న్యూఢిల్లీ: ‘తక్షణ ట్రిపుల్ తలాక్’ బిల్లుపై బుధవారం రాజ్యసభ అట్టుడికింది. లోక్సభ ఆమోదం పొందిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017పై రాజ్యసభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. మహారాష్ట్ర వివాదంపై పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలని డిమాండ్ చేశాయి. సెలెక్ట్ కమిటీలో ఉండాల్సిన సభ్యుల పేర్లతో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఓ జాబితాను డిప్యూటీ చైర్మన్ కు అందజేశారు. ఈ బిల్లు తీసుకురావటం ద్వారా నేరాలు పెరిగేందుకు ప్రోత్సహించేలా ముస్లిం లను బీజేపీ మోసగిస్తోందని.. గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకే బీజేపీ బలప్రయోగం ద్వారా బిల్లులను ఆమోదింపజేసుకుంటోందన్నారు. విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. బిల్లుపై చర్చను తప్పించుకునేందుకే కాంగ్రెస్.. సెలెక్ట్ కమిటీ నాటకమాడుతోందని బీజేపీ విమర్శించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కటంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను గురువారానికి వాయిదా వేశారు. శీతాకాల సమావేశాలకు రెండ్రోజులే మిగిలి ఉండటంతో ఈ బిల్లును నెగ్గించుకునేందుకు ప్రభుత్వం, వ్యతిరేకించేందుకు విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్న సభ్యులు -
రాజ్యసభలో ప్రతిపక్షాల ఉడుంపట్టు
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు క్లియరెన్స్కు తొలిరోజు అవాంతరం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీల గందరగోళంతో అధికార పక్షం బిల్లును ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభను స్పీకర్ వాయిదా వేశారు. బిల్లుపై గురువారం తిరిగి చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఇది వరకే లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు ఇప్పుడు రాజ్యసభలోకి చర్చకు వచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సభలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకొంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను సభలో మాట్లాడనివ్వాలని కోరారు. తన మాట వినకుంటే సభను వాయిదా వేస్తానని కూడా హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ రాజ్యసభలో మోషన్ ఇచ్చారు. అయితే, ఈ బిల్లును ఎందుకు సెలక్ట్ కమిటీకి ఇవ్వకూడదనే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లు ఇవ్వడంతో సమయం వృధా అవుతుందని, కనీసం ఆరు నెలలు గడిపోతాయని అన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అత్యవసరంగా ఆమోదించాల్సిన బిల్లు అని, సుప్రీంకోర్టు ఆందోళన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఎవరూ ఇవ్వడం లేదో మొత్తం భారతదేశం చూస్తోందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి సభలో న్యాయశాఖ మంత్రి చెప్పిందంతా కూడా సరికాదన్నారు. ఈ బిల్లు కచ్చితంగా సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి (గురువారానికి) వాయిదా వేశారు. -
నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు
న్యూఢిల్లీ: నేడు రాజ్యసభ ముందుకు రానున్న ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ)బిల్లులో సవరణల కోసం ఒత్తిడి చేయొద్దని కాంగ్రెస్ను కేంద్రం కోరింది. లోక్సభలో సహకరించినట్లుగానే రాజ్యసభలోను బిల్లు ఆమోదానికి సాయపడాలని కాంగ్రెస్ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కోరారు. ఈ బిల్లుపై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సవరణలు కోరినా ఒత్తిడి చేయలేదు. బిల్లుపై చర్చ కోసం సమయం కేటాయించాలని మంగళవారం సమా వేశమైన రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అయితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం. -
‘ట్రిపుల్ తలాక్’.. అందరికళ్లూ కాంగ్రెస్పైనే!
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్రచర్చనీయాంశమైన ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభకు రానుంది. బీజేపీకి భారీ మెజారిటీ ఉన్న లోక్సభలో తలాక్ బిల్లుకు సులువుగా ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలదే మెజారిటీ కావడంతో తలాక్కు ఆమోదం లభిస్తుందా, లేదా అనేదానిపై ఉత్కంఠనెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని విపక్ష పార్టీలు ఏకమైతే తలాక్ బిల్లు వీగిపోయే అవకాశాలే ఎక్కువ. తలాక్ బిల్లు విషయంలో రాజ్యసభలో అనుసరించాల్సిన విధానంపై కాంగ్రెస్, సీపీఎం, ఇతర పక్షాల మధ్య చర్చలు నడిచాయి కానీ ఉమ్మడి నిర్ణయం ఉంటుందని మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. అందరికళ్లూ కాంగ్రెస్పైనే : మిగతా పక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ సొంతగా బిల్లులో కొన్ని మార్పులను సూచించే అవకాశాలున్నట్లు తెలిసింది. మార్పులకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ‘సెలెక్ట్ కమిటీ’ ని వేయాలని డిమాండ్ను తెరపైకి తేనున్నట్లు సమాచారం. వివాహలకు సంబంధించినవి సివిల్ వివాదాలుకాగా.. బీజేపీ తీసుకొచ్చిన బిల్లుతో వాటిని క్రిమినల్ వివాదాలుగా మార్చేసిందన్న సీపీఎం వాదనతో ఏకీభవిస్తున్నట్లు కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభలో కాంగ్రస్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎంపీలకు విప్ జారీ : మూడురోజుల సెలవుల తర్వాత మంగళవారం పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభంకానున్నాయి. ట్రిపుల్ తలాక్తోపాటు మరికొన్ని కీలక బిల్లులు కూడా నేడు, రేపు ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో జనవరి 2, 3 తేదీల్లో సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ బీజేపీ తన సభ్యులకు విప్ జారీచేసింది. రేపు(బుధవారం) ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. -
వర్సిటీల్లో ఆందోళనలపై చర్యలేం లేవు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో పాటు చెలరేగిన హింసపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ‘విశ్వవిద్యాలయాలు స్వతంత్ర సంస్థలు. ధర్నాలు, ఆందోళనలు చెలరేగినప్పుడు వాటి నియంత్రణకు స్థానిక అధికారుల సాయంతో చర్యలు తీసుకునే పూర్తి అధికారం వారికుంది’ అని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ విషయాన్ని లోక్సభ అధికారిక వెబ్సైట్లో సోమవారం అప్లోడ్ చేశారు. నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు: ఉన్నపళంగా ముమ్మారు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులిచ్చే పద్ధతిని నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. -
ఆమె బీజేపీలో చేరారు!
-
ట్రిపుల్ తలాఖ్కు అపర్ణ ప్రశంసలు
లక్నో : సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ ట్రిపుల్ తలాఖ్ చట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బిల్లుపై లోక్సభలో మాట్లాడిన అపర్ణ.. ట్రిపుల్ తలాఖ్ బిల్లు మహిళల హక్కులను కాపాడుతుందని అన్నారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ట్రిపుల్ తలాఖ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ట్రిపుల్ తలాక్కు చిన్నమార్పులతో సమాజ్వాదీ పార్టీ అధికారికంగా మద్దుతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాక్ బిల్లు : స్టాలిన్కు థ్యాంక్స్
సాక్షి, చెన్నై: ట్రిపుల్ తలాక్ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని కోరిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) కృతజ్ఞతలు తెలిపింది. సజ్జద్ నొమానీ నేతృత్వంలో ఏఐఎంపీఎల్బీ కార్యవర్గ సభ్యులు సోమవారం స్టాలిన్ను ఆయన నివాసంలో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, దీనికి పాల్పడిన భర్తకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా పార్లమెంట్ ఇటీవల బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ట్రిపుల్ తలాఖ్ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందింది. అయితే ఈ బిల్లు లోక్సభ ఆమోదంపై కేంద్రం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
ఆమె బీజేపీలో చేరారు!
కోల్కతా: ట్రిపుల్ తలాక్ కేసులో ఒక పిటిషనర్ అయిన ఇష్రత్ జహాన్ తాజాగా బీజేపీలో చేరారు. ఆదివారం హౌరాలోని బీజేపీ కార్యాలయంలో ఆమె లాంఛనంగా పార్టీలో చేరారని బీజేపీ బెంగాల్ జనరల్ సెక్రటరీ సాయంతన్ బసు మీడియాకు తెలిపారు. ఆమెను సత్కరించేందుకు త్వరలోనే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ ఒకరు. దుబాయ్ నుంచి ఆమె భర్త ఫోన్లో మూడుసార్లు ’తలాక్’ అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటం చేశారు. గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాను బీజేపీలో చేరడంపై ఇష్రత్ మీడియాతో ఇంకా స్పందించలేదు. -
నవ భారతానికి మీరే పునాది
న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న దేశ యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారి ఓట్లు నవ భారతానికి పునాది కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ఏడాది ‘మన్ కీ బాత్’ చివరి కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ... ఆగస్టు 15 సమయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఢిల్లీలో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసి.. నవ భారత నిర్మాణంపై మేధోమథనం చేయాలని మోదీ సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ప్రగతి శీల భారతదేశం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పరీక్షలో ప్రథముడిగా నిలిచిన అజుమ్ బషీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి కథనాన్ని అందరూ స్మరించుకోవాలని ప్రధాని అభిలషించారు. మన్ కీ బాత్లోని ముఖ్యాంశాలు 2000వ సంవత్సరంలో పుట్టిన వారు జనవరి 1 , 2018 నుంచి కొత్త ఓటర్లుగా నమోదుకు అర్హులవుతారు. 21వ శతాబ్దం ఓటర్లకు భారత ప్రజాస్వామ్యం స్వాగతం పలుకుతోంది. వారిని నేను అభినందించడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓట్లు నవ భారతానికి ఆధారం. కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదం, అవినీతి నుంచి మీరు నిర్మించే నవ భారతం విముక్తి పొందాలి. నవ భారతంలో అందరికీ సమానమైన అవకాశాలు దక్కడంతో పాటు వారి ఆశలు, ఆకాంక్షలు తీరాలి. దేశంలోని ప్రతి జిల్లాలో మాక్ పార్లమెంటును ప్రారంభిద్దామా? 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత నవ భారతంపై అందులో మేథోమధనం చేయాలి. ఆగస్టు 15 సమయంలో .. ఢిల్లీలో నిర్వహించే మాక్ పార్లమెంటులో ప్రతి జిల్లా నుంచి ఎంపికైన యువత పాల్గొని, రాబోయే ఐదేళ్లలో మన సంకల్పాల్ని సాకారం చేసుకునేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించాలని ఆకాంక్షిస్తున్నాను. అంజుమ్ గాథ అందరికీ స్ఫూర్తి కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన అంజుమ్ బశీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి గాథ ఇటీవలే తెలిసింది. అతను కశ్మీర్లోని ఉగ్రవాదం, విద్వేష కోరల నుంచి బయటపడి తన లక్ష్యాన్ని సాధించాడు. 1990లో అతని పూర్వీకుల ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారు. ఉగ్రవాదం, హింస వల్ల అంజుమ్ కుటుంబం స్వగ్రామం వదిలి వెళ్లిపోయింది. అతను మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న మార్గంలో ముందుకు సాగాడు. ముస్లిం మహిళల పోరాటం ఫలించింది ఈ ఏడాది జనవరి 4 నుంచి మార్చి 10 వరకు ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా సర్వేను నిర్వహించబోతున్నాం. 4 వేల నగరాల్లో 40 కోట్ల మందిని సర్వే చేయనున్నాం. 2018 గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలకు చెందిన పది మంది అధినేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారని మన్ కీ బాత్లో ప్రధాని తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం అనంతరం ప్రధాని తొలిసారి స్పందించారు. కేరళలోని శివగిరి మఠం యాత్రికుల ఉత్సవాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ‘ముస్లిం తల్లులు, సోదరీమణుల ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం.. అప్పటికప్పుడు ఇచ్చే ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి మార్గం దొరికింది’ అని చెప్పారు. 70 ఏళ్ల సంప్రదాయాన్ని మార్చాం.. ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్లాలంటే.. తప్పకుండా మగవారి తోడు ఉండాల్సిందేనన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. 70 ఏళ్ల నుంచి వస్తున్న ఆ సంప్రదాయాన్ని మారుస్తూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఇక ముస్లిం మహిళలు ఏ సంరక్షకుడి తోడూ లేకుండా హజ్ యాత్ర చేయవచ్చు. ఈ ఏడాది ఒంటరిగా హజ్ యాత్ర చేసేందుకు 1300 మంది ముస్లిం మహిళలు నమోదు చేసుకున్నారు. వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా మైనార్టీ వ్యవహారాల శాఖను నేను ఆదేశించాను. -
ట్రిపుల్ తలాక్పై తొలిసారి పెదవి విప్పిన మోదీ!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ను లోక్సభ ఆమోదించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుతో శతాబ్దాల ముస్లిం మహిళల వేదనకు ముగింపు పలికినట్లు అయిందని మోదీ అన్నారు. ఈ చట్టం వల్ల ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రబలమైన ఈ ఆచారం కారణంగా ముస్లిం మహిళలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది ప్రజలంతా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అన్నారు. కొత్త ఏడాదిలో కూడా.. అవినీతి, నల్లధనం, బినామీ ఆస్తులపై పోరాటం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘అందరితో కలసి.. అందరి అభివృద్ధి’ అంటూ నూతన సంవత్సర సందేశం ఇచ్చారు. -
బహుభార్యత్వాన్ని రద్దు చేయండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభ ఆమోదం పొందడంతో.. ముస్లిం మహిళలు మరో డిమాండ్ను కేంద్రం ముందుంచారు. ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్తో పాటు బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. ట్రిపుల్ తలాక్ కన్నా.. బహుభార్యత్వం వల్ల ముస్లిం మహిళలు అధికంగా బాధలు పడుతున్నారని.. పలువురు ముస్లిం మహాళా న్యాయవాదులు చెబుతున్నారు. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వంపై న్యాయపోరాటం చేస్తున్న ఫరా ఫయాజ్, రిజ్వానా, రజియాలు ఈ విషయం మరోసారి గళం విప్పారు. ట్రిపుల్ తలాక్ తెచ్చిన ఊపుతోనే.. బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని.. వారు కోరారు. -
మోదీపై ట్వీట్.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ వ్యవహారం.. ముస్లిం వివాహ చట్ట సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. ఆప్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘అసలు ట్రిపుల్ తలాక్ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికే ప్రధాని అయిపోవచ్చు కదా!’’ అంటూ ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. Why say "Talaq Talaq Talaq" and go to jail , when you can just leave her without saying anything and become the Prime Minister of India.#TripleTalaq — Alka Lamba (@LambaAlka) December 29, 2017 -
నిన్న కఠిన చట్టం.. నేడు మరో ట్రిపుల్ తలాక్
లక్నో : ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం ముద్ర వేయించుకున్న మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్లో మరో వ్యవహారం వెలుగు చూసింది. మొరానాబాద్కు చెందిన వరిషా.. తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చాడని చెబుతున్నారు. ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘నా భర్త కట్నం కోసం గత కొంత కాలంగా హింసిస్తున్నాడు. 10 లక్షల రూపాయలు లేదా కారు ఏదో ఒకటి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ వెంటనే ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చానన్నాడు’’ అని వరిషా చెప్పారు. అయితే ఈ అంశంపై ఆమె భర్త, పోలీసులు స్పందించాల్సి ఉంది. కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. అయితే ప్రస్తుతం అది రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. Moradabad: Woman named Varishaa says, 'my husband gave me #TripleTalaq over dowry, he told me either get a car or Rs.10 lakh cash, if you can't I will leave you.' pic.twitter.com/zKABVylADq — ANI UP (@ANINewsUP) December 29, 2017 మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ -
ఎన్నారై వివాహాలపై చట్టాలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వివాహాల వివాదాల అంశంలో గోయల్ సిఫార్సుల అమలుతో పాటు ట్రిపుల్ తలాక్ క్రిమినల్ కోడ్ అమలు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ తదితరులు గురువారం ఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బండారు దత్తాత్రేయ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి లోకముద్ర మహంతి, విదేశాంగ శాఖ కార్యదర్శి మనోజ్ మహాపాత్రలను వేర్వేరుగా కలసి వినతిపత్రాన్ని అందిం చారు. ఎన్నారై వివాహాల్లో వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారం క్లిష్టంగా మారుతోందని, దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇక దృష్టంతా రాజ్యసభపైనే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభలో ఉన్న స్పష్టమైన మెజారిటీతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందటం ప్రభుత్వానికి పెద్ద కష్టమేం కాలేదు. దీనికి తోడు కాంగ్రెస్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించకపోవటంతో సాఫీగానే ఎన్డీయే ముందడుగేసింది. కానీ రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అయితే ఈ బిల్లును గెలిపించుకునేందుకు టీఎంసీ సహా పలు విపక్ష పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయి. మొదట్లో బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే.. కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లకపోయినా ఓటింగ్లో పాల్గొనబోమని వెల్లడించింది. పలు మార్పులతోపాటు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకోవాలని భావిస్తోంది. కాగా, ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభలో లేరు. కేవలం 15–20 మంది కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే సభకు హాజరయ్యారు. -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: తక్షణ ట్రిపుల్ తలాక్ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు గురువారం లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళా హక్కులను కాపాడే దిశగా దేశ చరిత్రలో ఇదో గొప్ప రోజని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే.. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా మరిన్ని నిర్దిష్టమైన అంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. బిల్లుపై వెంటనే ఓటింగ్ పెట్టకుండా స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఇది ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటంతోపాటు, ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా ఉందంటూ మజ్లిస్ ఎంపీ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు, ఏకాభిప్రాయ సాధనతోనే ఈ బిల్లును ఆమోదించుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో సూచించారు. ఆందోళనలతో ఆరంభం గురువారం సభ ప్రారంభం కాగానే.. బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్ను మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. దీనికి అనుమతివ్వటంతోనే బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా, ఇండియన్ ముస్లిం లీగ్, బీజేడీ, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. దీంతో గందరగోళం మధ్యే.. మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ‘మహిళా సాధికారత, మహిళల హక్కులను గౌరవించే దిశగా చరిత్రలో ఇది చాలా గొప్పరోజు’ అని ఆయన పేర్కొన్నారు. ఇది మతం, సమాజానికి సంబంధించిన విషయం కాదని.. కేవలం మహిళలను గౌరవిస్తూ వారికి న్యాయం చేసేదిగా మాత్రమే చూడాలని విపక్షాలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందని విమర్శించారు. దీనికి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.. ‘మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్న సమయంలో పార్లమెంటు నిశ్శబ్దంగా ఉండొచ్చా?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లు ఏ మతానికీ ఉద్దేశించినది కాదని.. దేశంలో మహిళలకు గౌరవం, భద్రత, న్యాయం కల్పిస్తామని చెప్పాల్సిన తరుణమొచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రిపుల్ తలాక్ అమానవీయమని.. సరైన చట్టం తీసుకురావటం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించొచ్చని సూచించిన విషయాన్నీ రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. యూపీలోని రాంపూర్లో గురువారం ఉదయం కూడా ఓ మహిళ ఆలస్యంగా నిద్రలేవటంతో భర్త తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు. భర్త జైలుకెళ్తే భార్యకు మెహర్ ఎవరిస్తారన్న విపక్షాల ప్రశ్నలకు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఈ కేసు విషయంలో ముస్లిం మహిళలు కోర్టుకెళ్లాల్సిన పనిలేదు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కేసులో బెయిల్ ఇచ్చే విచక్షణ కోర్టుకే ఉంటుంది. భర్త సంపాదన ఆధారంగా జీవనభృతిని న్యాయమూర్తే నిర్ణయిస్తారు’ అని వెల్లడించారు. ముస్లిం షరియాలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని.. కేవలం తక్షణ ట్రిపుల్ తలాక్ (తలాక్–ఈ–బిద్దత్)పై మాత్రమే చర్చిస్తోందని ఆయన తెలిపారు. వ్యతిరేకించిన జాబితాలో అన్నాడీఎంకే! ఈ బిల్లు తీసుకురావాలనుకునే ఆలోచనే అర్థరహితమని బీజేడీ ఎంపీ భర్తృహరి మహతబ్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తే.. మెహర్ (భరణం) చెల్లించేదవరని ఆయన ప్రశ్నించారు. ఆర్జేడీ, మజ్లిస్, బీజేడీ, ఇండియన్ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముందుగానే నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు నోటీసులివ్వకపోవటంతో వీరికి మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదు. కాగా, కొంతకాలంగా ఈ బిల్లు ముసాయిదాను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్.. చర్చ జరుగుతున్నప్పడు మాత్రం మాట్లాడలేదు. కాంగ్రెస్కు ఓకే.. కానీ! స్వల్ప మార్పులతో బిల్లుకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తలాక్ తర్వాత మహిళలు, వారి పిల్లల హక్కులను కాపాడేందుకు భరోసా కల్పించేలా బిల్లులో మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ను నిరోధించే ఏ చర్యకైనా కాంగ్రెస్ మద్దతుంటుందన్నారు. భర్త జైల్లో ఉంటే జీవన భృతి ఇవ్వటంపై స్పష్టత కల్పించాలన్నారు. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమేనని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర న్యాయ మంత్రి ఖుర్షీద్ విమర్శించారు. మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే బిల్లును చట్టంగా చేసే హక్కు పార్లమెంటుకు లేదని ఒవైసీ విమర్శించారు. ‘ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను హరించివేస్తుంది. ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తుంది. బిల్లును రూపొందిస్తున్నప్పుడు ముస్లింలను సంప్రదించలేదనే విషయం స్పష్టమవుతోందని’ ఒవైసీ మండిపడ్డారు. నేరుగా మోదీపై విమర్శలు చేస్తూ.. ఇతర మతాల్లోని దాదాపు 20 లక్షల మంది మహిళలూ భర్తల వేధింపులకు గురవుతున్నారని వారి హక్కుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం ద్వారా ట్రిపుల్ తలాక్ను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరమేముందని పలు విపక్షాలు ప్రశ్నించాయి. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మహ్మద్ బషీర్ విమర్శించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లులా అర్థమవుతోందన్నారు. బిల్లుపై స్పందనలు.. బంగ్లాదేశ్, పాక్, మొరాకోసహా పలు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడో ట్రిపుల్ తలాక్ను నియంత్రించా యి. భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలి. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలి. ముస్లిం మహిళలపై వేధింపులను చూస్తూ ఊరుకుందామా? మేం షరియాలో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు. – రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి. జాతి ప్రయోజనాల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి ఇవ్వాలి. హడావుడిగా కాకుండా విస్తృత చర్చల ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలి. ముస్లిం మహిళలకు సాధికారత ఇవ్వటంలో బీజేపీకి ఇంత తొందరెందుకు? – మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్షనేత. ఈ బిల్లు ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త ఆశలు, ఉత్సాహం నింపుతుంది. – బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ బిల్లును సవరించడానికి లేదా రద్దుచేయడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకుసాగుతాం. – ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే కోట్లాది ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుంది. – విదేశాంగ సహాయ మంత్రి అక్బర్ బిల్లులో ఏముంది.. ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. ► రాతపూర్వకంగా లేక మొబైల్, ఈమెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా. ► బిల్లులో ట్రిపుల్ తలాక్ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు. ► మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. ► తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్లు ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్లు మాత్రం ట్రిపుల్ తలాక్ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3–2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి చట్టం చేసేలా ఏకతాటిపైకి రావాలని సుప్రీం సూచించింది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ‘ఆర్టికల్ 25 నుంచి తలాక్–ఎ–బిద్దత్ విడదీయరానిది. సున్నీల్లోని హనాఫీ ముస్లింలు 1,400 ఏళ్లుగా దీన్ని ఆచరిస్తున్నందున మతాచారంలో భాగమైంది. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి తగినట్లుగా లేదని చెప్పి ట్రిపుల్ తలాక్ను కోర్టు తోసిపుచ్చలేదు’ అని అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఖేహర్ అభిప్రాయంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకీభవిస్తూ.. న్యాయస్థానం తీర్పు ద్వారా ట్రిపుల్ తలాక్ను తోసిపుచ్చలేరని... చట్టం ద్వారానే ఇది జరగాలన్నారు. ‘షరియా చట్టంలో ఉంటే అది ప్రాథమిక హక్కులకు అతీతంకాదు. ఇష్టారాజ్యంగా ముస్లిం పురుషుడు విడాకులు ఇవ్వడం ఏకపక్షం, అహేతుకం... దానికి ఆర్టికల్ 25 కింద రక్షణ లేదు’ అని జస్టిస్ నారిమన్ తీర్పు ఇవ్వగా జస్టిస్ లలిత్ ఏకీభవించారు. -
ఓవైసీ సవరణలకు నో.. ట్రిపుల్ తలాక్కు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఒక్క సవరణ లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలతోపాటు ఇతరులు ప్రతిపాదించిన సవరణలకు కూడా మద్దతు లభించకపోవడంతో అవి వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభలోకి అడుగుపెట్టనుంది. గురువారం లోక్సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు తాను వ్యతిరేకం అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన ప్రసంగిస్తూ పలు సవరణలు ప్రతిపాదించారు. ముస్లింలను సంప్రదించకుండానే బిల్లును తీసుకొచ్చారన్న ఆయన ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనితో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని, ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త జైలుకు వెళితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని అసదుద్దీన్ ప్రశ్నించారు. కాగా, అంతకుముందు మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ నేడు చారిత్రాత్మక దినం అన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదని, ముస్లిం మహిళలకు పెద్ద ఊరట అని, లింగ సమానత్వం కూడా ఈ బిల్లు ద్వారా అందుతుందని చెప్పారు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు ఎంతో సహాయం చేస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలను ఈ బిల్లుతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మరోపక్క, ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, ఎంఐఎం, బిజు జనతాదల్ వంటి పార్టీలు మాత్రమే ఈ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకం అని అన్నారు. అలాగే, ముస్లి పర్సనల్ లా బోర్డు కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఏదీ ఏమైనా మొత్తానికి ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించాయి. ట్రిపుల్ తలాక్కు లోక్సభ ఆమోదం -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లులో చిల్లులెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ పేరిట ముస్లిం యువతులకు ఏకపక్షంగా విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్)–బిల్’ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదంటూ గత ఆగస్టు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని భావించడం వల్ల ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. పెళ్లయిన ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం యువకులను వేధించే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. బిల్లులోని మూడవ సెక్షన్ ప్రకారం పెళ్లయిన ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు నోటిమాటగాగానీ, రాతపూర్వకంగాగానీ, ఎలక్ట్రానిక్ రూపంలోగానీ, మరే ఇతర రూపాల్లోగానీ ‘ట్రిపుల్ తలాక్’ చెప్పడం చెల్లదు, అది చట్టవిరుద్ధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్ సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉంది. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని బిల్లులోని ఏడవ సెక్షన్ ‘కాగ్నిజబుల్ అఫెన్స్ (పరిగణించతగ్గ తీవ్రమైన నేరం)’గా పరిగణిస్తోంది. అంటే ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు. బాధిత భార్య భర్తను శిక్షించాలని కోరుకోక పోయినా ఈ సెక్షన్ కింద భర్తను విచారించి జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ భార్య తప్పుడు ఫిర్యాదు చేసినా భర్తకు శిక్ష తప్పదు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్గా ఈ నేరాన్ని పరిగణించి నట్లయితే ముందుగా బాధితురాలు మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయాలి. ఆ కేసును విచారించాల్సిన అవసరం ఉందా, లేదా? పోలీసుల దర్యాప్తునకు ఆదేశించి నిందితుడికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందా? అన్న అంశాలను మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. (సాక్షి ప్రత్యేకం) హిందువులకు సంబంధించిన చట్టాలతో ఈ కొత్త చట్టాన్ని పోల్చిచూస్తే మత వివక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తన నుంచి విడిపోయిన భార్యను రేప్ చేసిన ఓ హిందూ భర్తను చట్టప్రకారం శిక్షించాలంటే భార్య అనుమతి తప్పనిసరి. ఇక్కడ త్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం భర్తను శిక్షించడానికి భార్య అనుమతే అవసరం లేదు. హిందువుల్లో వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లో తీసుకొచ్చిన చట్టంలో కూడా నిందితులకు రక్షణ ఉంది. (సాక్షి ప్రత్యేకం) భార్య లేదా సమీప బంధువులు ఫిర్యాదు చేస్తేగానీ కేసు నమోదు చేయకూడదు. విచారణ జరపరాదు. మన దేశంలో ముస్లిం మహిళల వివాహాలను ‘అఖిల భారత ముస్లిం లా బోర్డు’ పర్యవేక్షిస్తోందన్న విషయం మనకు తెల్సిందే. ముస్లిం వివాహాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వాటికి సంబంధించిన బిల్లులపై ముందుగా ఆ బోర్డు అభిప్రాయాలను తీసుకోవడం మన గత ప్రభుత్వాల ఆనవాయితీ. ఈసారి అలాంటి అభిప్రాయలను తీసుకోకుండానే బిల్లును తీసుకొచ్చారు. ‘ట్రిపుల్ తలాక్’ నుంచి ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల ముస్లిం కమ్యూనిటీకే ముస్లిం మహిళలు దూరమై, మరింత సామాజిక శిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ‘శ్యారా బానో కేసు’లో ఆమెకు అండగా నిలబడి వాదించిన మహిళా సంఘం ‘బెబ్యాక్ కలెక్టివ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం స్త్రీ, పురుషుల మధ్య వివక్షను తొలిగించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని శంకించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంలో ఈ మహిళా సంఘం కృషి ఎంతో ఉందన్న విషయం తెల్సిందే. (సాక్షి ప్రత్యేకం) -
అందుకు కూడా ఎవరైనా విడాకులిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ విధానంలో మార్పులు తెచ్చే బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టే రోజు కూడా ఓ ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం వ్యక్తి తన భార్య ఆలస్యంగా నిద్ర లేస్తుందనే కారణంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తలాక్ అని చెప్పేశాడు. దాంతో ఇప్పుడు ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ప్రస్తావించారు. ఆలస్యంగా నిద్ర లేచినందుకు కూడా విడాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాజా ట్రిపుల్ తలాక్ కేసుపై ఆయన చెప్పిన వివరాలు ఏమిటంటే.. ఖాసీం అనే వ్యక్తి ఓ ట్రక్కు డ్రైవర్. అతడు గుల్ అఫ్షాన్ అనే యువతి నాలుగేళ్ల కిందట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ, రెండో రోజు నుంచే ఆమెను ప్రతి రోజు కొట్టడం ప్రారంభించాడు. పైగా ఆలస్యంగా నిద్ర లేస్తుందనే ఒకే కారణాన్ని చూపి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ నాలుగేళ్ల బంధానికి ట్రిపుల్ తలాక్తో స్వస్తి చెప్పాడు. దీంతో గుల్ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. పైగా ఖాసీం ఎక్కడికి వెళ్లాడో తెలియదు. తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న విషయం తెలసిందే. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే తలాక్ చెప్పడం నేరం అవుతుంది. -
2017 : సంచలన తీర్పులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిన ఏడాది ఇది. ట్రిపుల్ తలాక్, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు ఇలా పలు అంశాల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పులను వెలవరించాయి. ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ.. సుప్రీంకోర్టు ఈ ఏడాది చారిత్రాత్మక తీర్పును వెలవరించింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను కాలరాసేలా ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది. వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు గోప్యత హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీం సంచలన తీర్పును వెలవరించింది. తొమ్మిదిమంది న్యాయమూర్తుల బెంచ్.. దీనిని ఏకగ్రీవంగా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని ప్రకటించింది. 2జీ కుంభకోణం యూపీఏ హయాంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం స్కామ్పై పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును ప్రకటించింది. 2జీ స్కామ్లో దోషులుగా ముద్రపడిన మాజీ టెలికాం మంత్రి ఏ రాజీ, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళిలు నిర్దోషులుగా పాటియాలా కోర్టు ప్రకటించింది. మైనర్ భార్యతో..! మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది రేప్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పును ప్రకటించింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. డేరాబాబా డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలవరించింది. తీర్పు తరువాత పంచకుల కోర్టు బయట డేరా అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు మహిళలపై అత్యాచారాలు చేశాడన్న అభియోగంపై డేరా బాబాను దోషిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఆరుషి హత్య కేసు సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్యకేసులో తల్లిదండ్రులు నూపర్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టును నిర్దోషులుగా ప్రకటించింది. 2013 నుంచి దాస్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దంపతులు కోర్టు తీర్పుతో ఈ ఏడాది బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. శశికళను వెంటాడిన ఆస్తుల కేసులు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళను ఆస్తుల కేసులు వెంటాడాయి. 2016లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాక ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో సీఎం ఆఫీస్కు వెళ్లాలని కలలుగన్న శశికళ.. బెంగళూరులోని పరప్పణ జైలుకు వెళ్లాల్సివచ్చింది. -
ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. అయితే ఇది విరుద్ధమంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం ఓ నోటీసును అందించారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు 72వ నిబంధన ప్రకారం నోటీసు అందజేసినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే దానిపై చర్చకు అంగీకరిస్తారా? అన్నది చూడాలి. ‘‘ముస్లిం మహిళలను రక్షించేందుకు రూపొందించిన బిల్లు అని కేంద్రం చెబుతోంది. తద్వారా ముస్లింలను దోషిగా చూపించి రెచ్చగొట్టే విధంగా కేంద్రం చేష్టలు ఉన్నాయని స్పష్టమౌతోంది’’ అని ఆయన చెబుతున్నారు. కావాలంటే ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలని అసదుద్దీన్ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఓ లేఖ రాశారు. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు నేపథ్యంలో లోక్సభకు ఇవాళ, రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది. ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లు-2017కు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఇంకోపక్క బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఖురాన్కు వ్యతిరేకమైతే ఒప్పుకోం
లక్నో: ప్రతిపాదిత ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు పవిత్ర ఖురాన్ గ్రంథానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది తమకు ఆమోదయోగ్యం కాదని పలు ముస్లిం మహిళా సంస్థలు స్పష్టం చేశాయి. ‘నిఖా (పెళ్లి) అనేది ఓ ఒప్పందం. దాన్ని ఎవరు ధిక్కరించినా శిక్షించాల్సిందే. ఖురాన్, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతిపాదిత బిల్లు లేకపోతే దాన్ని ఏ ముస్లిం మహిళా ఒప్పుకోదు’’అని ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు చైర్ పర్సన్ షైస్టా ఆంబెర్ తెలిపారు. ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఇస్లామీ, జమియత్ ఉల్మా ఏ హింద్, ఇతర సంస్థలకు ముసాయిదా బిల్లును చూపించాల్సిందిగా న్యాయ కమిషన్కు లేఖ రాశాం’ అని పేర్కొన్నారు. ‘కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ఓ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతిపాదిత బిల్లు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు’ అని ముస్లిం వుమెన్ లీగ్ అధ్యక్షురాలు నాయిశ్ హసన్ ఆరోపించారు. -
ఆ బిల్లు.. కుటుంబాలను నాశనం చేస్తుంది’
సాక్షి, లక్నో: కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకున్న రానున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువస్తోందని ముప్లిం లా బోర్డు అభిప్రాయపడింది. ఈ చట్టం వల్ల ముస్లిం కుటుంబాలు సర్వనాశనమవుతాయని ముస్లిం లా బోర్డు తెలిపింది. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు లాబోర్డు సెక్రెటరీ మౌలానా ఖాలీద్ సైఫుల్లా రహమానీ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా.. మూడేళ్ల జైలు శిక్ష మరీ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు రానున్న నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ట్రిపుల్ తలాక్ పేరుతో ఇచ్చే ఇన్స్టంట్ విడాకులు అక్రమం, రాజ్యాంగా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై దీనిపై ప్రత్యేక బిల్లును రూపొందించింది. ట్రిపుల్ తలాక్ను చట్టపరంగా నిరోధించే ఈ బిల్లును మోదీ ప్రభుత్వం డిసెంబర్ 15న ఆమోదించింది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఈ వారంలోనే లోక్సభ ముందుకు రానుంది. ఇన్స్టంట్ విడాకులను నిరోధించడంతో పాటు, అలా చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లులోనే మహిళలకు భరణం తప్పనిసరి చేశారు. -
ట్రిపుల్ తలాక్.. రేపు కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం మతానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. లోక్సభలో డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. లోక్సభ అధికారిక వెబ్ సైట్లో ది ముస్లిం ఉమెన్ బిల్లు(వివాహ హక్కుల చట్టం)-2017 పేరిట ఓ ప్రకటనను కూడా ఉంచింది. బిల్లు ప్రకారం తలాక్ ఏ రూపంలో ఉన్నా నేరమే. అందుకు గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 15నే ఈ డ్రాఫ్ట్ బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది కూడా. ఇక తన పార్టీ ఎంపీలందరికీ బీజేపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. వివాదాస్పదమైన అంశం కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తప్పనిసరిగా రావాలంటూ ఎంపీలకు సూచించింది. ట్రిపుల్ తలాక్ను చట్టవిరుద్దంగా పేర్కొంటూ ఆగష్టు 22న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అవసరమైన చట్టం రూపకల్పన చేయాలని కేంద్రానికి సూచించగా.. ఇప్పుడు కేంద్రం ఆ పని చేయబోతుంది. ముస్లిం మహిళల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా బిల్లును రూపొందించామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ఇది వరకే తెలిపారు కూడా. అయితే మత పెద్దల అభిప్రాయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. -
తలాక్పై బిల్లు
ముస్లిం మహిళలపై వివక్ష చూపుతున్న తలాక్ పద్ధతి చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి నాలుగు నెలలు కావస్తోంది. ఈ విషయంలో తామొక చట్టం తీసుకురాదల్చుకున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే సర్కారు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించిన ఆ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మన రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా చూడాలని..కుల, మత, లింగ ప్రాతిపదికనగానీ... పుట్టిన ప్రాంతాన్ని బట్టిగానీ వివక్ష చూపరాదని చెబుతోంది. అయినా ఏదో ఒక రూపంలో అన్నిటా ఇలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళల పట్ల ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. ముస్లింలలో కొద్దిమందే ఆచరిస్తూ ఉండొచ్చుగానీ...మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే విధానం మన దేశంలో అమలు చేస్తున్నవారు, అందువల్ల ఇబ్బందిపడుతున్న మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలు అయి దుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించబట్టే ఆ విధానం చెల్లుబాటు కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తలాక్కు సంబంధించి అమలులో ఉన్న నిర్దిష్ట విధానాలను కూడా తోసిరాజని ఇష్టానుసారం అమలు చేయడం కూడా పెరిగింది. ఫోన్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మాధ్యమాలద్వారా చెప్పేవరకూ వెళ్లింది. తలాక్ విధానం చెల్లదని మొన్న ఆగస్టులో 3–2 మెజారిటీతో అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు ఇచ్చినప్పుడు అప్పటి చీఫ్ జస్టిస్ ఖేహార్, మరో న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్లు దాంతో ఏకీభవించకుండా 1,400 ఏళ్లనుంచి అమలవుతున్న విధానంలో జోక్యం చేసుకోవడం మతపరమైన స్వేచ్ఛకు హామీ పడుతున్న రాజ్యాంగంలోని 25(1) అధికరణకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. పెళ్లనేది ఇద్దరి జీవితాలతోపాటు...రెండు కుటుంబాలను ఏకం చేసే వ్యవస్థ. పెళ్లంటే ఆడా మగా మధ్య ఏర్పడే భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు... విస్తృతార్ధంలో ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పౌర సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యత. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం లేనప్పుడు అది వివాహ వ్యవస్థలోనూ ప్రతిఫలిస్తుంది. వివక్ష, ఆధిపత్య ధోరణులు సంసారాల్లోకి చొరబడతాయి. అత్యధిక సందర్భాల్లో మహిళలనే బాధితులుగా మారుస్తాయి. రాజ్యాంగమైనా, చట్టాలైనా ఇలాంటి వివక్షనూ, ఆధిపత్య ధోరణులనూ అంగీకరించవు. మన చట్టాలు భిన్న మతాలకుండే వైయక్తిక చట్టాలను (పర్సనల్ లా) గుర్తించాయి. కానీ అవి రాజ్యాంగం నిర్వచించిన... చట్టాలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే అమలు కావాలన్నది తలాక్ విధానంపై వెలువడిన మెజారిటీ తీర్పు భావన. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కురాదల్చుకున్న చట్టం ఆ భావనకు అనుగుణంగా ఉందా? ఈ పిటిషన్లపై మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు లింగ సమానత్వాన్ని, మహి ళల గౌరవాన్ని దెబ్బతీసే ఆచారాలు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి లోబడి చట్టం తీసుకురాదల్చుకుంటే... తలాక్ ద్వారా వివాహబంధాన్ని రద్దు చేసుకోవడం చెల్లుబాటు కాదని ప్రకటిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొంచెం ముందుకెళ్లింది. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బిల్లును రూపొందించింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లులోని అంశాలేమిటన్నది మంత్రి శివశంకర్ ప్రసాద్ వివరంగా చెప్పకపోయినా... ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా అకస్మాత్తుగా మూడుసార్లు తలాక్ చెప్పడం ‘చట్టవిరుద్ధం, చెల్లుబాటుకానిది’ అని బిల్లు నిర్దేశిస్తున్నదని వివరించారు. దీన్ని ఆచరిస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని అన్నారు. తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పాక దానికింద విడాకులివ్వడం భర్తలకు సాధ్యం కాదు. పెళ్లనేది భార్యాభర్తల మధ్య ఏర్పడే సివిల్ ఒప్పందం. తాజా తీర్పు తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం భర్తకు సాధ్యం కాదు. అలా చేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవడానికి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ మాటున భార్యను వేధించినా, హింసించినా, ఆమెకున్న హక్కుల్ని కాలరాసినా అది గృహహింస చట్టం పరిధిలోకొస్తుంది. ఇలాంటి అవ కాశాలున్నప్పుడు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని దానికదే శిక్షార్హమైన నేరమనడం ఎంత వరకూ సబబు? ఇందువల్ల రాజీ మార్గాలు మూసుకుపోవా? దాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చి, భర్తను జైలుకు పంపితే ఆ భార్యాభర్తలు మళ్లీ కలిసే అవకాశం ఉంటుందా? విడిపోవడానికి సిద్ధపడిన మహిళకు సైతం ఇలాంటి పరిణామాలు ప్రశాంతతనిస్తాయా? సుప్రీంకోర్టు కూడా శిక్షార్హమైన నేరంగా పరి గణించాలని సూచించలేదు. అయితే ఆ తీర్పు వెలువడ్డాక ఇంతవరకూ ఇలాంటి 67 కేసులు తన దృష్టికొచ్చాయని కేంద్రం అంటున్నది. తీర్పు వెలువడినాకో, చట్టం చేశాకో... వెనువెంటనే అందరికీ వాటిపై అవగాహన ఏర్పడుతుందనుకోవడం సరి కాదు. అందుకు సమయం పడుతుంది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అకస్మాత్తుగా విడాకులిచ్చే పద్ధతికి వ్యతిరేకంగా మొన్న ఏప్రిల్లో తీర్మానం చేసింది. ఈ విధానాన్ని పాటించేవారిపై సాంఘిక బహిష్కరణ అమలు చేయాలని పిలుపునిచ్చింది. అటువంటి సంస్థలు, ముస్లిం వర్గాల్లో పలుకుబడిగల ప్రముఖుల సాయంతో తాజా తీర్పుపై అందరిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాల అనంతరం పరిస్థి తేమిటో సమీక్షించి బాధిత మహిళలతో, మహిళా హక్కుల సంఘాలతో, మత సంస్థలతో చర్చించి బిల్లు రూపొందించి ఉంటే బాగుండేది. నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ పనిచేసిన తీరును ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. బిల్లుపై పార్లమెంటులో ఎటూ చర్చ ఉంటుంది. కానీ అంతకన్నా ముందు భిన్న వర్గాలతో మాట్లాడితే ప్రభుత్వానికి ఈ సమస్యపై మరింత స్పష్టత ఏర్పడేది. న్యాయం కలగజేయాలన్న ఆత్రుత మంచిదే. కానీ ఆ ఆత్రుతలో మౌలిక ఉద్దేశమే దెబ్బ తినకూడదు. -
మూడుసార్లు తలాక్ అంటే ఇక కటకటాల్లోకే...
సాక్షి, న్యూఢిల్లీ/కోల్కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది. ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆయన జూనియర్ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ప్రసాద్ మద్దతు పలికారు. కోల్కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు. -
మోదీ పేరిట ట్రిపుల్ తలాక్!
బరేలీ : ఇస్లాం వ్యతిరేక విధానం ట్రిపుల్ తలాక్ పై తాత్కాలిక నిషేధం అమలులో ఉన్నా... అలాంటి ఘటనలు మాత్రం ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్లో మరో ట్రిపుల్ తలాక్ వెలుగు చూడగా.. భార్య భర్తల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేసు ఆసక్తికరంగా మారింది. బరేలీకి చెందిన ఫైరాకు ఆమె భర్త దానిష్ మూడు సార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చాడు. అయితే తాను ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి హాజరు అయిన క్రమంలోనే భర్త విడాకులు ఇచ్చాడని సదరు మహిళ వాపోతుంది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని హర్షిస్తూ తాను మోదీ సభకు హాజరయ్యానని కానీ, తన భర్త అది అర్థం చేసుకోవట్లేదని చెబుతున్నారు. అంతేకాదు ఓ ఆంటీతో తన భర్తకి సంబంధం ఉందని.. అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. సభ నుంచి రాగానే మోదీ ర్యాలీకి వెళ్లావంటూ తనని, తన కొడుకును కొట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటివేశాడని ఫైరా ఆరోపిస్తున్నారు. అయితే భర్త మాత్రం కారణం అది కాదని చెబుతున్నారు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం నడుపుతున్న నేపథ్యంలోనే విడాకులు ఇచ్చేశానని, తాను ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నదాంట్లో వాస్తవం లేదంటున్నాడు. ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆమె దుస్తులు ధరిస్తోంది. అది నాకు నచ్చలేదు. పైగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇంక నా భార్యను భరించటం నా వల్ల కాదు. అని భర్త దానిష్ చెబుతున్నాడు. పరస్పర వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేక దర్యాప్తు ద్వారా చిక్కుముడి విప్పేందుకు బరేలీ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ట్రిపుల్ తలాక్ బాధితురాలికి యోగి అభయం
సాక్షి, గోరఖ్పూర్ : ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ మంగళవారం గోరఖ్పూర్ మఠంలో జనతా దర్బార్ నిర్వహించారు. ఈ సమయంలో రాంపూర్కు చెందిన బాధిత ముస్లిం మహిళ.. ట్రిపుల్ తలాఖ్ గురించి ఆయనకు వివరించారు. ‘నాకు నాభర్త ఫోన్లోనే తలాక్.. అని ముమ్మారు చెప్పి విడాకులు ఇచ్చారని’ ఆమె వాపోయారు. విడాకులు ఇవ్వడమేకాక.. తనను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు అతియా బేగం యోగి ఆదిత్యనాథ్కు వివరించారు. అతియా బేగం ఆవేదనపై స్పందించిన యోగి ఆదిత్యానాథ్.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళకు తప్పకుండా న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలపై దురాగతాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. My husband gave me Triple Talaq over the phone and also threatened to kill me. A law should be made to stop this. Today, I have come to CM's Janta Darbar, so, I can narrate my story to him: Triple Talaq victim from Ramapur pic.twitter.com/nfJVjNOtm9 — ANI UP (@ANINewsUP) November 21, 2017 -
తలాక్కు చెల్లుచీటి!
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరింత మద్దతు తెలుపుతోంది. ట్రిపుల్ తలాక్ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తలాక్ను రద్దు చేసే క్రమంలో భాగంగా బిల్లును రూపొందించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా.. బిల్లు రూపకల్పనకు మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన సమాచారం. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముస్లిం వ్యవస్థలో భాగమైన ఈ తలాక్ వల్ల మహిళలు అన్యాయానికి గురువుతున్నారని, వారికి చట్ట పరమైన రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఆగస్టు 22న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసాలకు సంబంధించినది.. కావడం వల్ల దీనిపై కేందం స్పష్టమైన చట్టాన్ని చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.