Jacqueline Fernandez
-
జైలు నుంచే హీరోయిన్కి ప్రేమ లేఖ..గిఫ్ట్గా ప్రైవేట్ జెట్!
‘బేబీ.. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ ఏడాది మనకు ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez )కు ప్రేమ లేఖ రాశాడు ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్ర శేఖర్(Sukesh Chandrashekhar). మరో జన్మంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా జన్మిస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు జైలులో ఉన్నప్పటికీ తన ప్రియురాలికి ప్రైవేట్ జెట్ను కానుకగా ఇచ్చాడు. ‘షూటింగ్స్ కోసం వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకోసం ఓ ప్రైవేట్ జెట్ని బహుమతిగా అందిస్తున్నాను. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నా. ఈ జెట్లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి’ అని ప్రియురాలిపై తనకున్న ప్రేమనంతా లేఖ రూపంలో రాశాడు.రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2021లో ఢిల్లీ పోలీసులు సుఖేశ్ అరెస్ట్ చేశారు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. జాక్వెలిన్ తన ప్రియురాలు అని సుఖేశ్ అంటుంటే.. అసలు అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ చెబుతోంది. కోర్టులో కూడా ఇదే విషయం చెప్పింది. అయిన్పటికే సుఖేశ్ మాత్రం ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు. బహుమతులు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె బర్త్డేకి ఓ పెద్ద పడవను గిఫ్ట్గా అందించాడు. క్రిస్మస్ కానుకగా పారిస్లో ఒక వైన్ యార్డ్నే కానుకగా ఇస్తున్నట్లు లేఖ రాశాడు. -
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
కష్టాలను తట్టుకొని, త్వరగా కోలుకొని, తిరిగి మామూలు స్థితిలోకి వచ్చే మానసిక దృఢత్వాన్ని ఇంగ్లిష్లో ‘రిజిలియన్స్’ అని, తెలుగులో ‘స్థితిస్థాపకత్వం’ అని మనం అంటే అంటూండవచ్చు కానీ.. ఇక్కడ మాత్రం.. ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ అని మాత్రమే ఆ.. దృఢత్వానికి అర్థం చెప్పుకోవాలి! జాక్వెలిన్ బాలీవుడ్లోకి వచ్చి 15 ఏళ్లు అయింది. ఈ ఒకటిన్నర దశాబ్దాలలో ఆమె అనేక విజయాలను చవి చూశారు. కొన్ని కష్టకాలాలు కూడా ఆమెకు తమ తడాఖా చూపించాయి. అయితే – ‘‘కష్టం లేనిదే జీవితం లేదు. ఆ కష్టం నుంచి జీవితం ఏం నేర్పిందన్నదే మనకు ముఖ్యం’’ అని అంటారు జాక్వెలిన్.‘‘నేనైతే గాలి దుమారంలా వచ్చిపోయే ఒడిదుడుకులకు గట్టిగా నిలబడటం నేర్చుకున్నాను. నాపై నేను నమ్మకాన్ని ఏర్పరచుకోవడాన్ని సాధన చేశాను. చేస్తున్న పని నుండి పారిపోవలసి వస్తే అసలా పనిలోకి ఎన్ని ఆశలతో వచ్చామన్నది మొదట గుర్తు చేసుకోవాలి. అక్కడి వరకు సాగిన మన ప్రయాణాన్ని వృథా కానివ్వకూడదని సంకల్పించుకోవాలి. ఇక నాకైతే నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచే వ్యాపకాలూ నాకు తోడుగా ఉన్నాయి’’ అంటారు జాక్వెలిన్ . శ్రీలంక నుంచి వచ్చి, ‘అలాద్దీన్’ (2009) చిత్రంతో బాలీవుడ్కు పరిచయమై, ‘మర్డర్–2’ తో ఇండస్త్రీలో నిలదొక్కుకున్న జాక్వెలిన్ .. ‘‘ఇండియా నన్ను స్వీకరిస్తే చాలునన్నదే అప్పటి నా కల’’ అంటారు. ‘‘అయితే ఈ దేశం నన్ను అక్కున చేర్చుకుని, ఆ కలను మించిన గుర్తింపునే ఇచ్చింది. మొదట్లో భాష కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులు నాకిది పరాయి దేశం అన్న భావన కలగనంతగా నన్ను ఆదరించారు’’ అని ఆమె తెలిపారు.ఈ పదిహేనేళ్లలోనూ 30కి పైగా చిత్రాలలో నటించిన జాక్వెలిన్ రెండు నెలల క్రితమే ‘స్టార్మ్ రైడర్’ మ్యూజిక్ వీడియోతో సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ‘హౌస్ఫుల్ 5’ చిత్రంలో నటిస్తున్నారు. అందులో హీరో అక్షయ్ కుమార్. ‘‘ఏ రంగంలోనైనా ఎదుగుతున్న క్రమంలో సవాళ్లు ఎదురవటం మామూలే. అయితే ఊహించని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముట్టినప్పుడు (బహుశా ఈడీ దాడులు, మీడియా రాతలు అని ఆమె ఉద్దేశం కావచ్చు) జీవితం తలకిందులు అయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే మనం దృఢంగా ఉండాలి.. ’’ అని హార్పర్స్ బజార్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు జాక్వెలిన్ (చదవండి: జస్ట్ ఏడు రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గిన నటి నిమ్రా ఖాన్: ఇది ఆరోగ్యకరమేనా..?) -
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మరోసారి ఈడీ సమన్లు
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. రూ. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో సుమారు రెండేళ్ల క్రితం ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు జైల్లో ఉన్న సుకేశ్ పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో ఆమె పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించింది.అయితే, తాజాగా ఈ కేసులో జాక్వెలిన్కు ఈడీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో ఈడీ పలుమార్లు ఆమెను ఇప్పటికే విచారించింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.సుకేశ్ నుంచి జాక్వెలిన్ చాలా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించింది. అయితే, సుకేశ్ తన జీవితాన్ని నాశనం చేశాడని జాక్వెలిన్ కోర్టు ముందు గతంలో వాపోయింది. అతని వల్ల సినిమా ఛాన్స్లు కూడా పోయాయని ఆమె తెలిపింది. తన కెరీర్తో సుకేశ్ ఆడుకున్నాడని కోర్టు ఎదుట జాక్వెలిన్ వాపోయింది. కొన్నేళ్లుగా సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. -
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
బికినీలో కూల్గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్క్యూట్ స్మైల్తో మాయలో పడేస్తున్న దీపికా పిల్లివెనక అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చేస్తున్న అమైరా దస్తూర్నడుము వయ్యారాలు.. జబర్దస్త్ వర్ష కిర్రాక్ పోజులుచిన్న పిల్లలా ఆడుకుంటున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Kanch (@akansharanjankapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Likhita Yalamanchili (@likhita_yalamanchili) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
సున్నితమైన ఎమోషన్స్ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా 'అరి' అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్కు సౌత్, నార్త్లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పలు అనుమానాలు
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముంబై బాంద్రావెస్ట్లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో ఒక అపార్ట్మెంట్లో ఆమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అందులో 14వ ఫ్లోర్లో ఉండే ఒక ఫ్లాట్లో బుధవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. కానీ 15వ ఫ్లోర్లో జాక్వెలిన్ ఉంటుంది. ఈ మంటలు ఆమె ఉండే నివాసం వరకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్కు కాల్ చేయడంతో వెంటనే వారు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు కూడా చేసింది. కానీ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేయడమే కాకుండా తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్, జీవనోపాధిని నాశనం చేశాడని చెప్పిన జాక్వెలిన్.. సుఖేశ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు కిందనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. -
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
నువ్వు మరింత అందంగా తయారవుతున్నావ్.. హీరోయిన్కు ప్రేమలేఖ!
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపాడు. (ఇది చదవండి: చిరంజీవిపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!) రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో సుకేశ్ చంద్రశేఖర్ తన ఫ్రెండ్కు విషెస్ చెప్పాడు. నటి పుట్టినరోజు సందర్భంగా సుకేశ్ ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను చాలా మిస్సవుతున్నా సుకేశ్ లేఖలో రాస్తూ..'నా బేబీ జాక్వెలిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా..యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టినరోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రహంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు.' అంటూ తీవ్రమైన భావోద్వేగంతో రాసుకొచ్చాడు. గతంలో చంద్రశేఖర్ ఆమెను కౌగిలించుకోవడం, కేక్ తినిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు. అయితే గతంలో సుఖేష్ చంద్రశేఖర్తో డేటింగ్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్తో ఆ సినిమాలో ) -
రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..
గత ఏడాదిలో సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఆమె కొత్త ఇల్లు కొనడంతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో జాక్వెలీన్ కొత్త ఇంటిని కొనింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్-ఆలియా భట్, కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి బడా హీరోలు నివసించే ప్రాంతంలో 'మర్డర్-2' బ్యూటీ కొత్త ఇంటిని తీసుకుంది. (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) ఇదే ప్రాంతంలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారని తెలిసిందే. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్లో ఇంటిని కొనుగోలు చేసింది ఈ బ్యూటీ. వ్యాపారా నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో 3 BHK, 4 BHK ఇళ్లు కొనాలన్నా రూ. 12 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ బ్యూటీ ఎన్ని బెడ్ రూమ్స్ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఇంకా తెలియరాలేదు. కానీ సుమారు రూ. 20 కోట్లతో కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. జాక్వెలిన్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వచ్చాయి. సుకేష్ బహుమతిగా పంపించాడా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇదంతా సుకేష్ నుంచి వచ్చిన ప్రాప్తం అంటూ మరోకరు కామెంట్ చేశారు. మరోకరు అయితే ఏకంగా 'సుకేష్ డబ్బుతోనా లేక సల్మాన్ భాయ్తోనా?' ఇని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆమెకు బెమధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్ మాత్రం జైళ్లోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: జాక్వెలిన్కు కాకుండా నాటునాటుకు ఆస్కార్.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) (ఇదీ చదవండి: (Kajal Aggarwal: నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్) -
పింక్ లో ప్రియమణి.. బ్లూ డ్రెస్లో వర్ష..తారల అందాలు
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి నీలి రంగు డ్రెస్లో వర్ష పరువాల విందు వొకేషన్ మూడ్ అంటూ సముద్రం ఒడ్డున బోటుపై ఫోటోకి పోజులు ఇచ్చాడు బుల్లితెర నటుడు రవికృష్ణ View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
'అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా'
ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన విషయం. కానీ సౌత్ సినిమాలకు ఈ అవార్డులు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు(ఆర్ఆర్ఆర్) పాటకు, బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఇది జీర్ణించుకోలేకపోయిన కొందరు ఈ రెండు చిత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మేకప్ ఆర్టిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ షాన్ ముట్టతిన్ ఆస్కార్ విజయంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'హహ్హ, ఇది భలే ఉంది. ఇండియాలో ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను కానీ ఏకంగా ఆస్కార్ను కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్ అయినా!' అని ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు ఇలా ఆర్ఆర్ఆర్ను ఆడిపోసుకోవడానికి కారణం లేకపోలేదు. తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్' సినిమాలోని అప్లాజ్ కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్కు పోటీపడింది. అయితే ఆ పాటను వెనక్కు నెట్టి నాటునాటుకు అకాడమీ అవార్డు రావడంతో అతడు అసూయ పడుతున్నాడు. అయినా మరీ అంత జెలసీ పనికిరాదని బుద్ధి చెప్తున్నారు నెటిజన్లు. -
ఆర్ఆర్ఆర్కు పోటీగా జాక్వెలిన్ మూవీ.. ఆస్కార్ నామినేషన్స్లో చోటు
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' చిత్రంలోని అప్లాజ్ అనే సాంగ్ ఆస్కార్ నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్కు పోటీగా నిలిచింది. జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
అతని వల్ల నా కెరీర్ మొత్తం నాశనం: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్పై బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతని వల్లే తన కెరీర్ పూర్తిగా నాశమైందని వాపోయింది. సుకేశ్ తన భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జాక్వెలిన్ మాట్లాడుతూ..'సుకేష్ చంద్రశేఖర్ నా కెరీర్ నాశనం చేశాడు. అతను ఒక మోసగాడు. నేను అతని తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నయవంచనకు గురిచేశాడు. తనను తప్పుదారి పట్టించాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు.' అంటూ తన వాంగ్మూలంలో వివరించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
ఆమె వల్లే అన్ని కోల్పోయా.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు బెయిల్) గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది. మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు. -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్లో కనిపించింది. అక్షయ్కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
Ram Setu Review: ‘రామ్ సేతు’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ సేతు నటీనటులు: అక్షయ్ కుమార్, నాజర్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా తదితరులు నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో దర్శకత్వం : అభిషేక్ శర్మ సంగీతం: డేనియల్ బి జార్జ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్ విడుదల తేది: అక్టోబర్ 25, 2022 అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా నేడు( అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘రామ్ సేతు’ కథేంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. రామసేతుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని భారతీయులు విశ్వసిస్తారు. రామసేతు వేనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది అందరికి ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ని తీసుకొని ‘రామ్ సేతు’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ శర్మ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడు. వాస్తవ గాధకు కల్పనను జోడించి కథనాన్ని నడిపించాడు. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రీన్ప్లే ఉండాలి. ఈ చిత్రంలో అది మిస్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్లస్ ఏంటంటే.. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చూపించారు. శ్రీలకంలో రావణాసురుడి ఆనవాళ్లు ఉన్నాయని, రామాయణం ప్రకారం రావణుడు ఉన్నాడంటే.. రాముడు కూడా ఉన్నట్లే కదా అని ఈ చిత్రం సారాంశం. శ్రీలంకలో ఉన్న త్రికూటరపర్వతం, అశోకవనం, స్వర్ణలంక ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించారు. అయితే హీరో టీమ్ చేసే పరిశోధన మాత్రం ఆసక్తికరంగా సాగదు. పేలవమైన స్క్రీన్ప్లే, పసలేని డైలాగ్స్, చప్పగా సాగే కీలక సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవు. ఎవరెలా చేశారంటే.. ఆర్కియాలజిస్ట్ ఆర్యన్గా అక్షయ్ చక్కగా నటించాడు. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్గా తెరపై కనిపించాడు. గైడ్ ఏపీగా సత్యదేవ్ తనదైన నటనతో మెప్పించాడు. ఆయన ఎవరో అని రివీల్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. ఆర్యన్ టీమ్మెంబర్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పాత్రకు న్యాయం చేసింది. నాజర్, నుస్రత్ బరూచాతో పాటు ఇతన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. డేనియల్ బి జార్జ్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా. ఎడిటర్ రామేశ్వర్ ఎస్ భగత్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు బెయిల్
Jacqueline Fernandez Bail: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. కాగా సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ను నిందితురాలిగాపేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్ను ఆగస్టు 17న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 26 కోర్టుల ఎదుట హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ అవగా, సోమవారం జాక్వెలిన్ న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ ఈడీ స్పందన కోరింది. అయితే అప్పటికే రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. దీన్ని అంగీకరిస్తూ రూ.50 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ను ఢిల్లీ పాటియాల కోర్టు మంజూరు చేసింది. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. మరోసారి జాక్వెలిన్కు సమన్లు
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల వసూళ్ల కేసుతోపాటు మనీ లాండరింగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ పోలీసు శాఖ ఆర్థికనేరాల విభాగం అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రముఖ వ్యక్తులను మోసగించి, రూ.200 కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్న సుఖేశ్ చంద్రశేఖర్తో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకదశలో సుఖేశ్ను పెళ్లి చేసుకోవాలని జాక్వెలిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్కు బిగుస్తున్న ఉచ్చు..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల జాక్వెలిన్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్పై నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్షీట్ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్కు సమాన్లు జారీ చేసింది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ కాగా రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'విక్రాంత్ రోణ'
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ. గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా మంజునాథ్ గౌడ్ నిర్మించారు. జూలై 28న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగానే వసూళ్లు రాబట్టింది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 విక్రాంత్ రోణ డిజిటల్ రైట్స్ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొద్దిరోజులు ఆగారంటే విక్రాంత్ రోణను ఎంచక్కా కూర్చున్న చోటే వీక్షించేయవచ్చు. The devil will take over @ZEE5Kannada @KicchaSudeep @anupsbhandari @JackManjunath @shaliniartss @ZeeStudios_ #VikrantRonaOnZee5 https://t.co/vjt1XW0ziw — VikrantRona (@VikrantRona) August 25, 2022 ಇದೇ September 2nd ಬರ್ತಿದ್ದಾನೆ ವಿಕ್ರಾಂತ್ ರೋಣ ನಿಮ್ಮ Zee5 ಅಲ್ಲಿ! Stay tuned@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss @shivakumarart @AlwaysJani @ZeeStudios_ @ZeeKannada @RavishankarGow5 @vasukivaibhav#VR pic.twitter.com/MEpDbecYCt — ZEE5 Kannada (@ZEE5Kannada) August 25, 2022 చదవండి: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడా! పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు షాక్ ఇచ్చిన ఈడీ
-
ఈడీ షాక్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ని నిందితురాలిగా ఈడీ పరిగణించింది. ఈ మేరకు జాక్వెలిన్ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో చేరుస్తూ..ఆమెను నిందితురాలిగా పేర్కొంది. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. (చదవండి: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న బుల్లితెర నటి) రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?
‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా ! 'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి. రోజ్ రూమ్: ‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్లైన్లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే. అమ్రిస్: పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్రిస్ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్ను బట్టే ధరలు. -
Vikrant Rona Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
టైటిల్ : విక్రాంత్ రోణ నటీనటులు :కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మధుసూదన్ రావు తదితరులు నిర్మాత: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ దర్శకత్వం: అనూప్ భండారి సంగీతం : అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్ విడుదల తేది: జులై 28, 2022 కథేంటంటే.. కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్ గంభీర్(మధుసూదన్రావు), అతని తమ్ముడు ఏక్నాథ్ గంభీర్(రమేశ్ రాయ్)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్ రోణ(కిచ్చా సుధీప్). ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్ రోణ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విక్రాంత్ రోణ..ఇదొక యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్, టీజర్లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్ పెరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్ట్రాక్, మదర్ సెంటిమెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎవరెలా చేశారంటే.. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్ బండారి పర్వాలేదు. క్లైమాక్స్లో అతని పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్ ఆర్ట్వర్క్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘విక్రాంత్ రోణ’ మూవీ ట్విటర్ రివ్యూ
కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కి భారీ స్పందన లభించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 28) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #VikrantRona one of the best 3 D movie in India,,, Best thrill with suspence ,,, what a experience in 3 d totally paisa vasool,,, Kannada industry is in Another level 🔥 🔥 🔥 And collection don't worry guys it will be another level because movie is on 🔥🔥 — Rakesh appu (@Kotresh57392792) July 28, 2022 త్రీడీలో వచ్చిన చిత్రాల్లో విక్రాంత్ రోణ ఒక మంచి చిత్రమని, సుదీప్ పెర్ఫామెన్స్ అద్భుతమంటూ కామెంట్ చేస్తున్నారు. కన్నడ పరిశ్రమని మరోస్థాయిలో నిలబెట్టిన చిత్రమిదని అంటున్నారు. En production design guru!! This is no less than a Hollywood film. Sudeep is stunning, 1st half superb with great interval bang #VikrantRona — Arun (@KfiTalks) July 28, 2022 హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది అంటున్నారు. My opinion Indian best 3D movie after #RRR is #VikrantRona It's impossible to do such a visuals with in 100 cro Kudos to #VikrantRona team#KicchaSudeep𓃵 #SalmanKhan #Sandalwood #Bollywood #Tollywood pic.twitter.com/VXmNsAr5WM — Sri Murali (@Sri_since_1998) July 28, 2022 #VikrantRona Ultimate comedy movie 😂 Every scene is dark. Biggest horror comedy gone wrong lol Biggest disaster from Side actor hero 😂#VikrantRonaFDFS #VikrantRonaReview #VikrantRonaOnJuly28 #KichchaSudeep — Jack (@HoxJack) July 28, 2022 Block Buster Review All Over 💥💥💥💥💥 VikrantRona Mania All Over 🔥 Record Breaking VikrantRona Movie 🔥#VikrantRona#VikrantRonaToday#VikrantRonaCelebration Megaa Block Buster VikrantRona 🔥@KicchaSudeep ❤@VikrantRona 🔥 pic.twitter.com/xWKf3z2CY2 — The Name Is Kiccha👑 (@TheNameIsKiccha) July 28, 2022 #VikrantRona one word @KicchaSudeep steal the show ,,,, Nirup excellent,,,, Ravishankar gowda ,, neetha everybody super jst wow that it ,,,,, Director is the real hero kudos — Vamshi Paidipally (@dir_vamsi) July 28, 2022 Interval twist ge Theaters full havali , one of the best interval scenes , Kiccha Boss Screen presence & Very Good quality , very very rich Making 💥💥 Eagerly Waiting for 2nd half 🤘🤘#VikrantRona #VikrantRonaFDFS @KicchaSudeep @VikrantRona — HITMAN ROCKY 😎 (@HITMANROCKY45_) July 28, 2022 @VikrantRona Interval@anupbhandari Anna Director Driving Till now , Great Senses of Comics, Mannerism he filled into inspector #VikrantRona The Swag of @KicchaSudeep Package Unexpected Interval Block Panna n Sanju Lived Up🙌 No Spoilers🤗 3D is Very Good.Still it's a Trailer pic.twitter.com/jJ3ydosC6j — TeAm SpiRiT (@TheRkBoss) July 28, 2022 #VikrantRona First half Report: 🛑 Interval Bang is Woww🔥 🛑 @KicchaSudeep 's Style & Swag is the big highlight of the cinema 🛑 BGM, Cinematography, production design is top notch. 🛑 @anupsbhandari 's #Rangitaranga flavour#VikrantRonaReview — Rakshith Reviews🎬 (@RakshithReviews) July 28, 2022 #VikrantRona 1st half: Commercial film blended up with Amazing visuals,BGM,Screenplay,looks everything positive👍,Interval is predictable but good👍 Good 1st half 2nd half: screenplay picks up,@KicchaSudeep action💥,Not like a routine thriller💥,Climax anthem and visuals💥 — OTT Thankan 2.0 (@ott_thankan) July 28, 2022 #VikrantRona -best ever storytelling in Sandalwood, @KicchaSudeep sir stole with his ultimate performance& screen presence it's going to be another feather in Kiccha's Acting cap, @anupsbhandari hatts off to u,one of best interval blocks in KFI 💥 1st half finished BLOCKBUSTER — Box Office Karnataka (@Karnatakaa_BO) July 28, 2022 Hands Down to @anupsbhandari ♥️ Happy tears man 🔥 First Half Done, all set for an epic second half 🔥♥️#VikrantRonaReview#VikrantRonaFDFS #KicchaSudeep @KicchaSudeep #VikrantRona #VRin3D — Kiccha Sudeep CULT™ (@KicchhaCult) July 28, 2022 -
విక్రాంత్ రోణతో ఆ కల తీరింది: కిచ్చా సుదీప్
కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని అనూప్ భండారీ దర్శకత్వంలో మంజూనాథ్ గౌడ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైకి వచ్చింది. ఇందులో పాల్గొన్న నటుడు కిచ్చా సుదీప్ మాట్లాడుతూ చెన్నైకి ఎప్పుడు వచ్చినా అత్యధిక గౌరవం ఇచ్చి పని ఇచ్చి అభిమానం చూపుతున్నారన్నారు. విక్రాంత్ రోణ భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్, అడ్వెంచర్, ఫాంటసీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మంచి ఇంటెన్స్తో కూడిన కథా చిత్రాన్ని చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. విక్రాంత్ రోణతో ఆ కల తీరిందన్నారు. (చదవండి: కొత్త రకం హెయిర్ స్టయిల్లో రజనీకాంత్!) ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. మంచి కంటెంట్తో కూడిన కథ కావడంతో తనకు బాగా నచ్చిందన్నారు. దీనిని ఇంకా ఎలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లవచ్చు అన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. దీంతో త్రీడీ ఫార్మెట్ రూపొందించినట్లు చెప్పారు. దర్శకుడు మంచి ఇంటెన్స్తో ఫుల్ ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ చిత్రం విడుదల అనంతరం దర్శకుడి గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. కాగా ఈ చిత్రాన్ని గత 20 ఏళ్ల క్రితం త్రీడీ ఫార్మెట్ వచ్చిన మై డీయర్ కుట్టి చేతన్ చిత్రంతో పోల్చవద్దని అన్నారు. అది ఒక హిస్టరీ అని పేర్కొన్నారు. ఆ చిత్రం అందించిన త్రీడీ ఎఫెక్ట్ మరే చిత్రం ఇవ్వలేదన్నారు. అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా దర్శకుడు కొత్త ఇమేజినేషన్, విజన్తో తీశారన్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా బాగా రూపొందించినట్లు తెలిపారు. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకోవడమే సక్సెస్ అని నటుడు కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. -
విక్రాంత్ రోణ పోస్టర్ పెట్టాలని ఉంది!
‘‘తెలుగు ప్రేక్షకులది మంచి మనసు. వారికి సినిమా నచ్చిందంటే పెద్ద హిట్ చేస్తారు. త్రీడీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘విక్రాంత్ రోణ’తో ఆ ఎక్స్పీరియన్స్ను మరోసారి చూడబోతున్నారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు నాగార్జున. సుదీప్ టైటిల్ రోల్లో అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’. నీతూ అశోక్, నిరూప్ బండారి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ – ‘‘సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్ నటుడిగా సుపరిచితుడు. సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ను మేం పెడుతుంటాం. ఆ సినిమాల్లో మేం కూడా భాగమయ్యామనే గర్వంతో అలా చేస్తాం. ఇంతకుముందు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ పెట్టాం. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ పోస్టర్ పెట్టాలని ఉంది’’ అన్నారు. ‘‘నేను థియేటర్స్లో చూసిన తొలి సినిమా నాగార్జునగారి ‘శివ’. అప్పట్లో సైకిల్ చైన్తో కొట్టడం అనేది స్టయిల్గా మారిపోయింది. నేనూ సైకిల్ చైన్ను బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇక ‘విక్రాంత్ రోణ’ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లోనే జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాల్లో యాక్టర్గా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ‘విక్రాంత్ రోణ’ను కూడా ఆద రించి, హిట్ చేయాలి’’ అన్నారు సుదీప్. ‘‘నాగార్జునగారి ‘గీతాంజలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఇక నా తొలి స్క్రిప్ట్ సుదీప్గారి కోసమే రాసుకున్నాను. ‘విక్రాంత్ రోణ’ నా ఇరవయ్యేళ్ల కల. సుదీప్గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అనూప్ బండారి. -
విక్రాంత్ రోణ ట్రైలర్: ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు
కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించారు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. భయం నిండిన ఆ ఊరిలో భయం అంటే ఏమిటో తెలియని ఒకడు వచ్చాడు అంటూ విక్రాంత్ రోణగా సుదీప్ పాత్రను పరిచయం చేశారు. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. కానీ ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దీన్ని థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనూప్. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన ‘రా రా రాక్కమ్మా’ సాంగ్ విశేష ఆదరణ పొందిన విషయం విదితమే! రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ను మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’ చదవండి: -
ఐఫా గ్రీన్ కార్పెట్పై బాలీవుడ్ తారల తళుకులు (ఫొటోలు)
-
మంగ్లీ పాడిన మాస్ సాంగ్ 'రారా రక్కమ్మా..' విన్నారా?
సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా..’ అనే పక్కా మాస్ తెలుగు పాటను బుధవారం విడుదల చేశారు. ‘‘త్రీడీ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. ‘రా రా రాక్కమ్మా’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘‘రా రా రాక్కమ్మా..’ పాట చిత్రీకరణ సమయంలో ఎంజాయ్ చేశాను. పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్కు నచ్చే సాంగ్ ఇది’’ అన్నారు జాక్వెలిన్. ఈ చిత్రానికి సహనిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి. అజనీష్ లోక్నాథ్. చదవండి: విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత Sonali Bendre: క్యాన్సర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా -
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ షాక్
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను అచాట్ చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్ ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరైంది. -
ఓటీటీలోకి అక్షయ్ కుమార్ మూవీ.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా అలరించారు. ఈ చిత్రం తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్గా వచ్చింది. అలాగే తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 18న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. 'బచ్చన్ పాండే' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 15 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'బచ్చన్ పాండే మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్. ఈ వినోదాన్ని మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి తీసుకువస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ గదిలో కూర్చొని మొత్తం యాక్షన్, డ్రామా, కామెడీతో నిండి ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 15న ప్రైమ్ వీడియోలో ఆస్వాదించవచ్చు. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్ చేశామో మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: షూటింగ్లో ఏం కనిపించేది కాదు.. ప్రాణం పోయినంత పనైంది: అక్షయ్ కుమార్ knock knock 🚪 you have a visitor 👀#BachchhanPaandeyOnPrime, April 15#SajidNadiadwala @farhad_samji @akshaykumar @kritisanon @Asli_Jacqueline @ArshadWarsi @TripathiiPankaj @prateikbabbar @saharshshukla6 @ActorASingh @KhanUroosa @gauravchopraa @WardaNadiadwala @NGEMovies pic.twitter.com/dBD8ZzEC9s — amazon prime video IN (@PrimeVideoIN) April 11, 2022 -
శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన స్వదేశమైన శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధన కొరతతో పోరాడుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు లంకేయులు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంటిన చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం గురించి శ్రీలంక దేశ జెండాను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. ఈ పోస్టులో జాక్వెలిన్ 'శ్రీలంక యువతిగా నా దేశం, నా దేశ ప్రజలు ఏం అనుభవిస్తున్నారో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అభిప్రాయాలను విని విసిగిపోయాను. నేను చెప్పేది ఏంటంటే.. మీ కంటికి కనిపించిన దాని ఆధారంగా ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరినీ తొందరపడి దూషించకండి. శ్రీలంక ప్రజలకు కేవలం సానుభూతి, మద్దతు అవసరం. అక్కడి పరిస్థితి గురించి తప్పుగా మాట్లాడం కంటే వారి క్షేమం కోసం 2 నిమిషాలు మౌన ప్రార్థన చాలు వారికి మిమ్మల్ని మరింత దగ్గర చేయడానికి. అతి త్వరలోనే నా దేశం, దేశప్రజలు శాంతియుతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. ఇందుకోసం శ్రమించే వారికి అపారమైన శక్తి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.' అని రాసుకొచ్చింది. As a Srilankan, it is heartbreaking to see what my country and countrymen are going through. I have been flooded with a lot of opinions since this began from around the world. I would say, do not be too quick to pass a judgement and vilify any group based on what is shown. pic.twitter.com/7GXbkXOoBP — Jacqueline Fernandez (@Asli_Jacqueline) April 4, 2022 -
Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టన్నింగ్ ఫోటోస్
-
అతని తపన నాకు ఎంతో నచ్చుతుంది: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez Says Working With John Abraham In Attack 1 Movie: హౌస్ఫుల్ 2, రేస్ 2, ఢిష్యుం తర్వాత బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎటాక్: పార్ట్ 1'. ఎక్ థా టైగర్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి యాక్షన్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, 'రాకెట్ సింగ్' మూవీకి దర్శకత్వం వహించిన లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పా ఠక్ షా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాక్వెలిన్. చదవండి: ఇండియాస్ సూపర్ సోల్జర్పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్ 'ఎటాక్-1 ఓ కొత్త రకమైన ఆసక్తికరమైన కథ. ఇది భారతదేశంలో తెరకెక్కిన తొలి సూపర్ సోల్జర్ సైన్స్ ఫిక్షనల్ స్టోరీ. ఇందులో అవకాశం రావడం సంతోషంగా, గౌరవంగా ఉంది. జాన్ అబ్రహంతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషంగా, సరదాగా, సౌకర్యవంతగా ఉంటుంది. సినిమా కోసం జాన్ అబ్రహం పడే తపన నాకు ఎంతో నచ్చుతుంది.' అని జాక్వెలిన్ తెలిపింది. ఈ మూవీకి పెన్ స్టూడియోస్, జెఏ ఎంటర్టైన్మెంట్, అజయ్ కపూర్ ప్రొడక్షన్ సమర్పణలో డాక్టర్ జయంతిలాల్ గడా, హీరో జాన్ అబ్రహం, అజయ్ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది వరకూ ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ
బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్ చంద్రశేఖర్తో రిలేషన్లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్కు మద్దతుగా నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్తో ఓ ప్రకటన విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. -
సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్
Jacqueline Fernandez Trolls Old Video Her Bodyguard Better Than Sukesh: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇటీవల తన వ్యక్తిగత ఫొటోలు ప్రసారం చేయొద్దని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ మధ్యలో సుకేష్తో జాక్వెలిన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీంతో మీడియా మొత్తం జాక్వెలిన్పై దృష్టి సారించింది. అయితే తాజాగా ఈ శ్రీలంక భామ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 'సుకేష్ ఎక్కడా ఉన్నాడు. అస్సలు కనపడట్లేదుగా' అని ఒక యూజర్ రాస్తే సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బాగున్నాడు అని మరొకరు స్పందించారు. 'ఇంకా పీఆర్ వాళ్ల కష్టం బాగా తెలుస్తోంది', 'ఇదంతా డ్యామెజ్ కంట్రోల్ కోసం', 'జాక్వెలిన్ను ఇలా చూసే సుకేష్ ఫిదా అయింటాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ త్రోబ్యాక్ వీడియోలో ఎరుపు రంగు సాటిన్ దుస్తులు ధరించి ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్ ఫొటోలకు ఫోజులిచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. అవి ప్రసారం చేయొద్దని -
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్తోపాటు జాక్వెలిన్కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట.. -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
జాక్వెలిన్కి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర
Actors Jacqueline Fernandez and Nora Fatehi:మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఐఫోన్ నుండి బిఎమ్డబ్ల్యూ కారు వంటి ఖరీదైన బహుమతులను అదించడంలో అతని భార్య లీనా మారియా పాల్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాదు దర్యాప్తులో ఆ ఇదరూ బాలీవుడ్ నటులు సుకేష్ నుండి అందుకున్న బహుబమతులు గురించి వివరించారు. (చదవండి: ‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు) అయితే ఫెర్నాండెజ్తో స్నేహం చేయడానికి సుకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్ను "స్పూఫ్" కాల్ చేయగా, నోరా ఫతేహిని అతని భార్య ద్వారా పరిచయం చేసుకున్నట్లు వెళ్లడించింది. ఈ మేరకు ఈడీ విచారణలో నోరాకి సుకేశ్ బీఎండబ్ల్యూ కారు, అతని భార్య లీనా ఖరీదైన బ్యాగ్, ఐఫోన్ వంటి బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన ఫెర్నాండెజ్, సుకేశ్ నుండి రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, మల్టి స్టోన్ చెవిపోగులు, బహుమతులతో పాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని తీసుకున్నట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్పై ఉన్న అభియోగాల నేపథ్యంలో ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) -
ఇటీవల స్వల్ప ఊరట, మరోసారి ఈడీ ముందుకు జాక్వెలిన్
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరైంది. ఇటీవల ఈ కేసులో ఆమెకు ఇటీవల స్వల్ప ఊరట లభించగా విదేశాలకు వెళ్లేందుకు ఈడీ ఆమెకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లినా ఆమెను విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు. తన దగ్గరు ఈడీ లుక్ అవుట్ నోటీసులు చూసి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! ఈ నేపథ్యంలో ఈ రోజు(డిసెంబర్ 8) ఆమె మరోసారి ఈడీ విచారణకు హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నేడు (డిసెంబరు 8) హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో జాక్వెలిన్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఆమెను విచారించిన అధికారులు జాక్వేలిన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాగా జాక్వేలిన్ను ఇదివరకు రెండుసార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి Actor Jacqueline Fernandez appears before Enforcement Directorate (ED) at its office in Delhi in connection with Rs 200 crore extortion case involving conman Sukesh Chandrasekhar pic.twitter.com/LNd6v5qs2y — ANI (@ANI) December 8, 2021 -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి
బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్తో జాక్వెలిన్కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అతనితో దిగిన ఫోటో బయటకు రావడంతో ఈ అమ్మడు చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ శ్రీలంక బ్యూటీపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందట. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పౌల్తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.ప్రస్తుతం ఈ బహుమతుల ఇష్యూ బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. -
ఆ ఫోటోలు లీక్.. అడ్డంగా బుక్కయిన హీరోయిన్
Jacqueline Fernandezs Romantic Photo With Sukesh Chandrasekhar Leaked: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్తో కలిసి క్లోజ్గా దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్పై అభియోగం ఉంది. అంతేకాకుండా మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ సైతం ఈడీ విచారణను ఎదుర్కొంది. అయితే సుకేశ్తో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొంది. తాజాగా అతడితో జాక్వెలిన్ రొమాంటిక్గా దిగిన ఓ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుకేశ్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసినట్లు తెలుస్తుంది. సుకేశ్..జాక్వెలిన్ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్కు ప్రైవేటు జెట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. -
సొగసు చూడతరమా.. లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందాన్ని పొగడతరమా
-
Ram Setu: బై బై ఊటీ
‘రామ్ సేతు’ చిత్రబృందం ఊటీకి బై బై చెప్పేసింది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు నటుడు సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఊటీలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ ముగిసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జాక్వెలిన్, సత్యదేవ్తో పాటు తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘ఫోటోలో లేదా జీవితంలో చీకటి మేఘాలపై ఎప్పుడూ అందమైన కాంతిరేఖ ఉంటుంది’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. ఇందులో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. -
అందమైన పోజులతో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (ఫోటోలు)
-
కాజల్ గర్భవతా? సినిమా నుంచి తప్పుకున్న చందమామ!
Jacqueline To Replace Pregnant Kajal Aggarwal: ‘విశేషం ఏమైనా ఉందా?’... పెళ్లయిన అమ్మాయిలను చాలామంది అడిగే ప్రశ్న ఇది. తల్లి కాబోతున్నావా? అనే విషయాన్ని ఇలా అడుగుతుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఏదైనా విశేషాన్ని స్వయంగా చెబుతారేమోనని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ పెదవి విప్పడంలేదు కానీ ఆమె గర్భవతి అనే వార్త మాత్రం ప్రచారంలోకొచ్చింది. చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్..ధర తెలిస్తే షాకే గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కానున్నారనీ, ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారనీ, సైన్ చేసి.. ఇంకా సెట్స్కి వెళ్లని సినిమాల నుంచి మాత్రం తప్పుకుంటున్నారనీ టాక్. అలా తప్పుకుంటున్న సినిమాల్లో నాగార్జున సరసన అంగీకరించిన ‘ది ఘోస్ట్’ ఒకటని చెప్పుకుంటున్నారు. ఆమె స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ని తీసుకున్నారట. ‘సాహో’లో ప్రభాస్తో ‘బ్యాడ్ బాయ్’ ఐటమ్ సాంగ్కు జాక్వెలిన్ కాలు కదిపారు. మరి.. తెలుగు తెరపై కథానాయికగా కూడా ఆమె కనిపిస్తారా అంటే.. కాజల్ విశేషం నిజమే అయ్యుంటే, ‘ఘోస్ట్’ యూనిట్ జాక్వెలిన్ని తీసుకుని ఉంటే నిజమే అవుతుంది. చదవండి : దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్ -
ఆలియాకు కమిట్మెంట్ ఇవ్వలేదు..కానీ జాక్వెలిన్తో డేటింగ్
ఆలియా భట్.. అభినయమే ఆమెను అభివర్ణిస్తుంది.. సిద్ధార్థ్ మల్హోత్రా.. నటుడిగా నిరూపించుకోవాలన్న తపనే అతన్ని నిలబెడుతోంది.. కెరీర్, క్యారెక్టర్ మధ్య ఉన్న ఆ అంతరమే ఈ ఇద్దరి ప్రేమను కొనసాగనివ్వలేదు! ఆ బ్రేకప్ స్టోరీనే చెబుతోంది ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’... వారసత్వ పరిఛాయే ఆలియాకు సినీరంగ ప్రవేశం కల్పించినా.. ప్రతిభతోనే స్థిరపడింది. అందం ఆమెకు అదనపు ఆకర్షణ మాత్రమే అయింది. ఆలియా ఎంట్రీకి పూర్తి భిన్నమైన ఇంట్రడక్షన్ సిద్ధార్థ్ది. పద్దెనిమిదో ఏటనే మోడలింగ్లోకి అడుగుపెట్టి.. ఆ గ్రాఫ్ని కిందపడకుండా చూసుకున్నాడు. అయినా ఆ రంగం మీద ఆసక్తి తగ్గిపోయి సినిమా వైపు కదిలాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా కరణ్ జోహార్ దగ్గర చేరి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’కి పనిచేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలైంది. అది (వరుణ్ ధవన్తో పాటు) ఆలియా, సిద్ధార్థ్లకూ మొదటి సినిమా. అయితే ఇదివరకు చెప్పుకున్న సినిమా వాళ్ల ప్రేమ కథల్లా ఈ జంట మధ్య లవ్ ఆ సినిమా సెట్స్ మీద స్టార్ట్ కాలేదు. స్నేహం మాత్రమే ఏర్పడింది. అది అలా కొనసాగి కొనసాగి ప్రేమగా మారింది. ఆ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో సిద్ధార్థ మల్హోత్రే చెప్పాడు.. ‘మేమిద్దరం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్గా కలవలేదు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు అని. డేటింగ్ కంటే ముందు నుంచే ఆలియా నాకు తెలుసు.. స్నేహితురాలిగా. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తెలీలేదు’ అని. షికార్లు.. పుకార్లు యాజ్ యూజువల్.. వీళ్లిద్దరూ కలసి నటించింది ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘కపూర్ అండ్ సన్స్’ .. ఈ రెండు సినిమాల్లోనే. అందుకే సెట్స్ మీద పుట్టే ఆకర్షణ కన్నా.. సినిమాకవతలి అవగాహనతోనే దగ్గరయ్యారు. ఇద్దరి షెడ్యూల్స్లోని ఖాళీ సమయాల్లో షికార్లకెళ్లారు.. పార్టీలు చేసుకున్నారు.. హ్యాంగవుట్స్తో సేద తీరారు. అవన్నీ మీడియాలోని సినిమా కాలమ్స్లో ఎక్స్ట్రా స్పేస్ను తీసుకున్నాయి. బాలీవుడ్ జనాలు ఈ జంట మీద కామెంట్లు సంధించేకంటే ముందే తమ ప్రేమను ప్రకటించాలని నిర్ణయించుకున్నారిద్దరూ. ఆలియా స్టార్ అయ్యింది..దూరం పెరిగింది ఆలియా నటించిన సినిమాలు హిట్ల మీద హిట్లు కొడుతూ ఆమెను స్టార్గా మార్చేశాయి. సిద్ధార్థ్ ఎంచుకున్న సినిమాలు ఫ్లాప్లతో నటుడిగా అతన్ని నిరూపించుకునే ప్రయత్నలలోనే ఉంచేశాయి. ఇది సహజంగానే అతని ఈగోని ప్రభావితం చేసింది. మానసికంగా ఆలియాతో దూరాన్ని పెంచింది. ఆ దూరాన్ని తను నటిస్తున్న సినిమాల్లోని కథానాయికల దగ్గర సాన్నిహిత్యంగా మలచుకున్నాడు సిద్ధార్థ్. అలా అతని జీవితంలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చింది ‘ఎ జెంటిమన్’ చిత్రంతో. సిద్ధార్థ్ లైఫ్లోకి జాక్వెలిన్ ఎంట్రీ ఆ సినిమా సెట్స్ మీద వాళ్లిద్దరూ ఒకరి ఆకర్షణకు ఒకరు లోనయ్యారు. షూటింగ్ అయిపోయాక కూడా మియామీ (అమెరికా) బీచుల్లో గంటలు గంటలు కాలక్షేపం చేశారు. లాంగ్ డ్రైవ్లకు వెళ్లారు. డిన్నర్ డేట్స్ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆలియాతో మాటలు, మంచిచెడుల విచారణ మిస్ అయింది ఆ ప్రేమ డైరీలో. సిద్ధార్థ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలియాకు అనుమానం వచ్చేలోపలే జాక్వెలిన్తో అతని వ్యవహారం ఆమె చెవిన పడింది. ఫీలైంది. పొగిలి పొగిలి ఏడ్చింది. తనను అతను అర్థం చేసుకుంది అంతేనా? అని బాధ పడింది. ఆ ప్రేమకు బలం లేదని నిర్ధారించుకుంది. సిద్ధార్థ్ను క్షమించింది.. కెరీర్ మీద మరింత దృష్టి పెట్టింది. బ్రేకప్కి కొన్ని కారణాలున్నాయి ఇద్దరూ కలుసుకున్నప్పుడు.. సంజాయిషీ అడిగారు.. ఇచ్చుకున్నారు. ‘స్నేహాన్ని మాత్రం భద్రం చేసుకుందాం..’ అని నిశ్చయించుకున్నారు. ఆ మాట మీదే ఉన్నారు. అలా నాలుగేళ్ల ఆ ప్రేమకు బ్రేక్ పడింది. విడివిడిగా వాళ్ల ప్రయాణం కొనసాగింది. ‘కలసి ఉండాలి అనుకోవడానికి ఏ రీజన్ లేకపోయినా విడిపోవాలి అనుకోవడానికి కచ్చితంగా కారణం ఉంటుంది. అలా మా బ్రేకప్కీ మాకంటూ కొన్ని కారణాలున్నాయి. నాలుగేళ్ల మా సాహచర్యంలో సంతోషాలెన్నో.. స్పర్ధలూ అన్నే. స్పర్థలను మరిచిపోయి... హ్యాపీ మూమెంట్స్నే గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాం. అందుకే విడిపోయినా ఫ్రెండ్స్గా హాయిగా.. హ్యాపీగా ఉన్నాం’ అని చెప్పాడు సిద్ధార్థ్ మల్హోత్రా కాఫీ విత్ కరణ్ షోలో. ‘సిద్ధార్థ్, నేను ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చాం. మా ఇద్దరి మధ్య బోలెడంత చరిత్ర ఉంది. మేం కలసి చేసిన ప్రయాణంలోని ఎన్నో మలుపులకు ఇద్దరం సాక్షులమే. నిజం చెప్పాలంటే.. సిద్ధార్థ్ మీద నాకెలాంటి నెగెటివ్ థాట్స్ లేవు. అతనంటే అప్పుడెంత గౌరవం ఉందో.. ఇప్పుడూ అంతే ఉంది. నా విషయంలో తనూ అలాగే ఉన్నాడనుకుంటున్నాను. మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడుకుంటాం.. కలవాలనిపిస్తే కలుస్తాం.. ఎలాంటి బ్యాడ్ వైబ్స్ లేకుండా’ అని ఆలియా భట్ కూడా చెప్పింది ఓ ఇంటర్వ్యూలో. అయితే ఈ జంట విడిపోవడానికి సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆలియాకు కమింట్మెంట్ ఇవ్వకపోవడమే కారణమంటాయి బాలీవుడ్ వర్గాలు. ∙ఎస్సార్ -
రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం
బాలీవుడ్ నటి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో ఉన్నారని టాక్. అంతేకాదు.. తన బాయ్ఫ్రెండ్తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనున్నారట. బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ను కూడా ఖరారు చేశారట. కాగా జాక్వెలిన్ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్ఫుల్ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్తో ఆమె డేటింగ్ చేశారని, 2013లో బ్రేకప్ అయ్యారని టాక్. అయితే ఆ బ్రేకప్కి ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్ బాయ్’కి జాక్వెలిన్ డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
వ్యాపారవేత్తతో స్టార్ హీరోయిన్ సహజీవనం!
Jacqueline Fernandez: వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది సాహో బ్యూటీ ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’. ‘సాహో’లో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ శ్రీలంకన్ లేడీ.. రీసెంట్గా మరో టాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ శ్రీలంక భామ ఓ ఇండియన్తో ప్రేమలో పడిందట. సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె రిలేషనల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి. ఈ భామ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొనిదంట. అందులోనే బాయ్ఫ్రెండ్తో కలిసి ఉంటుందని సమాచారం. బాలీవుడ్ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం కామన్. ఇప్పుడు ఆ లిస్ట్లో జాక్వెలిన్ కూడా చేరింది. మరి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. చదవండి: భార్యకు నటుడి సర్ప్రైజ్; థాంక్యూ అంటూ భావోద్వేగం డేటింగ్ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?! -
హాలీవుడ్ డెబ్యూలో జాక్వెలిన్..షూటింగ్ ఎక్కడ జరిగిందంటే..
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంథాలజీ ఉమెన్స్ స్టోరీస్తో ఈ భామ హాలీవుడ్ డెబ్యూ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రకటించింది. మొత్తం ఆరు భాగాలుగా ఈ అంథాలజీ కథను తెరకెక్కించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు మహిళా దర్శకులు ఈ కథలను రూపొందించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులతో ఈ సినిమా చేయనున్నారు. జాక్వెలిన్ కథకు సంబంధించి ఈ సినిమాలో ఆమె ఓ ట్రాన్స్జెండర్ మోడల్తో నటించింది. గతేడాది అక్టోబర్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకుంది. చాలా వరకు ముంబైలోనే షూటింగ్ను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న జాక్వెలిన్ జాన్ అబ్రహం,అక్షయ్ కుమార్ల యాక్షన్ సినిమా షూటింగ్ను కూడా పూర్తిచేసింది. లాక్డౌన్ కారణంగా సల్మాన్తో చేస్తున్న కిక్-2 సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి : సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె కేంద్రంపై బాలీవుడ్ నటి మీరా చోప్రా విమర్శలు -
ప్రియాంక ఇంటిని కొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవలే ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు ఏడు కోట్ల రూపాయలని సమాచారం. ఇంత కాలం ముంబైలో అద్దె ఇంట్లో ఉండేది జాక్వెలిన్. ఇప్పుడు ముంబైలోని జూహూ ప్రాంతంలో కొత్త ఫ్లాట్ తీసుకుంది. సముద్రం కనిపించే వ్యూతో బాల్కనీ, ఐదు బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ ఏరియా ఈ ఇంటి స్పెషాలిటీ. గతంలో ఈ ఫ్లాట్లో ప్రియాంకా చోప్రా నివసించేది. హాలీవుడ్కి వెళ్లకముందు ప్రియాంక ఆ ఇంట్లోనే ఉండేది. నిక్తో వివాహం అయ్యాక లాస్ ఏంజెల్స్కి మకాం మార్చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఇల్లు అమ్మింది. జాక్వెలిన్ సినిమాల విషయానికొస్తే.. 2009లో అలాదిన్ సినిమాతో వెండితెరపై కాలు మోపింది. 'కిక్', 'రేస్ 3' సినిమాల్లో సల్మాన్తో నటించింది. 'కిక్' సీక్వెల్లో ఈ ఇద్దరూ మరోసారి జోడి కట్టనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ’బచ్చన్ పాండే’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ కల్యాణ్- క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఓ చిత్రంలోనూ ఈ భామ కనిపించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అంగూర్’ నవ్వించడానికి రెడీ టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ -
పవన్ రెండో హీరోయిన్ ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె యువరాణి పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. దీంతో పవన్తో జోడీ కట్టే భామ ఎవరా? అని ఆయన అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రెండో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె పాత్ర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ శ్రీలంక భామ గతంలో జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో స్పెషల్ సాంగ్లో చిందులేసింది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆడిపాడి అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఏయం రత్నం నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. (చదవండి: పవన్ కల్యాణ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్) మరోవైపు పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ఆరంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే– సంభాషణలు అందిస్తున్నాడు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. (చదవండి: వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్) -
‘బచ్చన్ పాండే’ విడుదల తేదీ ఖరారు
ముంబై: బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బచ్చన్ పాండే’. ఇటీవల షూటింగ్ను ప్రారంభించిన ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా(26 జనవరి 2022) బచ్చన్ పాండేను విడుదల చేయాలని నిర్ణయించినట్లు శనివారం ప్రకటించారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సాజిద్ నదియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ మూవీ అక్షయ్ లీడ్రోల్ పోషిస్తున్నారు. అలాగే కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండజ్లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ‘బచ్చన్ పాండే’తో అక్షయ్ భయంకరమైన గ్యంగ్స్టర్గా భయపట్టనున్నాడు. (చదవండి: పాండే ప్రయాణం ప్రారంభం) -
స్టార్ హీరోయిన్ క్యూట్ ఫొటో, కామెంట్ల వెల్లువ
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ’బచ్చన్ పాండే’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బీ టౌన్ సెలబ్రిటీల మనసులు దోచుకుంది. ఇట్స్ వీకెండ్ అంటూ ఫెర్నాండెజ్ బుల్లి గౌను వేసుకుని ఉన్న తన చిన్ననాటి ఫోటో షేర్ చేసింది. సో క్యూట్ అంటూ ప్రీతి జింతా, యామి గౌతమ్, మనీష్ పాల్, ఊర్వశి రౌతాలా వంటివారు కామెంట్లు చేస్తున్నారు. అందాల నటి అప్పుడూ, ఇప్పుడూ క్యూట్గానే ఉందని అభిమానులు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఫెర్నాండెజ్ గత డిసెంబర్లో ఓ హాట్హాట్ ఫొటో షేర్ చేసి ట్రెండింగ్లో నిలిచిన సంగతి తెలిసిందే. జిమ్లో వర్కౌట్ చేస్తూ మిర్రర్ సెల్ఫీ దిగుతున్న ఫొటోను ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆమె.. ‘కొందరు నువ్వు నువ్వులా ఉండు అని చెప్తారు. మళ్లీ వాళ్లే నువ్విలా ఉన్నావేంటి అని జడ్జ్ చేస్తారు. అందుకే ఎలా ఉండాలో నువ్వే ఎంపిక చేసుకో’అని క్యాప్షన్ జత చేసింది. దీంతోపాటు గత డిసెంబర్ 27న సల్మాన్ బర్త్డే సందర్భంగా ఫెర్నాండెజ్ పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. హైస్కూల్ వయసులో సల్మాన్ ఖాన్తో దిగిన ఫొటో అది. కాగా, 2009లో అలాదిన్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. కిక్, రేస్ 3 సినిమాల్లో సల్మాన్తో నటించింది. కిక్ సీక్వెల్లో ఈ ఇద్దరూ మరోసారి జోడి కట్టనున్నారు. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
పాండే ప్రయాణం ప్రారంభం
బచ్చన్ పాండే అనే భయంకరమైన గ్యాంగ్స్టర్గా మారారు అక్షయ్ కుమార్. ఆయన తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’ చిత్రీకరణ గురువారం జై సల్మేర్లో ప్రారంభమయింది. అక్షయ్ కుమార్, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండజ్ ముఖ్య పాత్రల్లో ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. ‘‘సాజిద్ నదియాడ్తో నేను చేస్తున్న పదో చిత్రమిది. ఇంకా మరెన్నో సినిమాలు చేస్తాం. ఈ సినిమాలో నా కొత్త లుక్ ఎలా ఉందో చెప్పండి’’ అంటూ తన లుక్ను షేర్ చేశారు అక్షయ్ కుమార్. ‘బచ్చన్ పాండే’ తమిళ హిట్ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్. -
అక్షయ్తో నటించడానికి ఆత్రుతగా ఉన్నా..
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘బచ్చన్ పాండే’ సినిమా తారాగణంలో చేరనున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాణంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బచ్చన్ పాండే’. తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు ఇది హిందీ రీమేక్. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ అక్షయ్ కుమార్కు జోడిగా నటించన్నారు. తాజాగా జాక్వెలిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో ఫొస్ట్ చేశారు. ‘‘బచ్చన్ పాండే’యాక్షన్-కామెడీ చిత్రంలోని నటీనటులతో కలిసి నటించడానికి చాలా ఆత్రుతగా ఉన్నాను’ అని కామెంట్ జత చేశారు. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) తనకు చాలా సంతోషం కలిగించే షూటింగ్ వాతావరణం సాజిద్ నడియాడ్వాలా నిర్మాణ సంస్థలోని సినిమాల్లో దొరుకుతుందని తెలిపారు. తనకు సాజిద్ నిర్మాణ సంస్థలో ఇది 8వ చిత్రమని పేర్కొన్నారు. ఎప్పుడెప్పడు అక్షయ్తో షూటింగ్లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఇక అక్షయ్ కుమార్ సరసన జాక్వెలిన్ హౌస్ ఫుల్ సీరిస్లోని ఓ మూవీలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ‘బ్రదర్స్’ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో జైసల్మేర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఎలాంటి పాత్రలో మెరుస్తారో చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఇటీవల నటుడు అర్షద్ వార్సీ కూడా ‘బచ్చన పాండే’లో అక్షయ్ కుమార్కి స్నేహితుడి పాత్రలో నటిస్తారని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గ్యాంగ్స్టర్గా, కృతి సనన్ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపించనున్నారు. -
నవ్వించడానికి రెడీ
రణ్వీర్ సింగ్ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్వీర్తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్’ (1982) చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు రోహిత్ శెట్టి. హీరోగా రణ్వీర్ సింగ్ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్వీర్ది డబుల్ రోల్. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
బీ పాజిటివ్
ప్రస్తుతం ఎటు చూసినా కరోనా పాజిటివిటీ. సామాజిక వేదికల నిండా నెగటివిటీ. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ముఖ్యం. కరోనాకి నెగటివ్గా ఉంటూ... మానసికంగా పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎనర్జీలు మన మాట వినేలా చేసుకోవాలి. ఈ కరోనా కష్టకాలాన్ని దాటే మాత్రను కనిపెట్టే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఆ మందు వచ్చేలోగా పాటించాల్సిన మంత్రం ఒకటుందంటున్నారు మన కథానాయికలు. ‘‘బీ పాజిటివ్’ – అదే మనందర్నీ ఉంచుతుంది యాక్టివ్’’ అని తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు పలువురు కథానాయికలు. ఈ అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం. ప్రేమను పంచుదాం – తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపుతున్నారు. ప్రస్తుతం మనందరం సాధారణమైన పరిస్థితుల్లో లేము. అందరం ఓ విపత్తును ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయాల్లో మనందరం ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. మన తోటి వారికి ప్రేమను పంచుదాం. ద్వేషాన్ని కాదు. సోషల్ మీడియాను ఒకరితో ఒకరం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిద్దాం. నిందించడానికి, నెగటివిటీని పంచడానికి కాదు. ఒకరికి ఒకరం నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు. నిరాశను దగ్గరకు రానివ్వకండి – జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఈ లాక్డౌన్లో నేను ఆచరించింది ఏంటంటే.. పాజిటివ్గా ఆలోచించడం, నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకోవడం. మనసు పాజిటివ్గా ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. జీవితానికి కొత్త ఆశ కలుగుతుంది. మనం ఏదైనా చేయాలన్నా, కొత్త మనిషిగా మారాలన్నా ముందు మన ఆలోచనల నుంచి మొదలుపెట్టాలి. మన ఆలోచనలే మనం. వాటిని సక్రమంగా ఉంచుకుని, ఆచరించగలిగితే చాలు. ప్రస్తుతం అందరం ఒకలాంటి అనిశ్చితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరం మరింత ధైర్యంగా నిలబడాలి. నిరాశను దగ్గరకు రానివ్వకండి. నెగటివిటీ పంచకండి. పాజిటివ్గా ఉందాం. ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది – కృతీ సనన్ మనందరం మన ఆలోచనల ద్వారా ఓ ఎనర్జీను మన చుట్టూ నింపుకుంటాం అని నమ్ముతాను. ఆ ఎనర్జీ ద్వారానే మరొకరితో కనెక్ట్ అవుతాం. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. పాజిటì వ్గా ఆలోచించేవాళ్లే నీతోనూ కనెక్ట్ అవుతారు. ఒకవేళ నెగటివ్ అయితే నెగటివ్గా ఆలోచించేవాళ్లను ఆకర్షిస్తావు. అంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్మండి. అదే ఆచరించండి. ఇదే నా మంత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన మంత్ర ఏంటంటే... ప్రేమను పంచండి. తిరిగి ప్రేమనే పొందండి. -
సరదాలు.. నవ్వులు
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ క్రిపలానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సైఫ్, అర్జున్లకు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండజ్, యామీ గౌతమ్ నటించనున్నారు. ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ‘‘ఇదో వినోదాత్మక చిత్రం. దీనికి మరింత సరదాను ఈ ఇద్దరు హీరోయిన్లు తీసుకువస్తారని అనుకుంటున్నాం. సైఫ్–జాక్వెలిన్, అర్జున్–యామీ జంటలు అందించే వినోదం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
జీవితం చాలా చిన్నది
లాక్డౌన్ వల్ల సెలబ్రిటీలందరూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. బుక్స్ చదవడం, వంటలు చేయడం, ఆన్లైన్ క్లాసుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు. మరి.. ‘ఈ లాక్డౌన్ మీకు ఏం నేర్పించింది’ అనే ప్రశ్నను హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముందుంచితే...‘‘నా జీవితం గురించి తెలుసుకున్నాను. జీవితం చాలా చిన్నదని అర్థం చేసుకున్నాను. అందుకే మన జీవితంలోని ప్రతి రోజునీ సంతృప్తికరంగా జీవించాలి. మనకు ప్రతిరోజూ విలువైనదే. అలాగే మనం ప్రకృతిని మెచ్చుకోవాలి. ప్రకృతి వల్లే మానవ మనుగడ సాధ్యపడుతుందనిపిస్తోంది. అందుకే ప్రకృతిని మనం కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... జాన్ అబ్రహాం ‘ఎటాక్’లో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు జాక్వెలిన్. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. -
తేరే బినా పాటకు నెటిజన్లు ఫిదా..
ముంబై: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్లా కొత్త రొమాంటిక్ ట్రాక్ ‘తేరే బినా’ వీడియో సాంగ్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పాటలో వారిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా ఈ పాటను మంగళవారం భాయిజాన్ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే ఈ పాటను స్వయంగా సల్మాన్ చిత్రీకరించాడు. అంతేకాదు పాటను కూడా తనే పాడాడు. ఇక పాటలో గడ్డంతో ఉన్న భాయిజాన్ను చూసి నెటిజన్లు ‘‘సల్మాన్ గడ్డంతో మరింత హ్యండ్ సమ్గా ఉన్నాడు’ అని ‘జాక్వలిన్ మేకప్, క్యాస్టుమ్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (సల్మాన్ ‘తేరే బినా’ టీజర్ విడుదల) సల్మాన్ ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేస్తూ.. ‘లాక్డౌన్లో మీకు ఇంకాస్తా వినోదాన్ని అందించేందుకు మా కొత్త ట్రాక్ ‘తేరె బినా’ వచ్చేసింది. ఈ న్యూ రొమాంటిక్ ట్రాక్ వినండి’ అంటూ షేర్ చేశారు. అంతేగాక ‘‘నేను పాడిన ఈ పాటకు నేనే దర్శకుడిని, నిర్మాతను. అంతేగాక చిత్రీకరణ కూడా నేనే చేశాను. ఇప్పుడు మీ కోసం పోస్టు కూడా చేస్తున్నా. ఈ పాట వినండి, పాడండి. మళ్లీ ఇంట్లో చిత్రీకరించి రీపోస్టు చేయండి, షేర్ చేయండి.. ట్యాగ్ చేయండి.. #TereBina’’ అంటూ తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కాగా ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొత్తం పన్వెల్లోని సల్మాన్ ఫాం హౌజ్లో జరిగింది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను జాక్వలిన్ దగ్గరుండి చూసుకున్నట్లు ఆమె ఈ పాట ప్రమోషన్ ఇంటర్య్వూలో వెల్లడిచింది. (తేరే బినా మ్యూజిక్ వీడియో రిలీజ్) Most Handsome Bollywood Actor Ever...Imagining looking this good at 54,Only Salman Khan can relate..The best of young gen stars cant compete Salman at 54 and thats a fact!!!! #TereBina pic.twitter.com/eN8UnK9nz5 — BeingHonest (@Itsss_Shivam) May 12, 2020 -
సల్మాన్ ‘తేరే బినా’ టీజర్ విడుదల
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మదర్స్ డే సందర్భంగా తాను నటించిన ‘తేరే బినా’ మ్యూజిక్ వీడియో టీజర్ను ట్వీటర్లో విడుదల చేశారు. ‘తేరే బినా.. హ్యాపీ మదర్స్ డే’ అని సల్మాన్ కామెంట్ జతచేశారు. ఇక ఈ మ్యూజిక్ వీడియో టీజర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తానని ఇటీవల సల్మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్కు జంటగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించారు. సల్మాన్ గుర్రంపై స్వారీ చేస్తున్న షాట్తో టీజర్ మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్లో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్హౌస్కి పరిమితమైన విషయం తెలిసిందే. హీరోయిన్ జాక్వలిన్ కూడా సల్మాన్ ఫామ్లో స్వీయ నిర్భందంలో ఉన్నారు. లాక్డౌన్లో వేళ సల్మాన్, జాక్వలిన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘తేరే బినా’ మ్యూజిక్ వీడియో టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘మిసెస్ సీరియల్ కిల్లర్’ రివ్యూ
తన అందచందాలతో కట్టిపడేసే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "మిసెస్ సీరియల్ కిల్లర్". ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. హీరోయిన్ నటన, నటుడు మనోజ్ బాజ్పాయి మ్యాజిక్ ఏవీ సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. మొదటి 80 నిమిషాలు ఎందుకు చూస్తున్నామా అన్న సందేహం తలెత్తక మానదు. కానీ చివరి 26 నిమిషాలు అప్పటివరకు చూపించిన ప్రశ్నల చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తాయి. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అక్షయ్ కుమార్కు "జోకర్" సినిమాతో డిజాస్టర్ అందించిన శిరీష్ కుందర్ ఈ సిరీస్కు దర్శకత్వం వహించి మరోసారి ఫెయిల్ అయ్యాడు. కథా విశ్లేషణ: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన మహిళలు దారుణంగా హింసకు గురవుతూ చనిపోతుంటారు. దీనికి డా.మృత్యుంజయ్ ముఖర్జీ(మనోజ్ బాజ్పాయ్) కారణమని పోలీసులు భావిస్తారు. దీంతో మర్డర్ కేస్లో చిక్కుకున్న భర్త మృత్యుంజయ్ను కాపాడటం కోసం అతని భార్య సోనా ముఖర్జీ(జాక్వెలిన్ ఫెర్నాండేజ్) బయలు దేరుతుంది. సీరియల్ కిల్లర్ తరహాలో మరో హత్య చేసి భర్తను కాపాడుకుంటుంది. ఈక్రమంలో భర్త కోసం ఏదైనా చేసే భార్య పాత్రలో జాక్వెలిన్ అద్భుతంగానే రాణించింది. అయితే ఈ సిరీస్లో కొన్ని సంఘటనలు అర్థం పర్థం లేనివిగా ఉన్నాయి. ఉదాహరణకు సోనా తన భర్త ఆఫీసుకు వెళ్లి కంప్యూటర్ పాస్వర్డ్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాస్వర్డ్ మరేంటో కాదు.. షోనా(Shona) అని ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో ప్రేక్షకుడు పెద్దగా ఆశ్యర్యపోవడానికి ఏమీ ఉండదు. యాక్షన్ సన్నివేశాలు కూడా నిదానంగా సా..గుతాయి. కామెడీ గురించి చెప్పాలంటే కొన్ని డైలాగులు, సన్నివేశాలు నవ్విస్తాయి. మరికొన్ని చోట్ల సన్నివేశాలు పెద్ద లాజిక్గా అనిపించవు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అంచనాలతో ఈ సిరీస్ చూడటానికి వచ్చిన అభిమానుల ఆశలను జాక్వెలిన్, మనోజ్ బాజ్పాయి అడియాశలు చేశారనడం కంటే హత్య చేశారనడమే కరెక్ట్. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా జాక్వలిన్’) ప్రేక్షకుడి వాయిస్: ఈ సిరీస్ను అందించినందుకు నెట్ఫ్లిక్స్పై బూతుల వర్షం కురిపిస్తున్నారు. చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు అందుకుంటున్నారు. దీనికన్నా హాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలు వంద రెట్లు నయమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. జాక్వెలిన్ డైలాగ్ డెలివరీ, చెత్త కథనం పూర్తిగా నిరాశకు గురి చేశాయని పెదవి విరుస్తున్నారు. మొత్తంగా ఇది ఒక్కసారి చూడటమే ఎక్కువని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. సిరీస్ ప్రారంభంలో జాక్వలిన్ నోట "టార్చర్ అంటే మీకిప్పటివరకు తెలియదు.. ఇకపై చూస్తారు" అని డైలాగ్ చెబుతుంది. నిజంగానే ఈ సిరీస్ చూడటం అంటే టార్చరే అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా చూసిన వారికి భారీ నిరాశ తప్పదు. -
ఇదే నా మొదటి డిజిటల్ కవర్ ఫోటో..
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న వేళ బాలీవుడ్ ప్రముఖులు స్వీయ నిర్భంధానికి పరిమితమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా జాక్వలిన్ ఓ తెల్లని గుర్రంతో పోజ్ ఇస్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘ఇది నా మొదటి డిజిటల్ కవర్ ఫోటో చూడండి’ అని కామెంట్ కూడా జత చేశారు. ప్రస్తుతం జాక్వలిన్ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా జాక్వలిన్’) ఈ ఫోటోలో కనిపిస్తున్నగుర్రం సల్మాన్ ఖాన్ ఫామ్హౌజ్లోనిది. జాక్వలిన్ షేర్ చేసిన ఫోటో ‘హార్పర్స్ బజార్’ ఫ్యాషన్ మేగజైన్ మే ఎడిషన్కు సంబంధించిన కవర్ ఫోటో. మేగజైన్ కవర్ ఫోటో షూట్ చేయడానికి తన స్నేహితుడు సాజన్ సింగ్ సాయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సాజన్ సింగ్ కొరియోగ్రాఫ్ర్గా, డాన్స్ ఇండియా డాన్స్లో పాల్గొన్న పోటీదారుగా అందరికి సుపరిచితమే. (టాప్లో 3 ఇడియట్స్!) ‘లాక్డౌన్ సమయంలో నాకు చాలా విషయాలు అనుభవంలోకి వచ్చాయి. కరోనా వైరస్ బాధ గురించి ఆలోచిస్తే.. ఈ మహమ్మరి చాలా మందికి ఇబ్బంది కలిగిస్తోందని తెలుస్తోంది. ప్రసుతం నేను ఫామ్హౌజ్లో సురక్షితంగా ఉన్నాను. ఇక్కడి నుంచి అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వైరస్ను ఎదుర్కొనే బలం, ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని జాక్వలిన్ పేర్కొన్నారు. జాక్వలిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్కు చెందిన పన్వెల్ ఫామ్హౌస్లో సెల్ఫ్ క్వారంటైన్కు పరిమితమైన విషయం తెలిసిందే. జాక్వలిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’) View this post on Instagram Head over to @bazaarindia to check out my first digital cover!!! 💛💛 📸@saajan_singh23 A post shared by Jac’kill’ine Fernandez (@jacquelinef143) on May 2, 2020 at 9:57am PDT -
‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’
అందం అభినయం ఆమె సొంతం.. ‘హీరోయిన్గా మాత్రమే’అని పట్టుపట్టకుండా చిన్న చిన్న మెరుపులాంటి పాత్రలో పాటు, ఐటమ్ సాంగ్స్తోనూ కుర్రకారు మనసు దోచుకుంటోంది బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్. ‘సాహో’లో ప్రభాస్ పక్కన ఓ పాటలో మెరిసిన జాక్వలిన్ తాజాగా వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’లో ప్రధాన పాత్ర పోషించింది. శిరీష్ కుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫలితం మాట ఎలా ఉన్నా చిత్రంలో నటించిన నటీనటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్పేయి, మోహిత్ రైనాలు కీలక పాత్రలు పోషించారు. తన భర్తను కాపాడుకోవడానికి పోరాటం చేసే ఓ భార్య పాత్రలో కనిపించిన జాక్వలిన్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో జాక్వలిన్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించి మరి మెప్పించింది. గతంలో ఎప్పుడూ చూడని జాక్వలిన్ను ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ లో చూశామని నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. అంతేకాకుండా తన నటన, అభినయంతో తన కెరీర్లోనె బెస్ట్ పెర్మార్మెన్స్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్లు సైతం ఓటీటీ ప్లాట్పామ్పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా వీరిదారిలోనే జాక్వలిన్ కూడా డిజిటల్ వరల్డ్లో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదవండి: మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్ మళ్లీ ట్రెండింగ్లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_601242433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నా మనసులో కొందరు ఉన్నారు
పొరుగింటి అమ్మాయి జాక్విలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్కు వచ్చి అప్పుడే పదిసంవత్సరాలు దాటిపోయింది! ‘అలాద్దీన్’(2009) సినిమాతో వెండితెరకు పరిచయమైన జాకీ... సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్లాంటి అగ్రహీరోలతో నటించింది. ‘హీరోయిన్గా మాత్రమే’ అని పట్టుబట్టకుండా ‘ఐటమ్ సాంగ్స్’తోనూ అలరిస్తోంది. నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మిసెస్ సీరియల్ కిల్లర్’లో నటిస్తోంది. ‘సాహో’లో ప్రభాస్ పక్కన ఒక పాటలో మెరిసిన ఈ అందాల సుందరి త్వరలో క్రిష్ దర్శకత్వంలో పవన్కళ్యాణ్ సరసన నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె గురించి కొన్ని ముచ్చట్లు.. ‘జయాపజయాలు అనేవి జీవితంలో సర్వసాధారణం కదా... మరి మీరు ‘ఓటమి’ని ఎలా తీసుకుంటారు? కంగారు పడిపోతారా? నిరాశ చీకట్లోకి వెళ్లిపోతారా?’ అని అడిగితే... జయాపజయాలను సమానంగా చూసిన జాకీ ఇలా చెబుతోంది... సక్సెస్ ఎప్పుడూ శాశ్వతం కాదు. అలాగే ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు. ‘కిక్’ సినిమాతో పెద్ద సక్సెస్ వచ్చింది. ‘ఇక నాకు తిరుగులేదు’ అని సన్నిహితులందరికీ చెప్పి మురిసిపోయాను. దురదృష్టవశాత్తు అది నిజం కాలేదు. చెప్పొచ్చేదేమిటంటే ‘కిక్’ సక్సెస్ను నేను సరిగ్గా వినియోగించుకోలేకపోయాను. అంతమాత్రాన దిగులుపడి కూర్చోలేదు. ‘నెక్స్ట్ ఏమిటి!’ అంటూ ముందుకువెళ్లాను. ‘ఇది టెక్నాలజీ కాలం. ఎలా అప్డేట్ అవుతారు?’ అని అడిగితే ‘ఎంత వరకు అవసరమో అంతవరకు’ మాత్రమే అని చెబుతూనే సోషల్ మీడియాలో సినిమాలు,స్టార్లపై జరిగే ట్రోలింగ్పై ఇలా స్పందిస్తోంది... విమర్శలను ఎలా స్వీకరిస్తామనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. మరో కోణం నుంచి చూస్తే వాటిలో హాస్యాన్ని ఆస్వాదించవచ్చు. ‘ఓపెన్మైండ్’తో నిర్మాణాత్మకమైన విమర్శను స్వీకరించవచ్చు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా నా వరకైతే ట్రోల్స్, మీమ్స్ను సీరియస్గా తీసుకోను. సోషల్ మీడియా యుగంలో ఏది చెప్పినా విపరీతార్థాలకు, రకరకాల వ్యాఖ్యలకు దారి తీసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం! ‘కేమ సూత్ర’ అనే విచిత్రమైన పేరుతో జాకీకి శ్రీలంకలో ఒక రెస్టారెంట్ ఉంది. ‘‘శ్రీలంకలో దర్శించాల్సిన ప్రదేశాలలో కేమ సూత్ర కూడా ఒకటి’’ అని చమత్కరిస్తుంటాడు హీరో అక్షయ్కుమార్. ఈ రెస్టారెంట్ గురించి ఆమె ఇలా చెబుతోంది... శ్రీలంక వంటకాలు అంటే నాకు చాలా ఇష్టం. సంప్రదాయమైన పాతవంటకాలకే కొత్త టచ్ ఇచ్చి ఆ రుచిని అందరికీ పరిచయం చేయడానికి షెఫ్ దర్శన్ మునిదాసతో కలిసి ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఇది బయోపిక్ల కాలం కదా! ‘మీకో ఛాన్స్ వస్తే ఎవరి బయోపిక్లో నటిస్తారు?’ అని అడిగితే ఆమె నుంచి వెంటనే సమాధానం రాదు. ‘అదేమిటి!’ అని ఆశ్చర్యపడేలోపే ‘నా మనసులో కొందరు ఉన్నారు. వారి బయోపిక్లలో నటించాలని ఉంది. వారి పేర్లు తరువాత చెబుతాను’ అంటూ ఊరిస్తుంది! -
‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’
హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షాపై నెటిజన్లు గరం అవుతున్నారు. ఇతరుల ప్రతిభను కొట్టేసి అది మీదేనని చెప్పుకోడానికి మనసెలా వచ్చిందని నిలదీస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. దీనికి ఎంతగా విశేష ఆదరణ దక్కిందో, అంతే స్థాయిలో విమర్శలపాలవుతోంది. దీని మూలాలు బెంగాలీ పాటను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇది బెంగాలీ ఫోక్ సాంగ్ అని, ఒరిజినల్ పాటకు కర్త, కర్మ, క్రియ అయిన జానపద కళాకారునికి గుర్తింపునివ్వకపోవడం దారుణమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతడి అనుమతి లేకుండా నిర్దాక్షిణ్యంగా కాపీ కొట్టారని విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి బెంగాలీ సంగీతకారుడు రోహన్ దాస్గుప్తా స్పందిస్తూ.. ‘రతన్ కహార్ అనే బెంగాల్ జానపద కళాకారుడు ఈ పాటను రూపొందించడంతోపాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడాడు. ఇప్పుడు వచ్చిన జెండా ఫూల్.. అతను 1970లో "బోరోలోకర్ బీటీ లో" అంటూ గొంతెత్తి పాడాడు. దురదృష్టమేంటంటే తాజా పాట సంగీతం, లిరిక్స్పై హక్కులు కోరుతూ దావా వేసేందుకు అతని దగ్గర డబ్బు లేదు. కానీ ఈ పాట అచ్చంగా అతనిదేనన్న నిజం అందరికీ తెలియాలి’ అని కోరుతూ ట్వీట్ చేశాడు. యూట్యూబ్లో ‘జెండా ఫూల్’ పాట వీడియోలో అతని పేరును కూడా చేర్చాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రతన్ కహార్ పశ్చిమ బెంగాల్లోని బిర్భుమ్ జిల్లాలో శౌరి గ్రామంలో నివసిస్తున్నారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!) -
నా ముక్కు బాలేదన్నారు
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే నటనతో పాటు ముక్కు ముఖం కూడా బావుండాలంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముక్కు విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ‘నీ ముక్కు బాలేదు’ అని కొందరు ముక్కుసూటిగా చెప్పేవాళ్లట. 2009లో వచ్చిన ‘అలాదిన్’ సినిమా ద్వారా బాలీవుడ్కి పరిచయమయ్యారు శ్రీలంక మూలాలున్న జాక్వెలిన్ ఫెర్నాండజ్. నటిగా బాలీవుడ్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘నటిగా బాలీవుడ్లో నా లక్ టెస్ట్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం శ్రీలంక నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లు ఎవ్వరూ లేరు. ఓ గుర్తింపు సంపాదించుకోవాలనే తపనతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాను. హీరోయిన్గా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చాలా మంది నా పేరు మార్చుకోమని సలహా ఇచ్చేవాళ్లు. ఫెర్నాండజ్ ఏంటి? ముస్కాన్ అని పెట్టుకో బావుంటుంది అని ఒకరు, నీ ముక్కు బాలేదు, ముక్కు సర్జరీ చేయించుకో అని మరొకరు, ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దు అని కొందరు.. ఇలా రకరకాలుగా చాలా చెప్పేవారు. కానీ నేను మాత్రం నాలానే ఉండాలని నిశ్చయించుకున్నాను.. ఉన్నాను. ఈ పదేళ్ల ప్రయాణం నటిగా చాలా సంతృప్తినిచ్చింది. ఆ సలహాలు గుర్తు చేసుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది’’ అని ఫ్లాష్బ్యాక్ను గుర్తుచేసుకున్నారు. అన్నట్లు.. ‘సాహో’లో ప్రభాస్తో కలిసి ‘బాడ్ బ్యాయ్..’ అనే పాటకు జాక్వెలిన్ స్టెప్పులేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ముంబైకు వచ్చిన కొత్తలో ఎగతాళి చేశారు
ముంబై : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ఎంట్రీ అనుకున్నంత సులువుగా జరగలేదన్నారు శ్రీలంక మాజీ మిస్ యూనివర్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వెలిన్ ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడ్డారు. బీటౌన్లో అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కాగా ఇటీవలే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన విషయం తెలిసిందే. సాహోలోని ఓ పాటలో ప్రభాస్తో కలిసి ఆడిపాడారు. ఇక తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ భామ. ఈ సందర్భంగా.. మొదటిసారి ముంబైలో అడుగు పెట్టినప్పుడు ఎదుర్కొన్న విచిత్ర సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో పదేళ్లుగా తన ప్రయాణం ఎలా సాగిందో వెల్లడించారు. (‘మాకు ఓ అన్నయ్య ఉంటే బాగుండు’) ఆమె మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో 2016లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ హీరోయిన్గా రాణించాలనుకున్నాను. ఫస్ట్ టైం ముంబైకు వచ్చినప్పుడు నన్ను ఓ పరాయి వ్యక్తిగా చూశారు. నా ముఖంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. ముక్కుకు సర్జరీ చేసుకోవాలని, పేరు బాగా వెస్ట్రన్గా ఉందని ‘ముస్కాన్’గా మార్చుకోవాలని, కనుబొమ్మలను ఒత్తుగా మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అలాగే నేను మాట్లాడే హిందీని చాలా మంది ఎగతాళి చేశారు. ప్రజలు నన్ను ‘ఫిరంగి నటి’ అంటూ తిట్టేవారు’. అని చెప్పుకొచ్చారు. అయితే అవేవి పట్టించుకోకుండా తనకు తానుగా ఉండాలనుకున్నారని.. అది తనకెంతో కలిసొచ్చిందన్నారు. ఎవరేం అనుకున్నా.. వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి నేడు పరిశ్రమలో నిలదొక్కుకున్నారని బదులిచ్చారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!) -
రకుల్ ఎటాక్
బాలీవుడ్పై హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ‘ఎటాక్’ చేసినట్లున్నారు. వరుస అవకాశాలను ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్లో కెరీర్ గ్రాఫ్ను పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దేదే ప్యార్ దే, మర్జావాన్ చిత్రాల్లో హిందీ తెరపై కనిపించారు. ఇటీవల అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు జాన్ అబ్రహాం హీరోగా హిందీలో తెరకెక్కనున్న ‘ఎటాక్’ సినిమాకి సైన్ చేశారు. లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రకుల్ ఓ కథానాయికగా నటించనున్నారు. మరో నాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తారు. ‘‘మంచి స్క్రిప్ట్ కుదిరింది. జాన్తో మరోసారి నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. రకుల్ది కూడా చాలా మంచి పాత్ర’’ అని జాక్వెలిన్ పేర్కొన్నారు. -
వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్
భూమ్మీద ప్రేమకు, అనుబంధానికి మించిన అమూల్యమైంది ఏదీ లేదు. అయితే ఆ ప్రేమలో అత్యున్నత స్థాయి తల్లిదే. ఆ తరువాత అంతటి ప్రేమను పంచేది సోదరులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికి తార్కాణమే ఈ వీడియో. నిజానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఎప్పుడో చక్కర్లు కొట్టింది. అయితే దీనిని తాజాగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో మరోసారి ఈ వీడియో వార్తల్లో నిలిచింది. ‘తోబుట్టువుల ప్రేమను మించింది ఏదీ లేదు’ అనే క్యాప్షన్తో విల్ స్మిత్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పిల్లవాడు తన చెల్లెతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. చెల్లెతో బంతిని బాస్కెట్లో వేయమని చెప్పగా మొదటి ప్రయత్నంలో ఆమెకు ఆ బంతి గోల్ మిస్ అవుతుంది. దీంతో చిన్నారి ఏడుపు లంకించుకోవడంతో అన్న తనను హత్తుకొని మళ్లీ ప్రయత్నించమని దైర్యం చెప్తాడు. అంతేగాక తనను ఎత్తుకొని మరి మళ్లీ ఆమె బాస్కెట్లో బంతి వేయడానికి సహాయపడతాడు. ఈసారి బంతి సరిగా బాస్కెట్లో పడటంతో చిన్నారి ఆనందంతో మునిగి తేలుతుంది. కాగా వీడియోను ఇప్పటికే కొన్ని లక్షలమంది వీక్షించగా అనేకమంది నెటిజన్లు తమకు ఓ అన్నయ్య ఉంటే బాగుండు అని భావోద్వేగంతో కామెంట్ పెడుతున్నారు. వీరే గాక వీడియో చూసిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా దీనిపై స్పందించారు. వీడియో చూశాక నాకు ఏడుపు వచ్చింది అంటూ.. కామెంట్ పెట్టారు. View this post on Instagram Nothing beats that sibling love :-) 📹 @sarahanne_n_clan A post shared by Will Smith (@willsmith) on Oct 17, 2019 at 2:30pm PDT -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!
సాహో సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్, పారితోషికాలకు సంబంధించిన వార్తలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నటించిన జాక్వలిన్ ఫెర్నాండెజ్కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక్క పాటలో నటించినందుకు ఈ భామకు రూ. 2 కోట్ల పారితోషికంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఉత్తరాది నటులనే తీసుకున్న సాహో టీం, సినిమా మీద అంచనాలు మరింత పెంచేందుకు జాక్వలిన్తో స్పెషల్ సాంగ్ చేయించారు. అందుకే భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, వెన్నెల కిశోర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు
అభిమానులు ఓ సినిమాపై అంచనాలు పెట్టుకుంటే ఏ రేంజ్లో ఆదరిస్తారో చరిత్రలో అనేక సార్లు చూశాం. ఆ సినిమాకు సంబంధించిన ఫోటో, టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఎంతో హైలెట్ చేస్తారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘సాహో’పై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు రికార్డులు క్రియేట్ చేసాయి. తాజాగా సాహో సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో ప్రభాస్ బ్యాడ్ బ్యాయ్ అంటూ ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులేసిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతేకాకుండా 3,58,664 మంది లైక్ కొట్టారు. దీంతో ప్రపంచంలోనే కేవలం 24 గంటల్లో ఇన్ని లక్షల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్ బాయ్’నిలిచింది. ఇక ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ ప్రభాస్ సింగిలా.. డబులా?