somu veerraju
-
ఏపీ బీజేపీలో కలకలం!
సాక్షి, రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari), మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) మధ్య తూర్పుగోదావరి జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి నియామకం అంశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలంటూ పావులు కదిపారు. చివరకు వీర్రాజు జాతీయ నేతలను ఒప్పించి తన అనుచరుడైన కొవ్వూరుకు చెందిన పక్కి నాగేంద్రకు జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం.. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీగా ఉండీ కూడా తన అనుచరురాలైన ఎన్.హారికను జిల్లా అధ్యక్షురాలిగా నియమించలేక పోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వద్ద పురందేశ్వరి మాట చెల్లుబాటు కాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర ఉత్తర్వులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడచినట్లు సమాచారం. బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని నూతన అధ్యక్షుడికి సోము వీర్రాజు సూచించారు. ఇదే విషయమై పురందేశ్వరి స్పందిస్తూ.. పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురైనట్లు సమాచారం. టీడీపీతో అంటకాగుతున్నందుకేనా? పురందేశ్వరి బీజేపీలో ఉన్నా, ఆమె మనసంతా టీడీపీలోనే ఉందన్న ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి టీడీపీ బలోపేతం, అధికారంలోకి తీసుకురావడానికి సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యరి్థగా బీజేపీ నేత శివరామకృష్ణంరాజును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయంతో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి వర్గంలో అప్పట్లో అలజడి రేగింది. నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ అభ్యర్థి శివరామకృష్ణం రాజుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పక్షాన పురందేశ్వరి నిలబడటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తన మరిది (సీఎం చంద్రబాబు) ప్రయోజనాల కోసమే చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అందువల్లే ఆమె సిఫారసులను కమలం పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది. పురందేశ్వరి, సోము వీర్రాజుల మధ్య ఆది నుంచి సయోధ్య కుదరడం లేదు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదని వీర్రాజు కోరారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక చిన్నమ్మ ఉన్నట్లు భావించిన సోము వర్గం అప్పటి నుంచి ఆమెను విభేదిస్తోంది. -
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. వీరి పేర్లు ఖరారు?
సాక్షి, ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. కాగా, మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవ్లకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరోవైపు.. సోము వీర్రాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల అంచనా.. అనకాపల్లి- సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం. -
బీజేపీకి ‘మూడొ’చ్చింది
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్గా ఉంది. ఆ మూడు ఏవంటే కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది. ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు. -
ఒక కార్యకర్తగానైనా పని చేస్తా: సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. మార్పులు చేర్పులపై తనకు బాధ లేదని.. ఒక కార్యకర్తగా కూడా పార్టీ కోసం పని చేస్తానని అన్నారాయన. అలాగే.. పురంధేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తాం అని ఆయన ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్గా పదవీ కాలం ముగియడంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించి.. దగ్గుబాటి పురంధేశ్వరిని నూతన అధ్యక్షురాలిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇదీ చదవండి: సారీ.. మరో ఛాన్స్ ఇవ్వలేం! -
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు అవుట్?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మార్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం ముగిసింది. అయితే మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం లేదంటూ జాతీయ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. కాగా సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కీలక బాధ్యతల అప్పగింత హామీని ఆయనకు అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కాషాయ పార్టీకి కొత్త బాస్ రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి, జీవీఎల్, పురందేశ్వరి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సాయంత్రం లోపు క్లారిటీ రానుంది. -
‘చంద్రబాబు ఎంతో ఇబ్బందిపెట్టారు.. మరిచిపోలేదు’
సాక్షి, తిరుపతి: రానున్న ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెం గ్రామంలో సోమవారం కేంద్ర ఐటీ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్తో కలసి ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడారు. బీజేపీ .. పొత్తులతో అధికారంలోకి రాదని, అందుకే రాష్ట్రంలో టీడీపీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జనసేనతో మాత్రం కలసి నడుస్తామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇబ్బంది పెట్టిన విషయం మరచిపోలేదని.. దీంతోనే కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు అంటే అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల నిధులు ఇచ్చారని.. అయితే ఆయన వాటిని చంద్రన్న బాట పేరుతో ఖర్చుచేసి బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్పారని దుయ్యబట్టారు. ఇవాళ.. జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పలు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని దీంతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 85 చెరువులను అమృత్ సరోవర్ పేరుతో ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీ చాలన్నది బాబే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ పాలన చేపట్టి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చిత్తూరులోని గంగినేనిచెరువు పార్కు వద్ద నిర్వహించిన జిల్లా మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. మోదీ పాలన దేశానికి ఆదర్శమన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని ఆరోపించారు. బాబు పాలనలో సోమవారం పోలవరం అని కాలక్షేపం చేశారన్నారు. జనసేన, టీడీపీ పొత్తు విషయమై బాబునే ప్రశ్నించాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్
-
చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ప్రకాశం: బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు నిలదీశారు. ఆ అర్హత లేదు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. ఇదీ చదవండి: బాబూ.. శవాల మీద పేలాలు ఏరుకోకు! -
సోము వీర్రాజుకు నిరసన సెగ..!
-
మే 15 నుంచి బీజేపీ ప్రచార భేరి
రాజమహేంద్రవరం సిటీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరిస్తూ మే నెల 15వ తేదీ నుంచి జూన్ 15 వరకు ప్రచార భేరి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకు పది రోజులపాటు పోరాటం చేయడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వివరాలను మాధవ్ మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసి వెళ్తుందనే అసత్య ప్రచారం జరుగుతుందని.. దానిని తిప్పికొడతామని చెప్పారు. గతంలో తెలుగుదేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందన్నారు. అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ తమతోనే ఉన్నారని, వచ్చే ఎన్నికలకు జనసేనతోనే కలిసి వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వంపై పోరాటం విషయంలో జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పురందేశ్వరి, టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన వ్యాపారవేత్త రామచంద్రప్రభు గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు శుక్రవారం రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. పధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడు తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి బీజేపీలో చేరానని రామచంద్ర ప్రభు తెలిపారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. -
మా పొత్తు జనసేనతో మాత్రమే
సాక్షి, అమరావతి: బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే కలిసి ముందుకెళ్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, టీడీపీతో పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా.. సోము వీర్రాజు జవాబిచ్చారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకెళ్తాయని చెప్పారు. అందువల్లే పవన్కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని కలిశారని పేర్కొన్నారు. పవన్ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కలిసినంత మాత్రాన.. వాళ్లు రాజకీయంగా ఒక్కటైనట్టు కాదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబు వద్ద తాను కూడా కూర్చున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన కలిసి పోరాడతాయని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ వ్యూహం ప్రకారం జరగవన్నారు. -
AP: జనసేనకు షాకిస్తూ బీజేపీకిలోకి..
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో విపక్షాల పొత్తులపర్వంపై గందరగోళం నడుస్తోంది. బీజేపీ-జనసేనల చెట్టాపట్టాల్పై ఆ పార్టీల నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో దోస్తీ ఉన్నా.. లేనట్లేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండడమూ చూస్తున్నాం. ఈ తరుణంలో జనసేనకు పండగనాడు ఊహించని షాక్ తగిలింది. జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకాగా, ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాడు ఆకుల కిరణ్. -
పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023 -
జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం: సోము
గంగవరం(చిత్తూరు జిల్లా): జనసేనతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. గంగవరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున సోము వీర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. జనసేన పొత్తుతోనే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు 2024 ఎన్నికలకు కూడా వెళ్తామని తెలిపారు. -
పదివేల కోట్లు ఇచ్చినా బాబు రాజధాని కట్టలేదు
మదనపల్లె/ బి.కొత్తకోట: కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఇచ్చినా చంద్రబాబు రాజ«దాని నిర్మించకపోగా, రైతులను నడిరోడ్డు మీద పడేశాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ, బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్లతో జరిగిన సమావేశంలోనూ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు అమరావతిలో సగం నిర్మాణాలు చేసి ఉన్నా ఈరోజు రాజధాని ప్రసక్తే ఉండేది కాదన్నారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి పెరిగిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రత్యేక అజెండాతోనే పార్టీ మారుతున్నారన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఈ విషయాన్ని పవన్కళ్యాణ్ స్వయంగా ధృవీకరించారని తెలిపారు. కమ్యూనిస్టులు అంగన్వాడీ కేంద్రాల నుంచి వసూలు చేసే సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీలను ఓడించాలన్నారు. -
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ.. సోము వీర్రాజుపై ఎఫెక్ట్ ఎంత?
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. వివరాల ప్రకారం.. ఏపీ బీజేపీ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు. -
ఏపీలో బీజేపీ ఆ నానుడి మార్చివేసిందా?
ఆంద్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు కురిపించి నిరసనలకు దిగారు. ఒకప్పుడు మానవ సేవే మాధవ సేవ అనేవారు. కాని ఏపీలో బీజేపీ ఆ నానుడిని మార్చివేసినట్లుగా ఉంది. పసిపిల్లవాడికి శివరాత్రి నాడు ముఖ్యమంత్రి జగన్ పాలుపడుతున్నట్లుగా ఒక కారికేచర్ వచ్చింది. దానిని వైసీపీ అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారట. అందులో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు బీజేపీ నేతలు కనిపెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారు నిరసనలు, ధర్నాలు అంటూ రంగంలోకి దిగారు. ఇక ప్రకటనల ఊదర ఎటూ ఉంటుంది. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిజానికి బీజేపీ వారి చేష్టలపై అసలు స్పందించకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కాని మతపరమైన అంశంగా బీజేపీ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం సున్నితంగా ఉంటుంది కనుక వైసీపీ నేతలు దానిపై మాట్లాడినట్లు ఉన్నారు. ఆ కారికేచర్ గమనించినవారికి ఎవరికైనా ముందుగా వచ్చే ప్రశ్న అందులో ఏమి తప్పు ఉందని! ఇందులో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని! బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఇన్ చార్జీ సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తదితర ముఖ్యనేతలతో పాటు చిన్నా,చితక నేతలు కూడా దీనిపై ప్రచారం చేపట్టారు. ఈ ప్రభుత్వం ఏకంగా హిందూ వ్యతిరేక ప్రభుత్వమని వారు తేల్చేశారు. అదెలాగంటే పసిపిల్లవాడికి పాలు పట్టడమట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? చిన్నారి బాలుడికి పాలు పడితే శివుడికి క్షీరాభిషేకం చేయడాన్ని అపహాస్యం చేసినట్లయిందని వారు ఆరోపిస్తున్నారు. హిందువులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఏదో ఈనాడు, తదితర టీడీపీ మీడియా ప్రచార సంస్థల ద్వారా ప్రచారం పొందడానికి తప్ప బీజేపీ నేతల చర్య ఎందుకన్నా ఉపయోగం ఉంటుందా?ఈనాడు కూడా అసలు ఆ ఫోటోలో ఏముందో రాయకుండా శివలింగానికి క్షీరాభిషేకాన్ని అవహేళన చేసేలా ఫోటో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మాత్రమే పేర్కొనడం గమనించదగిన అంశం. ఆ ఫోటోను సవివరంగా ప్రచురిస్తే అసలు విషయం బయటపడిపోయి,ప్రజలకు వాస్తవం తెలిసిపోతుందన్నది ఈనాడు భయం కావచ్చు. సరే!వారి బాద వారిది! ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మహా ప్రసాదంగా ఈనాడు భావిస్తోంది . అది వేరే సంగతి.సోము వీర్రాజు ఆద్వర్యంలో ఏకంగా మార్కాపురం, గిద్దలూరులలో ధర్నాలు కూడా చేసేశారు. ఆయనేదో అక్కడకు టూర్ కు వెళ్లినట్లున్నారు. ఏదో ఒకటి చేస్తే పోలా అని చేసినట్లుంది తప్ప ఏ మాత్రం ఇందులో అర్దం లేదు.ఏపీలో మతపరమైన వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి గతంలోను బీజేపీతో పాటు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేయకపోలేదు. గుడులలో చోరీలు జరిగాయనో, విగ్రహాలను పాడు చేశారనో , ఏవో సాకులతో అలజడి సృష్టించడానికి కృషి చేశారు. కాని అవేవి ఫలించలేదు. ప్రభుత్వం అలాంటి చిన్న ఘటన జరిగినా వెంటనే సీరియస్గా రియాక్ట్ అవడమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటనపై విపక్షం నానా రాద్దాంతం చేసింది. వెంటనే సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని కేంద్రం దానిపై స్పందించలేదు.శ్రీకాకుళం జిల్లాలో ఒక విగ్రహాన్ని తరలించిన ఘటనను వివాదాస్పదం చేశారు. తీరా చూస్తే టీడీపీవారే కావాలని అలా చేసి యాగీ చేశారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెల్లడైంది. రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారంటూ మరో గొడవను సృష్టించారు. ప్రభుత్వం వెంటనే మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ రకంగా హిందువుల మనోభావాలకు ఎక్కడా దెబ్బ తగలకుండా చర్యలు చేపడుతుంటే విపక్షానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత నిష్టతో ప్రతి హిందూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ,ఉగాది .. ఇలా ఒకటేమిటి? ఆలయాలలో ఉత్సవాలు పలు సందర్భాలలో ఆయనే పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా బీజేపీ నేతలకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించి భంగపడ్డారు. ఆయా కేసులలో టీడీపీవారే నిందితులుగా పట్టుబడుతుండడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అలాంటి ఘటనలే దాదాపు జరగకుండా ఆగిపోయాయి. ఏమి దొరకక బీజేపీవారికి ఈ చిన్న పిల్లాడి బొమ్మను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూడడం దారుణం. అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రస్తావించారు. హిందూ మతం బీజేపీ సొంతం కాదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే బీజేపీ నేతలు అప్పట్లో నోరు మెదపని విషయాన్ని వారు గుర్తు చేసి ప్రశ్నించారు. వీటికి వారి వద్ద సమాధానం ఉండదు. బీజేపీవారు ఇంతటి శ్రద్దను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ప్రత్యేక హోదా అంశంలో ,రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో చూపించి ఉంటే మంచి పేరు వచ్చేది. బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, జనసేన తమతో పొత్తులో ఉంటుందో, ఉండదో తెలియని వైనం తదితర కారణాలతో రాజకీయాలను డైవర్ట్ చేయడానికి బీజేపీ పూనుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుని బీజేపీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది. కానీ అవి హేతుబద్దంగా లేకపోవడం, అర్ధవంతంగా లేకపోవడం వల్ల బీజేపీనే నవ్వులపాలవుతోంది. అందువల్ల ఇలా చిన్నపిల్లాడికి పాలు పడితే కూడా తప్పుపట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉంటేనే వారికి పరువు దక్కుతుంది. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు పద్దతి కాదు: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: బీజేపీ రాజకీయాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయంలో ఆలయాలను కూలిస్తే బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవిస్తారు. తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారు. మానవసేవే.. మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజీయం చేస్తోంది. సునీల్ ధియోధర్ ట్వీట్ చాలా అవమానకరంగా ఉంది. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూల్చివేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారు?. ప్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్క్ అవుట్ కాదు. సీఎం జగన్.. అర్చకులకు ఆర్ధిక సహయం అందించడం నుండి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయాల్లో వైభవం తీసుకువచ్చారు. మీ ఒక్కరికే హిందుత్వం మీద ప్రేమ ఉందా?. సోము వీర్రాజుకు రాజకీయాలు చేయాలను కుంటే ఇది పద్దతి కాదు. సునీల్ ధియోధర్ వంటి నాయకులను పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేస్తే ఇంకా దిగిజారిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం’
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అనేది బీజేపీ నేతలకు తెలియదా?. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వెల్లంపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం బీజేపీ మానుకోవాలి. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూలిస్తే బీజేపీ ఏం చేశారు?. చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం. బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
‘ప్రజల్ని రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ మానసికంగా సిద్ధమవుతోందా?. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జనసేన పొత్తుకు సైతం దూరంగా జరిగేలా ఆయన ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఇటీవల జగిత్యాల కొండగట్టు పర్యటనలో ‘బీజేపీతోనే ఉన్నా’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం ఏపీలో పవన్తో పొత్తు విషయంలో డైలమా ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు జనసేనతోనే పొత్తు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన సోము వీర్రాజు వాయిస్లో ఒక్కసారిగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బీజేపీ ఏపీ చీఫ్.. ‘‘కలిసి వస్తేనే జనసేనతో పొత్తు.. లేదంటే జనంతోనే మా పొత్తు’’ అంటూ ప్రకటించడం గమనార్హం. పైగా ప్రజలను రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు ఉండదంటూ వ్యాఖ్యల ద్వారా పొత్తు విషయంలో ఊగిసలాట ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు టీడీపీనే ప్రధాన కారణమని చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కల్యాణ్, కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీలను ఒకచోట చేర్చేందుకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ తీరుపైనే బీజేపీలో అనుమానాలు మొదలైనట్లు స్పష్టమవుతోంది. పైగా టీడీపీతో కలిసి ఏమాత్రం ముందుకు వెళ్లడం ఇష్టంలేని బీజేపీ అవసరమైతే జనసేనాని కూడా దూరం పెట్టేందుకు సిద్ధమైంది!. ఈ క్రమంలో జనసేన కలిసి రాకపోయినా.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామనే రీతిలో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టమవుతోంది. -
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. స్పందించిన సోము వీర్రాజు
ఒంగోలు: పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్నే ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీతోనే ఉన్నానని పవన్ చెప్పారు. మేమూ అదే చెబుతున్నాం. టీడీపీతో జనసేన పొత్తు గురించి నన్ను అడగడం సరికాదు. అదేదో పవన్నే అడగండి’ అని సోము వీర్రాజు అన్నారు. తమ పొత్తు జనసేనతోనే కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అటూ ఇటూ తిరగడం వల్ల ఆరేడు ప్రాణాలు పోవడం తప్ప ఏమీ ఉపయోగముండదన్నారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్రెడ్డి వంటి వారు మాట్లాడే అంశాలపై తాను స్పందించనని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, పీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నా ధిక్కార స్వరం దేనికి సంకేతం..?
-
సోముపై కన్నా మరోసారి ఫైర్.. ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నియమించిన వారినే తొలిగించారంటూ సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా నిప్పులు చెరిగారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలీపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కన్నా హయాంలో ఏనాడూ కేంద్ర కమిటీ నిర్ణయాలను పాటించలేదన్నారు. సోము వీర్రాజు కేంద్ర కమిటీ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చెబుతోంది. చదవండి: కేసీఆర్వి పగటి కలలు: సోము వీర్రాజు -
కేసీఆర్వి పగటి కలలు: సోము వీర్రాజు
కర్నూలు కల్చరల్: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అంటూ పగటి కలలు కంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పి అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మాట్లాడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్... ఇప్పుడు ఆంధ్రా అంటూ కూని రాగాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నియంత్రణ చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
చంద్రబాబు ఆంధ్రాలో తిరుగుతారు.. హైదరాబాద్లో నిద్రపోతారు
గుంటూరు (వెస్ట్): ప్రతిపక్ష నేత చంద్రబాబు పగలు ఆంధ్రాలో తిరుగుతూ.. రాత్రికి మాత్రం హైదరాబాద్ వెళ్లి నిద్రపోతుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో తొలగించిన 26 పథకాలు అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల నిరసన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క భవనం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారని విమర్శించారు. 2014 నుంచి దళితుల అభివృద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. జాతీయ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దళితులకు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలిచ్చే పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇందులో 50 శాతం సబ్సిడీని కేంద్రమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని నీరు గార్చేశారని ఆరోపించారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న లక్ష బ్యాక్లాగ్ పోస్టులను భర్తీని చేయకుండా దళితులపై సీఎం జగన్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. కేంద్రం మన రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, రూ.65 వేల కోట్లతో రోడ్లు నిర్మించిందని చెప్పారు. అయితే డబ్బులు కేంద్రానివి.. స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివి అన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. కుటుంబ పాలన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసత్యాలను ప్రచారం చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టేశారని విమర్శించారు. ఓట్లకోసం సంక్షేమ బాటపట్టిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, మాగంటి సుధాకర్ యాదవ్, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పొదుపు సంఘాలను తానే ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. ప్రధాని కూడా తనను పొగిడారని చెప్పుకుంటున్నారు. ప్రధాని అలా అన్నారని ఆయనకు ఎవరు చెప్పారు? పొదుపు సంఘాలను చంద్రబాబు ఏర్పాటు చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది దివంగత ప్రధాని పీవీ నరసింహారావు. 1991–95 మధ్య పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో పొదుపు సంఘాల వ్యవస్థను తెచ్చి రివాల్వింగ్ ఫండ్ మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామంలో ఒక ఎన్జీవో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అందులో చంద్రబాబు ప్రమేయం ఏమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పీవీ వీటిని తీసుకొస్తే.. వాజ్పేయి వచ్చాక డ్వాక్రా పేరుతో పట్టణాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు మైక్ పట్టుకొని ఊగిపోతున్నారు. అదీ మన తడాఖా అంటున్నారు. ఏం తడాఖా..? అలాంటి వాటినే ఎంగిలి కాఫీలు తాగే రకాలు అంటారు’ అని ధ్వజమెత్తారు. ఇక ఇబ్బందులు ఉండవు.. బీజేపీ కార్యక్రమాలకు రాష్ట్రంలో పత్రికలు పెద్దగా కవరేజీ ఇవ్వడం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పవన్కళ్యాణ్ సమావేశం తర్వాత తమ మిత్రపక్షం జనసేన కార్యక్రమాల కవరేజీ కూడా తగ్గించేశారని చెప్పారు. మోదీ, పవన్కళ్యాణ్ మధ్య పలు అంశాలపై చర్చ జరిగిందని, ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. బీజేపీ, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి పోరాడతాయన్నారు. పవన్కళ్యాణ్ కార్యక్రమాలను అధికారపార్టీ నేతలు నిరోధిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ సొమ్ము చర్చిలకు ఎలా కేటాయిస్తారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. బీసీలపై టీడీపీ తీరుకు నిదర్శనం: జీవీఎల్ టీడీపీ పూర్తి అభద్రతా భావంతో ఉందని జీవీఎల్ చెప్పారు. టీడీపీ ఏర్పాటు నుంచి పార్టీలో కొనసాగుతున్న యనమల లాంటి వారిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని లోకేశ్ ప్రకటించటాన్ని బట్టి బీసీల పట్ల వారి వైఖరి తెలుస్తోందన్నారు. బీజేపీ–జనసేన భాగస్వామ్యంతో 2024లో పొలిటికల్ బ్లాక్బస్టర్ రావడం ఖాయమన్నారు. సాధారణ రోజుల్లో పెద్దగా కనిపించని రూ.2 వేల నోట్లు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెద్దఎత్తున బయటకు రావడంపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం టీడీపీ హయాంలో కూడా రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలోనే ఉందన్నారు. దీనిపై కేంద్ర విమానయాన మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. -
పొలిటికల్ కారిడార్ : టీడీపీతో పొత్తుపై మోదీ క్లారిటీ ..
-
ఎల్లో మీడియాపై ఏపీ బీజేపీ సీరియస్.. చర్యలకు సిద్ధం!
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా కథనాలపై ఏపీ బీజేపీ సీరియస్ అయ్యింది. బీజేపీ కోర్ కమిటీ భేటీపై తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోము వీర్రాజుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది. అయితే, సోమువీర్రాజు తనలాగే 40 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రధాని వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది. ఎల్లోమీడియా కథనాలను బీజేపీ నేతలు ఖండించారు. కాగా, టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలపై చర్యలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక, కోర్ కమిటీ భేటీలో చంద్రబాబుతో అంటకాగిన నేతల ప్రచారంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ భేటీలో ఇద్దరు ఎంపీలు.. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బలహీనపడిందని అన్నారు. దీనిపై చర్చ నడిచింది. బాబుకి ఏజ్ లేదు.. లోకేష్కు సామర్థ్యం లేదని ఎంపీలు చెప్పారు. చంద్రబాబుపై నెగటివ్ కామెంట్స్ ఎల్లో మీడియా ప్రచురించలేదు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు సభలకు వాడుకున్న వైనంపై ప్రధాని మోదీ వద్ద చర్చించారు. ఆ అంశాన్ని చంద్రబాబు కోవర్టు బీజేపీ నేతలు మీడియాలో రాయించలేదు. ఇక, సోము వీర్రాజు నిర్వహించిన జనపోరు యాత్రను మోదీ అభినందించారు. -
ప్రధాని రోడ్డు షో సక్సెస్: సోము వీర్రాజు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షో విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో శనివారం ప్రధాని బహిరంగ సభ అనంతరం వీర్రాజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని రోడ్డు షోను విజయవంతం చేసిన ఇన్చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులను ఆయన అభినందించారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ, రాజకీయ అంశాల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో ఆయన చర్చించారు. వివిధ అంశాలపై వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు: విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి భారీ బహిరంగ సభ జరగలేదని, ఇకపై జరగబోదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సభని అత్యద్భుతంగా విజయవంతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రధాని సభ అత్యద్భుతం: జీవీఎల్ నరసింహారావు మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖలో ప్రధాని సభ అత్యద్భుతంగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన విజయవంతమైందని.. ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందన్నారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. -
ప్రధాని పర్యటనకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజులుగా పార్టీ శ్రేణుల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ప్రధాని పర్యటించే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 11వ తేదీన భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రికి ఘనస్వాగతం పలుకుతాయని తెలిపారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహిస్తామని, ఉత్తరాంధ్ర ప్రసిద్ధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు చేదు అనుభవం
-
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు సోము వీర్రాజును కోరారు. వికేంద్రీకరణకు అనుకూలం అంటూనే అమరావతి ఫేక్ యాత్రకు ఎందుకు బీజేపీ మద్దతు తెలుపుతోందని వారు నిలదీశారు. సోము వీర్రాజు సూటిగా స్పందించకపోవడంతో వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు -
వీర్రాజు Vs కన్నా.. ఏపీ బీజేపీలో లుకలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక నేపథ్యంలో రెండు రోజులుగా సోము వీర్రాజునుద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ‘పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలో మా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. గతంలో ఇలాంటి పార్టీ విషయాలపై రెండు నెలలకోసారి అందరమూ కూర్చొని మాట్లాడే వాళ్లం. ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే ఇవన్నీ చూస్తున్నారు. ఎవరితోనూ చర్చించడంలేదు. చివరకు కోర్ కమిటీలో కూడా చర్చకు రావడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో మాకు తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు. పవన్తో సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, ఆ బాధ్యతను జాతీయ నాయకుడు మురళీధరన్కు అప్పగించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే, 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అధిష్ఠానం స్పష్టం చేసిందని.. అందువల్లే ఆసంతృప్తితో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ కూడా రాష్ట్రంలో సోము వీర్రాజు నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కన్నా కొట్టిపారేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన నాటి నుంచి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. బుధవారం తాను ఎలాంటి కార్యకర్తల సమావేశం నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం వీర్రాజు ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం ఎయిర్పోర్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన విజయవాడకు రాలేదు. నేరుగా బెంగళూరుకు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు. -
2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే అధ్యక్షుడు!
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజే 2024 ఎన్నికల వరకు కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు నాయకత్వంలోనే ఏపీలో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని.. ఆ మేరకు జాతీయ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తోందని, టీడీపీకి మళ్లీ అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కాగా, విశాఖలో పవన్కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడాన్ని బీజేపీ ఖండిస్తోందని చెప్పారు. పవన్తో సోము వీర్రాజు ఫోన్లో మాట్లాడారని.. పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ మాధవ్ను అక్కడికి పంపామని పేర్కొన్నారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో " స్ట్రెయిట్ టాక్ "
-
కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు : సోము వీర్రాజు
-
మోదీ ఫొటోను చెప్పులతో కొట్టించింది మర్చిపోం
విజయనగరం గంటస్తంభం: టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినా.. చంద్రబాబు ప్రధాని మోదీ ఫొటోను గాడిదకు తగిలించి ఎమ్మెల్యేలతో చెప్పులతో కొట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్తు చేశారు. వాటన్నింటినీ బీజేపీ ఎప్పటికీ మర్చిపోదన్నారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ వల్లే విశాఖ రైల్వేజోన్ సాకారమవుతోందన్నారు. ప్రధానులను మార్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందలేదని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన దాదాపు రూ.7 వేల కోట్లను సింగపూర్, చైనా ప్లాన్లు అంటూ మాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని.. ఆయన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. సభలో బీజేపీ నాయకులు తీగల హరినాథ్, పావని తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై సోము వీర్రాజు ఫైర్
-
ఆధారాలున్నాయా?.. ఏబీఎన్ రాధాకృష్ణపై సోము వీర్రాజు ఫైర్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలపై తప్పుడు రాతల విషయంలో ఏబీఎన్ రాధాకృష్ణపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో ‘విద్వేషపూరిత కథనాలతో బీజేపీ ప్రతిష్టకు భంగం కలిస్తారా?. అవినీతిపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తారా?. బీజేపీ నేతలు అవినీతికి పాల్పడినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా?. మీ రచనలు ‘ఎల్లో జర్నలిజం’గా కనిపిస్తున్నాయి. వారంలోగా ఆధారాలు చూపాలి. లేకుంటే క్షమాపణలు చెప్పాలి. వారంలో స్పందన లేకుంటే చట్టపరమైన చర్యలకు దిగుతాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు నిధులిస్తే రాజధాని ఎందుకు కట్టలేదు
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.6,500 కోట్లు కేంద్రం చంద్రబాబుకు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆ నిధులతో రాజధానిని ఎందుకు కట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు నేడు రోడ్డుపై పాదయాత్రలు చేస్తున్నారని రైతులను రోడ్డుపై ఎవరు నడిపిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం గుంటూరులో లాడ్జిసెంటర్లో ప్రజా పోరు వీధి సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అన్ని దేశాలు తిరిగి ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని తరహాలో ఏపీకి రాజధాని నిర్మాణం చేస్తానని పలు మార్లు చెప్పారన్నారు. దేశాలు తిరిగి వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప, రాజధాని కట్టలేదన్నారు. -
Sakshi Cartoon 28-09-2022
ప్రపంచమంతా తిరిగి రాజధాని ఎలా కట్టాలో తెలుసుకోవడానికి ఆ ఖర్చు చేశారట సార్! -
రాజధాని పేరుతో చంద్రబాబు డబ్బంతా వృధా చేశారు : సోము వీర్రాజు
-
చంద్రబాబుపై ప్రశ్నల వర్షం.. ఆ 6,500 కోట్లు ఏం చేశావ్: సోము వీర్రాజు
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు.. ప్రజల డబ్బంతా వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఇచ్చిన రూ. 6,500 కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. రూ. 1800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్ నిర్మించింది. అయితే, కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ బాగుందో లేక చంద్రబాబు రాజధాని బాగుందో చర్చకు రావాలి. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. సింగపూర్, మలేషియా, జపాన్ అంటూ దేశాలు తిరిగి వచ్చాడు. వేల కోట్లు ఖర్చు చేశాడు. కానీ.. రాజధానిని మాత్రం ఎందుకు కట్టలేదు’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఆనాడు దానిని అడ్డుకుంది చంద్రబాబే.. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
పసుపు, కుంకుమ పేరుతో కేంద్ర నిధుల దుర్వినియోగం
నెల్లూరు(బారకాసు): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో పసుపు, కుంకుమ పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యా యని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పును ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయకుండా కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగపరచుకోవాలన్నారు. సముద్రతీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం 60 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజాపోరు బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
చంద్రబాబుకు చెక్.. జూ. ఎన్టీఆర్ సేవలను వాడుకుంటాము: సోము వీర్రాజు
సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరి మధ్య రాజకీయంగా మంతనాలు జరిగినట్టు లీక్లు బయటకు రావడంతో పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమువీర్రాజు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జూ. ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటాము. చంద్రబాబుపై మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు. జూ.ఎన్టీఆర్కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఆయనుకు ప్రజాదరణ ఎక్కడుంటే ఆయన సేవలు అక్కడే ఉపయోగించుకుంటాము. ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పింది అని వ్యాఖ్యలు చేశారు. -
బల్క్ డ్రగ్ పార్క్ వద్దనడం దారుణం
అమలాపురం రూరల్: ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కాకినాడ జిల్లాకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు కోరినా కూడా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అడ్డుపడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహించబోతున్నట్లు వీర్రాజు చెప్పారు. మోదీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని వివరిస్తామన్నారు. -
‘చవితి’పైనా రాజకీయమా?
సాక్షి, అమరావతి: వినాయక చవితి పండగను సైతం రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ, టీడీపీలు దుష్ట ఆలోచన చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నిస్తే.. తాము ఉద్యమించామని.. దాంతో వెనక్కి తగ్గిన మాట వాస్తవం కాదా? అని విష్ణు ప్రశ్నించారు. వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన మీకు వినాయక చవితి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆ ఇద్దరు నేతలకు ఆయన స్పష్టంచేశారు. మళ్లీ వీరే ఇప్పుడు వినాయకుడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఇక 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనల ప్రకారమే వినాయక మండపాలు, పందిళ్లకు అనుమతులిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. అప్పట్లో వినాయక మండపాలకు రూ.వెయ్యి విద్యుత్ ఛార్జీగా నిర్ణయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. అలాగే, కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామికి రూ.6 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు రథాన్ని తయారుచేయిస్తోందని ఆయన గుర్తుచేశారు. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి.. హిందువులను పండగలు చేసుకోనివ్వడంలేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం ఉందని మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పగలరా అని చంద్రబాబు, సోము వీర్రాజులను మల్లాది విష్ణు సవాల్ చేశారు. వీళ్లు హిందువులే కాదు.. అసలు భారతీయులే కాదన్నారు. వీరికి మరో పనిలేకే ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై వారిద్దరికీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రాన్ని అడిగి పోలవరానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తావా అని సోము వీర్రాజుకు విష్ణు సవాల్ విసిరారు. -
BJP Amaravati Padayatra: బీజేపీ నేతల్ని దొంగలన్న రైతు
తాడేపల్లి రూరల్: అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ‘మనం–మన అమరావతి’ పేరుతో వారం రోజులపాటు బీజేపీ తలపెట్టిన పాదయాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఉండవల్లి మీదుగా పెనుమాకకు చేరుకుంది. పెనుమాకలో సోము వీర్రాజుకు తారసపడిన ఓ రైతు ‘మీరు దొంగలు’ అంటూ నిందించాడు. ‘మీ వల్లే రాజధాని రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు’ అని మండి పడటంతో సోము వీర్రాజు కొంత అసహనానికి గురయ్యారు. మరో రైతు కలగజేసుకుని అమరావతి విషయంపై ప్రశ్నించారు. అతడికి సోము వీర్రాజు బదులిస్తూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి సూత్రధారి చంద్రబాబేనని, కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు సరిగా ఖర్చుపెట్టి ఉంటే రైతులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. బీజేపీ ఒకే రాజధానికి కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించడంతో పాటు అమరావతి స్మా›ర్ట్ సిటీ ఏర్పాటుకు రూ.2,500 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలోనే రైతులకు ప్లాట్లు కేటాయించి రాజధానిని అభివృద్ధి చేస్తామని వీర్రాజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్కు వార్నింగ్ -
ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబే కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన రూ. 7,798 కోట్లు తీసుకొని కేంద్రానికీ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ రాజకీయ ఉనికి కోసం పార్లమెంట్లోనూ, బయటా హోదా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా కొందరు రాజకీయ కుట్రలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉందన్నారు. జనసేనతో కలసి మిత్రపక్షంగా ముందుకు సాగుతామన్నారు. -
బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతుందని శనివారం ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్లు హాజరవుతారని పేర్కొంది. ఈ నెల 2,3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు చర్చించనున్నట్లు తెలిపింది. -
Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఒకే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రమాదకర నల్ల బెలూన్లు ఎగురవేయడం ద్వారా భారీ కుట్రకు పూనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో ఆ పార్టీ నేతలు ప్రమాదకర బెలూన్లు ఎగురవేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఘటన వెనుక సూత్రధారులు, పాత్రధారులను, కుట్ర అమలు చేసిన దుష్టశక్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. చదవండి: (CM YS Jagan: తరతరాలకు స్ఫూర్తిదాత) -
సోము వీర్రాజుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదైంది. బుధవారం ఉదయం రావుపాలెం జొన్నాడ వద్ద సోము వీర్రాజు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న ఎస్ఐని వెనక్కి నెట్టి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు.. సోము వీర్రాజుపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, బుధవారం ఉదయం.. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతో మమేకం అయితేనే ప్రజాస్పందన తెలిసేది.. బాబుకి అది తెలీదు -
జొన్నాడలో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
-
పోలీసులపై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
సాక్షి, రాజమండ్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రావుపాలెం జొన్నాడ వద్ద వీరంగం సృష్టించారు. నా కారును ఎందుకు ఆపారంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. చదవండి: (గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ ప్రారంభం) -
‘పొత్తు’ను పక్కన పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొత్తు అంశాలను పూర్తిగా పక్కనపెట్టి.. మన పార్టీని సొంతంగా ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశంపైనే దృష్టిపెట్టి నేతలందరూ పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన నడ్డా రాత్రి నగరంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న సహచర పార్టీలు పొత్తులపై ఎలాంటి అంశాలను చర్చకు తీసుకొచ్చినప్పటికీ మన ప్రతి ఆలోచన, కార్యక్రమం మాత్రం స్వయంకృషితో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేలా ఉండాలని నడ్డా సూచించారు. బీజేపీ మాతో కలిసి పోటీచేస్తుందని కొన్ని ప్రత్యర్థి పార్టీల మైండ్ గేమ్ గురించి ఆలోచించవద్దన్నారు. తెలంగాణలో అక్కడి నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు అక్కడ మన పార్టీ ప్రత్యామ్నాయ స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు ఎక్కువగా రాష్ట్ర పర్యటనలకు వస్తారని చెప్పారు. అలాగే, జూలైలో మోదీ రాష్ట్ర పర్యటన సమయంలో ర్యాలీ నిర్వహించే అంశం గురించి చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, పురంధరేశ్వరి, సునీల్ దియోధర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను, మోదీ సంక్షేమం–అభివృద్ధిని పొలింగ్ బూత్ స్థాయికి తీసుకెళ్లెలా కోర్ కమిటీ సమావేశంలో రోడ్ మ్యాప్ను సిద్ధంచేసినట్లు చెప్పారు. నేతల చేతుల్లోనే బీజేపీ పురోగతి అంతకుముందు.. నడ్డా బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జిల రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పురోగతి నాయకులు, కార్యకర్తలు చేతుల్లోనే ఉందని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అందించిన తోడ్పాటుపై రాష్ట్ర బీజేపీ రూపొందించిన పుస్తకాన్ని నడ్డా ఆవిష్కరించారు. అనంతరం నాలుగైదు పోలింగ్ బూత్లను కలిపి ఒకటిగా పేర్కొనే శక్తి కేంద్రాల ఇన్చార్జిలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘మిగతా పార్టీలకు భిన్నంగా మన పార్టీకి విలువలతో కూడిన సిద్ధాంతం, మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉండటం మనందరి అదృష్టం. పార్టీ మీకు ఒక దారి చూపుతుంది. ఆ మార్గంలో మీరు నడిస్తే చాలు. మీరే కార్యక్షేత్ర యోధులు. శక్తి కేంద్రాల ఇన్చార్జిలు తమ పరిధిలోని బూత్ల వారీగా సమావేశాలు నిర్వహించి, కొత్త కార్యకర్తలను చేర్చుకుంటూ కమిటీలు వేయాలి. వీటిల్లో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఇలా అన్నివర్గాల వారికి స్థానం కల్పించాలి. వీరు ప్రతిరోజూ ఐదుగుర్ని కలిసి పార్టీ సిద్ధాంతాలను వివరించాలి. వీలైతే ఆ ఐదుగురిని పార్టీలో చేర్పించాలి. బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు. బీజేపీ రాజకీయంగా కుటుంబ పార్టీలతోనే పోరాడుతోంది. ఏపీలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా కుటుంబ పార్టీలే. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. కేంద్రం అమలుచేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీగా పేరుమార్చి అమలుచేస్తోంది’. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ : సోము ఆ తర్వాత సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. సాయంత్రం విజయవాడ నగర ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ నడ్డా మాట్లాడారు. -
టీడీపీకి ఓ విధానం లేదా?
ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎవరైనా పదవుల్లోని వ్యక్తి చనిపోతే జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని, అది తమ పార్టీ విధానమని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోందని, అయితే గతేడాది జరిగిన తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎందుకు పోటీ చేశారని, పార్లమెంట్కు ఓ విధానం, అసెంబ్లీకి మరో విధానం ఆ పార్టీ సిద్ధాంతమా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తారన్నారు. మీడియా సమావేశంలో కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కాకు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!
ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు. -
Somu Veerraju: టీడీపీతో పొత్తుపై సోమువీర్రాజు స్పష్టత
నల్లజర్ల: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనంతోనే తమ పార్టీ పయనిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. జూన్ 5న రాజమహేంద్రవరం, 6న విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలు జరుగనున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి శివనాగరాజు ఇంటివద్ద మంగళవారం జరిగిన శక్తి కేంద్రాల ఇన్చార్జ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు. చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు) -
పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: పొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీకి జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్ను అడగాలని అన్నారు. దేశంలో బీజేపీ ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తుందని, దానితో ప్రజలను ఓట్లు అడుగుతామని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమకు ముఖ్యమని, 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోస్యం చెప్పారు. -
చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదు: సోమువీర్రాజు
సాక్షి, విజయవాడ: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చెయ్యదన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. జూన్ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు. చదవండి: (ఎల్లో చానెల్లో మీటింగ్లు.. చాటింగ్లు) -
ప్రత్యేక హోదా ఖరీదు రూ.15 వేల కోట్లు
మదనపల్లె/చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకహోదా ఖరీదు రూ.15,000 కోట్లుగా ప్యాకేజీని నిర్ణయించి వాటితో పాటుగా ఆరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తే సరిపోతుందన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా, ఐదేళ్లు అధికారంలో ఉండి సింగపూర్, జపాన్ అంటూ మోసగించిన వారిని నిలదీయాలన్నారు. -
సోమువీర్రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి కారుమూరి
-
టీడీపీ వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం
హిర మండలం: ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ పాలన వల్లే వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. ‘జలం కోసం జన పోరు యాత్ర’ పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు బీజేపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం హిరమండలంలోని వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 91 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వారికి చెప్పారు. అనంతరం జరిగిన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో 10 ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. చంద్రబాబు విఫలమవ్వడం వల్లే వంశధార ప్రాంత నిర్వాసితులు, స్థానికులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ, మధు కుమార్, పి.విష్ణుకుమార్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మా పొత్తు వారితోనే...!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. విశాఖలోని లాసన్స్బేకాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాని బుధవారం ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ప్లాంట్ని ఇక్కడే కొనసాగించాలని ఏపీ బీజేపీ గతంలోనే కేంద్రానికి స్పష్టం చేసిందని చెప్పారు. గనుల రద్దు విషయం మైన్స్ పాలసీలో భాగంగానే జరిగిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేనతో పొత్తుపై ప్రశ్నించగా..రాష్ట్రంలో 1.35 కోట్ల రైస్ కార్డుదారులతో తమ పొత్తు ఉంటుందని, 30 లక్షల ఇళ్లు పొందిన ప్రజలతో పొత్తు ఉంటుందని, 1.35 లక్షల జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డులు పొందిన వారితో తమ పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు విష్ణుకుమార్రాజు,మాధవ్ తదితరులు పాల్గొన్నారు -
Sakshi Cartoon: ..ఇంకా ఎగస్ట్రా పెగాసస్ కూడా!
..ఇంకా ఎగస్ట్రా పెగాసస్ కూడా! -
టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్చార్జ్లు అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తులేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బీజేపీకే వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్చార్జ్లు సునీల్ దియోధర్, మధుకర్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్లోని పరిణయ ఫంక్షన్ హాలులో ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. సమావేశం తర్వాత కూడా విషయాలను బయటికీ వెల్లడించలేదు. అయితే సమావేశానికి హాజరైన బీజేపీ ముఖ్యనేతలు ఇద్దరు విషయాలను ‘సాక్షి’కి వెల్లడించారు. వారి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై ‘మైండ్గేమ్’ ఆడుతున్నారన్నారు. జనసేనతో కూడా పొత్తులపై ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని, పవన్కల్యాణ్తో పాటు జనసేన నేతల్లో స్థిరమైన నాయకత్వం లేదని, అలాంటివారిని నమ్మి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లలేమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి ఏదీ? బీజేపీ ఇన్చార్జ్లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుల నుంచి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. జాతీయపార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్ననేతలే బీజేపీలో ఉన్నారని, వారు బీజేపీ కాకుండా టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, చంద్రబాబుకు, వారికి మధ్య ఉన్న ధృడమైన బంధం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో వారు బీజేపీలో చేరారో అందరికీ తెలిసిందే! ఇలాంటి వ్యక్తుల మాటలు విశ్వసించి పార్టీలో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సునీల్ దియోధర్తో పాటు సుప్రకాశ్కు పలువురు అధ్యక్షులు వ్యక్తిగతంగా కలిసి వివరించినట్లు తెలుస్తోంది. బైరెడ్డి గైర్హాజరు... పార్టీ వీడతారని చర్చ సమావేశానికి బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గైర్హాజరయ్యారు. కనీసం రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. జనవరి 22న ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ప్రజానిరసన సభలో కూడా ఆయన పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి బీజేపీని వీడతారనే చర్చ జిల్లాలో నడుస్తోంది. టీజీ వెంకటేశ్ వైఖరిపై ఫిర్యాదులు జిల్లా అధ్యక్షులు వ్యక్తిగతంగా పార్టీ నేతలతో కలిసి ముచ్చటించిన సందర్భంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వైఖరిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో, ఆయన తనయుడు టీడీపీలో కొనసాగుతున్నారని, ఈ వైఖరితో కర్నూలు ప్రజల్లో టీజీ ఫ్యామిలీ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఉంటే ఇద్దరూ బీజేపీలో, లేదంటే టీడీపీలో కొనసాగాలని, రెండు పడవలపై ప్రయాణం వద్దని కర్నూలు జిల్లా నేతలు సునీల్ దియోధర్కు చెప్పినట్లు తెలిసింది. -
సీమ అభివృద్ధికి కేంద్రం కృషి
సాక్షి, కడప/కోటిరెడ్డి సర్కిల్: ‘రాయలసీమ నుంచి అనేకమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్య మంత్రులయ్యారు. ప్రాజెక్టులతో పాటు అనేక రంగాలను విస్మరించడంతో రాయలసీమ అభివృద్ధిలో వెనకబడిపోయింది.. సీమ అభివృద్ధికి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుంది..’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కడపలో శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘రాయ లసీమ రణభేరి’ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ ఆధిక్యతతో గెలిపించినా మూడేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ లేదని.. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని వి మర్శించారు. రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం పాలకులు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తన భుజస్కంధాలపై వేసుకుందని, పూర్తి చేసేందుకు శక్తివంఛన లేకుండా కృషిచేస్తోందన్నారు. అనేక జా తీయ రహదారులు నిర్మిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం లోకి వస్తామన్నారు. రౌడీ ప్రభుత్వం పోతుందని, జనసేనతో కలిసి డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభు త్వాన్ని స్థాపిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. గండికోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవాలయాలను కూడా కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని స్పష్టంచేశారు. బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సాగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, జాతీయ ప్రధాన కార్యదర్శులు పురందేశ్వరి, వినోద్దౌడె, జాతీయ కార్యదర్శి సత్యకుమార్లు మాట్లాడుతూ.. రాయలసీమకు 200 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. సీమ అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీని ఓడించాలంటే పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీనిగానీ, ప్రాజెక్టులనుగానీ పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ఇతర నేతలు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్రాజు, తదితరులు కూడా పాల్గొన్నారు. -
బీజేపీ నేత జీవీఎల్ కు వెల్లంపల్లి సవాల్
-
ఉద్యోగాలు అమ్ముకున్న చంద్రబాబు
గుంటూరు మెడికల్ /నెల్లూరు (బారకాసు): తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటం కోసం వినియోగిస్తుందని ఆరోపించారు. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే రైతుయాత్ర చేస్తామని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్న చంద్రబాబు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలను చేపడితే.. అందులో ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొమ్ము చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలో జరిగిన శక్తి కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాలను దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తే.. వాటిని దివంగత ప్రధాని వాజ్పేయి పట్టణాలకు విస్తరింపజేయడంతో పాటు బలోపేతం చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తానే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాçస్పదమన్నారు. -
అమరావతి రైతుల్ని చంద్రబాబు మోసగించారు
సాక్షి, మచిలీపట్నం: చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేదని, భూములిచ్చిన రైతులకు ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్లలో రూ.7,200 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో.. ఏం చేశారో తెలియదని అన్నారు. సింగపూర్, జపాన్, రష్యా అంటూ విదేశాల్లో జోరుగా తిరిగారని, ఎక్కడికి వెళితే అలా రాజధాని నిర్మిస్తామని చెప్పి ఐదేళ్లలో కట్టలేకపోగా.. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉండుంటే కేవలం రూ.10 వేల కోట్లతో అద్భుత రాజధాని నిర్మించేవాళ్లమ న్నారు. రాజధాని నిర్మిస్తే కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 7 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేవలం 3 లక్షల ఇళ్లకు పునాదులు వేసి వదిలేశారని వివరించారు. ఆ ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రూ.4 వేల కోట్లు రుణం కూడా తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఒక్క పోర్టయినా నిర్మించారా రాష్ట్రంలో 900 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంటే ఒక్కపోర్టయినా కట్టారా? అని వీర్రాజు ప్రశ్నించారు. 14 జెట్టీలు కట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు ఒక్కటీ నిర్మించలేకపోయాడని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.600 కోట్లు ఇస్తుందని, అలా ఆరు జెట్టీలకు రూ.3,600 కోట్లు ఇస్తామని చెప్పి నట్లు గుర్తు చేశారు. -
ఏపీ బీజేపీ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి
-
చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు నడుస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఏపీ బీజేపీలో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: వాడుకుందాం.. వదిలేద్దాం.. అచ్చెన్న వ్యాఖ్యలు వైరల్ ‘‘గతంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ లు పవన్ కల్యాణ్ ఒక్కరే చదివేవారు. ఇప్పుడు పవన్ కల్యాణ్కు బీజేపీ నేతలు తోడయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు, కడపకు స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇస్తామని చెప్పే సత్తా సోము వీర్రాజు, జీవీఎల్కు ఉందా?. బీజేపీ నేతలు కపట నాటకాలాడుతున్నారని’’ మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి, సీఎం రమేష్లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని.. ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడినా సీఎం జగన్ ఏపీని అభివృద్ధి చేసి తీరతారన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చదవొద్దని ఏపీ బీజేపీ నేతలకు మంత్రి హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇలాగే కొనసాగితే బీజేపీ మరింత హీనంగా తయారవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు రాజధానిని కట్టలేకపోయారు: సోము
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు సీఎంగా ఉండి చంద్రబాబు రాజధానిని కూడా కట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ప్యానలిస్టులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులతో పాటు ఇతర ఆర్థిక నిపుణులు, న్యాయవాద– వివిధ రకాల వృత్తి విభాగాల ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. -
వామపక్షాలకు మేమంటేనే నచ్చదు
విజయనగరం గంటస్తంభం: వామపక్షాల నేతలు ఇతర పార్టీలను ఒక్క మాట అనరని.. బీజేపీ ఎన్ని మంచి పనులు చేసినా తీవ్ర విమర్శలు చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ జగన్ అంటే వామపక్షాలకు ప్రేమ ఎక్కువన్నారు. ప్రధాని మోదీ మాత్రం వారికి నచ్చరన్నారు. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలు, జూట్ పరిశ్రమలు మూతపడినా ఏమీ మాట్లాడరని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తున్నారని మాత్రం తెగ గోల చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. -
టీడీపీ వల్లే డిస్కమ్లపై రూ.30వేల కోట్ల భారం
ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్ డిస్కమ్లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కమిషన్ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. -
‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు తెచ్చుకున్న బాబు’
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు.. సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం దగ్గర ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు కూడా తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పుడు రాష్ట్రానికి అదే విధంగా నిధులు రాబట్టుకోవాలన్నారు. విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు సీఎంగా ఉండి కూడా రాజధానిని కట్టకుండా చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. -
సీఎం కేసీఆర్కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు: సోము వీర్రాజు