belt shops
-
బాబు సర్కారుకి భారీ గిరాకీ.. ఇదేనా సంపద సృష్టి
-
విచ్చలవిడి బెల్టు షాపులు.. ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం భారీగా తాగించడంతో.. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78, 547 కేసుల బీర్లు, 83,74, 116 కేసులు మద్యం అమ్మకాలు సాగాయి. న్యూ ఇయర్కి రూ. 1000 కోట్లు మద్యం వ్యాపారులు టార్గెట్ పెట్టుకోవడంతో గత ఏడాది డిసెంబర్ కంటే భారీగామద్యం అమ్మకాలు పెరిగాయి.విచ్చలవిడి బెల్టు షాపులతో మందుబాబులు భారీగా మద్యం తాగేస్తున్నారు. 2023 డిసెంబర్లో 25,83,530 కేసుల మద్యం.. 6,4,370 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసుల లిక్కర్.. 9,11,815 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్లో 4,62,832 కేసుల లిక్కర్.. 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. 18 శాతం లిక్కర్, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: చిత్తూరులో ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్పై దాడిదుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి.ఇక్కడ బైపాస్ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. -
బయట పడ్డ బెల్టు షాపులు.. బాబు పరువు బజారు పాలు
-
తిరువూరులో బెల్ట్ షాపుల భాగోతం
-
వేలం పాట వేసి బెల్ట్ షాపులు నడుపుతున్న ఎమ్మెల్యే అనుచరులు
-
ప్రజలపై పెనుభారం మోపుతారా!
అనంతపురం (కార్పొరేషన్): విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు ఐదున్నర నెలల్లో రూ.15,485 కోట్ల పెనుభారం మోపారని.. తిరిగి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఐదున్నర నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు.ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచి్చన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బెల్టు తీసినంత సులభం కాదు.. బెల్టు షాపుల మాఫియాను అరికట్టడం బెల్టు తీసినంత సులభం కాదని చంద్రబాబుకు అనంత చురకలంటించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టడానికి కారణం చంద్రబాబే అన్నారు. వేలం పాట వేసి మరీ బెల్టు షాపులను తన కార్యకర్తలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పుడేమో బెల్టు తీస్తా అని తనకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బూడిద కోసం రెండు జిల్లాల పోలీసులను సరిహద్దుల్లో బందోబస్తు పెట్టడం, ఈ విషయంపై సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేటు మరొకటి లేదని మండిపడ్డారు. -
ఇదీ చంద్రబాబు సర్కార్ డొల్లతనం
సాక్షి, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు సర్కార్ డొల్లతనం బయటపడింది. బెల్టు షాపులకు ఐదు లక్షల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ధర్మవరంలో మాత్రం డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం లో ఓ టీడీపీ నేత వీడియో వైరల్గా మారింది. డబ్బులు తీసుకుని బెల్టుషాపులకు అనుమతిస్తున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి ఆరోపిస్తున్నారు.పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ముఖ్య నేతలు, అధికారులు లంచం తీసుకుని బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల వద్ద డబ్బు తీసుకుని మద్యం బెల్ట్ షాపులు కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడితే.. టీడీపీలో ఉండొద్దంటున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి చెప్పుకొచ్చారు. -
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత–సరఫరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణం యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఊపేక్షించేందిలేదన్నారు.ఎమ్మార్పీకి కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తూ, బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తూ పట్టుబడితే తొలిసారిగా రూ.5 లక్షలు జరిమానా విధించాలన్నారు. అదే తప్పును పునరావృతం చేస్తే దుకాణం లైసెన్స్ను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇసుక లభ్యతను పెంచాలని సీఎం సూచించారు. ఇసుకలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
బెల్టు షాపులంటూ గిల్టు కథనాలా?
సాక్షి, అమరావతి: అసలు బెల్టు షాపులు ఎవరు పెడతారు? వీటిని నిర్వహించేది లాభాపేక్షతోనే కదా? మరి షాక్ కొట్టే ధరలతో ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో, నియమిత వేళల్లో మాత్రమే మద్యాన్ని విక్రయిస్తోందంటే సర్కారుకు లాభాపేక్ష లేనట్లే కదా? అయినా అసలు ప్రభుత్వానికి దుకాణాల్లో చిల్లరగా మద్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? మరి రామోజీ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు? గతంలో ఐదేళ్లు మత్తుగా పడుకుని ఇప్పుడే నిద్ర లేచారు కాబట్టేనా! టీడీపీ నేతలు ఎవరైనా వాళ్ల దుకాణాల్లో మద్యం అమ్ముతుంటే ఆయన ఫొటోలు తీశారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు 236 బెల్టు షాపులు లెక్క తేల్చానంటూ గుండెలు బాదుకుంటున్న ఆయన చంద్రబాబు హయాంలో 43వేల బెల్టు షాపులు ఏర్పాటైతే నోరెత్తకపోవడం గమ్మత్తుగా లేదా? సాధారణంగా ప్రైవేట్ దుకాణదారులు తాము అమ్ముకోవడంతోపాటు మరింత మద్యాన్ని తాగించేందుకు రకరకాల దుకాణాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తూ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను సైతం ఏర్పాటు చేసింది. బాబు హయాంలో ఏరులై పారిన మద్యం.. చంద్రబాబు హయాంలోటీడీపీ మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గత సర్కారు వేలం ద్వారా 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు కేటాయించగా వాటన్నింటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా మరో 4,380 పర్మిట్ రూమ్లకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. వాటికి అదనంగా టీడీపీ నేతలు 43 వేల బెల్ట్ దుకాణాలను తెరచి దోపిడీకి తెగబడ్డారు. గుడి, బడి తేడా లేకుండా వీధికి ఒకట్రెండు చొప్పున బెల్ట్ షాపులను తెరిచి మద్యం ఏరులై పారించారు. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. ఉక్కుపాదం మోపిన సీఎం జగన్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను ఒకేసారి రద్దు చేశారు. 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ పరం చేసేశారు. టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిలు సాగించాయి. ఇప్పుడు సమయాన్ని కుదించి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయిస్తున్నారు. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఇక 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. -
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్ఎస్ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్ బలిపశువులు కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. -
రామోజీ ‘రక్త’ కన్నీరు!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలో రామోజీ కంటిచూపుతో డిసైడ్ చేస్తాడు.. కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలో ఆయనే శాసిస్తాడు.. విధానపరమైన నిర్ణయాలనూ రామోజీరావే నిర్దేశిస్తాడు.. ఇదంతా 2019 చంద్రబాబు హయాం వరకు ఉన్న పరిస్థితి. అప్పటి వరకు ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.. చెల్లింది కూడా. ఆ తర్వాత సీన్ మారింది.. ఇప్పుడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో రామోజీ ఆటలు సాగడంలేదు.. తన సమీప బంధువు నుంచి పోలవరం కాంట్రాక్టు మొదలుకుని నిన్నమొన్నటి మార్గదర్శి చిట్ఫండ్స్ వరకూ ఆయనకు తరచూ నోట్లో పచ్చివెలక్కాయలు పడుతున్నాయి. గొంతులో ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నది జీ హుజూరంటూ తలూపే చంద్రబాబు సర్కారు కాదు కదా.. పుష్కలంగా ప్రజామద్దతు ఉన్న వైఎస్ జగన్ సర్కార్ ఇది. పైగా తన జేబులో మనిషి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వైభవం మరోవైపు మిణుకుమిణుకుమంటోంది. దీంతో రామోజీకి దిక్కుతోచడంలేదు..సరికదా పిచ్చెక్కినట్లు ఉంటోంది. అంతే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వైఎస్ జగన్ సర్కారుపై అడ్డగోలుగా.. తన పాఠకులు విసుగెత్తిపోయారనే కనీస స్పృహ కూడా లేకుండా నిత్యం కలంకూట విషం చిమ్ముతున్నాడు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఎప్పటిలాగే మరోసారి విషం కక్కాడు. ఈ విషబీజాలు మీకు కిక్కు ఇస్తాయేమోకానీ మీరనుకున్న లక్కు నెరవేరదు రామోజీ..! నిత్యం అబద్ధాలు అల్లుతూ రాసే విషపు రాతలోని పచ్చినిజం ‘ఏది నిజం’.. ఇదిగో... సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఈనాడు మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అధికారంలో లేడన్న బాధ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా విజయవంతంగా కొనసాగుతున్నారన్న అక్కసు అంతా కలగలిపి మరీ అక్షరాల్లో కూర్చి తన కరపత్రికలో కడుపుమంట తీర్చుకున్నాడు రామోజీ. కానీ, వాస్తవం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న మద్యం విధానం అందిస్తున్న ఫలాలు ఏమిటో ప్రజలకు తెలుసు.. బెల్ట్ దుకాణాల్లేని పల్లెలకు తెలుసు.. పర్మిట్రూమ్లు లేని ఊర్లకు తెలుసు.. మద్యం రేట్లు అమాంతంగా పెరగడంతో ఆ వ్యసనానికి తమ భర్తలు, పిల్లలు క్రమంగా దూరమవుతుండటంతో ఊరట చెందుతున్న అక్కాచెల్లెమ్మలకు తెలుసు.. దశాబ్దాలుగా నాటుసారా తయారీ తప్ప మరో దిక్కులేని అగత్యం నుంచి బయటపడి, ప్రస్తుతం దర్జాగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో సామాజిక గౌరవం పొందుతున్న కుటుంబాలకు తెలుసు.. సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకూ తెలుసు. ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు అన్నదే ఈనాడు రామోజీరావు దుగ్థ. ప్రజలు చంద్రబాబును ఏమాత్రం నమ్మడం లేదనే ఆయన ఆక్రోశం. వైఎస్ జగన్మోహన్రెడ్డిపట్ల జనాదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతుండడమే ఆయన ఆందోళన. అందుకే తనకు అలవాటైన రీతిలో విష ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రామోజీ, చంద్రబాబు ద్వయానికి కష్టంగా ఉన్నా సరే వారు ఇప్పటికైనా గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ టైమ్ అయిపోతోంది.. మీ కట్టుకథలకు కాలం చెల్లింది. తెలుస్తోందా రామోజీ.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్లు..ఆరు బెల్ట్ దుకాణాలు.. మద్యం విక్రయాలను దశల వారీగా నియంత్రిస్తామన్న మేనిఫెస్టోలోని హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్న నిజం పాపం రామోజీరావుకు గుర్తుండి ఉండదు. అప్పట్లో మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల గుప్పెట్లోనే ఉండేవి. వేళాపాళా లేకుండా 24గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చేది. సీఎంగా జగన్ వచ్చాక.. కానీ, ఈ మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియాను తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులు అయితే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. ఇక మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ. 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాల సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10గంటల నుంచి రాత్రి 9గంటల వరకే విక్రయాలను అనుమతించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల రద్దు అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతించారు. అంటే మద్యం దుకాణాలే అనధికారికంగా బార్లుగా కూడా చలామణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కాదనగలరా రామోజీరావుగారూ.. బార్ల సంఖ్య పెంచలేదు టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు ఇక దశలవారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలను సగానికి పడిపోయాయి. అందుకు ఈ గణాంకాలే తార్కాణం.. మేనిఫెస్టోలో హామీ మేరకే షాక్ కొట్టేలా మద్యం ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. తద్వారా పేదలను మద్యం వ్యసనానికి దూరం చేయాలన్నది తమ విధానమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అదేమాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కిందామీదా పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. పేదలు మద్యానికి దూరమవుతుండటం కూడా రామోజీరావుకు ఆవేదన కలిగిస్తుందంటే నిజంగా ఆయనకు మామూలు చికిత్స కాదు మానసిక చికిత్స అవసరమనిపిస్తోంది. డిస్టిలరీలన్నీ బాబు హయాంలోనివే.. ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో స్లైడ్లు ప్రదర్శించి మరీ వివరించారు. అయినా సరే.. కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీని ఏమనాలి.. ఏం చేయాలి? సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ తప్పా రామోజీ.. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీచేసి ప్రభుత్వం నిధులు సమీకరించింది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కూడా స్పష్టంచేసింది. పేదల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తగినన్ని నిధులు సమీకరించడం కూడా రామోజీరావుకు కంటగింపుగా మారుతోంది. తాను, తన చంద్రబాబు తప్ప పేదలు బాగుపడకూడదని ఆయన భావన కావచ్చు. ఆ రోజులకు కాలం చెల్లింది. మీకు అర్ధమవుతోందా రామోజీ.. అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. ఎలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. సారా సిండికేట్కు గుండెల్లో రైళ్లు 2019 నుంచి 2023 మార్చి వరకు పోలీసు, ఎస్ఈబీ విభాగాలు నాటు సారా తయారీదారులపై 1,44,254 కేసులు నమోదు చేశాయి. మొత్తం 1,12,604 మందిని అరెస్టుచేశారు. 18.41లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతోపాటు 5.34కోట్ల లీటర్ల సారా ఊటలను ధ్వంసం చేయడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. మొత్తం 14,556 వాహనాలను జప్తుచేశారు. బైండోవర్ కేసులు, పీడీ యాక్ట్లు.. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, అక్రమంగా నల్లబెల్లం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వారిపై బైండోవర్ కేసులు నమోదుచేస్తోంది. 2020 జూన్ నుంచి 2023 మార్చి 14 వరకు మొత్తం 74,674 బైండోవర్ కేసులు నమోదు చేసింది. అలాగే, రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా దందాకు అలవాటుగా మారిన నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్లను ప్రయోగిస్తున్నారు. 2020, మే 16 నుంచి 2023, మార్చి 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 206 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. అక్రమ మద్యం దందాకు చెక్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగింది. టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఆ దందాపై ఉదాసీనంగా ఉండేది. రామోజీ కూడా ఏనాడు పెన్నెత్తి మాట్లాడలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మద్యం దందాకు సమర్థంగా చెక్పెట్టింది. ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ మద్యం స్మగ్లింగ్ను కట్టడి చేస్తోంది. దీనిని కాదనగలరా రామోజీ.. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’ దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. నవోదయం పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా దన్నును అందించడంతోపాటు సామాజికంగా గౌరవాన్ని పెంచింది. అందుకోసం ఎస్ఈబీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అటువంటి గ్రామాలను గుర్తించి ఆయా జిల్లాల యంత్రాంగాల సహకారంతో పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తోంది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకు కూడా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది రామోజీ.. చంద్రబాబు, రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే రక్తమాంసాలతో వ్యాపారం వారిద్దరిదే వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేయాలో.. ప్రభుత్వ పాలనా వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయాలో ఈ ప్రపంచంలో చంద్రబాబు, రామోజీరావులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ విషయంలో పేటెంట్ వారిద్దరిదే. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఈయన శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు! జిల్లాల వారీగా పీడీ యాక్ట్ కేసులు.. జిల్లా కేసులు శ్రీకాకుళం 3 విజయనగరం 1 అల్లూరి సీతారామరాజు 5 పార్వతీపురం మన్యం 4 అనకాపల్లి 2 కాకినాడ 12 అంబేడ్కర్ కోనసీమ 6 తూర్పు గోదావరి 36 పశ్చిమ గోదావరి 8 ఏలూరు 12 కృష్ణా 6 ఎన్టీఆర్ 8 బాపట్ల 14 పల్నాడు 15 ప్రకాశం 7 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 3 చిత్తూరు 22 తిరుపతి 1 వైఎస్సార్ 5 కర్నూలు 6 నంద్యాల 19 అనంతపురం 6 శ్రీసత్యసాయి 4 అన్నమయ్య 1 మొత్తం 206 -
ఏది నిజం?: 3 అబద్ధాలు 6 అభాండాలు.. ‘ఈనాడు’ మరో విష కథనం
ఆయనే కర్త... కర్మ... క్రియ 1990ల మొదట్లో... మద్య నిషేధ ఉద్యమానికి... 1996 నుంచీ రాష్ట్రంలో అక్రమ మద్యం పెరిగిపోవటానికి... అలా పెరిగిపోయిందంటూ ‘ఈనాడు’విచ్చలవిడిగా రాయడానికీ... రైల్వే స్టేషన్లో రెండు బాటిళ్లు దొరికినా ఓ పేద్ద వార్త ప్రచురించడానికి... 1997లో చంద్రబాబు మద్య నిషేధం ఎత్తివేయటానికి... అన్నిటికీ ఆయనే కర్త..కర్మ... క్రియ. ఆయనే రామోజీరావు!!. విచిత్రమేంటంటే ఈ 86 ఏళ్ల మద్య నిషేధ ఉద్యమకారుడు 1997లో చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసినపుడు తన పత్రిక ‘ఈనాడు’లో ఓ విచిత్రమైన సంపాదకీయం రాశాడు. ప్రభుత్వాలు నిషేధాన్ని అమలు చేయటం సాధ్యం కాదని, జనం ఎవరికి వారు తాగటం మానేస్తే తప్ప ఈ మహమ్మారిని అంతం చేయలేమని సూత్రీకరించాడు.. అలా నిషేధాన్ని ఎత్తేశాక తన రామోజీ ఫిలిం సిటీలోని ఫైవ్స్టార్ హోటళ్లలో దేశ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టాడు. వాటిని మరింత తాగించడానికి బెల్లీ డ్యాన్సులు పెట్టాడు. వారానికో ప్రత్యేక కార్నివాల్ను పెట్టి... తన పత్రికలో ప్రకటనలిచ్చి మరీ జనాన్ని రప్పించి తాగించాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో నిషేధం అనేది ఎవరికి వారు విధించుకోవాలి తప్ప ప్రభుత్వమో... అమ్మకం దార్లో చేయటం కష్టం!. అంటే... ఎవరికి వారు తాగటం మానేయాలి తప్ప తాను మాత్రం అమ్ముతూనే ఉంటానని, ఇష్టం వచ్చిన వాళ్లు తాగొచ్చని చాలా పద్ధతిగా చెప్పారు. ఇదీ... ఈయన గారి పాత్రికేయ పాతివ్రత్యం!. రామోజీరావు చాలా నికార్సయిన మనిషి. సిద్ధాంతానికి కట్టుబడే తత్వం. కాకపోతే ఆ సిద్ధాంతమే కాస్త తేడా!. అదేంటంటే తన చంద్రబాబు అధికారంలో ఉంటే మద్య నిషేధం అక్కర్లేదు. వేరెవ్వరు అధికారంలో ఉన్నా... మద్య నిషేధం కావాలి. లేదంటే ఊరుకోరు. అందుకే... నాడు: బాబు హయాంలో ఊరూరా విరగకాసిన 43,000 బెల్టు షాపుల్ని ‘ఈనాడు’ ఏనాడూ చూడలేదు. నేడు: ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎక్కడో ఒకటీ అరా నడుస్తున్నా... ‘3 పెగ్గులు–6 గ్లాసులు’ అంటూ తాగినట్లే ఊగిపోతారు. నాడు: అప్పట్లో ఏకంగా 4,380 మద్యం దుకాణాలు... పక్కనే పర్మిట్ రూమ్లతో సహా మందు పోస్తుంటే అది విచ్చలవిడితనమని ‘ఈనాడు’కు అనిపించలేదు. నేడు: షాపులో కొనుక్కుని ఎక్కడో పొలాల్లో తాగుతున్న వారిని కూడా ఫోటోలు తీసి... బెల్టు షాపులో కొని తాగుతున్నట్లుగా చిత్రీకరిస్తాడు. నాడు: బాబు హయాంలో అమ్మే ఏ మద్యమైనా ఆయన దృష్టిలో అమృతమే. నేడు: అవే డిస్టిలరీలు, అదే మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తుంటే... అది విషమంటూ నీచపు రాతలు రాస్తాడు. కోవర్టులతో కలిసి దొంగ టెస్టులు చేయించి మరీ దుష్ప్రచారానికి దిగుతాడు. నాడు: చంద్రబాబు ఏ బ్రాండుకు అనుమతిచ్చినా అది చాలా గొప్పదని ‘ఈనాడు’ భావం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఆ పత్రిక దృష్టిలో అప్పట్లో గొప్పపేర్లు. నేడు: బాబు దిగిపోవటంతో... ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన ఘోరమైన పేర్లంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు!! త్రీ క్యాపిటల్స్, స్పెషల్స్టేటస్ అంటూ లేని పేర్లను కూడా ఉన్నట్టుగా ఎల్లో రాతలు రాసి యాగీ చేస్తుంది. ► ఇక ఏ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం ఎంత మద్యం కొంటోందన్న విషయంలోనూ విషప్రచారమే. రాష్ట్రంలో చంద్రబాబు అనుమతిచ్చిన 20 డిస్టిలరీలుండగా... వాటిలో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లు ఇవ్వటం కూడా రామోజీరావు దృష్టిలో ‘అడ్డగోలు’ వ్యవహారమే. బాబు హయాంలో ఒకే డిస్టిలరీకి 15–20 శాతం ఆర్డర్లిచ్చినా అందులో ఎలాంటి తప్పూ కనిపించదు. ► ఇవన్నీ ఎందుకంటే... బేసిగ్గా చంద్రబాబు తప్ప వేరెవ్వరూ పదవిలో ఉండకూడదన్నది రామోజీరావు సిద్ధాంతం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వద్దనుకున్నాక రామోజీ అభీష్టంతో పనిలేదు కదా? కాకపోతే ఆ వాస్తవం రామోజీకి మూడున్నరేళ్లు గడిచినా జీర్ణం కావటంలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ కాలం మాదిరిగా తాను తలచుకుంటే ఎవరినైనా పదవిలో కూర్చోబెట్టగలనన్న అహం ఇప్పటికీ చావలేదు. విషపు రాతలతో ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని... అలా ప్రభుత్వ ఆదాయ వనరును దెబ్బతీస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలూ అమలు చేయలేని పరిస్థితిలో పడి ప్రజాభిమానాన్ని కోల్పోతుందనేది ఆయన పరమోద్దేశం. కాకపోతే ఇక్కడొక చిన్న లాజిక్ను రామోజీరావు మిస్సవుతూనే ఉన్నాడు. మద్యంపై చెప్పింది చెప్పినట్టే... రామోజీ మిస్సయిన లాజిక్కేంటంటే... అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాటకు కట్టుబడే వైఎస్సార్ లక్షణానికి అక్షరాలా వారసుడు. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తూ వెళతానని ఎన్నికలకు ముందే చెప్పారాయన. ఆ నియంత్రణలో భాగంగానే... తాను ఎన్నికల్లో గెలిస్తే మద్యం ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తానని, అమ్మకాలను తగ్గిస్తానని చెప్పారు. అన్నట్టే ధరలు పెంచటంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2018–19లో చంద్రబాబు హయాంలో 384.36 లక్షల మద్యం కేసులు విక్రయిస్తే 2021–22లో ఆ సంఖ్య ఏకంగా 277.16 లక్షలకు తగ్గింది. ఇక బీర్ల విక్రయానికొస్తే 2018– 19లో ఏకంగా 278.50 లక్షల కేసులు విక్రయించగా... 2021–22లో ఆ సంఖ్య కేవలం 82.60 లక్షలకు తగ్గిపోయింది. కాకపోతే ఇదేదీ రామోజీరావుకు కనిపించదు. బాబు హయాంలో చాలా పక్కాగా పరిమితంగా మద్యం విక్రయాలు జరిగినట్లు... ఇప్పుడేమో విచ్చలవిడిగా అమ్మేస్తున్నట్లు ఆయనకు కలలు వస్తుంటాయి. అవి ‘ఈనాడు’లో రాతల రూపంలో ప్రత్యక్షమవుతుంటాయి. ఈ చర్యలు ‘ఈనాడు’కు ఎన్నడూ కనిపించవా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను అడ్డుకోవడం అసాధ్యం కనక... ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. 4,380 మద్యం దుకాణాలను ఏకంగా 2,934కి తగ్గించడంతోపాటు విక్రయ వేళలను కుదించారు. అందుకే విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2020–21లో మద్యం విక్రయాలు 40%, బీర్ విక్రయాలు 73% తగ్గడమే ఇందుకు నిదర్శనం. కాకపోతే ఇలా తగ్గిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇంత తగ్గినా... మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టి అమ్మేస్తున్నారని చేతికొచ్చిన రాతలు రాసి అచ్చేస్తుంటుంది. బెల్టు షాపులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదని, పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి అక్రమంగా మద్యం విక్రయించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను (సెబ్) ఏర్పాటు చేసింది. సెబ్కు ఎవ్వరైనా ఫిర్యాదు చేసేలా ఆ ఫోన్ నెంబర్ను మద్యం దుకాణాల వద్ద కూడా ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన వ్యవస్థ చాలా పెద్దది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒకటో రెండో చోట్ల అనధికారికంగా విక్రయించటం జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే ఇది 1 శాతానికన్నా తక్కువే. కాకపోతే రామోజీరావు మాత్రం దీన్నే వంద శాతంగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకటో రెండో చోట్ల జరిగిన సంఘటనలను చూపిస్తూ... మొత్తం రాష్ట్రమంతటా ఇలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం మొత్తం 100 శాతం అక్రమ విక్రయాలు జరిగినా పెన్నెత్తి రాయడు. ఒక్కచోట కూడా అక్రమం జరిగినట్లు చెప్పడు. అసలు బాబు హయాంలో బెల్టు షాపుల్ని నియంత్రించడానికి గానీ, షాపుల్లో మద్యం ధరలను పెంచి విక్రయిస్తే అడ్డుకోవటానికి గానీ ఏదైనా వ్యవస్థ ఉందా? ఇప్పుడలా కాదు కదా? గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో మద్యానికి సంబంధించి ఎన్ని కేసులు బుక్ చేశారో తెలుసా? ఎందరిని అరెస్టు చేశారో తెలుసా? ఎన్ని వాహనాలను సీజ్ చేశారో తెలుసా? మరి ఇన్ని చేస్తున్నారంటే అక్రమంగా విక్రయించే వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారనే కదా అర్థం? ఈ వాస్తవాలనెందుకు రాయరు రామోజీరావు గారూ? ప్రభుత్వంపై బురద జల్లేటపుడు ఆ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని కూడా ప్రస్తావించాలి కదా? మీ పాఠకులేం పాపం చేశారు? మీ సూత్రం ఇప్పుడు వర్తించదా రామోజీ? రామోజీరావు సూత్రం ప్రకారం మద్య నిషేధాన్ని అమలు చేయటం ప్రభుత్వాలకు అసాధ్యం. నిషేధమే కాదు... మద్యాన్ని నియంత్రించటం కూడా సాధ్యం కాదు. ఎవరికి వారు మద్యం మానేయాలి తప్ప... వారి చేత మద్యం మాన్పించటం ప్రభుత్వాలతో అయ్యే పనికాదు. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచీ రామోజీరావు ఈ సూత్రానికే కట్టుబడ్డారు. 2004లో దిగిపోయి... మళ్లీ చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే వైఖరి. అందుకే బెల్టు షాపుల జోలికి వెళ్లలేదు. మద్యం దుకాణాలన్నీ ప్రయివేటు మాఫియా చేజిక్కించుకుని ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్నా పెన్నెత్తలేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే ఎమ్మార్పీ ధరలకు ఖచ్చితంగా కట్టుబడి విక్రయిస్తున్నా... బెల్టు షాపుల్ని నామరూపాల్లేకుండా చేసినా ఆయనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒకటీ రెండు చోట్ల చిన్న దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారని, దీన్ని ప్రభుత్వం నియంత్రించటం లేదు కాబట్టి... రాష్ట్రమంతటా ‘3 పెగ్గులు– 6 గ్లాసుల’ మాదిరి ఉందని బురద జల్లేశారు. మరి రామోజీ లాజిక్ ప్రకారమే చూసుకుంటే వీటిని ప్రభుత్వమెలా నియంత్రిస్తుందని ఆయన అనుకోవాలి కదా? ఎవరికి వారు మద్యం మానాలి తప్ప ప్రభుత్వం వారిచేత ఎలా మాన్పిస్తుందని చెప్పింది ఆయనే కదా? కాకపోతే ఈ ప్రభుత్వ వైఖరి చంద్రబాబులా లేదు. కఠినంగా నియంత్రించడానికే ఎస్ఈబీని ఏర్పాటు చేసింది. ఎస్ఈబీ దాడులు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిగో... ఇప్పుడు ‘ఈనాడు’ రాసిన వ్యవహారంపై కూడా కచ్చితంగా ఎస్ఈబీ తనిఖీలు చేసి తన బాధ్యత తాను నిర్వహిస్తుంది. కాకపోతే ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ దుర్మార్గపు రాతలు రాయటమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ‘‘బాబు కళ్లలో సంతోషం కోసం’’ అన్న రీతిలో టైమ్ టేబుల్ పెట్టుకుని మరీ ప్రతి పక్షం రోజులకోసారి ఇలా మద్యంపై విషపు రాతలు రాస్తున్న రామోజీకి... ఇది ‘ఈనాడు’ చెబితే నమ్మేసే కాలం కాదని అర్థమయ్యేదెప్పుడో..? -
ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!!
గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. అంతేకాదు!! రోడ్లు బాగులేకుంటే పట్టించుకోవటం లేదంటూ అరుపులు. బాగు చేస్తుంటే అప్పులు తెచ్చేస్తున్నారంటూ పెడబొబ్బలు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నా... ఉద్యోగాల కల్పన పెరుగుతున్నా కూడా అవేమీ పట్టనట్లుగా అభివృద్ధి లేదని, వెనకబడిపోయామని దుష్ప్రచారం. ఇవన్నీ పది తలల రామోజీరావులోని రంగులు. ఆయన పుత్రిక ‘ఈనాడు’లో రోజూ పేజీల కొద్దీ పరిచే వార్తలు. పోనీ రామోజీలో ఇన్ని భావావేషాలు అన్నివేళలా ఉంటాయా అంటే.. ఆ ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు అధికారంలో ఉంటేనే ఈ వేషాలన్నీ బయటకు వస్తాయి. బాబు అధికారంలో ఉంటే ఐదేళ్లూ రోడ్లేయకపోయినా... రోడ్లేయటానికి ఉన్న ఇబ్బందులే రామోజీకి కనిపిస్తాయి. ఇసుక ఉచితమంటూ ఎమ్మెల్యేలు మాఫియా డాన్లలా మారి అమ్మేసినా అదంతా ఆయన దృష్టిలో జనహితమే. బెల్టు షాపులు పెట్టి మద్యం ఊరూరా పారించినా... ఆ తప్పు తాగేవాళ్లదే తప్ప బాబుది కాదు. టీకొట్టు నడిపేవాళ్లని దావోస్ తీసుకెళ్లి.. వాళ్లకి కోట్లు తొడిగి ఎంఓయూలు చేసుకుంటే... వాళ్లంతా రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే పారిశ్రామికవేత్తలే. ఇంతెందుకు!! బాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా... అది చారిత్రక అవసరమే. బాబు ఏం చేసినా... అది దేశ ప్రయోజనాల కోసమే. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఇలాంటి దగుల్బాజీ రాతలు రాసేవాళ్లు ఆశిస్తున్నది ఒక్కటే. ఈ ప్రభుత్వానికి జనాదరణ తగ్గటం లేదు. కాబట్టి దీన్ని ఏ పనీ చేయకుండా కట్టడి చేయాలి. రాష్ట్రంలో కరెంటు, రోడ్లు, నీళ్లు ఏవీ లేవని విపరీతంగా దుష్ప్రచారం చెయ్యాలి. నిరుపేదల సంక్షేమాన్ని నిలిపేసేలా చెయ్యాలి. ఆదాయం తగ్గినా... అప్పులు మాత్రం తేనివ్వకూడదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణ తగ్గిపోవాలి. తామెన్ని చేసినా ఆయనే గెలుస్తాడు కనక ప్రతిపక్షాలన్నీ కలిసిపోవాలి. లేకపోతే తామే కలిపేయాలి. ఏ మార్గంలో అయినా... ఎవరి సాయంతో అయినా అర్జెంటుగా చంద్రబాబును కుర్చీ ఎక్కించేయాలి. ‘ఈనాడు’ చూసేవారికి ఎవరికైనా అర్థమయ్యేది ఇదే!!. ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరులు తక్కువే. పన్నుల్లో అధికభాగం వచ్చేది మద్యం.. పెట్రోలు నుంచే. పెట్రోల్లో కేంద్రానిదే సింహభాగం. వీటితో పాటు రుణాలు, గ్రాంట్లు ఇతరత్రా ఆదాయంపైనే ఏ రాష్ట్ర బడ్జెట్టయినా నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదీ ఈ నిధులతోనే. అలాంటిది రాష్ట్రం ఒక వంక మద్య నియంత్రణకు కట్టుబడి షాపులు తగ్గించి.. బెల్టు షాపులు తీసేసి... అమ్మకాలను తగ్గిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు కెళుతుంటే ఈ రాతలేంటి రామోజీ? రాష్ట్రానికి ఆదాయం వస్తే తప్పా? చంద్రబాబు హయాంలో ఏటేటా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతూ పోయినా మీ పెన్నులోంచి ఒక్క అక్షరమూ రాలి పడలేదెందుకు? 7.81 కాంపౌండెడ్ వృద్ధితో 2015–16లో 306 లక్షల కేసులుగా ఉన్న మద్యం విక్రయాలు 2018–19లో బాబు దిగిపోయే నాటికి ఏకంగా 384 లక్షల కేసులకు చేరాయి. మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపి... తన ఫిలింసిటీలో క్యాబరేలకూ ఓకే చేసిన ఉద్యమనేత రామోజీ బీరు విక్రయాలైతే 168 లక్షల కేసుల నుంచి ఏకంగా 227 లక్షలకు చేరాయి. నిజానికి అదే వృద్ధి నేటికీ కొనసాగితే 2021–22లో 481 లక్షల మద్యం కేసులు విక్రయించి ఉండాలి. కానీ వాస్తవంగా 266 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దీన్నిబట్టే ప్రభుత్వం మద్య నియంత్రణకు ఏ స్థాయి కృషి చేస్తోందన్నది అర్థమవుతుంది. అంకెలు చెబుతున్న ఈ వాస్తవాలను కూడా రామోజీరావు పరిగణనలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఎంత దారుణమైన వార్తలు రాసయినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచటమే ఆయన ధ్యేయం. తనవాడైన చంద్రబాబును మళ్లీ పీఠంపై చూడాలన్నది ఆయన కల. జనం గుండెల్లో నిలిచి...ఎందరినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న వైఎస్ జగన్ తన వాడు కాదు మరి!!. అదే అసలు తేడా. పకడ్బందీ దుష్ప్రచారపు వ్యూహం ‘ఈనాడు’ సహా ఎల్లో పత్రికల్లో మొదట పతాక శీర్షికల్లో వేస్తారు. తరవాత ఆ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు రకరకాలుగా మీడియాతో మాట్లాడతారు. అవన్నీ మళ్లీ ఆ మీడియా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తుంది. వీటిని మళ్లీ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్లనూ మీడియాలో సందర్భాన్ని బట్టి వేస్తారు. ఇదీ... నచ్చని ప్రభుత్వాలపై దుష్ప్రచారానికి ఎల్లో మీడియా చేసే పకడ్బందీ దుష్ప్రచార ప్రణాళిక. ఇప్పుడీ ప్రణాళికలో సీబీఎన్ దత్తపుత్రుడు కూడా చేరిపోయాడు. ‘ఈనాడు’ వార్తకు తన వెటకారపు పైత్యాన్ని జోడించి చెలరేగిపోయాడు. పథకం ప్రకారం దాన్ని మళ్లీ ‘ఈనాడు’ తన వెబ్సైట్లో పెట్టేసింది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ ఎల్లో జర్నలిజం? పత్రిక పేరిట రాజకీయాలెందుకు? నేరుగా రాజకీయాల్లో చేరిపోవచ్చుగా? ‘మత్తు’ ఎవరిది రామోజీరావు గారూ? ఇక స్వయంగా రామోజీ విషయానికొస్తే... ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధ ఉద్యమానికి సారథి. పోటీగా వచ్చిన ‘ఉదయం’ పత్రిక ఆర్థిక మూలాలు మద్యం డబ్బులోనే ఉన్నాయని భావించి... అందరినీ ఎగదోసి ఉద్యమాన్ని నడిపిన ‘నాయకుడు’. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి... చంద్రబాబును ఎక్కించాక... నిషేధానికి తూట్లు పొడిచిన మహా పత్రికావ్రతుడు. ఇక ఇప్పుడు నేరుగా తన పేరిట పెట్టుకున్న ఫిలింసిటీలో మద్య ప్రవాహాన్ని పారిస్తూ... క్యాబరేలు, అర్థనగ్న నృత్యాలక్కూడా తెరలు తీసిన ఫక్తు వ్యాపారి. మరి ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ చరిత్ర తెలియనిదెవరికి? ఇదే చంద్రబాబు అయ్యుంటేనా...!! ఆదివారం ‘ఈనాడు’ అచ్చేసిన రామోజీ ‘మత్తు’ వార్తలో ప్రధానంగా పేర్కొన్న విషయం ఒక్కటే. ఇప్పుడున్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చాలా ఎక్కువ వడ్డీకి రుణం తెచ్చేసిందని, అది మున్ముందు భారమైపోతుందని!!. నిజానికి ఏ ప్రభుత్వమైనా నేరుగా తను జారీ చేసే రాష్ట్రాభివృద్ధి బాండ్లపై తక్కువ వడ్డీయే చెల్లిస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లపై మాత్రం కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు 8.03 శాతం వడ్డీ చెల్లిస్తుండగా బెవరేజెస్ కార్పొరేషన్ మాత్రం 9.32 శాతం వడ్డీతో బాండ్లు జారీ చేసింది. నిజానికిపుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి అనిశ్చితి రాజ్యమేలుతోంది. గతనెల దేశంలో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరగా... గ్రామాల్లో ఈ రేటు 8.38 శాతంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఇదే రికార్డు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరటంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది. మన ఆర్బీఐ ఇదే బాటలో నడవగా... యూరోపియన్ సెంట్రల్ బ్యాంకూ ఈ ది«శగానే వెళుతోంది. ఇలాంటి సమయంలో 9.32 శాతం వడ్డీ అంటే చాలా తక్కువకిందే లెక్క. ఇదే గనక చంద్రబాబు చేసి ఉంటే రామోజీ మంగళహారతులు పట్టి మరీ పతాక శీర్షికల్లో బాబు గొప్పతనాన్ని, చాణక్యాన్ని కుమ్మేసేవారు. కానీ ముఖ్యమంత్రి జగన్ కనక ఈ అప్పు తేవటమే నేరమన్న తీరులో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ హయాంలో... అబ్బో!! టీడీపీ హయాంలో ఏపీసీఆర్డీఏ బాండ్లు జారీ చేసి రూ.2,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో రాష్ట్రాభివృద్ధి రుణాలకు ప్రభుత్వం 8.42 శాతం చెల్లిస్తుండగా... సీఆర్డీఏ 10.32 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేసింది. రూ.1,300 కోట్ల మేర జారీ చేయగా రూ.2,000 కోట్లకు (1.5 రెట్లు) బిడ్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును, ఆయనపై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని వర్ణిస్తూ ‘ఈనాడు’ ఆకాశానికి ఎత్తేసింది. బాబు ముంబయి వెళ్లి తన సక్సెస్పై ఇంటర్వ్యూలిచ్చారు. కానీ ఇపుడు తక్కువ వడ్డీకి బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లకు ఏకంగా 4.5 రెట్ల స్పందన వచ్చింది. అయినా దీన్ని వ్యతిరేక కోణంలో చూస్తూ దుష్ప్రచారానికి పూనుకున్నారు రామోజీ జర్నలిజాన్ని ఏమనుకోవాలన్నది జనం విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అంశం. ప్రభుత్వ సంస్థలు అప్పులు తెస్తే తప్పా? ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తేవటం నేరమన్నట్లు, అదేదో ఘోరమన్నట్లు రామోజీరావు గుండెలు బాదేసుకున్నారు. నిజానికి ప్రభుత్వ గ్యారెంటీతో ప్రభుత్వ పీఎస్యూలు అప్పులు తేవటమన్నది చంద్రబాబు హయాంలో బీభత్సంగా జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర పీఎస్యూలకు రూ.14,028 కోట్ల అప్పులు రాగా... వాటిని చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.59,250 కోట్లకు తీసుకెళ్లిపోయారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెంచేశారు. అయినా రామోజీకి ఎన్నడూ ఇది కనిపించకపోవటమే చిత్రాతిచిత్రం. మద్యం తగ్గటం కనిపించటం లేదా? మద్యాన్ని దశలవారీగా తగ్గించి, నియంత్రిస్తామని ఎన్నికలకు ముందే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా దానికే కట్టుబడి... దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏకంగా 40 శాతం తగ్గించేశారు. బాబు హయాంలో ఏకంగా 4,300 మద్యం దుకాణాలుండగా... వాటి సంఖ్యను 2,934కు పరిమితం చేశారు. మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. దీనికితోడూ చంద్రబాబు ఊరూరా ప్రోత్సహించిన దాదాపు 43,000 బెల్టు షాపుల ఉనికే లేకుండా చేశారు. ఫలితంగా మద్యం వినియోగం రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. జనం దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో ముందు చెప్పినట్లే కొన్నింటిపై రేట్లు పెంచారు. ఇవన్నీ నచ్చని రామోజీరావు తన దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. వైఎస్సార్ నోరు పారేసుకున్నారు.. చంద్రబాబు క్లాస్ పీకారు... చంద్రబాబు, ఇతర నాయకుల విషయంలో రామోజీ రాసే వార్తల్లో ఎంత ‘విష’యం ఉంటుందన్నది ఈ చిన్న వార్తను చూస్తే తెలుస్తుంది. 2008 జూన్ 19న ఒకే రోజు అటు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు నిర్వహించారు. అందులో కొందరు విలేకరుల తీరుపై ఇద్దరూ అసహనం వ్యక్తం చేశారు. కానీ దానిపై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తలకు శీర్షికలేంటో తెలుసా? ఒకదానికేమో ‘మీడియాపై నోరు పారేసుకున్న వైఎస్’. మరోదానికేమో ‘మీడియాకు క్లాస్ పీకిన చంద్రబాబు’. అదీ కథ. ‘ఈనాడు’ జర్నలిజం గురించి, రామోజీ నీతినియమాల గురించి చెప్పటానికి ఇదొక్కటి చాలేమో. అదే విషయాన్ని ఆ మర్నాడు నాటి సీఎల్పీ ఎండగట్టింది. -
అక్కడ ఎనీ టైం మందు.. ఫుల్ కిక్కే కిక్కు..!
సాక్షి,ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుమూల గిరిజన తండాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ సమయంలోనైన(ఏనీటైం) మద్యం బాటిళ్లు దొరకడంతో మందుబాబులు తెల్లవారు జాము నుంచే మత్తులో తూగుతున్నారు. అర్ధరాత్రి గడిచిన గ్రామాల్లో బెల్డ్షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తండాలు, గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో 18 గ్రామాలుండగా, 25 బెల్టుషాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. హోటళ్లు, బార్లను తలపిస్తున్నాయి. చీప్లిక్కర్తో మొదలుకొని అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి అందుబాటులో మద్యం వీర్నపల్లి మండలంలోని తండాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లో ఎప్పుడైనా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాలను రాత్రి పదిన్నర గంటలకే మూసివేస్తుండగా, ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. డోర్ డెలీవరీ పద్ధతిలోనూ మద్యం విక్రయాలు సాగడం మరో విశేషం. ఒకప్పుడు నాటుసారా, గంజాయి మత్తులో తూగిన పల్లెలు.. ఇప్పుడు మద్యం కిక్కులో ఉంటున్నాయి. చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. దొంగచాటుగా మద్యం విక్రయాలు, హోటళ్లలో సిట్టింగులు పెట్టిన చట్టరీత్యనేరం. దాడులు చేసి బెల్టుషాపులను గుర్తించి మూసివేస్తాం. – ఎంపీఆర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ,ఎల్లారెడ్డిపేట -
తగ్గిన మద్యం వినియోగం
కావలి: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 27 నెలలుగా అమలు చేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ కారణంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని సెబ్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా, ప్రభుత్వం 33 శాతం మేర దుకాణాల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం 2,975 దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు లాభాపేక్షతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించగా.. ప్రస్తుత ప్రభుత్వం దశల వారీ నియంత్రణకు దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్రెడ్డి, సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ‘మందు’ ప్రశాంతత!
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మూలపాడు, త్రిలోచనపురం జంట గ్రామాల జనాభా దాదాపు 7 వేలు. సమీపంలోని కేతనపల్లిలో మరో 5 వేల జనాభా ఉంది. రెండేళ్ల క్రితం వరకు మూలపాడులో ఓ మద్యం దుకాణం ఉండేది. సాయంత్రం 4 గంటలు అయితే చాలు పరిస్థితి అదుపు తప్పేది. గొడవలు, కొట్లాటలు నిత్యకృత్యం. దీనికి అనుబంధంగా నాలుగైదు బెల్ట్ దుకాణాలు ఉండేవి. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఏర్పాటైన మద్యం దుకాణం పక్క నుంచి నడవాలంటే మహిళలు హడలిపోయేవారు. శుభకార్యాలు జరిగినా మనశ్శాంతి ఉండేది కాదు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీ మద్య నియంత్రణలో భాగంగామూలపాడులోని మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మూడు గ్రామాల్లో పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు సాయంత్రం వేళ ఏ గొడవలు, కొట్లాటలూ లేవు. అల్లరిమూకల ఆగడాలు లేవు. మహిళలు ధైర్యంగా రోడ్డుపై నడవగలుగుతున్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మద్యపానాన్ని నిరుత్సాహ పరచడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానం రాష్ట్రంలోని పల్లెల్లో తెచ్చిన సానుకూల మార్పులు ఇవీ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను తొలగించారు. దీంతో ప్రతి పల్లెలో మళ్లీ ప్రశాంత వాతావరణం పరిఢవిల్లుతోంది. బెల్ట్ దుకాణాల రద్దు... మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపు... మద్యం షాపుల వేళల కుదింపు... షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంపు... ఇలా మద్యం విక్రయాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రెండేళ్లలో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. దశలవారీగా కట్టడి ఇలా.. ► రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగుగా బెల్ట్ దుకాణాలను తొలగించింది. టీడీపీ హయాంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాల వ్యవస్థ కొనసాగింది. ఎటుచూసినా మద్యం లభ్యం కావడంతో విచ్చలవిడిగా విక్రయాలు సాగాయి. పాన్ షాపులు, కాకా హోటళ్లు కూడా బెల్ట్ దుకాణాలుగా రూపాంతరం చెందాయి. గ్రామాల్లో మద్యం ఏరులైపారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను పూర్తిగా నిర్మూలించింది. ► రెండో అడుగుగా టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించే విధానాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రైవేట్ వ్యక్తులైతే ధనార్జనే లక్ష్యంగా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తారు. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాల కేటాయింపు విధానాన్ని తొలగించి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు లేకుండా చేసింది. ► మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా తగ్గిస్తోంది. 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా రెండేళ్లలో ప్రభుత్వం 1,433 దుకాణాలను తగ్గించింది. 2019–20లో 836 దుకాణాలు, 2020–21లో 597 దుకాణాలను రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. అంటే రెండేళ్లలో 33 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం రద్దు చేసింది. ► మద్యం దుకాణాల వేళలను కూడా ప్రభుత్వం కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది. రెండేళ్లలో గణనీయంగా తగ్గిన విక్రయాలు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తోంది. దశలవారీగా మద్య నియంత్రణ కోసం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్రంలో రెండేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. 2019 మేతో పోలిస్తే 2021 ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గగా బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం పడిపోవడం గమనార్హం. 40 శాతం పడిపోయిన లిక్కర్ అమ్మకాలు రాష్ట్రంలో లిక్కర్(ఐఎంఎల్) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు 3,12,43,860 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు 1,88,81,430 లిక్కర్ కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఇక 2020 అక్టోబర్ నుంచి 2021 జూలై ఆఖరు వరకు 1,72,33,528 లిక్కర్ కేసులు విక్రయించారు. అంటే లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గాయి. బీరు అమ్మకాలు 78 శాతం డౌన్ రాష్ట్రంలో బీరు విక్రయాలు భారీగా తగ్గాయి. 2018 అక్టోబరు నుంచి 2019 సెప్టెంబరు వరకు 2,44,07,717 బీరు కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు కేవలం 52,26,185 బీరు కేసులు మాత్రమే విక్రయించడం గమనార్హం. 2020 అక్టోబరు నుంచి 2021 జూలై 31 నాటికి 52,00,915 బీరు కేసులే విక్రయించారు. రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి. అశాంతి నుంచి శాంతివైపు మాది మత్స్యకార గ్రామం. రెండేళ్ల క్రితం వరకు మద్యం దుకాణం ఉండేది. సాయంత్రమైతే చాలు మందుబాబుల అరుపులు, కేకలు, గొడవలతో భయం వేసేది. ఆడవాళ్లు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయేవారు. చీకటి పడితే ఇతర ప్రాంతాల నుంచి మా ఊరికి రావడానికి జంకేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మా ఊరిలో శాంతి నెలకొంది. కాయకష్టం చేసుకునే వాళ్లు పొదుపు చేయడం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోంది. – పినపోతు దుర్గ, పీబీవీపాలెం, కోరంగి, తూర్పు గోదావరి జిల్లా ఊర్లో ప్రశాంతత.. సాయంత్రమైతే చాలు మా ఊరిలో మద్యం మత్తులో గొడవలు, కొట్లాటలు జరిగేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం దుకాణాన్ని తొలగించడంతో ప్రశాంతంగా ఉంది. సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఆడవాళ్లు ధైర్యంగా గ్రామంలోకి రాగలుగుతున్నారు. – దేవరకొండ నాగరాణి, మూలపాడు, కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి మద్యం మత్తులో ఈ ప్రాంతంలో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం మద్యం దుకాణం తొలగించడంతో మా గ్రామంలో రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. – గొట్టిముక్కల పోతురాజు, మూలపాడు, కృష్ణా జిల్లా. బెల్టు రద్దుతో మనశ్శాంతి టీడీపీ హయాంలో మా ఊర్లో నాలుగు బెల్టు దుకాణాలు ఉండేవి. సాయంత్రమైతే చాలు మందుబాబుల చిందులతో బయటకు రావాలంటేనే భయపడేవాళ్లం. రెండేళ్ల క్రితం బెల్టు దుకాణాలను తొలగించడంతో ఊరు ప్రశాంతంగా ఉంది. కుటుంబాల్లో మనశ్శాంతి నెలకొంది. – బండి వెంకటలక్ష్మి, కె సముద్రపుగట్టు, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా పేద కుటుంబాలు బాగుపడుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో మా గ్రామంలో మద్యం దుకాణం ఉండేది. ఎంతోమంది మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యం పాడుచేసుకోవడంతో పాటు కష్టార్జితాన్ని మద్యం దుకాణాలకే ధారపోసేవారు. ఇప్పుడు మద్యం దుకాణాన్ని తొలగించారు. ఊర్లో మందు దొరకడంలేదు. మద్యం ధరలు కూడా బాగా పెంచడం మంచిదైంది. పేదలు మరో ఊరు వెళ్లి అంత డబ్బు పెట్టి కొనేందుకు సాహసించడం లేదు. దీంతో కుటుంబాలు బాగు పడ్డాయి. – సాకే గౌతమి, సర్పంచ్, సనప గ్రామం, అనంతపురం జిల్లా -
సీఎం జగన్ ఆదేశంతో 108 కోట్లు మిగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం 108 కోట్ల రూపాయలు ఆదా చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో మద్యం షాపులు రెంట్కు తీసుకున్నామని, ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఆయన మద్యం షాపులపై రివర్స్ టెండరింగ్ వేయాలని ఆదేశించారన్నారు. సీఎం జగన్ ఆదేశం మేరకు మద్యం దుకాణాలపై రివర్స్ టెండరింగ్ వేశామన్నారు. (చదవండి: డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు) ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బెల్టు షాపుల రెంట్పై దాదాపు 108 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలాయని వెల్లడించారు. 2019-20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించామని చెప్పారు. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21 ఏడాది కేవలం 562.2 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని తెలిపారు. అంటే దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామన్నారు. అంతేగాక మద్యపానం తగ్గించడం వల్ల రాష్ట్రంలో నేరాలు ప్రమాదాలు బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు) -
తూలేవాడిని నిలబెట్టింది!
సాక్షి కడప: మందుబాబులకు మద్యం బరువుగా, భారంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతోంది. అక్క చెల్లెమ్మల జీవితాల్లో కష్టాలు తొలగి వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం కఠినంగా మద్య నియంత్రణ చర్యలను అమలు చేస్తుండటంతో మార్పు కళ్ల ముందే కనిపిస్తోంది. టీడీపీ హయాంలో వైఎస్సార్ జిల్లాలో 1,200కిపైగా బెల్ట్ షాపులు ఉండగా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్మూలించింది. ఇక టీడీపీ హయాంలో జిల్లాలో 255 మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 173కి కుదించారు. ధరలు భారీగా పెంచడం, విక్రయ వేళలను తగ్గించడం, దుకాణాల కుదింపుతో చాలామంది మద్యానికి దూరంగా ఉంటున్నారు. సాధారణంగా అయితే ఆపను.. ‘నాకు 15 ఏళ్లుగా మద్యం అలవాటు ఉంది. రోజూ తాగనిదే నిద్ర పట్టేది కాదు. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటిసారి మద్యం ధరలు పెంచినప్పుడు గతేడాదే మానేద్దామనుకున్నా. ఇటీవల మరోసారి రేట్లు పెంచడంతో అనవసరంగా డబ్బులు తగలేయడం తప్ప ఒరిగేదేమీ లేదని పూర్తిగా మానేశా. ఇక ఎప్పుడూ మద్యాన్ని ముట్టను. సాధారణంగా అయితే మద్యాన్ని మానుకునేవాడిని కాదు. సీఎం జగన్ సార్కు కృతజ్ఞతలు’ – ఎస్.సిరాజ్ఖాన్ (జమాల్పల్లె, సీకే దిన్నె మండలం, కమలాపురం నియోజకవర్గం) ఎక్కడబడితే అక్కడ పడేవాడ్ని.. ‘కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తా. నాకు పదేళ్లకు పైగా మద్యం అలవాటు ఉంది. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగేవాడిని. తాగిన మత్తులో ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. పిల్లల ఛీత్కారా లతోపాటు మద్యం ధరలు పెరగడంతో తాగుడంటే విరక్తి చెంది మారిపోయా. నాలుగు నెలలుగా మందు జోలికి వెళ్లడం లేదు. కలహాలు లేకుండా కుటుంబంతో ఆనందంగా ఉన్నా. మద్యానికి వెచ్చించే డబ్బులతో పిల్లలకు పండ్లు, చిరుతిండ్లు తెచ్చి ఇస్తున్నా. వారి కళ్లల్లో ఆనందం చూసి ఇక జీవితంలో తాగకూడదని నిర్ణయిం చుకున్నా. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు’ – ఎస్.హరిబాబు (కడప) సానా వరకు తాగటం తగ్గింది... ‘రాజంపేట సబ్స్టేషన్లో వాచ్మన్గా పనిచేస్తున్నా. కూలి పనులకు కూడా వెళతా. రాత్రి మందు పడితేగానీ పొద్దున పనికి వెళ్లేవాడిని కాదు. కరోనా కారణంగా దాదాపు రెండు నెðలలు మందు దొరక లేదు. మళ్లీ షాపులు తెరిచాక రెండు రోజులు తాగా. గతంలో రూ.200–250 మాత్రమే అయ్యే మద్యం ఖర్చు ఇప్పుడు రూ.600 వరకు అవుతోంది. లాక్డౌన్ లో మందు లేకుండా ఉండగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండలేననే పట్టుదలతో మందు మానేశా. పనులు లేనప్పుడు ఇంటివద్దే మనవళ్లు, మనవరాళ్లను ఆడిస్తూ సంతోషంగా ఉన్నా. మా ఊళ్లో మందు తాగే టోళ్లంతా సానా వరకు తాగడం తగ్గించినారు. సీఎం జగన్ మంచి పనే చేశారు. మిగతా షాపులు కూడా ఎత్తేస్తే అందరికి నాలుగు డబ్బులు మిగులుతాయి’ – గొంటు సుబ్బన్న (కొమ్మివారిపల్లె, రాజంపేట మండలం) మత్తు వదిలింది...! ‘భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.500 దాకా సంపాదిస్తా. భార్యతోపాటు ఇద్దరు కుమారులున్నారు. మద్యం మత్తుతో ఒళ్లు నొప్పులు తెలియవని దీర్ఘకాలంగా తాగుడు వ్యసనానికి బానిసనయ్యా. నిత్యం రూ.150 వరకు తాగుడుకు ఖర్చయ్యేది. లాక్డౌన్ వల్ల చాలా రోజులు మద్యానికి దూరమయ్యా. ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో తాగుడు మానుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంది. అంతా కలసి భోజనం చేయడం, పిల్లలతో గడపడం ఆనందాన్ని ఇస్తోంది. మద్యం మత్తు నుంచి బయటపడటం చాలా సంతోషంగా ఉంది’ – మద్దెల సుధాకర్ (సిద్దవటం, రాజంపేట నియోజకవర్గం) -
30 ఏళ్ల వ్యసనం పోయింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశలవారీ మద్య నియంత్రణ చర్యలతో దశాబ్దాలుగా తాగుడుకు బానిసలైన వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 475 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే గతేడాది వంద షాపులను తగ్గించింది. ఈ ఏడాది మరికొన్ని దుకాణాలను తగ్గించడంతో ప్రస్తుతం 318 మద్యం షాపులే మిగిలాయి. గతంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుసంధానంగా నాలుగైదు బెల్టు షాపులుండేవి. రాష్ట్ర ప్రభుత్వం 2 వేలకుపైగా బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించడంతో ప్రశాంతత నెలకొంది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు కూడా భారీగా తగ్గాయి. షాక్ కొట్టేలా ధరలను పెంచడంతో పలువురు తాగుడును విడనాడి కుటుంబంతో కలసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యంతోపాటు వ్యాపారమూ బాగుంది. తొమ్మిదేళ్లుగా గ్రామంలో బిర్యానీ వ్యాపారం చేస్తున్నా. రోజూ సంపాదనలో ఎక్కువ భాగం మందుకే ఖర్చు చేసేవాడిని. ధరలు పెరగడంతో ఎనిమిది నెలలుగా తాగడం మానేశా. ఆరోగ్యం బాగుపడటంతోపాటు వ్యాపారం కూడా పెరిగింది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నా. ముఖ్యమంత్రి నిర్ణయంతో చాలా మంది మద్యానికి దూరం అవుతున్నారు. – తుంగతుర్తి వెంకటరాజు, సీహెచ్ పోతేపల్లి, ద్వారకా తిరుమల మండలం మందుతోనే ముఖం కడిగా.. నిరుపేద కుటుంబంలో జన్మించా. చదువు అబ్బలేదు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బంతా తాగుడుకే తగలేసేవాడిని. మందుతోనే ముఖం కడిగి మందుతోనే నిద్రపోయేవాడిని. పెళ్లి అయినా నేను మారలేదు. ఈ హింస భరించలేక పిల్లల భవిష్యత్తు కోసం నా భార్య కువైట్ వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లల్ని నానమ్మ, తాత వద్ద ఉంచి మళ్లీ మందులోనే మునిగిపోయా. జగనన్న మద్యాన్ని నియంత్రిస్తానంటే మా కడుపు కొడుతున్నాడని తిట్టుకున్నా. అంచెలంచెలుగా ధరలు పెంచి విక్రయాలను కట్టడి చేయడంతో తాగుడు పూర్తిగా మానేశా. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలతో గడుపుతున్నా. –పుచ్చకాయల సత్యానందం, పాలకోడేరు మండలం ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా.. నాకు 30 ఏళ్లుగా తాగుడు అలవాటు ఉంది. కూలి పనులు ఉన్నా లేకున్నా ప్రతి రోజూ తాగేవాడిని. ఏడాదిగా మద్యం రేట్లు విపరీతంగా పెరగడంతో తాగుడు మానుకున్నా. ఆ డబ్బును ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా. – ఎంవీవీ సుబ్బారావు గోపాలపురం -
మందు బాబులను ఆగమాగం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి. ఏదో ఒకటి నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్చల్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నిద్రలేవగానే గొంతులో మందు చుక్క పడనిదే అడుగు ముందుకు వేయని మందుబాబులు...లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. లాక్డౌన్తో మద్యం దుకాణాలను సైతం బంద్ చేశారు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో ఉంటున్న మధు అనే పెయింటర్ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్డౌన్తో కిక్కు కరువై కరోనా వైరస్ (కోవిడ్–19) మందు బాబులను ఆగమాగం చేస్తోంది. లాక్డౌన్తో బార్లు, మద్యం దుకాణాలు కూడా మూత పడడంతో మద్యం కోసం నానాయాతనలు పడుతున్నారు. అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. కేవలం 24 గంటలపాటే జనతా కర్ఫ్యూ ఉంటుందని భావించిన మందుబాబులు.. మద్యం కొనుగోళ్లపై ముందుచూపు ప్రదర్శించలేదు. రాత్రికి రాత్రే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ ప్రకటించడంతో బిత్తరపోయారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) చేసేదేమీలేక వైన్స్షాపులు, బెల్టు షాపుల్లో ఉన్నవాటిని గుట్టుగా కొని గుటకేసినా.. అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో దేశీ మద్యం వైపు చూస్తున్నారు. దేశీ మద్యం అంటే అదేంటో అనుకుంటున్నారా? అదేనండీ గుడుంబా, నాటుసారా. ఆఖరికి కల్లు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. (అగ్రరాజ్యం అతలాకుతలం) తాటివనాల్లో మందు..విందు! ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్డౌన్ పుణ్యామా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం... దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క..చికెన్ ముక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ... వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్గల్లిలో భూషణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్డౌన్ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. వైన్ షాపులో చోరీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్లో ఆగంతకులు షాపు షట్టర్స్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు. -
బెల్ట్ షాపుల వెనుక టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు
-
బెల్టు షాపులు మూసేస్తే నగదు బహుమతి
-
బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అనధికార సూచనలు! ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్ అధికారులు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది. మాకు టార్గెట్ ఉంది మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్ నిర్ణయించారు. లైసెన్స్డ్ వ్యాపారులు ఐఎంఎల్ డిపోల నుంచి టార్గెట్ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే. – శేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మోర్తాడ్ -
మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కెరమెరిలో మండలంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై ఆదివాసీ మహిళలు బుధవారం దాడి చేశారు. బెల్టు షాపు నిర్వహించవద్దని గతంలోనే మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా తీరు మారకపోవడంతో ఆగ్రహించిన మహిళలు నిర్వాహకుడిని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గిరిజన సంఘాల తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వైన్షాపులకు అధికారులు టెండర్లు పిలవలేదు. దీంతో ఏజెన్సీలో వైన్షాపులు లేవు, మద్యం అమ్మకాలు లేవు. బెల్టుషాపులు కూడా ఉండొద్దంటూ ఆదివాసీ మహిళలు ఊరూరా తిరిగి షాపులలో ఉన్న మద్యం సీసాలను అప్పుడే ధ్వంసం చేశారు. సంఘాల తీర్మానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే పది వేల రూపాయల జరిమానాతో పాటు దుకాణాల మీద దాడులు తప్పవని గతంలోనే హెచ్చరించారు. -
మందు.. మేమే అందిస్తాం..!
సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం. ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..! గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్ వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లోని వైన్స్ వ్యాపారులు నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి.. మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిల్పై రూ.30 అధికం గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్ బాటిల్ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. -
బెల్ట్ షాపులపై మహిళల దాడి
సాక్షి, వేంసూరు(ఖమ్మం) : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని అనేకసార్లు ఎక్సెజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామంలోని మహిళలందరూఏకమై బెల్ట్ షాపును తొలగించారు. మండల పరిధిలోని జయలక్ష్మీపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్షాపులపై సోమవారం మహిళలు దాడులు నిర్వహించారు. మద్యంసీసాలను ధ్వంసం చేశారు. బెల్ట్ షాపులు తొలగించాలని నినాదాలు చేస్తూ సోమవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. జయలక్ష్మీపురం పంచాయతీ ఆంధ్రా సరిహద్దులో ఉందని, అక్కడ మద్యపాన నిషేధం అమలు కావడంతో, గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు కిరాణా షాపునకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం వల్ల యువత పెడదోవ పట్టడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా బెల్ట్ షాపులను పూర్తి తొలగించాలని కోరారు. -
బెల్టు తీయాల్సిందే!
‘కంచె.. చేను మేసిన రీతి’గా.. జిల్లాలో కొందరు ఆబ్కారీ అధికారుల అండదండలతో అడ్డగోలుగా బెల్ట్ షాపులను నడుపుతున్నారు. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా.. వీరికి మాత్రం అవి వర్తించవన్నట్లుగా ఈ తతంగం సాగుతుంది. దీంతో గ్రామాలు మద్యం మత్తులో జోగుతున్నాయి. ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్లు కట్టబెట్టడంతో కొత్తగా బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసుకునే పని ఊపందుకుంది. సాక్షి, మహబూబ్నగర్ : నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో మొత్తం 67 మద్యం దుకాణాలున్నాయి. ఇటీవల వీటన్నింటికి కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. మరో రెండేళ్ల పాటు వీరే దుకాణాలను నడిపించనున్నారు. దుకాణాలతో పాటు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బెల్టు దుకాణాలు సుమారు 350పైబడి ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా నవాబ్పేట, దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి అధికారిక దుకాణాల కంటే రెండింతలు అధికంగా ఈ దుకాణాలున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో రోజుకి రూ.3.50కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం అనుమతుల్లేని దుకాణాల ద్వారానే రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పలు బెల్టు దుకాణాల్లో రోజుకి రూ.50వేల మద్యం అమ్ముడవుతోంది. వీటిల్లో పగలు, రాత్రిళ్లు మద్యం విక్రయాలు జరుగుతుండడంతో యువత మద్యానికి బానిసవుతున్నారు. నిబంధనలు ఇలా.. ఎలాంటి లైసెన్సులు లేకుండా మద్యం విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. ఇలాంటి వారిపై ఆబ్కారీ శాఖ అధికారులకు నేరుగా కేసులు నమోదు చేసే అధికారం ఉంది. పట్టుబడిన వారికి శిక్షతో పాటు భారీ జరిమానాలు అమలవుతాయి. 34ఏ టీఎస్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి వద్ద ఆరు లీటర్లు(బాటిళ్ల) మద్యం కలిగి ఉండవచ్చన్న నిబంధన ఉంది. అంతకు మించి ఉంటే అక్రమ మద్యంగా గుర్తిసారు. శుభకార్యాలు జరిగినా, విందు కార్యక్రమాలు ఉన్నా ఆరు బాటిళ్లకు మించి తీసుకోవద్దు. వాస్తవానికి ఒక వ్యక్తికి ఇంతకు మించి విక్రయించొద్దు. ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి ఉంటే గానీ నిబంధనలు దాటి మద్యం ఇవ్వకూడదు. ఇంత కఠినంగా నిబంధనలు ఉన్నా బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. మొక్కుబడిగా కేసులు బెల్టు దుకాణాల్లో కొందరు సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తమ బంధువులు, స్నేహితుల ద్వారా అనధికారికంగా మద్యం దుకాణాలు ఉంటే మొక్కబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. బెల్టు దుకాణాల నుంచి సర్కిళ్ల వారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న బెల్టు దుకాణాల నుంచి నెలకు రూ.2నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వీటిపై దాడులు చేసేందుకు సాహసించట్లేదు. నిజానికి గొలుసు దుకాణంపై దాడి జరిగినపుడు మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరగాలి. ఆ దుకాణంపై కూడా కేసు నమోదు చేయాలి. మద్యం సీసాలపై పక్కా ఆధారాలు కూడా ఉంటాయి. కానీ, ఈ తరహాలో అధికారులు దర్యాప్తు చేయట్లేదు. ఒకవేళ వివరాలు తెలిస్తే లైసెన్సుదారులతో బేరసారాలు చేసి కేసులు లేకుండా వదిలేస్తున్నారే ప్రచారం ఉంది. వారిదే ప్రధాన ప్రాత బెల్టు దుకాణాల నిర్వహణలో మద్యం దుకాణాదారులదే ప్రధాన పాత్ర ఉంటోంది. ఒక్కో అధికారిక దుకాణం పరిధిలో 10 నుంచి 15 బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. ఎమ్మార్పీ ధరపై రూ.5 నుంచి రూ.50 వరకు తక్కువ చేసి ఈ దుకాణాదారులకు మద్యాన్ని కట్టబెడుతున్నారు. తిరిగి వీరు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.60 వరకు అదనం చేసి విక్రయాలు జరుపుతున్నారు. వీరికి ఎక్సైజ్ శాఖతో సంబంధాలు ఉండడంతో బెల్టు దుకాణాలపై దాడులు చేయకుండా చూసుకుంటున్నారు. చాలా చోట్ల లైసెన్సులు కలిగిన దుకాణాదారులే ఆబ్కారీ సిబ్బందికి నెలనెలా కొంత అమ్యామ్యాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో ప్రత్యేక తనిఖీలు కొత్త మద్యం దుకాణాలు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. బెల్టు దుకాణాల నిర్వహణపై డిసెంబర్ మొదటి వారంలో ప్రత్యేక తనిఖీలు చేస్తాం. మద్యం దొరికితే కేసులు నమోదు చేస్తాం. ఎవరూ అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేయరాదు. బెల్టు దుకాణాల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. – జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా -
‘బెల్టు’ అండగా.. గల్లా నిండగా
సాక్షి, ఆసిఫాబాద్ : సరిహద్దు మండలాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు బెల్టు షాప్లు అండగా నిలుస్తున్నాయి. బెల్టు షాప్ల మాటున అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడుతూ వ్యాపారులు దండుకుంటున్నారు. దీనికి తోడు పొ రుగు రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా మద్యం దుకాణదారులు బెల్టు షాపులతో ఒప్పందం చేసుకుని దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా సాగుతోంది. సరిహద్దు జిల్లా అయిన చంద్రాపూర్, గడ్చిరోలిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉండడంతో మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న వైన్స్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సరిహద్దుల్లో నిత్యం దందా.. మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోల్లి జిల్లాలో ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. దీంతో బార్డర్లో వైన్సులను దక్కించుకునేందుకు వ్యాపారులు కొత్త దుకాణాల లైసెన్సు పొందే సమయంలో పోటాపోటీగా టెండర్లు వేశారు. ఈక్రమంలో వాంకిడి, సిర్పూర్(టి), కౌటాల, రవీంద్రనగర్, బెజ్జూరు వైన్సులకు ‘మహా’క్రేజీ ఏర్పడింది. అయితే కొంత మంది టెండర్లలో లక్షల రూపాయలు పోగొట్టుకుని మద్యం షాపులు దక్కని వారు లక్కీ లాటరీలో షాపు దక్కించుకున్న వారికి గుడ్విల్ కింద లక్షల రూపాయలు ముట్టజెప్పి తిరిగి మద్యం వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇక కొందరు పెట్టుబడి భరిస్తామని వాటాలు మార్చుకుని దందా సాగిస్తున్నారు. ఈ దందా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వైన్సుల్లో అధికంగా జరిగుతోంది. వాంకిడిలో ఇదే తరహాలో లక్కీడీప్లో పొందిన వ్యక్తికి పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి ఓ షాపును సొంతం చేసుకుని అడ్డగోలుగా మద్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తూ ఆక్రమ సంపాదనకు తెరలేపారు. వైన్స్లను తలపిస్తున్న వైనం.. సరిహద్దుల్లో ఉన్న వైన్సుల నుంచి యథేచ్ఛగా నిత్యం మద్యం సరఫరా సాగుతూనే ఉంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, బెల్టుషాపుల కేంద్రంగానే దందా సాగుతోంది. వాంకిడిలో ఉన్న ఓ వైన్ షాపు నేరుగా బెల్టుషాపులను గంప గుత్తగా అడ్వాన్సుగా మద్యం సరఫరా చేస్తూ అక్రమంగా నిల్వలు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఏకచత్రాధిపత్యంగా వాంకిడి మండలం గోయగాంలో ఓ బెల్టుషాపునకు నేరుగా డంప్ చేస్తూ మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. వాస్తవానికి మద్యం స్టాక్ ఊట్నూర్ డిపో నుంచి ఎక్సైజ్ అధికారులు సూచించిన గోదాంల్లో నిల్వ ఉంచుకుని అవసర మేర సరఫరా చేస్తూ వైన్సుల్లో విక్రయించాలి. అలా కాకుండా నేరుగా సరిహద్దు గ్రామాల్లో బెల్టుషాపులుకే, అక్కడి నుంచి పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ దండుకుంటున్నారు. ఎమ్మార్పీకి కంటే డబుల్.. పక్క రాష్ట్రంలో నిషేధం అమలులో ఉండడంతో ఇక్కడితో పోల్చితే రెట్టింపు ధరలతో విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణంగా వైన్సుల్లో కౌంటర్ విక్రయాలు కంటే బెల్టుషాపులకే నిత్యం పెద్ద మొత్తంలో సరకు రవాణా అవుతుంది. ఈ బలహీనతతో మహారాష్ట్ర నుంచి వచ్చే బెల్టుషాపు నిర్వహకులకు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. చీప్ లిక్కర్ క్వాటర్ సీసా రూ.65 ఉంటే మహారాష్ట్ర బెల్టు షాపుల్లో రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. ఓసీ క్వాటర్కు ఎమ్మార్పీ రూ.120 ఉంటే స్థానిక బెల్టుషాపుల్లో రూ.150 వరకూ ఉంటే మహారాష్ట్రలో రూ.300 వరకూ అమ్ముతున్నారు. ఇలా ఒక్కో బ్రాండ్కు ఒక్కొ తీరుగా రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. అయితే కొంత మంది మరో అడుగు ముందుకేసి సరిహద్దులో అక్రమంగా మద్యం నిల్వ చేసి రూ.20 నుంచి రూ.30 వరకూ అధికంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. వైన్సుల నుంచే.. బెల్టు దుకాణదారులను వైన్సు షాపుల వరకూ రానివ్వకుండా వైన్సుల నుంచి వారి చెంతకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి లకడికోట్, రాజురా చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న గోయగాం లాంటి బెల్టుషాపుల్లోనే అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక సిర్పూర్(టి)సరిహద్దులో ఉన్న పొడ్సా, వెంకట్రావుపేట్, కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలం గూడెం గుండా నిత్యం మద్యం తరలిపోతోంది. మహారాష్ట్రలోని ఐరి, ఆల్లపల్లి తదితర ప్రాంతాలకు ప్రాణహిత నదిని దాటించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా నిలవరించేందుకు వాంకిడిలో ఎక్సైజ్ చెక్పోస్టు ఉన్నప్పటికీ అటు పోలీసులు, ఇటు అబ్కారీ శాఖ నిలువరించలేకపోతున్నారనేది బహిరంగ సత్యం. -
రేటు చూస్తే ‘కిక్కు’దిగాల్సిందే..
మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకే మూతపడుతుండగా.. మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. డిమాండ్ పెరగడంతో అక్కడ ఎమ్మార్పీ కంటే రూ.50 దాకా అదనంగా బాదేస్తున్నారు. ఫలితంగా బార్ల గల్లాపెట్టెలు పొంగిపొర్లుతుండగా.. మందుబాబులు జేబులు తడుముకుంటున్నారు. నిన్నటివరకూ రూ.120 ఉన్న ఓ బ్రాండ్ లిక్కర్ క్వార్టర్పై ప్రభుత్వం రూ.20 పెంచగా రూ.140కి చేరింది. అదే బార్కు వెళ్లి రూ.200 ఇస్తే చిల్లర వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. గట్టిగా అడిగితే మందులేదు పొమ్మంటున్నారు. చేసేదేమీలేక మద్యం ప్రియులు బార్ యజమానులు అడిగినంత ఇచ్చి వాళ్లిచ్చింది పుచ్చుకుంటున్నారు. సాక్షి, అనంతపురం సెంట్రల్ : నూతన మద్యం పాలసీని బార్ నిర్వాహకులు అనుకూలంగా మలుచుకున్నారు. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు బంద్ కాగా, బార్లు కళకళలాడుతున్నాయి. ఇదే అదునుగా లిక్కర్ ధరలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రూ.లక్ష కూడా దాటని ఓ బార్ కౌంటర్.. ఇప్పుడు రూ.4 లక్షలు దాటిపోతోంది. నూతన ఎక్సైజ్ పాలసీతో ‘చుక్క’లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మద్యపాన నిషేధించడంలో భాగంగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఇటీవలే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 247 మద్యం షాపులుండగా.. దాన్ని 197కు కుదించింది. మద్యంషాపుల వేళల్లోనూ మార్పులు చేసింది. దీంతో రాత్రి 8 గంటలకు మద్యం షాపులు మూతపడుతున్నాయి. ఇక పర్మిట్షాపులను పూర్తిగా రద్దు చేయడంతో మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. జిల్లాలో 32 బార్లు ఉండగా..అన్నింటిలోనూ గతంతో పోలిస్తే రెట్టింపు వ్యాపారం జరుగుతోంది. అన్నింటిపైనా దోపిడీ బార్ నిర్వాహకులు లిక్కర్పైనే కాకుండా వాటర్బాటిళ్ల నుంచి ఆహార పదార్థాల వరకూ భారీ రేట్లు అమలు చేస్తున్నారు. డాబాలతో పోలిస్తే 50 నుంచి 60 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. అధికారులకు మామూళ్లుతో పాటు వారు వచ్చినప్పుడు మర్యాదలు చూసుకుంటుండడంతో అధికారులెవరూ∙పెద్దగా పెట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మద్యం ప్రియుల ఇళ్లకు కాసిన్ని కాసులైనా వెళ్తాయి...లేకపోతే పేదల కష్టార్జితం బారు గల్లాపెట్టెలోకి వెళ్తుంది. నియంత్రించే పరిస్థితి లేదు బార్లలో మద్యం రేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి లే దని ఇన్చార్జ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెబుతున్నారు. సర్వీసు పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారనీ, త్వరలో బార్ల వేళల్లోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అమలైతే వారికి కూడా చెక్ పడుతుందన్నారు. -
ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్ వైజర్లు,17 మంది నైట్ వాచ్మెన్లు, 41మంది సేల్స్మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. పుత్తూరు పట్టణంలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. చదవండి: రాత్రి 8 వరకే మద్యం -
తొలిదఫాలో బెల్ట్షాపులు రద్దుచేసిన ప్రభుత్వం
-
మద్యనిషేధంలో మరో ముందడుగు
-
పైలెట్ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు
-
మద్యం స్మగ్లింగ్కు చెక్
బెల్టు షాపుల తొలగింపుతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగితే.. బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గింది. అలాగే 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నాం. సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మద్యం స్మగ్లింగ్ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం వల్ల వచ్చే అనర్థాల గురించి పాఠ్య ప్రణాళికల్లోనూ పొందుపరచాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్య నిషేధం అమలుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను వినియోగించు కోవాలన్నారు. దశల వారీ మద్య నిషేధానికి అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని, దీనిపై అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే పని చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా 16 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం వినియోగం గణనీయంగా తగ్గిపోతోందని, ఇందుకు ప్రధాన కారణం బెల్టు షాపుల తొలగింపేనని పేర్కొన్నారు. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగిందని, బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గిందన్నారు. ప్రైవేట్ దుకాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నామని, 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 శాతం దుకాణాలు తగ్గిపోనున్నాయని అధికారులు వివరించారు. మద్య నియంత్రణ, నిషేధానికి, డీ ఎడిక్షన్ కేంద్రాలకు నిధులు రూ.500 కోట్లకు పెంచుతున్నామన్నారు. జీఎస్టీ, వాహన రంగం ఆదాయంలో తగ్గుదల వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల ఉన్నతాధికారులు శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించారు. వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదన్నారు. స్టీల్ రేట్లు తగ్గడం వల్ల కూడా ఆదాయంపై ప్రభావం చూపుతోందని చెప్పారు. సిమెంట్ ధర తగ్గడం వల్ల, దాని మీద వచ్చే పన్నులు తగ్గుతున్నాయని వివరించారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయం మెరుగు పడుతుందని ఆశాభావంతో ఉన్నామని, జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటి వారంలో రూ.597 కోట్లు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. -
సరికొత్త సూర్యోదయం..
నూతన ప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం.. సమాజంలో అద్భుత ఫలితాలనిస్తోంది. పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆర్థిక దుస్థితి, అనారోగ్యం బారిన పడిన బడుగుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కచెల్లెమ్మలు, అవ్వల కళ్లల్లో ఆనందపు మెరుపులు ఆవిష్కృతమవుతున్నాయి. – సాక్షి, గుంటూరు మా బతుకులు బాగుపడుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీ మద్య నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మా గ్రామస్తులంతా స్వాగతించారు. రోజంతా కష్టపడిన సొమ్మును మా మగాళ్లు తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. స్థానిక 15 మహిళా సంఘాల ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ మువ్వల ఆదయ్య, నాయకులు, యువతతో గ్రామంలో సమావేశం నిర్వహించుకుని వైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతుగా గ్రామంలో బెల్ట్షాప్లు నిర్వహించకూడదని ఈ ఏడాది జూలైలో తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు మా అందరి బతుకులు బాగుపడుతున్నాయి. – మువ్వల బాలమ్మ, మెట్టవలస గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వైఎస్ జగన్ నిర్ణయంతో.. బెల్ట్ షాపులను నిర్మూలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సమాజంలో పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రెండోరోజే.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపుల నిర్మూలనకు ఆదేశించారు. బెల్టు షాపులు మూతపడ్డాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేసే మద్యం మహమ్మారి ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్టయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 24గx7 మద్యం సరఫరా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ షాపులుండేవి. అనధికారికంగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయాలు జరిగేవి. మంచి నీళ్లు దొరకని గ్రామాలైతే ఉన్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామమంటూ లేనంతగా పరిస్థితి తయారైంది. తాగుడుకు బానిసలైన కొందరు.. మద్యం కొనుగోలుకు డబ్బు ఇవ్వలేదని భార్య, తల్లిదండ్రులను కడతేర్చిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. తాగుడుకు బానిసలైనవారు అనారోగ్యం పాలై కుటుంబ సంపాదనంతా ఆస్పత్రులకు చెల్లించాల్సి వచ్చేది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్షాపులుండేవి. తాగుబోతు తనం ఎక్కువ వడంతో పాటు.. కొట్లాటలు కూడా జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్రామాల్లో బెల్ట్షాపులను అరికట్టడం వల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంచెలంచెలుగా సీఎం వైఎస్ జగన్ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పడంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. – కలై అరసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, నంగమంగళం, చిత్తూరు జిల్లా శుభ పరిణామం.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం బెల్ట్ షాపులను నిర్మూలిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రజలను మద్యం నుంచి దూరం చేయాలంటే వారికి మద్యం అందుబాటులో లేకుండా చేయడమే సరైన నిర్ణయం. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులను ఎత్తివేసి ప్రభుత్వం తొలి విజయం నమోదు చేసుకుంది. ఇదే స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకెళ్తూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి. – వి.లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్యం దొరక్కుండా చేయాలి.. నా భర్తకు 70 ఏళ్లయ్యా.. ఆయన సంపాదనతో పాటు, నా రెక్కల కష్టం కూడా తాగుడుకే తగలేసేవాడు. కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషించాను. 70 ఏళ్ల వయస్సులోనూ తాగుడుకు డబ్బులివ్వాలంటూ నన్ను సతాయించేవాడు. మునుపటిలా ఇప్పుడు ఊళ్లో మద్యం దొరక్కపోవడంతో తాగుడు దాదాపు తగ్గిపోయింది. రాజన్న బిడ్డ నిర్ణయంతో నా కుటుంబంతో పాటు.. మా ఊళ్లో చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. – సానంపూడి శేషమ్మ, వెల్లంపల్లి, మాచవరం మండలం, గుంటూరు జిల్లా రెండు నెలల్లోనే తగ్గిన అమ్మకాలు 8,15,806 కేసులు ఏటా పెరుగుతున్న అమ్మకాలు 10% ప్రభుత్వ నిర్ణయం వల్ల తగ్గిన అమ్మకాలు 12% ఒక కేసు అంటే 8.64 లీటర్ల మద్యం ఈ ఫొటోలో కనిపిస్తున్న జరపాల బుజ్జీబాయ్ది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామం. ఈమె భర్త చినబాబు మద్యానికి బానిస. పనికెళ్లకుండా 24 గంటలూ మద్యం తాగుతూ భార్యాపిల్లలను వేధించేవాడు. బుజ్జీబాయ్ తన కూలిలో నెలకు రూ.4 వేల దాకా భర్త తాగుడుకు ఇవ్వాల్సి వచ్చేది. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి. మద్యం అందుబాటులో లేకపోవడంతో చినబాబు తాగడం మానుకున్నాడు. పనికెళుతూ రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. దీంతో నెలకు రూ.4 వేల తాగుడు ఖర్చు మిగలడమేగాక.. అదనపు ఆదాయం తోడవడంతో హాయిగా ఉన్నారు. -
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలును ముమ్మరం చేస్తూ..నూతన ఎక్సైజ్ పాలసీకి జిల్లాలో తొలి అడుగులు పడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మద్యం షాపు రెంట్ల భవనాలు, ట్రాన్స్పోర్టు, ఫర్నిచర్ల టెండర్లకు ఎక్సైజ్ శాఖ పిలుపునిచ్చింది. దీంతో జిల్లాలోని మొత్తం 294 బెల్టు షాపులకు గాను, 250 షాపులకు సంబంధించిన టెండర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా అధిక రెంట్లు కోడ్ చేసిన భవన యజమానులతో పాటు ఒక్కొక్క టెండరుదారుడితో మాధవీలత చర్చించారు. ఈ క్రమంలో పాత తరహాలోనే అద్దె చెల్లిస్తామని చెప్పి టెండర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. -
ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు నుంచి ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఒక్కో షాపునకు ఆస్తుల కల్పన, నిర్వహణకయ్యే ఖర్చు మొత్తం కలిపి గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకు, పట్టణ/నగర ప్రాంతాల్లో రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో షాపులో ఫ్యాన్లు, టేబుళ్లు, ఫ్రిజ్ (బాటిల్ కూలర్), ర్యాకులు, గ్రిల్స్, స్కానర్, సీసీ కెమెరాలతో పాటు కంప్యూటర్ బిల్లింగ్కు ఏర్పాట్లుచేయాలని.. ఇందుకు రూ.లక్షన్నర దాటుతుందని తేల్చారు. అద్దె, సిబ్బంది జీతభత్యాలు కలిపి నెలకు మరో రూ.లక్ష వరకు ఖర్చవుతుందని ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే షాపు 150 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని.. రాష్ట్ర, జాతీయ రహదారులకు, గుడి, బడికి దూరంగా ఉండాలని నిర్దేశించారు. కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బంది భర్తీ కాగా, ఒక్కో మద్యం షాపులో సూపర్వైజరు, ఇద్దరు సేల్స్మెన్లు, ఓ సెక్యూరిటీ గార్డును నియమించనున్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులకు సిబ్బందిని ఎంపికచేస్తారు. ఈ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుచేయడంతోపాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన అమలుచేయనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికను త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించనున్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఆగస్టు నుంచి ప్రతి జిల్లాలో పది ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జేసీ ఆధ్వర్యంలో కమిటీకి బాధ్యతలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి సిబ్బందిని ఎంపికచేసే బాధ్యతల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిపో మేనేజరులతో కూడిన కమిటీకి అప్పగించనున్నారు. నోటిఫికేషన్ జారీచేసి సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేస్తారు. అలాగే, మద్యం డిపో నుంచి షాపునకు సరుకు చేరవేసేందుకు సరఫరాదారుల్ని (ట్రాన్స్పోర్టర్లు) కూడా టెండర్ల ద్వారా ఈ కమిటీయే ఎంపిక చేస్తుంది. మద్యం డిపో నుంచి షాపునకు సరుకు లోడింగ్, అన్లోడింగ్ బాధ్యతలు మొత్తం సరఫరాదారే చూసుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత విధానం ప్రకారం మద్యం షాపులు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ముందుగానే ఆయా డిపోలకు డీడీలు చెల్లించి సరుకు పొందుతున్నారు. కానీ, కొత్త విధానం ద్వారా ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలో షాపులు నిర్వహిస్తున్నందున డిపో నుంచి అప్పు (క్రెడిట్) విధానంలోనే సరుకు తెచ్చి అమ్మకాల తర్వాత డిపోకు డబ్బు చెల్లిస్తారు. అయితే ఏ రోజుకా రోజు బ్యాంకులో డబ్బు జమచేయాలా? లేదా బ్యాంకు సిబ్బంది క్యాష్ పికప్ చేసుకోవాలా? అన్న విధానంపై ఇంకా స్పష్టతలేదు. బ్యాంకు సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలనే అంశంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్కు నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు, సేల్స్మెన్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అకౌంట్స్ చూడాల్సి ఉన్నందున సూపర్వైజర్కు డిగ్రీ విద్యార్హతగా, సేల్స్మెన్కు ఇంటర్/పది విద్యార్హతగా నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా సర్కారు ఈ షాపులను నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం నుంచి సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్దేశమిదే.. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు దక్కించుకుని మాఫియాగా ఏర్పడి విచ్చలవిడిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా బెల్టు షాపుల్ని ఏర్పాటుచేసి ప్రజల్ని వ్యసనపరులుగా మార్చేస్తున్నారు. బ్రాండ్ మిక్సింగ్కు పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహిస్తే ఈ తరహా ఉల్లంఘనలు ఏమీ ఉండవు. అలాగే, బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఏర్పడడమేగాక సీఎం హామీ మేరకు దశల వారీగా మద్యపాన నిషేధానికి అవకాశం ఏర్పడుతుంది. -
బెల్ట్ జోరు.. పల్లె బేజారు
సాక్షి, వట్పల్లి(మెదక్) : పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. మండంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఒకటి నుంచి రెండు బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనీటైం మద్యం. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. వట్పల్లి, జోగిపేట ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువెళ్లి ఒక మద్యం బాటిల్పై ఎంఆర్పీ రేటు కంటే రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు.. గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణషాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. నిషేధం బుట్టదాఖలు.. గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం,గొడవలు వంటి సంఘటనలు చోటు,చేసుకోవడంతో మండలంలోని నాగులపల్లి, ఖాదిరాబాద్లో, మర్వెళ్లీ గ్రామాల్లో మద్యం నిషేధిస్తూ గ్రామస్తులంతా తీర్మానించారు. సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు నిషేధిత గ్రామాల వైపు చూసిచూడనట్లు వ్యవహరించడంతో మూడు నెలల్లోనే మద్యం అమ్మకాలు పునఃప్రారంభమవడంతో నిషేద తీర్మానాలు బుట్టదాఖలయ్యాయి. కేసులు నమోదు చేస్తాం గ్రామాల్లో బెల్టుషాపులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం.గ్రామాల్లో మద్యం విక్రయాలను నివారించేందుకు నిరంతర తనిఖీలు చేస్తూనే ఉన్నాం.గ్రామాల్లో ఎవరైన మద్యం విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. – సుబ్రహ్మణ్యం, ఎక్సైజ్ సీఐ, జోగిపేట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే దారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లర్లు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై వారిపై ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. – ఈశ్వరయ్య,కేరూర్ -
అక్టోబర్ 1 నుంచి బెల్ట్ షాపులు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు 1వతేదీ నుంచి ఎక్కడా బెల్టు షాపులు ఉండవని, అసలు ఆ పేరే వినిపించదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండబోవని చెప్పారు. బెల్ట్ షాపులు లేకుండా చేయడంతోపాటు మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంతో ప్రభుత్వమే రిటైల్గా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. శాంతిభద్రతలపై మంగళవారం జరిగిన కలెక్టర్లు – ఎస్పీల ఉమ్మడి సమావేశంలో సీఎం ఈమేరకు ప్రకటించారు. ‘ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్ షాపులకు తెర పడదు. ప్రభుత్వం నిఘా పెంచినా ఒక వారం రోజులు మూసివేసి మళ్లీ ఏదో ఒకవిధంగా బెల్ట్ షాపులు తెరుస్తారు. లాభార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలు పెంచుకోవడానికే ప్రయత్నిస్తారు. అదే ప్రభుత్వమైతే బెల్ట్ షాపులు నిర్వహించదు. మద్యం విక్రయాలు పెంచాలనే స్వార్థం ఉండదు. ఈ లక్ష్యంతోనే అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆం్రధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే మద్యం షాపులు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం’ అని సీఎం జగన్ వివరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం దుకాణాలు రాష్ట్రంలో అక్టోబరు 1వతేదీ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యం షాపులు నిర్వహిస్తామని రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏటా మద్యం షాపులు తగ్గిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని 4,377 మద్యం షాపుల లైసెన్సు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ దుకాణాదారులు మరో మూడు నెలల పాటు షాపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తాం. తర్వాత ప్రైవేట్ దుకాణాలుండవు. బెవరేజెస్ కార్పొరేషన్ రిటైల్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తుంది. క్రమేణా వీటిని తగ్గిస్తూ సంపూర్ణ మద్య నిషేధం అమలు దిశగా చర్యలు తీసుకుంటాం’ అని సాంబశివరావు వివరించారు. సెప్టెంబర్ 30 వరకు లైసెన్స్ గడువు పొడిగింపు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సు గడువును మరో మూడు నెలల పాటు పెంచుతూ రెవెన్యూ (ఎక్సైజ్, వాణిజ్య, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని 4,377 మద్యం దుకాణాలు, 15 హైబ్రీడ్ హైపర్ మార్కెట్ల లైసెన్సు వ్యవధి ఈనెల 30వ తేదీతో ముగియనుండటం తెలిసిందే. వీటి గడువును సెప్టెంబర్ 30వతేదీ వరకు పెంచుతున్నట్లు మెమోలో ప్రభుత్వం పేర్కొంది. మూడు నెలల కాలానికి లైసెన్స్ ఫీజుతోపాటు పర్మిట్ రూమ్స్ లైసెన్సు ఫీజులను వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రం తిరిగి చెల్లించేది లేదని మెమోలో స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసమే: సీఎం ‘అన్నీ ఆలోచించి సమాజ శ్రేయస్సు కోసమే దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించాం. బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. రహదారులు వెంట, దాబాల్లో కూడా మద్యం అమ్ముతున్నారు. అక్టోబరు 1 నుంచి ఇలా జరగనివ్వం. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఆలయాలు, విద్యా సంస్థల సమీపంలో మద్యం షాపులు ఉండరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అక్టోబర్ 1 నాటికి బెల్ట్షాపులు ఎత్తివేయాలి
-
‘బెల్ట్’ తీసేశారు
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): పచ్చటి సంసారాల్లో చిచ్చురేపిన మద్యం మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మద్యం మహమ్మారి నిర్మూలను చికిత్స ప్రారంభించారు. ఒక్కసారిగా ఈ వ్యాధిని నిర్మూలించడం వీలుకాదని ముందే గ్రహించిన ఆయన విడతల వారీగా తుదముట్టిద్దామని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా బెల్ట్షాపుల నిర్మూలనకు ఇచ్చిన ఆదేశాలు నరసన్నపేట నియోజకవర్గంలో విజయవంతమయ్యాయి. గ్రామాల్లో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల క్రితం గ్రామాల్లో పరిస్థుతులు ఒకలా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థులు పూర్తిగా మారాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమంటూ మహిళా లోకం పొగడ్తలతో ముంచెత్తుతుంది. బెల్ట్షాపుల మూతకు గ్రామాల్లో పెద్దలు కూడా సహకరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపుతో నాలుగు మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులన్నీ దాదాపుగా మూతపడ్డాయి. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయంలో బెల్ట్ షాపులను మూతవేస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ తుంగలోకి తొక్కడంతో.. బెల్ట్ షాపులు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. మద్యం అమ్మకాలపై నెలవారీ టార్గెట్లు ఇవ్వడంతో ఎక్సైజ్ సిబ్బంది కూడా ఎంత తాగిస్తే అంతగా లక్ష్యం సాధిస్తామని బెల్ట్ షాపులను అప్పట్లో ప్రోత్సహించారు. 2014కు ముందు గ్రామాల్లో వీధికో బెల్ట్ షాపు ఉంటే గత ప్రభుత్వ అధినేత పుణ్యమా అని వీధికి నాలుగైదు వెలిశాయి. నరసన్నపేట పట్టణంలో అయితే సందు, సందులో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బయటకు ఒకలా ప్రకటనలు చేయడం, లోపల ఆదేశాలు మరోలా ఇవ్వడంతో బెల్ట్ షాపులు మూత అనేది కేవలం ప్రకటలనకే పరిమితం అయింది. నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల వివరాలు.. మండలం బెల్ట్ షాపులు ప్రస్తుతం నడుస్తున్నవి నరసన్నపేట 310 0 పోలాకి 160 0 జలుమూరు 110 0 సారవకోట 90 0 మాటే శాసనం.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘నా మాటే శాసనం’ అన్న తీరులో జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేయడంతో వారం రోజుల్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. సీఎం ఆదేశాలను విధిగా నరసన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గట్టిగా చెప్పారు. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే లైసెన్స్ ఉన్న షాపులపై కేసులు పెట్టాలని, గ్రామాల్లో గొలుసు దుకాణాలు మూత పడాల్సిందేనని, గ్రామాల్లో మద్యం లభిస్తున్నట్లు తెలిస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్థానిక సీఐ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది జూలు విదిల్చారు. దీంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం మద్యం కేవలం లైసెన్స్ ఉన్న షాపుల్లోనే లభిస్తుంది. ఈ షాపుల్లో కూడా రెండు బాటిళ్ల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. నరసన్నపేట ఎక్సైజ్(సీఐ) స్టేషన్ పరిధిలో ఉన్న జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాల్లో దాదాపుగా అన్ని బెల్ట్ షాపులు మూసివేశారు. వీటిని నడిపిన వారు ప్రత్యామ్నాయ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మద్యం మహమ్మారి నిషేధానికి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న మొదటి ప్రయత్నం విజయవంతం అయింది. కోటబొమ్మాళి సర్కిల్ సీఐ పరిధిలో ఉన్న సారవకోట మండలంలో కూడా మద్యం అనధికార షాపులు మూతపడ్డాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21 లైసెన్స్డ్ షాపులున్నాయి. ప్రస్తుతం వీటిల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గత పది రోజుల్లో మద్యం అమ్మకాలు 40 శాతం మేరకు తగ్గాయి. ఎక్సైజ్ సిబ్బందికి గ్రామాల దత్తత.. నరసన్నపేట సర్కిల్ స్టేషన్ పరిధిలో ఉన్న 12 మంది పోలీసులు, ముగ్గురు ఎస్ఐలు రెవెన్యూ గ్రామాల వారీగా దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలను వీరి నుంచి ఏ రోజు నివేదికలు ఆరోజు సీఐ తీసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించే వారికి సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, పెద్దల నుంచి బెల్ట్షాపుల మూతకు ప్రోత్సాహం లభించిందని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. అక్రమ మద్యం ఉంటే కేసులు నిబంధనలకు మించి మద్యం బాటిళ్లు అధికంగా ఉన్నా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనధికార మద్యం ఉంటే కేసులు నమోదు చేస్తాం. బెయిల్ రాకుండా సెక్షన్లు వేస్తాం. ప్రస్తుతం కేవలం లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మద్యం అమ్మకాలకు పరిమితం చేశాం. ఎవరైనా లైసెన్స్డ్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు చేస్తే వారి లైసెన్స్లు పూర్తిగా రద్దు చేస్తాం. –శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట గ్రామాల్లో ప్రశాంతత గత ప్రభుత్వ కాలంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉండటంతో ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వై.ఎస్.జగన్మెహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యం బెల్ట్ షాపులు నిర్మూలకు చర్యలు తీసుకోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు కనిపించడం లేదు. వారం రోజులుగా గ్రామాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు. – పుట్టా ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్, వీఎన్పురం, నరసన్నపేట -
వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి
-
వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారంలోగా బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్లో మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో బెల్టు షాపుల నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, బెల్టు షాపులు కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పెషల్ సీఎస్ సాంబశివరావు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు విద్యార్థుల్లో, యువతలో చైతన్య కార్యక్రమాలతోపాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. బెల్టు షాపుల నిర్మూలన, మద్యాన్ని దూరం చేసే చైతన్య కార్యక్రమాలు బాగా నిర్వహించిన అధికారులకు రివార్డులు కూడా అందిస్తామన్నారు. గంజాయిపై సాగు దశ నుంచే నిఘా పెట్టి ధ్వంసం చేయాలని సూచించారు. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 27 వరకు రాష్ట్రంలో 9,246 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 9,355 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే 644 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు షాపుల నిర్మూలనకు ప్రతి గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్, ప్రతి మండలానికి ఒక్కో ఎస్సైకు బాధ్యతలు అప్పగిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ముకేష్కుమార్ మీనా చెప్పారు. బెల్టు షాపుల నిర్మూలనపై రోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
బెల్టు షాపుల నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ భేటీ
-
‘వారం రోజుల్లోగా బెల్టు షాపులను నియంత్రించాలి’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పర్చడానికి ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలని.. రేపటి నుంచే పని మొదలు పెట్టాలని స్పెషల్ సీఎస్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే గంజాయి సాగులో లేకుండా చూడాల్సిన బాధ్యత అబ్కారీ శాఖపై ఉందన్నారు. గ్రామానికో కానిస్టేబుల్ : ముకేశ్ కుమార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది అంతా గట్టిగా పనిచేస్తే బెల్టు షాపుల తొలగింపు అసాధ్యం కాదని కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు షాపుల ఎత్తివేతకు సమావేశాలు నిర్వహించాలని, నిర్వాహకులకు కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. బెల్టు షాపుల నియంత్రణ కోసం ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ను.. మండలానికి ఎస్సైని బాధ్యులుగా నియమిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించి బెల్టు షాపులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్టు షాపుల నిర్మూలనపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బెల్టు షాపుల నియంత్రణలో నూరుశాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు అందజేసి సత్కరిస్తామని చెప్పారు. (చదవండి : ‘బెల్ట్’ తీయకుంటే లైసెన్స్ రద్దు) -
‘బెల్ట్’ తీయకుంటే లైసెన్స్ రద్దు
సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చిచ్చు రగిలించి మహిళలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్న మద్యం బెల్టు షాపులను నిషేధిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తన పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన మూడో రోజే ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు పేదల జీవితాలను దారుణంగా నాశనం చేస్తున్న బెల్ట్ షాపులను ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే సమూలంగా తొలగించాల్సిందేనని శనివారం ఎక్సైజ్ శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. దీనిద్వారా ప్రతి పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మద్యాన్ని కేవలం ప్రత్యేక ఆదాయ వనరుగా చూడకూడదని పేర్కొన్నారు. ఎక్కడైనా బెల్ట్ షాప్లు కనిపిస్తే వాటిపై చర్యలు తీసుకుంటూనే వాటికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ల లైసెన్స్లు కూడా రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించి బెల్ట్ షాప్లను సమూలంగా నిర్మూలించడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. దశలవారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ను కలుసుకుని మద్యం మహమ్మారి వల్ల తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని మొర పెట్టుకున్నారు. మద్యం లేకుండా చేయాలని, ముఖ్యంగా వీధి వీధిన వెలసిన బెల్ట్ షాపుల వల్ల తమ భర్తలు, చేతికి అందివచ్చిన కుమారులు మద్యానికి బానిసలై చిన్న వయసులోనే మృతి చెందుతున్నారని ఆక్రోశించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాంతాల నుంచి జగన్కు ఇలాంటి వినతులే అందాయి. మన ప్రభుత్వం రాగానే మద్యం మహమ్మారిని దశలవారీగా పారదోలుదామని, అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి బెల్ట్ షాపులను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో 4,380 వైన్ షాపులుండగా, వీటికి అనుంబంధంగా ఒక్కో షాపునకు 10 చొప్పున 43,800 బెల్ట్ షాపులున్నాయి. 800 బార్లు ఉన్నాయి. -
మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి
వరంగల్ రూరల్: రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడినందున అక్రమ మద్యం, బెల్లం,గుడుంబా అమ్మకాలను నియంత్రించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఐఎంఎఫ్ఎల్, ఐడీసీ, అక్రమ తరలింపులను అడ్డుకోవాలని సురేష్ రాథోడ్ చెప్పారు. ప్రతి వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పనిచేసేలా చూడాలని ఆయన తెలి పారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్1, ఆర్2, రిజిష్టర్లను నిర్వహించాలని తెలిపా రు. ఎక్కువ మద్యం అమ్మితే ఆ రిటేల్ షాపుల వివరాలు తమకు ఇవ్వాలని సురేష్ రాథోడ్ వివరించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వాట్సప్ గ్రూపునకు అందుబాటులో ఉండాలని చెప్పారు. సెల్ మెసేజ్లకు స్పందించాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అరగంటలోపే స్పందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు అడగవద్దని ఆయన స్పష్టం చేశారు. సి–విజిల్ ఫిర్యాదులకు స్పందించాలని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరినైనా అరెస్టు చేసి స్టేషన్కు తరలించినప్పుడు కొట్టకూడదని సురేష్ రాథోడ్ అన్నారు. 24 గంటలు పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వరంగల్ రూరల్ పి.శ్రీనివాసరావు, వరంగల్ అర్బన్ బాలస్వామి, మహబూబాబాద్ డీపీఈఓ దశరథ్, భూపాలపల్లి డీపీఈఓ శశిధర్రెడ్డి, జనగామ డీపీఈఓ మహిపాల్ రెడ్డి, సీఐలు, పాల్గొన్నారు. -
బెల్టు తీస్తే ఒట్టు..!
చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి అబ్కారీ పరిధిలో 442 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో 70 శాతం దుకాణాల వద్ద అనధికారిక బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. మద్యానికి బాని సైనవాళ్ల బతుకుల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. జిల్లాలో నెలకు 200 వరకు బెల్టు దుకాణాలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు చేసినా, మద్యం స్వాధీనం చేసుకున్నా..‡ ఆదాయానికి అలవాటుపడ్డ వారు ఈ వ్యాపారాన్ని మానలేకపోతున్నారు. టీడీపీకి చెందినవారికి ఉపాధి చూ పడానికే అన్నట్లు గ్రామాల్లో బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. బెల్టు దుకాణాలపై జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసే సమయంలోముందస్తుగా కొందరు వ్యాపారులకు సమాచారం లీక్ చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కేసులు తగ్గినప్పుడు అధికారులు, మద్యం దుకాణాల నిర్వాహకులకు ఫోన్లు చేసి మనుషులను పంపాలంటూ నామమాత్రపు అరెస్టులు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాబువి నీటి మూటలు.. గతేడాది జూలైలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్లీనరీలో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని, రాష్ట్రంలో ఎక్కడా బెల్టుదుకాణం లేకుండా చేస్తామని చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల్లో బెల్టు దుకాణం లేకుండా చేస్తామన్నారు. అవి నీటిమూటలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు ఊపందుకోవాలంటే బెల్టు దుకాణాలు ఒక్కటే ప్రత్యామ్నాయమనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెల్టు దుకాణాలు తీసేయడానికి ప్రభుత్వం ఇష్టపడటంలేదు. జిల్లా ఆబ్కారీ శాఖలో ఎౖMð్సజ్ సహాయ కమిషనర్, సూపరింటెండెంట్ పోస్టుతో పాటు మొత్తం 2 వేల వరకు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం తమపై అదనపు భారం మోపుతోందని కొందరు ఆబ్కారీ అధికారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళా లేదు... టౌన్లో ఎక్కడ పడితే అక్కడ వేళాపాళా లేకుండా మద్యం అమ్మతా ఉండారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియడంలేదు. రోడ్లపై ఉన్న చిల్లర అంగళ్లలో కూడా క్వార్టర్ బాటిళ్లు అమ్మతా ఉండారు. ఎప్పుడూ గొడవలే. రోడ్డుపై నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంది. – చిట్టెమ్మ, చిత్తూరు కుటుంబాల్లో తిండి లేదు.. మధ్య తరగతి కుటుంబాలు మద్యానికి బానిసై జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. చాలదన్నట్లు ప్రతి చిల్లర దుకా ణంలో మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబా ల్లో మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లకు తినడానికి తిండి కూడా పెట్టడంలేదు. – కళైఅరసి, ఎంపీటీసీ సభ్యురాలు,నంగమంగళం, గుడిపాల కేసులు పెడుతున్నాం.. బెల్టు షాపులను తొలగించడానికి రోజూ ఓ ప్రణాళికతో పనిచేస్తున్నాం. కేసులు పెట్టి నిందితులను అరెస్టు కూడా చేస్తున్నాం. ఏడాదిలో ఆరు మద్యం దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశాం. – మధుమోహన్రావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరు. -
బిగుసుకోని బెల్ట్..!
పశ్చిమగోదావరి ,తణుకు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో అధికార పార్టీ నాయకులకు ఇప్పటికే గుబులు పట్టుకుంది. ఈ పథకాలపై ప్రజల్లో చర్చ రావడంతో జనాన్ని మభ్యపెట్టే పనిలో పార్టీ నాయకులు పడ్డారు. ఇందులో భాగంగానే బెల్ట్ దుకాణాలు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు నీటిమీద రాతలే అయ్యాయి. అనధికార మద్యం విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన ఆదేశాలు వట్టివే అని తేలిపోయింది. తాజాగా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో కల్తీ మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో ఎక్సైజ్ అధికారులు మరోసారి పరుగులు పెడుతున్నారు. సత్యవాడ గ్రామంలో ఒక బెల్టుషాపులో కొనుగోలు చేసిన మద్యం తాగినందుకే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారని పోలీసు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా తేల్చడంతో బెల్టుషాపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార మద్యం విక్రయాలపై దాడులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా కొన్ని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా దాడులతో ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. మద్యం దుకాణాలకు దీటుగా బెల్టుషాపులు అమ్మకాలు సాగిస్తున్నాయి. మూసివేత బూటకమే బెల్ట్ షాపులను సమూలంగా మూసివేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. మద్యం పాలసీల్లో భాగంగా తీసుకున్న విధాన నిర్ణయాల కారణంగా అప్రతిష్టను మూటకట్టుకుని మహిళల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటివరకు బెల్ట్ షాపులను నిరోధించకపోగా వీధి వీధినా పుట్టగొడుగుల్లా ఏర్పాటుకు పరోక్షంగా సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బే«ఖాతరు చేస్తూ రాష్ట్ర రహదారుల స్థాయిని తగ్గిస్తూ జీవో జారీ చేసి మళ్లీ యథావి«ధిగా మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ పరిస్థితుల్లో బెల్ట్ షాపుల మూసివేత ప్రహసనమే అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బెల్ట్షాపుల మూసివేత ఒక బూటకమని ప్రజలు అప్పట్లోనే ఆరోపించారు. మద్యం షాపులకు లక్ష్యాలు జిల్లాలో 474 మద్యం దుకాణాలు, 39 బార్లు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా ఏటా రూ.123 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. అయితే ఒక్కో దుకాణం పరిధిలో కనీసం 5 వరకు బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ శివార్లోని కిళ్లీ దుకాణాలు, కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రెస్టారెంట్లు పేరుతో అనధికార సిట్టింగ్లు వేసి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తడం లేదు. ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీ మద్యం అమ్మకాలకు సంబంధించి లక్ష్యాలు విధిస్తున్నందున మద్యం వ్యాపారులు బెల్ట్ షాపుల ఏర్పాటుకు అధికారుల నుంచి అనధికార ఆమోదం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మద్యం షాపుల ఏర్పాటును మహిళలు వ్యతిరేకిస్తున్నందున వ్యాపారులు బెల్ట్షాపుల ద్వారానే అత్యధికంగా విక్రయాలు జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. జాతీయ రహదారి వెంబడి హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లోనూ అనధికార బార్లు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలను ప్రభుత్వం మరింత పెంచుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పగలు సమయాల్లో చిన్నచిన్న బడ్డీ కొట్లుగా వ్యాపారాలు సాగిస్తూ రాత్రయ్యే సరికి బార్లుగా మార్చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక మద్యం దుకాణం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ దీనికి అనుబంధంగా గ్రామాల్లో పది నుంచి 15 వరకు బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎక్కువ శాతం బెల్టుషాపులు అధికార పార్టీ నాయకులు నడుపుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోప ణలు ఉన్నాయి. సత్యవాడ ఘటనతో మేల్కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
వైన్స్ నిల్.. ‘బెల్ట్’ ఫుల్
సదాశివనగర్(ఎల్లారెడ్డి)/బీబీపేట(కామారెడ్డి) : మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికారుల కన్నుసైగలలోనే ఈ తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెతి చూడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 37 వైన్స్ దుకాణాలు, మూడు బారులు కొనసాగుతున్నాయి. అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారని తెలుస్తోంది. ప్రతి నెల ముడుపులు అందడంతో వారు బెల్టు దుకాణాలపై దృష్టి సారించడం లేదని స్పష్టమౌతుంది. మద్యం షాపుల ప్రతి నెల రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్లలో మద్యం సేవించ రాదు, బార్లలో సీల్డ్ మద్యం అమ్మరాదు. వైన్స్కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు, బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటలవరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు. ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు.. మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్కు రూ.10 నుంచి రూ.20 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే.. అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్టాండ్లలోనే బెల్టు షాపులు నిర్వహిస్తుండటం, రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపుపై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే బైండోవర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండెవర్ చేస్తున్నాం. బెల్టు దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. –శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెల్టు షాపులకు అనుమతులు లేవు గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. ఒకవేళ అమ్ముతున్నారని ఎవరైనా సమాచారం అందిస్తే బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐ, దోమకొండ -
జోరుగా ‘బెల్టు’ దందా
నవాబుపేట : గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు గానీ మద్యం మాత్రం పుస్కలంగా దొరుకుతోంది. నవాబుపేట మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరుగా కొనసాగుతుంది. అమ్మకాలు నిలిపివేయాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని కిరాణం షాపులు బెల్టు షాపులగా దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని గంగ్యాడ, గుబ్బడిపత్తేపూర్, ఎల్లకొండ, అక్నాపూర్, మమ్మదాన్పల్లి, కొజ్జవనంపల్లి, కడ్చర్ల, మూలమాడ, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, మైతాప్ఖాన్గూడ తదితర గ్రామాల్లోని కిరాణం షాపుల్లో మద్యం విరివిగా దొరుకుతుంది. కొంత మంది షాపుల్లో కాకుండా ఇరుగుపొరుగు ఇళ్లలో మద్యం పెట్టి అడిగిన వారికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు ముఖ్యంగా గంగ్యాడలో 8 కిరాణం షాపులు ఉండగా అందులో 7 దుకాణాల్లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. నిత్యం రూ. 50 వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే మెతాప్ఖాన్గూడ గ్రామంలో సైతం అదే పరిస్థితి. ఇటీవల గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ చేయగా భారీగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న బెల్టు షాపుల యజమానులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పాల్పడుతున్నారు. బోనాల పండుగకు భారీగా మద్యం నిల్వ నవాబుపేట మండలంలో సోమవారం బోనాల పండుగ నేపథ్యంలో బెల్టు షాపుల యజమానులు భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు సమాచారం. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు కాకుండా క్వాటర్పై రూ. 30 అదనంగా అమ్ముకుంటున్నారు. అధిక రేట్లు అని నిలదీస్తే మావద్ద మద్యం లేదని పంపిస్తారు. దీంతో చేసేదేమీ లేక వారు అమ్మిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు అడ్డుకునేవారే లేరు సర్పంచ్గా గెలువగానే గ్రామస్తుల అభిప్రాయంతో మద్యం అమ్మరాదని తీర్మానం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులకు తెలిపినా నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారు. అధికారుల అండతో ఇష్టం వచ్చినట్లు మద్యాన్ని అమ్ముతున్నారు. అక్రమ మద్యం అమ్మకాలను ఆపే వారే లేరు. – గోవిందమ్మ, గంగ్యాడ మాజీ సర్పంచ్ అధికారుల నిర్లక్ష్యంతోనే.. గ్రామంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. పలుమార్లు నేనే స్వయం గా ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. బెల్టుషాపులు నడుస్తున్నాయని తెలిసి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల కనుసన్నల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలి. – గోపాల్గౌడ్ అక్నాపూర్, మాజీ సర్పంచ్ చర్యలు తీసుకుంటాం నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు మాకు సమాచారం అందింది. ఇది వరకు దాడులు చేసి పలువురిపై కేసులు కూడా నమోదు చేశాం. మళ్లీ దాడులు చేస్తాం. క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ నాగేష్, నవాబుపేట -
పదిళ్లకో బెల్టు షాపు..
ఈయన పేరు మల్లేశం. భార్య పేరు సాయమ్మ. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రోజువారీ కూలీనే వీరి జీవనాధారం. వీరి ఇంటి పక్కనే బెల్ట్షాప్ ఉంది. మల్లేశం ప్రతిరోజూ తాగుడుకు రూ.250 నుంచి రూ.300 దాకా ఖర్చు చేయడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా కూలీకి వెళ్లడమే మానేశాడు. సాయమ్మ ఒక్కతే కూలీకి వెళ్లి భర్త, పిల్లలను సాకాల్సిన దుస్థితి. తాగుడు మానేయాలని భర్తతో సాయమ్మ తరచూ గొడవపడేది. పది రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఉన్న మల్లేశం.. సాయమ్మను కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తాను పొడుచుకుని ఆసుపత్రి పాలయ్యాడు! కోరుట్ల : ఇలాంటి అఘాయిత్యాలు ఒకట్రెండు కాదు.. పది రోజులకో నేరం.. నెలకో ఘోరం అక్కడ కామన్గా మారిపోయాయి. మద్యం ఏరులై పారుతుండటంతో ఆ మత్తులో చిక్కి కూలీలు చిత్తయిపోతున్నారు. ఇదెక్కడో అడవుల్లోని తండాలోనో, మారుమూల ఊరిలోనో జరుగుతున్న తంతు కాదు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని అల్లమయ్యగుట్టలో లిక్కర్ సృష్టిస్తున్న బీభత్సం! పది ఇళ్లకో బెల్ట్ షాపు: అల్లమయ్యగుట్ట కాలనీలో సుమారు 300 ఇళ్లు ఉండగా.. బెల్టు షాపులు 30 ఉన్నాయి. జనాభా 1,200 నుంచి 1,500 వరకు ఉంటుంది. కాలనీలో ఉన్నవారంతా రోజువారీ కూలీలే. ఉదయం లేచింది.. మొదలు సాయంత్రం వరకు అంతా పనిచేసి రాత్రి వేళ ఇంటికి చేరుకుంటారు. కాయకష్టం మరిచిపోవడానికి కూలీలు మద్యానికి అలవాటు పడ్డారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు బెల్ట్షాపులు ఇబ్బడిముబ్బడిగా తెరిచారు. గల్లీకో బెల్ట్షాపులు ఏర్పాటయ్యాయి. చిన్నచిన్న కిరాణా షాపుల్లో.. టేలల్లో.. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ 24 గంటలు మద్యం(చీప్ లిక్కర్) అందుబాటులో ఉంటుంది. అది తాగి కూలీలు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. తాగి గొడవలు పడటం.. పొద్దంతా కష్టించి సంపాదించిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో కాలనీవాసుల బతుకులు చితికిపోతున్నాయి. మూడొంతుల కూలి మద్యానికే.. అల్లమయ్యగుట్ట కాలనీవాసులు రోజువారీ సంపాదించే కూలి డబ్బులో మూడొంతులు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు మద్యం అమ్మకాలతో రోజుకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం ఉంటోంది. ఈ లెక్కన 30 బెల్ట్ షాపులకు కాలనీ వాసులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుల్లోంచి ప్రతీరోజు రూ.60 వేల దాకా చేరుతోంది. ఇలా కాలనీవాసులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అనేక నేరాలు జరుగుతున్నాయి. ‘మామూళ్ల’.. మత్తు! అల్లమయ్యగుట్ట కాలనీలో సగానికిపైగా జనం మద్యం మత్తులో మునిగి తేలుతుండగా.. అడ్డగోలుగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతోంది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న వేములవాడ ప్రధాన రహదారి వెంట దాదాపు నాలుగు బెల్ట్షాపులు ఉన్నాయి. కాలనీలో సుమారు 14 వీధులు ఉండగా వీధికి రెండు చొప్పున బెల్ట్షాపులు వెలిశాయి. వీటన్నింటికీ కోరుట్లలోని వైన్ షాపుల నుంచి మద్యం సరాఫరా అవుతోంది. ఈ విషయం తెలిసినా వైన్ షాపుల నుంచి నెలవారీ మాముళ్లు అందుతుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీకి చెందిన యువకులే అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. ఆడోళ్లకు భద్రత లేదు మా కాలనీలో ఎక్కడపడితే అక్కడ మందు దొరుకుతంది. మొగోళ్లు పనులు బంద్ చేసి చీప్ లిక్కర్ తాగుతున్నరు. పొద్దస్తమానం తాగడంతో ఆడోళ్లు పరేషాన్ అవుతున్నరు. ఎప్పుడు ఆడోళ్ల మీద ఏం ఘోరం జరుగుతుందోనని భయపడుతున్నం. – ఎల్లవ్వ, అల్లమయ్యగుట్ట కాలనీ 24 గంటలు మందు.. కాలనీలో అంతా కూలీనాలి చేసుకునేటోళ్లమే. పెళ్లాం.. మెగుడు కలిసి పనిచేస్తే వచ్చేది రూ.500. అందులో తాగుడుకే సగం డబ్బులు పోతున్నయ్. కాలనీలో ఎక్కడపడితే అక్కడ లిక్కర్ అమ్ముతున్నరు. - వీరభద్ర నగేశ్, అల్లమయ్యగుట్ట కాలనీ -
ప్రభుత్వ పెద్దల అండతో ‘బెల్టు’కు జోష్
సాక్షి, అమరావతి: బెల్టు షాపులు ఎక్కడా లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బెల్టు షాపులు నానాటికీ విస్తరిస్తున్న తీరే ఆ విషయం బయటపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెల్టు షాపులను మరింత విస్తరించాలని ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. నిజానికి టీడీపీ నేతలే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఫోన్ కొడితే మద్యం బాటిళ్లను ఇంటికే చేరవేస్తూ సిండికేట్లు ప్రజలను మద్యానికి మరింత బానిసలను చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఫ్యాన్సీ, కూల్డ్రింక్ షాపులు, మెడికల్ షాపుల్లో బెల్టు షాపులు నిర్వహించిన వారు ఇప్పుడు మద్యం గోడౌన్లు, తోపుడు బండ్లపైనా అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో బాటిల్పై రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తూ.. పగలు–రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవలే ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఓ గోడౌన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గోడౌన్లపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా.. అనుమతులు ఉన్నాయంటూ అధికారులు పట్టించుకోవడంలేదు. గోడౌన్లను కూడా సిండికేట్లు కేంద్రంగా చేసుకుని బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆసరాతో ఎన్నికల్లోగా బెల్టు షాపులు మరిన్ని పెంచేందుకు మద్యం సిండికేట్లు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ‘బెల్టు’ ఆదాయం రూ.9 వేల కోట్ల పైనే.. బెల్టు షాపుల ద్వారా మద్యం వ్యాపారం ఏటా రూ. 9 వేల కోట్లకు పైగా జరుగుతోందని అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా పదికి తక్కువ కాకుండా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ. 17,291 కోట్ల మేర జరుగుతున్నాయి. ఇందులో రూ. 9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా బెల్టు దుకాణాల ద్వారానే అమ్మకాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఇక అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల వేలం పాటలకు రంగం సిద్ధమైంది. మద్యం వ్యాపారులు సిండికేట్ గొడుగు కిందకు రాకుండా వ్యాపారం నిర్వహించినా.. బెల్టు షాపుల విషయంలో పోటీ పడినా.. ఎక్సైజ్ శాఖ అధికారులు మధ్యవర్తిత్వం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. సీఎం తొలి సంతకం ఏమైంది? సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకాల్లో బెల్టు షాపులు రద్దు కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకూ దానిపై చర్యలు లేవు. బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో కలసి రాష్ట్రంలో బెల్టు షాపులు తొలగించాలని వినతి పత్రం అందించారు. 15 రోజుల్లోగా బెల్టు షాపుల రద్దుపై చర్యలు తీసుకోకుంటే మహిళలే మద్యం దుకాణాల్ని ధ్వంసం చేస్తారన్నారు. -
‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’
సాక్షి, విజయవాడ : 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. బెల్టు షాపులను తొలగించాలని కోరుతూ బుధవారం ఆమె ప్రసాదం పాడు ఎక్సైజ్ కార్యాలయంకు వెళ్లి కమిషనర్కు వినతిపత్రం అందిచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఆరోపించారు. మహిళల సాధికారత దిశగా చంద్రబాబు సర్కార్ ఆలోచించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ఒక్క సంతకం పెడితే ఆ నిమిషం నుంచే ఏదైనా అమల్లోకి రావాలని, అది వైఎస్సార్సీపీతోనే సాధ్యమవుతుందన్నారు. కోర్టులను కూడా ఎక్సైజ్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
గల్లీకో ‘బెల్టు’!
తుంగతుర్తి నుంచి వర్ధెల్లి వెంకటేశ్వర్లు అదో మండల కేంద్రం.. 2 వేల పైచిలుకు కుటుంబాలు.. వ్యవసాయం, అనుబంధ వృత్తులపై ఆధారపడి పొట్టబోసుకునేవారే ఎక్కువ.. ఇక్కడ ప్రభుత్వం అనుమతించిన మద్యం షాపులు మూడంటే మూడే! కానీ అక్రమంగా వెలిసిన బెల్టుషాపులెన్నో తెలుసా.. 50కిపైనే!! ఇక ఆ మండల కేంద్రాన్ని ఆనుకొని 10 కిలోమీటర్ల పరిధిలో 12 గ్రామాలున్నాయి. ఆ పల్లెల్లో గల్లీకొకటి చొప్పున ఏకంగా 160కిపైగా బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. ఈ ఒక్క మండల కేంద్రం, దాని పరిధిలోని 12 పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా మొత్తం మద్యం దుకాణాల లెక్క 212గా తేలింది. ఇలా ఈ ఒక్క మండలంలోనే కాదు.. రాష్ట్రంలో చాలాచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. బెల్టు దుకాణాలు పల్లెల్లో గల్లీగల్లీకి పాకుతున్నాయి. ఒకప్పటి టీ కొట్లు, బడ్డీ కొట్లన్నీ ఇప్పుడు బెల్టు దుకాణాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనధికార లెక్కల ప్రకారం లక్షకుపైగా బెల్టు షాపులున్నట్టు సమాచారం. ప్రతి గ్రామంలో సగటున రోజుకు రూ.15 వేల విలువైన మద్యం వ్యాపారం సాగుతోంది. ఆరు నెలల కిందటి వరకు కొంత అదుపులోనే ఉన్న బెల్టు దుకాణాలు ఇటీవలి కాలంలో ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. ‘బెల్టు’లెట్లా వెలుస్తున్నాయంటే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని లైసెన్స్డ్ మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలపై ‘సాక్షి’క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. దీనికి స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు సహకరించారు. తుంగతుర్తి మేజర్ గ్రామ పంచాయతీలో 2,775 కుటుంబాలు ఉండగా.. 8,500 జనాభా ఉంది. దీని చుట్టూ 10.కి.మీ. పరిధిలో కర్విరాల కొత్తగూడెం, బండరామారం, వెంపటి, పసునూరు, వెలుగుపల్లి, గానుగుబండ, అన్నారం, సంగెం, గొట్టిపర్తి, మానాపురం, రావులపల్లి పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి వివిధ పనుల కోసం రోజుకు కనీసం 800 నుంచి 1,000 మంది తుంగతుర్తి వస్తుంటారు. ఈ పట్టణంలో మూడు లైసెన్స్›డ్ మద్యం దుకాణాలు ఉండగా.. వాటిని అనుసంధానంగా 50 బెల్టు దుకాణాలు ఉన్నాయి. తుంగతుర్తి సరిహద్దు తూర్పున కట్టెకోత మిషన్ వద్ద నుంచి పడమర నాగారం రోడ్డు పెట్రోల్ బంకు వరకు ‘సాక్షి’ప్రతినిధి పరిశీలించారు. ఈ మొత్తం నిడివి 1.6 కి.మీ. ఉండగా.. ఇందులోనే మూడు లైసెన్స్డ్ ఏ4 మద్యం దుకాణాలు, 11 బెల్టు దుకాణాలు కనిపించాయి. గతంలో ఈ దుకాణాల్లో చాయ్, చిన్నచిన్న తినుబండారాలు విక్రయించేవారని స్థానికులు పేర్కొన్నారు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు సుమారు 400 మీటర్ల దూరంలో పూలగడ్డ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు అన్నీ వ్యవసాయం, కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న కుంటుంబాలే ఉన్నాయి. ఈ బజారులో 15 బెల్టు దుకాణాలు ఉన్నట్లు తేలింది. ఇవేగాకుండా పాత బడి సెంటర్లో 6, తూర్పువాడలో 8 చొప్పున బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. మొత్తంగా తుంగతుర్తిలో 50, అన్నారం 30 వెంపటిలో 20, సంగెంలో 10, వెలుగుపల్లిలో 22, రావులపల్లిలో 10, గొట్టిపర్తిలో 19, గానుగుబండ 10, తూర్పుగూడెంలో 8, బండరామారంలో 20, కొత్తగూడెంలో 8, మానాపురం 5 చొప్పున 212 బెల్టు దుకాణాలు ఉన్నట్లు లెక్క తేలింది. 40 గ్రామాలు.. 18 రేషన్ దుకాణాలు తుంగతుర్తి మండల పరిధిలో 12 గ్రామపంచాయతీలకు అనుబంధంగా 28 ఆవాసాలు కలిపి మొత్తం 40 గ్రామాలున్నాయి. ప్రజలకు నిత్యావసరాలు అందించే రేషన్ దుకాణాలు మాత్రం కేవలం 18 గ్రామాల్లోనే ఉన్నాయి. ఇందులో రావులపల్లి గ్రామానికి రేషన్ డీలర్ పోస్టు ఖాళీగా ఉండగా.. గొట్టిపర్తి రేషన్ డీలర్కు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక వైద్యం విషయానికి వస్తే దాదాపు 35 వేల పైచిలుకు జనాభా ఉన్న తుంగతుర్తి మండలంలో ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. వెలుగుపల్లి, వెంపటి, సంగెం, గొట్టిపర్తి గ్రామాల్లో మాత్రమే ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఎమ్మార్పీ ఏది? తుంగతుర్తిలోని మూడు లైసెన్స్›డ్ మద్యం దుకాణాల యాజమాన్యాలు సిండికేట్ అయ్యాయి. రెండు దుకాణాల్లో రిటెయిల్గా విక్రయిస్తుండగా.. గాంధీ బొమ్మకు సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణం నుంచి పూర్తిగా బెల్టుషాపులకే మద్యం విక్రయిస్తున్నారు. రిటెయిల్ దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన లేదుగానీ బెల్టు దుకాణాలకు మాత్రం ఫుల్లుకు రూ.40, క్వార్టర్కు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టు షాపుల్లో రిటెయిల్ విక్రయ దుకాణాల్లో జరిగే రోజువారి గిరాకీకి నాలుగు రెట్లు ఎక్కువ బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బెల్టు దుకాణాలపై అటు ఎక్సైజ్ కానీ, ఇటు పోలీసులు కానీ దాడులు చేయకుండా చూసుకునే బాధ్యత లైసెన్స్›డ్ దుకాణాల సిండికేటుదే. స్థానిక పోలీసులకు రూ.20 వేలు, ఎక్సైజ్ పోలీసులకు రూ.8 వేల చొప్పున నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలేం చెబుతున్నాయి? ఎక్సైజ్ నింబంధనల ప్రకారం టీఎస్బీసీఎల్ (తెలంగాణ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్) నుంచి ఒక దుకాణానికి కేటాయించిన మద్యం సీసాలను వేరొక దుకాణం నుంచి విక్రయించటం నేరం. మద్యం మార్పిడి విక్రయాలు చేస్తూ పట్టుబడిన దుకాణానికి 9 రోజుల పాటు లైసెన్స్ను రద్దు చేసి, రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. ఇదే కేసులో పదేపదే పట్టుబడితే లైసెన్స్ను పూర్తిగా రద్దు చేస్తారు. కానీ ఇక్కడ బహిరంగంగానే ఒక దుకాణం మద్యం మరో దుకాణంలో విక్రయిస్తున్నారు. మామూళ్లు తీసుకొని స్థానిక, ఎక్సైజ్ పోలీసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. నడుపుతోంది యువతే.. బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న కుటుంబాల్లో 80 శాతం మంది పదో తరగతి నుంచి డిగ్రీలోపు చదువుకున్న యువతే ఉంది. చదివిన చదువులకు ఉద్యోగాలు రాక, వ్యవసాయ పనులు చేసుకోలేక మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్నామని తుంగతుర్తికి చెందిన ఓ యువకుడు చెప్పాడు. రూ.4 వేల నుంచి రూ.5 వేల పెట్టుబడి పెడితే అన్నీ ఖర్చులు పోనూ రోజుకు కనీసం రూ.600 నుంచి రూ.800 వరకు మిగులుతాయని వెలుగుపల్లి గ్రామనికి చెందిన బెల్టు దుకాణం నిర్వాహకుడు తెలిపారు. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు, వ్యవసాయం, అనుబంధ వృత్తులపై ఆధారపడి రోజూ కష్టం చేసుకునే వారే ఎక్కువగా మద్యం తాగుతున్నారు. తుంగతుర్తికి చెందిన ఓ మహిళను పలకరించగా.. ‘‘ఇక్కడే 50కి పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి సార్.. ఈడు మీదున్న పిల్లలే ఎక్కువగా తాగుతున్నరు’’అని చెప్పారు. మరికొందరు మహిళలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బెల్టుషాపులపై ఉక్కుపాదం
యాచారం : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ గ్రామాల్లో ప్రశాంతత కోసం ముందు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు విచ్చలవిడిగా మద్యం తాగడం వల్లే ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణంకు దారి తీస్తుందని అంచనాకు వచ్చిన పోలీస్ శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో మద్యం బాటిల్ కానీ, నాటు సారాయి కానీ దొరక్కుండా కట్టడి చర్యలకు ఉపక్రమించింది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మేజర్ గ్రామ పంచాయతీలైన నక్కర్తమేడిపల్లి, యాచారం, గునుగల్, నందివనపర్తి, మాల్, చింతపట్ల తదితర గ్రామాల్లోని ఆశావహులు నిత్యం దావత్లు ఇస్తుండడంతో తాగుబోతుల వీరంగం అంతా ఇంతా కాదు. మాల్, గునుగల్, యాచారం కేంద్రాల్లో ఉన్న వైన్స్ దుకాణాల నుంచి నిత్యం ఆయా గ్రామాల్లోని బెల్టు దుకాణాల వ్యాపారులు వేలాది రూపాయలు విలువ జేసే మద్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. స్థానికంగానే మద్యం దొరకడం వల్ల మందుబాబులు అర్థరాత్రి వరకు తాగుతూ గ్రామాల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో ఏ క్షాణాన ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళన నెలకొంది. బెల్టు దుకాణాలపై ఏకకాలంలో దాడులు మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో దాదాపు 150కి పైగానే బెల్టు దుకాణాలున్నట్లు పోలీస్ శాఖ అంచనాకు వచ్చింది. ఆయా గ్రామాల్లో ఏ బెల్టు దుకాణం దారుడు మద్యం విక్రయాలు జరుపుతారనే సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా సేకరించిన పోలీసులు ఏక కాల దాడులకు నిర్ణయించారు. పక్షం రోజుల వ్యవధిలోనే మద్యం విక్రయాలు జరుపుతున్నందుకు గాను ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సీఐ లిక్కి కృష్ణంరాజు పర్యవేక్షణలో ఎస్సైలు వెంకటయ్య, సురేష్, 30 మందికి పైగా పోలీస్ సిబ్బంది గ్రామాల్లో ఉన్న బెల్టు దుకాణాలపై ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నక్కర్తమేడిపల్లి, మల్కీజ్గూడ, నానక్నగర్, చింతుల్ల, గునుగల్, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోని బెల్లు దుకాణాలపై దాడులు చేసి వ్యాపారులను గట్టిగా హెచ్చరించారు. 20 మందికి పైగా వ్యాపారులను అదుపులోకి తీసుకుని మళ్లీ మద్యం బాటిల్ విక్రయించినా కేసు నమోదు చేసి ఆరు నెలలు జైలుకు పంపిస్తామని పేర్లు నమోదు చేసుకుని వదిలేశారు. యాచారం, మాల్, గునుగల్ కేంద్రాల్లో ఉన్న వైన్స్ వ్యాపారులను కూడా కలిసి బెల్టు దుకాణాల వ్యాపారులకు మద్యం విక్రయించరాదని, విక్రయాలు జరిపితే మీపైన కూడా కేసులు నమోదు చేయడంతో పాటు వైన్స్ షాపులు సీజ్ చేస్తామని హెచ్చరికలు చేశారు. ఏకకాల దాడుల వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పోలీస్ చర్యలు అభినందనీయం గ్రామాల్లో బెల్టు దుకాణాలపై పోలీసులు ఏక కాలంలో దాడులు చేయడం వల్ల గ్రామాల్లో మద్యం విక్రయాలు తగ్గాయి. ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామంలో చూసినా మందుబాబుల వీరంగం ఉంది. సర్పంచ్లుగా పోటీ చేసే ఆశావహులు నిత్యం రూ. వేలల్లో ఖర్చు చేసి అప్పులపాలైనారు. మద్యం కట్టడికి పోలీస్ శాఖ చర్యలు అభినందనీయం. – తలారి మల్లేష్, తక్కళ్లపల్లి మద్యం అమ్మితే ఫిర్యాదు చేయండి మండలంలోని 24 గ్రా మ పంచాయతీల్లో బెల్టు దుకాణాల వ్యాపారులు మద్యం విక్రయాలు జ రిపితే 94906 17313 ఫోను నంబరుకు ఫిర్యా దు చేయాలి. వెంటనే ఆ దుకాణంపై దాడులు చేసి వ్యాపారితో పాటు వైన్స్ యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తాం. మద్యం వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం లేకుండా పోతుందనే ఏక కాల దాడులకు దిగాం. – లిక్కి కృష్ణంరాజు, సీఐ యాచారం -
పల్లెల్లో మద్యం పడగ
సాక్షి, మహబూబ్నగర్ క్రైం : నిండు వర్షాకాలంలో మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉండొచ్చేమో గాని.. మద్యానికి మాత్రం ఎలాంటి కొదువ లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతూ.. పెద్దఎత్తున దాడులు చేయిస్తోంది.. వ్యాపారులు, తయారీదారులపై పీడీ యాక్టు అమలుచేస్తోంది. ఫలితంగా సారా తయారీ, అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బెల్టు దుకాణాలు ఆక్రమించాయి. ఏ మూల చూసినా అవే దర్శనమిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కొరవడడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, హోటళ్లు, పాన్ డబ్బాల్లో మద్యం వాసన గుప్పుమంటోంది. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టుల సాయంతో అక్రమార్జన మహబూబ్నగర్ జిల్లాలో బెల్టు దుకాణాల సం ఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 66 వైన్స్ దుకాణాలుండగా ఒక్కోదానికి సగటున 20 నుంచి 40 బెల్టు దుకాణాలతో సంబంధాలుండటం విశేషం. మరికొంద రు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటళ్లు, కిరాణ దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ పేరుతో బోర్డులు తగిలిస్తున్న వ్యాపారులు బెల్టుల సాయంతో అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ప్రతి రోజు వైన్స్తో సమానంగా బెల్టు దుకాణాల్లో వ్యా పారం సాగుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా నిత్యం రూ.50 లక్షల వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేకంగా కొన్ని వైన్స్ దుకాణాలు ఇదే పనిగా ముందుకు సాగుతున్నాయి. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకుని రికార్డుల్లో నమో దు చేస్తూ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. నాసికరం మద్యం.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు నాసిరకం మద్యానికి దారి తీస్తున్నాయి. వైన్స్ దుకాణాల నుంచి తీసుకొచ్చిన దానికి దుకాణదారులకు చెల్లించిన దానికంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 ధర పెంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సీసాల్లో మద్యాన్ని తొలగించి నీళ్లు కలుపుతున్నారు. బెల్టు దుకాణాల్లో బీర్లు కొనుగోలు చేయాలన్నా అదనంగా రూ.40 చెల్లించాల్సిందే. ఎక్కువ శాతం చీప్లిక్కర్ తాగే వారి కోసం బెల్టు దుకాణాల్లో కొన్ని బ్రాండ్లను అసలు ధర కంటే అదనంగా రూ.40కి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేల కంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు దుకాణాలు గల్లీగల్లీలో విస్తరించాయి. బెల్టు దుకాణారులకు మద్యాన్ని సరఫరా చేయడంతో సిండికేటు దందా సాగించే వారికి రోజువారీగా సగటున రూ.20 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందని అంచనా. రూ.లక్షలు వెచ్చించి టెండర్ల ద్వారా దుకాణాలు దక్కించుకున్నందుకు లాభసాటిగా ఉండాలనే తాపత్రయంతో నిలువునా ముంచేస్తున్నారు. మరోపక్క అదనంగా డబ్బులు చెల్లించి బెల్టు దుకాణాలను కొనసాగించినందుకు మాకు లాభం లేకపోతే ఎలా? అనే ధోరణితో బెల్టు దుకాణం నకిలీ మద్యంతో మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేబుల్స్ తొలగించి విక్రయాలు ఎక్సైజ్ అధికారులు నిబంధనలు మాత్రం బేషుగ్గా ఆదేశిస్తున్నారు. మద్యం సీసాలను ఏ దుకాణానికి ఏ లేబుల్తో పంపిణీ చేశారో అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ దుకాణానికి సరఫరా చేసిన సీసాలను అక్కడే విక్రయించాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. ప్రత్యేకంగా ఒక్కో దుకాణానికి ఒక్కో కోడ్ను కేటాయించారు. ఈ తతంగమంతా మద్యం గొలుసుకట్టు దుకాణాల విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే. ఆచరణలో చూస్తే కేవలం కాగితాలకే ఆ నిబంధనలను పరిమితం చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. మరో పక్క ఏంచక్కా సీసాలకు ఉన్న లేబుల్స్ను తొలగించి విచ్చలవిడిగా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ కూర్చోబెట్టి.. గ్రామాల్లో ఎక్కడ పడితే సిట్టింగ్ రూంలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా వైన్స్ సిట్టింగ్ రూంల వద్ద వాహనాలు తనిఖీ చేసి, బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు చేసి కేసులు చేస్తున్నారు. దీంతో మందుబాబులు ప్రధాన మద్యం దుకాణాలను వదిలి గ్రామాల బాట పడుతున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనేక నిబంధనలున్నాయి. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టాలి. నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. కంప్యూటరైజ్ స్కానింగ్ చేయాలి. దీంతో ఏ రకం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో విక్రయించింది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత దుకాణంపై నిఘా ఉంచుతారు. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యంతోపాటు నీటి ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు సైతం విక్రయిస్తూ అక్కడే మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. -
వైన్స్ వద్దు...బెల్టే ముద్దు..
భద్రాచలం : ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి. సిండికేటైన వ్యాపారస్తుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. వీటికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సిండికేట్ దందా’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. భద్రాచలంతోపాటు జిల్లా అంతటా బెల్టు షాపుల దందా సాగుతోంది. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం మండలంలోని కొన్ని ప్రాంతాలను ‘సాక్షి’ పరిశీలించింది. భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లోగల పాన్ షాపులో మద్యం విక్రయాలు జరిగాయి. ఉదయ భాస్కర్ సినిమాహాల్ ముందు, చర్ల రోడ్లోని గాయత్రీ ఆలయం సమీపంలోని పాన్ షాపులు, కాలేజీ సెంటర్, పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్లో కాలేజీ గ్రౌండ్ వెనుక గల పాన్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం ధృవీకరించినట్లుగా తెలిసింది. భద్రాచలం పట్టణంలో ప్రజానీకానికి ఇబ్బందికరంగా కొన్నిచోట్ల బెల్టు షాపులు నిర్వహణ సాగుతున్న విషయం వాస్తవమేనని నిఘా వర్గాలు సైతం ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఎక్సైజ్Œ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెస్టారెంట్లలో అమ్మకాలు ఫ్యామిలీ రెస్టారెంట్లుగా బోర్డులు తగిలించినచోట కూడా లోపల మద్యం అమ్మకాలు దర్జాగా సాగుతున్నాయి. భద్రాచలం–చర్ల రూట్లో దుమ్ముగూడెం మండలంలోని సీతానగరం వద్ద ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. పర్ణశాల కుటీరానికి సమీపంలో ఉండటంతో తిరుగు ప్రయాణంలో వస్తున్న అనేకమంది ఇక్కడ మద్యం సేవిస్తున్నారు. ఈ రహదారిలో తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కూడా ఈ మద్యం విక్రయాలే కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దుమ్ముగూడెం మండలంలోని ముల్కపాడు సెంటర్లోగల పాన్ షాపులు.. సాయంత్రం వేళ మద్యం దుకాణాలుగా మారిపోతున్నాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పాన్ షాపుల వదంద వాహనాల రద్దీ కనిపిస్తోంది. భద్రాచలం పట్టణంలోని ఓ రెస్టారెంట్లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. క్వార్టర్ బాటిళ్ల కొరత..! మద్యం దుకాణాల్లో ప్రస్తుతం క్వార్టర్ బాటిళ్ల విక్రయాలు నిలిపివేసి, అనుబంధంగా ఉన్న బెల్టు షాపులకు తరలిస్తున్నారని మద్యం ప్రియలు అంటున్నారు. మద్యం షాపుల్లోనైతే ఎంఆర్పీకి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నందున అధిక రేట్లకు విక్రయించేందుకని వాటిని బెల్టు షాపులకు తరలిస్తున్నారని, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మందు బాబులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ, చివరకు ఇళ్ల మధ్య కూడా ఏర్పాటు చేస్తున్న బెల్టు షాపులను నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బెల్ట్ తీసేదెప్పుడో?
గుర్ల : గ్రామాల్లో గుక్కెడు నీరు దొరకడం ఏమో గానీ, మద్యం దొరకని ప్రాంతం లేదు. బెల్టుషాపులను పూర్తిగా నివారిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి విస్తరణకు పూనుకుంటుంది. మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం బెల్టు షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గుర్ల మండలమే చక్కని ఉదాహరణ. మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మండల పరిధిలోనున్న గుర్ల, కోటగండ్రేడు, అచ్యుతాపురంలోనున్న నాలుగు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు జరపాలని అధికారులు లైసెన్స్లు మంజూరు చేశారు. మండలంలోని 37 పంచాయతీలకు ఏదో ఒక మార్గం ద్వారా ఈ నాలుగు షాపుల నుంచి మద్యం బెల్టు షాపులకు సరఫరా అవుతుంది. గ్రామాల్లో మద్యం అమ్మకాలు వద్దంటూ పలుసార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహిళలు ఆందోళన మేరకు గ్రామాల్లో రెండు, మూడు వారాలు పాటు అధికారులు మద్యం నిషేధించారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, షాపు యజమానులకు అధికారులతో పరిచయం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే యథావిధిగా బెల్టుషాపుల్లో మద్యం అమ్ముకుంటున్నారని గ్రామస్తులు నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి. బెల్ట్ షాపులు నడుపుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్శాఖ అధికారులు గంభీరం వ్యక్తంచేసిన అందులో వాస్తవం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నన్స్ సొసైటీ) ఇచ్చిన సమాచారంలో మండలంలో ఎక్కడా బెల్టు షాపులు నిర్వహించలేదనే నివేదికను అధికారులు పంపించారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం బయటకు వస్తుందని గ్రామస్తులు చెబుతు న్నారు. బెల్టు షాపుల్లో ముద్రిత ధరలకు కాకుండా అధిక రేట్లుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మండల శివారు ప్రాంతాలైనా పకీరు కిట్టాలి, కోండగండ్రేడు, దేవునికణపాక గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రత్యామ్నాయంగా సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో మందుబాబులు జోరు ఆరికట్టాలంటే బెల్ట్ షాపులు నియంత్రణ అవసరమని ప్రజలంటున్నారు. ఎక్సైజ్ అధికారులు తూతుమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను నిషేధించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. స్థానిక పోలీసులే నయం స్థానిక పోలీసులు దాడులు చేసి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారు తప్ప ఎక్స్జ్ పోలీసులు మాత్రం ఎక్కడా బెల్ట్ షాపులపై దాడి చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి బెల్ట్ షాపు నడుపుతున్నట్లు ఎక్స్జ్ అ«ధికారులకు సమాచారం ఇస్తే వారి వివరాలను బెల్ట్ షాపు నిర్వహకులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయంపై నెల్లిమర్ల ఎక్సైజ్ సీఐ శైలాజారాణి వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. బెల్ట్ షాపులను నిర్ములించాలి మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రంలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. – చింతపల్లి అప్పారావు, బీజేపీ నాయకుడు, గుర్ల దాడులు చేస్తున్నాం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై తరుచూ దాడులు చేస్తున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నిర్వహకులపై కేసులు నమోదు చేస్తున్నాం. – సంభాన రవి, ఎస్ఐ, గుర్ల -
ఎమ్మార్పీకి ‘బెల్టు’తో బురిడీ!
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారులు రూటు మార్చారు. ఎమ్మార్పీ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటం, పర్మిట్ రూం సామర్థ్యం చూపించి ఎక్సైజ్ అధికారులు వసూళ్లు చేస్తుండటంతో కొత్త పంథా ఎంచుకున్నారు. దుకాణం ద్వారా రోజువారిగా విక్రయించే మద్యంను సగానికి కుదించుకోని ఆ మొత్తాన్ని బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి క్వార్టర్ సీసా మీద కనీసం రూ. 5 చొప్పున ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన ఈ బెల్టు దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేయడం కుదరక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కళ్లు తేలేస్తోంది. అక్రమ మద్యం కేసులు పెట్టి బెల్టు లేకుండా చేస్తే మద్యం విక్రయాల రేటు పడిపోతుందని వెనకడుగు వేస్తోంది. నిబంధనలు పాటిస్తూనే.. మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ధర ఉల్లంఘనను నిరోధించడంతో పాటు అక్రమ, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ’లిక్కర్ ప్రైస్’ యాప్ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న 880 లిక్కర్ బ్రాండ్లను ఈ యాప్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి సీసాకు సంబంధించి క్వార్టర్, ఫుల్ బాటిల్ ఎమ్మార్పీ ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను యాప్తో తెలుసుకోవచ్చు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఆ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 7989111222, టోల్ ఫ్రీ నంబర్ 18004252523కు కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. నిర్ణీత సమయం తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దీంతో గతంలో టెండర్లు వేసినా లైసెన్స్ దక్కని పాత మద్యం వ్యాపారులు నిత్యం దుకాణాల మీద కన్నేసి.. అవకాశం దొరికితే ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులో దొరికితే రూ. 2 లక్షల జరిమానా, 7 రోజుల పాటు లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేస్తోంది. దీంతో ఈ సమస్యలకు మద్యం వ్యాపారులు విరుగుడు కనిపెట్టారు. బెల్టుతో రూ. 8 వేల కోట్ల వ్యాపారం దుకాణంలో నిబంధనలు పాటిస్తూనే.. రోజు వారి మద్యం విక్రయాలను సగానికి తగ్గించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి మద్యం దుకాణంలో సగటున 75 నుంచి 100 కేసుల మద్యం విక్రయించేవాళ్లు. ఇప్పుడు 40 నుంచి 45 పెట్టెలకు మించి అమ్మడం లేదు. మిగిలిన మద్యాన్ని బెల్టు దుకాణాలకు తరలించి ఎమ్మార్పీ మీద రూ. 5 అదనపు ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవెన్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 8 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఎక్సైజ్ అధికారుల మధ్యవర్తిత్వం ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని ప్రభుత్వం టార్గెట్గా నిర్ణయించింది. కానీ అధీకృత మద్యం దుకాణాల ద్వారా 50 శాతం మద్యం కూడా అమ్ముడవదు. దీంతో బెల్టు దుకాణాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ మద్యం దుకాణాలున్న మండలాల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే విషయంలో వ్యాపారులకు గొడవలు రాకుండా ఎక్సైజ్ అధికారులే మధ్య వర్తిత్వం చేసి ఊళ్లను పంచారు. ఒకరికి కేటాయించిన గ్రామంలో మరో వ్యాపారి అడుగు పెట్టకూడదు. ఒప్పందం అతిక్రమించిన వారిపై అధికారులు అక్రమ మద్యం వ్యాపారం కేసులు పెడుతున్నారు. -
ఘల్లుమంది గ్లాసు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో రూ.1,306 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరిలో రూ.1,690 కోట్లు విక్రయాలు జరిగాయి. అంటే.. 29.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఫిబ్రవరిలో రూ.522 కోట్ల మద్యం విక్రయించగా, ఈ నెల 15 నాటికే అమ్మకాల విలువ రూ.780 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 15 రోజులకే రూ.258 కోట్ల అధికంగా అమ్మకాలు జరిగాయి. 15 రోజులకే గతేడాది ఫిబ్రవరి కంటే 49.22 శాతం వృద్ధి రేటు నమోదు కావడంపై ఎక్సైజ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో రూ.79 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.19.58 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది అమ్మకాలపై మొత్తం రూ.15,133 కోట్లకు పైగా ఆర్జించగా, ఈ ఏడాది రూ.17 వేల కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని విధించడం గమనార్హం. 2014లో రూ.11,569 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు పెరగడం గమనార్హం. ఈవెంట్ల పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలకు అనుమతిలిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభం రోజు పార్టీల కోసం ఇష్టమొచ్చినట్లు ఈవెంట్ల పర్మిషన్లు, పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్మకాలకు అనుమతులివ్వడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈవెంట్ల పేరుతో ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. అమ్మకాలు పెరగడానికి కారణాలివే.. - డిస్టిలరీల నుంచి మద్యం నిల్వకు 13 జిల్లాల్లో మద్యం డిపోల సంఖ్య పెరిగింది. డిపోలను పెంచి సరుకు సరఫరాకు అందుబాటులో ఉంచారు. - గతేడాది రూ.15 వేల కోట్ల మద్యం ఆదాయం కోసంరాష్ట్ర ప్రభుత్వం 15 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్లుగా) మార్చేసింది. - చీప్ లిక్కర్ను ఏరులై పారించేందుకు ఏకంగా టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసింది. - మద్యం వ్యాపారులకు కమీషన్లను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. - బెల్టు షాపుల సంఖ్య గతంలో కంటే అధికంగా పెరిగాయి. ఫోన్ చేస్తే ఇంటికే మద్యం వచ్చేలా సిండికేట్లు ఏర్పాట్లు చేశారు. -
తప్పుకదమ్మా..
‘బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టరాదని, మద్యం అమ్మకాలు చేపడితే కేసుల్లో ఇరుక్కుంటామని, చేసింది తప్పని తెలిసినా బెల్టుల్లో మద్యం అమ్మకాల జోరు తగ్గడం లేదు.’ ఇంట్లో యజమానికి, అందివచ్చిన పిల్లలకు మద్యం జోలికి వెళ్లొద్దని చెప్పాల్సిన కొంతమంది మహిళలే బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ పట్టుబడటం విచిత్రం. ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలపై నమోదు చేస్తున్న కేసుల్లో 30 శాతం మహిళలు ఉంటున్నారు. విజయనగరం రూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా నిర్మూలిస్తామని ఇచ్చిన హామీ గాలిలోనే కలిసిపోయింది. దీంతో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలు ప్రకటించడంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు జూలై 19న బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు నెలలు ఎక్సైజ్ అధికారులు 510 కేసులు నమోదు చేశారు. వీటిలో 30 శాతం మంది మహిళలే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టి ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాల నుంచి మద్యం బాటిళ్లు వారి భర్తలో, కుమారులో తీసుకువస్తే ఇంటివద్ద నిర్వహించే చిన్నచిన్న దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించే సమయాల్లో ఇళ్ల వద్ద వీరే ఉండటంతో అధికారులకు పట్టుబడి కేసుల్లో చిక్కుకుంటున్నారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది ఐదు నెలల కాలంలో 71 బెల్టు కేసులు నమోదు చేస్తే 24 కేసుల్లో మహిళలే ముద్దాయిలు కావడం విశేషం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేసిన 99 కేసుల్లో 14 మంది మహిళలు పట్టుబడ్డారు. జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో జూలై 19 నుంచి నమోదైన కేసుల్లో 150మందికి పైగా మహిళలు బెల్టు దుకాణం కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంటి సభ్యులకు చెప్పాల్సిన మహిళలే ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఆందోళనకరమని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. బెల్టు దుకాణాలకు దూరంగా ఉండండి.. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించి కేసుల్లో ఇరుక్కోవడం బాధాకరం. ప్రతి మూడు నాలుగు కేసుల్లో ఒక మహిళ పట్టుబడటం విచారకరం. వీటి నిర్వహణలో మహిళలు దూరంగా ఉండాలి. గ్రామాల్లో బెల్టులు నిర్వహిస్తే అధికారులకు సమాచారం అందించడానికి మహిళలు ముందుకు రావాలి. – ఆరిక శంభూప్రసాద్, ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం -
మహిళల ఆవేదనపై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, దువ్వూరు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వెల్లువెత్తుతున్నారు. ఏడోరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను జొన్నవరంలో సోమవారం ఉదయం పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళలు.. వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. మహిళల ఆవేదన పట్ల స్పందించిన వైఎస్ జగన్... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం వైఎస్ జగన్ ఇక్కుపల్లి జంక్షన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు కదిలారు. ఎన్కుపల్లి, జిల్లెల, కానగూడూరు, ఇడమడక మీదగా చాగలమర్రి వరకూ యాత్ర కొనసాగనుంది. -
మద్యం విక్రయిస్తే 50 వేలు జరిమానా!
శంకరపట్నం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో బెల్ట్షాపుల్లో మద్యం విక్రయించవద్దని మహిళలు నిషేధం విధించారు. ఆదివారం నుంచి గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ. 50 వేలు, మద్యం సేవిస్తే రూ.5 వేలు జరిమానా, మద్యం అమ్మినవారిని పట్టిస్తే రూ.10 వేల బహుమతి అందిస్తామని వైస్ ఎంపీపీ కొయ్యడ పరశురాములు, మహిళలు ముక్తకంఠంతో ప్రకటించారు. గద్దపాకలో మద్యం తాగుడు, అమ్మకాలు బంద్ చేయాలని కోరుతూ మహిళలంతా ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. మద్య నిషేధం అమలు చేయాలని గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీసులకు సమాచారమిచ్చారు. గద్దపాకలో 11 బెల్ట్షాపులు నడుస్తున్నాయని.. కూలీ డబ్బులు మద్యం తాగేందుకే ఖర్చుచేస్తున్నారన్నారు. డబ్బులు లేకున్నా పర్లేదు మందు ఇస్తామని బెల్ట్షాపు నిర్వాహకులు ఫోన్ చేసి మరీ మద్యానికి బానిసలను చేస్తున్నారన్నారు. ఒక్కొక్క బెల్ట్షాపులో రైతుల ఖాతాలు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు ఉన్నాయని మహిళలు కంటతడి పెట్టారు. ఇంట్లో భార్యలు కూలీకి వెళ్లి పత్తి ఏరితే వచ్చిన రూ.100 కూలీ డబ్బులు కూడా తాగుడుకు ఇవ్వమని భర్తలు గొడవ పడుతున్నారన్నారు. గ్రామంలో 80 శాతం పైగా మద్యానికి బానిసలయ్యారని వీఆర్వో తెలిపారు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వచ్చిన జీతంలో తన భర్త రూ.5 వేల మద్యం తాగేందుకు ఖర్చు చేస్తున్నాడని మద్యం అమ్మకాలు లేకుండా చేయాలని ఎస్సై శ్రీనుకు మొరపెట్టుకున్నారు. కాగా, గద్దపాకలో మహిళలు మద్య నిషేధం ప్రకటించారని దీనికి అందరూ సహకరించాలని కేశవపట్నం ఎస్సై సూచించారు. మద్యం అమ్మకాలు చేస్తే కేసు లు నమోదు చేస్తామన్నారు. తాగి.. మంచం పట్టిండు నా భర్తను మద్యం తాగుడుకు బానిసను చేసిండ్రు. మద్యం తాగి.. షుగర్ వ్యాధితో లేవకుండా మంచం పట్టిండు. పోరగాండ్లు తాగుడుకు బానిసలు అవుతుండ్రు. గద్దపాకలో మద్యం అమ్మితే, దాడులు చేసి మద్యం సీసాలు పగులగొడుతం. – భాగ్యలక్ష్మి ఇద్దరు చనిపోయిండ్రు మా ఇంట్లో ఇద్దరు మద్యానికి బానిసలై చనిపోయిండ్రు. మా ఊళ్లో 18 ఏండ్ల పోరగాండ్లను కూడా తా గుడుకు బానిసలను చేత్తండ్రు. బెల్ట్షాపోళ్లు సంపాదన కోసం పేదోళ్లు, రైతులకు మద్యం అలవాటు చేయించి డబ్బులు లాగుతుండ్రు. – పుష్పలత -
ఇంటి ముందుకే మందు
రంగంలోకి ‘మొబైల్ మద్యం’ - ‘బెల్టు’ షాపుల సరికొత్త అవతారం.. హాలోగ్రామ్ లేబుళ్లు తొలగించి సరఫరా - ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో విక్రయాలు.. లిక్కర్ సిండి‘కేట్ల’ నయా దందా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులు సరికొత్త అవతారంలో జనం ముందుకు వచ్చేశాయ్. కిరాణా షాపులు, పాన్ షాపులు, లాడ్జిలు, మెడికల్ షాపుల్లో మద్యం వ్యాపారాలు చేస్తున్న సిండి‘కేట్లు’ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయ్. మొబైల్ ‘బెల్టు’ షాపులు తెరపైకి తీసుకొచ్చి ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఒకేచోట బెల్టు షాపులు నిర్వహిస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో మొబైల్ మందు అమ్మకాలు చేపట్టడం గమనార్హం. ఇలా ఇప్పుడు మొబైల్ మద్యం వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఈ తరహా విక్రయాలతో సిండికేట్ల మధ్య వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. విశాఖపట్టణంలో మద్యం వ్యాపారంలో పట్టున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిర్వహించే సిండికేట్కు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమాత్యుడి అనుచరుడు నడిపే సిండికేట్కు ఇటీవల విభేధాలు తలెత్తి ఆధిపత్య పోరుకు దారి తీసింది. లేబుళ్లు తొలగించి విక్రయాలు మొబైల్ విక్రయాల ద్వారా మద్యం అమ్మకాలు ఇటీవల పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బాటిళ్లపై 13 అంకెల బార్ కోడ్ హాలోగ్రామ్ లేబుళ్లను తొలగించి విక్రయాలు సాగిస్తున్నారు. బ్యాచ్, హీల్ నెంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బార్ కోడ్ నెంబరును ముద్రిస్తే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టే వీలుంది. బాటిళ్లపై లేబుల్ లేకపోతే ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యంగా గుర్తించి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొబైల్ మద్యం విక్రయాలు అధికంగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్టణం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఫిర్యాదులపై చర్యలు ఉత్త ప్రచారమే.. బెల్టు షాపులపై ఫిర్యాదుల కోసం 1100 నంబరు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘ప్రజలే ముందు’ (పీపుల్స్ ఫస్ట్) నినాదంతో ఈ నంబరు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం కోర్ డ్యాష్ బోర్డు సమాచారం మేరకు ఈ నంబరుకు ఇప్పటివరకు 3,916 బెల్టు షాపులపై ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. ఎక్సైజ్ అధికారులు 3,822 ఫిర్యాదుల్ని పరిశీలించి తనిఖీలు చేపట్టారని, 1,126 షాపులను మూసివేశారని డ్యాష్ బోర్డులో ప్రకటించారు. కానీ బెల్టు షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం ఐనవోలు, తాడేపల్లి ప్రాంతాల్లో పాన్షాపులు, జనరల్ స్టోర్లలో మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయని మహిళా సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. -
బెల్టుషాపు నిర్వహిస్తే చర్యలు
గుత్తి: జిల్లాలో ఎక్కడైనా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తే విక్రయదారుడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం షాపు లైసెన్స్ను రద్దు చేస్తామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్చార్జ్ ఈఎస్ మల్లారెడ్డి చెప్పారు. పట్టణంలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 146 మద్యం షాపులకు గానూ ఇప్పటి దాకా 133 మద్యం షాపులు ఏర్పాటు అయ్యాయన్నారు. ఒక కేవలం 13 మాత్రమే ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. గుత్తి ఎక్సైజ్ పరిధిలోని గుత్తిలో రెండు షాపులు, కరిడికొండలో ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే జిల్లాకు మొత్తం 17 బార్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో ఇప్పటిదాకా కేవలం రెండు బార్లు మాత్రమే ఏర్పాటైనట్లు చెప్పారు. కార్యక్రమంలో గుత్తి సీఐ రాజశేఖర్ గౌడ్, ఎస్ఐ ప్రసాద్రావు లు ఉన్నారు. -
బెల్టు తీసి.. టోపీ పెడతాం..!
-
బెల్టు తీసి.. టోపీ పెడతాం..!
సర్కారు మద్యం పాలసీపై అనుమానాలు - కొసరు తొలగింపు.. అసలు పెంపు! - బెల్టు షాపుల తొలగింపు నిర్ణయం ప్రచారం కోసమే! - రాష్ట్రంలో 40 వేలకు పైగానే బెల్టు షాపులు - బాబు సీఎం అయ్యాక బెల్టు షాపులు రద్దు చేస్తూ నాలుగో సంతకం - మూడేళ్లుగా వీటిపై ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలే లేవు - తాజాగా ప్రతిపక్ష నేత ప్రకటనతో మరోసారి రద్దు ఉత్తర్వులు సాక్షి, అమరావతి : డోర్ డెలివరీ అంటూ ఇన్నాళ్లూ రాష్ట్రంలో మద్యం వరద పారించిన సర్కారు.. ఇప్పుడు బెల్టు షాపుల రద్దుకు డ్వాక్రా మహిళలు, ఎన్జీవోల సాయం కోరడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఓ వైపు అసలు షాపులను వదిలేసి కొసరు షాపుల రద్దు అంశాన్ని మాత్రమే తెరపైకి తేవడం.. మరో వైపు మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను పెంచేస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తడం.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం విధిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బెల్టు షాపులను ఎత్తేస్తామని ప్రకటించింది. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా మూడేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బెల్టు షాపులు రద్దు చేస్తున్నట్లు ఫైలుపై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బెల్టు షాపుల గురించి, వాటి పరిస్థితిపై ఎన్నడూ సమీక్ష చేసిన పాపాన పోలేదు. 2014 జూన్ 8న బెల్టు షాపుల రద్దుపై జీవో 263 జారీ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఏ చర్యలూ తీసుకోలేదు. ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకోసమని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు బెల్టు షాపుల్ని రద్దు చేయాలని ఆదేశించారని, ఈ మేరకు 18వ తేదీన కేబినెట్ నిర్ణయించిందని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం మెమో జారీ చేశారు. కాగితాల్లోనే కమిటీలు బెల్టు షాపుల సమాచారమిస్తే నజరానా అందిస్తామని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం ఆదేశించారు. బెల్టు షాపులను రద్దు చేసేందుకు రాష్ట్రంలో 13 జిల్లా కమిటీలు, 553 మండల, 5,332 గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినట్లు కాగితాలపై చూపించారు. ఈ కమిటీలు ఉన్నాయా.. లేక రద్దయ్యాయో తెలియని స్థితి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బెల్టు షాపుల రద్దు అంశాన్ని ప్రభుత్వం ప్రచారంగా మాత్రమే వాడుకోజూస్తున్నదని పలువురు సామాజిక కార్యకర్తలు, మద్యం వ్యతిరేక పోరాట కమిటీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. అన్నీ తూతూ మంత్రపు కేసులే రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టు షాపులున్నట్లు సాక్షాత్తూ ఎక్సైజ్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం రూఢీ కావడం గమనార్హం. మూడేళ్లుగా బెల్టు షాపులపై 23 వేల కేసులు నమోదు చేసినట్లు అధికారిక ఎక్సైజ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇవి కూడా తూతూ మంత్రంగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్జాగా అమ్మకాలు.. వసూళ్లు ► శ్రీకాకుళం జిల్లాలో ఓ మంత్రి నియోజకవర్గంలో బెల్టు షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. మద్యం వ్యాపారులు బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు నెలవారీ రూ.కోటిన్నర సంబంధిత మంత్రికి ముట్టజెప్పాలి. వీటి వసూలు బాధ్యత ఓ సీఐ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు ఏకంగా సమీక్ష సమావేశంలోనే బాహాటంగా వెల్లడించారు. ► గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే బెల్టు షాపులు నడుస్తున్నాయి. ► విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సైతం బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. ► చిత్తూరు జిల్లాలో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ మహిళలు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రికి సన్నిహితంగా ఉండే సిండికేటు నేత ఒకరు ఎమ్మార్పీ ఉల్లంఘనలు మొదలు బెల్టు షాపుల వరకు అంతా తానే పర్యవేక్షిస్తారు. సదరు మంత్రి అనుయాయుడికి ఇక్కడ ఎక్సైజ్ అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ‘బెల్టు’ తీయాల్సిందే.. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులపై దాడులు కొనసాగించాలని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖల సాయంతో గ్రామాల్లో బెల్టు షాపుల్ని తొలగించాలని సూచించారు. బుధవారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 133 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 415 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఊరిలో బార్... దారిలో బెల్ట్!
⇔ రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు ⇔ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోనే దుకాణాలు ⇔ కొత్త షాపులు, బార్ల ఏర్పాటులో వ్యాపారులు బిజీ ⇔ హైవే పక్కన ఇక బెల్టు షాపులు ! ⇔ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వ్యాపారులు ⇔ ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దని ఫిర్యాదుల వెల్లువ మచిలీపట్నం : ఇప్పటి వరకు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉండేవి. గుట్టుగా మద్యం విక్రయించేవారు. బార్ అండ్ రెస్టారెంట్లు ఊరికి దూరంగా... రహదారులకు దగ్గరగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారనుంది. గుడి, బడి, నివాసాల సమీపానికి మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు రానున్నాయి. యథేచ్ఛగా మద్యం విక్రయించనున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా చేరనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం. రహదారులకు దూరంగా బార్లు, మద్యం షాపులు పెడితే వ్యాపారం తగ్గిపోతుందని భావించిన వ్యాపారులు... కొత్త పాలసీ ప్రకారం షాపులు, బార్లు ఏర్పాటు చేస్తూనే, పాత వాటిని బెల్ట్ షాపులుగా కొనసాగించాలని పథకం రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కరోజే గడువు ... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను రహదారులకు దూరంగా మార్చేందుకు ఒక్క రోజే సమయం ఉంది. ఈ క్రమంలో మూడు నెలలు గడువు ఇవ్వాలని మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అయితే, వ్యాపారుల అప్పీలును హైకోర్టు గురువారం ఉదయం తిరస్కరించింది. మరోవైపు నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్, కొత్త వాటికి లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు హడావుడిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 25, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటికి రెన్యూవల్, లైసెన్స్ల కోసం దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలనను మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ ఈఎస్లు పూర్తి చేశారు. వ్యూహాత్మకంగా... జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆ పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. విజయవాడలో అత్యధికంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో వీటిని ఎక్కడకు తరలించాలి, ఎక్కడ మద్యం విక్రయాలు చేయాలి.. అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు పెద్ద భవనం కావాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గృహాల మధ్యలో మద్యం దుకాణాలా... నూతన నిబంధనల ప్రకారం జిల్లాలోని 343 మద్యం దుకాణాల్లో అధిక శాతం ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ ఈఎస్ పరిధిలో 168, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి. వీటిని గృహాల మధ్య ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎక్సైజ్ అధికారులకు స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఇళ్లు, అంగన్వాడీ, రామాలయం దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఫిర్యా దు చేస్తే ఇళ్ల మధ్య మద్యం దుకా ణాలను తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. -
బెల్టుషాపులపై ఉద్యమం
అనంతపురం అర్బన్ : మద్యం వ్యాపారాన్ని నియంత్రించి, బెల్టుషాపులను ప్రభుత్వం ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహిళ సంఘాల నాయకురాళ్లు హెచ్చరించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలనే అంశంపై శనివారం స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.పద్మావతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, వైఎస్ఆర్ మహిళ విభాగం నగర అధ్యక్షురాలు శ్రీనదేవి, హెచ్ఆర్సీ ప్రతినిధి మునీరా, మహిళ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడారు. బెల్టు షాపులు ఎత్తివేసి, మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హామీని నిలబెట్టుకోలేదని దుమ్మెత్తిపోశారు. మద్యం వల్ల నేరాలు ఎక్కువవుతున్నాయని, ప్రత్యేకించి మహిళలపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మద్యపానాన్ని అరికట్టాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు పార్వతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మద్య నిషేధం ఏది బాబు?
ఐద్వా శిక్షణా తరగతుల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న అమలాపురం రూరల్ : ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతి«థిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా లీగల్ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాన్ని తొలగించాలి
ఒంగోలు టౌన్ : మహిళల పుస్తెలు తెంచుతున్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ కొత్తపట్నం మండలం గుండమాల, మోటుమాల గ్రామాలకు చెందిన మహిళలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉబ్బా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణం (షాపునెం 42) ఏర్పాటు చేయడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలి చేసుకొని జీవిస్తున్న పేదల ఆదాయమంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని గతంలో రెండు గ్రామాలకు చెందిన మహిళలు ఆందోళనలు చేసినప్పుడు వేలం పిరియడ్ పూర్తికాగానే ఆ దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మళ్లీ ఆ షాపునకు టెండర్లు ఆహ్వానించడం అన్యాయమన్నారు. కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ నివాస ప్రాంతాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించకుంటే ఈనెల 30వ తేదీ జరిగే వేలాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. లీజ్ పిరియడ్ ముగియగానే తొలగిస్తాం : కొత్తపట్నంలోని మద్యం దుకాణం (షాపు నెం 42) లీజ్ పిరియడ్ ముగిసిన వెంటనే దానిని తొలగిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. మహిళలు నిర్వహించిన ధర్నా వద్దకు ఆయన వచ్చి వారితో మాట్లాడారు. లీజ్ పిరియడ్ జూలై 1వ తేదీతో ముగుస్తుందని స్పష్టం చేశారు. ధర్నాలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య, సీఐటీయూ నాయకుడు తంబి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఎస్.స్వామిరెడ్డి, పి.ప్రకాష్ ధర్నా శిబిరాన్ని సందర్శించి మహిళలకు మద్దతు ప్రకటించారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కనిగిరిలో కూడా..: పట్టణంలో నిరుపేదలు ఉండే ప్రాంతం, హాస్టళ్ల మధ్య వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకుడు పీసీ కేశవరావు మాట్లాడుతూ కూలీనాలి చేసుకుని జీవించే వాళ్లు, విద్యార్థులు ఉన్నచోట మద్యం షాపు, గోడౌన్ ఏర్పాటుకు ఏలా అనుమతి ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే పట్టణంలో విచ్చలవిడిగా గొలుసు షాపులు పెరిగాయని, పేదల ఇళ్ల మధ్య షాపులు పెట్టి వారి జీవనాన్ని నాశనం చేయడం తగదన్నారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో మద్యం షాపు పెడితే మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో షాపును ధ్వసం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సీఐకి అందజేశారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో షాపునకు అనుమతి ఇవ్వమని సీఐ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాము, ఆదెయ్య, రమణయ్య, రహంతుల్లా, వెంకటయ్య పాల్గొన్నారు. -
మందు.. ఇక కాస్ట్లీ గురూ!
ఎక్కడైనా మందు మామూలుగానే దొరుకుతుందేమో గానీ, హరియాణా వెళ్లారంటే మాత్రం మామూలు కంటే అదనంగా డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే, అక్కడ రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల మద్యం సీసాల ధరలను 20 శాతం చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లకు చెందిన స్వదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), విదేశీ మద్యం అన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది. ఇందుకు గాను 2017-18 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు విడుదల చేశారు. దీనివల్ల రీటైలర్ల ఆదాయం బాగా పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు.. గుర్గావ్, ఫరీదాబాద్ ఎక్సైజ్ జోన్లోల నివసించేవాళ్లు పబ్లలో తాగాలంటే మరింత ఎక్కువ వదిలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, అక్కడి పబ్లు, బార్ల లైసెన్సు ఫీజులను ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లోలవరకు పెంచారు. దీంతోపాటు ఇతర పన్నులు అదనం. ఇప్పుడు మద్యం దుకాణాల వాళ్లు తాము ఏ రకం మద్యం కావాలనుకుంటే దాన్ని అమ్ముకోవచ్చు. జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ఇక నగరాలు, పట్టణాల్లో ఎక్కడ అమ్ముకుంటారో ఆ ప్రదేశం ఎంపిక నిర్ణయాన్ని వ్యాపారులకే ప్రభుత్వం వదిలేసింది. దాన్ని బట్టి చూస్తే.. మద్యం అమ్మకందారులు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అంటే ఒకరకంగా ఇవి అధికారిక బెల్టుషాపుల లాంటివన్న మాట. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 4900 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం రూ. 4071 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈసారి కాస్త కోటా పెంచి రూ. 5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించారు. లైసెన్సు ఫీజులతో పాటు కొన్ని పన్నుల ద్వారా ఈ అదనపు ఆదాయం వస్తుందని కెప్టెన్ అభిమన్యు అంటున్నారు. ఒక్కో లైసెన్సుకు తోడు అదనంగా రెండు బెల్టుషాపులు నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వడంతో.. ఇప్పటివరకు ఉన్న 3500 మద్యం షాపులు కాస్తా ఇప్పుడు 9వేల వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. -
విశాఖ బెల్ట్ షాపులపై మహిళల దాడి
-
బెల్ట్షాపులపై మహిళల సమరం
నందిగామ : కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణపై మహిళలు నిరసన గళం విప్పారు. శనివారం దాదాపు 60 మంది మహిళలు నందిగామలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గ్రామంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల కారణంగా తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని వాటిని మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు
* జిల్లాలో 1500కు పైగా బెల్టుషాపులు * అధికారపార్టీ అండతో చెలరేగుతున్న సిండికేట్లు * మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ గ్రామాల్లో ప్రజలకు తాగునీరు లభించడం లేదు. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అసలే పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలపాలైన రైతులు మద్యానికి బానిసై జీవితాలు గుల్ల చేసుకుంటున్నారు. రోజువారి కూలీలు సైతం కూలి డబ్బుతో మద్యం సేవించి ఉత్త చేతులతో ఇంటికెళ్తున్నారు. సాక్షి, గుంటూరు: గ్రామాల్లో ఎటు చూసినా కరువు. కానీ మద్యం దుకాణాలు మాత్రం కళకళలాడుతున్నాయి. ఎక్సైజ్ నూతన మద్యం విధానం పేరుతో గ్రామాల్లో ఒక్క బెల్టు దుకాణం కూడా లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బెల్టు దుకాణాలను ప్రొత్సహిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోనే అత్యధికంగా బెల్టుషాపులు ఉండటం విశేషం. అవి కూడా అమాత్యుల అనుచర గణం, అధికారపార్టీ కేడర్ నిర్వహిస్తుండటంతో ఆ నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. అధికార పార్టీ ఒత్తిళ్లు, మామూళ్లకు దాసోహమైన ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుంటూ బెల్టుషాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పర్యవసనంగా జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, బెల్టుషాపులు 1500కుపైగా చేరాయి. 24 గంటలూ అందుబాటు.. గ్రామాల్లోని చిల్లర దుకాణాల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఒకటి, రెండు చోట్ల ఎక్సైజ్ అధికారులు బెల్టుదుకాణాలపై దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకోగానే, జిల్లాకు చెందిన ఓ మంత్రి ఫోన్ చేసి మనవాళ్లే వదిలేయండంటూ హుకుం జారీచేస్తుండటం జిల్లాలో పరిస్థితి తీవ్రతకు కారణం. గతంలో బెల్టుదుకాణాలపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, బెల్టుదుకాణాలకు మద్యం సరఫరా చేసే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని పోలీసు అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అది కూడా కనిపించడం లేదు. మన పని కాదు కదా అంటూ పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. పైగా అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు నడుస్తున్నా నెలవారి మామూళ్లు తీసుకుంటూ గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. బెల్టుదుకాణాలను తొలగించాలని మహిళా సంఘాలు, గ్రామంలోని మహిళలు అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల ఎదుట ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు. మనవాళ్లే వదిలేయండి.. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమర్రు, మురికిపూడి, వేలూరు, కనపర్తి, తూబాడు, చందవరం, కారుచోల, జగ్గాపురం, వంకాయలపాడు, కొండవీడు గ్రామాల్లో అయితే పదికి పైగా బెల్టుదుకాణాలు ఉన్నాయి. ఇటీవల కనపర్తి గ్రామంలో బెల్టుదుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, వెంటనే మంత్రి ఫోన్చేసి వారిని వదిలేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండలానికి 40 నుంచి 50 బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. నడింపాలెం గ్రామంలో పది దుకాణాలున్నాయి. గతంలో గుంటూరు వచ్చిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం రాజధాని జిల్లా అయిన గుంటూరులో బెల్టుదుకాణాలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. -
బెల్ట్షాపుల నిర్మూలనకు కమిటీ!
* బుచ్చిబాపన్నపాలెంలో బెల్ట్షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు * ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారుల్లో చలనం నరసరావుపేట టౌన్: గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ ఏవీఎస్ ప్రసాద్ హెచ్చరించారు. బుచ్చిబాపన్నపాలెంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులతో కలసి బుధవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నరసరావుపేట ఎక్సైజ్ శాఖ సీఐ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఆ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామస్థాయి నూతన కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీకి కన్వీనర్గా ఎస్ఐ, అధ్యక్షురాలిగా గ్రామసర్పంచ్ గజ్జల నాగమల్లేశ్వరి, సభ్యులుగా వీఆర్ఓ కొండపరెడ్డి రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాటూరి సురేష్బాబు, ప్రధానోపాధ్యాయురాలు రేవతి, డ్వాక్రా మహిళలు కాకుటూరి లక్ష్మమ్మ, సీమల అంజమ్మ, గ్రామపెద్దలు గజ్జల ముసలారెడ్డి వ్యవహరిస్తారన్నారు. గ్రామంలో ప్రత్యేక నిఘా : సీఐ బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ వి.వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ గ్రామంలో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. గ్రామంలో ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 94409 02484, 99490 95788 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
మద్యం బెల్టు తీసిన మహిళలు
కమ్మపాళెంలో మహిళల చైతన్యం కమ్మపాలెం(కొడవలూరు): మహిళలం తా చైతన్యమై గ్రామంలోని మద్యం బెల్టు దుకాణాలను తొలగిం చిన సంఘటన మండలంలోని కమ్మపాలెం లో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామం లో రెండు మద్యం బెల్టుదుకాణాలుండడంతో మద్యం ప్రియులు గ్రామంలోని రోడ్డు పక్కనున్న పోలేరమ్మ ఆలయం వద్ద మద్యం సేవిస్తూ గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారా రు. గ్రామంలోని మహిళలు రోడ్డుపైకి రావాలంటే మందుబాబుల ఆగడాల కారణంగా ఇబ్బందిపడేవారు. ఈ సమస్యపై గ్రామస్తులంతా కలసి గురువారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని బెల్టు దుకాణాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం గ్రామంలోని కొంతమంది మహిళలు, గ్రామ పెద్దలు శుక్రవారం బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి వార వద్దున్న మద్యం బాటిళ్ల స్వాధీనం చేసుకుని గ్రామంలోని ఆలయం వద్ద పగులగొట్టారు. మళ్లీ దుకాణాలు కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దుకాణదారులను హెచ్చరించారు. గ్రామస్తుల నిర్ణయానికి దుకాణదారులు కూడా కట్టుబడి దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలకు కళ్లెం పడడంతోపాటు మందుబాబుల ఆగడాల నుంచి గ్రామస్తులకు విముక్తి లభించింది. గ్రామానికి చెందిన బెల్లం వెంకటనగేష్, ఏటూరి విజయమ్మ, కొమ్మి విజయమ్మ, వింజావళి, ఆంజనేయులమ్మ, బి. శ్రీనివాసులు, నాపా సురేంద్రనాయుడు, మాలకొండయ్య, ఆదెమ్మ, సతీష్బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బెల్ట్షాపులపై పోలీసుల దాడులు
మొమిన్పేట్: రంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. జిల్లాలోని మొమిన్పేట్ మండలం మోరనాగపల్లి గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముస్తాక్, మానిక్జీ, మనయ్యలను అరెస్ట్ చేశారు.