BTech student
-
హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. పంజగుట్ట– అమీర్పేట మార్గంలోని బిగ్బజార్ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్ బైక్ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి వచి్చన పోలీసులు లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్కుమార్ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు. -
సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024 -
ప్రేమ పేరుతో వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్రెడ్డి విచారణ చేపట్టారు. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.. మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్స్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్ చేస్తూ జాబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్పాత్పైకి ఎక్కి.. టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఇక, ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిద్దరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కారు డ్రైవ్ చేసిన సాకేత్ రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. -
Hyderabad: బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చోటుచేసుకుంది. ఎస్ఐలు రామకృష్ణ, మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా అరుపాలెం మండలం, మామునూర్ గ్రామానికి చెందిన సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిబట్ల ఏరోస్పేస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్లోని ఎస్వీ బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ రెండో అంతస్తులోని తన గదిలో బెడ్ షీట్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్ కోసం నగరానికి వెళ్లిన రూంమేట్స్ వచ్చి చూసేసరికి విగతజీవిగా మారి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ యజమాని వేణుకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతుని కుటుంబసభ్యులు, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మృతుని తండ్రి రాంబాబు, బంధువులు శనివారం ఉదయం హాస్టల్కు చేరుకుని బోరున విలపించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా నరేంద్ర మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు. కాల్ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఆర్థిక ఇబ్బందులా లేక మరేమైనా ఉన్నాయా అనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.హాస్టల్ భవనంపై నుంచి దూకి...లాలాపేట: తార్నాకలోని ఓయూ ఇంటర్నేషనల్ హాస్టల్ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది. ఓయూ పోలీసులు తెల్పిన మేరకు.. వికారాబాద్ జిల్లాకు చెందిన ముల్కగల్ల రవి (25) నిజాం కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తార్నాకలోని స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది 108కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి వెంటనే ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తలకు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈమేరకు పోలీసులకు సూసైడ్ నోట్ లభించిందని తెలిసింది. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
Hyderabad: కలల తీరం చేరకుండానే.. రోడ్డు ప్రమాదంలో
హైదరాబాద్: వీసా ప్రాసెస్లో భాగంగా బ్యాంక్ స్టేట్మెంట్ కోసం వెళ్తున్న బీటెక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి సత్యనారాయణపురానికి దొంతరి మధుసూదన్రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా వీసా కోసం నగరంలోని హిమాయత్నగర్ బ్యాంక్లో స్టేట్మెంట్ కోసం యాక్టివాపై వెళ్తుండగా.. ఉప్పల్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వర్షిత్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తాడనుకున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో వర్షిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
గుండె పోటుతో బీటెక్ విద్యార్థిని మృతి
నర్సాపూర్(జి): మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు... మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని(18) హైదరాబాద్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చేసింది. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందింది. తండ్రి నార్వాడే వెంకట్ రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..
సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్ కాలనీకి చెందిన రాహుల్, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్ కలిశారని, క్లాస్లకు రెగ్యులర్గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది. -
అమ్మాయిల పేరుతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ అకౌంట్స్.. బరితెగించిన బీటెక్ స్టూడెంట్
-
'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్ విద్యార్థి?
సాక్షి, కరీంనగర్: అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థి పడాల అభిలాష్(20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి పడాల రమేశ్–రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు అభిలాష్ కరీంనగర్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇతడి తల్లి, నానమ్మ ఇంట్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు జరిగితే తమ పరువు పోతుందని ఇద్దరికీ చెప్పాడు. గొడవలు పెట్టుకోవద్దని సూచించాడు. అయినా, అత్తాకోడళ్లు ఇదేమీ పట్టించుకోలేదు. తీవ్రమనస్తాపం చెందిన అభిలాష్ తన ఇంటి సమీపంలో పత్తి చేనులోకి వెళ్లాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com Follow the Sakshi TV channel on WhatsApp: -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
మహబూబ్నగర్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మిరి గోపాల్ కుమార్తె శ్రీవాణి (19) హైదరాబాద్ మేడ్చల్లోని సూర్యనగర్కాలనీలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. ఇటీవల ఇంటికి వచ్చి రెండ్రోజులు ఉండి సోమవారం తిరిగి హాస్టల్కు వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. కళాశాల నుంచి తండ్రికి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ హైదరాబాద్కు బయలుదేరారు. మూడు నెలల కిందట శ్రావణి అక్క వివాహం జరింది. అనంతరం శ్రావణి తల్లి పెబ్బేరు నుంచి కొత్తకోటకు బైక్పై వస్తుండగా నాటవెళ్లి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందింది. మూడు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని రాయపోల్ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కందుకూరుకు చెందిన నారాయణరెడ్డి, లంగర్హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన భానుప్రసాద్, హస్తినాపురం ఈస్ట్ కాలనీకి చెందిన నవీన్ ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు బైక్పై రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన మారుతి వాహనం (ఏపీ28 బీఎస్ 0010) వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. కాగా, భారత్ ఇంజినీరింగ్ కళాశాల హైదరాబాద్ వెళ్లే దారిలో ఉంటే.. వీరు రాయపోల్ వైపుగా ఎందుకు వచ్చారో తెలియాల్సి వుంది. కారును నడిపిస్తున్న పి.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆసరా అవుతారనుకుంటే.. ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని అనుకుంటే రోడ్డు ప్రమాదం ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయపోల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడటంతో కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులను అప్పగించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. -
TS: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి
నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) హసన్పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువా రం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్ జాహెద్షా, అబ్దుల్ షాదాబ్తో కలిసి బైక్పై సరదాగా కంఠాత్మకూర్ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ -
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్మేన్గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్టౌన్లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్స్ట్రాగామ్లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: సీరియల్ రేపిస్ట్ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..) -
తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు..
వైఎస్సార్: కురబలకోట మండలం అంగళ్లులోని ఓ కళాశాలలో సీఎస్ఈ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మధు (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన కుడుం ఉత్తన్న కుమారుడు మధు చదువుల్లో మేటి. పదిలో ఫస్ట్క్లాస్లో పాసయ్యాడు. ఇంటర్లో కూడా రాణించాడు. అంగళ్లులోని ఓ కళాశాలలో ఇతనికి సీఎస్ఈలో ఫ్రీ సీటు వచ్చింది. తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సహ విద్యార్థులతో బాగా కలసిపోయే వాడు. అంగళ్లులో రూము అద్దెకు తీసుకుని కళాశాలకు రాకపోకలు సాగించేవాడు. ఈనేపథ్యంలో ఈనెల 12న సాయంత్రం నుంచి కన్పించకుండా పోయాడు. రూముకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా చుట్టుపక్కల విచారించారు. సెల్ ఫోన్ కూడా రూములో వదిలి వెళ్లాడు. ఇతని ఆచూకీ కోసం కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. ఎక్కడైనా ఉంటాడులే అని భావి స్తూ వచ్చారు. మంగళవారం ఉదయం అంగళ్లులోని తుమ్మచెట్లపల్లె వద్ద ఉన్న కోల్డ్స్టోరేజీ వెనుక వైపు ప్రాంతంలో దుర్వాసన రాసాగింది. స్థానికులు పరిశీలించి చూడగా కుళ్లిన స్థితిలో శవం కన్పించింది. మృతుడి దుస్తులు, చెప్పుల ఆధారంగా అదృశ్యమైన మధుగా గుర్తించారు. పక్కన టమాటా పంట వద్ద ఉన్న డ్రిప్ వైరుతో ఇతను చెట్టుకు ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి స్పష్టమవుతోంది. ముట్టుకుంటే ఊడిపోయే పరిస్థితి కావడంతో డాక్టర్లు మంగళవారం సంఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఎందుకురా ఇలా చేశావ్.. ఇదిలా ఉండగా మధుకు తెలివైన విద్యార్థిగా పేరుంది. ఎవ్వరితో ఎలాంటి విబేధాలు లేవు. ఆర్థిక సమస్యతో స్నేహితులను ఇటీవల డబ్బు ఆడిగినట్లు చెబుతున్నారు. దీనికి తోడు అంగళ్లుకు చెందిన మరొకరికి బాకీ ఉన్నట్లు సమాచారం. కొత్త అప్పు పుట్టక మరో వైపు చేసిన అప్పు తీరే మార్గం కన్పించక మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితులు మాత్రం ఎందుకురా ఇంత పని చేశావని సంఘటన స్థలంలో కంట తడిపెట్టడం చూపరులను కలిచివేసింది. తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు.. మన కుటుంబంలో ఒక్కరూ చదువుకున్న వారు లేరు.. నువ్వన్నా ప్రయోజకుడవు అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకున్నా లేకున్నా.. కష్టపడి చదివిస్తున్నాం కదరా.. ఎందుకిలా చేశావురా.. అంటూ మధు అన్నయ్య బోరున విలపించాడు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ శివాంజనేయులు తెలిపారు. ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్లు లేదా రుణ యాప్లు ఏమైనా ఈ సంఘటనకు దారి తీశాయా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
బైక్ అదుపు తప్పి బీటెక్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం: మండలంలోని సబ్బవరం–చోడవరం రోడ్డులోని ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీస్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. రోలుగుంట మండలంలోని అడ్డసార శివారు మర్రిపాలెం గ్రామానికి చెందిన కూరాకుల చిన్నబ్బాయి చిన్న కుమారుడు నాని(21)తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతడు బుధవారం రాత్రి బైక్పై తగరపువలసలోని కళాశాలకు తిరిగి వెళ్తున్నాడు. ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం వద్ద బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ బలంగా ఢీకోవడంతో హెల్మెట్ నుజ్జునుజ్జు అయి తలకు తీవ్రగాయాలయ్యాయి .దీనితో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో సూసైడ్ నోట్, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’ -
ఆమె వల్ల పిచ్చోడినయ్యా.. ప్లీజ్ వారినైనా కాపాడండి: బీటెక్ విద్యార్థి సూసైడ్
సాక్షి, విజయవాడ: సూసైడ్ నోట్ రాసిపెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్ పాస్ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు. -
కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న అర్పిత అనే విద్యార్థిని నిన్న(ఆదివారం) సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల బిల్డింగ్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బీటెక్ విద్యార్థిని ప్రేమవివాహం.. గ్రామంలోకి వచ్చి బలవంతంగా..
సాక్షి, ప్రకాశం(కొత్తపట్నం): వారు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అమ్మాయి కన్నవారికి నచ్చలేదు.. వెంటనే అమ్మాయి ఆచూకీ కనుగొని బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోనికి తీసుకున్నారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి గూడురు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శినానికి వెళ్లాడు. అదే సమయంలో చెన్నై నుంచి వారి బంధువులతో జీవిత శివకుమారి కూడా దర్శినానికి వచ్చింది. ఇలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమదాకా దారి తీసింది. ఇటీవల సింగరాయకొండలో వివాహం చేసుకున్నారు. తరువాత కొత్తపట్నం పోలీస స్టేషన్కు వచ్చి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. అప్పటికే యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశారు. వారు కొత్తపట్నంలో ఉన్నారని తెలుసుకున్న గూడూరు టూటౌన్ ఎస్సై, కొత్తపట్నం పోలీస్స్టేషన్కు వచ్చి ఇద్దరినీ తీసికెళతానని చెప్పాడు. వెంటనే గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని ఇద్దరూ మేజర్లు అయితే ఎలా తీసికెళతారని ప్రశ్నించారు. దీంతో ఏమీ చేయలేక ఎస్సై వెనుతిరిగాడు. అయితే వారం రోజుల తరువాత మళ్లీ కొత్తపట్నం పోలీస్ స్టేషన్కు వచ్చి ఇద్దరూ గూడూరు రావాలని కోరాడు. కానీ యువతి నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 19న సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసికెళ్లారు. గ్రామస్తులు అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కారాని జయరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారిలోనే వారిని పోలీసులు అడ్డగించి ఒంగోలు టూటౌన్కు తీసుకొచ్చారు. అయితే పెండ్లి కుమార్తె తండ్రి కారాని శ్రీను.. కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ కోడలను ఆమె మేనమామలు భాస్కర్రెడ్డి, భరత్రెడ్డి మరి కొంత మంది బలవంతగా తీసికెళ్లారని యువకుని తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఎస్సై కొక్కిలగడ్డ మధుసూదన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘వైజాగ్ బిట్స్’ విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.. ‘కాంకర్డ్’కు అంకురార్పణ
సాక్షి, విశాఖపట్నం: స్థానిక బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు “కాంకర్డ్” పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ డా.గోవింద రాజు వెల్లడించారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా చెగ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ప్రకృతి శ్రీవాస్తవ గౌరవ అతిధిగా క్యాథెరిన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ హాజరయ్యారని తెలిపారు. చదవండి: వావ్..వాట్సాప్లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా? కాంకర్డ్ అంకుర సంస్థను బిట్స్ వైజాగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు పి. జాషువ రాజు ఆధ్వర్యంలో, ఐదుగురు విద్యార్థుల బృందం ఈ స్టార్టప్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, యుఐ/యుఎక్స్ డిజైనింగ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలెప్మెంట్, డిజైన్ స్పాటిలైట్ వెర్టికల్స్ లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారని సంస్థ వ్యవస్థాపకులు జోషువా రాజు వివరించారు. సహ వ్యవస్థాపకులు సందీప్, మేఘశ్యామ్ ఫుల్ స్ట్యాక్ డెవలప్మెంట్ లో అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తారని, విద్యార్థి రాహుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, మహేష్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని చెప్పారు. మూడవ సంవత్సరం చదువుతున్న శ్రావ్య కంటెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా పని చేస్తారన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సంస్థను ప్రారంభించడం అభినందనీయమని, వారికి తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగాప్రకృతి శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. తమ విద్యార్థులు అంకుర సంస్థను విద్యార్థులు స్థాపించడం చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంస్థల్ని మరిన్ని తీసుకురావాలని ప్రిన్సిపాల్ అభిలషించారు. కళాశాల కరెస్పాండెంట్ డా. కొండ్రు శ్రీలక్ష్మి బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని సంస్థలు అన్ని విభాగాల్లోనూ స్టార్టప్తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిట్స్ వైజాగ్ అకడమిక్ ముఖ్య సలహాదారు డా. సీవీ గోపినాథ్, డీన్ డా.విక్టర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వీడియో: ‘బీటెక్ చాయ్వాలి’.. ఆమె థింకింగ్ వేరె లెవల్ గురూ..
ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్ చాయ్వాలి అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్ను ప్రారంభించింది. సదరు షాప్నకు ‘బీటెక్ చాయ్వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్లోని గ్రీన్ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్ను నడుపుతున్నాను. ‘బీటెక్ చాయ్వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) మరోవైపు.. గ్రీన్ఫీల్డ్ ప్రాంతంలో ‘బీటెక్ చాయ్వాలీ’ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షాప్లో స్పెషల్ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్ చాయ్వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. https://t.co/l4NsiNCmn1 ke baad ab https://t.co/uwi8X7YeHb chaiwali bhi aagyi 🙄 Ab apun bhi bnega Upsc chaiwala 😍 pic.twitter.com/hH2Xxu2vKy — 🚩ASHU THAKUR 🚩 (@ashu_thakurr) October 3, 2022 -
రాంగ్కాల్ పరిచయం.. బీటెక్ యువతి పాలిట శాపం
నెల్లూరు(క్రైమ్) : రాంగ్కాల్ పరిచయం ఓ యువతి పాలిట శాపంగా మారింది. సేకరించిన సమాచారం మేరకు.. కావలి పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. యువతి సెల్ఫోన్కు కొంతకాలం కిందట ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే సారీ.. రాంగ్ నంబర్ అంటూ యువకుడు మాటలు కలిపాడు. వారి పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. రెండురోజుల కిందట ఇద్దరూ నెల్లూరులో కలుసుకున్నారు. అనంతరం ఓ లాడ్జికి వెళ్లారు. ఈ క్రమంలో యువకుడు ఆమె సెల్ఫోన్లోని వీడియోలు, ఫొటోలు చూసి ఎవరివని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై దాడిచేసి సెల్ఫోన్తో పరారయ్యాడు. దీంతో యువతి అతని కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి, పరారైన యువకుని ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు) -
తేలు కాటుకు బీటెక్ విద్యార్థిని మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా: తేలు కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తుల వివరాల పకారం.. రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు–పద్మ దంపుతలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి(22) బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రాగా, జాయిన్ కావాల్సి ఉంది. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. కూరగాయలు తెంపుతున్న సమయంలో కాలికి ఏదో విషపురుగు కుట్టినట్లు అనిపించగా అక్కడున్నవారికి తేలు కనిపించింది. మాలతిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె హార్ట్బీట్ తక్కువగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం చనిపోయింది. ఉద్యోగం చేసి, తమకు అండగా ఉంటుందనుకున్న కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీజేపీ నాయకుల ఆందోళన సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో సరైన చికిత్స అంది ఉంటే మాలతి బతికేదని బీజేపీ నాయకులు అన్నా రు. ఈ మేరకు దవాఖానాలో వారు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్ వారి తో మాట్లాడారు. యువతి గుండె పనితీరు సరిగా లేకపోవడం వల్లే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారన్నా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!
వేలూరు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్ కలకలం రేపింది. ఆంబూరు పట్టణానికి చెందిన అనార్ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అనార్ అలీ ఇంటిని చుట్టుముట్టారు. అతని వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని రహస్యంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు ఉసేన్ లస్కర్తో ఈ విద్యార్థి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదీ చదవండి: రాడికల్ శక్తులను కట్టడి చేయండి -
ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది విదేశీ విద్య వైపే మొగ్గుచూపుతున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైనా సరే... ఎంఎస్ చేసిన తర్వాతే ఏదైనా అంటున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో చేరేందుకు తక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఎంటెక్ కోర్సుల్లో సీట్లు నిండే పరిస్థితి కూడా లేదు. ఏటా 70–65 వేల మంది బీటెక్ ప్రవేశాలు పొందుతుంటే, కనీసం 4 వేల మంది కూడా ఎంటెక్లో చేరడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కూడా గేట్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరే వారే 3 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు 12 వేల మంది ప్రతి ఏటా ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్మెంట్, ఇతర పీజీ కోర్సులకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లే వారి సంఖ్య 15 వేల వరకూ ఉంటోంది. ఇలా మొత్తం మీద 27 వేల మందికిపైగా బీటెక్ తర్వాత ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీటెక్కు ఉన్న పోటీ వాతావరణం ఇతర కోర్సులకు ఉండటం లేదు. అవకాశాలే లక్ష్యం... విదేశాల్లో సాధారణంగా ఎంఎస్ తర్వాత సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు చేపడతారు. మన దేశంలో మాత్రం బీటెక్ తర్వాతే ఈ అవకాశాలు ఉంటున్నాయి. అయితే, మన దేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంఎస్ చేసిన తర్వాత మంచి వేతనం లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ చేసేందుకు బ్యాంకులు ఎక్కువగా రుణాలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో అనధికారికంగా ఏదో ఒక పార్ట్టైమ్ ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతకాలంగా ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ కోర్సుల్లో ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులు ఇక్కడ చేసి, కొనసాగింపుగా అమెరికాలో ఎంఎస్ చేయడం ప్రయోజనంగా ఉంటోందని సాఫ్ట్వేర్ నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా బీటెక్ తర్వాత ఎంఎస్కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికతో విద్యను అందిస్తున్నాయి. అందుకే విదేశీ మేనేజ్మెంట్ కోర్సులకూ ప్రాధాన్యమిస్తున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటుపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: పలమనేరు పట్టణంలోని గుడియాత్తంరోడ్డు బజంత్రీ వీధిలో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్రెడ్డి(20 ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా చినమండ్యం గ్రామానికి చెందిన దిలీప్రెడ్డి పట్టణ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బజంత్రీవీధిలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు విద్యార్థులతో కలసి అద్దెకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలో ఫ్యానుకొక్కీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా దిలీప్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. గేమ్లకోసం అప్పులు చేసినట్లు, చివరికి మొబైల్ కూడా తాకట్టు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సూసైడ్ నోట్ రాసి.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చైతన్యపురి: ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, రాచూరు గ్రామానికి చెందిన గుత్తి బాలయ్య కుమారుడు అనిల్ కుమార్ అవంతి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను స్నేహితుడితో కలిసి న్యూ దిల్సుఖ్నగర్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 6న స్నేహితుడు సొంతూరుకు వెళ్లగా అనిల్ ఒక్కడే గదిలో ఉన్నాడు. రెండు రోజులుగా అద్దెకు ఉంటున్న వారు కనిపించకపోవడంతో సోమవారం ఇంటి ఓనర్ గది వద్దకు వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి వుంది. కిటికీ లోనుంచి చూడగా అనిల్కుమార్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గదిలో పోలీసులు తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
‘దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగింది’
సాక్షి, అమరావతి: రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఎంతైనా ఉందన్నారు. ‘ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ తీసుకువచ్చారు.. దిశ చట్టం పెండింగులో ఉన్నప్పటికీ పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని’ చెప్పారు. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని హితవు పలికారు. -
Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..
సాక్షి గుంటూరు: శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని.. హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అసలు వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అంతకుముందు వారి ప్రేమ విషయం మాకు చెప్పలేదు. రమ్య తల్లిదండ్రులకు నేనేమీ చెప్పలేను. మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రాకూడదు' అని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
సత్తా చాటిన ‘దిశ’.. న్యాయం జరిగింది
సాక్షి, అమరావతి: ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి దిశ వ్యవస్థ ద్వారా ఉరి శిక్ష వేయించండి చూద్దాం..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ప్రభుత్వానికి విసురుతున్న సవాల్కు శుక్రవారం జవాబు లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో ఓ హంతకుడికి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయించింది. గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 10 గంటల్లోనే అరెస్టు చేయడంతోపాటు.. సత్వరం చార్జ్షీట్ దాఖలు, ఫోరెన్సిక్ నివేదికల సమర్పణ, క్రమంతప్పని రీతిలో విచారణ ద్వారా నిందితుడి నేరాన్ని రుజువు చేసి, కేవలం 257 రోజుల్లోనే దోషిగా తేల్చి.. కోర్టు ద్వారా ఉరి శిక్ష వేయించగలిగింది. మహిళా భద్రత పరిరక్షణలో దేశానికే దిశ వ్యవస్థ చుక్కానిగా నిలిచింది. యుద్ధప్రాతిపదికన స్పందన మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణం గుర్తించి సత్వరం శిక్ష విధించే ప్రక్రియలో దిశ వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2021 ఆగస్టు 15న గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్యపై శశికృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు నిందితుడిని కేవలం 10 గంటల్లోనే అరెస్టు చేశారు. నేర నిరూపణకు కీలకమైన ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను కేవలం 48 గంటల్లోనే పూర్తి చేసి నివేదికలు తెప్పించారు. నిందితుడు సాంకేతికపరమైన లోపాలను అవకాశంగా చేసుకుని తప్పించుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా చేశారు. రమ్య మృతదేహం, నిందితుడి దుస్తులు, కత్తి, ఘటనా స్థలంలో ఉన్న రక్తపు నమూనాలను సరిపోల్చి నిర్ధారించారు. ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం కేవలం రెండ్రోజుల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు తెప్పించడం దిశ వ్యవస్థతోనే సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ విభాగం హైదరాబాద్లోనే ఉండిపోయింది. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం నమూనాలను హైదరాబాద్లోని ల్యాబొరేటరీకి పంపించి నివేదికలు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేది. కానీ దిశ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్ని బలోపేతం చేసింది. గుజరాత్లోని యూనివర్సిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సౌజన్యంతో రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను నెలకొల్పడంతో పాటు ఈ వ్యవస్థను మూడింతలు అభివృద్ధి చేసింది. ఆ విభాగంలో నిపుణులను ఐదింతలు పెంచింది. తద్వారా రమ్య కేసులో కేవలం 48 గంటల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలను తెప్పించారు. దిశ వ్యవస్థలో భాగంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదింతలు బలోపేతం చేసింది. దాంతో ఈ కేసులో నిందితుడి కాల్డేటాను పోలీసులు సత్వరం, సమర్థవంతంగా విశ్లేషించగలిగారు. హత్యకు ముందు నిందితుడు తన మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడిన టవర్ లొకేషన్, రమ్యను వేధిస్తూ అంతకుముందు మాట్లాడిన కాల్డేటా, పంపిన వాట్సాప్ మెసేజ్లు అన్నింటినీ నిర్ధారించారు. పక్కాకుట్రతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని నిరూపించే సాక్ష్యాలను పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. చకచకా కొలిక్కి.. రమ్య హత్య కేసును పోలీసులు దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ కేసులో కేవలం వారం రోజుల్లోనే చార్జ్షీట్ దాఖలు చేయడం విశేషం. దిశ కేసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం కేసు సత్వర విచారణకు దోహదపడింది. గతంలో మహిళలపై దాడుల కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇతర పోలీసు కేసులతోపాటు ఈ కేసులను కూడా వాదించాల్సి వచ్చేది. దాంతో పని భారంతో తరచూ వాయిదాలు కోరేవారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అడ్డంకిని తొలగించింది. దిశ కింద నమోదు చేసిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. దాంతో రమ్య హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా న్యాయస్థానంలో విచారణకు హాజరై నేరాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించారు. తద్వారా హత్య జరిగిన 257 రోజుల్లోనే కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించేలా దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. ‘దిశ’తో దర్యాప్తు వేగవంతం ఇలా మహిళలపై దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి. కాగా ఏపీ పోలీసులు 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక వేధింపుల కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. దేశంలోనే అత్యధికంగా 854 కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2020–21లో దేశంలోనే అత్యధికంగా 92.21 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు నమోదు చేశారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) కేసు వివరాలిలా.. ►ఆగస్టు 15, 2021న రమ్య హత్య ►సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు ►10 గంటల వ్యవధిలో అరెస్టు ►2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ ►దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు ►ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు ►క్రమం తప్పకుండా కోర్టు విచారణ ►వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది ►257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు ►ఏప్రిల్ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరులో రమ్యను పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన కుంచాల శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. నడిరోడ్డుపై ఒక విద్యార్థినిని అత్యంత పాశవికంగా చంపడం, ముద్దాయిని పట్టుకునే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడం, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పరారు కావడానికి ప్రయత్నించడం తదితర కారణాల వల్ల ఈ కేసును అత్యంత అరుదైనది (రేరెస్ట్ ఆఫ్ ది రేర్)గా భావిస్తున్నామని న్యాయమూర్తి రాంగోపాల్ తన తీర్పులో పేర్కొన్నారు. క్రైం నెంబర్ 446/2021 అండర్ సెక్షన్ 354(డి).. 302 ఐపీసి, సెక్షన్3 (2)(విఎ)ఆఫ్ ఎస్సి–ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసులో ఉరి శిక్ష (దీన్ని హైకోర్టు నిర్దారించాల్సి ఉంటుంది), రూ.వెయ్యి జరిమానా లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. 354(డి) సెక్షన్ కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(వి) కింద జీవిత ఖైదు, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(విఎ) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పొడిచి పొడిచి హత్య గుంటూరు పరమాయకుంటలో నివాసముంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య(20)కు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం వడ్డెరపాలెంకు చెందిన కుంచల శశికృష్ణ(19)తో ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యింది. పదోతరగతి మధ్యలో మానేసి, ఆటోమొబైల్ షాపులో పనిచేసిన శశికృష్ణ.. తర్వాత తన నానమ్మ ఊరు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. రమ్యను బస్టాండ్లో తరచూ కలిసే శశికృష్ణ.. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు రమ్య తిరస్కరించింది. అతని ఫోన్ నంబర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగస్టు 15న తన ఇంటి నుంచి టిఫిన్ కోసం హోటల్కు వచ్చిన రమ్యను నడిరోడ్డుపై కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 12 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 13న కోర్టు విచారణకు తీసుకుంది. డిసెంబర్ 31న విచారణ ప్రారంభించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28 మంది సాక్షులను విచారించారు. హత్యకు సంబంధించి కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని, ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలో అన్ని సాక్ష్యాలను సేకరించారు. ఆఖరుకు డీఎన్ఎ టెస్ట్ కూడా చేయించారు. సాక్షులు అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. మంగళవారంతో వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మీడియాతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు మొదలవ్వగానే.. శశికృష్ణ దోషిగా నిర్ధారణ అయ్యిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. సరిగ్గా 2.30 గంటలకు దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం భారీ బందోబస్తు నడుమ ముద్దాయిని జైలుకు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా చరిత్రలో విద్యార్థినిపై హత్య కేసులో ఉరిశిక్ష పడటం ఇది రెండోసారి. 1999లో జెకేసీ కళాశాలలో సాయిలక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినిని సుభాని అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఆ కేసులోనూ దోషికి ఉరి శిక్ష పడింది. అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వం రమ్య హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ప్రజా ప్రతినిధులు రమ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటించారు. రెండో రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు రమ్య తల్లి నల్లపు జ్యోతికి అందించారు. అదే నెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు – పేదలందరికి ఇల్లు పథకం కింద గుంటూరులో ఇంటి పట్టా అందించారు. పోస్టుమార్టం, ఛార్జ్షీట్ వేసే దశలో అమె తల్లికి మరో రూ.8,25,000 ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చెల్లించారు. రమ్య సోదరి నల్లపు మౌనికకు సెప్టెంబర్ 16న రెవిన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి మౌనికకు డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో కోటీ 61 లక్షల 25 వేల 300 రూపాయల ఖర్చుతో ఐదు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ స్పందనను జాతీయ ఎస్సీ కమిషన్ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆగష్టు 15న నా కుమార్తె హత్యకు గురైందని తెలిసి సృహ కోల్పోయాను. తర్వాత ఎస్పీ వచ్చి ధైర్యం చెప్పారు. దిశ డీఎస్పీ రవికుమార్ నాతో వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు దోషిని వెంటనే పట్టుకుంటామన్నారు. ఆ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుకుని పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటి ఉండి అండగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున పరామర్శించి, మరింత ధైర్యం చెప్పారు. న్యాయస్థానమంటే ఎరుగని మాకు ప్రత్యేక పీపీ శారదామణి సొంత మనిషిగా భావించి సహకరించారు. ఇవాళ దోషికి ఉరి శిక్ష విధించడంతో మాకు ఊరట లభించింది. మాకు సహకరించిన ప్రభుత్వం, పోలీసులు, దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు – జ్యోతి, హత్యకు గురైన రమ్య తల్లి సీఎంతో మాట్లాడాకే ధైర్యం వచ్చింది మా అక్కను చంపిన వాడిని గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని తొలుత భావించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లే ముందు కూడా న్యాయం జరుగుతుందని పెద్దగా అనిపించలేదు. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాతే ధైర్యం వచ్చింది. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, ప్రజాప్రతినిదులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – మౌనిక, హత్యకు గురైన రమ్య సోదరి ఈ తీర్పుతో మహిళలకు భరోసా గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వగానే ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అనంతరం జీజీహెచ్కు వెళ్లి రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాం. హత్య చేసిన యువకుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పది గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. సాక్ష్యాలు, సీసీ పుటేజీ, వేలి ముద్రలు, డీఎన్ఏ తదితర ఆధారాలు సేకరించాం. పోలీస్, ఫోరెనిక్స్, న్యాయస్థానం.. ఒక బృందంగా పని చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం పోలీసుల పనితీరును అభినందించింది. ఈ తీర్పుతో మహిళలకు భరోసా కలుగుతుందనడంలో సందేహం లేదు. – కె.ఆరిఫ్హఫీజ్, గుంటూరు జిల్లా ఎస్పీ ఈ శిక్షకు అతను అర్హుడే రమ్య హత్య కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కోర్టు ట్రయల్ జరుగుతున్న క్రమంలో పలువురు సాక్షులను విచారించాం. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం దోషికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హత్యకు పాల్పడిన అతను ఈ శిక్షకు పూర్తిగా అర్హుడే. – శారదామణి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణ శిక్ష సరికాదు క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. – భూలక్ష్మి, శశికృష్ణ తల్లి ‘దిశ’ను విమర్శిస్తున్న వారికి ఇదో చెంపపెట్టు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టు. దేశంలో ఎక్కడాలేని రీతిలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టానికి రూపకల్పన చేశారు. పార్లమెంట్ ఆమోదించడంలో జాప్యం వల్ల దిశ ఇంకా చట్ట రూపం సంతరించుకోలేదు. ఆ చట్టం స్ఫూర్తితో దిశ యాప్ను ప్రభుత్వం రూపొందించింది. కోటి మంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్లో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కోర్టు తీర్పు చరిత్రాత్మకం విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకం. హత్య జరిగిన 10 గంటల్లోపే నిందితుణ్ణి అరెస్ట్ చేసి.. 24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు చేశాం. కోర్టు తీర్పుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు వణుకు పుడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోంది. – తానేటి వనిత, హోంమంత్రి ‘దిశ’ గొప్పదనమిది విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాం. 9 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్షపడేలా చేయడం సీఎం వైఎస్ జగన్ పరిపాలన గొప్పదనం. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయడానికి ఆస్కారం ఉండేది. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ‘దిశ’తో సత్వర న్యాయం గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ బిల్లు స్ఫూర్తితో సత్వర న్యాయానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ కేసు విచారణ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని జాతీయ ఎస్సీ కమిషన్ సైతం మెచ్చుకుంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్ మృగాళ్లకు కనువిప్పు రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మృగాళ్లకు కనువిప్పు అవుతుంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. రమ్య కేసును దిశ చట్టం రూపకల్పనలో పేర్కొన్నట్టుగా వేగవంతంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేశారు. – విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు న్యాయాధికారి రామ్గోపాల్ ప్రకటించారు. రమ్య కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది. రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో రూ.1,61,25,300తో ఐదెకరాల పట్టా భూమి కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేసింది. రమ్య హత్యకేసు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు బావుందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్చైర్మన్ అరుణ్హల్దార్ కొనియాడారు. హత్య అనంతరం గుంటూరు వచ్చిన కమిషన్ బృందం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రభుత్వం చాలా పాజిటివ్గా స్పందించిందని కొనియాడింది. -
పలాస అమ్మాయి జాక్పాట్.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
సాక్షి, విశాఖపట్నం: బీటెక్ చదువుతుండగానే ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో భారీ ఆఫర్ను చేజెక్కించుకుందో విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ కళాశాలలో అమెజాన్ సంస్థ 2021 డిసెంబర్లో క్యాంపస్ సెలక్షన్ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు) -
Hyderabad: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులు వరంగల్లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లి వివేకానంద నగర్లో నివసించే బత్తిని సోహన్ సిద్ధ అనే బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వరంగల్లో బంధువుల పెళ్లికి వెళ్లొచ్చేసరికి సిద్ధ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (హోటల్లో స్నేహితురాలితో ఏకాంత వీడియో.. ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో) -
సిద్ధూ.. ఒక్కసారి చూడు బాబూ..
వెంకటాచలం(నెల్లూరు జిల్లా): పెద్ద చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్న కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు ఆదూరు శీనయ్య – అపర్ణ తల్లడిల్లిపోయారు. కందలపాడు సమీపంలో సాగునీటి కాలువలో ఈతకు వెళ్లి మృతిచెందిన మండలంలోని కనుపూరుకు చెందిన బీటెక్ విద్యార్థి ఆదూరు సిద్ధూ, తిరుపతికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పర్నా అనుదీప్ మృతదేహాలకు శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో అనుదీప్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లగా సిద్ధూ మృతదేహాన్ని బంధువులు శుక్రవారం 12 గంటలకు కనుపూరుకు తీసుకువచ్చారు. చదవండి: రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి.. గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు కనుపూరు గ్రామానికి చెందిన ఆదూరు శీనయ్య – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధూ బీటెక్ చదువుతుండగా, రెండో కుమారుడు హర్ష నెల్లూరు నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తమ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి వికటించి పెద్ద కుమారుడు సిద్ధూ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సిద్ధూ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేదు. సిద్ధూ ఒక్కసారి నన్ను చూడు బాబూ.. అంటూ ఆ తల్లి పడిన ఆవేదన చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే కాకాణి పరామర్శ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆదూరు సిద్ధూ మృతిచెందాడని తెలియడంతో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం కనుపూరుకు వెళ్లి సిద్ధూ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. -
అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్: బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూలు జిల్లా మాదవన్పల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అరుణ దంపతుల కుమారుడు శివనాగులు బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 20 రోజుల క్రితం వీఎన్ఆర్ కాలే జీæ హాస్టల్లో చేరాడు. కాగా గురువారం ఉదయం శివనాగులు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హాస్టల్ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాచుపల్లిలో నివాసముండే శివనాగులు మేనమామ ప్రకాష్ హుటాహుటిన హా స్టల్ దగ్గరకు వచ్చాడు. అయితే సుమారు 30 నిమిషాలు అతన్ని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించ లేదు. అప్పటికే మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బీజేపీ నాయకులు కాలేజ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే పోలీసులకు సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, అందుకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని, కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరినట్లు అందులో ఉంది. మృతుడి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఎలాంటి సమస్యలు లేవని, సుసైడ్ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ తమ బిడ్డది కాదని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల ధర్నా.. లాఠీ చార్జ్.. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయంటూ కాలేజ్ గేట్ ముందు ధర్నా చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారిపై లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలేజ్ యాజమాన్యం కనీసం విద్యార్థి మృతికి సంతాపం కూడా తెలపక పోవడం సిగ్గుచేటని ఏబీవీపీ నాయకులు అన్నారు. మధ్యాహ్నం తరువాత స్పందించిన కాలేజ్ యాజమాన్యం సెలవు ప్రకటించింది. లాఠీ చార్జిపై శ్రీశైలంగౌడ్ ఆగ్రహం.. విద్యార్థి అనుమానాస్పద మృతిపై నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవి ధంగా మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, నిజాంపేట్ మున్సి పల్ అ«ధ్యక్షుడు సతీష్లు పోలీసులు, కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై మండి పడ్డారు. అదే విధంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి శ్రీనివాస్లు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు హాస్టల్లో ఫ్రెషర్స్ పార్టీ.. వీఎన్ఆర్ హాస్టల్లో బుధవారం రాత్రి ఫ్రెషర్స్ పార్టీ జరిగినట్లు సమాచారం. ఆ పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఈ నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేదా ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడితే అసలు విషయం బయటపడే అవకాశముంది. -
నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థి దారుణ హత్య?
కావలి( నెల్లూరు జిల్లా): కావలి రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ముసునూరు టోల్గేట్ సమీపంలో హైవే పక్కనే చెట్ల మధ్య వింజమూరుకు చెందిన బీటెక్ విద్యార్థి కంచర్ల రాజేందర్ (20)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి తగులబెట్టిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ కథనం మేరకు.. టోల్గేట్ నుంచి తుమ్మలపెంట వెళ్లే మార్గంలో హైవే పక్కనే చిల్లచెట్లలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు హైవే అథారిటీ సిబ్బంది సమాచారం అందించారు. చదవండి: వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో.. మృతదేహం వద్ద లభించిన సగం కాలిన సెల్ఫోన్లోని సిమ్కార్డ్ ఆధారంగా వివరాలు సేకరించారు. అతను వింజమూరుకు చెందిన కంచర్ల రాజేందర్గా తెలిసింది. కావలి విట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రాజేందర్ గురువారం ఉదయం కాలేజీకని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కళాశాలలో విచారించగా అసలు కాలేజీకే రాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే రాజేందర్ మృతదేహం ముసునూరు టోల్గేట్ సమీపంలో లభించింది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అమ్మా నేను చనిపోతున్నా.. నన్ను క్షమించు.. -
ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్పై బీటెక్ స్టూడెంట్ ఫిర్యాదు
హయత్నగర్: ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం... హయత్నగర్కు చెందిన బీటెక్ విద్యార్థిని (22) చంపాపేట్కు చెందిన రబ్లావత్ శంకర్(24) అనే ఆటో డ్రైవర్ను ప్రేమించింది. రెండేళ్ల పాటు తనను వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత యువతి బుధవారం సాయంత్రం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. -
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్కుమార్ కుమార్తె రోహిత (21) విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె సోమవారం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనకు ఏడాదిగా పరిచయమున్న అదే కళాశాలకు చెందిన విద్యార్థితో మనస్పర్థలు వచ్చాయని, తనతో అతను మాట్లాడటం లేదని ఆవేదన చెందింది. దిగులు పడవద్దని తాము వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో కుటుంబసభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్కు వచ్చి రోహిత గదిని చూడగా అక్కడ ఆమె ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు చాట్రాయి నుంచి కానూరు వచ్చారు. హాస్టల్ గదిలో రోహిత మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తూ బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా' -
పేర్లు మార్చి.. ప్రేమ పేరుతో నమ్మించి..
కర్నూలు (టౌన్): వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పేర్లు మార్చుకుంటూ.. యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసగిస్తున్న బీటెక్ విద్యార్థిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తున్నాడు. అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహం కాగా, ఆమె ఫొటోలను వాట్సాప్లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిందితుడు అన్వేష్ను కర్నూలు కలెక్టరేట్ వద్ద గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ హెచ్చరించారు. -
డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం
వైరా రూరల్: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్తో వివాహం కుదిరింది. ఇక్బాల్ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేయగా ఇక్బాల్ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు తెలిసింది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. -
లోకేష్ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కాదు
తూర్పుగోదావరి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఏంమాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థంకాదని మండిపడ్డారు. -
‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’
సాక్షి, తాడేపల్లి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. అయితే నారా లోకేష్బాబు, ఆ పార్టీ నేతలు రాజకీయ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్న చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. అప్పుడు లేవని ఆ పార్టీలోని దళిత నాయకుల నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ఆ నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలు దళితుల గురించి మాట్లాడిన మాటలు గుర్తులేవా అని, అప్పుడు ఈ దళితుల నోళ్లు ఎందుకు లేవలేదని విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసం పని చేయవద్దని టీడీపీ నాయకులకు సునీల్ కుమార్ హితవు పలికారు. దళితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదని భరోసానిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల్లో కేవలం ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే వైఎస్ జగన్ 5 మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దళితులంతా జగనన్న వెంటే ఉన్నారని, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని జగనన్నతో విడదీయలేరని స్పష్టం చేశారు. చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ పాక్లో దారుణం: మహిళా టిక్టాకర్పై 300 మంది దాడి! -
గుంటూరులో టీడీపీ నేతల శవ రాజకీయం
-
టీడీపీ శవరాజకీయాలు
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గుంటూరులో ఆదివారం హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి సోమవారం ఉదయం పంచనామా పూర్తయింది. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ వివేక్యాదవ్ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ, మేయర్ మనోహర్నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము తదితరులు రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ మంత్రి లోకేశ్ వస్తున్నారని, ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని టీడీపీ నేతలు ఆనంద్బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్కుమార్, నసీర్ అహ్మద్, కార్యకర్తలు అంబులెన్సు ముందు బైఠాయించారు. వారించిన పోలీసులపై తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట ఎస్ఐ నరసింహపై దాడిచేశారు. అంబులెన్స్కు దారిచూపే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. జీజీహెచ్ నుంచి రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్సును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అక్కడా అంతే.. మృతురాలి ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే రీతిన ప్రవర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్కుమార్, ఆలపాటి రాజా, ఆనంద్బాబు మృతురాలి ఇంటి ముందు నిలబడి నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను లోకేశ్ బృందం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని పేర్కొన్నారు. రమ్య ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించటమేగాక పోలీసు విధులకు ఆటంకం కలిగించిన లోకేశ్, మరో 32 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అర్బన్, రూరల్ ఎస్పీలు ఆరీఫ్ హఫీజ్, విశాల్ గున్నీ అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. లోకేశ్ను విడుదల చేయాలంటూ టీడీపీ వారు ప్రత్తిపాడులో రోడ్డుపై బైఠాయించి ఎస్ఐ అశోక్తో వాగ్వాదానికి దిగి కవ్వించారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్ సీఐ వాసు సోమవారం రాత్రి లోకేశ్తో పెదకాకాని పోలీసుస్టేషన్ వద్ద సంతకం చేయించుకుని పంపించారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్య జరుగుతుంటే దిశ యాప్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గుంటూరు నడిబొడ్డునే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే సీఎం జగన్కి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. -
గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి, గుంటూరు: కాకాని రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ హఫీజ్ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని
వనపర్తి క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం.. వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటోంది. ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యా లయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు. తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లోనే మధ్యాహ్నం ఉరేసుకొని చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం. -
మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం
సాక్షి, భాగ్యనగర్కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్నగర్కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. -
విషాదం: ఒక్కసారిగా కృష్ణాలో దూకిన బీటెక్ విద్యార్థి
సాక్షి, తాడేపల్లి: స్నేహితులతోపాటు సరదాగా కృష్ణానదికి వచ్చిన బి.టెక్. విద్యార్థి అనంత లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన బి.టెక్ 4వ సంవత్సరం చదివే సాయి (20), అవినాష్ అనే స్నేహితుడు, మరో ఐదుగురితో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్లోకి ఈతకు వెళ్లారు. అవినాష్, మరో ఐదుగురు కృష్ణానదిలోకి దిగి ఈత కొడుతుండగా సాయి గట్టు మీద నుంచొని ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ స్నేహితులు ఈత కొట్టడం చూసి ఒక్కసారిగా గట్టు మీద నుంచి కృష్ణానది నీటిలోకి దూకాడు. దూకిన సాయి మునిగిపోయి కనిపించకపోవడంతో ఆక్వా డెవిల్స్ సిబ్బంది వెదికి, బయటకు తీయగా సాయి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాయి మృతదేహాన్ని స్నేహితులు విజయవాడ తీసుకువెళ్లారు. సాయి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడిగా తెలియవచ్చింది. నలుగురు జూదరుల అరెస్ట్ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్తూరు తాడేపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్ఐ శేఖర్బాబు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చిట్టినగర్: నిబంధనలకు విరుద్దంగా శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొత్తపేటకు చెందిన పి. మురళి కొంతకాలంగా శానిటైజర్ను చిన్నచిన్న బాటిల్స్గా చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెక్టార్ ఎస్ఐ విశ్వనాథ్ నిందితుడిని అరెస్టు చేసి 80 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చిట్టినగర్: పాముల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కాలువలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాలువలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి నీటిలో కనిపించడంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల మెట్లెక్కుతూ బీటెక్ విద్యార్థి మృతి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వస్తున్న భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వివరాల మేరకు.. హైదరాబాద్కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్ధం కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. గాలిగోపురం వద్ద ఆయాసం రావడంతో శ్వాస ఆడలేదు. టీటీడీ సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఊపిరి అందక రాహుల్ మృతి చెందాడు. చదవండి: వివాహేతర సంబంధం: తండ్రీ కొడుకుల ఆత్మహత్య ఎక్స్లేటర్పై కాలుతీసి బ్రేక్పై మోపడంతో... -
జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్నగర్ సమీపంలోని కార్మికనగర్లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విడాకులు కోరిన భార్య.. కడుపుమీద కారు ఎక్కించి హత్య) -
సెల్ఫీ వీడియో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెద్ద చదువులు చదివిస్తున్నారు. కానీ ఓ పరీక్ష ఫెయిలయ్యానన్న మనస్థాపంతో ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడపుకోతను మిగిల్చాడు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు... పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల ఏకైక కుమారుడు తిరుమలేష్(23) ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు రాసే ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. (చదవండి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. "అమ్మా... నేను ఫెయిల్యూర్గా మిగిలిపోయా. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా.. చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా. నాలాంటి ఎదవకు జన్మనిచ్చి మీరు తప్పు చేశారమ్మా.. మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్నందుకు బాధగా ఉంది. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా, నన్ను క్షమించండి" అంటూ వీడియో తీసి మిత్రులకు పంపాడు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తిరుమలేష్ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. (చదవండి: జీవితం నాశనం అయింది, బతికింది చాలు) -
ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్డెడ్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన రక్షిత అనే బీటెక్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్ అయింది. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన 20ఏళ్ల రక్షిత.. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. డిసెంబర్ 31న రక్షిత బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షితకు బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి అవయవాలను దానం చేస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితలు ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోని డీఆర్డీఓలో పని చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థులకు గూగుల్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ శుభవార్త అందించింది. ప్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. నిర్దేశిత ఇంటర్న్షిప్ 12 నుంచి 14 వారాల పాటు ఉంటుంది. ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తుకు చివరితేది డిసెంబర్ 11, 2020 అని గూగుల్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగుళూర్లోని గూగుల్ క్యాంపస్లలో మాత్రమే ఈ ఇంటర్న్షిప్కు అవకాశం ఉంటుంది. (వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం) అర్హతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్లో బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసునేందుకు అర్హులు. అభ్యర్థులకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, సీ + +, పైథాన్ తెలిసి ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్వేర్ లేదా అల్గారిథమ్లతో పాటుఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి. -
ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్ను ప్రస్తుత డిమాండ్తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో బ్లాక్చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్చైన్ డెవలపర్, బ్లాక్చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్వర్క్గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్గా కెరీర్ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
దివ్య తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కు అందజేత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబసభ్యులకు పది లక్షలు చెక్కును అందజేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంటల్లోనే దివ్య తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కును అందజేసింది. చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుందని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ దివ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం తరపున , పార్టీ తరపున వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) సీఎం వైఎస్ జగన్ సహాయం మరవలేనిదని దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చారని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జగన్కి రుణపడి ఉంటామన్నారు. ఈ కేసులో తమ బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. (సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం
సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ సతీష్ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో') -
'హోంమంత్రి భరోసాతో ధైర్యంగా అనిపిస్తుంది'
విజయవాడ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని, దివ్యను హత్యచేసిన ఉన్మాదిని శిక్షించి న్యాయం చేయాలని ఆమె తల్లి కుసుమ విన్నవించుకున్నారు. స్వయంగా రాష్ర్ట హోం మంత్రే తమ ఇంటికి రావడంతో భరోసాగా ఉందని దివ్య తండ్రి జోసెఫ్ అన్నారు. కోర్టుల చుట్లూ తిరగలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తమకు హోంమంత్రి భరోసా ఇవ్వడం చాలా ధైర్యంగా అనిపిస్తుందన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేలా మంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) తాను సీఎం వైఎస్ జగన్కు వీరాభిమానినని , తన చెల్లికి తక్షణమే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని దివ్య సోదరుడు దినేష్ అన్నారు. ఈ ఘటనను సామాజిక దారుణంగా చూడాలని, ఇంట్లో ఉన్నా రక్షణ లేకపోవడం అన్నది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమన్నారు. దేశంలో ప్రతీ రెండు రోజులకు ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు జరుగతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా! ) -
అసలేం జరిగింది?
-
'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'
సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్) పోలీసుల విచారణలో కొత్త విషయాలు దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్ చేయగా.. ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్కు బదిలీ చేశారు. పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం జీజీహెచ్ సర్జికల్ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!) -
ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు. (చదవండి: మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య తేజస్విని అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవహారంపై దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదు. నాగేంద్ర ఇంటిపై మేము దాడి చేసామన్న ఆరోపణలు కూడా సత్యదూరం. అతడి మాటల్లో దివ్యపై ప్రేమ ఉంటే అంత కిరాతకంగా ఎలా చంపాడు..?. వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవన్నీ కూడా మార్ఫింగ్ ఫొటోలని దివ్య తల్లి కుసుమ కొట్టిపారేసింది. -
గో కార్టింగ్ సీజ్, నిర్వాహకులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుర్రంగూడలోని హాస్టన్ గో కార్టింగ్ నిర్వాహకులను మీర్పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతి లేకుండానే గో కార్టింగ్ నిర్వహిస్తున్నారని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సందర్శకులను అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ నిర్వహాకులు గుర్రం లోహిత్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాంత్ను అరెస్ట్ చేసి గో కార్టింగ్ సెంటర్ను సీజ్ చేశారు. కాగా వనస్థలిపురంలోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన శ్రీ వర్షిణి అనే యువతి గో కార్టింగ్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గో కార్టింగ్ నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణి మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. (గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: హాస్టన్ గో కార్టింగ్ ప్లే జోన్ నిర్వాహకులపై మీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత బుధవారం సాయంత్రం గో కార్టింగ్ రైడింగ్ చేస్తూ బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైడింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైన శ్రీవర్షిణి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో శ్రీ వర్షిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవనుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వెంట్రుకలు చిక్కుకోవడంతో గో కార్టింగ్ రైడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అయితే, సెల్ఫీ కోసం శ్రీ వర్షిణి హెల్మెట్ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయని, ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్ గో కార్టింగ్ జోన్ నిర్వాహకులు చెప్తున్నారు. (చదవండి: గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ ప్లే జోన్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమరపల్లి మండలానికి చెందిన కాపా నాగేశ్వరరావు, మంజుల దంపతులకు కుమార్తె శ్రీవర్షిణి (21), కుమారుడు నాగప్రణీత్లు ఉన్నారు. నాగేశ్వరరావు మృతి చెందడంతో రెండున్నరేళ్ల క్రితం తల్లి మంజుల పిల్లలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రీవర్షిణి వరంగల్ కిట్స్లో బీటెక్ 3వ సంవత్సరం సీఎస్సీ గ్రూప్ చదువుతోంది. బుధవారం ఇంటికి బంధువులు రావడంతో శ్రీ వర్షిణి వారితో కలిసి సరదాగా రాత్రి 7.30 గంటల సమయంలో గుర్రంగూడలోని హస్టెన్ గో-కార్టింగ్కు వెళ్లారు. కాగా శ్రీవర్షిణి బంధువుతో కలిసి రైడ్కు వెళ్లగా ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే శ్రీవర్షిణి చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవర్షిణి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది... హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం దీనిపై గో-కార్టింగ్ యాజమాన్యం స్పందిస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. నిర్వాహకుడు కిరణ్ మాట్లాడుతూ.. శ్రీ వర్షిణితో పాటు వాళ్ల బాబాయ్ నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మా కార్టన్కు వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేము కార్టన్ ఇస్తాం. శ్రీ వర్షిణి, వాళ్ల బాయ్ ఇద్దరూ ఒకే వెహికల్పై ఉన్నారు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఒక రౌండ్ వేశాక రెండో రౌండ్లో శ్రీ వర్షిణి హెల్మెట్ తీసి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసింది. దీంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయి. ఆమె కిందపడటంతో తలకు దెబ్బ తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత మూడేళ్లుగా కార్టిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
గో కార్టింగ్: బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
-
గో కార్టింగ్: బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ సరదా బీటెక్ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన నగర శివారులోని గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్లో చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్కు వెళ్లింది. గో కార్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ టైర్కు యువతి తల వెంట్రుకలు చుట్టుకున్నాయి. వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీ వర్షిణి తల బలంగా నేలకు తగిలింది. ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో శ్రీ వర్షిణిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎవరిని ప్రేమించకండి, చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించండి అంటూ తన మిత్రులకు బాయ్ చెప్తూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా సప్తగిరికాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించిన సాయి.. ఆ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయాక అతని సెల్ ఫోన్లో సూసైడ్కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడడంతో కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు బోరున విలపించారు. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’) -
వింత వ్యాధితో గిరిజన విద్యార్థిని..
సీతంపేట: ఎచ్చెర్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అమీల అనే గిరిజన విద్యార్థిని కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సీతంపేట మండలంలోని ఎతైన కొండలపై ఉన్న గడికారెం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని వింత వ్యాధితో బాధపడుతోంది. ఒల్లంతా కురుపులతో నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పటికే ఈమె వైద్యానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. అయినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అప్పులు చేసి ఈమెకు వైద్యం చేయించారు. ఇంకా నయం కావడానికి మరో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబానికి వింత వ్యాధి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. -
నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో
కర్నూలు(సెంట్రల్): నాన్నా తాగొద్దు. అమ్మను బాగా చూసుకో అంటూ లెటర్ రాసి పెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్లూరులోని జానకీ నగర్కు చెందిన విజయకుమార్ జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలతోపాటు ఇంట్లో తండ్రి మందుకు అలవాటుపడడంతో చదువుపై దృష్టి సారించలేకపోయేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో వాళ్లు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఫ్యాన్కు ఉరి వేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. -
ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
అమీర్పేట: ఇంటర్ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తూ్త బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఆర్నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్పేట ధరంకరం రోడ్డులోని దీప్శికా ఒకేషనల్ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే విద్యార్థికి బదులుగా బీటెక్ చదువుతున్న సాయితేజ అనే మరో విద్యార్థి శుక్రవారం జరిగిన గణితం బి.2 పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న విద్యార్థి వయస్సు ఎక్కువగా కనిపించడంతో ఇన్విజిలేటర్కు అనుమానం వచ్చి హాల్ టికెట్ను తనిఖీ చేశాడు.విద్యార్థి వద్ద ఉన్న హాల్టికెట్లోని ఫోటోతో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పరిశీలించడంతో అసలు విషయం వెలుగుచూసింది.దీంతో పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ
పామూరు: విజయవాడ, గుంటూరు, ఒంగోలులో బీటెక్ చదువుతున్న తమ పేర్లను పట్టణంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాలలో నమోదు చేసుకున్నారని పామూరు పట్టణం, మండలంలోని ఇనిమెర్ల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కనిగిరి ఏఎస్డబ్ల్యూవో రాజేశ్వరి, పామూరు ఎస్ఐ చంద్రశేఖర్లు విచారణ చేపట్టారు. వివరాలు.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని బెల్లంకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఎంపీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని విజయవాడ, ఒంగోలు, గుంటూరులోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరారు. విద్యార్థులు వేముల వాసు, వై.మోహన్కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో, వల్లపుశెట్టి సతీష్ ఒంగోలు పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో, ఇర్లా కల్యాణ్ గుంటూరు చలపతి కళాశాలలో బీటెక్లో చేరారు. వీరు ఫస్ట్ సెమ్ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా నవశకం కార్యక్రమంలో భాగంగా జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మీ పేర్లు ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సదరు విద్యార్థులకు సమాచారం ఇచ్చాయి. విద్యార్థులు అవాక్కై హుటాహుటిన పామూరు వచ్చి సదరు డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించిన తమను యాజమాన్యం దూషించిందని బాధిత విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ విద్యార్థులను విచారించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. డిగ్రీ కళాశాల నిర్వాహకులను పిలిపించి విచారణ జరిపారు. జిల్లా అధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన కనిగిరి ఏఎస్డబ్ల్యూవో ఈ.రాజేశ్వరమ్మ కూడా విద్యార్థులను విచారించారు. దీనిపై విద్యార్థులు పామూరులో సదరు డిగ్రీ కళాశాల లేదని, సీఎస్పురంలో ఉందని తెలపగా విద్యార్థులు తెలిపిన కళాశాలలో విచారణ చేపట్టి ఆమె వెళ్లారు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా బుధవారం ఏఎస్డబ్ల్యూవో నివేదిక ఆధారంగా సీఐతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఏఎస్డబ్ల్యూవోను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదు. -
వీడిన బీటెక్ విద్యార్థి కేసు మిస్టరీ
సాక్షి, మేడ్చల్: బీటెక్ విద్యార్థి జీవన్రెడ్డి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. నల్గొండ జిల్లా సిద్దార్థ కాలనీకి చెందిన జీవన్రెడ్డి మేడ్చల్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను కళాశాల సమీపంలోని హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 11న కాలేజీకి వెళ్లిన అతడు తిరిగి రాలేదు.(అయిదు రోజులైనా లభించని బీటెక్ విద్యార్థి ఆచూకీ) ఇక హాస్టల్ రూమ్ బాత్రూంలో రక్తపు మరకలు కనపడటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జీవన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసమే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలోనూ అతను క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేవాడని తెలిసింది. (విద్యార్థి అదృశ్యం: 70 సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన) -
నారాయణమ్మ విద్యార్థినికి బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లొ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.లోహితా రెడ్డి అడోబ్ ఐఎన్సీ సంస్థలో రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఇటీవల కళాశాలలో అడోబ్, అమేజాన్, జేపీ మోర్గాన్, డెలాయిట్ తదితర సంస్థలు విద్యార్థునులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (హెచ్సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ) కళాశాలకు చెందిన 440 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. సుమారు రెండు వందల మంది రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇంజినీరింగ్ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థినులకు పలు కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, కార్యదర్శి విద్యారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
బంజారాహిల్స్: ఆక్సిజన్ సిలిండర్ పైపులను మెడకు చుట్టుకుని.. పాలిథిన్ కవర్లను ముఖానికి వేసుకొని బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం పరీక్షల్లో ఓ సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఫిలింనగర్లోని వినాయనగర్ బస్తీలో నివసించే పి.గణేష్ (19) బండ్లగూడలోని మహవీర్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి కురుమయ్య టిప్పర్ డ్రైవర్. తల్లి రమణమ్మ పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గణేష్ ఉంటున్న గది నుంచి తీవ్రంగా వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి డోర్ కొట్టారు. పావుగంట గడిచినా డోర్ తీయకపోగా అప్పటికే వాసన మరింత పెరగడంతో కిటికీలోంచి లోనికి చూడగా గణేష్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను మెడకు చుట్టుకొని, ఓ పాలిథిన్ కవర్ను ముఖానికి వేసుకొని కనిపించాడు. అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగులగొట్టి గణేష్ను వెంటనే అపోలో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు నెలల క్రితం గణేష్ బీటెక్ రెండో సంవత్సరం పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురయ్యాడని, మరోసారి పరీక్ష రాసినప్పటికీ ఫలితం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఆక్సిజన్ సిలిండర్లను తన ఇంట్లోకి తెచ్చుకోగా వాటిని తల్లి గమనించలేదు. మృతుడి చెల్లెలు మాత్రం సిలిండర్ల గురించి ప్రశ్నించగా గణేష్ సమాధానం చెప్పలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని మరో విద్యార్థి.. మలక్పేట: పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. గుజరాత్ రాజ్కోట్కు చెందిన హరీష్ బాయ్ కుమారుడు దర్శన్ హరీష్ బాయ్ (24) చదువు కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్ హెగ్డే ఆస్పత్రి సమీపంలోని దీక్షత్ అపార్ట్మెంట్ పెంట్హైస్లో అద్దెకు ఉంటున్నాడు. గడ్డిఅన్నారంలోని ఓ విద్యాసంస్థలో గేట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 2న గేట్ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం పరీక్ష ‘కీ’ పేపర్ చూసుకోగా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనోవేదనకు గురైన అతడు ఈ నెల 15న తన గదిలోని సీలింగ్ హుక్కుకు బెడ్షీట్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాచ్మన్ మారుతి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గదిలో దొరికిన సూసైడ్ నోట్లో తన శవాన్ని కోయంబత్తూర్లోని ‘బూ యోగా’ సెంటర్కు అందించాలని రాసి ఉంది. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
హుస్నాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది. వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్పై నారు వేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది. -
ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!
సాక్షి, ఉలవపాడు: రోడ్సేఫ్టీ పోలీసుల మానవత్వం ఓ యువకుడిని తన సొంత ఇంటికి చేర్చింది. మతి స్థిమితం లేకుండా జాతీయ రహదారిపై తిరుగుతున్న యువకుడిని చేరతీసి సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు కలిపి ఏర్పాటు చేసిన రోడ్డుసేప్టీ వాహనంలో కానిస్టేబుళ్లు ప్రసాద్, బ్రహ్మయ్యలు విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై బీట్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు తడుస్తూ కనిపించాడు. తొలుత అనుమానించలేదు. మరలా తిరిగివస్తున్న సమయంలో కూడా అలానే కనిపించడంతో సోమవారం ఉదయం అతనిని దగ్గరకు తీసుకున్నారు. ముందు ఉలవపాడు హోటల్లో టిఫిన్ పెట్టించారు. తమ వాహనంలోనే ఉంచుకుని సమాచారం అడిగారు. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజనం పెట్టించారు. అతని వద్ద ఆధార్ కార్డు ఉండడం గమనించి కార్డుతీసుకుని అతని ఫొటోలు తీసి అక్కడ ఉన్న వారికి పంపించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు గుర్తించి మంగళవారం ఉదయం ఉలవపాడుకు వచ్చారు. వచ్చిన తరువాత ఆ యువకుడు అలా మతిస్థిమితం లేకుండా తిరగడానికి గల కారణాలు, ఆ కుటుంబం పడుతున్న బాధలను తల్లిదండ్రులు వివరించారు. ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు... ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామంలోని ఉమ్మడివరం కాలనీకి చెందిన కందుకూరి రాములు, సృజనల కుమారుడు కందుకూరి రాజేష్. 2012 లో విజయవాడలోని ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చేరాడు. మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో గొడవ జరిగింది. కళాశాలలో తల పై కొట్టడంతో గాయపడ్డాడు. ఆ తరువాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుండి క్రమంగా మతి స్థిమితం లేకుండా తయారవుతున్నాడు. ఈ పరిస్థితులో హైదరాబాద్, బెంగళూరు ఇలా పలు చోట్ల చూపించారు. అయినా తగ్గలేదు. తరువాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న ఒంగోలు రిమ్స్ లో చేర్చారు. అక్కడే 21 వరకు ఉన్నాడు. వైద్యశాలలో తల్లి నిద్రపోతున్న సమయంలో పారిపోయి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేకుండా ఇలా రోడ్ల పై తిరుగుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి వారి తల్లితండ్రులు వెతికినా ఆచూకీ కనపడలేదు. ఈ పరిస్థితుల్లో రోడ్సేఫ్టీ పోలీసులు గుర్తించి అతనితో మంచిగా మాట్లాడుతూ దాదాపు 12 గంటలు ఉంచుకున్న తరువాత తన అడ్రస్కు సంబంధించి కార్డును చూపించాడు. తల్లిదండ్రులకు అప్పగింత... ఇక్కడ తీసిన ఫొటోలను అక్కడి పోలీసులకు, మిత్రులకు రోడ్ సేఫ్టీ సిబ్బంది వాట్సప్ ద్వారా పంపించారు. వారి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి తల్లితండ్రులు కందుకూరి రాములు, సృజనలు ఆ ఫోటోలు చూసి తమ కుమారుడిని గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం రావడంతో రోడ్సేఫ్టీ పోలీసు సిబ్బంది ప్రసాద్, బ్రహ్మయ్యలు రాజేష్ను వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
రుషికొండ బీచ్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు.