day
-
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
ప్రపంచ చీరల దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: చీర కట్టుకునే సంస్కృతి 5 వేల ఏళ్ల నుంచి కొనసాగుతోందని ఫ్లో (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చైర్పర్సన్ ప్రియా గజ్దర్ అన్నారు. శుక్రవారం ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ) లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ చీరల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ చీర కట్టు అనేది ప్రపంచం ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. ఏటా డిసెంబర్ 21న శారీ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘ది సారీ– సిక్స్ యార్డ్స్ ఆఫ్ సస్టైనబుల్ హెరిటేజ్’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. -
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
National Candy Day: మిఠాయి పుట్టుక వెనుక..
మిఠాయిలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. స్వీట్స్ను చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరుతుంది. మరి ఇలాంటి మిఠాయిల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం నవంబర్ 4న జాతీయ మిఠాయి దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీపిని ఇష్టపడేవారు తియ్యని వేడుక చేసుకునే రోజు. ఈ రోజు ఉద్దేశ్యం స్వీట్లను ఆస్వాదిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తీపి పదార్థాలపై మనకున్న ప్రేమను వ్యక్తపరడచడం. ఈ రోజున వివిధ రకాల క్యాండీలను రుచి చూడటమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వేడుక చేసుకుంటుంటారు.మిఠాయి కథ భారతదేశంలోనే మొదలయ్యింది. ప్రాచీన భారతీయులు చెరకు రసాన్ని ఉడికించి, అచ్చులుగా పోసేవారు. వీటిని ముక్కలుగా చేసి దానిని ‘ఖండ’ అని పిలిచేవారు. దీనినే చరిత్రకారులు తొలి మిఠాయిగా అభివర్ణించారు. పురాతన చైనా, మధ్యప్రాచ్యం, ఈజిప్ట్, గ్రీస్, రోమ్లలో తేనెతో మిఠాయిలు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు మిఠాయిని జీర్ణవ్యవస్థను మెరుగుపరడచానికి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఉపయోగించేవారు.18వ శతాబ్దంలో క్యాండీ.. ఫ్రాన్స్ బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చింది. వంటలలో నైపుణ్యం కలిగినవారు చక్కెరతో మిఠాయిలు చేసేవారు. 1830వ దశకంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సమయంలో మిఠాయి సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల క్యాండీలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో చాలామంది ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు మిఠాయి తింటుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్న పనులు సఫలమవుతాయని భావిస్తుంటారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
Halloween Day: ఈ దెయ్యాల ఉత్సవం దేనికి జరుపుతారో తెలుసా?
హాలోవీన్ డే అంటే దెయ్యాల ఉత్సవం. గతంలో ఈ పండుగ గురించి భారతీయులకు పెద్దగా తెలియదు. అయితే కాలానుగుణంగా ఈ విదేశీ పండుగ మనదేశంలోనూ అక్కడక్కడా జరుపుకుంటున్నారు.ప్రతియేటా అక్టోబర్ 31న హాలోవీన్ డే జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలో ప్రజలు దెయ్యాల వేషం వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అతీంద్రియ శక్తులతో ఈ పండుగకు ముడిపెడతారు. ఈ హాలోవీన్ పండుగ ఇప్పుడు ఒక ట్రెండ్గా మారిపోయింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనే కాకుండా మరికొన్ని పట్టణాల్లో కూడా హాలోవీన్ పార్టీలు నిర్వహిస్తున్నారు.కొన్ని చోట్ల పాఠశాలల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ హాలోవీన్ పండుగ వెనుక అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పండుగకు రెండు వేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. ఈ ఉత్సవం ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నార్తర్న్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ పండుగను సంహైన్ అని కూడా పిలుస్తారు.సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్లో హాలోవీన్ను పౌర్ణమి నాడు వచ్చినట్లు చూపిస్తారు. అయితే, హాలోవీన్ సమయంలో పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది. 2020లో పౌర్ణమి నాడు హాలోవీన్ వచ్చింది. తదుపరి హాలోవీన్ పౌర్ణమి రాత్రి కోసం చాలా సంవత్సరం వేచి ఉండాలి. హాలోవీన్ రోజున, పిల్లలు వివిధ రకాల దుస్తులు ధరించి సమీపంలోని ఇళ్లకు వెళతారు. క్యాండీలను పంచిపెడతారు.ఈ ఆచారం ప్రారంభమైన నాటి రోజుల్లో రాత్రి సమయంలో దెయ్యాలు భూమిపై సంచరిస్తాయని నమ్మేవారు. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచడం మొదలుపెట్టారు. దీని తరువాత, చర్చిలలో ప్రార్థన చేసే అలవాటు ప్రారంభమైంది. క్రమంగా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ప్రారంభించారు.హాలోవీన్ రోజున నలుపు ,నారింజ రంగులతో అలంకరించుకుంటారు. నారింజ రంగు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు శరదృతువును సూచిస్తుంది. నలుపు రంగు అనేది భయానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శీతాకాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు రంగులు రుతువులలో మార్పులు, జీవితం ,మరణాన్ని సూచిస్తాయి. ఇది కూడా చదవండి: పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే.. -
Internet Day: మొదటి ఎలక్ట్రానిక్ సందేశం చేరిందిలా..
ఈ రోజు (అక్టోబర్ 29) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్ 29న ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపారు. నాడు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్(ఆర్పానెట్) అని పిలిచేవారు.ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ .. స్టాన్ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు.అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈరోజున కొత్త ఆన్లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్లో.. -
World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా..
విద్యార్థి దశలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న నిర్వహిస్తుంటారు.ఈరోజు (అక్టోబర్ 15) దేశ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆ మహనీయుని గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అబ్దుల్ కలాం విద్యార్థులకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయన విద్యారంగంలో ప్రశంసనీయమైన కృషి చేశారు. డాక్టర్ ఏపీ జె కలాం ప్రజా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024) థీమ్ 'విద్యార్థుల భవిష్యత్తు కోసం సంపూర్ణ విద్య'. విద్యను కేవలం అకడమిక్ అచీవ్మెంట్లకే పరిమితం చేయకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010 (అబ్దుల్ కలాం 79వ జయంతి) నుంచి ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 2002, జూలై 18న దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కలాం సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు. కలాం 2002 నుండి 2007 వరకు దేశానికి 11వ రాష్ట్రపతిగా ఉన్నారు. తన పదవీకాలంలో ఆయన విద్యార్థులు, యువతపై తనకున్న ప్రేమ, ఆప్యాయతలను వివిధ కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు. కలాం అందించిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఇప్పటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..! -
World Standards Day: ప్రమాణాల ప్రాధాన్యత తెలిపేందుకు..
మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. వస్తు ప్రమాణీకరణకున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ప్రతి సంవత్సరం అక్టోబరు 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రమాణాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు నిపుణులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణీకరణ ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు అవగాహన పెంచడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం. తొలిసారిగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1970లో నిర్వహించారు. ప్రామాణీకరణను సులభతరం చేయడానికి అంతర్జాతీయ సంస్థను రూపొందించాలని నిర్ణయించిన 25 దేశాల ప్రతినిధులు 1956లో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలోనే 1847లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)ఏర్పాటయ్యింది.సామాజిక అసమతుల్యతలను పరిష్కరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐఎస్ఓ ఏర్పాటయ్యింది. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ప్రామాణీకరణ కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 1947 సంవత్సరంలో దీనిని స్థాపించారు. 1986లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ పేరును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మార్చారు. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల పరిధిలో పని చేస్తుంది.ఇది కూడా చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే! -
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్గా పోస్టల్ సేవలు -
Cotton Day : పత్తి ఉత్పత్తుల ప్రాముఖ్యత తెలిపేందుకు..
పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు. ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు -
Translation Day: ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తూ..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.బైబిల్ను లాటిన్లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్ను లాటిన్లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్ఐటీ) ప్రారంభించింది.ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్పియర్, టాల్స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
National Daughter’s Day 2024: వందే భారత్ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ
జంషెడ్పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.జంషెడ్పూర్లోని జుగ్సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపి వందేభారత్ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! -
World Rose Day 2024: క్యాన్సర్ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం -
World Gratitude Day: నేనెవరికి థ్యాంక్స్ చెప్తానంటే
థాంక్యూ అమ్మమ్మా!నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పలనుకుని చెప్పలేకపోయింది మా అమ్మమ్మకే. తన ప్రవర్తన ద్వారా మాకు ఒక జీవన విధానాన్ని నేర్పించిందామె. ముఖ్యంగా జీవన సహచరుడితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో, కొట్టకుండా... తిట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలో మా అమ్మమ్మ మా అందరితో మెలిగిన తీరు నుంచే మేము నేర్చుకున్నాం. పోదుపు పాఠాల సంగతి సరేసరి. మేమందరం చిన్నప్పుడు మా ప్రతి సెలవులకూ మా అమ్మమ్మ వాళ్లింటికే వెళ్లేవాళ్లం. తన పిల్లలతో΄ాటు మమ్మల్ని అందరినీ చదువుల వైపు, ఉద్యోగాల వైపు ముఖ్యంగా నిజాయితీతో కష్టపడి పనిచేయాలనే తలంపు వైపు, కుల మతాలకు తావులేని ఆదర్శాలవైపు తమ జీవన విధానంతోనే మళ్లించిన మా అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమతి వావిలాల సీతాదేవి, వెంకటేశ్వర్లు గార్లకు కృతజ్ఞతలు ఎలా చెప్పలో మాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా, చెప్పడానికి భౌతికంగా వారు మా మధ్య లేదు. అయితేనేం, మా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్న మా అమ్మమ్మ, తాతయ్యలకు ఈ రోజున గుండెలనిండుగా థాంక్స్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించిన సాక్షికి కూడా థాంక్స్.– తెల్కపల్లి ఇందిరా ప్రియదర్శిని, కంభం మా వారికే నా థాంక్స్నేను థాంక్స్ చెప్పేది ముందుగా మా వారికే. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల రీత్యా పెళ్లయ్యే సమయానికి నేను అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగాను. అయితే ఇంకా చదువుకోవాలని ఉందన్న నా మనసు గ్రహించింది మా వారు జేవీఎస్ రామారావు గారే. ఇంటిలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నేను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో΄ాటు మా అత్తగారు, మా మామగారు, వదినగారు కూడా చదువుకుని ఉద్యోగం చేయడంలో ఎంతగానో సహకరించారు. ఇప్పుడు నేను మూడు పీజీలు, రెండు డిగ్రీలు, రెండు డిపామాలు, ఎం.ఈడీ. చేసి ఉద్యోగం చేస్తూ కూడా మరికొద్దికాలంలోనే పీహెచ్డీ కూడా పూర్తి చేయబోతున్నానంటే అందుకు మా వారి ప్రోత్సాహ సహకారాలే కారణం. అందుకే మా వారికే నా ధన్యవాదాలు. – డి.ఎల్. అనూరాధ, భద్రాద్రి కొత్తగూడెంతండ్రి తర్వాత తండ్రి లాంటి...నేను నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత అంతగా రుణ పడిన ఏకైక వ్యక్తి మా మేనమామ కొన్నూరు సత్యారెడ్డిగారే. నా చిన్నప్పుడు నా సోదరుడి అనారోగ్య పరిస్థితుల్లో, నా తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారికి అండగా ఉంటూ, నన్ను గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన ప్రేమతో పెట్టిన గోరుముద్దలతో పెరిగిన ఈ దేహం పడిపోయే వరకూ ఆయన పేరు కాపాడుకుంటూ నిలబడే ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసి, విలువలు నేర్పి, ఇంతవాణ్ణి చేసిన నా మేనమామకు సాక్షి పత్రిక వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. – లంకల అన్వేశ్వర్ రెడ్డి, కుమార లింగం పల్లి, మహబూబ్నగర్ జిల్లా -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
National Watermelon Day: ప్రయోజనాలే కాదు.. చరిత్ర కూడా గొప్పదే..
జాతీయ పుచ్చకాయ(వాటర్ మిలన్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది. పుచ్చకాయ చరిత్రపుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు. కింగ్ టుటన్ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్లు కనిపించాయి.ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.ఆరోగ్య ప్రయోజనాలుపుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో ఈ జ్యూసీ ఫ్రూట్ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. -
మద్రాసు @385
దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి. ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి( 2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. -
పంద్రాగస్టు: తెలుసుకోవలసిన 10 విషయాలు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. -
www.. ప్రపంచ గతిని మార్చిన 3 అక్షరాలు!
ముప్ఫై ఐదేళ్ల క్రితం కనుక్కొన్న మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ మూడు అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్ లేదు. ఆ మూడు అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు (ఆగస్ట్ 1) ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..ఇదీ www చరిత్రఇంటర్నెట్ అనేది కంప్యూటర్లను కలిపే నెట్వర్క్ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ వెబ్ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే, వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన దీన్ని WWW అనే దాన్ని రూపొందించారు. బెల్జియన్ ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కైలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (HTTP)ని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే WWW అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా నిరూపించుకుంది. 21వ శతాబ్దం నాటికి, వెబ్ వినియోగం కంప్యూటర్లతోపాటు స్మార్ట్ఫోన్లకు కూడా మారింది. నేడు, వరల్డ్ వైడ్ వెబ్ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచ్ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్ వైడ్ వెబ్ యాక్టివ్ యూజర్లున్నారు. -
నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
రాహుల్గాంధీ రాజకీయాల్ని మరచిపోతారు.. సచిన్టెండూల్కర్ బ్యాటింగ్కు బదులు ఈటింగ్కి జై కొడతారు.. హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. ఈ సందర్భంగా లొట్టలేస్తూ నెమరేసుకుందాం..మన బిర్యానీ..కహానీ..దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్గా మారిందన్నమాటే. దేశవ్యాప్తంగా సెకనుకు సగటున 2.5 బిర్యానీలు హాంఫట్ అవుతున్నాయట. గతేడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు స్విగ్గీ సర్వ్ చేసింది. అంటే అక్షరాలా కోటి 30లక్షలు.. నగరంలోని 1700కు పైగా రెస్టారెంట్లలో కేవలం ఒక్క స్విగ్గీ ద్వారా అమ్ముడవుతున్న బిర్యానీల సంఖ్యే ఇది. ఇక ఇతరత్రా మార్గాల ద్వారా జరిగే విక్రయాలను కలుపుకుంటే చెప్పనక్కర్లేదు. నగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలిస్థానం చికెన్ బిర్యానీ కాగా, రెండో స్థానం వెజ్ బిర్యానీ కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి. తాజాగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యుత్తమ రుచుల్లో మన బిర్యానీ 6వ స్థానంలో నిలిచింది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇది. సైనికుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మటన్, బియ్యం సమపాళ్లలో మేళవించి చెక్కల మంట మీద మసాలాలు, కుంకుమ పువ్వు దీనిలో కలిపి వండేవారట. నగరాన్ని పాలించిన నిజామ్ ఉల్ మల్్క.. బిర్యానీ విస్తరణ చరిత్రలో చెక్కుచెదరని పేరు తెచ్చుకున్నారు. స్థానిక వంటకాల శైలులను ఒకటొకటిగా కలుపుకుంటూ ఎన్నో కొత్త రుచులను అద్దుకుంది బిర్యానీ. ఇందులో నిజామ్స్ సృష్టించిన కచ్చి గోస్త్ బిర్యానీ ఒకటి. ఇటీవల మన దేశపు అగ్రగామి చెఫ్ సంజీవ్కపూర్ సైతం తన అభిమాన బిర్యానీ హైదరాబాద్లో పుట్టిన కచ్చి గోస్త్ బిర్యానీ గురించి చెప్పడం విశేషం. సిటీలో టాప్ బిర్యానీ సెంటర్లు ఇవే... ఏళ్ల నాటి నుంచి చారి్మనార్కు సమీపంలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్. అదే క్రమంలో పాతబస్తీలోని దారుల్íÙఫాలోని నయాబ్, బంజారాహిల్స్లోని బిర్యానీ వాలా, హైదర్గూడలోని కేఫ్ బహార్, సికింద్రాబాద్లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్నుమా ప్యాలెస్లోని అదా, క్రాస్రోడ్స్లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్... తదితర పేర్లు నగరంలోని బిర్యానీప్రియులకు నిత్య స్మరణీయం. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా.. ఇటీవలి కాలంలో మరికొన్ని రెస్టారెంట్స్ అత్యాధునిక హంగులతో రుచికరమైన బిర్యానీలను వడ్డిస్తున్నాయి. బహురూపాల్లో...⇒ బిర్యానీని సాధారణంగా హండి లేదా కుండలో వండడం అనేది ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ, పార్సిల్స్ కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత డబ్బా బిర్యానీ వచి్చంది. ఇది కాంపాక్ట్ కంటైనర్లో అందించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని మారేడు మిల్లి బొంగులో బిర్యానీకి ఫేమస్. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్ అవే ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లోని స్పైసీ వెన్యూ రెస్టారెంట్లో ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్ చేస్తున్నారు. ⇒ కొత్తగా బకెట్ బిర్యానీ వచి్చంది. ఎరుపు, తెలుపు, బ్లూ.. ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాలుకు కలర్ఫుల్ ట్రీట్ అందుబాటులోకి తెచ్చాయి. నగరంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ–ఇన్–ఏ–వాటర్–వెస్సల్ కూడా రానుందని అంటున్నారు. అంతే కాదు కోన్లో బిర్యానీ, పిజ్జాలో బిర్యానీ, సమోసాలో బిర్యానీ, బిర్యానీ సుషీ రోల్స్, బిర్యానీ ఫ్లేవర్ ఐస్ క్రీం వంటివి ఆన్ ద వే అట.చవులూరించే వెరైటీలు... చికెన్, మటన్, వెజిటబుల్స్.. జోడించిన బిర్యానీలు ఓ వైపు లీడ్ చేస్తుండగా, నగరంలో ఉలవచారు బిర్యానీ, క్లాసిక్ హైదరాబాదీ బిర్యానీ, రిచ్ అండ్ క్రీమీ లక్నోవి బిర్యానీ. టాంగీ, ఫ్లేవర్ఫుల్ బాంబే బిర్యానీ వంటివి విభిన్న రకాల మేళవింపులతో అందుబాటులోకి వచ్చాయి. చైనీస్– ఆధారిత ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదా మెక్సికన్–ప్రేరేపిత బురిటో బిర్యానీ ఫ్యూజన్ బిర్యానీ... ఇలా ఫుడ్ లవర్స్కి పదుల సంఖ్యలో ఎంపిక అవకాశాలు అందిస్తున్నారు.మండీ వచి్చనా... ట్రెండీ మనదే..నగరంలోని బార్కాస్ ప్రాంతంలో పేరొందిన మండీ...బిర్యానీకి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. అరబ్బుల వంటకమైన మండీ.. నగరంలో వేగంగా విస్తరించింది. అలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచీ మండీ హవా మొదలైంది. అయితే ఇప్పటికీ బిర్యానీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయిందంటే.. దటీజ్ హైదరాబాద్ బిర్యానీ అంటున్నారు సిటీ ఫుడ్ ఇండస్ట్రీ వర్గాలు. పొట్లం బిర్యానీ స్పెషల్బిర్యానీ రుచి, నాణ్యతతో పాటు కంటైనర్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెరైటీ కంటైనర్స్లో వడ్డించడం, పార్సిల్ చేయడం ద్వారా ఫుడ్ లవర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ ముఖ్యం. మా రెస్టారెంట్ స్పెషల్గా పొట్లం బిర్యానీ అందిస్తున్నాం. ఆమ్లెట్లో చుట్టిన బిర్యానీని సిటీలో ఎక్స్క్లూజివ్గా అందుబాటులోకి తెచ్చాం. – సంపత్, ద స్పైసీ వెన్యూ రెస్టారెంట్హైదరాబాద్ ఆవకాయతో.. అమెరికాలో బిర్యానీ..నగరవాసులు అనేకమంది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ తెలుగువాళ్లు అధికంగా నివసించే చోట కూడా హైదరాబాద్ బిర్యానీ హల్చల్ చేస్తోంది. ‘మన ఇండియన్స్తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు’ అంటూ చెప్పారు నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నగే‹Ù, సాయిప్రసాద్. ఈ బావా, బావమరుదులు ఇద్దరూ అమెరికాకు వలస వెళ్లి అక్కడ బావర్చి బిర్యానీ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అందించే ఆవకాయ బిర్యానీ అక్కడ పాప్యులర్. దీని కోసం సునీత బంధువులు మల్కాజ్గిరిలో భారీ ఎత్తున ఆవకాయ పచ్చడి తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ... థియేటర్లలో షోస్ టైమింగ్స్లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నైట్లైఫ్తో పాటే మిడ్నైట్ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్లోని గ్రాండ్ హోటల్ అర్ధరాత్రి బిర్యానీ విందుకు చిరునామాగానూ, అలాగే చాదర్ఘాట్ మిడ్నైట్ బిర్యానీలకు కేరాఫ్గా మారాయి. కొన్ని స్టార్ హోటల్స్ బిర్యానీ ప్రియులకు అర్ధరాత్రుళ్లు తలుపులు తెరుస్తున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్ ఇటీవలే ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చి»ౌలి, బోరబండ, వివేకానందనగర్.. ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్ షిఫ్ట్ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు.వుడ్ ఫైర్పై వండే కేటరర్.. సూపర్..నగరానికి చెందిన మహరాజ్ కేటరర్స్, ఎస్కె కేటరర్స్, ఎలిగెన్స్.. తదితర సంస్థలు వుడ్ ఫైర్ మీద వండి కేటరింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో వీరి బిర్యానీలకు డిమాండ్ ఉంది. అలాగే హోటల్స్ విషయానికి వస్తే..బావర్చి, పంజాగుట్టలోని మెరిడియన్, ఫైవ్స్టార్ హోటల్ మారియట్లో బిదిరి అనే హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్, ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఆస్టోరియా, పిస్తా హౌజ్లోని సాఫ్రాని బిర్యానీలు నా ఛాయిస్. –జుబైర్ అలీ, ఫుడ్ బ్లాగర్ -
హైదరాబాద్ అంతా చుట్టేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
మహిళా సాధికారత థీమ్తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
Global Wind Day 2024: గాలి ‘పవర్’ అప్పుడే తెలిసింది!
ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకునే గ్లోబల్ విండ్ డే, పవన శక్తి ప్రాముఖ్యత, భూగోళాన్ని మార్చే దాని శక్తి గురించి అవగాహన పెంచుతుంది. ఇది పవన శక్తిని స్థిరమైన, పునరుత్పాదక శక్తి వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం.భారత్లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్ తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ విండ్ ఎనర్జీ డే చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ఆసక్తికర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పవన విద్యుత్ చరిత్ర ఇదీ..విండ్ ఎనర్జీ చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులోని నైలు నదిపై పడవలను నడపడానికి తొలిసారిగా విండ్ మిల్స్ ఉపయోగించారు. తరువాత చైనాలో పవన శక్తిని అభివృద్ధి చేశారు. ఇక్కడ గాలితో నడిచే నీటి పంపులను క్రీస్తుపూర్వం 200లో కనుగొన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ విండ్ వీల్ ను సృష్టించాడు.విండ్ మిల్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పరికరంగా మారింది. వాటి ఉపయోగం చివరికి 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది. పశ్చిమ అమెరికాలో వేలాది నీటి పంపులు, చిన్న విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసిన హోమ్ స్టెడర్లు, వ్యవసాయదారులు దీనిని చేశారు. 1970 లలో చమురు కొరత కారణంగా పవన విద్యుత్ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి దారితీసింది.46,422 మెగావాట్ల సామర్థ్యంభారత పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తూ కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తన తాజా డేటాను ఆవిష్కరించింది. 2024 మే 31 నాటికి సంచిత భౌతిక పురోగతి నివేదిక సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపన రంగాలలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఒక్క మే నెలలోనే భారత్ 3,007.28 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు. అవి పవన శక్తి, సౌర శక్తి. పవన విద్యుదుత్పత్తి 535.96 మెగావాట్లు పెరగడంతో మొత్తం సామర్థ్యం 46,422.47 మెగావాట్లకు చేరింది. -
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
-
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
-
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
భారత్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాక్ యత్నం!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షాబాజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని ఈనెల 28న భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా నాలుగేళ్ల విరామం తర్వాత పాక్ తమ జాతీయ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. 1940లో లాహోర్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. దీనికి గుర్తుగా సాధారణంగా మార్చి 23న పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి దీనిని మార్చి 28న నిర్వహించేందు సన్నాహాలు చేస్తున్నారు. 1940, మార్చి 22 నుండి మార్చి 24 వరకు లాహోర్లో జరిగిన సమావేశాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్.. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో భారతదేశంలోని ముస్లింల కోసం అధికారికంగా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనలో ఎక్కడా ‘పాకిస్తాన్’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించిన తేదీని పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 మార్చి 23న పాక్ అధికారికంగా తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీంతో పాకిస్తాన్ డొమినియన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా మారింది. 1960- 1968 మధ్య కాలంలో ఈ తీర్మానం ఆమోదం పొందిన స్థలంలో మినార్-ఎ-పాకిస్తాన్ నిర్మితమయ్యింది. దీనిపై తీర్మానానికి సంబంధించిన వివరాలు చెక్కారు. పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ కాంప్లెక్స్లో మార్చి 28న జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ దౌత్యవేత్తలు, భారతీయులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించనున్నారు. అనంతరం పాకిస్తాన్ హైకమిషనర్, ముఖ్య అతిథి ప్రసంగాలు చేయనున్నారు. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్నగర్లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్ల టీకాలు అందించారు. -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’
ఈరోజు చారిత్రాత్మక రోజు. నేడు ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2003 తర్వాత ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుతూ మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. కంగారూలతో పోరుకు టీమ్ ఇండియా సైన్యం సిద్ధమైంది. గ్రాండ్ ఫైనల్ను వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేడియంనకు తరలివస్తున్నారు. భారతదేశంలోని ప్రతిచోటా టీమ్ ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలోని విశ్వేశ్వరుని మొదలుకొని ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుని వరకూ అందరు దేవుళ్లు భారత్ టీమ్ను ఆశీర్వదించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని ముజఫ్ఫర్నగర్లో పదిమంది యువకులు భారత్ గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టబోమంటూ కఠిన ఉపవాస దీక్షకుదిగారు. శివచౌక్కు చేరుకున్న ఈ యువకులు అక్కడి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘భారత్ ఈ మ్యాచ్లో గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టుకోబోమని, ఒక వేళ భారత్ పరాజయం పాలయితే ఇక తమ జీవితంలో ఎప్పటికీ క్రికెట్ చూడబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇది కూడా చదవండి: అహ్మదాబాద్లో పర్యాటకుల రద్దీ -
అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి?
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. విద్యకుగల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశప్రజలంతా విద్యావంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే నవంబరు 11న(నేడు) జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం అక్షరాస్యత విషయంలో ఘనమైన చరిత్రను కలిగివుంది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పురాతన విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చాణక్య, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్, రామానుజన్, అమర్త్య సేన్ తదితర పండితులు, రచయితలు, కవులు, ఆలోచనాపరులను భారతదేశం ప్రపంచానికి అందించింది. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నవంబరు 11న దేశంలోని విద్యా సంస్థలు సెమినార్లు నిర్వహించడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. అక్షరాస్యత ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్వతంత్ర భారతావనిలో విద్యావ్యవస్థకు పునాదులు పడటం మొదలుకొని, ఈ రంగంలో నేడున్న స్థితిగతులు.. ఇందుకు నాటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ అందించిన సహకారాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వాస్తవాలు ప్రపంచంలోని 135 దేశాలలో మహిళల అక్షరాస్యత రేటులో భారతదేశం 123వ స్థానంలో ఉంది. దేశంలో 60 లక్షల మంది పిల్లలు బడి బయట అంటే చదవుకు దూరంగా ఉన్నారు. దేశంలో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. దేశంలో వయోజన అక్షరాస్యత రేటు 63%. ప్రపంచంలో అత్యధికంగా 287 మిలియన్ల(ఒక మిలియన్ అంటే 10 లక్షలు) నిరక్షరాస్యులైన వయోజనులకు నిలయంగా భారతదేశం ఉంది భారతదేశంలో బడి బయట ఉన్న పిల్లల్లో 47.78% మంది బాలికలే కావడం విశేషం. 1950లలో 10 మంది భారతీయుల్లో కేవలం ఇద్దరు మాత్రమే అక్షరాస్యులు. 2022నాటి విద్యా గణాంకాలు దేశంలో విద్యాభివృద్ధికి సూచికగా నిలిచాయి. 2018లో దేశంలో అక్షరాస్యత రేటు 74.4%కి చేరింది. దీనిని చూస్తే దేశంలో అక్షరాస్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది. దేశంలో అక్షరాస్యత రేటు లింగం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను అనుసరించి మారుతుంటుంది. 2018 నాటికి పురుషుల అక్షరాస్యత రేటు 82.4శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 65.8శాతం. అక్షరాస్యత రేటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విభిన్నంగా కనిపిస్తుంది. కేరళలో అక్షరాస్యత రేటు 96.2 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదయ్యింది. ఇది 66.4శాతంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, సామాజిక ఉద్యమాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి తదితరాలతో దేశంలో అక్షరాస్యత రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో అక్షరాస్యత శాతం పెరిగేందుకు దోహదపడిన ప్రభుత్వ కార్యక్రమాలిలా ఉన్నాయి. జాతీయ అక్షరాస్యత మిషన్: ఇది 1988లో ప్రారంభమయ్యింది. ఇది వయోజనులకు ప్రాథమిక విద్యను అందించడం, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తోంది. సర్వశిక్షా అభియాన్: 2001లో ప్రారంభమయ్యింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విద్యా హక్కు చట్టం: దీనిని 2009లో రూపొందించారు. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత , నిర్బంధ విద్యను తప్పనిసరి చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్: 2009లో ప్రారంభమయ్యింది. ఇది 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మాధ్యమిక విద్యను అందించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్: 2015లో ఇది ప్రారంభమయ్యింది. ఇంటర్నెట్ ద్వారా దేశ పౌరులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విద్యావిధానం ప్రారంభమయ్యింది. అక్షరాస్యతాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు దేశఅక్షరాస్యతలో లింగ అంతరం కనిపిస్తోంది. ఇది బాలికలు, మహిళలు విద్య, సాధికారతను పొందకుండా అడ్డుపడుతోంది. ఈ అంతరానికి పలు సామాజిక నమ్మకాలు, ఆచారాలు కారణంగా నిలుస్తున్నాయి. అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానత.. ఇది వివిధ రాష్ట్రాలు-ప్రాంతాల మధ్య వనరులు, అవకాశాల అసమాన పంపిణీని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్లో ఈ సవాళ్లు అధిగమించి భారత్ అక్షరాస్యత విషయంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం! ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, సనత్నగర్లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అతిపిన్న వయసులోనే రికార్డులు, అవార్డులు
సాక్షి, అనకాపల్లి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున జన్మించిన అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన లాస్విక ఆర్య అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 6 నెలల వయస్సులో ‘వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో, 9 నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘మెమొరి ఆఫ్ జీకే అవార్డు’ బంగారు పతకం, ప్రశంసాపత్రాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, దేశంలో గల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలను గుర్తిస్తుంది. 1 నుంచి 20 వరకూ స్క్వెర్స్ను గుర్తించి ‘ మెమొరీ ఆఫ్ జనరల్ నాలెడ్జ్’ విభాగంలో ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. అక్టోబర్ మొదటి వారంలో ‘లిటిల్ చాంప్–2023’’ ప్రశంసా పత్రాలు, ట్రోఫీ, బ్యాడ్జ్, మెడల్ను అందించారు. ఈ ఏడాది జూలైలో ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు’లో కూడా చిన్నారి స్థానం పొందింది. 9 నెలల వయస్సులో 4 నిమిషాల వ్యవధిలో 24 మానవ శరీర భాగాలు గుర్తించడంతో ‘మాక్సిమమ్ బాడి పార్ట్స్ ఐడెంటిఫైడ్ బై ఏ ఇన్ఫ్యాంట్’గా ప్రశంసాపత్రంతో పురస్కారాన్ని పొందింది. గతేడాది అక్టోబర్ 11న జన్మించిన లాస్విక ఆర్య ఏడాది కూడా పూర్తి కాకుండానే సాధిస్తున్న విజయాల పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం తెలిపారు. తాను పుట్టిన ప్రపంచ బాలికల దినోత్సవానికి ఎక్కడా తీసిపోకుండా తాను సాధించిన విజయాలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
సెలవైనా ఠంఛన్గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
చనిపోయినా బతికుందాం!
మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ. ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. నమోదు ఇలా అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. సజీవమూర్తి కిరణ్చంద్ సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు. 8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో యాక్టివ్ ప్రెజెన్స్కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) ఈ సందర్బంగా టెక్మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా. ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు. -
ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ బిర్యానీదే
● ● జిల్లాలో 20 రకాలకుపైగా బిర్యానీలు లభ్యం ● నిమిషానికి పది బిర్యానీలు ఆర్డర్ పెట్టి తింటున్న వైనం ● శ్రీకాకుళం: బారసాల నుంచి దశ ది న కర్మల వరకు, పుట్టిన రోజు నుంచి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ అంతా బిర్యానీలదే. ఈ వంటకం ఎంతబాగా కుదిరితే కార్యం అంత చక్కగా జరిగినట్టు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే సిక్కోలు వాసులు లొట్టలేసుకుని తింటున్నారు. ఒకప్పుడంటే ఈ బిర్యానీ దొరకడం కష్టంగా ఉండేది గానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ఊళ్లలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 20 రకాల బిర్యానీలు దొరుకుతున్నాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. ఎర్రటి మాంసం ముక్కలు కనిపిస్తే నే బిర్యానీ మజా ఇస్తుందనుకుంటే పొరపాటే.. పుట్టగొడుగుల నుంచి పన్నీరు వరకు, ఆవకాయ నుంచి గోంగూర వరకు పలు రకాల బిర్యానీలు చికెను, మటను బిర్యానీలకు గట్టి పోటీ ఇస్తున్నా యి. ఇటీవలే ప్లాంట్బేస్డ్ చికెన్, మటన్ పేరిట బిర్యానీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శాకాహారమే. మాంసాహార విషయానికి వస్తే హైదరాబాదీ దమ్బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ, మటన్, ప్రాన్ బిర్యానీలంటూ రకరకాలు నోరూరిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.700లకు పైబడి బిర్యానీ ధర ఉంది. జిల్లాలో నిమిషానికి 10 బిర్యానీలు ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ బిర్యానీకే ఆదరణ ఎన్నో రకాలు బిర్యానీలు ఉన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న ఆదరణ ప్రత్యేకం. అన్ని బిర్యానీల్లో యాభై శాతం ఇవే వెళ్తాయి. వెజ్, నాన్ వెజ్ల బిర్యానీలలో దమ్కే ప్రథమస్థానం. – తపన్కుమార్, బాబూరావు,చెఫ్లు బిర్యానీ అంటే ఎంతో ఇష్టం ప్రతి వారం చివర్లో బిర్యానీ తప్పక తింటాను. బిర్యానీ అంటే అంత ఇష్టం. ఆహార ప్రియు ల అభిరుచి మేరకు తయారీ దారులు కూడా రకరకాల రుచులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మావంటి వారికి సంతోషం. – ఇప్పిలి సురేష్, శ్రీకాకుళం -
యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..
ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. యోగా చేయడం వలన కలిగే లాభాల గురించి తెలియజేయడమే యోగా దినోత్సవం ఉద్దేశం. యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు. తిరుమలాయ్ కృష్ణమాచార్య ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ధీరేంద్ర బ్రహ్మచారి ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. కృష్ణ పట్టాభి జోయిస్ ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. మహర్షి మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త..హోటళ్లు ఆడ్వాన్ బుకింగ్ చేస్తే.. -
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వైజాగ్ లో ఘనంగా ముగిసిన నేవీ డే వేడుకలు
-
ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
-
షుగర్ వ్యాధికి జాగ్రత్తలే ఔషధం
అరసవల్లి: మధుమేహంగా పిలిచే షుగర్వ్యాధి.. తీపి పదార్ధాలు ఎక్కువ తినే వారిలో వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయా యం చేయకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటివి సమస్యగా పరిణమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్ వ్యాధి బయటపడుతోంది. ఈలోపే నష్టం జరిగిపోతోంది. కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్.. జిల్లాలో 1,34,303 మందికి కోవిడ్ పాజిటివ్ బారినపడ్డారు. కరోనా సోకిన తర్వాత ఎక్కువ శాతం మందికి షుగర్ వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నవారు కోవిడ్ నుంచి సులభంగానే బయటపడ్డారు. నియంత్రణ లేని వారు ఐసీయూలో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 49560 మంది షుగర్ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. 15 శాతం కేసులు పెరిగాయి.. జిల్లా జనాభాలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు..ఇప్పుడు కరోనా తర్వాత 15 శాతం మంది పెరిగారు. ఆహారంలో కార్బోహైడ్రేడ్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పీచు కలిగిన పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి బరువు పెరగకుండా సహాయం చేస్తుంది. – డాక్టర్ కెల్లి చిన్నబాబు, షుగర్ వ్యాధి నిపుణుడు స్టెరాయిడ్స్ వాడితే ప్రమాదం షుగర్ వ్యాధి ఉన్నవారు స్టెరాయిడ్స్ మందులు వాడకూడదు. ఇవి వాడితే శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హానిచేయదు. – డాక్టర్ ఎం.మనోజ్, ద్వారకామయి హాస్పిటల్ -
అంతర్జాతీయ టైగర్ డే-ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది. -
మేం ఆడితే లోకమే ఆడదా...
-
Promise Day 2022: ప్రామిస్ డే స్పెషల్
-
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్లు ఏమిటో తెలుసా? ► రాష్గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
Chocolate Day 2022: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
-
వాలెంటైన్స్ డే వీక్: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
ఏడు రోజుల వాలంటైన్స్ డే వీక్ జోరుగా..హుషారుగా సాగుతోంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన వాలంటైన్స్ డే క్రమంగా విశ్వవ్యాపితమైంది. ఎక్కడ చూసినా... వాలెంటైన్స్ సందడి. ప్రేమ కోసం, ప్రేమ కొరకు ,ప్రేమతో అంటూ లవ్బర్డ్స్ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు.. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? ‘ప్రేమ’ అటే మ్యాజిక్.. అదో మాయ. మాటల్లో వర్ణించలేని తీయని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ డే వీక్లో చాకోలెట్ డే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9న అత్యంత మధురంగా జరుపుకునేదే చాకొలెట్ డే. అలాంటి స్వీటెస్ట్ డే కోసం ప్రేమజంటలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్తో ప్రేమలో పడితే.. పెళ్లి తరవాత తన జీవిత భాగస్వామితో ఈ చాక్లెట్ డే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమ భావన తరువాత మన మనసును ఆహ్లాదంగా, తీపి చేసేవి చాకోలెట్లే! మరి అలాంటి చాకొలెట్స్ను ప్రేమించిన వ్యక్తికి షేర్ చేయకుండా ఎలా ఉంటారు. నో. వే ..కదా.. రకరకాల ప్రేమ చాక్లెట్లు, డార్క్ చాకోలెట్లు.. అబ్బో.. చాలానే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ టేస్ట్కు తగ్గట్టుఎంచుకుని మీ వాలెంటైన్ స్వీట్ మూడ్లోకి తీసుకెళ్లండి. చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. అసలు చాక్లెట్ చూడగానే మనసు తేలికపడుతుంది. చాక్లెట్ తింటే డిప్రెషన్ హుష్ కాకి అవుతుంది. మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా మారిపోయి మెదడు పనితీరునీ మెరుగు పరుస్తుందట. సో.. అలిగి కోపంతో రగిలిపోతున్న ప్రేయసినీ లేదా ప్రియుడిని చాకొలెట్ ఇచ్చి కూల్ చేసేయండి.. బీపీని కంట్రోల్ చేయడానికి చాక్లెట్ దివ్య ఔషధమని చాలా స్టడీస్ చెప్పాయి. ఖరీదైన గిప్ట్స్ ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న చాక్లెట్తో పొందవచ్చు. హ్యాపీ చాక్లెట్ డే.. ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే రోజు ప్రేమజంటలు ఫుల్బీజీ. అసలు 7 రోజుల వాలంటైన్స్ వీక్ సందడి షురూ అవుతుంది. రోజ్ డేతో మొదలైన వాలెంటైన్స్ వీక్ కిస్ డే తో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే గాసెలబ్రేట్గా చేసుకుంటారు. -
Celebrate Your Unique Talent Day: టాలెంట్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉండాలే కానీ మన క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు టాలెంట్, ప్రతిభ లేదా దిమాక్ ఇవి వుంటే చాలు మనకు మనమే తోపులం. మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్గా ఉండాలి. మనలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే అంటోంది సాక్షి. ఇది మీకు తెలుసా? టాలెంట్ అంటే ఒకప్పుడు బరువుకి మెజర్మెంట్గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్లో టాలెంట్ అంటే దాదాపు 55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే: ఆసక్తికర విషయాలు
-
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే: ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: 22 నిమిషాలు పాటు ఊపిరి బిగబట్టిన స్టిగ్ సెవెరిన్సెన్ గురించి మీకు తెలుసా? తమలపాకుల్లాంటి తన చేతులతో విస్తరాకు మడిచినట్టు ఇనుప పెనాన్ని మడత పెట్టేసిన వైనాన్ని మీరెపుడైనా చూశారా. ఒక్క నిముషంలో 10కి పైగా యాపిల్స్ను గిన్సిస్ రికార్డు సృష్టించిన భామ గురించి మీకు తెలుసా? అవును ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ఇలాంటి క్రేజీ విషయాలతోపాటు, ఎన్నో ఆసక్తికర విషయాలను రికార్డు చేసేదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచంలో ఇంతకముందెవ్వరూ చేయని అత్యుత్తమ పనికి, లేదా సాహసానికి లభించే గుర్తింపే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించాలని చాలా మంది డ్రీమ్ అయితే దీనికి కూడా ఒక రోజుంది తెలుసా. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది నవంబర్ 17న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన సంఘటనలను, సన్నివేశాలను ఇది రికార్డు చేస్తుంది. ఇ లాంటి రికార్డులన్నీ "గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్" లేదా జీ డబ్ల్యు ఆర్ అనే బుక్లో నిక్షిప్తం చేస్తారు. ఈ బుక్ 100కి పైగా దేశాల్లో, 23 భాషలలో ప్రచురితమవుతుంది. మొదటిసారిగా నవంబర్ 19, 2004న జరుపుకోగా ఆ తరువాత నవంరు17కి మారింది ప్రపంచ రికార్డులను తెలుసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఆ రికార్డులను బ్రేక్ చేయాలనుకుంటున్న ఔత్సాహికులను ప్రోత్సహించేలా ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు. (లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు ) నవంబర్ 10, 1951న, గిన్నిస్ బ్రూవరీస్ మేనేజింగ్ డైరెక్టర్, సర్ హ్యూ బీవర్, ఐర్లాండ్లోని షూటింగ్ పార్టీలో యూరప్లో అత్యంత వేగవంతమైన పక్షి ఏదబ్బా అని ఆలోచన మెదడును తొలిచేసింది. దీనికి సంబంధించి తెలుసుకునేందుకు ఎలాంటి పుస్తకం అందుబాటులో లేదని గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా సాధించిన రికార్డులను తెలుసుకునేందుకు ఒక పుస్తకం అవసరమని కూడా అతను గ్రహించాడు. ఈ ఆలోచన క్రిస్టోఫర్ చాటవే అనే ఆయన్ని కూడా ఆకర్షించింది. చాటవే సిఫారసు మేరకు ఆగష్టు 1954లో, నోరిస్ ,అతని రాస్ మెక్విర్టర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సంకలనం చేసేందుకు నియమితులయ్యారు. 198 పేజీలతో 1000 కాపీల మొదటి ఎడిషన్ ఆగస్టు 27, 1955న మార్కెట్లోకి వచ్చింది. (ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు) బ్రిటన్లో రికార్డు అమ్మకాలను సాధించింది. 1956లో అమెరికాలో ముద్రితమై 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తరువాత 1976లో అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ఈ అద్భుతమైన జి.డబ్ల్యూ.ఆర్. రికార్డులను ప్రదర్శించేందుకు వీలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియాన్ని ప్రారంభించారు. డాగ్ అతిపొడవైన నాలుక 30 సెకన్లలో రికార్డు సిట్ డౌన్ ఫుట్బాల్ క్రాస్ఓవర్లు 30వేలకుపైగా పాటలుపాడిన గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, అతితక్కువ కాలములో 750 సినిమాలకి పైగా సినిమాలలో నటించిన హాస్య నటుడు బ్రహ్మానందం, ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన గొప్పవారిలో నిలిచిన సినీ ప్రముఖులు. అలాగే 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు దివంగత మల్లి మస్తాన్బాబు కూడా నిలవడం విశేషం. అతిపొడవైన మీసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇది నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మాత్రమే కాదు ప్రకృతిలో జరిగే విపరీతాలను ఇది పరగణనలోకి తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలి అనే మీ కల సాకారం కోసం ఈ రోజునుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్హౌజ్లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని అల్లాహార్లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
వీరే... ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ !
వెబ్డెస్క్: జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం... ఎగుడుదిగుడు గగనం మేమేరా పిడుగులం అంటూ యూత్ని వర్ణించాడు ఓ సినీ కవి. నిజమే ! ఆ యుత్లో ఉన్న ఎనర్జీకి స్కిల్ను జోడించి వారి భవిష్యత్తుతో పాటు మానవాళి మనుగడకు కొత్త బాటలు వేయడం లక్క్ష్యంగా ప్రతీ ఏడు జులై 15న వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబరు 18న తీర్మాణించింది. దీని ప్రకారం మొదటిసారి 2015లో జులై 15న తొలిసారి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం యువతకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంచడం ద్వారా భవిష్యతత్తులో వారు ఎంట్రప్యూనర్లుగా, ఉద్యోగస్తులుగా రూపొందించడం వరల్డ్ యూత్ స్కిల్ డే ముఖ్య ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు, నైపుణ్యం కలిగిన యువత అందరినీ ఒకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయడం ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా తర్వాత యువతలో మిగిలి ఉన్న నైపుణ్యాలు అనే థీమ్తో ఈసారి వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొవడంలో యువత చూపించిన నైపుణ్యాలు అనే అంశం ప్రధానంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తీవ్ర ఒత్తిడి కరోనా రక్కసి దాడికి తీవ్రంగా గురయ్యారు యువత. సమాజంలో అన్ని వర్గాలపైన కరోనా ప్రభావం ఉన్నా.. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు చాలా ప్రభావానికి లోనయ్యారు. మానసికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇటు చిన్న వాళ్లలా ఉండలేక అటు పెద్ద వాళ్లతో పోటీ పడలేక నలిగిపోయారు. ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. కరోనా కల్లోలం కరోనా కారణంగా గడిచిన ఇంచు మించు ఏడాదిగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా మూత పడి ఉన్నాయి. 2021 జూన్ వరకు 19 దేశాల్లో ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. పాఠశాలలు మూత పడటం వల్ల 15.7 కోట్ల మంది యువత నష్టపోతుండగా పాక్షింగా మూతపడటం వల్ల 76.8 కోట్ల మంది నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. - 15 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు వారు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులకు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు - 2020లో కరోనా సంక్షోభం కారణంగా 8.7 శాతం యూత్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే సమయంలో 25 ప్లస్ వయస్సు వారు 3.7 శాతమే ఉద్యోగాలు కోల్పోయారు. - యువతలో మగవారితో పోల్చినప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మరో 30 ఏళ్లలో సముద్రంలో చేపల కంటే ఇవే ఎక్కువట!
వెబ్డెస్క్: అణుయుద్ధాలు, కరోనా వైరస్ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్ను కంట్రోల్ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. జులై 12న పేపర్ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 1952లో అమెరికాలో 1852లో తొలిసారి పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్ అండ్ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ భూతం 1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్ అంటే 500 బిలియన్ టన్నులు రీసైకిల్ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. మనకు ప్రమాదమే సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిందే ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్లాస్టిక్ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి. ప్లాస్టిక్ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు కెనడా భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్ ప్లేట్స్, చెంచాలు ఇలా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించింది. రువాండ రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కెన్యా ప్లాస్టిక్కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్ బ్యాగుల వినియోగం పెరిగింది. ఫ్రాన్స్ 2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్ అవే, ఫుడ్ వేర్, కర్ట్లరీ ఐటమ్స్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్ వేర్కి ఉపయోగించే ఐటమ్స్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్కి చెక్ ఫ్రాన్స్ పెడుతోంది. ఇండియా 2022 నాటికి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ, డిస్పోజల్కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. -
‘ప్లాస్టిక్’ పరిష్కారం ఇదే!
వెబ్డెస్క్: న్యూ క్లియర్ వెపన్స్, గ్లోబల్ వార్మింగ్ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద అంశం ప్లాస్టిక్. పర్యావరణ సమతుల్యత ప్లాస్టిక్ బ్యాగ్లతో దెబ్బతింటోంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్పై అవగాహన కల్పించేందుకు జులై 3న ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ డేని నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్.. ప్రమాదాలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవసరంగా మారింది. అయితే ప్లాస్టిక్తో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటి మన్నిక కాలం. ప్లాస్టిక్ బ్యాగులు సహజ పద్దతిలో తిరిగి భూమిలో కలిసి పోవాలంటే 100 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూమి మీద అలాగే ఉంటుంది. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాలాలు మూసుకుపోయి... వరదలకు కూడా కారణం అవుతోంది. ప్రమాదంలో పశువుల ప్రాణాలు పెద్దపెద్ద నగరాలన్నీ సముద్ర తీరాల చుట్టే వెలిశాయి. ఈ నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త కారణంగా సముద్ర జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇక పల్లె నుంచి మెట్రో సిటీ వరకు చెత్త కుప్పల్లో పేరుకు పోతున ప్లాస్టిక్ని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. మొదట యూరప్లో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలనే ప్రచారం మొదట యూరప్లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ‘ఏకో’ ధర తగ్గాలి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉన్నా .. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తిరిగి ప్లాస్టిక్ బ్యాగుల వైపుకే మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ బాధ్యత ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. స్టార్టప్లు ఈ దిశగా పని చేయాల్సి ఉంది. కార్పొరేట్ కంపెనీలు, భారీ వాణిజ్య సంస్థలు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ పరిశోధనలకు దన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కోట్లు గడిస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ప్లాస్టిక్ నివారణపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. బడా సంస్థలు ప్లాస్టిక్పై దృష్టి సారించి... నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తే మార్పులు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు మార్కెట్లోకి తేవడం ద్వారా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించవచ్చు. చదవండి : అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా -
నాన్న.. ప్రతీ బిడ్డను వెంటాడే ఓ ఎమోషన్
కని పెంచేది అమ్మ. అవసరాలను తీర్చేది నాన్న. నడకలో ప్రతీ అడుగు ముందుండే వ్యక్తి నాన్నే. నాన్నంటే ప్రతీ బిడ్డకు తప్పు చేస్తే దండిస్తాడనే ఒక భయం. కానీ, ఎలాంటి ఆపదలోనైనా అండగా ఉండే ధైర్యం కూడా. స్వార్థం లేని తల్లిదండ్రుల ప్రేమకు.. ప్రతీరోజూ రుణం తీర్చుకున్నా తప్పులేదు. కానీ, ప్రత్యేకంగా ఒకరోజు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో జూన్ మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా జరుపుతున్నారు. అలా ఈ జూన్ 20 ‘నాన్నకు ప్రేమతో..’ అంకితమైంది. యూరప్ నుంచి యూరోపియన్, అమెరికన్ చర్చి సంస్కృతుల్లో పూర్వీకులకు గౌరవించుకోవడమనే సంప్రదాయం ఉండేది. ఇందుకోసం మధ్యయుగకాలంలో సెయింట్ జోసెఫ్స్ డే(మార్చి 19న) నిర్వహించేవాళ్లు. ప్రపంచంలో మదర్స్ డే సంబురాలు మొదలయ్యాక. తండ్రులకు అలాంటి ఒకరోజు ఉండాలనే ఆలోచన నుంచి ఫాదర్స్డే పుట్టింది. దీనివెనకాల ఓ కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫాదర్స్ డే కథ.. అమెరికా నుంచి పుట్టిందనే కథనం ఒకటి వినిపిస్తుంటుంది. సేవలకు గుర్తింపుగా సొనోరా స్మార్ట్ డొడ్డ్ అనే యువతి తన తండ్రి సేవలకు గుర్తింపుగా.. ఆయన పుట్టినరోజును ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ అమ్మాయి టీనేజీలో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సోనొరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ మిలిటరీలో పని చేస్తాడు. తల్లిని పొగొట్టుకున్న సొనోరా, తండ్రి జాక్సన్తో కలిసి ఐదుగురు తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తుంది. తమ కోసం సుఖాలు త్యాగం చేసిన ఆ తండ్రిని సొనోరా సన్మానించి గౌరవిస్తుంది. తండ్రి పడ్డ శ్రమకు గుర్తుగా ఆమె.. ఆయన పుట్టినరోజు జూన్5ను ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. అలా ఒక తండ్రి త్యాగానికి బిడ్డ ఇచ్చిన గౌరవాన్ని ప్రపంచం మెచ్చుకుంది. తండ్రికి గౌరవంగా ఒకరోజు ఉంటే తప్పులేదని అంగీకరించింది. మూడో ఆదివారం అప్పటికే అమెరికాలో అమలులో ఉన్న జులై 5వ తేదీని.. ముందుకు జరిపింది. అలా జూన్ 5న ఫాదర్స్ డే మొదలైంది. చివరకు 1972లో ప్రెసిడెంట్ నిక్సన్.. ఏటా జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా ప్రకటిస్తూ అధికార పత్రంపై సంతకం చేశాడు. 111 దేశాలు పాటిస్తున్న ఈ రోజును అనధికారికంగానే ఫాదర్స్ డేగా నిర్వహించుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సంవత్సరంలో.. వేర్వేరు రోజుల్లో ఫాదర్స్ డేను జరుపుతున్నాయి. రష్యా, బెలారుస్లు ఫిబ్రవరి 23న ఫాదర్స్ డే గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. అక్కడ మాత్రం ఇక ఒక సంవత్సరం చివర్లో ఫాదర్స్ డేను నిర్వహించేది బల్గేరియా(డిసెంబర్ 26). మనతో సహా చాలావరకు దేశాలు మాత్రం జూన్ మూడో ఆదివారంరోజునే ఫాదర్స్ డేగా స్వీకరించాయి. కొన్ని దేశాల్లో ఫాదర్స్ డే సెలవు రోజుకాగా.. మరికొన్ని దేశాల్లో అప్రకటిత సెలవుగా కొనసాగుతోంది. ఏమివ్వగలం ? నిరంతర శ్రామికుడిగా పేరున్న తండ్రికి.. ఆయన్ని గౌరవించుకునే రోజున ఏం ఇవ్వగలం? వాట్సాప్లో స్టేటస్, ఇన్స్ట్రాగ్రామ్లో ఫొటో, ఫేస్బుక్లో పోస్ట్తోనో, కాస్ట్లీ గిఫ్ట్లతో సంతోషపెట్టగలమేమో. కానీ, ఆ నిస్వార్థమైన ప్రేమను మాత్రం వెలకట్టలేం. అందుకే ఆ తండ్రి స్పర్శను.. అపారమైన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుదాం. -
జాతీయ బాలికా దినోత్సవం స్పెషల్ ఫోటోలు
-
ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా?
2021 సంవత్సరంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే!.. 21వ శతాబ్ధంలో.. 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు ఇది. 1846లో ఇదే రోజున చార్లెస్ డికెన్స్ ‘డైలీ న్యూస్’ మొదటి ఎడిషన్ విడుదలైంది. 1950లో ప్రముఖ నవల ‘ అనిమల్ ఫార్మ్’ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణించారు. వీటితో పాటు.. ► నేషనల్ హగ్గింగ్ డే ► నేషనల్ హగ్ యువర్ పప్పీ డే ► ఉమెన్స్ హెల్దీ వేయిట్ డే కూడా ఈ రోజే. అంతేకాకుండా.. ఈ సంవత్సరానికి కూడా ఓ ప్రత్యేక ఉంది. శుక్రవారంతో మొదలై.. శుక్రవారంతో ముగిసే లీపు సంవత్సరం ఇది. 2010 సంవత్సరాన్ని పోలిన ఈ సంవత్సరం క్యాలెండర్ 2027, 2100లో మాత్రమే మళ్లీ పునరావృతమవుతుంది. ఈ రోజు ప్రత్యేకతను అందరికీ తెలియజేస్తూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేసేస్తున్నారు. ‘‘ మన జీవితంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఓ అడుగు ముందుకు వేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. Wishing everyone A very special n historical day of our life... Today is the *21st Day* of *21st Year* of the *21st Century*. ❣️ HAVE A NICE DAY ❣️ — लाखन सिंह बोहरा (@singhlakhan) January 21, 2021 *An unique Day of our life* Today is the 21st day of the 21st year of the 21st century. — Naresh Gera (@gerank) January 21, 2021 -
నవ్వండి బాస్.. మహా అయితే తిరిగి నవ్వుతారు
సాక్షి, విశాఖపట్నం: విశ్వ శ్రేయః హాస్యః అని ఓ సంస్కృత వాక్యం ఉంది. అంటే.. ప్రపంచ శ్రేయస్సు కోరేది ఏదైనా ఉందంటే అది కేవలం నవ్వు మాత్రమే. ఒకరినొకరు ద్వేషించుకునే బదులు నవ్వుతూ పలకరించుకుంటే అసలు యుద్ధాలే రావంటారు అరిస్టాటిల్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా.. మీరు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా..? అంతలా ఆలోచిస్తున్నారేంటి.? అలా బిక్కమొహమేసుకొని చిరాగ్గా ఉండకుండా కాస్తా నవ్వండి. నవ్వుతూ ఈ కథనం చదివేయండి.. నవ్వులనేవి మంచి మనసుకు చిరునామాలు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే వారి నవ్వును కొలమానంగా తీసుకోవచ్చంటారు వైద్య నిపుణులు. ఉదయాన్నే లేచినవెంటనే.. అద్దం చూస్తూ.. చిరునవ్వు నవి్వతే చాలు. ఆరోజంతా ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. మనసును విశ్రాంతపరుస్తూ.. కొత్తలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఒత్తిడి, కోపం, నొప్పులకు దివ్యౌషధంలాంటిదని వైద్యులు ధ్రువీకరించారు. నవి్వనప్పుడు విడుదలయ్యే హార్మోనులు మీలో చిరాకును దూరం చేస్తాయి. దీని వల్ల వునం ఆరోగ్యంగా జీవించగలం. జీవితంలో మిమ్మల్ని స్థిరంగా ఉండేటట్లుగా సహాయపడుతూ.. పాజిటివ్ ఆలోచనలతో జీవించేలా ప్రోత్సహిస్తుంది. మీ బాధల్ని తగ్గించి ఎంకరేజ్ చేస్తూ.. గాజువాకకు చెందిన శ్రీకర్.. కోట్ల రూపాయలు సంపాదించినా ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తుంటాడు. ఇంట్లో వాళ్ల సలహా మేరకు డాక్టర్ దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. బీపీ, సుగర్ ఇలా వ్యాధుల చిట్టా చెప్పుకొచ్చాడు. మొత్తం విన్న డాక్టర్ శ్రీకర్ని కాసేపు తీక్షణంగా చూసి మందులు రాసిచ్చారు. హాస్పిటల్ బయటకు వచ్చి మందులు కొందామని చీటీ చూడగా... అందులో.. రోజూ మూడు పూటలు మనసారా నవ్వుతూ ఉండండి అని రాసి ఉంది. అప్పటి నుంచి అది ఫాలో అయిపోయాడు శ్రీకర్. సరిగ్గా నెల తర్వాత చూస్తే బీపీ, సుగర్ కంట్రోల్లోకి వచ్చాయి. ముఖారవిందం మారిపోయింది. ఇప్పుడు శ్రీకర్ హాయిగా ఉన్నాడు. ఎందుకంటే.... నవ్వు.. మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. నవ్వు.. వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. నవ్వు.. ఒత్తిడిని జయిస్తుంది. నవ్వు.. ఆహ్లాదాన్ని పంచుతుంది. నవ్వు.. శరీరానికి కావాల్సిన శక్తినందిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి ఒక్క చిరునవ్వుకే సాధ్యం. సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉందో లేదో తెలీదు కానీ.. నవ్వుకు మాత్రం వ్యా«ధులు నయమవుతాయన్న నిజం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాంటి నవ్వుకు ఉన్న శక్తిని తెలిపే రోజే స్మైల్ పవర్ డే. నవ్వడం ఒక భోగం... నవ్వు భౌతిక, మానసిక, భావోద్వేగ, సమతుల్యతకు సహాయకారి. నవ్వు వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. దీనివల్ల శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలు కరిగించి ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడుతుంది. మరికొన్ని పరిశోధనలు డయాబెటిక్ పేషెంట్స్లో సుగర్ లెవల్స్ను కంట్రోల్ చేసే శక్తి నవ్వుకు ఉంటుందని నిరూపించాయి. స్మైల్ సైకాలజీ ప్రకారం స్మైల్ సైకాలజీ ప్రకారం చూస్తే.. రోజువారీ మనలోని శక్తిని మార్చే గుణం నవ్వులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే గంటసేపు నవి్వతే.. ఆ రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. కొత్త స్నేహాల్ని పరిచయం చేస్తుంది. మనలో ని శక్తి సామర్థ్యాల్ని మరింత ఇనుమడింపజేస్తుంది. సక్సెస్కు చిరునామాగా నవ్వు ని లుస్తుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. చాక్లెట్కు మె దడు పనితీరుని చురుకుదనంగా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి చాక్లెట్ బార్లు 2,000 తింటే.. మెదడు ఎంతటి చు రుకుదనంగా మారుతుందో.. ఒక్క నవ్వు అంతటి చురుకుదనాన్ని ఇస్తుందని బ్రిటిష్ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. శరీర శోభను పెంచే శక్తి నవ్వుకే.. ►నవ్వు మానవ జీవితానికి పలువిధాల శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు 150 కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►అనేక రుగ్మతల్ని రూపుమాపగలిగే శక్తి నవ్వుకి ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని రకాల వ్యాధుల్ని నవ్వుతోనే నయం చేసుకోవచ్చు. అనవసరంగా మందులు వాడాల్సిన పని లేకుండా వ్యాధులు తగ్గే అవకాశాలు నవ్వుతోనే సాధ్యం. ►మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది. ►మనం నవి్వనప్పుడు అంటువ్యాధుల్ని నిర్మూలించే కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఏబీ ఇమ్యునోగ్లోబిన్స్ని కూడా నవ్వు వృద్ధి చేస్తుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్స్ వృద్ధి చెందితే.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్ను నాశనం చేసి శ్వాసకోశాన్ని కాపాడుతుంది. ►సహజంగా నొప్పి తగ్గించే ఎండారి్పన్ను నవ్వు పెంచుతుంది. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ కండరాలకు సంబంధించిన నొప్పులు, మైగ్రేన్ ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పుల్ని తగ్గించేందుకు ఈ ఎండార్ఫిన్ ఎంతగానో దోహదపడుతుంది. ►ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. బ్రాంకైటిస్, ఉబ్బసం ఉన్నవారికి నవ్వు వైద్యుడిగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి రక్తంలో ప్రాణవాయువు స్థానాన్ని పెంచుతుంది. ►మానసిక ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►పది నిమిషాల పాటు నవి్వన తర్వాత చెక్ చేస్తే.. బీపీ పేషెంట్లో రక్తపోటు తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలు తెలిపాయి. ►మనసారా రోజూ నవ్వుకోండి. మీ ముఖంలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మన ముఖ కండరాల్ని టోన్ చెయ్యడంతో పాటు ముఖ కవళికల్ని మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మీరెప్పుడైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడటాన్ని గమనించారు. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. ఇలా రక్త ప్రసరణ వేగవంతమైతే.. ముఖ చర్మానికి పోషణ లభించి మెరుపు సంతరించుకుంటుంది. ఈ సీక్రెట్ను తెలుసుకునే.. చాలా మంది నవ్వుతూ ఉంటారు. ఇంత పవర్ నవ్వులో ఉన్నప్పుడు ఈ వార్తని కూడా సీరియస్గా చదువుతారెందుకు.. ఇప్పటి నుంచే నవ్వుతూ.. నవ్విస్తూ.. హాయిగా ఆరోగ్యంగా జీవించండి. ఒత్తిడి దూరం.. గంటల తరబడి చదువుతున్నప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతుంటాను. ఆ సమయంలో ఒక్క అరగంట సేపు కామెడీ షోలు చూస్తుంటా. అంతే ఒత్తిడి మొత్తం మాయమైపోయి రిలాక్స్గా మారిపోతుంటా. ఇంట్లో అంతా ఇదే ఫాలో అవుతున్నాం. – శైలజ, పీజీ విద్యార్థిని కామెడీ షోలకు ప్రాధాన్యం... నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడో చదివాను. అప్పటి నుంచి కామెడీషోలు, సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాను. క్లాసులు విన్నాక.. కాసేపు ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఎవరికి తెలిసిన జోకుల్ని చెప్పుకుంటూ నవ్వుకుంటాం. – బండారు స్వరాజ్యం, బీటెక్ విద్యార్థిని నవ్వే ఆయుధం... ఎదుటి వారు ఏ విషయంలోనైనా కోపంగా మాట్లాడితే.. వారికి నేను చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటాను. దీంతో.. వారు కూల్ అయిపోతారు. నాపై కోపాన్ని మరిచిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు. నా స్మైల్ నా పవర్ అని చాలా మంది చెబుతుంటారు. – తమ్మినేని దర్శిని,డిగ్రీ విద్యార్థిని లాఫర్ థెరపీ మంచిదే... మా దగ్గరికి చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతూ వస్తుంటారు. వాళ్లందరికీ ఫిజియోథెరపీ చేశాక ఇంటికి వెళ్లి అరగంట పాటు నవ్వమని సలహా ఇస్తుంటాను.లాఫర్ థెరపీతో ఎలాంటి నొప్పులనైనా మాయం చెయ్యొచ్చు. – ఎస్.స్వాతి, ఫిజియోథెరపిస్ట్ -
వినరా వినరా నరుడా
‘వినదగు నెవ్వరు సెప్పిన’ అన్నాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే. ఎవరు ఏం చెప్పినా వింటున్నారు. అయితే తర్వాతి లైను ఒకటి ఉంది. ‘వినినంతనే వేగపడక వివరింపతగున్’... విన్న వెంటనే వేగంగా ఒక అభిప్రాయానికి రావొద్దని, విన్న దానిలో మంచి ఏదో చెడు ఏదో తేల్చుకుని, విశ్లేషించుకుని, అజా పజా చూసుకొని, సరైన దారిలో వెళ్లేవాడే నీతిపరుడు అని ఈ పద్యం చెబుతుంది. సరైన మాట పలకడం ఎంత ముఖ్యమో సరైన మాట వినడం, చెవికెక్కించుకోవడం అంతే ముఖ్యం. ఏ నీటి కోసం ముంత పట్టుకుంటే ఆ నీరే దొరుకుతాయన్నట్టు చెప్పుడు మాటలకు చెవిని విడిచి పెడితే ఆ మాటలే చెవి దాకా వస్తాయి. రామాయణంలో మందర మాటలను కైక చెవికెక్కించుకుంది. దాని వల్ల ఒక నష్టం. లంకలో రావణుడు విభీషణుడి మాటలు చెవినెక్కించుకోలేదు. అదొక నష్టం. చెవికి చేరిన మాటను పుటం పెట్టి తీసుకోవడంలోనే మన విజ్ఞత, లౌక్యం, బతుకు సజావుతనం ఉంటాయి. అంతఃపుర కాంతలు ఇందరు ఉండగా సైరంధ్రీ పై మక్కువ ఏలరా అని కీచకుణ్ణి అతడి సోదరి హెచ్చరిస్తుంది. వినలేదు. ఐదు ఊళ్లు వదిలి పెట్టు... గొడవ ఆగుతుంది అని కృష్ణుడు మాటవరస ప్రతిపాదన చేస్తే దుర్యోధనుడు చెవికేసుకోలేదు. చెవి శుభ్రంగా ఉండి ఉంటే కీచకుడు బతికేవాడు. దుర్యోధనుడు ఆ ప్రతిపాదన కాకపోతే మరో ప్రతిపాదన చేసి నష్టనివారణ చేసుకుని ఉండేవాడు. యుద్ధంలో, దొమ్మీలో, అల్లర్లలో రణగొణ ధ్వనులు అధికం. సత్యం పలుచనైపోతుంది. దాని డెసిబల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ‘అశ్వత్థామ హతః’ అని వినపడ్డాక ఆ తర్వాత లో గొంతుకతో పలికిన ‘కుంజరః’ను కూడా ద్రోణుడు సరిగా విని ఉంటే చనిపోయింది తన కొడుకు అశ్వత్థామ కాదని, ఆ పేరుతో ఉన్న ఏనుగు అని తెలుసుకొని ప్రాణాలు కాపాడుకుని ఉండేవాడు. జనుల చెవి ఎప్పుడూ మాయలో పడుతూనే ఉంటుంది. చెడు శబ్దాల ఊబిలోకి దిగుతూనే ఉంటుంది. వారికి మంచి చెప్పడానికి మహాత్ములు, ప్రవక్తలు దిగి రావడాన్నే పనిగా పెట్టుకున్నారు. కొందరు గుడి గోపురం ఎక్కి మరీ చెప్పారు. కొందరు ఊరు వాడలు తిరిగి చెప్పారు. చెడు చెవి ఉన్నవారంతా ఈ మంచి వినిపించడానికి వచ్చిన వారిని పరీక్షలు పెట్టారు. రాళ్లతో కొట్టారు. కడకు కొందరి ప్రాణాలే తీశారు. కాని వారు ఒక్కసారి పలికిన మంచి శతాబ్దాలు గడిచిపోయినా వినబడుతూనే ఉంటుంది. మంచిని వినిపించాలి అనే సంకల్పానికి ఉన్న శక్తి అది. మనం నిద్రపోయేటప్పుడు ఇవాళ ఏ మంచి మాట ఎవరికి వినిపించాం అని ఆలోచిస్తే ఎంత మంచి ఆవరణంలో మనం ఉంటున్నామో అర్థమవుతుంది. శారీరక బధిరత్వానికి వైద్యం ఉంది. మానసిక బధిరత్వానికి లేదు. ప్రేమను వినకుండా పగను వినేవారు, స్నేహాన్ని వినకుండా ద్వేషాన్ని వినేవారు, శాంతిని వినకుండా యుద్ధాన్ని వినేవారు, ఐకమత్యాన్ని వినకుండా విభజన తత్వాన్ని వినేవారు, మానవత్వాన్ని వినకుండా మతాన్ని వినేవారు, క్షమను వినకుండా శిక్షను వినేవారు నిజమైన, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామని చెప్పలేము. చేతులు, కాళ్లు మెదడుకు దూరంగా ఉంటాయి. గుండె కూడా మెదడుకు దూరమే ఉంటుంది. చెవే చాలా దగ్గర. ఇది నింపుకునే జాలి, కరుణ, ఆర్ద్రత మెదడులోకి త్వరగా చేరి మనల్ని దయామూర్తులను చేస్తాయి. వినలేకపోయే వారి మీద జోకులు వేయడానికి మించిన కుసంస్కారం లేదు. ‘చెవిటి మాలోకం’, ‘సౌండ్ ఇంజనీర్’... ఈ పేర్లు పెట్టడం నవ్వు వచ్చే విషయం ఏ మాత్రం కాదు. నిజానికి వారు అదృష్టవంతులు. ‘వాడెంత వీడెంత’, ‘వాడి సంగతి చూస్తా’, ‘ఫలానా వాళ్లని చంపేయాలి’, ‘ఆమెను ఏం చేస్తానో చూడు’, ‘వాడు తక్కువ నేను ఎక్కువ’, ‘పో.. వెళ్లి చంపు’ లాంటి మాటలు వాళ్ల చెవికి వినిపించవు. ఆ మేరకు వాళ్లు చెడుకు దూరంగా ఉన్నారు. ఈ మాటలను సంపూర్ణంగా వినగలిగే గ్రహణశక్తి ఉన్నా అవి వినక్కర్లేని వివేచనతో ఉండటమే ఇప్పుడు కావలసింది. చెవికి మంచి ఆహారం ఇవ్వడం అవసరమని గ్రహించండి. ఒక పాట వినిపించండి. సితార్ కచ్చేరిలో మునకలేసేలా చేయండి. ఒక భక్తి గీతానికి పరవశం కానివ్వండి. ఒక ప్రార్థనలో నిమగ్నం అవనివ్వండి. ఒక ఆత్మీయుని పలకరింపుతో తబ్బిబ్బు కానివ్వండి. ఒక మంచి పని చేశాక ఎదుటివారు ‘కృతజ్ఞతలు’ అని చెబుతుంటే ఆ మాటను మూడు పూటలా మాత్రలా మింగించండి. చెవి ఆరోగ్యం అంటే సమాజ ఆరోగ్యం. దేశ ఆరోగ్యం. చెడు శబ్దాల స్వచ్ఛభారత్ చేసి మంచి మాటల సమోన్నత భారత్గా మలచడమే ఇప్పుడు మన విధి. -
నేడు మానవ అకమ రవాణా వ్యతిరేక దినం
-
అధిక జనాభాను నియంత్రించాలి
బెల్లంపల్లి: అధిక జనాభాను నియంత్రించాలని బెల్లంపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంగం నిత్యకళ్యాణ్ అన్నారు. బుధవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభాను అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరగడం వల్ల వనరుల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ నిర్వాహకులు సిరికొండ ఆంజనేయరావు, ఎస్.నర్శింగం, కె.సత్యనారాయణ, రాజన్న, నారాయణరావు, వెంకట రమణారెడ్డి, రాజయ్య, కె.నర్సయ్య, దుర్గా ప్రసాద్, వి.సంతోష్, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శంకర్ పాల్గొన్నారు. -
జావా.. నాటి హవా !
విజయవాడ స్పోర్ట్స్: ఒకప్పుడు పెద్దవాళ్లు ఆఫీషియల్గా వాడే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే... 1987కు ముందువరకు కుర్రకారు బైక్ ఏదంటే జావా మోటార్ సైకిలే. 1929లో చెకోస్లేవియాలో తయారైన ఈ జావా మోటారు సైకిల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. రోడ్డుపైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సింహం అయితే...జవా మోటార్ సైకిల్ పులి అనేవాళ్లు. ఇప్పటికీ దీనికున్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. బీటింగ్కు మారుపేరు జావానే. టుస్ట్రోక్ ఇంజిన్ ఇది. 350 సీసీ, 250 సీసీ బైక్లు ఉన్నాయి. బండి స్టార్ట్ చేయడానికి కిక్ రాడ్డే గేర్ రాడ్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక్క జావా బైక్ మాత్రమే. పూర్తిగా ఎగ్ షేప్గా ఏ ఒక్క పార్టు బయటకు కనిపించకుండా ఉండే బైక్ జావా బైక్. ఇప్పటికీ రోడ్డుపై ఎన్ని వందల బైక్లు వెళ్లినా...ఒక జావా బైక్ చాలు తన ఉనికిని చాటుకోవడానికి. పాత సినిమాల్లో హీరోలు వాడిన బైక్ ఇది. 1980 తరువాత జావా బైక్ని కొంతమార్పులు చేసి యజ్డీ బైక్గా పేరు మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు పైగా ఈ బైక్ ఏలింది. పాత బులెట్ మాదిరిగానే ఎన్ని సంవత్సరాలు బండి అయినా సరే మళ్లీ దానిని కొత్త బైక్గా తయారు చేసుకునే వీలున్న బైక్ ఇది. బండి ఎంత పాతదయితే అంత క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా జావా క్లబ్లు దేశవ్యాప్తంగా జావా క్లబ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 8న ఇంటర్నేషనల్ ‘జావా డే’ ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జవా క్లబ్లు వరల్డ్ జావా డేని నిర్వహిస్తున్నాయి. విజయవాడలో కూడా ‘బీటింగ్ హార్ట్స్ జావా’ క్లబ్ ఉంది. ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 ఎనిమిది గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి క్లబ్ సభ్యులంతా తమ బైక్లపై రైడ్ చేయనున్నారు. జావా బైక్ల బీటింగ్తో కనులవిందు చేయనున్నారు. -
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లిలో గురువారం గడ్డిపల్లి మిల్లు హమాలీ యూనియన్ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తమదేనన్నారు. కార్మికుల సంక్షేమమే సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు గుండు గుర్వయ్యగౌడ్, ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, బెల్లంకొండ గుర్వయ్యగౌడ్, సలిగంటి జానయ్య, ముక్కంటి వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా సభ్యత్వం గాల్లో పని చేస్తున్న కార్మికులు మూడు కోట్లకు పైబడి సభ్యత్వం కలిగి ఐఎన్టీయూసీ అతిపెద్ద యూనియన్గా కొనసాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వేములూరు ప్రాజెక్ట్పై నిర్మించిన ఎన్ఏటీఎల్ పవర్ప్లాంట్ ఐఎన్టీయూసీ కార్మికులతో కలిసి 71వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చ లిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గురవ య్య, కరుణాకర్రెడ్డి, కోటేష్, ముక్కంటి, రామ్మూర్తి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్రావు దేశ్పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
ఘనంగా ఆటా డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది. వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు. -
కరెంటు ఫుల్...నీళ్లు నిల్
కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న విధంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుతే ప్రాణాధారం. ప్రభుత్వం ఇప్పుడు 24గంటల ఉచిత నిరంతర విద్యుత్ ఇస్తున్నా ఆయకట్టేతర ప్రాంతాలకు చెందిన రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు. విద్యుత్ను అవసరాల మేరకే సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో రైతులను చైతన్య పరచడంలో విద్యుత్శాఖ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల విద్యుత్ మోటార్లు ఆగకుండా నడుస్తుండడంతో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా బోర్లు వట్టిపోయి, పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం.. విద్యుత్ వినియోగం గత యాసంగి సీజన్ కంటే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం, విద్యుత్ వినియోగం పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది. సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే. రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది మాకున్న రెండు ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాం. ఉన్న రెండు బోర్లు నెల రోజుల్లో వట్టిపోయాయి. 20 రోజుల క్రితం కొత్తగా రూ.50 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. మొత్తం రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులను మేపుతున్నాం. పెట్టిన పెట్టుబడి పోగా మరో రూ.70 వేల వరకు అప్పు మిగిలింది. – మల్లేపల్లి సైదమ్మ, సర్వారం, తిప్పర్తి మండలం 12గంటలు ఇస్తే చాలు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇస్తుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గి బోర్లు సన్నని ధారగా పోస్తున్నాయి. నాటు పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 12 గంటల కరెంట్ విడుతల వారీగా ఇస్తేచాలు. వ్యవసాయం చేయగలం. నీటి వసతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది. – గంగేశ్వర్, రైతు, అడ్డగూడూరు ఆటోస్టార్టర్లు తొలగించుకోమని చెప్పాం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నాటి నుంచే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోమని చెబుతున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. అవసరం మేరకు విద్యుత్ వాడుకుని ఆ తర్వాత రైతులు తమతంటతాముగానే స్టార్టర్లు బంద్ చేసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. ప్రతీ రోజూ నల్లగొండ జిల్లాలో 29.86 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కోటా 18.30 మిలియన్ యూనిట్లు మాత్రమే. – కృష్ణయ్య, విద్యుత్ శాఖ, ఎస్ఈ, నల్లగొండ -
మూడో సోమవారం
మాధవ్ శింగరాజు జనవరి నెలలోని మూడో సోమవారం అంటే అమెరికన్లలో చాలామందికి ఇష్టం ఉండదు! ‘ద మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ద ఇయర్’గా వాళ్లు ఫీలౌతారు. అప్పటికి క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయి ఉంటాయి. ఆ రెండు రోజుల కోసం చేసిన అప్పులేవైనా ఉంటే అవి మిగిలి ఉంటాయి. కొత్త సంవత్సరపు తీర్మానాలు ఈ రెండు వారాల్లో బ్రేక్ అయి ఉంటాయి. అవన్నీ అలా ఉంచండి.. క్రిస్మస్లా, న్యూ ఇయర్లా.. ఎదురుచూడ్డానికి దగ్గర్లో ఇంకే పండుగలూ ఉండవు. అందుకని జనవరి మూడో సోమవారాన్ని ‘బ్లూ మండే’ అంటాడు క్లిఫ్ ఆర్నల్ అనే సైకాలజిస్టు. అంటే దిగుళ్ల సోమవారం అని. మనుషుల్లో స్ట్రెస్ లెవల్స్ పెరగడం మొదలయ్యే రోజట అది. ‘ఇ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్’ లాంటి లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. ఆ లెక్కల్ని పక్కన పెడితే, అమెరికాలో ఇవాళ నేషనల్ హాలిడే! నేషనల్ హాలిడే ఎందుకంటే ఇవాళ అక్కడ ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’. అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని గుర్తు చేయడం కోసం (గుర్తు చేయడానికి, గుర్తు చేసుకోడానికి తేడా ఉంది) యేటా ప్రతి మూడో సోమవారం ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’ని జరుపుతోంది అమెరికా. (జరపడానికి, జరుపుకోడానికి తేడా ఉంది). ఈ ఏడాది మార్టిన్ డే, మార్టిన్ బర్త్డే రెండూ ఒకేరోజు వచ్చాయి. జనవరి 15 మార్టిన్ బర్త్డే. మరి మార్టిన్ బర్త్డే నే, మార్టిన్ డే గా ప్రకటించవచ్చు కదా! ప్రకటించవచ్చు కానీ, ఎందుకనో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని ‘మార్టిన్ లూథర్ డే’ పేరిట జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983లో ఆయన ఆ హాలిడే బిల్లు మీద సంతకం చేస్తే, 1986 జనవరి మూడో సోమవారం తొలిసారిగా అమెరికాలో హాలిడే అమల్లోకి వచ్చింది. అయితే అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలు ‘మార్టిన్ లూథర్ డే’ ని గుర్తించలేదు! కొన్ని రాష్ట్రాలైతే, లూథర్ డే అని కాకుండా, ఇంకేదైనా పేరు పెడితేనే గుర్తిస్తాం అని పట్టుపట్టి కూర్చున్నాయి! 2000 నాటికి గానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలసి ‘మార్టిన్ లూథర్ డే’ని నేషనల్ హాలిడేగా అంగీకరించలేకపోయాయి. బిల్లు మీద సంతకం పెట్టడానికి ముందు రొనాల్డ్ రీగన్ మనసు కూడా అందుకు అంగీకరించలేదు! మనసొప్పక, నల్లవాళ్లను నొప్పించలేక సంతకం పెట్టేశారు. ‘ది మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ది ఇయర్గా’ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని బలపరచడానికి ‘మార్టిన్ డే’ని కూడా ఒక కారణంగా చూపే తెల్ల అమెరికన్లు కూడా అక్కడ లేకపోలేదు. కనీస హక్కుల్ని సైతం పొందలేక.. డేస్, ఇయర్స్ మాత్రమే కాదు.. పుట్టినప్పట్నుంచీ డిప్రెసింగ్ లైఫ్నే గడుపుతున్న నల్లజాతి అమెరికన్ పౌరుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని అమెరికన్ జాతీయులు ఈ మాత్రంగానైనా అంగీకరించడానికి చాలా సమయమే పట్టింది. ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నారు మార్టిన్.. ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ అనే ప్రసంగంలో. మొన్న శుక్రవారం నాడు వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్.. ‘మార్టిన్ డే’ ఉద్ఘోషణ (ప్రొక్లమేషన్) మీద లాంఛనంగా సంతకం పెట్టిన రెండు రోజులకే, ఆఫ్రికా దేశాల పౌరులను ఉద్దేశించి ‘షిట్హోల్స్’ అనడం చూస్తుంటే, మార్టిన్ కల పూర్తిగా నిజం ఫలించిందా అన్న సందేహం కలుగుతుంది. మనసులో చీకటిని పెట్టుకుని ఎన్ని దీపాలను వెలిగిస్తే మాత్రం ఏమిటి? మనిషి మీద గౌరవం లేకుండా ఎన్ని ‘డే’లు జరిపితే మాత్రం ఏముంది? -
పేదల సంక్షేమమే థ్యేయం
మంత్రి కిమిడి కాకినాడ రూరల్: దేశం, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కిమిడి కళావెంకటరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సహకరించి రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపించడానికి సహకరించాలని కిమిడి కోరారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు., 90 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురువేసి జెండా వందనం చేశారు. ఏఆర్ ఫ్లటూన్, ఎన్సీసీ తదితర దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిజర్వు దళాలు ప్రదర్శించిన సంప్రదాయ కవాతును తిలకించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా 4,828 మహిళా సంఘాలకు రూ. 124 కోట్లు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా 2017 మంది సభ్యులకు రూ.25 కోట్ల 22 లక్షల మొత్తాన్ని రుణాలుగా మంత్రి అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ కలిపి 25 యూనిట్లకు రూ.42 కోట్ల 67 లక్షలు, ఎన్ఎస్ఎఫ్డీసీ ఆరు యూనిట్లకు రూ. 14 కోట్లు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ద్వారా 10 ట్రై సైకిళ్లు, ఆరు వీల్ చైర్లు, ఏడుగురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కోటి రూపాయలు విలువైన ఒక్కొక్కటి రూ. 10 లక్షలు విలువ గల 10 స్కార్పియో, టాటా జిస్ట్ తదితర వాహనాలను 9 మంది ఎస్సీ, ఒకటి ఎస్టీ లబ్ధిదారులకు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ చే కులాంతర వివాహాలు చేసుకున్న 84 జంటలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున రూ. 42 లక్షలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... విద్యాశాఖచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. వీరిలో ప్రగతి ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన స్వాగతం, స్వాగతం పాటకు, సెయింట్ అన్స్ గరల్స్ హైస్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకం, ఆదిత్యా ఇంగ్లిషు మీడియం, శ్రీనగర్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకాలకు మంత్రి కిమిడి జ్ఞాపికలను అందజేశారు. శకటాల ప్రదర్శన... శకటాల ప్రదర్శనలో దేవాదాయశాఖ అన్నవరం, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ–సర్వశిక్షా అభియాన్, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ–ఎస్సీ కార్పొరేషన్, సమీకృత గిరిజనాభివృద్ధి, పర్యాటక, మత్స్య, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డీఆర్డీఏ, వెలుగు శాఖలు నిర్వహించే కార్యక్రమాల అంశాలతో శకటాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిచారు. పౌర సరఫరాల శకటానికి ప్రథమ స్థానం, వ్యవసాయశాఖకు ద్వితీయ, అటవీశాఖకు తృతీయ బహుమతిని మంత్రి కిమిడి, జాయింట్ కలెక్టర్ మల్లికార్జునలు అందజేశారు. మార్చ్ ఫాస్ట్లో ఏఆర్ ప్లటూన్ మొదటి స్థానం, ఎన్సీసీ బాలికల విభాగానికి రెండో, బాలుర విభాగానికి మూడో స్థానం లభించిందిం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు చోడేపల్లి హనుమంతరావును మంత్రి కిమిడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్సీ విశాల్గున్నిలు సన్మానించారు. స్టాల్స్ను సందర్శించిన మంత్రి... జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, డ్వామా, విద్యాశాఖ తదితర శాఖలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి కళా సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ ఎ.మల్లికార్జున, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఆర్ఓ ఎం.జితేంద్ర, ఆర్డీఓ ఎల్.రఘుబాబు, స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఎన్. శ్రీనివాస్లతోపాటు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.