Discount offers
-
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
హలో సార్... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలనా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్కు విజిట్ చేసి చూడండి.సార్ గుడ్ ఈవెనింగ్, కార్తీక్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్ (BTECH) కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం... ...టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద రిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్ కాకముందే కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి..తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు. మరోవైపు పీఆర్ఓలు... వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్కు సంబంధించి ‘సూపర్, స్టార్, సీఓ’ బ్రాంచ్ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదీ చదవండి: బడి బయటే బాల్యం -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్సేల్గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్పూర్లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే.. -
అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది. ఫ్లాష్ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది. -
‘ఆ డిస్కౌంట్లు అనైతికం.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’
ఈ-కామర్స్ రంగంలో ధరలు పెంచి డిస్కౌంట్లను అందించడం వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు సంబంధించిన మేధో సంస్థ ‘కట్స్ ఇంటర్నేషనల్’ (CUTS International) తాజాగా విడుదల చేసిన నివేదికలో సూచించింది. అసలు ధరలు ఎక్కువగా చూపి పొదుపుపై తప్పుడు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఫ్లాష్ సేల్స్పై పూర్తిగా నిషేధం విధించే బదులు, వినియోగదారుల రక్షణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, మార్కెట్లో వ్యాపార సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాలని సూచించింది. న్యాయమైన, స్థిరమైన ఈ-కామర్స్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, విక్రేతలు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటం చాలా కీలకం. డిస్కౌంట్ భారాన్ని విక్రేతలపై మోపడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుందని, వారి లాభాల మార్జిన్లు క్షీణించవచ్చని నివేదిక పేర్కొంది. వినియోగదారుల సంక్షేమం కోసం, అమ్మకందారులందరూ మార్కెట్లో నిలదొక్కుకోవడం కోసం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు ఉత్పత్తులు/విక్రయదారుల 'సెర్చ్, ర్యాంకింగ్' పరంగా స్వీయ-ప్రాధాన్యత వంటి పద్ధతులలో పాల్గొనకూడదని సిఫార్సు చేసింది. -
బంపరాఫర్ : డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలుపై 10 లక్షల డిస్కౌంట్!
స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర పండగల సీజన్లో ఆయా ఈ - కామర్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అందుకు అనుగుణంగా వినియోగదారులు తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇప్పుడీ ఈ డిస్కౌంట్ ఫార్మలానే రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్లయ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రియాలిటీ సంస్థలు కొనుగోలు దారులకు తక్కువ ధరలకే వారు కోరుకున్న ప్లాట్లు, విల్లాలు, వన్ బీహెచ్కే, టూబీహెచ్కే ఇళ్లను అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ( ఫైల్ ఫోటో ) 👉 ముంబైకి చెందిన డెవలపర్లు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31వరకు అపార్ట్మెంట్లను బుక్ చేసుకునే గృహ కొనుగోలుదారులకు జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ (బై నవ్ పే లేటర్) 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తున్నారు. జీఎస్టీని సైతం రద్దు చేస్తున్నారు. 👉 జేపీ ఇన్ఫ్రా జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ-పేమెంట్ ప్లాన్, 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తుంది. ఆఫర్లో భాగంగా స్టాంప్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించింది. 👉 త్రిధాతు రియాల్టీ అనే సంస్థ 2 బీహెచ్కే యూనిట్పై రూ. 10 లక్షలు, 3 బీహెచ్కే పై 20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ( ఫైల్ ఫోటో ) 👉ఢిల్లీ-ఎన్సీఆర్లో భూటానీ ఇన్ఫ్రా సొంతింటి కలల్ని నిజం చేసుకునేందుకు వీలుగా ఓ స్కీమ్ను ప్రవేశ పెట్టింది. పథకంలో కస్టమర్లు కోరుకున్న ధరకే ప్రాపర్టీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఈ స్కీమ్లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన 77 యూనిట్ల కేటాయింపును లక్కీ డ్రా ఆధారంగా నిర్ణయిస్తారు. 👉 పథకం కింద, కొనుగోలుదారులు భూటానీ ఇన్ఫ్రా ప్రాపర్టీని ఎంచుకుంటే ఎంత ధరకి ఆ స్థిరాస్థి కావాలనుకుంటున్నారో అంతకే కోట్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ. 2 కోట్లు అయితే కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం రూ.1.75 కోట్లు లేదా రూ.1.5 కోట్ల ధరను కోట్ చేయవచ్చు. ఈ సందర్భంగా..లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని భూటానీ ఇన్ఫ్రా సీఈఓ ఆశిష్ భుటానీ తెలిపారు. ( ఫైల్ ఫోటో ) 👉 గౌర్స్ గ్రూప్ గ్రేటర్ నోయిడా వెస్ట్లోని గౌర్ వరల్డ్ స్మార్ట్స్ట్రీట్ ప్రాజెక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్లో ప్రతి బుకింగ్పై కారును ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 13 రెండు రోజులు అందుబాటులో ఉంది. అంతేకాదు మూడు సంవత్సరాల పాటు షాపుల నిర్వహణ అంతా ఉచితం 👉 ఘజియాబాద్లోని గౌర్ ఏరోసిటీ మాల్లోని షాపుల కోసం కంపెనీ ప్రతి బుకింగ్పై ఐఫోన్ను అందిస్తోంది. 👉 బెంగళూరులో ప్రావిడెంట్ హౌసింగ్ సంస్థ ప్రస్తుతం ఫ్రీడమ్ ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ 4.0ని నిర్వహిస్తోంది, ఇందులో కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా హౌసింగ్ యూనిట్ను బుక్ చేసుకోవచ్చు. గరిష్ట ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించింది. ఇలా డిస్కౌంట్ ధరలకే వారికి నచ్చిన ప్లాట్లను అందిస్తూ సేల్స్ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు. చదవండి👉 6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె! -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!
భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?) మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్కార్ట్ సేల్లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్..
అమెజాన్ భారత్లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించిన టీజర్ను అమెజాన్ విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్లో పేర్కొంది. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు! అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్మీ (Redmi 12C) ఫోన్ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999. సరికొత్త స్మార్ట్ఫోన్లు, వాటి యాక్సెసరీస్పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్లో ప్రైమ్ మెంబర్ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలపై.. టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో కస్టమర్లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్ప్లస్ వై సిరీస్ హెచ్డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్ల తొలగింపు.. -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
మే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఇతర గృహోపరకరణాలు కొనుగోలు చేయాలని అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు అదిరిపోయే సేల్ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే 5 నుంచి మే 10 వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ఆరు రోజుల పాటు జరిగే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్లను పొందవచ్చు. అదే సమయంలో నిర్వహించే క్రేజీ డీల్స్, బెస్ట్ ప్రైస్ వంటి డీల్స్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. 80శాతం వరకు డిస్కౌంట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, గ్రూమింగ్, స్టైలిష్ ప్రొడక్ట్లపై ఆఫర్లు, మైక్రో ఎస్డీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్లపై 60 శాతం డిస్కౌంట్, టీవీలు, ఉపకరణాలపై 75 శాతం, రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషీన్లపై 55 శాతం, గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు.ప్లిప్కార్ట్ సొంతం ప్రొడక్టులైన ఫ్యాషన్, బ్యూటీ,ఫుడ్, స్పోర్ట్స్ ప్రొడక్ట్, హోమ్, కిచెన్లో వినియోగించే వస్తువులపై 80శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ పాలసీ ఈ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు మే 4న డీల్స్లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు 5శాతం అపరిమిత క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 20వేల విలువైన సూపర్కాయిన్స్, రివార్డ్ల కంటే నాలుగు రెట్లు సంపాదించవచ్చు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ పాలసీలో వస్తువులు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చదవండి👉 మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు! -
డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్ వేదికల్లో ఫ్లాష్ సేల్స్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్ సేల్స్ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్ ప్లేస్ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్ ఇష్టపడే లేదా ప్రమోట్ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) డిస్కౌంట్లతో మంచి డీల్.. ‘ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్ సేల్స్ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) చిన్నవారిని రక్షించుకుంటాం.. ‘విదేశీ ఈ-కామర్స్ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్గా మాదిరిగానే పనిచేయాలి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. -
అమెజాన్లో ఆగని ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!
Amazon Blockbuster Value Days Sale: మీరు ఓ కంపెనీకి చెందిన బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటున్నారు? అయితే ఆ టీవీ డిస్కౌంట్కే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకోసం ఏయే ఈ - కామర్స్ సంస్థలు టీవీలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయోనని అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ‘బ్లాక్బ్లస్టర్ వ్యాల్యూ డేస్’ సేల్ను ప్రారంభించింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రత్యేకంగా సేల్ నిర్వహించ నుంది. ఈ సేల్లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సైతం అందిస్తుంది. (పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో) ఇక ఈ ప్రత్యేకమైన సేల్లో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ‘4కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ’ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) వన్ ప్లస్, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్కే సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్, రెడ్మీ, శాంసంగ్తో పాటు ఇతర గేమింగ్ డివైజ్లపై 25శాతం, గేమ్ టైటిల్స్పై 50 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తులైన ప్లే స్టేషన్ డివైజ్లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్లపై డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపైన కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కావున కొనుగోలుదారుడు సాధారణ ధర కంటే తక్కువకే ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ రూ. 5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనాలనుకునే కస్టమర్ రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 2021లో రూ. 10,000 వరకు పెరిగాయి. ఆ సమయంలో కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో దేశీయ మార్కెట్లో ప్రత్యులకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ స్కూటర్ల మీద మంచి ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రూ. 5వేలు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి అమ్మకాల్లో 27,000 యూనిట్లను విక్రయించి మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. -
రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై అత్యుత్తమ డీల్స్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.1000 విలువైన డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంది. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) టీవీలు, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకూ డిజిటల్ డిస్కౌంట్ డేస్ కొనసాగుతాయని, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 83 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది. -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్తోపాటు, వన్ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్లేన్కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్న్యూస్!
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. దివాళీ సేల్లో భాగంగా ఐఫోన్లను డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.69,990 ఉండగా రూ.59,990కే అందిస్తుంది. ఇక 256జీబీ, 512జీబీ ఫోన్ల ధరల్ని సైతం తగ్గించింది. ఐఫోన్ కొనుగోలుదారులు ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే రూ.1250 అదనంగా ఆఫర్ను పొందవచ్చు. దీంతో పాటు యూజర్లు ఎక్స్ఛేంజ్ డీల్ కింద రూ 16,990 వరకూ పొందుతారు. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ సంస్థ ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఫోన్ల వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. -
రిలయన్స్ డిజిటల్ దసరా ఆఫర్లు
హైదరాబాద్: దసరా సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంకు కార్డులపై 10% తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ వాచ్ను రూ.17,100కు, శామ్సంగ్ వాచ్ను రూ.6,490కు అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, స్మార్ట్వాచ్లు రూ.1,599 నుంచి అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లపైనా ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్టు తెలిపింది. శామ్సంగ్ ఎం53 5జీ ఫోన్ను కేవలం రూ.19,999కు, శామ్సంగ్ ఎస్22ను రూ. 49,990కే ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లు లేదా మైజియో స్టోర్ లేదా రిలయన్స్డిజిటల్ డాట్ ఇన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే జేబుకి చిల్లే!
దసరా పండుగ వచ్చేస్తోంది. ఇంకేముంది ఫెస్టివల్ సీజన్ వచ్చినట్లే. ఇప్పటికే దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థలు.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ డే అని, మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమవుతున్నా ఈ ఆఫర్ సేల్లో మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది గానీ ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ►కంపెనీ ఇస్తున్న డీల్స్లను చెక్ చేయండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్న డీల్ల వైపు ఆకర్షితులయ్యే ముందు, అవి ఎంత నిజమైనవో చెక్ చేయండి. లాంచ్ సమయంలో కంపెనీ దాని ధర ఏమిటో చూడండి. కొన్నిసార్లు నకిలీ డిస్కౌంట్లు కూడా జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు అమాయక కస్టమర్లు మోసపోతారు. ►డిస్కౌంట్లు ఆఫర్లు మాత్రమే కాదు ఆ వస్తువులు మనకి అవసరమా కాదా అని కూడా చూసుకోవాలి. లేదంటే కొన్న తర్వాత వాటిని వాటిని వాడకుండా ఇంట్లో ఓ మూలనా ఉంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వస్తువు నిరుపయోగంగా మారుతుంది. ►మీ కార్ట్లో త్వరగా మంచి డీల్లను ఉంచుకోండి. లేదంటే ఆఫర్ ముగిసిపోతుందనే తొందరలో మంచి వస్తువులను మిస్ చేసుకునే చాన్స్ ఉంది. కొనుగోలు చేసే ముందు మీరు కొందామని అనుకుంటున్న వస్తువుని ఇతర వాటితో పోల్చి చూడడం ఉత్తమం. ►బ్యాంక్ ఆఫర్లను సరి చూసుకోవాలి అలాగే వస్తువులపై కంపెనీ ఇస్తున్న తగ్గింపు ధరలను సరిగా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు బయటి మార్కెట్లో, ఇతర వెబ్సైట్లో వాటి ప్రస్తుత ధర ఎంత ఉందనేది కూడా తెలసుకోవాలి. మీరు కొనుగోలు చేయదలుచుకున్న ప్రాడెక్ట్ మీ బడ్జెట్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం ఉత్తమం. ►షిప్పింగ్ చార్జ్ల విషయంలోనూ తనిఖీ చేయండి. ఈఎంఐ(EMI) ఆఫర్ను సరిగా లెక్కించుకోండి. చదవండి: ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు! -
తొమ్మిదో వసంతంలోకి ‘బి న్యూ మొబైల్స్’
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బి న్యూ మొబైల్స్ ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుని, తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన మొబైల్స్పై 50% వరకు స్టోర్స్లో, ఆన్లైన్లోనూ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన టీవీలపై రూ.7వేల వరకు, లాప్ట్యాబ్లపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.1,599కే స్మార్ట్ వాచ్లను పొందవచ్చు. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 7.5% వరకు తక్షణ క్యాష్బ్యాక్ పొందవచ్చు. ప్రజల నిత్య జీవనంలో కీలకమైన సెల్ఫోన్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సామాన్యులకు అందజేయడంలో బి న్యూ ముందంజలో ఉంటుందని సంస్థ సీఎండీ యరగుంట్ల బాలాజీ చౌదరి తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 150పైకి షో రూమ్లను కలిగి ఉన్నాము. తర్వలోనే మరిన్ని షోరూంలను అందుబాటులోకి తీసుకొస్తాము. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజలకు సెల్ఫోన్లను తక్కువ ధరలకే అందించేందుకు గ్రామీణ మార్కెట్పై ప్రత్యేక దృష్టిని సారించాము’’అని బాలాజీ పేర్కొన్నారు. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా
సాక్షి,ముంబై: రానున్న పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మారుతి సుజుకి మారుతి కొన్ని మోడల్లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ను కూడా అందిస్తోంది. హ్యుందాయ్ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్లు అందించనుంది. టాటా మోటార్స్ టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు.దీంతోపాటు, రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు. గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, 75శాతం డిస్కౌంట్తో మరో సేల్!
కొనుగోలు దారులకు బంపరాఫర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు పోటీ పడి వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్నాయి. అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈసేల్లో శాంసంగ్, రియల్మీ, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన టీవీలపై టెలివిజన్, హోం అప్లయన్సెస్పై 75శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పింది. కండీషనర్ల(షాంపూలు)పై 55శాతం వరకు డిస్కౌంట్, మైక్రోవేవ్లపై 55శాతం, ఎయిర్ కండీషనర్లపై 55శాతం, వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాస్లపై 10శాతం నుంచి 70శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని అన్నారు. క్రేజీ డీల్స్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో 'క్రేజీ డీల్స్' పేరుతో 12ఏఎం, 8ఏఎం, 4పీఎంలలో ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహించనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. 'రష్ అవర్స్' 2ఏఎంలో కొనుగోలు చేసిన ప్రొడక్ట్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. -
స్వీట్ 16: త్వరపడండి అంటూ ఊరిస్తున్న ఇండిగో!
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో విమాన టికెట్లను సందించే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘స్వీట్ 16’ అంటూ తన కస్టమర్లను ఊరిస్తోంది. కేవలం రూ. 1616 ప్రారంభ ధరతో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. యానివర్సరీ ఆఫర్గా అందిస్తున్న ఈ సేల్ ఆగస్ట్ 5 వరకే ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఇండిగోట్వీట్ చేసింది. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) ఇండిగో సర్వీసులు ప్రారంభించి 16 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ తీసుకు రావడం విశేషం. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్ట్ 3న ప్రారంభమై ఆగస్ట్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో రూ. 1616 ప్రారంభ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. ఇది కూడా చదవండి: నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ అలాగే హెచ్ఎస్బీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు రూ. 800 వరకు క్యాష్బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆగస్ట్ 18 నుంచి 2023 జూలై 16 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ఇండిగో ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికట్ల ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Our #Sweet16 is here and we’ve got a sweet deal for you. 🎉🎉 Book your flights with fares starting at ₹1,616*. Don’t wait up, offer only valid till 5th August, 2022 for travel between 18th August, 2022 and 16th July, 2023. https://t.co/ViwbeYHuhQ#6ETurns16 #LetsIndiGo pic.twitter.com/CsekvQJtsx — IndiGo (@IndiGo6E) August 3, 2022 -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022కు తెరతీసింది. నేటి (జూలై 23న) అర్థరాత్రి నుంచిబిగ్ సేవింగ్డేస్ సేల్ షురూ కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్లో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై డిస్కౌంట్లు, స్పెషల్ డీల్స్ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకు తగ్గింపును, టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్, వివో, మోటరోలా తదితర స్మార్ట్ఫోన్లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది. అలాగే హెడ్ఫోన్లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్ స్క్రీన్ టాబ్లెట్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. అంతేకాదు సేల్ ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తాజా డీల్స్ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్బిఎల్ బ్యాంక్ కార్డ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ‘ప్లస్’ సభ్యుల కోసం ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 23 అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
విద్యార్ధులకు, తల్లిదండ్రులకు యాపిల్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ టీచర్లకు,విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు 'బ్యాక్ టూ స్కూల్' ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 22 వరకు జరిగే ఈ ఆన్లైన్ సేల్లో యాపిల్ ప్రొడక్ట్లను భారీ డిస్కౌంట్లకే అందిస్తుంది. యాపిల్ ప్రత్యేకమైన అమ్మకాల్లో జత యాపిల్ ఎయిర్ పాడ్ను ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు 6నెలల వరకు యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ను ఫ్రీగా పొందవచ్చు. యాపిల్ కేర్ ప్లస్లో జరిపే మాక్ బుక్ ఎయిర్,ఐమాక్,మాక్ మిని,మాక్ స్టూడియో ప్రొడక్ట్లపై 20శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా యాపిల్ ఎడ్యుకేషన్లో అమ్మే మాక్,ఐపాడ్, యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ల వంటి ఉత్పత్తులపై టీచర్లకు, ఫ్యాకల్టీ,స్టాఫ్, హోం స్కూల్ టీచర్లు, గ్రేడ్ లెవల్, యూనివర్సిటీ లెవల్ స్టూడెంట్లతో పాటు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది బ్యాక్ టూ స్కూల్లో డివైజ్లు, డిస్కౌంట్లు బ్యాక్ టూ స్కూల్ పేరుతో యాపిల్ సంస్థ మాక్బుక్ ప్రో 13పై రూ.10వేల డిస్కౌంట్ను అందిస్తుంది. మాక్ బుక్ ప్రో అసలు ప్రారంభ ధర రూ.1,29,900 ఉండగా.. డిస్కౌంట్తో రూ.1,19,900కే సొంతం చేసుకోవచ్చు. మాక్ బుక్ ప్రో 14పై రూ.19,490 వరకు డిస్కౌంట్కే కొనుగోలు చేసే సౌకర్యం ఉండగా.. ఈ డివైజ్ అసలు వాస్తవ ప్రారంభ ధర రూ.1,94,900 ఉండగా డిస్కౌంట్ తో రూ.1,75,410కే కొనుగోలు చేయోచ్చు. మాక్ బుక్ ప్రో 16 అసలు వాస్తవ ప్రారంభ ధర రూ.2,39,900 ఉండగా.. రూ.23,990 డిస్కౌంట్తో రూ.2,15,910కే లభ్యం అవుతుంది మాక్ బుక్ ఎయిర్(ఎం1) ధర రూ.99,900 ఉండగా.. ఇప్పుడు అదే డివైజ్ను రూ.10వేల డిస్కౌంట్తో రూ.89,900కే దక్కించుకోవచ్చు. మాక్ బుక్ ఎయిర్ (ఎం2) అసలు వాస్తవ ధర రూ.1,19,900 ఉండగా యాపిల్ నిర్వహిస్తున్న బ్యాక్ టూ స్కూల్ ఆఫర్ సేల్లో రూ.10వేలు డిస్కౌంట్తో రూ.1,09,900కే పొందవచ్చు. ఐ మాక్ అసలు ప్రారంభ ధర రూ.1,19,900 ఉండగా రూ.11,990 డిస్కౌంట్తో రూ.1,07,910కే కొనుగోలు చేయోచ్చు. యాపిల్ ఐపాడ్ ప్రో అసలు ప్రారంభం ధర రూ. 71,900 ఉండగా రూ.3,600 డిస్కౌంట్తో రూ.68,300కే యాపిల్ అందిస్తుంది. ఐపాడ్ ఎయిర్ అసలు ప్రారంభ ధర రూ.54,900 ఉండగా ఈసేల్లో రూ.4120 డిస్కౌంట్తో రూ.50,780కే కొనుగోలు చేయోచ్చు. వీటితో పాటు అర్హులైన కస్టమర్లు కొనుగోలు చేసిన ఎయిర్ పాడ్స్ను రూ.6,400 నుంచి రూ.12,200లు చెల్లించి అప్గ్రేడ్ చేసే సౌకర్యాన్ని ఈ సేల్ సందర్భంగా యాపిల్ సంస్థ కల్పిస్తుంది. -
ఐఫోన్-13 పై బంపరాఫర్!
ఐఫోన్-13ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. అమెరికాలోని టెలికమ్యునికేషన్స్ హోల్డింగ్ కంపెనీ ఏటీ అండ్టీ ఐఫోన్-13పై భారీ ఆఫర్ అందిస్తోంది. నెలకు కేవలం 2.78 డాలర్ల ఈఎంఐతో ఐఫోన్ను సొంతం చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్లో ఆపిల్ సంస్థ ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్ అమ్మకాలు నిర్విరామంగా కొనసాగుతుండగా.. అమెరికాకు చెందిన ఏటీ అండ్ టీ సంస్థ 128జీబీ ఐఫోన్-13 వేరియంట్ ఫోన్లపై ఆఫర్ను అందిస్తుంది. ఐఫోన్-13 స్పెసిఫికేషన్లు ♦ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ♦లైడార్ సెన్సార్ ♦5 జీ కనెక్టవిటీ సపోర్ట్ ♦వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ♦పవర్ ఎఫిసియంట్ ఎల్టీవో డిస్ప్లే ♦ఏ15 బయోనిక్ చిప్సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్ప్లే ♦ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ -
అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్!
Reliance Digital Discount Days Sale, ముంబై: రిలయన్స్ డిజిటల్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ‘‘డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్’’ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై బెస్ట్ డీల్స్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5% వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అదనంగా రూ.రెండు వేల విలువైన కూపన్స్ ఇస్తారు. రూ.80 వేల కంటే ఎక్కువ కొంటే రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్ ఇస్తారు. టీవీలు, స్మార్ట్ఫోన్స్, ల్యాప్ట్యాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈఎంఐ పద్ధతిలోనూ ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. సరికొత్త శామ్సంగ్గెలాక్సీ ఎస్22+ గ్రీన్ కలర్ వేరియంట్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 84,999గా ఉంది. ఈ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధర(ప్రారంభ ధర రూ.61,900)కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్లు, డిస్కౌంట్లు రిలయన్స్ డిజిటల్, జియో సోర్ట్స్లతో పాటు www. reliancedigital. in లేదా www. jiomart. com వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. -
విజయ్లో ఉగాది సేల్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ విజయ్ ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టోర్లతో పాటు ఇ-కామర్స్ వెబ్సైట్ www.vijaysales.comలో ఉగాది-ప్రత్యేక విక్రయాలను అందిస్తోంది. గరిష్టంగా ఎలక్ట్రానిక్స్పై 60% వరకు తగ్గింపును అందిస్తుంది. అంతేకాదు విజయ్ సేల్స్తో షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్లతో పాటు లాయల్టీ పాయింట్ల వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎయిర్ కండీషనర్లు, కూలర్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. 2022 ఏప్రిల్ 2 నుంచి 4 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తక్షణ తగ్గింపులు, ఆకర్షణీయమైన క్యాష్బ్యాక్ ఆఫర్లను కష్టమర్లు వినియోగించుకోవాలని ‘విజయ్’ కోరింది. -
వాహనదారులకు అలర్ట్.. చలాన్లు ఇంకా కట్టలేదా..?
నిర్మల్ (చైన్గేట్) : కోవిడ్ ఆంక్షలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలాన్ ద్వారా వేసిన జరిమానాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31 వరకు ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మార్చి1 నుంచి వర్తింపజేసిన రాయితీని జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 45 శాతం మందే వినియోగించుకున్నారు. మరో 55 శా తం మంది ఇంకా స్పందించడం లేదు. జిల్లా వ్యా ప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినందుకు పోలీసులు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించారు. అ యితే ఈ చలాన్ చెల్లింపునకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. దీంతో గడిచిన 25 రోజుల్లో జరిమానా విధించిన వారిలో సగం మంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు ముందుకు రాని పరిస్థితి. ఈ–చలాన్పై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ 38 నెలల కాలంలో... పోలీసులు 38 నెలల కాలంలో 4,41,996 ఈ–చలానా కేసులు నమోదు చేయగా రూ.20 కోట్లకు పై గా వసూలు కావాల్సి ఉంది. కానీ వీరిలో 2,76,659 మంది మాత్రమే 25 రోజుల్లో రాయితీతో కూడిన రూ.7,32,70,585 పెండింగ్లో ఉన్న ఈ– చలాన్ జరిమానా చెల్లించారు. అంటే 50 శాతం మంది కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలోగా మరో 1,65,337 కేసులకు సంబంధించిన ఈ–చలనా డబ్బులు 13,30,40,955 చెల్లించాల్సి ఉంది. జరిమానాలు ఇలా.. కరోనా, లాక్ డౌన్ సమయంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి ఈ చలానా రూ.1000 విధించా రు. ఇందులో వారు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు మిగిలిన రూ.900 మాఫీ వర్తిస్తుంది. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలకు 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 50 శాతం మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు వాహనాలకు విధించిన చలానా చెల్లించేందుకు ఆన్లైన్లో తెలంగాణ శాఖకు చెందిన http:// echalian. tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో వాహనం నంబరు ఎంటర్ చేయగానే పెండింగ్ చలానాల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పెండింగ్ చలాన్ల సంఖ్య, మొత్తం జరిమానాతో పాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలన్నీ వస్తాయి. పేమెంట్పై క్లిక్ చేయగానే గేట్వేలు కనిపిస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. సద్వినియోగం చేసుకోండి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు సద్విని యోగం చేసుకోవాలి. ఈ నెల 31లోగా రాయితీ చలాన్లు చెల్లించకపోతే గడువు ముగిసిన తర్వాత పోలీసులు విధించిన మొత్తం జరిమానా చెల్లించా ల్సి ఉంటుంది. – రావుల దేవేందర్, ట్రాఫిక్ ఎస్సై -
మండిపోతున్న ఎండలు 50 శాతం డిస్కౌంట్తో వస్తున్న ఏసీలు ఇవే
మార్చి చివర్లోకి వచ్చామో లేదా భానుడి ప్రతాపం మొదలైంది. చూస్తుండగానే సుర్రుమనే ఎండలు పెరిగిపోయాయి. గదిలో తిరిగే ఫ్యాను ఉక్కపోత నుంచి ఉపశమనం ఇవ్వలేపోతుంది. ఎయిర్ కండీషన్కి వెళ్ధామంటే సీజన్ ప్రారంభం కావడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అయితే అమెజాన్లో యాభై శాతం ఆఫర్తో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఏసీల వివరాలు మీ కోసం.. Lloyd 1.5 Ton 3 Star, Wi-Fi, Inverter Split AC - లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2021 సీజన్లో మార్కెట్లో వచ్చినప్పడు ధర రూ.65,999లు కానీ ప్రస్తుతం అమెజాన్లో 50 శాతం ఆఫర్తో రూ.32,.999కే లభిస్తోంది. అంతేకాదు పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులపై క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఏసీకి సంబంధించిన ఫీచర్లు పరిశీలిస్తే కాపర్ కంప్రెసర్, వైఫై ఏనేబుల్, ఆటోమేటిక్ హ్యుమిడిటీ కంట్రోల్, యాంటీ వైరల్, హెపా ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీలో 3 స్టార్ రేటింగ్ ఉంది. ప్రొడక్టు మీద ఏడాది, కంప్రెసర్ మీద పదేళ్ల వ్యారంటీ ఉంది. TCL 1.5 Ton 5 Star - టీసీఎల్ 1.5 టన్ ఏసీ 2021 మోడల్ ఏసీ ప్రారంభ ధర రూ.50,999లు ఉండగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్తో రూ. 31,999 దగ్గర అమెజాన్లో లభిస్తోంది. పలు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ద్వారా మరికొంత తగ్గింపు లభిస్తుంది. టీసీఎల్ 1.5 టన్ ఏసీలో కాపర్ కంప్రెషర్, విటమిన్ సీ, సిల్వర్ ఐయాన్ ఫిల్టర్, వైఫై, ఆల్ట్రా ఇన్వెర్టర్, గూగుల్ అసిస్టెంట్, స్మార్ట్ ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియేన్సిలో 5 స్టార్ రేటింగ్ కలదు. కేవలం 30 సెకన్లలో గది ఉష్ణోగ్రతను 27 సెల్సియస్ డిగ్రీల నుంచి 18 సెల్సియస్ డిగ్రీలకు తెస్తుందని టీసీఎస్ చెబుతోంది Whirlpool 1 Ton 3 Star - వర్ల్పూల్ 1 టన్ ఏసీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ధర రూ. 58,300లు ఉండగా ప్రస్తుతం 44 శాతం డిస్కౌంట్తో 25,810లకే వస్తోంది. ఈ ఏసీకి ఫీచర్లు పరిశీలిస్తే.. కాపర్ కంప్రెషర్, ఆల్ట్రా ఎన్ఎక్స్టీ వైఫై, కాపర్ ఇన్వెర్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీకిలో 3 స్టార్ రేటింగ్ ఉంది. LG 1.5 Ton 5 Star AI DUAL Inverter - ఎల్జీ 1.5 టన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ధర రూ.58,490 ఉండగా ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్తో రూ.46,590కే లభిస్తోంది. ఇందులో అధునాతమైన ఫీచర్లను ఎల్జీ పొందు పరిచింది. వాటిని పరిశీలిస్తే టచ్ ఫ్రీ ఆపరేషన్, ఆరు కూలింగ్ ఫీచర్లు, 6 స్టెప్ ఎనర్జీ కంట్రోల్, కంట్రోల్ ఏసీ ఎనీటైం, ఎనీవేర్, యాంటీ వైరస్ ప్రొటెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. పవర్ సేవింగ్లో 5 స్టార్ రేటింగ్ ఉంది. LG 1.0 Ton 5 Star DUAL Inverter Wi-Fi Window AC - ఇక స్మార్ట్ విండో ఏసీలకు సంబంధించి ఎల్జీ వన్ టన్ ఆర్టిఫిషియల్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీపై ఏకంగా 49 శాతం తగ్గింపు ఉంది. ఈ ఏసీ ఎంఆర్పీ రూ.56,999 ఉండగా అమెజాన్లో రూ.27,810కే లభిస్తోంది. తక్కువ శబ్ధంతో పని చేసే ఈ ఏసీ 5 స్టార్ రేటింగ్తో అందుబాటులో ఉంది. విండో ఏసీల్లో స్మార్ట్ ఫీచర్లు దీని ప్రత్యేకత. -
ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!!
మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3,099కే అందిస్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది. రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్పై ఆఫర్లు దేశీయ మార్కెట్ ప్రకారం..4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ధర రూ.16,099గా ఉంది. అయితే కొనుగోలు దారులు అతితక్కువ ధరకే సొంతం చేసుకునేలా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్ ధర కంటే భారీగా తగ్గనుంది. కొనుగోలు దారులు రియల్ మీ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్తో ఫోన్ ధర వెయ్యి తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.ఇక మీ పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా మీ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఉంటే.. రియల్ మీ రూ.3వేలకే పొందవచ్చు. చదవండి: ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి డిజియర్ మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మారుతి సుజుకి వితారా బ్రెజ్జా మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
ఫ్లిప్ కార్ట్లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!!
మార్చి 18న జరగాల్సిన హోలీ వారం రోజుల ముందే వచ్చేసింది. ఉక్రెయిన్ -రష్యా దేశాల యుద్ధం కారణంగా దేశీయంగా మండి పోతున్న ధరల నుంచి ఉపశమనం పొందేలా వినియోగదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బంపరాఫర్లు ప్రకటించింది. హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మార్చి12 నుంచి మార్చి 16వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ను ప్రారంభించనుంది. ఈ సేల్లో పలు ప్రొడక్ట్లపై భారీ ఎత్తున అంటే 80శాతం డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఈ సేల్స్లో దిగ్గజ కంపెనీల స్మార్ట్ ఫోన్లు యాపిల్, రియల్ మీ,ఒప్పో,శాంసంగ్ 60శాతం వరకు డిస్కౌంట్కే అందించనున్నట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్లో స్మార్ట్ వాచెస్ పై 60శాతం, ట్రిమ్మర్స్ అండ్ షేవింగ్ కిట్లపై 70శాతం,ల్యాప్టాప్స్ పై 40శాతం, వన్ ప్లస్,బోట్,జేబీఎల్, రియల్ మీకి చెందిన ఫోర్టబుల్ స్పీకర్స్, హెడ్ ఫోన్స్పై 80 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. మిగిలిన ఉత్పత్తులపై హోలీ సందర్భంగా చేసే షాపింగ్లో దుస్తులపై 80శాతం డిస్కౌంట్ అందిస్తుండగా, హోమ్, కిచెన్ ఎషెన్షియల్, ఫర్నీచర్, జిమ్, న్యూట్రిషియన్, గ్రాసరీస్ను డిస్కౌంట్లలో కొనుగోలు చేయోచ్చు. ఆఫర్లో ఇంకా మార్చి 12 శనివారం తెల్లవారు జామున 2గంటల నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ప్రారంభం కానుంది. ఈ సేల్ ప్రారంభం నుంచి ప్రతి రోజు తెల్లవారు జాము 12ఏమ్, 8ఏమ్, 4పీఎం కొత్త డీల్స్ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రష్ అవర్లో ఎర్లీ బర్డ్స్ సేల్స్లో మరిన్ని డిస్కౌంట్లను అందిస్తామని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు. చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్లు!! -
హలో.. గుడ్ ఈవినింగ్.. ప్లీజ్.. థ్యాంక్యూ అంటే చాలు.. ఇక్కడ రేట్లు తగ్గిస్తారు !
ఒకటి కొంటే ఒకటి ఉచితం, పండగ ప్రత్యేక తగ్గింపు లాంటి ఆఫర్లు మనమిప్పటి వరకు చూశాం. కానీ బ్రాండ్ ప్రమోషన్తో పాటు సోషల్ అవైర్నెస్ పెంచేందుకు హైదరాబాద్కి చెందిన ఓ రెస్టారెంట్ ఇస్తున్న ఆఫర్ నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. దీంతో ఈ రెస్టారెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. నగరంలోని ఐటీ కారిడార్లో ఉన్న ఖాజాగూడలో ఇటీవల దక్షిణ్ 5 పేరుతో ఓ రెస్టారెంట్ని ప్రారంభమైంది. దీని ఓనర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెరైటీ డిస్కౌంట్లు ప్రకటించారు. చూడటానికి కొత్తగా ఉన్న ఈ డిస్కౌంట్లు అందిస్తున్న తీరు దాని వెనుక దాగున్న పరమార్థం తెలుసుకున్న వారు ఈ రెస్టారెంట్ ఓనర్లను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పాజిటివ్ వైబ్స్ ఈ రెస్టారెంట్కి వచ్చిన కష్టమర్లు ఆర్డర్ చేసే సమయంలో ప్లీజ్, థాంక్యూ, హావ్ ఏ నైస్డే, గుడ్మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ వంటి పదాలు వాడుతూ ఆర్డర్ చేస్తే ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. ఉదాహారణకి ఈ హోటల్కి వెళ్లి మెనూ కార్డు చూసి థాళీ ఆర్డర్ చేస్తే బిల్ రూ. 275 అవుతుంది. అదే థాళీ ప్లీజ్ అని ఆర్డర్ చేస్తే రూ.20 డిస్కౌంట్తో థాళీ రూ. 255కే లభిస్తుంది. అలా కాకుండా గుడ్ ఈవినింగ్ ఏ థాళీ ప్లీజ్ అని ఆర్డర్ చేస్తే మరో రూ.10 అదనపు డిస్కౌంట్తో థాళీ కేవలం రూ. 240కే వస్తుంది. ఇలా అన్ని పదార్థాలపై ఈ తరహా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ ఎందుకంటే హోటల్స్, రెస్టారెంట్లలో మనకు సర్వ్ చేసే వ్యక్తులతో మర్యాదగా మెలగడం అనేది కామన్సెన్స్. కానీ క్రమంగా అది కనుమరుగైపోతుంది. చాలా సార్లు చేయని తప్పుకి సర్వర్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సంరద్భాల్లో వారిని మనుషులుగా కూడా గౌరవించరు. ఈ పద్దతిలో మార్పు తెచ్చేందుకు ఈ కొత్త రకం డిస్కౌంట్లు అందిస్తున్నామని రెస్టారెంట్ నిర్వాహాకులు అంటున్నారు. అంతేకాదు ఈ డిస్కౌంట్ల వల్ల కస్టమర్లు సైతం త్వరగా ప్రశాంత వదనం అలవరుచుకుంటున్నారని, అప్రయత్నంగా వారి మోములో చిరునవ్వులు పూస్తున్నాయంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Must see for #Foodies in #Hyderabad. Dakshin 5 restaurant in Khajaguda introduces 'Courtesy #Discounts'. Say "please" to get ₹15 discount. Say "Good Afternoon & a thali please" get ₹30 disc. More courtesies, more discounts. Also flat discs on total bill for elders=to their age. pic.twitter.com/iQvgYIMZ4F — Krishnamurthy (@krishna0302) March 5, 2022 మరో ఆఫర్ ఈ కుటుంబ సమేతంగా భోజనాలకు వచ్చే వారి కోసం ఎల్డర్ ది బెటర్ ఆఫర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందని కొందరు కస్టమర్లు అంటున్నారు. ఈ ఆఫర్ ప్రకారం ఫ్యామిలీ లేదా గ్రూపుగా ఈ రెస్టారెంట్ వెళ్లే వారిలో పెద్ద వయసు వారు ఉన్నట్టయితే వారి వయస్సుని బట్టి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ట్రెండింగ్లో ఈ కొత్త రకం ఆఫర్ల వెనుక వ్యూహాం ఏదైనా సరే.. ఇటీవల రోజుల్లో ఏ రెస్టారెంట్కి దక్కని ప్రచారం దక్షిణ్ 5కి లభిస్తోంది. ఐటీ సెక్టార్లో ఉన్న రెస్టారెంట్ కావడంతో ఇక్కడికి వెళ్లిన వారు.. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనతి కాలంలోనే ఇది జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. ఎంతో ఖర్చు చేస్తే కూడా రాని బ్రాండ్ ఇమేజ్ సోషల్ అవేర్నెస్తో కూడిన వెరైటీ డిస్కౌంట్తో వచ్చింది. Say please, thank you, have a nice day, .....show common #courtesies and get discounts on your food ordered in this Hyderabadi restaurant #Dakshin5, a one stop restaurant for 5 #SouthernStates of #India #Idea #Restaurant #Promotion #NewIdea #HyderabadRestaurants #HyderabadFood pic.twitter.com/ZIP78fxWn2 — D. Ramchandram (@Dramchandram) March 5, 2022 చదవండి: 47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్! -
అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్తో అమెజాన్ సేల్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, యాక్సెసరీస్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28వరకు జరగనున్న ఈసేల్లో శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ, రియల్ మీ తోపాటు ఇతర బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ.1000వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్ట్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అవకాశం కల్పిస్తుంది. స్మార్ట్ఫోన్ డీల్స్ అమెజాన్ ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్5 ధర రూ.20,990 ఉండగా, ఐక్యూ జెడ్3 రూ.17,990కే అందిస్తుంది. ఈ రెండు ఫోన్ల ధరలపై సుమారు రూ.3వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. రియల్ మీ నార్జో 50ఏ రూ.11,599 ఉండగా రూ.500 డిస్కౌంట్తో రూ.10,999కే పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.11,499 ఉండగా రూ.2000 డిస్కౌంట్తో రూ.9,499కే పొందవచ్చు. ఒప్పో ఏ 15ఎస్ ధర రూ.13,9990 ఉండగా రూ.9,990కే సొంతం చేసుకోవచ్చు. ఇవి కాకుండా, వన్ ప్లస్ 9 సిరీస్ కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ని ఉపయోగించి రూ.8,000 వరకు తగ్గింపు పొందవచ్చు. తాజా వన్ ప్లస్ 9ఆర్టీ పై రూ.4,000, వన్ప్లస్ నార్డ్ సీఈ2 5జీ పోన్ను ఐసీఐసీ ఐ క్రెడిట్ కార్డ్లపై రూ.1500 తగ్గింపుతో పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. సేల్ సమయంలో, అమెజాన్ పవర్ బ్యాంక్లు, హెడ్ఫోన్లు, ఇతర ప్రొడక్ట్లపై 60 శాతం వరకు తగ్గింపుకే అందిస్తుంది. స్మార్ట్ టీవీలపై పెద్ద డిస్కౌంట్లు,ఈఎంఐ సదుపాయాల్ని కల్పిస్తుంది. శాంసంగ్ ఫ్రేమ్ క్యూఎల్ఈడీ టీవీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లపై రూ.5 000 క్యాష్బ్యాక్తో, అమెజాన్ కూపన్లను ఉపయోగించి అదనంగా రూ. 1750 తగ్గింపుతో లభిస్తుంది. -
ఐపోన్ లవర్స్కు శుభవార్త, అమెజాన్లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు!!
యాపిల్ ఐపోన్ లవర్స్కు శుభవార్త. అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారులకు భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు స్మార్ట్ఫోన్పై రూ.11,000 వరకు డిస్కౌంట్తో పాటు ఇతర ఆఫర్లను పొందవచ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలనుకుంటే క్యాష్బ్యాక్ రూపంలో రూ.6000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధర రూ.68,900 ఉండనుంది. ఐఫోన్13 256జీబీ వేరియంట్ను రూ.78,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్లు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించవచ్చు. 512జీబీ వేరియంట్ను రూ. 98,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రకారం వినియోగదారులు ఐఫోన్13 కొనుగోలు చేసిన 90రోజులలోపు వారి క్రెడిట్ కార్డ్లకు లేదా బ్యాంక్ అకౌంట్లలో రూ.6వేలు జమ అవుతాయి. అంతే కాకుండా స్మార్ట్ఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు పొందడానికి కస్టమర్లు ఎక్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. అమెజాన్లో ఎక్ఛేంజ్ ఆఫర్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లతో సహా అన్ని మోడల్స్ కు వర్తిస్తుందని అమెజాన్ తెలిపింది. కస్టమర్లు తమ పాత స్మార్ట్ఫోన్ పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఎక్ఛేంజ్ స్మార్ట్ఫోన్ మోడల్పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో, ఆపిల్ ఐఫోన్ 13 కూడా రూ.5000 తగ్గింపుతో రూ.74,900కి విక్రయిస్తోంది. వాల్మార్ట్ యాజమాన్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఐఫోన్ 13 కొనుగోలుపై 5శాతం క్యాష్బ్యాక్ పొందడానికి కస్టమర్లు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించవచ్చు. -
వచ్చేసింది ఫ్లిప్కార్ట్ సేల్..అదిరిపోయే ఆఫర్స్! 80 శాతం డిస్కౌంట్!!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 23నుంచి ఫ్రిబ్రవరి 28వరకు ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్పై 80శాతం భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. 6 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్పై 80శాతంతో పాటు ఎస్ బ్యాంక్,స్లైస్ వీసా, ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వినియోగంతో 10శాతం డిస్కౌంట్ను అదనంగా పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ సేల్లో ప్రత్యేకంగా ల్యాప్ టాప్ కొనుగోళ్లపై రూ.30వేలు విలువ చేసే కొనుగోలు దారులకు ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు అందించే ఐటీ కోర్స్ లను ఉచితంగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ల్యాప్ ట్యాప్, డెస్క్ట్యాప్, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, స్మార్ట్ వాచెస్, కెమెరా యాక్ససరీస్తో పాటు ఇతర ప్రొడక్ట్లపై భారీ ఎత్తున డిస్కౌంట్ లను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!
ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటామోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్కు చెందిన పలు కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాల్ని చవిచూసింది.కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ.1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే ఈ నష్టాల్ని మరింత తగ్గించి లాభాల బాట పట్టేలా కొనుగోలు దారులకు ఆఫర్లను అందిస్తుంది. తాజాగా గణనీయమైన తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు పలు మోడళ్ల ఆధారంగా రూ.60,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ నివేదించింది. టాటా హారియర్ 2021 డీజిల్ వెహికల్ టాటా హారియర్ మోడల్ కారుపై రూ.20వేల వరకు నగదు ప్రయోజనాలు కలుపుకొని రూ.60వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక 2022 మోడల్ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ లో రూ.40వేల వరకు,డార్క్ ఎడిషన్ రూ. 20,000 వరకు ఎక్ఛేంజ్, ఎస్యూవీలో కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ 2021 మోడల్ సఫారీలలోరూ.60,000 వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని, దీంతోపాటు 2022 మోడల్ టాటా సఫారీ కారుపై రూ.40,000వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని పొందవచ్చు. టాటా టియాగో సెడాన్ కార్ల విభాగంగా కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న నాలుగు డోర్ల టాటా టియాగో కారుపై టాటా మోటార్స్ ఆఫర్లు ప్రకటించింది. కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వేరియంట్లు మినిహాయించి మిగిలిన కార్లపై రూ.25వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా నెక్సాన్ ఇక టాటా కార్లలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మరో కార్ నెక్సాన్. లుక్స్తో పాటు దాని పనితీరు కారణంగా కొనుగోలు దారులు నెక్సాన్ ను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే టాటా మోటార్స్ సైతం కొనుగోలుదారుల కోసం నెక్సాన్ డీజిల్ వెహికల్పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15,000, కాంపాక్ట్ ఎస్యూవీ కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.10,000 వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. -
ఫ్లిప్కార్ట్లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!
ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితమే 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సేల్తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ "బిగ్ బచత్ ధమాల్" సేల్ను ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిరహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్లో భాగంగా ఫ్యాషన్ దుస్తులు, టీవీలు, సౌందర్య ఉత్పత్తులు, హోమ్, కిచెన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్లో ప్రత్యేకంగా టీవీల మీద అందిస్తున్న ఆఫర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► ఎంఐ 4ఏ ప్రో: ఎంఐ 4ఏ ప్రో 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవి రూ.16,999 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టివి అసలు ధర రూ.19,999, అంటే మీరు ఈ స్మార్ట్ టివి మీద 15 శాతం తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ► సోనీ బ్రావియా: సోనీ బ్రావియా డబ్ల్యూ820 108 సెం.మీ(43 అంగుళాలు) టీవి అసలు ధర కంటే రూ.6 వేలు తక్కువ(రూ.28,999) ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.34,900గా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు. ► వన్ ప్లస్ వై సిరీస్: వన్ ప్లస్ వై సిరీస్ 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.27,999 నుంచి రూ.22,499కు తగ్గింది. ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలపై మీరు అదనంగా రూ.2000 తగ్గింపు పొందవచ్చు. ► వు ప్రీమియం: వు ప్రీమియం 139 సెం.మీ(55 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.75,000 నుంచి రూ.42,990కు తగ్గింది. ఈ స్మార్ట్ టివి మీద మీకు సుమారు 42 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎల్ జీ 108 సెం.మీ స్మార్ట్ టీవి, రియల్ మీ 108 సెం.మీ స్మార్ట్ టీవి మీద మంచి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
ఫ్లిప్కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్'లో వాటిపై అదిరిపోయే ఆఫర్స్..!
తాజాగా ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తూ ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరుతో మరో ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. నిన్ననే ముగిసిన బిగ్ సేవింగ్ డేస్ తర్వాత ఈ సేల్ ప్రకటించడం విశేషం. ఫ్లిప్కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' జనవరి 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్లో మీకు మొబైల్ కవర్, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యుఎస్, ల్యాప్ టాప్, కెమెరాల వంటి వాటి మీద అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా సేల్కు పోటీగా ఈ సేల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ కూడా జనవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ల్యాప్ టాప్స్ మీద 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డెల్ ఇన్ స్పిరాన్ రైజెన్ 5, డెల్ ఇన్ స్పిరాన్ వోస్ట్రో కోర్ ఐ3 11వ-జెన్, ఇన్ స్పిరాన్ కోర్ ఐ3 11వ జెన్ మోడల్స్ మీద ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హెచ్పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో సహా కొన్ని ప్రముఖ బ్రాండ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే,యాపిల్,శామ్ సంగ్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్, సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు, బ్లూటూత్ స్పీకర్ల మీద వరుసగా 30 శాతం, 40 శాతం, 60 శాతం, 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ మీద కూడా ఆఫర్స్ లభిస్తున్నాయి. డిఎస్ఎల్ఆర్ & మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ సేల్లోఫిట్ నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్లను రూ.1,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.699 నుంచి పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. చివరగా, మొబైల్ కేసులు మరియు కవర్లు కేవలం రూ.99 నుండి అందుబాటులో ఉంటాయి. (చదవండి: టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!) -
యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!
మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొబైల్స్ మీద ఏకంగా రూ.15 వేల తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ 11 సిరీస్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఐఫోన్ 13 సిరీస్ మీద రూ.23 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మొబైల్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 10ఆర్ సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు ఆఫర్స్ కూడా కేవలం ఇండియాస్టోర్ మాత్రమే లభిస్తున్నాయి. ఐఫోన్ 11 64జీబీ స్టోరేజీ అసలు ధర రూ.49,900 అయితే, ఇండియాస్టోర్ నెట్ వర్క్ స్టోర్లలో మీరు దీనిని రూ. 34,900 వరకు పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.4,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.45,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 7 128 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ రూపంలో రూ.11,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.34,900కు తగ్గుతుంది. అలాగే, మీరు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ కొనాలని చూస్తుంటే? దాని అసలు ధర రూ.1,29,900గా ఉంది. మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.1,24,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 10ఆర్ 64 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.18,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.1,06,900కు తగ్గుతుంది. (చదవండి: క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!) -
వ్యాక్సిన్ వేసుకున్న వారికి గోఎయిర్ బంపర్ ఆఫర్..!
ముంబై: భారతదేశంలోని ముంబై కేంద్రంగా స్థాపించిన గోఎయిర్ విమానాయాన సంస్థ విమానయాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కరోనా టీకాలు వేసుకున్న ప్రయాణీకులకు 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గోఎయిర్ దేశీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణీకులు గోవక్కి పథకాన్ని(GOVACCI Scheme) ఉపయోగించడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్ భారతదేశంలో ప్రయాణించే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం లేదా ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ యాప్లో వ్యాక్సినేషన్ స్టేటస్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గో ఫస్ట్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అని కంపెనీ తెలిపింది. భారతదేశం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటడంతో ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో 54 పైగా కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో, గత వారం వచ్చిన కొత్త కోవిడ్-19 కేసులలో సుమారు 73 శాతం ఓమిక్రాన్ కేసులకు సంబంధించినవే. (చదవండి: ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్లో ఎస్-400 మోహరింపు!) -
బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
సురేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు నచ్చిన బిర్యానీని ఆరగించేందుకు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్న ఆ ఇద్దరికి సడెన్గా రోడ్డు పక్కనే తాటికాయంత అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకర్షించింది. రెండు పార్శిళ్లు బిర్యానీ ఆర్డర్ ఇవ్వండి. ఒక బిర్యానీ పార్శిల్కే బిల్ కట్టండి' అంటూ ఫ్లెక్సీలోని ప్రకటన సారాంశం. అంతే డిస్కౌంట్లో బిర్యానీ వస్తుందని ఏమాత్రం ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ చేశారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నరేగాన్ (Naregaon) అనే ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే థామస్ కు స్థానికంగా ప్రాచుర్యం పొందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వెజ్, నాన్ వెజ్లో బిర్యానీతో పాటు పలు వంటకాలపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలుసుకున్నాడు. అంతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో అకౌంట్లో ఉన్న రూ.89,000 మాయమయ్యాయి. దీంతో థామస్ కంగారు పడుతూ ఎంఐడీసీ(Maharashtra Industrial Development Corporation) స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ..బాధితుడు తన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, అనంతరం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిపారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదని ఏ మాత్రం అశ్రద్ధ వహించిన బ్యాంక్ అకౌంట్ల ఉన్న సొమ్ము క్షణాల్లో మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. లేదని లైట్ తీసుకుంటే మోసపోతారని సూచిస్తున్నారు. సైబర్నేరాల్ని గుర్తించడం చాలా కష్టం. వెబ్సైట్/యాప్, బ్యాంక్/కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు, అది ఒరిజనల్లా లేదంటే ఫేకా అనే విషయాల్ని గుర్తించాలని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వెబ్సైట్లు/యాప్లను ఉపయోగించే సమయంలో అలర్ట్గా ఉండాలని, సీవీవీ, కార్డ్ వివరాల్ని షేర్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. చదవండి: నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న -
వచ్చేస్తోంది..ఫ్లిప్కార్ట్ మరో దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్తో ముందుకు రానుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్పై 80శాతం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ పేరుతో వరుస ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుండి 10 వరకు, రెండో సేల్ బిగ్ దీపావళి సేల్ పార్ట్ 1 అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించింది. తాజాగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు మరో బిగ్ దివాళీ సేల్ను ప్రారంభించనుంది. ఈ సేల్లో కొనుగోలు దారులకు నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, డీల్స్తో పాటు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై తగ్గింపు, ఎస్బీఐ కార్డ్లపై 10 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 80శాతం డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ పై 80శాతం ఆఫర్లో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో రెడ్మీ 9ప్రైమ్, ఎంఐ 11 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 వంటి స్మార్ట్ఫోన్లపై 80శాతం ఆఫర్ను అందిస్తుండగా..ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్ ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టైమ్ బాంబ్ డీల్స్ సాధారణ డిస్కౌంట్లు కాకుండా.. బిగ్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్లు 12ఏఎం, 8ఏఎం,4 పీఎం సమయాల్లో 'క్రేజీ డీల్స్'ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్కార్ట్ తెలిపింది. 'టైమ్ బాంబ్ డీల్స్' లో డెస్క్టాప్, ల్యాప్టాప్లు గరిష్టంగా 30 శాతం తగ్గింపుతో లభించనున్నాయి. పవర్ బ్యాంక్లు, హెడ్ఫోన్లు,స్పీకర్ల వంటి యాక్సెసరీలను కూడా 75 శాతం వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్లో దేశీయ విమానాల టికెట్లను బుక్ చేసుకుంటే రూ. 2,500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ. 25,000 వరకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
స్మార్ట్ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...!
Nokia C30 Jio Exclusive Offer: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నోకియా భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ ఫోన్ను రిలీజ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్ఫోన్ను గురువారం (అక్టోబర్ 21) రోజున లాంఛైంది. సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లలో నోకియా సీ-30 అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. నోకియా ఈ స్మార్ట్ఫోన్కు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వోఎస్ అప్డేట్స్ను కూడా అందించనుంది. చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్బుక్? కారణాలు ఏంటంటే.. నోకియా సీ30 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది. నోకియా సీ30 (3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 10999 కాగా, 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. గ్రీన్, వైట్ కలర్స్ వేరియంట్స్లో నోకియా సీ30 లభించనుంది. ఫోన్ కొనుగోలుపై జియో ఆఫర్..! ఈ స్మార్ట్ఫోన్ను రిలయన్స్ జియో భాగస్వామ్యంతో నోకియా కొనుగోలు చేయనుంది. మై జియో యాప్ లేదా జియో స్టోర్లలో నోకియా సీ30 కొనుగోలుపై 10 శాతం సుమారు రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ను జియో అందించనుంది. స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో ఆయా కొనుగోలుదారుడికి యూపీఐ రూపంలో రూ. 1000 తగ్గింపుతో పేమెంట్ అప్షన్ వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారుడు జియో నెట్వర్క్ను వాడినట్లైతే రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మింత్రా, ఫార్మ్ఈజీ, ఓయో, మేక్ మై ట్రిప్ల్లో సుమారు రూ. 4 వేల వరకు ఇతర బెనిఫిట్స్ను కూడా జియో అందిస్తోంది. నోకియా సీ-30 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 6.82 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే ఆక్టాకోర్ యునిసోక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13+2 ఎమ్పీ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 వాట్స్ ఛార్జింగ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ సపోర్ట్ చదవండి: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్న్యూస్ -
పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్
ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలకే డాట్సన్ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్తగా డాట్సన్ కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం 'డాట్సన్' దేశంలో విక్రయించే కార్ల(రెడి-గో, గో, గో ప్లస్)పై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించింది. అత్యధికంగా రూ.40 వేల వరకూ రాయితీలు అందిస్తుంది. ఈ స్టాక్ కొనసాగే వరకు లేదా అక్టోబర్ 31, 2021 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డీలర్ షిప్ స్థాయి బట్టి ఆఫర్లో మార్పులు ఉంటాయి. (చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!) ఎన్ఐసీ అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఎక్స్ఛేంజీ బోనస్ లభిస్తుంది. అధికారిక వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. డాట్సన్ రెడీ-గోపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనిలో ₹20,000 నగదు ప్రయోజనం, ₹ 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్పొరేట్ ఉద్యోగులకు కార్ల కంపెనీ ₹5,000 అదనపు కార్పొరేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఇక డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ 5 సీటర్ మోడల్పై రూ. 40 వేల ఆఫర్ ప్రకటించింది. దీనిలో క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజీ బోనస్ కింద ఒక్కోటి రూ.20 వేల చొప్పున ఉంది. ఇటువంటి ఆఫరే గో ప్లస్ మోడల్పై కూడా ఉంది. 7 సీటర్ ఎంపీవీపై రూ.20 వేల నగదు లబ్ధి, రూ.20 వేలు ఎక్స్ఛేంజీ బోనస్ ఇస్తున్నారు. -
స్మార్ట్ఫోన్ కార్నివాల్..! మొబైల్స్పై భారీ తగ్గింపు..!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల కాస్త తగ్గముఖం పట్టడంతో ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా కొత్త కొత్త సేల్స్ను కస్టమర్ల కోసం తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకోసం స్మార్ట్ఫోన్ కార్నివాల్ సేల్ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ సేల్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుంది. ఈ సేల్స్లో భాగంగా పలు మొబైల్స్పై భారీ ఆఫర్లను ప్రకటించింది. రియల్ మీ నార్జో 30 5జీ, పోకో ఎమ్3, ఐఫోన్ 12, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ వంటి ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. స్మార్ట్ఫోన్ కార్నివాల్ లో భాగంగా ఐఫోన్ 12 మినీ మొబైల్ అసలు ధర రూ.69,900 కాగా, ఈ సేల్ లో మీకు రూ. 59,999కు లభిస్తుంది. కస్టమర్లు ఐఫోన్ 11ని కూడా కొనుక్కోవచ్చు. ఇతర ఐఫోన్ల మీద కూడా డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ ధర రూ.9,499 డిస్కౌంట్ ధరకు అందుబాటులో లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ పోకో ఎం3 ధరను రూ.10,999 నుంచి రూ.10,499కు తగ్గించింది. రియల్ మీ నార్జో 30 5జీ ప్రారంభ ధర రూ.14,999 కాగా, డిస్కౌంట్ కింద రూ.1,000 తగ్గించింది. ఇలా చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్ అందిస్తుంది.(చదవండి: అది నకిలీది.. అలా నేను అనలేదు: ఆనంద్ మహీంద్ర) -
JioMart: మరో రెండు రోజులే... పైసా వసూల్ స్పెషల్ ఆఫర్
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోమార్ట్ పైసా వసూల్ పేరుతో సరికొత్త ఆఫర్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు పైసా వసూల్ అనేలా అచ్చమైన, స్వఛ్చమైన తగ్గింపు ధరలతో మెగాసేల్ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి 18 తేది వరకు ఈ మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ మధ్య ఈ కామర్స్ సంస్థలు రకారకాల పేర్లతోని సేల్స్ని నిర్వహిస్తున్నాయి. అద్భుతమైన ఆఫర్లు అంటూ ఊదరగొడుతున్నాయి. ఇలాంటి ఆఫర్ ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయిదే ఇందులో ఏదీ అసలైన ఆఫరో, ఏదీ కేవలం ప్రచార అర్భాటమో తేల్చుకోవడం కస్టమర్లకు ఓ సమస్యగా మారింది. ఇలా అవసరానికి మించి ఆర్భాటం లేకుండా మీ పర్సుపై భారం తగ్గించేలా తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందించేందుకు మెగా సేల్ అందుబాటులోకి జియోమార్ట్ అందుబాటులోకి వచ్చింది. మెగాసేల్ ఆఫర్లు - 300 గ్రాములు ఆపై ఎక్కువ బరువు ఉండే పెద్ద బిస్కట్ ప్యాకెట్లపై 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు - 240 గ్రాములు ఆపైన ఎంపిక చేసిన నూడుల్స్పై 33% తగ్గింపు - సాఫ్ట్ డ్రింక్ విభాగంలో అన్ని రకాల కోక్ ఉత్పత్తులు, మజాపై 33 శాతం తగ్గింపు - చాక్లెట్ ప్యాకెట్స్ 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి - రూ .1049లకే దావత్ దేవాయ బాస్మతి రైస్ 5 కేజీల ప్యాకేట్, 5 లీటర్ల ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కాంబో అందుబాటులో ఉంది. - అన్ని రకాల మసాలా దినుసులపై 33 శాతం తగ్గింపు - ఎంపిక చేసిన మల్టీ ప్యాక్ సబ్బులపై 33 శాతం తగ్గింపు - 4 కేజీలు ఆపై ఉన్న డిటర్టెంట్లపై 30 శాతం వరకు తగ్గింపు - ఎంపిక చేసిన షాంపూలపై 50 శాతం డిస్కౌంట్ - ఎంపిక చేసిన టూత్పేస్ట్లపై 50 శాతం తగ్గింపు ఎస్బీఐ కార్డుపై క్యాష్బ్యాక్ జియోమార్ట్ మెగా సేల్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్కార్డు చెల్లింపులపై 10 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. (అడ్వటోరియల్) -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు..
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్డాట్ఇన్ పోర్టల్లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది. -
మారుతి బంపర్ ఆఫర్, ఏ కారు ఎంత డిస్కౌంట్ లో వస్తుందో తెలుసా?
మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతీ సుజుకీ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్ షిప్లలో మారుతి వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ తో పాటు కార్పొరేట్ బెన్ ఫిట్స్ ను ఈ నెల చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడమే కాదు భారీ ఆఫర్లు ప్రకటించి ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తమకు సాటెవ్వరూ లేరని నిరూపిస్తుంది. తాజాగా మారుతీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం? మారుతి సుజుకి ఆల్టో 800 మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై (డిస్కౌంట్ వర్త్) క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.43,000వరకు తగ్గించనుంది. మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్ ఆఫర్ను అందిస్తుంది మారుతి సుజికి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్ను అందిస్తుంది మారుతి సుజికి ఎస్ క్రాస్ మారుతి సుజికీ ఎస్ క్రాస్ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా ఆ కారుపై పర్చేస్ బెన్ఫిటిక్స్ కింద రూ.57,500వరకు డిస్కౌంట్ పొందవచ్చు. -
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. అదిరిపోయే ఆఫర్లతో పండగే పండగ
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో ఆఫర్ల పండుగ మొదలైంది. పంద్రాగస్ట్ను పురస్కరించుకొని అమెజాన్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్' ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళమీరు జులైలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే.. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో గాడ్జెట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సేల్ సందర్భంగా కష్టమర్లకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్ ఎస్బీఐతో టై అప్ అయ్యింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సేల్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ( గరిష్టంగా రూ.1750) కొనుగోలు చేస్తే 10 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఆపిల్ ఐఫోన్ 11 అమెజాన్ సేల్ లో ఆపిల్ ఐఫోన్ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు కోసం పేరొందిన క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 రూ.79,900విలువైన ఆపిల్ ఐఫోన్ 12ను ఈ ఆఫర్ లో 11,901 తగ్గుతుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎక్సేంజ్ ఆఫర్లో రూ.13,400 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.వీటితో పాటు వన్ ప్లస్ 9జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బ్రాండ్లపై ఆఫర్లు అమెజాన్కు చెందిన డివైజ్ ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే ఈ బుక్ రీడర్స్ పై ఆఫర్లు లభిస్తాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈ సోనీ డబ్ల్యూహెచ్ ఎక్స్ఎం3 వైర్ లెస్ హెడ్ ఫోన్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఆపిల్ వాచ్ సిరీస్ ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2020 హెచ్ పీ పెవిలియన్ గేమింగ్ ల్యాప్ ట్యాప్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్" తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సేల్లో భాగంగా అమెజాన్ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, హోమ్ & కిచెన్, టీవీలు వంటి ఉత్పత్తుల పాటు నిత్యావసర వస్తువుల ధరలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఈ కామర్స్ కంపెనీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే, యూజర్ అమెజాన్ పేతో ద్వారా కొనుగోలు చేస్తే ₹1000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొనుగోలుదారులు ఎంపిక చేయబడ్డ బ్యాంక్ కార్డులపై 3 నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం లభిస్తుంది. షియోమీ, శామ్ సంగ్, ఐక్యూవో, మరిన్ని మొబైల్స్ పై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ సదుపాయం పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లు & యాక్ససరీలపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ 2 5జి, వన్ ప్లస్ నార్డ్ సిఈ 5జి, రెడ్ మి నోట్ 10టి 5జి, రెడ్ మి నోట్ 10లు, మి 11ఎక్స్, శామ్ సంగ్ ఎమ్ 21 2021, శామ్ సంగ్ ఎమ్32, శామ్ సంగ్ ఎమ్ 42 5జి, ఐక్యూవోయూ 7, టెక్నో కామోన్ 17 సిరీస్, టెక్నో స్పార్క్ గో వంటి స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన ఈ సేల్లో తీసుకొచ్చిన కొన్ని ఒప్పందాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆఫర్లు కెమెరాలపై 60% వరకు తగ్గింపు ట్రైపాడ్ లు, రింగ్ లైట్లు వంటి వాటిపై 60% వరకు తగ్గింపు స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 60% వరకు తగ్గింపు హెడ్ ఫోన్ లపై 60% వరకు తగ్గింపు సంగీత వాయిద్యాలు, ప్రొఫెషనల్ ఆడియోపై 60% వరకు తగ్గింపు స్పీకర్లపై 60% వరకు తగ్గింపు ల్యాప్ టాప్ లపై ₹30,000 వరకు తగ్గింపు ప్రింటర్లపై 30% వరకు తగ్గింపు గేమింగ్ యాక్ససరీలపై 50% వరకు తగ్గింపు హై-స్పీడ్ వై-ఫై రూటర్ పై 60% వరకు స్మార్ట్ వాచీలపై 60% వరకు తగ్గింపు హార్డ్ డ్రైవ్లు, బాహ్య ఎస్ఎస్ డీలపై 50% వరకు తగ్గింపు మొబైల్, కెమెరా మెమొరీ కార్డులపై 60% వరకు తగ్గింపు టాబ్లెట్లపై 45% వరకు తగ్గింపు సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లపై 50% వరకు తగ్గింపు ఐటి యాక్ససరీలపై 60% వరకు తగ్గింపు స్టేషనరీ, ఆఫీస్ ఎలక్ట్రానిక్స్ పై 60% వరకు తగ్గింపు మానిటర్లపై 55% వరకు తగ్గింపు పీసీ కాంపోనెంట్లపై 50% వరకు తగ్గింపు డెస్క్ టాప్ లపై ₹40,000 వరకు తగ్గింపు అంతర్గత ఎస్ ఎస్ డిలపై 50% వరకు తగ్గింపు -
ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీగా ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ "బిగ్ సేవింగ్ డేస్ సేల్" పేరుతో మరోసారి సరికొత్త డిస్కౌంట్ సేల్ను తీసుకొని వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్, ఒప్పో, వివో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా కిచెన్ వంటి పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే జూలై 25 నుంచి జూలై 29 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరోసారి అదే పేరుతో సేల్ తీసుకొని వచ్చింది. ఎప్పటిలాగే, ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్లస్ సభ్యులు డీల్స్ ను ముందస్తుగా యాక్సెస్ చేసుకోగలరు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది. ఇంకా ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్పై తగ్గింపును లభించనుంది. అమ్మకం సమయంలో కంపెనీ మొబైల్స్, టాబ్లెట్లపై డిస్కౌంట్ అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ & యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీ & ఉపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫ్లిప్కార్ట్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. -
రాయితీలుంటేనే గృహ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు వైఖరిలో మార్పులు వచ్చాయి. కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను కస్టమర్లు కోరుకుంటున్నారని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 3 వేల మంది కస్టమర్లతో సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం గతంతో పోలిస్తే పెట్టుబడి సరైన సాధనంగా రియల్ ఎస్టేట్ అని భావించే వారి శాతం పెరిగింది. గతంలో 35% ఉండగా.. ఇప్పుడది 43 శాతానికి పెరిగింది. గతంలో స్టాక్ మార్కెట్లు సరైన ఇన్వెస్ట్మెంట్స్గా 15%మంది భావించగా.. ఇప్పుడది 20 శాతానికి చేరింది. కాగా.. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), బంగారంలో పెట్టుబడులపై కస్టమర్ల ఆసక్తి క్షీణించింది. గతంలో 22 శాతం మంది ఎఫ్డీలు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని భావించగా.. ఇప్పుడు 19 శాతానికి, గతంలో బంగారంలో పెట్టుబడులకు 28 శాతం మంది ఆసక్తి కనబర్చగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 71% మంది కొనుగోలు నిర్ణయాలను తీసుకునేలా, ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించే విధంగా డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ చెల్లింపు విధానాలను కోరుకుంటున్నారు. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ), సరఫరా ఎక్కువ ఉన్న డెవలపర్లు డిస్కౌంట్లను అందిస్తున్నారని, రుణ చెల్లింపులు, ఇతరత్రా నిర్వహణ కోసం తప్పదని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని చెప్పారు. ఇప్పటికే డెవలపర్లు తక్కువ మార్జిన్లలో ఉన్నారని పేర్కొన్నారు. డిమాండ్–సరఫరాలను బట్టి ధరలపై నియంత్రణ ఉంటుందన్నారు. చాలా మంది కస్టమర్లు పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్గ్రేడ్ అవుతుండటం, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడం కారణంగా ఇళ్లకు డిమాండ్ పెరిగిందని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి కూడా డిమాండ్కు ఊతమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో హోమ్బయ్యర్లు ఇళ్ల కోసం వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. 33 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలు ఒత్తిడిలోనే..: అనరాక్ కాగా, బ్యాంక్లు, ఆర్ధిక సంస్థలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి 100 బిలియన్ డాలర్ల రుణాలను అందించాయని.. వీటిలో 67 శాతం లోన్లు మాత్రమే సురక్షిత జోన్లో ఉండగా.. మిగిలిన 33 శాతం (33 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఆ 33 శాతంలో 15 శాతం (15 బిలియన్ డాలర్లు) కొంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ రికవరీకి అవకాశం ఉందని.. 18 శాతం (18 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. ఆయా డెవలపర్ రుణగ్రహీతలు అధిక పరపతి కలిగి ఉన్నారని తెలిపింది. 2019 ముగింపు నాటికి 93 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలలో 16 శాతం తీవ్రమైన ఒత్తిడి లోన్లని పేర్కొంది. దేశీయ రియల్టీ రుణాలలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ), ట్రస్టీషిప్స్ వాటా 63 శాతం వరకున్నాయని తెలిపింది. శాఖల వారీగా చూస్తే. బ్యాంక్ల వాటా 37 శాతం, హెచ్ఎఫ్సీలు 34 శాతం, ఎన్బీఎఫ్సీల వాటా 16 శాతం, ట్రస్టీషిప్స్ వాటా 13 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంక్లు, హెచ్ఎఫ్సీల లోన్ బుక్లలో వరుసగా 75, 66 శాతంతో సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎన్బీఎఫ్సీల రుణాలలో 46 శాతం వాచ్లిస్ట్ జాబితాలో ఉన్నాయని పేర్కొంది. గ్రేడ్–ఏ డెవలపర్లకు ఇచ్చే లోన్లలో 75 శాతం సురక్షిత జోన్లోనే ఉన్నాయని.. రియల్టీ రంగానికి పంపిణీ చేసే మొత్తం రుణాలలో 73 బిలియన్ డాలర్లు గ్రేడ్–ఏ బిల్డర్లకే అందుతాయని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. పుణే ఎన్సీఆర్, ముంబై నగరాలలోని మొత్తం రుణాలలో వరుసగా 40, 39, 37 శాతం లోన్లు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత బెంగళూరులో 15 శాతం, హైదరాబాద్, కోల్కతా, చెన్నై నగరాలలో 3–4 శాతం లోన్లు ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. -
ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ ఐదు రోజుల డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. జూలై 25 ఆదివారం నుండి జూలై 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మినీ ఫ్లాష్ అమ్మకాలను కూడా నిర్వహించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 24 అర్ధరాత్రి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అందుబాటులోఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది.ఇంకా ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతరఎలక్ట్రానిక్స్పై తగ్గింపును లభించనుంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ కూడా లభ్యం. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫ్లిప్కార్ట్ తన డిస్కౌంట్ అమ్మకాలను మొదలు పెట్టడం విశేషం. రూ. 1 చెల్లించి ప్రీబుకింగ్ : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కేవలం ఒక రూపాయితో ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్నిస్తోంది. సేల్ ప్రారంభం తరువాత మిగిలిన ధరను చెల్లించి సంబంధిత వస్తువునుకొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ధరలు ఐఫోన్ 12 రూ. 67,999 (ఎంఆర్పి రూ .79,999) ఐఫోన్ ఎస్ఇ రూ. 28,999 (ఎంఆర్పి రూ .39,900) మోటరోలా రేజర్ రూ. 54,999 (ఎంఆర్పి రూ. 1,49,999) శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 రియల్మీ సి 25 రూ. 9,999 (ఎంఆర్పి రూ .10,999) పోకో ఎక్స్ 3 రూ. 15,999 (ఎంఆర్పి రూ .19,999) ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 రూ. 6,499 (ఎంఆర్పి రూ .7,999 ఫ్లిప్కార్ట్ మినీ ఫ్లాష్ సేల్:అతి తక్కువ ధరకే రానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భారీ డిస్కౌంట్తో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 ,సాయంత్రం 4 గంటలకు మినీ ఫ్లాష్ సేల్ను నిర్వహించనుంది. అంటే పలు ప్రొడక్ట్స్ నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ సేల్ను కూడా ప్రకటించింది. ఇందులో ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకే పలు ఉత్పత్తులు లభించనున్నాయి. -
మారుతి సుజుకీ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్
ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. విక్రయాలను పెంచడం కోసం మారుతి సుజుకీ శ్రేణిలోని కొన్ని కారు మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మారుతి తన కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల కింద ఆఫర్లను అందించనుంది. ఆల్టో, స్విఫ్ట్, ఈకో అనేక రకాల కార్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాగా ఏర్టిగా మోడల్కు సంబంధించి ఏలాంటి రాయితీ ప్రకటించలేదు. కాగా ఈ ఆఫర్ జూలై 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకీ డిస్కౌంట్ను అందిస్తోన్న కారు మోడళ్లు ఇవే.. మారుతి ఆల్టో కస్టమర్లు సుమారు రూ. 15000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3000 కార్పొరేట్ బోసన్ను అందించనుంది. కాగా మారుతి ఆల్టో పెట్రోల్ ఇంజన్ మోడల్కు సుమారు రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్ మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్ మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోసన్ను ప్రకటించింది. కాగా ఈ మోడళ్లకు ఏలాంటి క్యాష్ డిస్కౌంట్ను అందించడం లేదు. మారుతి డిజైర్ మారతి డిజైర్ మోడల్ కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ను ప్రకటించింది. మారుతి ఈకో మారుతి ఈకో మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోసన్, రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ ఇంజన్ మోడల్కు రూ .25 వేల నగదు తగ్గింపు, సిఎన్జి మోడల్కు రూ .10,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వాటితో పాటుగా రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించనుంది. మారుతి స్విఫ్ట్ స్విఫ్ట్పై సుమారు రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్కు 10,000 రూపాయల నగదు తగ్గింపు, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ + వేరియంట్లకు రూ. 15,000 తగ్గింపు, స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్కు సుమారు . 30,000 నగదు తగ్గింపును ప్రకటించింది. మారుతి విటారా బ్రెజ్జా మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బోసన్, రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి వాగన్-ఆర్ పెట్రోల్ ఇంజన్ మోడల్కు రూ .15 వేల నగదు తగ్గింపుతో, సిఎన్జి ఇంజన్ మోడళ్లకు రూ .5 వేల నగదు తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .3,000 ను అందిస్తోంది. -
Amazon Clearance Sale : 70 శాతం వరకు డిస్కౌంట్లు
ఇండియాలో నంబర్ 1 ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులపై క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. వేలాది ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మకానికి ఉంచింది. గరిష్టంగా 70 శాతం వరకు పలు వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్తో పాటు అమెజాన్ కూపన్లు ఉపయోగించడం ద్వారా మరో రూ. 10,000 రూపాయల వరకు ఎంఆర్పీపై తగ్గింపు పొందవచ్చని అమెజాన్ తెలిపింది. మొబైల్ మిస్ అమెజాన్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేల్స్లో లాప్ట్యాప్, డెస్క్టాప్, కెమెరా, ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్స్, పవర్బ్యాంక్, హార్డ్డిస్క తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ డిమాండ్ ఉండే ఫోన్లు ఈ క్లియరెన్స్ సేల్స్ కేటగిరిలో లేవు. దీంతో వినియోగదారులు కొంత నిరాశకు లోనవుతున్నాయి. అయితే మిగిలిన ఐటమ్స్లో అవసరమైనవి తక్కువ ధరకు లభిస్తున్నాయనే వారు ఉన్నారు. చదవండి : ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా? -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్సేల్: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్ల అమ్మకాలను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో టీవీలు, ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపే ధరలకే విక్రయించనుంది. మే 2 న మే 7 వరకు ముగియనున్న ఈ సేల్లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు భారీ ఆఫర్లు అందించనుంది. ఇంకా టీవీల 75 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే ఆపిల్ శాంసంగ్, గూగుల్ సంస్థల ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కూడా తగ్గింపు ధరల్లో అందించనుంది. అంతేనా ఏసీలు, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, కంప్యూటర్ ఉపకరణాల ధరలపై తగ్గింపును ప్రకటించింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ ట్రాన్సక్షన్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు లభ్యం. (సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్!) ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు : ప్రధానంగా ఐఫోన్ 11 ఫోన్ ను ఈ సేల్ లో రూ. 7 వేల తగ్గింపును ప్రకటించింది. తాజా తగ్గింపుతో రూ. 44,999కే లభ్యం. లాంచింగ్ ధర రూ. 51,999. ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 3 ధర 46,999 నుంచి ప్రారంభం ఐక్యూ 3 29,990 8 జీబీ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,990 ఎంఐ 10 టీ సిరీస్ను ప్రారంభ ధ 27,999 రూపాయలు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ఫోన్ రూ. 17, 999 కే లభించనుంది. గెలాక్సీ ఎఫ్ 41 6 జీబీర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499 6 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 గూగుల్ పిక్సెల్ 4 ఏ ఫోన్ రూ. 26, 999 కే కొనుగోలు చేయవచ్చు. వీటితో కంప్యూటర్ ఉపకరణాలు రూ. 99 నుంచి లభించనున్నాయి. స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు (70 శాతం వరకు), బ్లూటూత్ స్పీకర్లు (70 శాతం వరకు), ల్యాప్టాప్లు (40 శాతం వరకు) పవర్ బ్యాంకులపై డిస్కౌంట్ అందించనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలు కూడా లభిస్తాయి. వన్ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 14,999లకే కొనుగోలు చేయవచ్చు. -
జోయాలుక్కాస్ ఉగాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ఉగాది పండుగ సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.1,000 గిఫ్ట్ ఓచర్ను పొందవచ్చు. అలాగే రూ.50 వేల డైమండ్, అన్కట్ ఆభరణాలపై రూ.5వేల గిఫ్ట్ ఓచర్ లభించనుంది. ఈ ఆఫర్ ఈ ఏప్రిల్ 14న ముగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు వారి నూతన సంవత్సరాన్ని జోయాలుక్కాస్ ఆభరణాలు మరింత శుభప్రదం చేస్తాయని కంపెనీ చైర్మన్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. గిఫ్ట్ ఓచర్తో పాటు కొనుగోలు చేసిన ఆభరణాలపై జీవితకాలం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సదుపాయం, తిరిగి కొనుగోలు హామీ సౌలభ్యతలను అందిస్తున్నామని ఆయన వివరించారు. -
రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై బంపర్ అఫర్
రియల్ మీ మనదేశంలో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఈ ఐదు రోజుల సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ నార్జో 30 ప్రోతో పాటు మరిన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పతులపై అద్భుతమైన డిస్కౌంట్లను రియల్ మీ అందిస్తుంది. ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్ 7 ప్రో ధర రూ.29,999, అయితే మీరు ఈ సేల్ భాగంగా రూ.27,999 కు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ఆన్లైన్ స్టోర్లో బుక్ చేసిన ప్రీపెయిడ్ ఆర్డర్లకు మాత్రమే రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. దీని అర్థం మీరు ఎక్స్ 7 ప్రోను కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు చెల్లింపు చేస్తేనే ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే డిస్కౌంట్ అఫర్ లభించదు. అదేవిధంగా, రియల్ మీ ఎక్స్ 7, నార్జో 30 ప్రో మొబైల్స్ పై రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పే చేయవచ్చు. వాస్తవానికి రూ.19,999 ధర గల రియల్మే ఎక్స్ 7 డిస్కౌంట్ తర్వాత మీకు రూ.18,999కు లభిస్తుంది. రూ.16,999కు విక్రయించే నార్జో 30 ప్రో మీకు రూ.15,999కు లభిస్తుంది. ఈ సేల్ లో డిస్కౌంట్ అనేది స్మార్ట్ఫోన్ల పైన మాత్రమే కాకూండా స్మార్ట్ టెలివిజన్లు, వైర్లెస్ ఇయర్బడ్లు, నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బ్రీఫ్కేసులు మొదలైనవి వాటిపై ఉన్నాయి. చదవండి: రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్ -
కార్ లవర్స్కు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కార్ లవర్స్కు తీపి కబురు అందించింది. వివిధ మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో టాటా మోటార్స్ మార్చి నెలలో తగ్గింపులను వెల్లడించింది. తన అధికారిక వెబ్సైట్లో అందించిన వివరాల ప్రకారం టియాగో, టైగోర్, నెక్సాన్ , 5-సీట్ల హారియర్తో సహా ఎంపిక చేసిన కార్లపై 65 వేల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. కన్జ్యూమర్ స్కీమ్, ఎక్స్ఛేంజి ఆఫర్, కార్పొరేట్ స్కీమ్ల రూపంలో వీటిని అందిస్తోంది. టాటా టియాగో మోడల్పై రూ.25వేలను తగ్గింపు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో కన్జ్యూమర్ స్కీమ్ రూ.15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్ రూ.10 వేలు ఉన్నాయి. టిగారో సెడాన్పై మొత్తం 30వేలుతగ్గింపు. ఇందులో కన్జ్యూమర్ స్కీమ్లో రూ. 15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్లో రూ.15 వేలు డిస్కౌంట్ భాగం. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీపై రూ.15వేలు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ఈకారు డీజిల్ వెర్షన్పై ఎక్స్ఛేంజి ఆఫర్తో మాత్రమే ఈ ఆఫర్ లభ్యం. ఇక హారియర్ 5సీట్ల మోడల్ క్యామో వేరియంట్పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. హారియర్లో పరిమిత వేరియంట్లకే ఆఫర్ను అందిస్తోంది. సాధారణ హారియర్పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. ఆల్ట్రోజ్ , ఫ్లాగ్షిప్ సఫారి ఎస్యూవీ కొనుగోళ్లపై ఈ ఆఫర్లు వర్తించవు. -
మారుతి సుజుకి బంపర్ అఫర్
కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వారి కోసం మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్ను అందిస్తోంది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఆఫర్ లభించనున్నట్లు పేర్కొంది. ఎర్టిగా మినహా మిగతా అన్ని ఎంట్రీ లెవల్ కార్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్ల డిమాండ్ను, అమ్మకాలను పెంచుకోవడం కోసం ఈ ఆఫర్ను ప్రకటించినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆఫర్లన్నీ దేశమంతటా ఒకే విధంగా ఉండవని నగరాల డీలర్షిప్ల బట్టి మారుతాయని స్పష్టం చేసింది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మోడళ్ల వారీగా డిస్కౌంట్: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ పై రూ.52 వేల వరకు తగ్గింపు మారుతి సుజుకి సెలెరియో మోడల్ పై రూ.47,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి ఆల్టో మోడల్ పై రూ.42,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి ఎకో మోడల్ పై రూ.37,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ పై రూ.30,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి డిజైర్ మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు మారుతి సుజుకి వాగన్ ఆర్ మోడల్ పై రూ.30,000 వరకు తగ్గింపు చదవండి: కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్ దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ -
ఇయర్ ఎండ్ ఆఫర్ : ఈ కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో కొత్త కారును సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆపర్. మహీంద్రా అండ్ మహీంద్రా తన అన్ని మోడల్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన థార్ ఎస్యూవీ మినహా దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్లోఅందించిన సమాచారం ప్రకారం బీఎస్-6 వాహనాలపై ఏకంగా 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ , అదనపు ఆఫర్లు ఇందులో భాగం. ఈ ఆఫర్ ఈ నెల(డిసెంబర్ 31, 2020)చివరి వరకు మాత్రమే చెల్లుతాయి. అలాగే ఆయా నగరాలు, ప్రాంతాల ఆధారంగా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ( రూ. 440 కోట్లు నష్టం : వేలాది ఐఫోన్లు మాయం) -
ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : ఆఫర్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐదు రోజుల బ్లాక్ ఫ్రైడే అమ్మకాన్ని చేపట్టిన సంస్థ తాజాగా ప్రతీ నెల మొదటి రోజుల్లో ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ పేరుతో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. రేపటి ( 2020, డిసెంబర్ 1-3 వరకు) అందిస్తున్న ఈ సేల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే టీవీలు, ఏసీలు రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇంకా బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు, బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్, ఆఫర్లను ప్రకటించింది. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్.కామ్లోఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఇప్పటికే వెబ్సైట్లో అమ్మకం కోసం ల్యాండింగ్ పేజీని తీసుకొచ్చింది. పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్, గృహాలంకరణ తదితర ఉత్పత్తులపై కూడా తగ్గింపును ప్రకటించింది. హెడ్ఫోన్లు, స్పీకర్లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్టాప్లపై 30శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లాంటిపై కూడా తగ్గింపులో ధరల్లో అందిస్తోంది. 8,999 రూపాయలు ధర వద్దే స్మార్ట్ టీవీలను అందిస్తోంది.స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు ప్రారంభ ధర 1,299 గా ఉంచింది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు వంటి సదుపాయం కూడా ఉంది. -
అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరోసారి డిస్కౌంట్ అఫర్లను తీసుకువచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకాలను 'గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్' పేరుతో ప్రారంభించింది. ఈ సేల్ ద్వారా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇయర్ఫోన్లు, టీవీలపై తగ్గింపు ధరలు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సీటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో సహా పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. రుపే కార్డు వినియోగదారులు కూడా ఈ ఆఫర్కు అర్హులు. ప్రైమ్ డే సేల్ (అక్టోబరు 29)మంచి శుభారంభాన్నిచ్చిందని అమెజాన్ ప్రకటించింది. నేటినుంచి (అక్టోబరు 30) - నవంబర్ 4 తో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగుస్తుంది. మరోవైపు ఈవారంలో ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి అమ్మకాలను చేపట్టాలని చూస్తోంది. అన్ని రకాల ఉత్పత్తులపై నేరుగా డిస్కౌంట్ మాత్రమే కాకుండా పలు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు నేరుగానే రూ.1,500 వరకు తగ్గింపు పొందొచ్చు. రుపేకార్డు 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా లభ్యం. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా పొందొచ్చు. దీపావళి ప్రత్యేక అమ్మకం సందర్భంగా ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 11 రూ. 49,999 కే విక్రయిస్తోంది. దీని ఎంఆర్పి రూ .64,900. అలాగే ఐఫోన్ 11 కొనుగోలుపై 16,400 రూపాయల ఎక్జ్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్ 2020 ఆఫర్లు స్మార్ట్ఫోన్లు - 40శాతం వరకు తగ్గింపు ల్యాప్టాప్లు - రూ .2,000 వరకు తగ్గింపు టీవీలపై- 40 శాతం వరకు తగ్గింపు కెమెరాలు - కనిష్టంగా 35 శాతం ఆఫర్ ఉపకరణాలు - కనిష్టంగా 45శాతం తగ్గింపు ఫ్యాషన్ - 70శాతం ఆఫ్ కిరాణా సామాగ్రిపై రూ .1 డీల్స్ -
రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్ కార్నివాల్’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్ డెలివరి, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్లెస్, క్యాష్లెస్ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్పీసీఐ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాతియా తెలిపారు. -
టాటా కార్లపై పండుగ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్ తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రానున్న ఫెస్టివ్ సీజన్ కారణంగా కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా బీఎస్-6 ఇంజీన్ఎస్యూవీ టాటా హ్యారియర్ కారుపై 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. బీఎస్6 కార్లకు మాత్రమే అందుబాటులోఉంచిన సంస్థ నెక్సాన్, టైగోర్, టియాగో, హారియర్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్లో డిస్కౌంట్లను ప్రకటించలేదు. టాటా హ్యారియర్ :80 వేల దాకా తగ్గింపు 25 వేల క్యాష్ డిస్కౌంట్, 15 వేల రూపాయల అదనపు కార్పోరేట్ ఆఫర్, 40 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది. టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మినహా అన్నిమోడళ్లకు తగ్గింపు ధరలను అందిస్తోంది. హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -స్పీడ్ ఆటోమేటిక్ , మాన్యువల్ ట్రాన్మిషన్లలో లభ్యం. ఎస్యూవీ ధర 13.84 లక్షలు బీఎస్-6 టాటా టియాగో 32,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. కన్స్యూమర్ స్కీమ్ 15వేలు, 7 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, 10 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి మొత్తం ప్రయోజనం 32 వేలు. అయితే కార్పొరేట్ ఆఫర్ టాటా గ్రూప్ , టీఎంఎల్ ఉద్యోగులు, టాటా ట్రస్ట్ ఇండియా, టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రెఫరల్, టాప్ 10 , టాప్ 20 కార్పొరేట్స్ తోపాటు, కోవిడ్-19 యోధులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది. బీఎస్- 6 టాటా నెక్సాన్ టాటా మోటార్స్ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అయితే డీజిల్ వేరియంట్లో మాత్రమే, డీజిల్ డెరివేటివ్ను ఎంచుకునే వినియోగదారులకు 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఆఫర్లు ఉన్నప్పటికీ చాలా స్వల్పం. -
ఇండిగో : వారికి ప్రత్యేక తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందు నిలిచి విశేష సేవలందిస్తున్న వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తామని ఇండిగో గురువారం తెలిపింది. టఫ్ కుకీ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో ఈ తగ్గింపును అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇండిగో వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఏడాది చివరి వరకు వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇందుకు చెక్-ఇన్ సమయంలో వారి గుర్తింపునకు సంబంధించిన ఆసుపత్రి ఐడిలను అందించాల్సి ఉంటుందని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 టికెట్ల కొనుగోలుకు, ప్రయాణానికి ఈ తగ్గింపు చెల్లుతుందని తెలిపింది. అంతేకాదు వీరి ప్రత్యేకతను ప్రయాణంలో ప్రతి దశలో గుర్తించేలా చేస్తుందని వెల్లడించింది. ఇండిగో చెక్-ఇన్ వద్ద కుకీ టిన్, బోర్డింగ్ గేట్ వద్ద స్వాగత ప్రకటన, పీపీఈ కిట్ పై ప్రత్యేక టఫ్ కుకీ స్టిక్కర్ తోపాటు, విమానంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని వెల్లడించింది. -
లాక్డౌన్లో బ్యాంకుల ఆఫర్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన లాక్డౌన్ అమలవుతున్న వేళ బ్యాంకులు వినూత్న ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔషధాలను తమ కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తామంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆఫర్ ఇచ్చింది. ‘ఈ కష్టకాలంలో ఫార్మసీ బిల్లుల భారం కాస్త తగ్గించుకునేందుకు సులభతరమైన మార్గం ఉంది. మీకు సమీపంలోని అపోలో ఫార్మసీ స్టోర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం దాకా డిస్కౌంటు పొందండి‘ అని ట్వీట్ చేసింది. అటు ఎస్బీఐ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చింది. ‘అపోలో 24/7 నుంచి హెల్త్ చెకప్ చేయించుకోండి. యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కొన్ని ల్యాబ్ టెస్టులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు పొందండి‘ అని పేర్కొంది. అటు, అక్షయ తృతీయ రోజున తమ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ ఇచ్చింది. రూ. 10,000 విలువ పైబడిన ప్రతీ కొనుగోలుపై 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్ ఫండ్కు రూ. 100 విరాళంగా ఇస్తామని తెలిపింది. ఇక బ్యాంకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలను కూడా సడలించాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకున్నా జూన్ 30 దాకా ఎటువంటి చార్జీలు విధించబోమంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఆఫరిచ్చింది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. ఆఫర్స్ ఇవే
సాక్షి, ముంబై: ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుభవార్తను అందించింది. మార్చి 19వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆ సేల్లో అందివ్వనున్న ఆఫర్ల వివరాలను ఫ్లిప్కార్ట్ తాజాగా వెల్లడించింది. మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్ జరగనుంది. ఈ నాలుగు రోజుల సేల్లో స్మార్ట్ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఫర్నీచర్పై ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి. మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్పై 80% వరకు, ఫ్లిప్కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్పై ఎక్స్ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్పై 15% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. -
ఫ్లిప్కార్ట్ బొనాంజా సేల్ : భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ సంస్థ ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్ ధరల్లో స్మార్ట్ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది. ఆపిల్, శాంసంగ్, వివో, రియల్మీ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపుదీనికి అదనం. రూ.15 వేల కేటగిరిలో శాంసంగ్ గెలాక్సీ ఏ50, వివో జెడ్1 ప్రొలు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్1. రియల్మి ఎక్స్టీ రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్ తగ్గింపు ధరలలో ఈ సేల్లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది. వివో జెడ్ 1 ఎక్స్ , రియల్ మి ఎక్స్టీ స్మార్ట్ఫోన్లు రూ. 13,990, 14,999 రూపాయల నుండి లభిస్తాయి. నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 7.2 ధరను తగ్గించి రూ .15,499 కే లభ్య. ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్ రూ. రూ .26,990 దీని అసలు రూ. 40వేల నుంచి భారీ తగ్గింపు ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ రియల్మీ ఎక్స్ 2 ప్రో రూ .27,999 తగ్గింపు రూ. 2వేలు బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్ఫోన్ రూ .29,999 పిక్సెల్ 3 ఎ సిరీస్ రూ .27,999 కంటే తక్కువకు లభించనుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 సిరీస్ కూడా రూ .22,999 నుండి లభిస్తుంది. రూ. 10, 000 లోపు స్మార్ట్ఫోన్లు ఒప్పో కె 1 రూ .9,990 ఐఫోన్లపై తగ్గింపు ఆండ్రాయిడ్ నుంచి ఐవోస్కు మారాలనుకుంటున్న వారికి కూడా ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ ధర రూ. 54,999 నుండి ప్రారంభం ఐఫోన్ 8 ను రూ .35,999 కు పొందవచ్చు. చదవండి : లేటెస్ట్ ఐఫోన్పై డిస్కౌంట్ ఆఫర్ -
అమెజాన్ కొంపముంచిన కోడ్.. స్టూడెంట్స్కు పండగ
లండన్: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డ జనం.. ఏం కావాలన్నా బయటకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పెద్ద మొత్తంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారత్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లతో భారీగా విక్రయాలు సాగిస్తున్నాయి. రోజురోజుకు ఆన్లైన్ షాపింగ్ పుంజుకుని.. మార్కెట్ బలపడుతున్న తరుణంలో కొన్నిసార్లు.. ఆయా వెబ్సైట్లలో లోపాల కారణంగా సంస్థలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ డీల్లో.. డిస్కౌంట్ కోడ్లోని లోపం కారణంగా అమెజాన్ సంస్థకు నష్టం జరిగిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యూకేలోని కొత్త కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 5 పౌండ్లు డిస్కౌంట్ ఇచ్చింది. అమెజాన్ సంస్థ 'వెల్కమ్5' అనే పేరుతో ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ఫై ఎలాంటి షరతులు పెట్టకపోవడంతో ఒకే కోడ్పై వినియోగదారులు అనేకసార్లు విక్రయాలు జరిపి సంస్థకు నష్టం మిగిల్చారు. డిస్కౌంట్ కోడ్లో లోపమున్న కారణంగా ఒకే వినియోగదారుడు ఆఫర్ను అనేకసార్లు ఉపయోగించవచ్చనే విషయం కంపెనీకి 9 రోజుల పాటు తెలియకపోవడం గమనార్హం. అమెజాన్ డిస్కౌంట్ కోడ్లో లోపాన్ని గుర్తించిన యూకే విద్యార్థులు, డిస్కౌంట్ కోడ్ను తెగ వాడేసుకుని లాభపడ్డారు. డిస్కౌంట్ కోడ్ను ఉపయోగించి ఎన్ని సార్లయినా కొత్త వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చని కనుగొన్న కొందరు విద్యార్థులు మొత్తం క్యాంపస్ లైఫ్కు సరిపడా వస్తువులు భారీ మొత్తంలో కొనిపడేశారు. ఇక డిస్కౌంట్ కోడ్లో ఉన్న లోపం గురించి ఆ నోటా ఈ నోటా పడి యూకేలోని అన్ని క్యాంపస్లకు పాకింది. దీంతో వందలాది మంది విద్యార్థులు టాయిలెట్ రోల్స్, టూత్పేస్టులు, బీర్ ప్యాక్లను పెద్దమొత్తంలో ఆర్డర్ చేసి పూర్తి ప్రయోజనం పొందారు. మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఈ లోపాన్ని ఒక వ్యసనంలా.. ఆటలా భావించి.. ఎప్పటికీ కొనవలసిన అవసరం లేకుండా.. టాయిలెట్ రోల్స్, టూత్పేస్టులు, బీర్ ప్యాక్లు, నవలలు, పెన్నులు, ఫోల్డర్లు, బ్యాటరీలు కొన్నామని పేర్కొన్నారు. అయితే 9 రోజుల తర్వాత లోపాన్ని గుర్తించిన అమెజాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోడ్ లోపంతో ఎంతమేరకు నష్టం వచ్చిందన్నది వెల్లడి కాలేదు. -
రిలయన్స్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ ఆఫర్
పండుగల సీజన్ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ పేరిట ఆఫర్ను ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్లో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్ వంటి ఎల్రక్టానిక్స్పై 15 శాతం క్యాష్బ్యాక్ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, ఎల్ఈడీ టీవీలు, ఐ–ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ కాలంలో మై జియో స్టోర్స్లో వోచర్లను సైతం అందిస్తున్నట్లు తెలిపింది. -
బంపర్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే -2019
సాక్షి, న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మరోసారి తీపి కబురు చెప్పింది. ప్రైమ్ డే 2019 సేల్ను ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఈ మేరకు అమెజాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15-19 తేదీల మధ్య నిర్వహించ నున్న ఈ సేల్లో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా ఈసారి ప్రైమ్ డే సేల్ ను గ్లోబల్గా 48 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆపిల్, వన్ప్లస్, శాంసంగ్ తదితర ప్రముఖ కంపెనీల టీవీలు, స్మార్ట్ఫోన్లు తదితర ఉత్పత్తులను ఈ సేల్లో తక్కువ ధరలకే తన ఫ్యాన్స్కు అందించనుంది. అలాగే హెచ్డీఎఫ్స క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై10శాతం ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ను అందించనుంది. ఇండియా, అమెరికా, కెనడా, యుకె, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బెల్జియం, ఆస్ట్రియాదేశాలతో పాటు ఈ ఏడాది యూఏఈలో ఈ ప్రైమ్ డే సేల్ ను తొలిసారిగా పరిచయం చేస్తోంది. -
ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఫ్లిప్కార్ట్ మరోసారి డిస్కౌంట్ సేల్కు తెరతీసింది. జూన్ 1 నుంచి-3వతేదీవరకు నిర్వహించే ఈ సేల్లో టీవీలు, ఇతర గృహోపకరణాలతోపాటు ఇతర ప్రొడక్ట్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. నెలవారీ అందించే రూ.1 సేల్తోపాటు పాటు ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా లభ్యం. కిరణా సరుకులపై రూ.1 డీల్స్ను అందిస్తోంది టీవీలపై 75శాతం డిస్కౌంట్ ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్పై 80 శాతం డిస్కౌంట్ దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై అదనంగా 15శాతం డిస్కౌంట్. హోం అండ్ ఫర్నిచర్పై 30నుంచి 75శాతం దాకా డిస్కౌంట్. ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం తగ్గింపు. బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, బుక్స్పై 80శాతం దాకా తగ్గింపు -
స్కోడా కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్ కార్ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్బ్యాక్ , బై బ్యాక్ లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రాపిడ్, ఆక్టావియా, కొడియాక్ తదితర కార్లపై దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు రాపిడ్ ( ఆంబిషన్ ఎంటీ డీజిల్, ఆంబిషన్ ఏటీ పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు డిస్కౌంట్ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఆంబిషన్ ఎంటీ డీజిల్ ఆంబిషన్ ఏటీ, పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోల్ మోడల్స్ పై రూ. 25వేల లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు రాపిడ్ మై 2018 రూ .1 లక్ష వరకు డిస్కౌంట్, దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా లభ్యం. ఆక్టావియా రూ. 50వేల వరకు డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల లోయల్టీ బోనస్ సూపర్బ్ మై 2019 రూ .50వేల డిస్కౌంట్ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం బై బ్యాక్ ఆఫర్ సూపర్బ్ మై -2018 కారుపై రూ .1.75 లక్షల డిస్కౌంట్ కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్. ఈ ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి. -
మారుతి కార్లపై భారీ తగ్గింపు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ షిప్ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఎర్టిగా ఫేస్లిఫ్ట్ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. -
గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఎయిర్ తక్కువ ధరల్లో దేశీయ విమాన టికెట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్గా తీసుకొస్తున్న ఈ ఆఫర్లో రూ.1375 (అన్నీ కలుపుకొని) ప్రారంభ ధరగా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 17 వరకు టికెట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణించేందకు గడువు జూన్ 2019తో ముగియనుంది. అహ్మదాబాద్- బెంగళూరు, బెంగళూరు-పట్నా, కోలక్తతా-ముంబై, కోలకతా-పుణే తదితర మార్గాల్లో ఈ డిస్కౌంట్లు రేట్లు వర్తిస్తాయని గో ఎయిర్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. It’s time to take off on that summer vacation! 🌴☀🌊 #FlySmart with domestic fares starting at ₹1,375*. Book now: https://t.co/dWTOajy6vD pic.twitter.com/Qh4pg9aroz — GoAir (@goairlinesindia) April 13, 2019 -
హానర్ గాలా ఫెస్టివల్ సేల్ : నేటి నుంచే
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ మేకర్ హానర్ ఫెస్టివ్సేల్ సోమవారం ప్రారంభమైంది. చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్లను అందిస్తోంది. నేటి (ఏప్రిల్ 8) నుంచి 12 వరకు సాగనుంది. ఈ కామర్స్ దిగ్గజాలు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా హానర్ గాలా ఫెస్టివ్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్ లో దాదాపు 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. హానర్ 9 ఎన్, హానర్ 9లైట్, హానర్ 7ఏ, హానర్ 10 లైట్ తదితర ఫోన్లతోపాటు టాబ్లెట్లు, తదితర ఉత్పత్తులపై ఈ తగ్గింపు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం రూ. 50 కోట్ల మేర ఈ ఆ ఫర్లను అందిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్కార్ట్ ధరలు : హానర్ 9 ఎన్ (4జీబీ/64జీబీ) వేరియంట్ను రూ. 9,499లకే అందిస్తోంది. అసలు ధర : రూ.13999. హానర్ 9 లైట్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. అసలు ధర రూ. 14,999 హానర్ 9 ఐ (4జీబీ/64జీబీ) వేరియంట్ ను రూ.10, 999లకే అందిస్తోంది. అసలు ధర రూ. 17999 అమెజాన్ ధరలు హానర్ ప్లే (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 13,999 లు. అసలు ధర 19,999 హానర్ 8 ఎక్స్ (4జీబీ/64జీబీ) వేరియంట్ ధర రూ. 12, 999లు. అసలు ధర 14,999 Celebrating 5 years of ‘Best Quality, True Price’ with #HONORGala. Sale Live on @Flipkart now - https://t.co/HbXIF9DLhw. Hurry! pic.twitter.com/EtHEbp5A7z — Honor India (@HiHonorIndia) April 8, 2019 -
రెడ్మికి ఝలక్ : 'రియల్మీ యో డేస్' సేల్
సాక్షి,ముంబై : చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో సబ్బ్రాండ్ రియల్మి మరోసారి డిస్కౌంట్లకు ఆఫర్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలతో 'రియల్మీ యో డేస్' సేల్ మరోసారి ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఇందులో ఆకర్షణీమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. రియల్మీ 2 ప్రొ, రియల్ మి యూ1 తదితర స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరలతో అందిస్తోంది. రియల్మీ 2 ప్రో (4జీబీ+64జీబీ) స్మార్ట్ఫోన్పై రూ.1,000 తగ్గింపుతో ధర రూ.11,990 లకే లభించనుంది. దీని అసలు ధర రూ.12990 6జీబీ+64జీబీ ధర రూ.14,990గా ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 10 ఉదయం 11 గంటలకు రియల్మీ 2 ప్రో కొనుగోలుపై రియల్మీ బడ్స్ ఉచితంగా అందివ్వనుంది. రియల్మీ యూ1 (3జీబీ+32జీబీ) ఫోన్పై రూ.1,000 డిస్కౌంట్తో రూ.9,999 కి లభ్యం. 3జీబీ+64జీబీ వేరియంట్ ధర,రూ.10,999 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. 8జీబీ ర్యామ్ స్మార్ట్ఫోన్ను రూ.15990లకే అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, రియల్ మి వెబ్సైట్ద్వారా ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అంతేకాదు రియల్ 3 ని రియల్మీ యో డే సేల్లో విక్రయించనుంది. Celebrating 6 Million users!#realmeYoDays 👉#realme2Pro -₹11,990 +1K off on prepaid on @Flipkart 👉#realmeU1 -₹9,999 +1K off on prepaid on @amazonIN 👉#realme Tech Backpacks at ₹1, free #realme Buds with realme2Pro & realme U1 on https://t.co/HrgDJTZcxv Starting 9th April. pic.twitter.com/eFxzZahOVR — realme (@realmemobiles) April 8, 2019 -
షావోమి ఫెస్టివ్ సేల్: రూ.9వేల దాకా డిస్కౌంట్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి మరోసారి ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్ సేల్ను మళ్లీ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు తాజా సేల్ద్వారా భారీ ఆఫర్లను అందిస్తోంది ఏప్రిల్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఫెస్టివ్ సేల్ కొనసాగుతుంది. ఆన్లైన్లో ఎంఐ.కాం, ఆఫ్లైన్ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర్లలో ఈ సేల్ ఉంటుంది. షావోమి లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు స్మార్ట్ టీవీలను కూడా తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోళ్లపై 5శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. షావోమి రెడ్మి 6, రెడ్మి వై2, రెడ్మి నోట్ 5ప్రొ, పోకో ఎఫ్1 ఎంఐ ఎల్ఈడీ టీవీ4 ప్రొలపై భారీ డిస్కౌంట్ను అందివ్వనుంది. Mi fans! The biggest offers, amazing deals, games and a lot more are here for you. #MakeTheMostOfMi in this #MiFanFestival. Check out now: https://t.co/5tWlIXPzyk 1500 RTs and we'll giveaway exciting prizes! pic.twitter.com/CgpgkmDvpQ — Mi India (@XiaomiIndia) April 1, 2019 -
ఎంఐ సూపర్ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, ముంబై : ఆన్లైన్ దిగ్గజాలు అమెజాన ఇండియా, ఫ్లిప్కార్ట్లు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్మేకర్ షావోమి కూడా తన ఆన్లైన్ సంస్థ ఎంఐ. కామ్ ద్వారా తగ్గింపు ధరలను ప్రకటించింది. ఎంఐ సూపర్ సేల్ ను ప్రారంభించింది. మార్చి 28 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. రెడ్మి నోట్ 6, రెడ్మి 6, షావోమి ఏ2, పోకో ఎఫ్ 1, రెడ్మి వై2, స్మార్ట్ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లను అందిస్తోంది. అలాగే మొబీక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డలుపై నోకాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్లు కూపన్ల, క్యాష్ బ్యాక్ను ఆఫర్ చేస్తోంది. షావోమి ఎం ఏ2 : ప్రారంభ ధర రూ. 14,999 రెడ్మి నోట్ 6ప్రొ: రూ. 13,999లకే లభ్యం. లాంచింగ్ ధర రూ.17,999 రెడ్మి 6 (3జీబీ /32జీబీస్టోరేజ్) : రూ. 7,499 రెడ్మి 6 (3జీబీ /64జీబీస్టోరేజ్ : రూ. 7,999 రెడ్మినోట్ 5 ప్రొ: రూ. 10,999 రెడ్మి వై2 (3జీబీ /32జీబీస్టోరేజ్) : రూ. 7,999 -
అమెజాన్కి కౌంటర్: ఫ్లిప్కార్ట్ బొనాంజా సేల్
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు వరుస ఆఫర్లతో స్మార్ట్ఫోన్ ప్రేమికులకు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ -2019ను సోమవారం ప్రకటించింది. మార్చి 28వరకు వరుసగా నాలుగురోజులపాటు ఈ సేల్ ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్స్ లను వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం అదనపు డిస్కౌంట్ను కూడా ఇవ్వనుంది. ముఖ్యంగా షావోమి రెడ్మి నో 6 ప్రొ, రెడ్మి 6 , పోకో ఎఫ్ 1 లను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే రియల్మి స్మార్ట్ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఏ 50, గెలాక్సీ ఏ 10, తోపాటు హానర్ 9 లైట్, హానర్ 9ఎన్, హానర్ 10 లైట్ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ తాజా మొబైల్ మొనాంజా సేల్ 2019లో లిస్ట్ అయి వుండటం విశేషం. -
అమెజాన్ ఫ్యాబ్ సేల్ : స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, ముంబై : అమెజాన్ మరోసారి డిస్కౌంట్ సేల్కు తెరతీసింది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను , ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది, దీంతో పాటు స్మార్ట్ఫోన్ యాక్ససరీస్లను కూడా తక్కువ ధరలకే అందిస్తోంది. నేటి (మార్చి 25నుంచి) 28వ తేదీవరకు ఈ సేల్ కొనసాగుతుంది రియల్ మీ యూ1 స్మార్ట్ఫోన్పై 2వేల తగ్గింపును అందిస్తంఓది. దీని అసలు ధర రూ. 11, 999. హువావే వై 9 పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అసలు ధర రూ. 15990. కాగా ప్రస్తుత ధర . 14,990. దీనిపై రూ. 13వేలకు పైగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇంకా వివో వై 83, వన్ ప్లస్ 6టీ, షావోమీ ఎంఐ ఏ2, వివో వి15ప్రొ తదితర స్మార్ట్ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది. -
అమెజాన్ హోలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం మరోసారి డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్ 2019 పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హావావే వై 9, వివో 5ప్రొ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్,కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ను ఆపర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాకు, 3టీబీ జియో డాటా ను అందివ్వనుంది. దీంతోపాటు హోలి స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మార్చి 9న మొదలైన ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. -
సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచి 60 ఏళ్లు పైబడిన భారత పౌరులు బుక్ చేసుకునే ప్రతి ఎకానమీ క్లాస్ టికెట్పైనా 50 శాతం వరకూ రాయితీని ఆఫర్ చేయనున్నారు. 60 సంవత్సరాలు మించిన సీనియర్ సిటిజన్లు వయసును ధ్రువీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిన సరైన గుర్తింపు కార్డులను చూపి ఈ ఆఫర్ను పొందవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణ తేదీకి వారం రోజుల ముందు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు చిన్నారులతో ప్రయాణించే సీనియర్ సిటిజన్కు రూ 1000ల ప్రత్యేక డిస్కౌంట్ను కూడా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్తో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. -
హువావే హాలిడే సేల్ : రూ.15వేల డిస్కౌంట్
హువావే తన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా స్మార్ట్ఫోన్లపై 15వేల రూపాయల దాకా డిస్కౌంట్ను అందిస్తోంది. హువావే హాలిడే సేల్ను అమెజాన్ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదపాయం కూడా ఉంది. హువావే పీ20లైట్, పీ 20ప్రొ నోవా 3ఐ, నోవా 3స్మార్ట్ఫోన్లపై ఈ భారీ డిస్కౌంట్లను హువావే ప్రకటించింది. భారీ ఆఫర్లివే.. హువావే పీ 20 ప్రొ : ఈ స్మార్ట్ఫోన్పై 15వేల రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. హాలిడే సేల్ లో ఈ స్మార్ట్ఫోన్ రూ. 54,999లకే లభ్యం. ఫీచర్లు: 6.1 అంగుళాల డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 40+24+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే పీ 20లైట్: రూ. 8వేల డిస్కౌంట్ అనంతరం ఇపుడు రూ.14,999 లకే లభ్యం ఫీచర్లు: 5.84 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్,64జీబీ స్టోరేజ్, 24+16ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీకెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ నోవా 3ఐ: రూ.7వేల డిస్కౌంట్తో రూ. 16,990 లకే అందుబాటులో ఉంది. ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్,16+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్ రిసెల్ఫీ కెమెరా, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ నోవా 3 : 10వేల రూపాయల తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ. 29,999లకే విక్రయిస్తోంది. ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 24+16ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్
న్యూయార్క్ : క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ విమానాలపై రూ 1000, అంతర్జాతీయ విమానాలపై 12 శాతం తగ్గింపును ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసింది. వీటికితోడు హోటల్ బుకింగ్స్పై 50 శాతం తగ్గింపును ఆఫర్ చేసింది. ఇక బస్ ప్రయాణీకులకూ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. బస్ టికెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. మరోవైపు ఈ ఆఫర్లను ఉపయోగించుకునేందుకు ఎలాంటి కూపన్ కోడ్ను వాడాల్సిన పనిలేదు. ఫ్లిప్కార్ట్ తాజా ఆండ్రాయిడ్ యాప్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్లోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఇండిగో న్యూ ఇయర్ సేల్కు ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 రూపాయల నుంచి ఇండిగో ఆఫర్ చేస్తోంది. -
రెడ్మి నోట్ 6ప్రో లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న చైనా మొబైల్ దిగ్గజం షావోమి నాలుగు(క్వాడ్) కెమెరాలతో సరికొత్త ఫోన్నున విడుదల చేసింది. నోట్ సిరీస్లో భాగంగా రెడ్మి నోట్ 6ప్ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. రేపు (నవంబరు23) మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా తొలి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సందర్భంగా మొదటి రోజున కస్టమర్లకు బంపర్ఆఫర్ ఇస్తోంది. అసలు ధరపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.500 తక్షణ క్యాస్బ్యాక్ లభించనుంది. అంతేకాదు ట్విటర్లో సెలబ్రిటీల ఫోటోలతో సందడి చేసింది ఎంఐ. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4+64 జీబీ ధర 12,999 (మొదటి రోజు మాత్రమే) 6+64 జీబీ ధర 14,999 (మొదటి రోజు మాత్రమే) -
ఫ్లిప్కార్ట్ దివాలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: రానున్న దీపావళి సందర్భంగా ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీసేల్ను ప్రారంభించింది. నేటి (గురువారం,నవంబరు 1) నుంచి అయిదురోజుల పాటు నవంబరు 5 దాకా వివిధ ఉత్సత్తులపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10శాతం తగ్గింపు. రెడ్మి నోట్ 5 ప్రొ, పోకో ఎఫ్ 1, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ : 2 వేల రూపాయల తగ్గింపుతో రూ. 12,999 లకే లభ్యం. పోకో ఎఫ్1: షావోమి సబ్బ్రాండ్ తీసుకొచ్చిన పోకో ఎఫ్1 (6జీబీ/128 జీబీ స్టోరేజ్) పై 3వేల రూపాయల డిస్కౌంట్. రూ.21.999లకు అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 (8జీబీ/1256 జీబీ స్టోరేజ్) 4వేల రూపాయల తగ్గింపు అనంతరం రూ.26,999 లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్: రూ. 5499 డిస్కౌంట్తో 40,999లకే అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్బీఐకార్డుపై 10శాతం డిస్కౌంట్ కలుపుకుని ఈ సేల్ లో ఫ్లిప్కార్ట్ రూ. 36,999లకే అందిస్తోంది. హానర్ 9 ఎన్: 4వేల రూపాయల తగ్గింపుతో 9999 రూపాయలకు లభ్యం. వీటితోపాటు హానర్10, ఆసుస్జెన్ ఫోన్లపై కూడా డిస్కౌంట్ను ప్రకటించింది. ఇంకా టీవీలు, ఎలక్రానిక్స్ ఉత్పత్తులు, ఫర్నిచర్పై 80శాతంగా దాకా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది -
సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): ప్రత్యేక ఆఫర్లు, సరికొత్త మోడళ్లతో సెల్ పాయింట్ షోరూంలు కళకళలాడుతున్నాయి. కాంబో, జోడీ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభి స్తోంది. ఈ సందర్భంగా సెల్ పాయింట్ ఎండీ మోహన్ప్రసాద్ పాండే, డైరెక్టర్ బాలాజీప్రసాద్ పాండే మాట్లాడుతూ దసరాతో పాటు షోరూం 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు. సామ్సంగ్, సోనీ, నోకియా, ఎల్జీ, మోటో, జియోనీ, ఐఫోన్, వివో, ఒప్పో, ఎంఐ తదితర కంపెనీల సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని తెలిపారు. బజాజ్ ఫిన్సర్వ్, హోమ్ క్రెడిట్, కేపిటల్ ఫస్ట్ ద్వారా నెలవారీ సులభ వాయిదా పద్ధతులు, జీరో పర్సంట్ డౌన్పేమెంట్ అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 90 శాఖల ద్వారా రూ.కోట్ల విలువైన బహుమతులను గెలుచుకోవచ్చని చెప్పారు. బంపర్ డ్రా కింద వంద మంది వినియోగదారులకు 10 గ్రాముల బంగారం, లక్కీ డ్రా కింద వంద ఎల్సీడీ టీవీలు, వంద రిఫ్రిజరేటర్లు, వంద వాషింగ్ మెషీన్లు, వంద మైక్రో ఓవెన్లతో పాటు స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ప్రెజర్ కుక్కర్, ఐరన్ బాక్స్లు కచ్చిత బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. సామ్సంగ్ జే6+ కొనుగోలుపై రూ.1,500 క్యాష్బాక్, సామ్సంగ్ జే4+ కొనుగోలుపై రూ.750 క్యాష్బ్యాక్ ఇస్తున్నామన్నారు. వీవో వి–11 ప్రోపై 5 శాతం క్యాష్బ్యాక్, ఒప్పో ఎఫ్–9 ప్రోపై 10 శాతం క్యాష్బ్యాక్, రూ.3,990 విలువ గల పెబ్బల్ (బ్లూటూత్ స్పీకర్) ఇస్తున్నట్టు చెప్పారు. నోకియా 6.1 కొనుగోలుతో ట్రాలీబ్యాగ్ అందజేయనున్నట్టు తెలి పారు. కొన్ని ఫోన్లు ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
భారీ డిస్కౌంట్లకు ఇదే చివరి అవకాశం
న్యూఢిల్లీ : ఈ పండగ కాకపోతే.. వచ్చే పండగ. లేదా ఆ తర్వాత ఫెస్టివల్కు చూసుకోవచ్చులే. ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్స్, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట. వచ్చే దివాళి సేల్ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. షావోమి, హానర్, వన్ప్లస్, శాంసంగ్, ఆసుస్ వంటి స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే వైట్ గూడ్స్ తయారీదారులు పానాసోనిక్, బోస్, బీఎస్హెచ్ ఎలక్ట్రానిక్స్ కూడా పండగ సీజన్ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచింది. సరిగ్గా పండగ సీజన్కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు. కానీ ఈ పండగ సీజన్ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్ అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘రూపాయి క్షీణత నిజంగా పెద్ద తలనొప్పి. సాధారణంగా స్మార్ట్ఫోన్ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్ వాల్యుమ్ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం’ అని హువావే, హానర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్ప్లస్, షావోమి తెలిపాయి. ఈ పండగ సీజన్ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. -
మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్పై రూ.70వేల వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ అందించే మోడల్స్లో స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎర్టిగా.. మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్ కింద, ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ రూ.15వేల నగదు డిస్కౌంట్తో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్పై రూ.20వేల డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా సీఎన్జీ ట్రిమ్పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్ వేరియంట్పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి. డిజైర్... మారుతీ సుజుకీ డిజైర్(పెట్రోల్) రెగ్యులర్ ఎడిషన్పై రూ.20వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. స్పెషల్ ఎడిషన్పై రూ.27వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్ డీజిల్ వేరియంట్పై రూ.10వేల నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్... మారుతీ సుజుకీ స్విఫ్ట్ రెగ్యులర్ పెట్రోల్ ట్రిమ్ వేరియంట్పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వేరియంట్పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్(డీజిల్)పై రూ.10వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో/ఆల్టో కే10... ఆల్టో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్ను, అన్ని మోడల్స్పై రూ.30వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
ఇండిగో ఇండిపెండెన్స్ డే సేల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఇతర విమానయాన సంస్థలు డిస్కౌంట్ స్కీమ్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండిగో కూడా రూ. 981కే విమాన టికెట్ను అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో పరిమితకాల ఆఫర్ కింద పరిమిత సీట్లను అందిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 15లోపు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా బుక్ చేసుకున్నటికెట్ల ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. వెబ్సైట్ అందించిన సమాచారం శ్రీనగర్, జమ్ము మధ్య రూ.981 టికెట్ను అందిస్తుండగా హైదరాబాద్-అహ్మదాబాద్ (రూ.1,992), హైదరాబాద్-లక్నో (రూ.2,456), కోల్కతా-బెంగళూరు (రూ .3,634), కోలకతా-భువనేశ్వర్ (రూ .1,379), కోలకతా-ఢిల్లీ (రూ. 2,836), కోలకతా-హైదరాబాద్ (రూ.2,594) ముంబై-బెంగళూరు (రూ.1,748), ముంబై-ఢిల్లీ (రూ .2,255), బెంగళూరు-ఢిల్లీ (రూ .2,929) అహ్మదాబాద్-బెంగళూరు (రూ.2,078), అహ్మదాబాద్-ఢిల్లీ (రూ.1,415), బాగ్డోగ్ర-కోల్కతా (రూ .1,613), బెంగళూరు-గోవా (రూ.1,782), బెంగళూరు-గోవా (బెంగళూరు) రూ.1,782), గౌహతి-కోల్కతా (రూ .1,793) ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. -
డిస్కౌంట్ల ఆషాఢం
విజయనగరం టౌన్ : ఆషాఢమాసం పూర్తి కావస్తోంది. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు దుస్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వస్త్ర దుకాణాల వారు స్పెషల్ డిస్కౌంట్ల పేరుతో పలు రకాల వస్త్రాలను మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు. అతివలు ఎక్కువ మక్కువ చూపే చీరలు, బంగారు ఆభరణాలపై వ్యాపారులు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఆషాఢం సేల్ పేరుతో మహిళలను దుకాణదారులు ఆకర్షిస్తున్నారు. పట్టుచీరలకు డిస్కౌంటే.. వ్యాపారులు ప్రధానంగా ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, కంచి, పోచంపల్లి తదితర పట్టుచీరలకు, వీటితో పాటు టిష్యూ శారీస్, కళంకారీ ప్రింట్స్, కాటన్ శారీస్, గద్వాల్, లెనిన్ కాటన్, చేనేత వస్త్రాలు, వెంకటగిరి తదితర చీరలకు గిరాకీని దృష్టిలో ఉంచుకుని డిస్కౌంట్లను పెడుతున్నారు. రూ.500 నుంచి రూ.50 వేల వరకు పట్టు, ఫ్యాన్సీ, కాటన్ చీరలు అందుబాటులోఉన్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే ఆషాఢంలో దాని ధర తక్కువగా ఉంటుంది. రాబోయే శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ దేవీకి స్వాగతం పలికేందుకు కాసుల దగ్గర నుంచి ఆభరణాల వరకు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దాని కోసం ముందుగానే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లోని మాల్స్, బంగారు దుకాణాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చిన్నపాటి చిరుజల్లులను కూడా లెక్క చేయకుండా మహిళలు కొనుగోళ్లు చేస్తుండడం విశేషం. నవ వధువులకు వరం.. ఆషాఢ మాసంలో కన్నవారింటికి నవ వధువులు వెళ్తారు. మళ్లీ అత్తింటి వారింటికి వెళ్లే సమయంలో బంగారం, వస్త్రాలను కన్నవారు పెట్టడం ఆనవాయితీ. దానికోసం ఆషాడంలోనే ముందుగా బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఆషాఢం నుంచి శ్రావణంలోకి అడుగు పెట్టేందుకు నవ వధువులు వేచి చూస్తుంటారు. ధరలు తక్కువ.. ఆషాఢంలో ధరలు తక్కువగా ఉంటాయి. దుస్తులు కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపుతారు. శ్రావణ మాసం ముందు ఉండడంతో డిస్కౌంట్లు ఉండడంతో మహిళలు ఎక్కువ మక్కువ చూపుతారు. బంగారం కూడా ఈ మాసంలోనే కొనుగోలు చేస్తారు. – భోగరాజు సూర్యలక్ష్మి, ఉద్యోగిని. ఆషాడం ఓ వరం.. మహిళలకు ఆషాఢ మాసం ఓ వరమని చెప్పొచ్చు. ఏడాదిలో ఈ నెలలోనే తక్కువ ధరలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాసం చివరి రోజుల్లో ధరలు మరీ తగ్గించి అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకోసం ప్రత్యేక బోర్డులు కూడా మార్కెట్లో వెలుస్తాయి. ఉన్నంతలో వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. – జయలక్ష్మి, గృహిణి. -
అమెజాన్ ‘ఫ్రీడం సేల్’ : డిస్కౌంట్లే డిస్కౌంట్లు
ఈ-కామర్స్ కంపెనీలు మళ్లీ డిస్కౌంట్లతో మారుమోగించబోతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల సేల్కు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు ‘ఫ్రీడం సేల్’ పేరుతో డిస్కౌంట్లకు తెరలేపుతోంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లియెన్స్, టీవీలు వంటి ఉత్పత్తులపై 20వేలకు పైగా డీల్స్ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్లో వన్ప్లస్, వివో, జేబీఎల్, ఎల్జీ, ఫిలిప్స్, క్యాసియో వంటి అన్ని రకాల బ్రాండ్లు పాల్గొనబోతున్నాయి. అమెజాన్ ఎకో డివైజ్లు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లీ ఈ-రీడర్స్ వంటి అన్ని డివైజ్లపై అదనంగా గ్రేట్ డిస్కౌంట్లను అమెజాన్ అందించబోతుంది. వన్ప్లస్ 6, హానర్ 7ఎక్స్, రియల్మి 1, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, వివో ఎక్స్21, హువావే పీ20 లైట్ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది. ఈ సేల్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ డీల్స్ను, డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పీసీ యాక్ససరీస్పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ టీజ్ చేసింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.భారత్లో ఎక్కువగా సందర్శించే షాపింగ్ ప్లేస్ అమెజాన్ అని, ప్రతి పండుగను తమ కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు. ఈ సీజన్లో కస్టమర్లు ఆశించే ప్రతీది తాము ఈ ఫ్రీడం సేల్లో ఆఫర్ చేస్తామని తెలిపారు. కొత్త ప్రొడక్ట్ల లాంచింగ్, గ్రేట్ డీల్స్, ఎక్స్ట్రా క్యాష్బ్యాక్లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆప్షన్లను అందిస్తూ అమెజాన్.ఇన్ ఈ ఫ్రీడం సేల్ను ఘనంగా నిర్వహించనుందని పేర్కొన్నారు. ఈ ఫ్రీడం సేల్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతూ ఉత్పత్తులు కొనేవారికి 10 శాతం అదనపు క్యాష్బ్యాక్ కూడా లభించనుంది. -
ఎయిర్ ఏషియా బంపర్ సేల్
సాక్షి,ముంబై: ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బై మోర్, సేవ్ మోర్ ఆఫర్లో భాగంగా దేశీయ,అంతర్జాతీయ ప్రయాణాలపై 40 శాతం (వన్ వే)రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లపై రేపటి నుంచి (31 జూలై)నవంబరు 30 మధ్య ప్రయాణించవచ్చు. ఆగస్టు 5 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలోనూ 40 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఎయిర్ ఏషియా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్రిడిట్, డెబిట్, చార్జ్కార్డ్ ద్వారా జరిగే పేమెంట్స్ ప్రాసెసింగ్ ఫీ నాన్-రిఫండబుల్. సీట్లు పరిమితంగా ఉంటాయి. ఎంపిక చేసిన విమానాలకు ఆఫర్ టికెట్లు వర్తించనున్నాయి. టికెట్లన్నీ సింగిల్ జర్నీకి ఉద్దేశించినవనీ, ఆఫర్లో భాగంగా జరిగే ఫేమెంట్స్ రిఫండ్ చేయనమని ఎయిర్ ఏషియా వెల్లడించింది. -
స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఆరు రోజుల క్రితమే బిగ్ షాపింగ్ డేస్ సేల్తో కస్టమర్లను ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సేల్కు ఫ్లిప్కార్ట్ తెరలేపింది. జూలై 23 నుంచి జూలై 29 వరకు సూపర్ వాల్యు వీక్ సేల్ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఈ వీక్లో భాగంగా స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ సూపర్ వాల్యు వీక్లో భాగంగా ఫ్లిప్కార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో జత కట్టింది. దీనిలో భాగంగా మూడు, ఆరు, తొమ్మిది నెలల ఇన్స్టాల్మెంట్స్ను ఎంపిక చేసుకున్న కస్టమర్లకు జీరో ఇంటరస్ట్ ఈఎంఐను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. సూపర్ వాల్యు వీక్లో స్మార్ట్ఫోన్లపై అందించే టాప్ డీల్స్ ఇవే... హానర్ 9 లైట్... హువావే ఈ-బ్రాండులో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లలో హానర్ 9 లైట్ ఒకటి. ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు రూ.1500 మినిమమ్ ఎక్స్చేంజ్ బెనిఫిట్లో అందుబాటులో ఉంది. రూ.14వేల వరకూ ఈ ఎక్స్చేంజ్ బెనిఫిట్ను పొందవచ్చు. నెలకు రూ.625తో నో-కాస్ట్ ఈఎంఐ కూడా ప్రారంభమవుతోంది. 3000 రూపాయల డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ఫోన్ రూ.10,999కు అందుబాటులో ఉంది. వివో ఎక్స్21... వివో ఎక్స్21 స్మార్ట్ఫోన్ రూ.35,990కు భారత్లో లాంచ్ అయింది. 7000 రూపాయల మినిమమ్ ఎక్స్చేంజ్ బెనిఫిట్తో ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. నెలకు రూ.1500 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్పై రూ.21వేల తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డుదారులకు అదనంగా 5 శాతం తగ్గింపును ఇస్తోంది. ఒప్పో ఏ83... 3000 రూపాయల మినిమమ్ ఎక్స్చేంజ్ బెనిఫిట్తో ఒప్పో ఏ83 స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ సూపర్ వాల్యు వీక్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ నెలకు రూ.1,555తో నో-కాస్ట్ ఈఎంఐతో ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్పై రూ.13వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఒప్పో ఎఫ్5 యూత్.. ఒప్పో ఎఫ్5 యూత్ స్మార్ట్ఫోన్పై 3000 రూపాయల వరకు మినిమమ్ ఎక్స్చేంజ్ బెనిఫిట్ లభిస్తోంది. నెలకు రూ.1,666తో నో-కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. రూ.14వేల వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్ లభ్యమవుతోంది. హానర్ 9ఐ.... ఫ్లిప్కార్ట్ సూపర్ వాల్యు వీక్లో హానర్ 9ఐ స్మార్ట్ఫోన్ రూ.15,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ నెలకు రూ.667తో నో-కాస్ట్ ఈఎంఐ ప్రారంభమవుతుంది. రూ.15వేల వరకు ఎక్స్చేంజ్పై తగ్గింపు లభిస్తుంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యులో వెయ్యి రూపాయల తగ్గింపు కూడా కస్టమర్లకు ఆఫర్ చేస్తుంది. -
వన్ప్లస్ ఎక్స్క్లూజివ్ సేల్, వారికోసమే..
సేల్స్.. డిస్కౌంట్ ఆఫర్లతో ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లు మోరుమోగుతున్నాయి. ఇటీవలే అమెజాన్ తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఎక్స్క్లూజివ్ డీల్స్ను, బంపర్ డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 గంటల పాటు లాంగ్ ఈవెంట్ను నిర్వహించింది. ఫ్లిప్కార్ట్ సైతం బిగ్ షాపింగ్ డేస్ సేల్కు తెరలేపింది. తాజాగా చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి వన్ప్లస్ సైతం సొంతంగా ఓ వినూత్నమైన సేల్ను ప్రారంభిస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్గా విద్యార్థులకు మాత్రమే. బ్యాక్-టూ-స్కూల్-సేల్ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, జూలై 30తో ముగియనుంది. ఈ సేల్లో వన్ప్లస్ ఉత్పత్తులు కొనుగోలు చేసే విద్యార్థులకు బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. వన్ప్లస్ ఉత్పత్తులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే ఈ సేల్ లక్ష్యమని కంపెనీ చెప్పింది. ఈ సేల్లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్పై భలే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో వన్ప్లస్ 6 కొనుగోలు చేసే వారికి రూ.1500 డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాక అమెజాన్ను నుంచి ఈ ఫోన్ను కొనుగోలు చేయాలని భావించే వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు వన్ప్లస్ కేసులు, కవర్లపై వన్ప్లస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్ ఖరీదు రూ.34,999గా ఉంది. ‘మా కోర్ యూజర్లు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు. అంటే మా కమ్యూనిటీ మొత్తంలో 30 శాతం. విస్తృతంగా పరిశోధన చేసిన అనంతరం, కన్జ్యూమర్లు డివైజ్లను కొంటారు. విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారులు. ఈ నేపథ్యంలో మా ప్రీమియం స్మార్ట్ఫోన్లో పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం’ అని వన్ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ అన్నారు. -
ప్రైమ్ డే : రూ.15 వేల కింద బెస్ట్ స్మార్ట్ఫోన్లివే!
అంతర్జాతీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జూలై 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్, నేటి అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. ఈ సేల్లో అన్ని బ్రాండు ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. ఫ్యాషన్, లైఫ్స్టయిల్, హోమ్ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. బెస్ట్ స్మార్ట్ఫోన్లకు కూడా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్లో 15 వేల రూపాయలకు కింద లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏమిటో ఓ సారి చూద్దాం.. శాంసంగ్ గెలాక్సీ ఆన్8 - రూ.9,990(అసలు ధర రూ.13,490) నోకియా 5(16జీబీ) - రూ.11,599 (అసలు ధర రూ.15,299) ఎల్జీ క్యూ6ప్లస్ - రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 - రూ.12,990కు తగ్గింపు హానర్ 7ఎక్స్(64జీబీ) - రూ.13,999కు లభ్యం జియోని ఎం7 పవర్ - రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్(64జీబీ) - రూ.11,990కు తగ్గింపు ఒప్పో ఏ57(32జీబీ) - రూ.11,990(అసలు ధర రూ.14,990) ఆసుస్ జెన్ఫోన్4 సెల్ఫీ - రూ.7,999(అసలు ధర రూ.10,999) కార్బన్ ఫ్రేమ్స్ ఎస్9 - రూ.5,899(రూ.8,999) రెడ్మి వై2 స్మార్ట్ఫోన్ 32 జీబీ వేరియంట్ కూడా రూ.9999కు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వచ్చింది. హానర్ 7సీ కూడా రూ.9499కు, మోటో ఈ5 ప్లస్ కూడా రూ.11,999కు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా మోటో జీ5ఎస్ ప్లస్ 64జీబీ వేరియంట్పై 29 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్తో పాటు, పవర్ బ్యాంక్లు, స్క్రీన్ ప్రొటెక్టర్లు, కేసెస్, కవర్స్, డేటా కేబుల్స్ వంటి మొబైల్ యాక్ససరీస్పై సుమారు 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. -
నేటి నుంచే సేల్ : మొబైల్ ఫోన్లపై సగం ధర తగ్గింపు
బెంగళూరు : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, 36 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సేల్ ఆఫర్ కింద స్మార్ట్ఫోన్స్పై అమెజాన్ సుమారు సగం శాతం మేర ధరలు తగ్గిస్తోంది. మొబైల్ ఫోన్లపై 40 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రైమ్ డే సేల్లో, వన్ప్లస్, హెచ్పీ, ఏసర్ వంటి టాప్ బ్రాండ్లు కొత్త కొత్త ప్రొడక్ట్లను ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయబోతున్నాయి. ప్రైమ్ మెంబర్లు క్విజ్లో పాలుపంచుకుని, వన్ప్లస్ 6 స్మార్ట్ఫోన్ను గెలుచుకునే అవకాశం పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, మోటో జీ6 వంటి వాటిపై సమర్థవంతమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు, హానర్ 7ఎక్స్ స్మార్ట్ఫోన్పై 3వేల రూపాయల వరకు ధర తగ్గింపు, నోట్8పై రూ.10 వేల ధర తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. హానర్ 7సీ, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, హువావే పీ20 ప్రొ, లైట్, వివో వీ7ప్లస్, వివో వీ9 స్మార్ట్ఫోన్లు కూడా ఆఫర్లో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా యాక్ససరీస్పై కూడా 80 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్, కేసెస్ అండ్ కవర్స్, డేటా కేబుల్స్ వంటి వాటిపై 80 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ప్రకటించింది.ఇ-కామర్స్ సైట్ అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రిడెట్, డెబిట్ కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ పే కస్టమర్లకు 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తోందని కంపెనీ వెల్లడించింది. పాత ఫోన్ల మార్పులపై రూ. 3000 ఆఫర్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ : క్రేజీ డీల్స్
బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కౌంటరిచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్కు పోటీగా ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ను ప్రకటించింది. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ షాపింగ్ డేస్, జూలై 19 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, డ్రస్లు, గాడ్జెట్లు వంటి ఇతర ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను, బిగ్ డీల్స్ను అందించనున్నట్టు తెలిపింది. కాగ, అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 16నే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుండగా.. ఫ్లిప్కార్ట్ సేల్ ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. ఈ సేల్ భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇన్స్టాంట్ 10 శాతం డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తుంది. ఈ సేల్ తేదీల్లో ప్రతి ఎనిమిది గంటలకు ఒక్కసారి భారీగా ధరల తగ్గింపు ఉంటుంది. ఈ సేల్ ప్రారంభమైన తొలి రెండు గంటలు ‘రష్ అవర్’ డీల్స్ను ఫ్లిప్కార్ట్ నిర్వహించబోతుంది. అంటే జూలై 16న సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ డీల్స్ను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. అదనంగా నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్స్ను కూడా ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తుంది. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు : ఈ సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ఫోన్ రూ.42,999కే అందుబాటులో ఉంటుంది. దీనిలోనే ఎక్స్చేంజ్పై 3 వేల రూపాయల తగ్గింపు, 8 వేల రూపాయల క్యాష్బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 37 వేల రూపాయల వరకు బై-బ్యాక్ ఆఫర్ గ్యారెంటీ కూడా ఈ స్మార్ట్ఫోన్కు లభ్యమవుతుంది. ఈ సేల్లో శాంసంగ్ ఫోన్ల ధరలు 10,900 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. హానర్ 9 లైట్ కూడా స్పెషల్ ఆఫర్ కింద అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో భాగంగా ఏ స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకున్న కనీసం వెయ్యి రూపాయలు తగ్గింపును యూజర్లు పొందనున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, యాక్ససరీస్ : గేమింగ్ ల్యాప్టాప్లపై 37 వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ను పొందవచ్చు. ఏసర్ ప్రిడేటర్ హిలియోస్ 300 ల్యాప్టాప్ ధర రూ.89,990 నుంచి రూ.63,990కు తగ్గుతుంది. హెడ్ఫోన్లు, ఛార్జర్స్పై 75 శాతం డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తుంది. 999 రూపాయల కంటే తక్కువకే బ్లూటూత్ స్పీకర్స్ లభ్యం కానున్నాయి. టీవీ, అప్లియెన్స్ : శాంసంగ్ 80సీఎం(32) హెచ్డీ టీవీను రూ.16,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఎయిర్ కూలర్స్, ఫ్యాన్లను రూ.999 నుంచే ఆఫర్ చేస్తుంది. వస్త్రాలు, ఇతర యాక్ససరీస్ : ఈ సేల్లో టీ-షర్ట్లు, షార్ట్లపై 50 శాతం తగ్గింపును అందుబాటులో ఉంచుతుంది. రెండు జతల సన్ గ్లాసెస్ను రూ.999కే అందిస్తుంది. స్నీకర్స్, బ్యాగ్స్, వాలెట్స్, జువెల్లరీ, అబ్బాయిల వస్త్రాలు, ఫుట్వేర్, కిడ్స్ ఫ్యాషన్ వంటి వాటిపై సుమారు 80 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుంది. ఇలా ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండే మెజార్టీ ఉత్పత్తులపై కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. -
12 లక్షల సీట్లపై డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్లైన్ ఇండిగో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా 12 లక్షల సీట్ల ఛార్జీలను అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ టిక్కెట్లు 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకు ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఇండిగో సేల్ మంగళవారం నుంచి ప్రారంభమై, శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సేల్ వివరాలను ఇండిగో క్యారియర్ తన వెబ్సైట్లో పొందుపరిచింది. అన్ని ఛానల్స్ ద్వారా బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లకు ఈ ఆఫర్ వాలిడ్లో ఉంటుందని ఇండిగో తెలిపింది. తక్కువ విమాన టిక్కెట్ ఛార్జీలే కాక, ఈ ఎయిర్లైన్ ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్లు జరిపే బుకింగ్స్పై 5 శాతం క్యాష్బ్యాక్ అందించనున్నట్టు కూడా పేర్కొంది. అయితే కనీస లావాదేవీ రూ.3000 మేర ఉండాలి. ఒక్కొక్కరికి 500 రూపాయల క్యాష్బ్యాక్ లభించనుంది. 2018 సెప్టెంబర్ 14న క్యాష్బ్యాక్ మొత్తాన్ని కస్టమర్ల అకౌంట్లో క్రెడిట్ చేయనున్నారు. ‘దేశీయ విమానయాన సంస్థ సీట్లపై అతిపెద్ద సేల్ను ప్రకటించడం ఆనందాయకంగా ఉంది. ఆగస్టు 4న ఇండిగో 12వ ఏటా అడుగుపెడుతోంది. ఈ సందర్భాన్ని తీపి గుర్తుగా మరలుచుకునేందుకు, 57 సిటీల్లో తమ నెట్వర్క్ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచాం’ అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. దేశీయంగా ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం 1,086 రోజువారీ విమానాలను ఇది ఆపరేట్ చేస్తోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ మార్గాలను ఇది కనెక్ట్ చేస్తోంది. గోఎయిర్, ఎయిర్ఏసియా, స్పైస్జెట్ విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ సేల్ ప్రకటించిన అనంతరం ఇండిగో ఈ ఆఫర్ ప్రకటించింది. -
మాన్సూన్ స్పెషల్ : ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్లు
మాన్సూన్ వచ్చేసింది.. విమానయాన సంస్థలు కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికుల ముందుకు వచ్చేశాయి. గగనతలంలో ఒక్కసారైనా చక్కర్లు కొట్టాలనే ఆశపడే వారి కలల్ని నేరవేర్చేందుకు విమానయాన సంస్థలు బిగ్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని సెక్టార్లలో విమాన టిక్కెట్లను అత్యంత తక్కువగా రూ.1,199కే ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్లైన్స్ ఆఫర్ చేసే టిక్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.. స్పైస్జెట్: ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమానాల్లో ప్రయాణించడానికి రూ.1,149 నుంచి టికెట్లు విక్రయిస్తోంది స్పైస్జెట్ సంస్థ. ఈ టిక్కెట్లను ఈనెల 30 వరకు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణకాలం జులై 1 నుంచి అక్టోబరు 8 మధ్యలో చేయవలసి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో వన్ వే ధరలకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందబుఆటులో ఉంటుంది. ఇండిగో: ఎంపిక చేసిన మార్గాల్లో, ఎంపిక చేసిన విమానాలకు అన్ని ఎక్స్క్లూజివ్ ఫేర్స్ను కలుపుకుని టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభవుతుంది. ఇవి కూడా జూన్ 30 లోపు బుక్ చేసుకోవాలి. ప్రయాణం జులై 11 నుంచి సెప్టెంబరు 27 మధ్య చేసేవారికి అనుకూలం. మధ్యలో ఆగి మరో చోటుకి వెళ్లాలంటే కుదరదు. నాన్స్టాప్ గమ్యాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. గ్రూప్ బుకింగ్స్కు ఇది అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ బుకింగ్స్ ట్రావెల్ చేయడానికి 15 రోజుల ముందు వరకు మాత్రమే వాలిడ్లో ఉంటాయి. గో ఎయిర్: స్వదేశంలో ప్రయాణానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 30 వరకి ఈ బుకింగ్ పిరియడ్ ఉంటుంది. జూలై 10 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి. బ్లాక్ తేదీలు అమల్లో ఉంటాయని, టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే వీటిని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందని గోఎయిర్ తెలిపింది. తేదీ మార్పు లేదా రూట్ల మార్పు ఉండదు. ఇన్ఫాంట్ బుకింగ్కు ఇది అందుబాటులో ఉండదు. తేదీ మార్పు, రీబుకింగ్, రీఫండ్ ఛార్జ్లు ఫేర్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. జెట్ ఎయిర్వేస్: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే వారికి కనీసధరపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. ఇది కూడా జూన్ 30 వరకే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 5 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఆమ్స్టర్ డ్యామ్, కొలంబో, పారిస్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇండియాలోనే ప్రయాణించాలనుకునే ఎంపిక చేసిన విమానాల ఎకానమీ టిక్కెట్ల బేస్ ఛార్జీకి 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు 30 శాతం వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రయాణాలనుకునే తేదీకి 15 రోజుల ముందస్తుగా ఈ టిక్కెట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కిందనే అంతర్జాతీయ మార్గాల్లో ఎకానమీ విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయలు, ప్రీమియర్ విమాన టిక్కెట్లపై 2500 రూపాయల తగ్గింపు కూడా లభిస్తోంది. ఎయిరేషియా: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణానికి 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులో జులై 1 వరకు టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. జులై 2 నుంచి నవంబరు 30 మధ్య ప్రయాణించే సౌలభ్యం ఉంది. వన్వేకి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పేర్ల మార్పు ఉండదు. ట్రూజెట్: హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.899 నుంచి ప్రారంభమవుతుంది. తమ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలంటే కూడా రాయితీ ఉంటుందని కంపెనీ తెలియజేసింది. -
ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ కార్లపై భారీ డిస్కౌంట్లు
ఫోర్డ్ ఇండియా తన ఫిగో హ్యాచ్బ్యాక్, ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్చేసింది. ఈ రెండు కార్లను డీలర్ వద్ద లక్ష రూపాయల డిస్కౌంట్లో విక్రయానికి ఉంచింది. దీంతో కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరికొన్ని వారాల్లో వీటి ఫేస్లిఫ్ట్ మోడల్స్ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో వాటి కంటే ముందే ఈ కార్ల పాత స్టాక్ను క్లియర్ చేయాలని ఫోర్డ్ ఇండియా భావిస్తోంది. గుజరాత్లో రూపొందిన ఫిగో నికర విక్రయాలు వెయ్యి యూనిట్లు ఉండగా.. ఆస్పైర్ విక్రయాలు సుమారు రెండు వేలు. 2015లో ఈ రెండు కార్లను ప్రవేశపెట్టారు. ఈ రెండు కార్లు దేశంలో కారు ఔత్సాహికులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మకాలు నిలకడగా తగ్గుముఖం పట్టడంతో, కంపెనీ చివరకు ఈ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ రెండు కార్లు త్వరలోనే ఫేస్లిఫ్ట్తో కొనుగోలుదారుల ముందుకు రానున్నాయి. త్వరలోనే మార్కెట్ప్లేస్లో పునఃప్రవేశించబోతున్నాయి. ముందస్తు కంటే మరింత తాజాగా, స్టయిల్గా ఫిగో, ఆస్పైర్ కార్లు రెండూ మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫేస్లిఫ్ట్ మోడల్స్లో ఇంటీరియర్స్ను కూడా అప్గ్రేడ్ చేశారు. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ ఇంజిన్ను డ్రాగన్ లైనప్ నుంచి 1.2 లీటర్, 3 సిలిండర్ యూనిట్తో రీప్లేస్ చేస్తోంది. 1.5 లీటరు టీడీసీఐ టర్బోఛేంజ్డ్ డీజిల్ ఇంజిన్ను మార్చడం లేదు. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఫీచర్ను కలిగి ఉన్నాయి. ఫిగో, ఆస్పైర్ ఫేస్లిఫ్ట్స్ రెండింటికీ ఫక్షర్డ్ 1.5 లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజిన్ను జతచేయాలని ఫోర్డ్ భావిస్తోంది. -
మారుతీ ‘ఇగ్నిస్’పై భారీ డిస్కౌంట్లు
మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా విక్రయాలు నమోదు చేస్తున్న మారుతీ, తన మోడల్స్లో ఒకటి మార్కెట్లో కస్టమర్లను చేరుకోలేకపోతుందని గుర్తించింది. అది ఇగ్నిస్ డీజిల్ వేరియంట్గా తెలిపింది. కస్టమర్ల నుంచి ఈ వాహనానికి తక్కువ డిమాండ్ వస్తుండటంతో, ఇగ్నిస్ డీజిల్ వేరియంట్ను ఆపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇగ్నిస్ డీజిల్ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్డీటీవీ కారన్అండ్బైక్ రిపోర్టు ప్రకారం, ఇగ్నిస్ డీజిల్కు సంబంధించి ఎలాంటి బుకింగ్స్ను తాము తీసుకోవడం లేదని ముంబైకి చెందిన ఓ డీలర్ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న డీలర్స్ కూడా ఇగ్నిస్ మోడల్ను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఆ కారు ధర చాలా ఎక్కువని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు అసలు ధర సుమారు 8 లక్షల రూపాయలుగా ఉంది. ఎవరైతే కస్టమర్లు పెట్రోల్ వేరియంట్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి అన్ని ఫీచర్లు కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. కంపెనీ ఇటీవలే తన కొత్త స్విఫ్ట్ను లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ చెందిన స్విఫ్ట్, ఇగ్నిస్ రెండు మోడల్స్ కూడా ఒకే విధమైన ధరను కలిగి ఉన్నాయి. మూడో తరానికి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ వేగవంతమైన కారుగా పేరులోకి వచ్చింది. ఇప్పటికే ఇది లక్ష యూనిట్ విక్రయాలను క్రాస్ చేసింది. అయితే ఇగ్నిస్ కేవలం నెలవారీ 4500 యూనిట్ విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. ఇగ్నిస్ను ప్రస్తుతం నిలిపివేయడంతో, ఇప్పటికే ఉన్న స్టాక్పై డీలర్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించారు. న్యూఢిల్లీలో ఇగ్నిస్పై 70 వేల రూపాయల వరకు ప్రయోజనాలను మారుతీ సుజుకీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్ వెర్షన్ 35 వేల రూపాయల నగదు డిస్కౌంట్లో అందుబాటులో ఉంది. ఏఎంటీపై కూడా 40 వేల రూపాయల డిస్కౌంట్ లభ్యమవుతుంది. 25 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్, రూ.3100 కార్పొరేట్ బోనస్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే డిస్కౌంట్లు, ఆఫర్లు డీలర్షిప్కు డీలర్షిప్కు మధ్య తేడా ఉంటాయి. ఇగ్నిస్ డీజిల్ బేస్ వేరియంట్ ధర, కొన్ని ప్రత్యర్థ వాహనాల ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
స్మార్ట్ఫోన్లపై పేటీఎం బంపర్ ఆఫర్లు
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అయితే ఇదే సరియైన సమయమట. డిజిటల్ దిగ్గజం పేటీఎం తన మాల్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. నోకియా... నోకియా స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ తన ప్లాట్ఫామ్పై 21 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 18 శాతం వరకు క్యాష్బ్యాక్ను ఇస్తోంది. మోటోరోలా.. మోటోరోలా హ్యాండ్సెట్లపై కూడా 35 శాతం వరకు డిస్కౌంట్లను పేటీఎం మాల్ అందిస్తోంది. డిస్కౌంట్తో పాటు క్యాష్బ్యాక్ను కూడా ఇది ఆఫర్ చేస్తోంది. క్యాష్బ్యాక్ మొత్తం డివైజ్ను బట్టి ఉంది. ఒప్పో... 5 శాతం ఫ్లాట్ క్యాష్బ్యాక్తో ఒప్పో స్మార్ట్ఫోన్లు, పేటీఎం మాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఏ57 స్మార్ట్ఫోన్పై గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. అంతేకాక 1,199 రూపాయల క్యాష్బ్యాక్ను ఇస్తోంది. క్యాష్బ్యాక్, డిస్కౌంట్ అనంతరం ఒప్పో ఏ57 స్మార్ట్ఫోన్ 10,791 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. వివో... ఒప్పో మాదిరిగా వివో హ్యాండ్సెట్లు కూడా ఫ్లాట్ 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ను కలిగి ఉన్నాయి. అన్ని చైనీస్ హ్యాండ్సెట్లతో పోల్చుకుంటే, వివో వీ5ఎస్ స్మార్ట్ఫోనే గరిష్టంగా 31 శాతం డిస్కౌంట్తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్ఫోన్పై 655 రూపాయల క్యాష్బ్యాక్ కూడా ఈ ఫోన్పై లభిస్తోంది. దీంతో మొత్తంగా రూ.12,444కు వివో వీ5ఎస్ను పేటీఎం మాల్ విక్రయిస్తోంది. ఆపిల్, గూగుల్, శాంసంగ్, హానర్, లెనోవో స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్లపై 9 వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్, శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్పై 8వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్, గూగుల్ పిక్సెల్ డివైజ్లపై కనీసం 6 వేల రూపాయల క్యాష్బ్యాక్ లభిస్తోంది. -
అమెజాన్లో ఐఫోన్ ఫెస్ట్, ఆఫర్లు ఇవిగో!
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన వెబ్సైట్లో ఐఫోన్ ఫెస్ట్కు తెరలేపింది. ఈ ఫెస్ట్ సందర్భంగా పలు ఆపిల్ ఐఫోన్ మోడల్స్పై ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను కేవలం హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలపై కూడా వాలిడ్లో ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, జూన్ 12 వరకు కొనసాగుతోంది. ఫెస్ట్లో భాగంగా అందించే ఆఫర్లు... ఆపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా వచ్చిన స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్పై 4,001 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అదనంగా దీనిపై 4 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఇస్తోంది. అమెజాన్లో రూ.89వేలుగా లిస్ట్ అయిన ఈ ఫోన్, రెండు డిస్కౌంట్ల అనంతరం రూ.80,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్పై రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్ను అందిస్తోంది. ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8 స్మార్ట్ఫోన్లపై కూడా 3 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను కస్టమర్లు పొందవచ్చు. రూ.1,001 ఫ్లాట్ డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 ప్లస్ను రూ.71,999కు అమెజాన్ విక్రయిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్పై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను పొందవచ్చు. మరోవైపు 4వేల రూపాయల డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 రూ.59,999కు అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 7పై యూజర్లు 2 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను పొందనున్నారు. 45,999 రూపాయలకు విక్రయించే ఈ స్మార్ట్ఫోన్పై కూడా రూ.6,371 ఫ్లాట్ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ ఫోన్పై కూడా రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ స్మార్ట్ఫోన్ అన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై రూ.250 అదనపు క్యాష్బ్యాక్నూ అమెజాన్ నేడు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఇండియా ఐదో వార్షికోత్సవంలో భాగంగా ఈ క్యాష్బ్యాక్ను ఇస్తోంది. -
ఆడి కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దారు ఆడి తన కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. తన పాపులర్ మోడల్ కార్లపై మూడునుంచి పదిలక్షల దాకా తగ్గింపును అందిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించేందుకు భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై పరిమిత కాలానికి కస్టమర్ బెనిఫిట్ స్కీంను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆడి క్యూ3 తో పాటు, ప్రముఖ మోడల్స్ ఏ3, ఏ4, ఏ6 సెడాన్ల కార్ల కొనుగోళ్లపై రూ.2.7 లక్షల నుంచి రూ .10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. జూన్ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దిగుమతి సుంకాలు , ప్రతికూలమైన పన్నులు తదితర కారణాలు కారును సొంతంచేసుకోవాలని కలలు కనే కస్టమర్కు ప్రతిబంధకం కాకూడదని తాము భావిస్తున్నామని ఆడి ఇండియా ప్రెసిడెంట్ రాహిల్ అన్సారీ చెప్పారు. ఈ పథకం కింద 2018లో కొనుగోలు చేసి 2019లో వినియోగదారులు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహంలో భాగంగాగానే ఆ ఆఫర్ అని చెప్పింది. అంతేకాదు ఎంపిక చేసిన మోడల్కార్లపై ఆడి ఛాయిస్ పథకం కింద 57శాతం బై బ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది. 2016లో 7,720 యూనిట్లు విక్రయించగా, 2017 నాటికి 2 శాతం వృద్ధితో 7,876 యూనిట్లు విక్రయించామని ఆదివారం ప్రకటించింది. అయితే గత సంవత్సరం మే, జూన్ అమ్మకాలు మందగించడం, జీఎస్టీ సందర్భంగా విలాసవంతమైన కార్లపై భారీగా డిస్కౌంట్ల ఫలితంగా పుంజుకున్న అమ్మకాల నేపథ్యంలో ఆడి ఇండియా ఈ ఏడాది కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2018-19 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చే దిశగా దిగుమతి సుంకాన్నిపెంచారు. సీకేడీ కార్లపై 10నుంచి 15 శాతం సుంకం పెంచగా మోటారు వాహనాలు, మోటారు కార్లు, మోటారు సైకిల్స్కు చెందిన విడిభాగాలపై 7.5నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే. -
డామిట్ ‘కారు’ అడ్డం తిరిగింది
ఇదో వింత ‘క్రైమ్’ కథ. ఎవరైనా కోట్ల లాభాలు ఆర్జించాలని బిజినెస్ ప్రారంభిస్తారు. కానీ.. ఆకాష్ నష్టాల కోసమే వ్యాపారంలోకి దిగాడు. ఎందుకంటే.. లాస్ మేకింగ్ సంస్థను ‘నల్లధన అక్రమార్కుల’కు అధిక మొత్తానికి అమ్మేయాలని స్కెచ్ వేశాడు. ఇందుకు ఖరీదైన కార్ల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను 70శాతం ధరలకే కస్టమర్లకు విక్రయించి, 30శాతం తానే భరించేవాడు. ‘డిస్కౌంట్ స్కామ్’కు తెరతీయడంతో కస్టమర్లు పెరిగిపోయి, విపరీతంగా డబ్బు వచ్చి పడింది. ఒక్కసారిగా నోట్లకట్టలను చూసిన ఆకాష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. పబ్బులు, క్లబ్బులు, టూర్లంటూ తెగ ఎంజాయ్ చేశాడు. కానీ.. డామిట్ ‘కారు’ అడ్డం తిరిగింది! ఆకాష్ కటకటాల పాలయ్యాడు. సాక్షి,సిటీబ్యూరో : సాధారణంగా ఎవరైనా లాభాలు ఆర్జించడానికే వ్యాపారం చేస్తారు. డిస్కౌంట్లో ఖరీదైన కార్లు ఇస్తానంటూ భారీ స్కామ్కు పాల్పడిన ఆత్మకూరు ఆకాష్ మాత్రం నష్టాల కోసమే దందా ప్రారంభించాడు. తన సంస్థను లాస్ మేకింగ్ సంస్థగా మార్చేసి ‘అమ్మేయాలనే’ ఉద్దేశంతోనే కార్ల వ్యాపారం ప్రారంభించాడు. అసలే నష్టానికి కార్లు విక్రయించే ఇతడి చేతికి డబ్బు రాగానే జల్సాలకు అలవాటుపడ్డాడు. సీన్ కట్ చేస్తే కేవలం ఏడాదిలో దాదాపు 100 మందికి రూ.18 కోట్ల వరకు బకాయి పడ్డాడు. శుక్రవారం ఆకాష్ను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్దలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో సొత్తు రికవరీ సవాల్గా మారింది. తండ్రి సంస్థను చేపట్టి... జహీరాబాద్కు చెందిన ఆకాష్ తండ్రి ఆర్కిటెక్ట్. వృత్తిలో భాగంగా సిటీకి వలసవచ్చిన ఆయన స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఆకాష్ జూబ్లీహిల్స్లోని ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ దశలో లాస్ మేకింగ్ కంపెనీలను నల్లధనం ఉన్న వారు భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తారంటూ ఇతడికి తెలిసింది. దీంతో తన సంస్థను విక్రయించాలనే ఉద్దేశంతో నష్టాలబాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకు మార్గాలు అన్వేషిస్తున్న అతడి దృష్టి ఖరీదైన కార్లపై పడింది. తక్కువ ధరకు వాహనాలు అమ్ముతానంటూ ప్రచారం చేసుకుని రంగంలోకి దిగితే నష్టాలతో పాటు పెద్ద సర్కిల్ ఏర్పడుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా పబ్స్, క్లబ్స్లో ప్రచారం చేసుకుంటూ పెద్దలు, రాజకీయ, సినీ ప్రముఖుల కుమారులు/సంబంధీకులకు గాలం వేశాడు. అసలు విషయం తెలిసి.. ఫార్చునర్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, ఫోర్చే... తదితర హైఎండ్ కార్లను 30 శాతం తక్కువ ధరకు విక్రయించడం మొదలెట్టాడు. 70 శాతం కస్టమర్ల నుంచి తీసుకుని మిగిలిన మొత్తం తానే వేసుకుని కార్లు ఇచ్చేవాడు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ఆకాష్కు డిమాండ్ పెరిగింది. కొన్నాళ్లకు అతడు అందుబాటులో లేకపోయినా ఫోన్లో సంప్రదింపులు జరిగిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయడం మొదలెట్టారు. ఓ దశలో ఇతగాడికి షాకింగ్ నిజం తెలిసింది. లాస్ మేకింగ్ కంపెనీలకు ఖరీదు చేయడం అరుదుగా జరుగుతుందని, అలా చేయాలన్నా సదరు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండాలని తెలుసుకున్నాడు. అయితే అప్పటికే భారీ మొత్తం అడ్వాన్సులు తీసుకోవడం, తన వద్ద ఉన్న డబ్బు అయిపోగా... ఒకరు ఇచ్చిన అడ్వాన్సులతో మరొకరికి కార్లు అందించడం జరిగిపోయింది. రుణమైనా తీసుకుందామని... దీంతో కంగుతిన్న ఆకాష్ కొన్నాళ్ల పాటు చేష్టలుడిగిపోయాడు. అయితే అప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో పాటు ‘బిజినెస్’ ఆపే పరిస్థితి లేకపోవడంతో మరో గత్యంతరం లేక ముందుకు వెళ్లాడు. కనీసం తన సంస్థను సమకాలీన అవసరాలకు తగ్గట్టు విస్తరించాలని, మరింత అభివృద్ధి చేయాలని భావించాడు. దీనికోసం బ్యాంకు నుంచి భారీ మొత్తం రుణం తీసుకోవాలని యోచించాడు. ఈ సంస్థ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఎంత ఎక్కువ మొత్తం టర్నోవర్ చూపిస్తే అంత ఎక్కువ లోన్ వస్తుందంటూ కొందరు ఇచ్చిన సలహా మేరకు టర్నోవర్ కోసం కార్ల దందాను కొనసాగించాడు. కార్లు ఖరీదు చేస్తామని చెప్పిన వారి నుంచి డబ్బును తన సంస్థ తన ఖాతాలో జమ చేయించుకునే ఆకాష్ దాని నుంచే షోరూమ్స్కు బదిలీ చేసేవాడు. కారు నంబర్ కోసం రూ.15 లక్షలు ఒక్కసారిగా రూ.కోట్ల టర్నోవర్ చూసేసరికి ఆకాష్ దృష్టి జల్సాలపై పడింది. రూ.3.5 కోట్ల ఖరీదైన కారును కొన్న ఆకాష్ రూ.15 లక్షలు వెచ్చించి ‘6666’ నెంబర్ దక్కించుకున్నాడు. తన వద్దకు కస్టర్లను తీసుకువచ్చిన దళారులకు రూ.1.9 కోట్లు కమీషన్లుగా చెల్లించాడు. కుటుంబంతో సహా వారం రోజుల పాటు బాలీకి వెకేషన్స్ కోసం వెళ్లి రూ.40 లక్షలు ఖర్చు చేశాడు. తరచూ స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్లి జల్సాలు చేసే ఇతడు ఒక్కో సందర్భంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు చెల్లించేవాడు. ఇలా మొత్తమ్మీద రూ.4.5 కోట్లు సొంత అవసరాలకు, రూ.13.5 కోట్లు ‘30 శాతం’ కింద ఇతరులకు కార్లు సరఫరా చేయడానికి ఖర్చుచేశాడు. చివరకు విషయం పోలీసులకు వద్దకు చేరడంతో శుక్రవారం కటకటాల్లోకి వెళ్లాడు. మరోపక్క ఈ కేసులో రివకరీలకు చేయాలా? వద్దా? అనేది పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంలో ఆకాష్ 155 కార్లను డిస్కౌంట్లో విక్రయించాడు. వీటిని ఖరీదు చేసిన వారిలో విద్యాధికులు, బడా బాబులు, రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా డిస్కౌంట్ మొత్తం పోగా మిగిలింది చెల్లించిన వారే. దీంతో వీరి నుంచి కార్లు రికవరీ చేయాల్సిన అవసరం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. డిస్కౌంట్గా తీసుకున్న 30 శాతం రికవరీ చేసి నష్టపోయిన వారికి ఇప్పించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారాల పరిష్కారానికి న్యాయసలహాలు తీసుకుంటున్నారు. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో సేల్ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్ఫోన్ను కూడా ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్ఫోన్ 32జీబీ వేరియంట్ను 17,999 రూపాయలకే ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
ఫ్లిప్కార్ట్కు కౌంటర్ : అమెజాన్ సమ్మర్ సేల్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇటీవల ప్రకటించిన బిగ్ షాపింగ్ డేస్ సేల్కు అమెజాన్ కౌంటర్ ఇచ్చేసింది. తాను కూడా ఈ నెలలో సమ్మర్ సేల్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మే 13 నుంచి మే 16 వరకు బిగ్ డీల్స్, డిస్కౌంట్లతో అలరించనున్నట్టు తెలిపింది. అయితే ఇదే తేదీల్లో ఫ్లిప్కార్ట్ తన బిగ్ షాపింగ్ డేస్ సేల్ను నిర్వహిస్తోంది. అమెజాన్ ఈ సేల్ కింద మొబైల్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లియెన్సస్, టీవీలు, స్పోర్ట్లు, ఫిట్నెస్ వంటి పలు ఉత్పత్తులపై పలు డీల్స్ను అందించనుంది. క్యాష్బ్యాక్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేయబోతోంది. మొత్తం ఈ సేల్లో 1000కి పైగా బ్రాండ్లలో, 40వేల డీల్స్ను అందించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. హానర్ 7ఎక్స్ డిస్కౌంట్ దీనిలో ప్రత్యేకంగా నిలువనుంది. రూ.10వేల వరకు ఆఫర్ల విలువతో నోకియా 7 ప్లస్ ఈ సేల్లో విక్రయానికి వస్తోంది. రియల్మి 1 కూడా తొలిసారి ఈ సేల్లో అందుబాటులోకి వస్తోంది. కేవలం యాప్పై అందించే డిస్కౌంట్లు ఆ నాలుగు రోజుల సేల్లో రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు లైవ్గా అందుబాటులో ఉంటాయి. యాప్లో షాపింగ్ చేసిన ఎంపికైన కొనుగోలుదారులకు రూ.4 లక్షల వరకు బహుమతులు అందుకోనున్నారు. మొబైల్ యాక్ససరీస్పై 80 శాతం వరకు డిస్కౌంట్లు, డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఫోన్ కేసులపై 70 శాతం వరకు, పవర్బ్యాంకులపై 70 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ల్యాప్టాప్లు రూ.20వేల వరకు డిస్కౌంట్లతో సేల్కు వస్తున్నాయి. పీసీ యాక్ససరీస్పై 50 శాతం తగ్గింపు లభ్యం కానుంది. కెమెరాలు, హెడ్ఫోన్లు, స్పీకర్లు, ఫిట్నెస్ ట్రాకర్లు, స్మార్ట్వాచ్లపై కూడా డీల్స్ను అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ఎకో డివైజ్లు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లీ పేపర్వైట్, ఈబుక్స్పై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. నాలుగు రోజుల సమ్మర్ సేల్లో భాగంగా ఎవరైతే అమెజాన్ పే బ్యాలెన్స్ను వాడి రూ.250కు మించి షాపింగ్ చేస్తారో వారికి అదనంగా 10 శాతం క్యాష్బ్యాక్ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కూడా అదనంగా 10 శాతం క్యాష్బ్యాక్ను ఆఫర్ చేయనుంది. స్మార్ట్ఫోన్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ స్కీమ్లలో విక్రయానికి వస్తున్నాయి. -
నో డిస్కౌంట్ ప్లీజ్.!
సాక్షి, సిటీబ్యూరో: కొత్తమోడల్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నప్పుడు పాతవాహనాల అమ్మకాలను పెంచుకునేందుకు డీలర్లు సైతం కొద్దో గొప్పో డిస్కౌంట్లు ప్రకటిస్తారు. మార్కెట్లోని అన్ని వస్తువుల అమ్మకాల తరహాలోనే ఆటోమొబైల్ రంగంలోనూ ఇలాంటి రాయితీలు సర్వ సాధారణం. అయితే ఈ రాయితీలే ఆటోమొబైల్ రంగానికి గుదిబండలుగా మారాయి. ప్రభుత్వానికి జీవితకాల పన్నుపైన ఆదాయానికి గండి పడుతుందంటూ డిస్కౌంట్లతో కూడిన ఇన్వాయీస్లను స్వీకరించేందుకు రవాణాశాఖ నిరాకరిస్తుండగా, షౌరూమ్లు ఇచ్చే ఇన్వాయీస్లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో డిస్కౌంట్ సేల్స్ వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఇదే అంశంపై కొందరు వ్యక్తులు షౌరూమ్లు ఇచ్చే ఇన్వాయీస్లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాహన తయారీదారులు నిర్ణయించిన వాస్తవ ధర (ఎక్స్షోరూమ్ ప్రైస్) ప్రకారమే జీవితకాలపన్ను చెల్లించాలని రవాణాశాఖ వాదిస్తోంది. ఇదే అంశంపైన ఇటీవల ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో డీలర్లు, రవాణా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.గ్రేటర్ పరిధిలో సుమారు 200 మంది ఆటోమొబైల్ డీలర్లు, మరో వంద మందికి పైగా సబ్ డీలర్లు నగరంలో ప్రతి రోజూ 2000 నుంచి 3000 వరకు వాహనాలను విక్రయిస్తారు. ఇందులో 70 శాతం వరకు బైక్లు ఉండగా, మరో 15 శాతం వరకు కార్లు, 5 శాతం లగ్జరీ వాహనాలు, మిగతా 5 శాతం ఇత ర వాహనాలు ఉంటాయి. ఆటోమొబైల్ డీలర్ల మధ్య ఉండే సహజమైన పోటీ వాతావరణం, అమ్మకాలను పెంచుకునేందుకు వినియోగదారులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా డీలర్లు వాహనాల వాస్తవ ధర (ఎక్స్షోరూమ్ ప్రైస్)పైన ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉదాహరణకు మారుతీ స్విఫ్ట్ వాస్తవ ధర రూ.10.25 లక్షలు ఉండగా, డీలర్లు దానిని రూ.9.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వారు విక్రయించిన మేరకే ఇన్వాయీస్లు ఇస్తున్నారు.అంటే ఒక వాహ నంపైన రూ.25 వేల నుంచి రూ.30 వేల వర కు రాయితీ లభిస్తుంది. ఇక్కడే వివాదం నెల కొంటోంది. రూ.10 లక్షల లోపు ఖరీదైన వాహనాలపైన 12 శాతం చొప్పున, రూ.10 లక్షలు దాటిన వాటిపైన 14 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. అంటే డీలర్లు ఇచ్చే డిస్కౌంట్ కారణంగా ఒక వాహనంపైన ఆర్టీఏ ఆదాయం ఏకంగా 2 శాతానికి పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్స్షోరూమ్ ప్రైస్ ప్రకామే అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం నగరంలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సుమారు రూ.17 కోట్లు ఇలా అదనంగా రాబట్టారు. డిస్కౌంట్ ధరలపై డీలర్లు ఇచ్చే ఇన్వాయీస్ ఆధారంగా వాహనాల రిజిస్ట్రేషన్లకు వచ్చే వినియోగదారులపైన అదనపు భారం పడుతోంది. రూ.10.25 లక్షల వాహనాన్ని రూ.9.9 లక్షలకే కొనుగోలు చేసిన వ్యక్తి రవాణాశాఖ నిబంధనల మేరకు అసలు ధర ప్రకారమే పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఆటోమొబైల్ డీలర్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై కొందరు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇన్వాయీస్ ప్రామాణికం.... వస్తువుకు విక్రయించిన ధరనే ప్రామాణికంగా తీసుకోవాలని డీలర్లు పట్టుబడుతున్నారు. ఇన్వాయీస్నే ప్రామాణికంగా భావించాలని డిమాండ్ చేస్తున్నారు. విక్రేతలు, కొనుగోలుదారులకు మధ్య జోక్యం తగదన్నారు. మంగళవారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపైన కొందరు డీలర్లు అధికారులను ప్రశ్నించారు. తమ వస్తువులను ఎంతకైనా విక్రయించే హక్కు తమకు ఉందని, తాము విక్రయించిన ధరల ప్రకారమే జీవితకాల పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ ఎక్స్షోరూమ్ ధరల ప్రకారం పన్నులు వసూలు చేయడం వల్ల అంతిమంగా వినియోగదారుడు తనకు లభించే రాయితీని కోల్పోవలసి వస్తోంది. ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవచ్చు కదా..’’ అని పలువురు డీలర్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు భవిష్యత్తులో ఇన్వాయీస్ల స్థానంలో ఎక్స్షోరూమ్ ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకొనేలా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ)తో అనుసంధానమయ్యేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. దాంతో వాహనాల పైన వినియోగదారులకు లభించే డిస్కౌంట్లు నిలిచిపోయే అవకాశం ఉంది. -
అక్షయ తృతీయ : ఆఫర్లతో జర జాగ్రత్త..!
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ నాడు తప్పక ఎంతో కొంత బంగారాన్ని కొంటే మంచిదని నమ్ముతుంటారు భారతీయులు. అంత పవిత్రంగా భావించే ఈ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వారు చెబుతున్న జాగ్రత్తలేమిటో ఓసారి చూడండి... నాణ్యత పరిశీలన... బంగారాన్ని కొనే ముందు తప్పక దాని నాణ్యతను పరిశీలించి, దాని అసలు విలువను లెక్కించాలి. ప్రతి ఆభరణం మీద తప్పక బీఐఎస్ హాల్మార్క్ ముద్ర, స్టాంపు, అది ఎన్ని క్యారెట్లు ఉన్నది, హాల్మార్కింగ్ సంవత్సరాన్ని కూడా చూడాలంటున్నారు మేకింగ్ చార్జీలు... ఈ పర్వదినం సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి పరిమిత కాలం వరకు మేకింగ్ చార్జీల మీద ఎక్కువ మొత్తంలొ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి బంగారం దుకాణాలు. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొనుగోలు చేయబోయే ఆభరణాల ఖరీదును కూడా వేర్వేరు దుకాణాల ధరలతో ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో దుకాణంలో ఒక్కో రకమైన మేకింగ్ చార్జీలు ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు రెండు, మూడు షాపుల్లో ఆభరణాల ధరలను వాకబు చేసిన తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమమంటున్నారు. నాణాలు, బిస్కెట్లయితే మేలు... బంగారాన్ని కొనేవారిలో ఎక్కువ మంది దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కొంటే మంచిది అని ఆలోచించి కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని పూర్తిగా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతోనే కొనాలనుకుంటున్నట్లయితే నాణేలు లేదా బిస్కెట్ రూపంలో కొనడం మంచిదని పేర్కొంటున్నారు. రాళ్లు వద్దు..సాదానే ముద్దు.. రాళ్లు పొదిగిని ఆభరణాలను కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమంటున్నారు. సాదా ఆభరణాలతో పోలిస్తే, రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఖరీదు ఎక్కువ. మేకింగ్ చార్జీలు కూడా అధికమే. రాళ్లు పొదిగిన ఆభరణాలను అమ్మాలనుకున్నా, మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు రాళ్ల ఖరీదును తీసివేసి బంగారానికి మాత్రమే విలువ కడతారు. ఈ రాళ్లు ఎంత ఖరీదైనవి అయినా కూడా కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు కాబట్టి రాళ్లు పొదిగిన ఆభరణాలను కొనకపోవడమే ఉత్తమం అని నిపుణులంటున్నారు. కాబట్టి ఈ సారి బంగారాన్ని కొనేముందు ఈ జాగ్రత్తలన్నింటని పాటిస్తే లాభాలన్నీ మీవే అంటున్నారు నిపుణులు. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా మరోసారి ‘ఐ ఫోన్ ఫెస్ట్’ అమ్మకాలకు తెర తీసింది. అమెజాన్ వెబ్సైట్, యాప్లలో ఐఫోన్ ఫెస్ట్ పేరిట నిర్వహిస్తున్న స్పెషల్ సేల్ను మంగళవారం ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక విక్రయాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 , ఐఫోన్ ఎస్ఈ లాంటి స్మార్టఫోన్లపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన ఆపిల్ వాచ్ మోడల్స్పై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్ 256జీబీ రూ.97,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర (ఎంఆర్పీ) రూ.1,08,930గా ఉంది. ఇదే స్మార్ట్ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధరల రూ.95,390 ఉండగా ప్రస్తుతం ఐఫోన్ ఫెస్ట్లో ఇది రూ.79,999 ధరకు లభిస్తున్నది. ఐఫోన్ 8 (64 జీబీ) రూ.54,999 కు (ఎంఆర్పీ రూ.67,940), ఐఫోన్ 8 (256జీబీ) రూ.68,999కు (ఎంఆర్పీ రూ.81,500), ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ రూ.65,999కు (ఎంఆర్పీ రూ.77,560), ఐఫోన్ 8 ప్లస్ 256జీబీ రూ.79,999కు (ఎంఆర్పీ రూ.91,110) లభిస్తున్నాయి. ఐఫోన్ ఫెస్ట్లో ఐఫోన్ 7 (32జీబీ) - రూ.41,999కు (ఎంఆర్పీ రూ.52,370) ఐఫోన్ 7 (128 జీబీ) -రూ.54,999 (ఎంఆర్పీ రూ.61,560) ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ -రూ.56,999 (ఎంఆర్పీ రూ.62,480) ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ -రూ.64,999 (ఎంఆర్పీ రూ.72,060) ఐఫోన్ 6ఎస్ 32జీబీ -రూ.33,999 (ఎంఆర్పీ రూ.42,900) ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32- జీబీ రూ.37,999 (ఎంఆర్పీ రూ.52,240) ఐఫోన్ 6 (32జీబీ) -రూ.23,999కు (ఎంఆర్పీ రూ.31,900) ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ -రూ.17,999 (ఎంఆర్పీ రూ.26వేలు) అదేవిధంగా యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 38 ఎంఎం రూ.32,380కి (ఎంఆర్పీ రూ.32,380), యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 42ఎంఎం రూ.31,900కి (ఎంఆర్పీ రూ.34,410) లభిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్కూడా లభ్యం. -
ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్: బిగ్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి మరోసారి ఫాన్స్ ఫెస్టివల్ను ప్రారంభించింది. 2018ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్ పేరుతో స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 5నుంచి 6 వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఎంఐ టీవీలు, ఎంఐ మిక్స్ 2, రెడ్మి నోట్ 5 ప్రో, రెడ్మి 5 లాంటి ఇతర ప్రొడక్ట్స్పై డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు ఎంఐ ఫాన్స్ కు రూ. 40 లక్షలు అంతకన్నా ఎక్కువ విలువైన ఎంఐ కూపన్లను అందిస్తోంది. ఫాన్ ఫెస్టివల్పై సోషల్మీడియాలో ప్రచారం నిర్వహించనున్నట్లు షావోమి ప్రకటించింది. దీని ద్వారా కూడా యూజర్లకు డిస్కౌంట్లను అందిస్తోంది. సోషల్ మీడియా యూజర్లు వారి స్నేహితులను ఆహ్వానిం చడంతో పాటు, నిర్దిష్ట లైక్స్ను పొందితే రెడ్మి నోట్ 5, వై1, బ్యాండ్ 2 లాంటి బహుమతులను ఉచితంగా గెలుచుకునే అవకాశం. ఇందులో గ్రూప్గా కూడా కూపన్లు గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కూపన్లు ఏప్రిల్ 4 న ప్రారంభమవుతాయి. మరోవైపు అమ్మకాల సమయంలో ఆఫర్లపై పూర్తి స్పష్టత లేనప్పటికీ..ఎంఐ మిక్స్2, ఎంఐ మాక్స్ 2, రెడ్మి 4, రెడ్మి వై1, రెడ్మి వై1లైట్ , రెడ్మి 5ఏ వంటి స్మార్ట్ఫోన్లపై రూ.3వేల వరకు తగ్గింపు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇవే కాకుండా ఎంఐ యాప్లో "క్రేజీ కాంబోస్" ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా షావోమి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఎల్ఈడీ టీవీలపై ఈ కాంబో ఆఫర్ ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 2 నుంచి 6 వరకు షావోమి 'కలర్ అవర్ ప్లానెట్' ప్రచారాన్ని చేపట్టింది. ఇందులో విజేతలు రెడ్మి 5ఏ గెలుచుకునే అవకాశం. మరిన్ని వివరాలు ఎంఐ స్టోర్ యాప్లో లభ్యం. -
ఫ్లిప్కార్ట్ ఉగాది స్పెషల్: భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి పండుగ ఆఫర్లకు తెరతీసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. వీటితో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులోఉంచింది. రాయితీ ధరల్లో హెచ్డీ ఎల్ఈడీ టీవీలు కొనుక్కోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మైక్రోమ్యాక్స్, శాంసంగ్, వియూ, పానసోనిక్ , ఎల్జీ లకుచెందిన హై ఎండ్ బ్రాండ్ టీవీలపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. మార్చి 16-18 దాకా 70శాతం డిస్కౌంట్స్. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్అదనం. 32 అంగుళాల మైక్రోమ్యాక్స్ హెచ్డీ ఎల్ఈడీ దాదాపు 3వేలనుంచి డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో12,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 19,990. కోడాక్ హెచ్డీ స్మార్ట్ర్ట్ టీవీ ధర రూ .14,999. దీని అసలు ధర రూ .20,990. రూ. 16వేల వియూ హెచ్డీ టీవీని రూ. 13,499కే పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ 40 అంగుళాల టీవీలపై 24శాతం డిస్కౌంట్. రూ. 47,999 విలువ చేసే శాంసంగ్ ఎల్ఈడీ టీవీ రూ.35,999లకే లభ్యం. ఎల్జీ 32ఇంచెస్ టీవీ రూ.18,4999 లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ.23,990గా ఉంది. అలాగే టీవీల కొనుగోళ్ల సందర్భంగా రూ. 8వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లుకూడా అందుబాటులో ఉన్నాయి. సూపర్ వాల్యూ వీక్ మార్చి 18-24 మధ్య స్మార్ట్ఫోన్లపై మరిన్ని ఆఫర్లతో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమౌతోంది. ఈ మేరకు ఫ్లిప్కార్ట్లో సూపర్వ్యాలూ వీక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. మీ డ్రీమ్ ఫోన్ను సొంతం చేసుకోమంటూ ఊరిస్తోంది. -
ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్స్పై బంపర్ బొనాంజ సేల్ను ప్రారంభించింది. నేటి నుంచి ప్రారంభించిన ఈ సేల్ను, మార్చి 15 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్లో హైలెట్గా లెనోవో కే8 ప్లస్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు నిలుస్తున్నాయి. లెనోవో కే8 ప్లస్ను రూ.7,999కే డిస్కౌంట్ ధరలో అందిస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఇవ్వనున్నట్టు తెలిపింది. లెనోవో కే8 ప్లస్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజ సేల్లో ‘హీరో ఆఫర్’ కింద అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్పై రెండు వేల రూపాయల మేర ధర తగ్గి, రూ.7,999కే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఒప్పో ఎఫ్3(4జీబీ) స్మార్ట్ఫోన్ ధర కూడా 16,990 రూపాయల నుంచి 11,990 రూపాయలకు తగ్గింది. బడ్జెట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్(16జీబీ) స్మార్ట్ఫోన్ 9,499 రూపాయలకు, గెలాక్సీ ఆన్5 స్మార్ట్ఫోన్ 6,290 రూపాయలకు, ఎల్జీ కే7ఐ స్మార్ట్ఫోన్ 4,999 రూపాయలకు, ఐఓమీ ఐ1 స్మార్ట్ఫోన్ 5,999 రూపాయలకు, మోటో ఈ4 ప్లస్(3జీబీ) స్మార్ట్ఫోన 8,999 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7(4జీబీ) స్మార్ట్ఫోన్ ధర 29,990 రూపాయల నుంచి 22,990 రూపాయలకు తగ్గింది. మోటో జడ్2 ప్లే(4జీబీ) స్మార్ట్ఫోన్ కూడా 19,999 రూపాయలకు మార్చి 13 నుంచి మార్చి 15 వరకు ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి వచ్చింది. హానర్ 9 లైట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్మి 5ఏ కూడా మార్చి 15న ఫ్లాష్ సేల్కు వస్తోంది. -
ఫ్లిప్హార్ట్ సేల్..రెడ్ మి నోట్5 గెలుచుకోవచ్చు
సాక్షి,ముంబై: ఇపుడు ఎక్కడ చూసినా వాలెంటైన్స్ డే ఫీవర్ కనిపిస్తోంది. ఈకామర్స్ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్కార్ట్ 'ది ఫ్లిప్హార్ట్ డే' పేరుతో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న స్మార్ట్ఫోన్లపై 14శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్ ఫిబ్రవరి 14 అర్థరాత్రినుంచి ప్రారంభం కానుంది. అంతేకాదు షావోమి లాంచ్ చేయనున్న రెడ్మి నోట్ 5ను ఉచితంగా అందుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర గాడ్టెట్లపైనా 14శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. అలాగే దుస్తులు, పాదరక్షలు, ఇతర ఉపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, గేమ్స్, పుస్తకాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఫర్నిచర్, ల్యాప్టాప్స్, కెమెరా తదితరాలపై 40 నుండి 80 శాతందాకా డిస్కౌంట్. టీవీలు, ఇతర గృహోపకరణాలపై కొనుగోలుదారులు 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గివ్ మీ5 హ్యష్ట్యాగ్ ద్వారా రెడ్మీ ఫోన్ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు రెడ్మి నోట్ 5ను ఫిబ్రవరి 14న లాంచ్ చేయనుంది అంచనా. ఇండియాలోనెం.1 బ్రాండ్స్మార్ట్ ఫోన్ను తమ వెబ్సైట్లో లాంచ్ చేయనున్నామన్న ప్రకటనతో.. అది రెడ్ మి నోట్ 5 కావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు వినియోగదారులు ఫ్రీ గిఫ్ట్లను గెలుచుకునేందుకు ప్రత్యేకమైన యాప్ గేమ్స్ నిర్వహిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లే తమకు బలమైన మూలస్థంభాలుగా నిలుస్తున్నారని, వారి ప్రేమతోనే ఫ్లిప్కార్ట్ మార్కెట్లీడర్గా ఎదిగిందని సీనియర్ డైరెక్టర్ స్మృతి రవిచంద్రన్ పేర్కొన్నారు. వారి ప్రేమను మరింత గెలుచుకోవడానికి , ఫ్లిప్హార్ట్ సేల్స్ ద్వారా ప్రేమికుల రోజున తమ కస్టమర్లకు మంచి అనుభూతినివ్వాలని భావిస్తున్నామన్నారు. ఈ ఆఫర్లు కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు వినియోగదారులకు మాత్రమే. Unleash your creative side. Last chance to win 5 #GiveMe5 Participate now - https://t.co/XZ3BIRZJdg pic.twitter.com/b6kfXBq8dd — Redmi India (@RedmiIndia) February 13, 2018 -
అమెజాన్లో ఆ ఫోన్లు చౌక
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ మేకర్ లెనోవా అమెజాన్, మోటో స్టోర్లో పలు స్మార్ట్ఫోన్ మోడల్స్పై భారీ డిస్కాంట్ను ఆఫర్ చేస్తోంది. ఈనెల 13 నుంచి 15 వరకూ పరిమిత కాలం వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వివిధ మోడళ్లపై రూ 6వేల వరకూ తగ్గింపును ప్రకటించింది. రూ 16,999కు లభించే మోటో జీ5ఎస్ ప్లస్ను రూ 13,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్ఛ్సేంజ్పై మరో రూ 2,000 అదనపు ఆఫర్ను ముందుకుతెచ్చింది. ఇక రూ 13,999 పలికే మోటో జీ5ఎస్ను రూ 11,999కి ఆఫర్ చేస్తోంది. మోటో జీ5ప్లస్ను రూ 11,999 నుంచి రూ 8,499కి అందుబాటులో ఉంచింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుండటంతో వినియోగదారులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని లెనోవా కోరింది. -
'ఫ్లిప్కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్' : 80 శాతం డిస్కౌంట్స్
దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ల వెల్లువ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'ది ఫ్లిప్హార్ట్ డే' సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. సర్ప్రైజ్లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్హార్ట్ డే' ఆఫర్లో సైన్-అప్ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్, హోమ్ డెకర్లపై 14 శాతం అదనపు డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఒకవేళ ల్యాప్టాప్లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. మొబైల్ ఫోన్లపై కూడా 'గ్రేట్ డీల్స్' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్కార్ట్ తెలిపింది. టీవీ, హోమ్ అప్లియెన్స్పై 70 శాతం వరకు, ఫర్నీచర్, డెకర్, ఫర్నీషింగ్ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్ డీల్స్' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్కార్ట్ తెలిపింది. -
పేటీఎం మాల్ రిపబ్లిక్ డే ఆఫర్స్
పేటీఎం మాల్ కూడా రిపబ్లిక్ డే సేల్ను నేటి(బుధవారం) నుంచి ప్రారంభించింది. ఈ కొత్త సేల్లో భాగంగా పేటీఎం స్మార్ట్ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ను, ల్యాప్టాప్లు, కెమెరాలపై 20వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ను, ఎలక్ట్రిక్ అప్లియెన్స్పై 20వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ను ప్రకటించింది. అంతేకాక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, జనవరి 28 వరకు కొనసాగనుంది. ఆపిల్, వివో, షావోమి, ఒప్పో, లెనోవో, మోటోరోలా, శాంసంగ్ వంటి పలు ప్రముఖ బ్రాండులన్నింటిపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్ డివైజ్ల పరంగా చూస్తే.. పేటీఎం మాల్ ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను 83,899 రూపాయలకు లిస్ట్ చేసింది. దీని అసలు ధర రూ.89వేలు. అదేవిధంగా ఐఫోన్ ఎక్స్(256జీబీ)ను 98వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దీని అసలు ధర లక్షకు పైన రూ.1,02,000గా ఉంది. అంతమొత్తంలో వెచ్చించలేని వారి కోసం ఐఫోన్ 8(64జీబీ)ను రూ.52,706కు లిస్టు చేసింది. ఈ ఫోన్ అసలు ధర 64వేల రూపాయలు. అదేవిధంగా 73వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8 ప్లస్(64జీబీ)ను కూడా రూ.63,470కు అందిస్తోంది. క్యాష్బ్యాక్ మొత్తాలను పొందడానికి యూజర్లు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రోమో కోడ్లను వాడాల్సి ఉంటుంది. వివో వీ5ఎస్, వివో వై55ఎస్, వివో వై69 వంటి 4జీ స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ 10 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తోంది. మోటో ఈ4 ప్లస్, లెనోవో కే6 నోట్, లెనోవో కే6 వపర్ హ్యాండ్సెట్లపై రూ.8000 వరకు క్యాష్బ్యాక్ను ప్రకటించింది. ఇక శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, క్యాష్బ్యాక్ ఆఫర్లతో అంత ప్రముఖ హ్యాండ్సెట్లు లేనప్పటికీ, ఫ్లాట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ జే3 ప్రో ధర రూ.8800 నుంచి రూ.7990కు తగ్గించింది. అదేవిధంగా గెలాక్సీ జే2 ధరను రూ.6990కు లిస్ట్ చేసింది. షావోమి స్మార్ట్ఫోన్లపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. పాపులర్ టాబ్లెట్లను కూడా పేటీఎం మాల్ ఈ సేల్లో లిస్ట్ చేసింది. -
టాప్ స్మార్ట్ఫోన్లపై ఆన్లైన్ దిగ్గజాల భారీ డిస్కౌంట్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఆన్లైన్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో డిస్కౌంట్ సేల్ సందడి మొదలైంది. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఈ రెండు దిగ్గజాలు స్పెషల్ సేల్ ప్రారంభించాయి. ఈ విక్రయాల్లో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. సరసమైన ధరల్లో టాప్ఎండ్ స్మార్ట్ఫోన్లను దక్కించుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. జనవరి 21నుంచి 23 దాకా ఈ స్పెషల్ సేల్ అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ ఎక్స్, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్, హానర్ 8 ప్రో,ఎల్జీ జీ6, ఎంఐ మిక్స్ 2, డివైస్లపై టాప్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్7, ఒప్పో ఎఫ్3 లపై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో గూగుల్ పిక్సెల్, లెనోవా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును అందుబాటులో తెచ్చాయి. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 64జీబీ: గత ఏడాది నవంబరులో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.84,999 లకే లభ్యం, (అసలు ధర రూ. 89వేలు) అలాగే 18 వేల రూపాయల దాకా ఎక్సేంజ్ ఆఫర్. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (32జీబీ నిల్వ): ఈ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ రూ .35,990 కు లభ్యం. అసలు ధర రూ .41,900. అలాగే రూ.18వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ హానర్ 8 ప్రో (128జీబీ/ 6జీబీర్యామ్): ఈ స్మార్ట్ఫోన్పై అందిస్తున్న17శాతం దాగా డిస్కౌంట్తో ప్రస్తుతం ఇది రూ.24,999కి లభ్యం. (అసలు ధర రూ.29,999) ఎల్జీ జీ 6: బెజెల్ లెస్ డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరాలతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్పై అమెజాన్ ఏకంగా 45 శాతం తగ్గింపు ధరలో ఆఫర్ చేస్తోంది. రూ.55,500కు లాంచ్ కాగా ప్రస్తుతం ఇది కేవలం రూ. 29,990 లకే లభ్యంకానుంది. షావోమి ఎంఐ మిక్స్ 2: షావోమి అద్భుతమైన స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్ 2 ఫ్లిప్కార్ట్ 29,990లకే అందిస్తోంది. గరిష్టంగా 21వేల రూపాయల ఎక్సేంజ్ ఆఫర్ కూడా. వీటితోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇతర స్మార్ట్ఫోన్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వీటి అధికారిక వెబ్సైట్లను పరిశీలించగలరు. -
రైల్వే అడ్వాన్స్ బుకింగ్: భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. భారీగా డిస్కౌంట్లను అందించే విమానయాన సంస్థల మాదిరిగానే రైల్వే కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. విమాన టికెట్ల మాదిరిగానే అడ్వాన్స్ బుకింగ్ రైల్వే టికెట్లపై డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందించాలని కమిటీ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే రైల్వే ప్రయాణీకులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఒక నెల రోజుల ముందు రైల్వే ప్రయాణీకులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించనుంది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం 50శాతం నుంచి 20శాతం దాకా అడ్వాన్స్ బుకింగ్పై డిస్కౌంట్ లభిస్తుంది. రైలులో ఖాళీగా ఉన్న సీట్లను బట్టి ఈ డిస్కౌంట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు రైలు బయలుదేరడానికి ముందు రెండు రోజుల నుంచి రెండు గంటల వరకు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని సూచించింది. అలాగే లోయర్ బెర్త్ కోరుకునే ప్రయాణీకులు మాత్రం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వృద్ధులకు, మహిళలకు , పిల్లలకు లోయర్ బెర్త్ కేటాయింపు ఉచితమని పునరుద్ఘాటించింది. దీంతోపాటు అర్థరాత్రి , అపరాత్రి కాకుండా, కన్వీనియంట్ సమయాల్లో గమ్యానికి చేరే రైళ్లలో టికెట్ ధరలను పెంచాలని కూడా సూచించింది. -
ముందస్తు’తో చౌక ప్రయాణం
న్యూఢిల్లీ: ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు విమాన ప్రయాణికుల మాదిరిగా రాయితీలు పొందే అవకాశాలున్నాయి. టికెట్ ధరల సమీక్షపై ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సూచనలతో ఇటీవల తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. కమిటీ ప్రతిపాదించిన వాటిలో ముఖ్యమైనవి.. ► నెలరోజుల ముందుగా సీట్లు బుక్ చేసుకునే వారికి అప్పటికి ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను బట్టి టికెట్ ధరలో 50 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ. ► రైలు ప్రయాణానికి రెండు రోజుల నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న టికెట్లపైనా స్లాట్ ప్రకారం తగ్గింపు. ► ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న వారికి రాయితీ. ► దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులకు మాత్రం ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే లోయర్ బెర్తు. ► అర్ధరాత్రి నుంచి వేకువజాము 4 గంటల మధ్య, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య కాకుండా సౌకర్యంగా ఉండే ఉదయం వేళల్లో గమ్య స్థానానికి చేరుకునే రైలు ప్రయాణికులపై అదనపు చార్జీ. ► ప్రయాణికుల డిమాండ్, రైళ్లను బట్టి జోనల్ స్థాయిలో టికెట్ ధర నిర్ణయం. ► రద్దీ ఉండే పండుగ రోజులు, సెలవు దినాల్లో ఎక్కువ ఛార్జీలు. అంతగా రద్దీ ఉండని సమయాల్లో టికెట్ ధరపై తగ్గింపు. ► ప్రీమియం రైళ్లు, ప్యాంట్రీకార్ ఉండే రైళ్లలో టికెట్ ధర 50 శాతం వరకు పెంపు. -
మళ్లీ ఆఫర్ల వెల్లువ : ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్
సేల్స్ సీజన్ మళ్లీ వచ్చేసింది. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్ తేదీలను ప్రకటించిన వెంటనే, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా మూడు రోజుల ఆఫర్ల పండుగకు తెరతీయనున్నట్టు పేర్కొంది. రిపబ్లిక్ డే సేల్ను నిర్వహించనున్నట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. జనవరి 21 నుంచి ఈ సేల్ ప్రారంభమై, జనవరి 23 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టాప్ ఆఫర్లతో కూడిన ప్రిప్యూ పేజీని కంపెనీ తన వెబ్సైట్లో విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ నిర్వహించబోతున్న ఈ రిపబ్లిక్ డే సేల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచింగ్లు ఉండనున్నాయి. అన్ని కేటగిరిల్లోని ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది. కొన్ని డీల్స్ను రివీల్ కూడా చేసింది. ల్యాప్టాప్లపై, ఆడియో, కెమెరా, యాక్ససరీస్లపై 60 శాతం వరకు తగ్గింపును, టీవీ, హోమ్ అప్లియెన్స్పై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ఫోన్ కేటగిరీలో కొన్ని టాప్ డీల్స్.... గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ తక్కువగా 48,999కే విక్రయించనున్నట్టు తెలిపింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు లావాదేవీలపై 10వేల రూపాయల తగ్గింపు కూడా లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 60,499 రూపాయలు. షావోమి ఎంఐ మిక్స్ 2ను 37,999 రూపాయలకు బదులు 29,999 రూపాయలకే అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ ఫోన్ను గతేడాదే షావోమి లాంచ్ చేసింది శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్ ధరను 26,990 రూపాయలకు తగ్గించింది. మిగతా రోజుల్లో ఈ స్మార్ట్ఫోన్ను 46వేల రూపాయలకు విక్రయిస్తోంది. రెడ్మి నోట్ 4 స్మార్ట్ఫోన్ను 10,999కే అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. అసలు ఈ ఫోన్ ధర 12,999 రూపాయలు. మోటో జీ5 ప్లస్ ధరను కూడా 16,999 రూపాయల నుంచి 10,999 రూపాయలకు తగ్గించింది. కాగ, అమెజాన్ కూడా ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ను నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్కు 12 గంటలు ముందుగానే అంటే జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, కెమెరాలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ కేటగిరీల్లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతోపాటు హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు అమెజాన్ పే యూజర్స్ రూ.250 అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ప్రోడక్ట్స్ను కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్ (రూ.200 వరకు) ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. -
ఇండిగో న్యూ ఇయర్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా న్యూ ఇయర్, హాలిడే డిమాండ్ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో, విని యోగదారులను ఆకట్టుకునేలా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్ ధరల్లో ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇండిగో వెబ్సైట్ సమాచారం జనవరి నెలలో అత్యధికంగా బుకింగ్ కోసం ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ పోర్టల్లోని ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా ఉంది. అలాగే బాగ్డోగ్రా నుంచి గౌవహటికి ప్రారంభ ధర రూ.1005గానూ, కోయంబత్తూర్ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఆన్లైన్ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్ కన్వీనియన్స్ ఫీజుగా (నాన్ రిఫెండబుల్)రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. మరికొన్ని విమాన సర్వీసుల టిక్కెట్ ధరల విషయానికి వస్తే... చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా ఇండిగో నిర్ణయించింది. -
న్యూ ఇయర్లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు
ఫ్లిప్కార్ట్ కొత్త ఏడాది సందర్భంగా నిర్వహిస్తున్న 2018 మొబైల్స్ బొనాంజ సేల్ను ప్రకటించింది. దేశీయ కొనుగోలుదారులు కొత్త స్మార్ట్ఫోన్తో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ను ప్రారంభించబోతుంది. జనవరి 3 నుంచి జనవరి 5 మధ్యలో ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ సందర్భంగా షావోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్మి నోట్4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అంతేకాక పలు 4జీ హ్యాండ్సెట్లను డిస్కౌంట్ ధరలో విక్రయించనున్నట్టు తెలిపింది. స్వల్ప ఛార్జీతో బైబ్యాక్ గ్యారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పలు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఈ సేల్లో ఉండనున్నాయి. మొబైల్స్పై సేల్ ఆఫర్స్... షావోమి ఎంఐ ఏ1 డిస్కౌంట ధర రూ.12,999కే అందుబాటు(ఎంఆర్పీ రూ.13,999) గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అత్యంత తక్కువ ధర రూ.39,999కే లభ్యం( అసలు రూ.61వేల నుంచి ధర ప్రారంభం), దీనిలోనే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై ఆఫర్ చేసే రూ.8000 డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మోటో జీ5 ప్లస్ రూ.9999కు విక్రయం(ఎంఆర్పీ రూ.16వేలు) రెడ్మి నోట్ 4 స్మార్ట్ఫోన్ కొత్త ధర రూ.10,999(అసలు ధర రూ.12,999). ఈ డిస్కౌంట్ ధర 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ వేరియంట్కు మాత్రమే అమలు. లెనోవో కే5 నోట్ 4జీబీ వేరియంట్ రూ.11,481కి లిస్ట్ అయింది. దీని అసలు ధర రూ.13,499. మోటో సీ ప్లస్ రూ.5,999కే సేల్(ఎంఆర్పీ రూ.6,999) ప్యానాసోనిక్ ఎలుగా ఏ3 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.6,999 డిస్కౌంట్ ధరలో అందుబాటు. ఈ ఫోన్ అసలు ధర 11,490 రూపాయలు. గెలాక్సీ ఎస్ 7 రూ.26,990కి అందుబాటు(అసలు ఎంఆర్పీ రూ.46వేలు) లెనోవో కే8 ప్లస్ ధర రూ.8,981 నుంచి ప్రారంభం -
నెం. 1 ఎంఐ ఫ్యాన్ సేల్: డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి తన కస్టమర్లకు మరోసారి డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. డిస్కౌంట్ సేల్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లతో మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షావోమి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘న్యూ ఇయర్ ' సేల్ను ప్రకటించింది. ‘ఎంఐ ఫ్యాన్ సేల్’ ఆఫర్ కింద దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 15 ఎంఐ హోమ్లలో డిస్కౌంట్ ధరలలో స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 23న లాంచ్ చేసిన ఈ ఆఫర్ జనవరి 1, 2018 వరకూ ఈ ఆఫర్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఇప్పటివరకూ ఆన్లైన్ ఆఫర్లతో అలరించిన షావోమి తాజాగా ఆఫ్లైన్ వేదికగా కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. ముఖ్యంగా పాపులర్ మోడల్స్ ఏ 1, రెడ్మీనోట్ 4, ఎం ఐ మిక్స్ 2, మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్స్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఎంఐ ఏ1, ఎంఐ మ్యాక్స్ 2 (32జీబీ వేరియంట్) ధరలు రూ.12,999కే లభ్యం( అసలు ధర రూ.13,999). ఇక రూ.15,999గా ఉన్న ఎంఐ మ్యాక్స్ 2(64జీబీ)ను రూ.14,999కు అందుబాటులో ఉంచింది. అలాగే ఎంఐ మిక్స్2పై మూడు వేల తగ్గింపు అనంతరం రూ.32,999కు లభ్యం కానుంది. వీటితో పాటు రెడ్మి నోట్4 4జీజీ వేరియంట్ రూ.10,999 (అసలు ధర రూ.11,999), రెడ్మి4 32జీబీ వేరియంట్ రూ.8,499(ఎంఆర్పీ రూ.8,999) రెడ్మి4 64జీబీ వేరియంట్ రూ.9,999(అసలు ధర రూ.10,999) విక్రయిస్తోంది. వీటితో పాటు వివిధ యాక్ససరీస్పైనా కూడా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. -
ఫ్లిప్కార్ట్ న్యూ పించ్ సేల్: స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి సేల్స్ ను ప్రకటించింది. ‘న్యూ పించ్ డేస్’ పేరుతో ఈ కొత్త సేల్ను లాంచ్ చేసింది . నేటి శుక్రవారం డిసెంబర్ 15) 17వ తేదీ వరకు ఈ విక్రయాలను నిర్వహించనుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ న్యూ పించ్ డేస్ సేల్లో రెడ్మీ నోట్ 4, ఐ ఫోన్ 8 , గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్ఎల్, షియోమీ ఎంఐ ఎ1, మోటో ఎక్స్4, శాంసంగ్ ఫోన్లు, ఐఫోన్లు, మొబైల్ యాక్ససరీలపై ఆకర్షణీయమైన రాయితీలు, ఆఫర్లను ఫ్లిప్కార్ట్ అందిస్తున్నది. ఫ్లిప్కార్ట్ యాప్ లేదా సైట్ ఎందులో ఐటమ్స్ను కొన్నాఈ ఆఫర్లు లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990 (రూ.16,010 తగ్గింపు) ధరకు, గెలాక్సీ ఆన్నెక్ట్స్ పై రూ.11, 900కు లభిస్తోంది. గెలాక్సీ జే 3 ప్రొ, గెలాక్సీ ఆన్ 5పై డిస్కౌంట్ ఆఫర్. అలాగే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.5,001 తగ్గింపుతో రూ.58,999 ధరకు లభిస్తుండగా, హెచ్టీసీ యూ11 రూ.44,999 (రూ.8,991 తగ్గింపు) ధరకు, పిక్సెల్ 2 రూ.39,999 (రూ.11,001 తగ్గింపు) ధరకు, యాపిల్ ఐఫోన్ 7 32జీబీ రూ.42,999 (రూ.6,001 తగ్గింపు) ధరకు, మోటో ఎక్స్4 (4జీబీ, 64జీబీ) రూ.20,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు లభ్యం కానున్నాయి. షావోమీ ఎంఐ ఎ1 రూ.12,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, షావోమీ రెడ్మీ నోట్ 4 (4జీబీ, 64జీబీ) రూ.10,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు , ఎంఐ మ్యాక్స్ 2 64జీబీ రూ.14,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, లభిస్తున్నాయి. ఇవే కాకుండా మరెన్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభ్యం. వీటితోపాటు ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్ససరీలపై కూడా ఈ సేల్లో ఆఫర్లను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
కొత్త రూట్ : డిస్కౌంట్ ధరలు
బడ్జెట్ క్యారియర్ ఎయిర్ఏసియా కొత్త రూట్లకు డిస్కౌంట్లో టిక్కెట్లను అందించనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి కొత్త రూట్లకు రూ.1,999కే టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు రోజూ డైరెక్ట్ విమానాలను లాంచ్ చేసింది. ఈ కొత్త మార్గానికి అడ్వాన్స్గా టిక్కెట్ బుక్ చేసుకునే వారికి, డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ కొత్త ఆఫర్ కింద డిసెంబర్ 10 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కేవలం వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమోషనల్ ధరల కింద ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తుందో ఎయిర్ఏసియా వెల్లడించలేదు. ఈ ఆఫర్ ధరలోనే పన్నులు కూడా కలిసి ఉంటాయి. సీట్లు పరిమితంగానే అందుబాటులో ఉంటాయని, అన్ని విమానాలకు ఈ డిస్కౌంట్ ధరలు వర్తించవని మాత్రం ఎయిర్ఏసియా తెలిపింది. ఎయిర్ఏసియా బుకింగ్స్ పోర్టల్లో సెర్చ్ చేస్తే, కొత్త రూట్ హైదరాబాద్ టూ భువనేశ్వర్, భువనేశ్వర్ టూ హైదరాబాద్కు 2018 జవనరి 4 నుంచి టిక్కెట్ ధరలు రూ.1999గా ఉన్నాయి. టిక్కెట్ ధర రూ.1999లోనే 20 కేజీల బ్యాగేజ్, ఒకపూట ఆహారం ఉండనుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే, నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు అందుబాటులో ఉంటుంది. హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ ఎత్తున్న డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. డిస్కౌంట్ ధరలు దేశీయ విమానయాన సంస్థలకు మంచి ట్రాఫిక్ వృద్ధికి సహకరిస్తాయి. -
శాంసంగ్ షాప్: సూపర్ క్యాష్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. వారం రోజులపాటు నిర్వహించనున్న అప్కమింగ్ ఆన్లైన్ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్ట్లను , క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం వివిధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపింది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లో క్రిస్మస్ కార్నివాల్ను ప్రకటించింది. డిసెంబరు 8నుంచి 15 వరకు ‘శాంసంగ్షాప్’ పేరుతో ఆన్లైన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్లో పేటీఎం, బజాజ్, కేషీ ఫై, మొబీ క్విక్ లాంటి ఇతర సంస్థల ద్వారా క్యాష్బ్యాక్, ఎక్సేంజ్ ఆఫర్, డిస్కౌంట్లు, నో కాస్ట్ ఐఎంఐ ఆఫర్లు అందిస్తోంది. రూ.10వేలకు పైన అన్ని ఉత్పత్తుల కొనుగోళ్లపై బజాజ్ ఫిన్ నో కాస్ట్ ఇఎంఐ అందిస్తోంది. పేటీఎం ద్వారా గెలాక్సీ ఎస్8 , ఎస్8 ప్లస్ , గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తే రూ. 8వేల క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదేవిధంగా మొబీక్విక్ వాలెట్ ద్వారా ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్. కేషీ ఫై శాంసంగ్ డివైస్లపై 40శాతం బై బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. వీటితో పాటు ఇతర శాంసంగ్ మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్సెసరీస్, టెలివిజన్లు లాంటి ఇతర పరికరాలు తగ్గింపు ధరలతో ఈ శాంసంగ్ షాప్ సేల్ లభిస్తాయని కంపెనీ తెలిపింది. శాంసంగ్ షాప్ ద్వారా ఒక వారం పాటు విక్రయాలను ఈ పండుగ సీజన్లో ఆనందించడానికి సంతోషిస్తున్నామని శాంసంగ్ ఇండియా ఆన్లైన్ ఉపాధ్యక్షుడు సందీప్ సింగ్ అరోరా చెప్పారు. -
డిస్కౌంట్లు కేక.. కారు చౌక
కార్ల కంపెనీలు.. డీలర్లు అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లు కేక పుట్టిస్తున్నాయి. కొత్త ఏడాది కొత్త మోడల్ కొనుక్కోవచ్చంటూ కొనుగోలుదారులు ఈ నెలలో కార్ల కొనుగోళ్లను వాయిదా వేస్తారు. వారిని ఆకర్షించడం, సంవత్సరాంత నిల్వలను తగ్గించుకోవడం లక్ష్యాలుగా కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు ఉచిత బీమా, ఎక్సే్ఛంజ్ బోనస్లు, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు, యాక్సెసరీలు ఉచితంగా అందించడం, వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో కూడా డిస్కౌంట్లనివ్వడం, బంగారు నాణేలు, హాలిడే ట్రిప్లు ఆఫర్ చేయడం, ఉచిత ఈఎంఐ వంటి ఆఫర్లను డీలర్లు అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి’ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు తెచ్చాయి. ప్రాంతాన్ని బట్టి, డీలర్ను బట్టి డిస్కౌంట్లు, ఆఫర్లు మారుతుంటాయి. మీకు కనుక బేరమాడే శక్తి బాగా ఉంటే మరింతగా డిస్కౌంట్లు, ఆఫర్లు పొందే అవకాశాలూ ఉన్నాయి. ఏతావాతా రూ.25,000 నుంచి రూ.8.85 లక్షల రేంజ్లో డిస్కౌంట్లను కార్ల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... టాటా మోటార్స్ తగ్గింపు రూ.1.87 లక్షల వరకూ టాటా మోటార్స్ కంపెనీ రూ.26,000–రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టియాగో, హెక్సాలపై రూ.78,000 వరకూ తగ్గింపులు ఇస్తోంది. మరోవైపు రూ. ఒక్క రూపాయి డౌన్ పేమెంట్గా చెల్లించి టాటా కార్లను సొంతం చేసుకునే ఆకర్షణీయ స్కీమ్ను ఆఫర్ చేస్తోంది. టాటా ఇండిగో ఈ–సీఎస్ మోడల్పై రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుండటంతో ఈ కారు ధర రూ.3,15,000కు తగ్గింది. కొనుగోలుదారుడు ఎవరైనా పేటీఎమ్ ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ కారు రూ.3.05 లక్షలకే లభిస్తుంది. మారుతీ డిస్కౌంట్ రూ.90,000 వరకూ.. భారత్లో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ, తన మోడళ్లపై భారీగానే డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సియాజ్, సెలెరియో, ఇగ్నిస్, ఎర్టిగ తదితర మోడళ్లపై ఆ కంపెనీ పెద్ద స్థాయిలోనే డిస్కౌంట్లనందిస్తోంది. స్విఫ్ట్పై రూ.35,000 వరకూ, సియాజ్ డీజిల్ మోడళ్లపై రూ.90,000 వరకూ డిస్కౌంట్లను అఫర్ చేస్తోంది. అయితే బాగా అమ్ముడయ్యే బాలెనో, బ్రెజా, డిజైర్ వంటి మోడళ్లపై ఈ కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వడం లేదు. హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్.. కొరియా కంపెనీ హ్యుం దాయ్ ఏకంగా డిస్కౌంట్ల కోసమే ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ పేరుతో ఒక స్కీమ్నే ప్రకటించింది. బాగా అమ్ముడయ్యే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్.. క్రెటాకు మినహా దాదాపు అన్ని మోడళ్లపై ఈ కంపెనీ డిస్కౌంట్లనందిస్తోంది. గ్రాండ్ ఐ10పై రూ.90,000 వరకూ, ఇలీట్ ఐ20పై రూ.55,000 వరకూ డిస్కౌంట్లనందిస్తోంది. అన్ని వేరియంట్లపై రూ.10,000 విలువైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఆఫర్ చేస్తోంది. హోండా కార్స్.. ఉచితంగా ఏడాది బీమా హోండా కార్స్ ఇం డియా.. సిటీ కారు కొనుగోలు చేస్తే, ఏడాది బీమాను ఉచితంగా అందిస్తోంది. సీఆర్–వీ మోడల్పై లక్షన్నర వరకూ డిస్కౌంట్నిస్తోంది. ఇక జాజ్ కారు కొంటే రూ.30,000 తగ్గింపు లభిస్తుంది. ఏడాది బీమా కూడా ఉచితంగా అందుతుంది. ఒక్క డబ్ల్యూఆర్వీ మోడల్పై మాత్రం ఎలాంటి తగ్గింపులు లేవు. ఫోక్స్వ్యాగన్ రాయితీ రూ.1.1 లక్షల వరకూ జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్వ్యాగన్ రూ.1.1 లక్షల వరకూ డిస్కౌంట్నందిస్తోంది. పోలో కారు కొనుగోలు చేస్తే నగదు డిస్కౌంట్తో పాటు, ఎక్సే్చంజ్ బోనస్ కూడా కలుపుకొని రూ.60,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. వెంటో మోడల్కు అయితే రూ.90,000 నగదు డిస్కౌంట్ను అందిస్తోంది. తక్కువ రేటుకే రెనో రుణాలు.. ఫ్రెంచ్ కార్ల కంపెనీ రెనో రూ.10,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తోంది. క్విడ్ కార్ల కొనుగోళ్ల కోసం 7.99 శాతానికే రుణాలందిస్తోంది. డస్టర్ ఏఎమ్టీపై రూ.90,000 క్యాష్ డిస్కౌంట్తో పాటు ఏడాదిపాటు ఉచిత బీమాను అందిస్తోంది. ఆడి తగ్గింపులు రూ.3లక్షలు –8.85 లక్షల రేంజ్లో.. జర్మనీ లగ్జరీ కంపెనీ ఆడి కూడా తగ్గింపుల విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ కంపెనీ ఏ3, ఏ4, ఏ6, క్యూ3 మోడళ్ల ధరలను రూ.3 లక్షల నుంచి రూ.8.85 లక్షల రేంజ్లో తగ్గించింది. ఆడి రష్ పేరుతో ఒక కొత్త ఆకర్షణీయమైన స్కీమ్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆడి కార్లను ఈ నెలలో కొనుగోలు చేసి 2019 నుంచి ఈఎమ్ఐలు చెల్లించేలా ఈ స్కీమ్ను డిజైన్ చేసింది. ఆడి కంపెనీ లాగానే స్కోడా ఇండియా కూడా ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి పేరుతో ఒక ఆకర్షణీయమైన స్కీమ్ను ఆఫర్ చేస్తోంది. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి కారును కొనుగోలు చేసిన ఏడాది తర్వాత ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు ఈ స్కీమ్ ఇస్తోంది. -
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దేశీయ కార్ మేకర్ మారుతిసుజుకి కార్లపై తగ్గింపురేట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా ఆల్టో, వాగన్ ఆర్, స్విఫ్, ఎర్టిగా కార్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి ప్రముఖ మోడల్స్ స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఆల్టో, ఎర్టిగా ధరలపై రూ. 30 వేలనుంచి రూ. 40వేల దాకా తగ్గింపు అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఆల్టో 800 పై రూ .35వేలు, స్విఫ్ట్ రూ .30వే తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే ఎర్టిగా డీజిల్మోడల్ ధరను రూ.40 వేలు తగ్గించింది. -
ఆడీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కారు తయారీదారు ఆడీ తన కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇయర్-ఎండ్ సేల్స్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మోడల్స్పై రూ.8.85 లక్షల వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు శుక్రవారం తెలిపింది. ప్రత్యేక ధరలు, సులభతరమైన ఈఎంఐ ఆప్షన్లు ఆఫర్ చేయనున్నట్టు కూడా కంపెనీ పేర్కొంది. ఆడీ రష్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లో భాగంగా ఆడీ ఏ3, ఆడీ ఏ4, ఆడీ ఏ6, ఆడీ క్యూ3 మోడల్స్పై ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో భాగంగా ఎంపికచేసిన మోడల్స్పై రూ.3 లక్షల నుంచి 8.85 లక్షల వరకు ధరల ప్రయోజనం లభించనుందని ఆడి ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017లో వినియోగదారులు కొనే తమ ఇష్టమైన ఆడీపై అదనపు ప్రయోజనాలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో భాగంగా పేమెంట్ 2019 నుంచి ప్రారంభించవచ్చు. ఆఫర్ కింద ఆడీ ఏ3 వాహనం రూ.26.99 లక్షలకు విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.31.99 లక్షలు. ఆడీ ఏ4 ధర రూ.33.99 లక్షలు. ఆఫర్ ముందు వరకు దీని ధర రూ.39.97 లక్షలు. అదేవిధంగా రూ.53.84 లక్షలుగా ఉన్న ఆడీ ఏ6 సెడాన్ రూ.44.99 లక్షలుగా ఉంది. ఎస్యూవీ ఆడీ క్యూ3 రూ.29.99 లక్షలకే విక్రయానికి వచ్చింది. ఇది లిస్ట్ అయిన ధర రూ.33.4 లక్షలు. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా ఆడీ ఈ ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. -
ఐఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు
ఆపిల్ ఫేవరెట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయమట. అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ఐఫోన్ ఫెస్ట్కు తెరతీసింది. ఈ ఫెస్ట్లో భాగంగా ఐఫోన్ కొత్త మోడల్స్, పాత మోడల్స్పై భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించింది. నిన్నటి(నవంబర్ 30) నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, డిసెంబర్ 9 వరకు ఈ ఫెస్ట్ జరుగనుంది. కొన్ని ఐఫోన్లు ముఖ్యంగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై ఈ ఐఫోన్లు కొనుగోలు చేసిన వారికి ప్రమోషనల్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాక ఈ కాలంలోనే అమెజాన్ పాత ఐఫోన్ మోడల్స్ ఎక్స్చేంజ్పై రూ.9500 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్లో ఐఫోన్ ఎస్ఈ 32జీబీ వేరియంట్ రూ.20,000కే లిస్టు అయింది. దీన్ని అమెజాన్ అసలు రూ.26వేలకు విక్రయిస్తోంది. అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరో రూ.2000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. దీంతో ఐఫోన్ ఎస్ఈ కస్టమర్లకు రూ.18వేలకే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఐఫోన్ ఎస్ఈ 16జీబీ వేరియంట్ కూడా ఐఫోన్ ఫెస్ట్ సేల్ సందర్భంగా రూ.18,990కే లభ్యమవుతోంది. డిస్కౌంట్ అనంతరం ఇతర ఐఫోన్ల ధరలు ఐఫోన్ 7ను రూ.41వేలకు విక్రయిస్తోంది ఐఫోన్ 6 ఎస్ను రూ.35వేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 6 ధర రూ.26వేలుగా ఉంది ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ వేరియంట్ను రూ.69,685కు అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ను రూ.58,999కు విక్రయం ఇలా అన్ని ఐఫోన్ మోడల్స్పైనా అమెజాన్ డిస్కౌంట్లను ప్రకటించింది. -
దివాళి ఆఫర్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
పండుగకి కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఊరించే డిస్కౌంట్లను దివాళి కానుకగా మార్కెట్లోకి తీసుకొచ్చాయి. కొనుగోలుదారుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఈ డిస్కౌంట్లకు తెరతీశాయి. కారు ధరపై రూ.20వేల నుంచి రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాక క్యాష్బ్యాక్, ఉచితంగా యాక్ససరీస్, ఉచితంగా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, గోల్డ్ కాయిన్లు, తక్కువ వడ్డీ స్కీమ్లు వంటి పలు స్కీమ్లను కార్ల తయారీ సంస్థలు ప్రవేశపెట్టేశాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద మారుతీ సుజుకీ స్విఫ్ట్, సెలెరియో కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.40వేల లబ్ది చేకూరనుంది. దేశంలోనే అత్యధిక మొత్తంలో అమ్ముడుపోతున్న కారు మోడల్ ఆల్టోపై కూడా మారుతీ సుజుకీ రూ.40వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. కానీ టాప్ సెల్లింగ్ మోడల్స్ డిజైర్, బాలెనో, బ్రిజా వాటిపై మాత్రం డిస్కౌంట్లను అందుబాటులోకి తేలేదు. దేశంలో రెండో అతిపెద్ద కారు తయారీదారిగా పేరున్న హ్యుందాయ్ కూడా తన పెట్రోల్ గ్రాండ్ ఐ10పై రూ.80వేల వరకు, డీజిల్ మోడల్పై రూ.90వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. గ్రాండ్ ఐ10 హ్యాందాయ్కి భారత్లో టాప్ సెల్లింగ్ మోడల్. రెండు నెలల క్రితం లాంచ్ చేసిన కొత్త ఎక్స్సెంట్పై కూడా రూ.50వేల వరకు డిస్కౌంట్ను హ్యాందాయ్ ప్రకటించింది. ఎస్యూవీ స్పెషలిస్టు మహింద్రా అండ్ మహింద్రా తన ఎక్స్యూవీ500పై రూ.50వేలు, టీయూవీ300పై రూ.45వేలు, స్కార్పియోపై రూ.42,500 డిస్కౌంట్లను అందిస్తోంది. నిస్సాన్ టెర్రానో, ఫోక్స్వాగన్ వెంటోలపై భారీ మొత్తంలో రూ.1.37 లక్షల, రూ.1.3 లక్షల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోండా తన బీర్వీపై లక్ష రూపాయలు, మారుతీ ఎర్టిగాపై లక్ష రూపాయల ప్రయోజనాలను అందిస్తోంది. లగ్జరీ కారు తయారీదారు మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ, వోల్వో, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలు కూడా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. -
మోటో దీపావళి ఆఫర్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
దీపావళి సందర్భంగా లెనోవో బ్రాండు మోటో తన స్మార్ట్ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. రిలయన్స్ జియో డేటా ఆఫర్, ఈఎంఐ ఆప్షన్లతో పాటు పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను మోటో అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే మోటో అందిస్తున్న 'స్పెషల్ దీపావళి ఆఫర్' కేవలం ఆఫ్లైన్ స్టోర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 21 వరకు ఈ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ట్వీట్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది. డిస్కౌంట్ల వివరాలు... మోటో ఈ4 స్మార్ట్ఫోన్ ధరను రూ.8,999 నుంచి రూ.8,199కు తగ్గించింది మోటో జీ5 స్మార్ట్ఫోన్ రూ.10,999కే అందుబాటు, ఈ ఫోన్ అసలు ధర రూ.12,599 మోటో ఎం స్మార్ట్ఫోన్ ధరను 4వేల రూపాయల మేర తగ్గించింది. రూ.16,999 రూపాయలుగా ఉన్న ఈ స్మార్ట్ఫోన్ రూ.12,999కే అందుబాటులోకి తెచ్చింది. మోటో జెడ్2 ప్లే స్మార్ట్ఫోన్ ధర రూ.29,499 నుంచి రూ.24,999కు తగ్గింపు ధరల తగ్గింపు మాత్రమే కాక, అదనంగా 100జీబీ 4జీ జియో డేటాను యూజర్లకు ఆఫర్ చేయనుంది. బజాజ్ ఫిన్సర్వ్, హోమ్ క్రెడిట్ నుంచి కూడా ఈఎంఐ స్కీమ్లను మోటో బ్రాండు ఆఫర్ చేస్తోంది. -
స్నాప్డీల్ సేల్: డిస్కౌంట్లో కొత్త ఐఫోన్లు
ఈ-కామర్స్ కంపెనీల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ తర్వాత స్నాప్డీల్ తన 'అన్బాక్స్ దివాలి సేల్''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్ నిర్వహిస్తున్న ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్లో భాగంగా ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొత్త ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్ కింద రూ.13వేల వరకు స్నాప్డీల్ అందిస్తోంది. పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్టు స్నాప్డీల్ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో డిస్కౌంట్ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్ ఛార్టడ్, యస్ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్ను స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్ డేస్లో ఆఫర్లకు అదనంగా ఇండస్ఇండ్ బ్యాంకు హోల్డర్స్కు అక్టోబర్ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్డీల్ ఆఫర్ చేస్తుంది. -
ఈ–కామర్స్ సంస్థల పండుగ ఆఫర్లు
►ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 20 నుంచి ► ఇదే బాటలో అమెజాన్ కూడా న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ రానున్న పండుగ సీజన్పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు యూజర్లకు అధిక డిస్కౌంట్లు అందించ్చేందుకు పలు ప్రధాన బ్రాండ్లతో, విక్రయదారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫ్లిప్కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ విక్రయాల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు ఈ సేల్ జరగనుంది. ఇందులో భాగంగా సంస్థ కేవలం భారీ డిస్కౌంట్స్తో మాత్రమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్ ఎక్సే్చంజ్, బై నౌ పే లేటర్, డెబిట్ కార్డులపై ఈఎంఐ వంటి పలు ఆప్షన్లతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఇక అమెజాన్ కూడా వార్షిక విక్రయాల సేల్కు రెడీ అవుతోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల చివరిలో అంటే ఫ్లిప్కార్ట్ సేల్ తర్వాత ఉండొచ్చు. -
వన్ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
సాక్షి ముంబై: వన్ ప్లస్ మూడు రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి వెయ్యిరోజులు పూర్తయిన ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్ 5-7వ తేదీ) గురువారం వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్లో ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా వన్ప్లస్ 3టీ, వన్ ప్లస్ 5 స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. వన్ప్లస్ 3టీ వన్ప్లస్ 3టీ భారీ తగింపును ఆఫర్ చేస్తోంది. రూ. రూ. 4వేల తగ్గింపుతో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ వెర్షన్ను రూ. 25,999, లకే అందిస్తోంది. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు మరో ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల క్యాష్బ్యాక్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్. 12 నెలల జీరో చార్జ్ ఇఎంఐ ఆఫర్ కూడా. వన్ప్లస్ 5 ఆఫర్లు వన్ప్లస్ 5 కొనుగోలుపై 100 మంది లక్కీ కస్టమర్లకు దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా గిఫ్ట్ ఓచర్. క్లియర్ టిప్ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు అధికారిక వెబ్సైట్లో) దీంతోపాటు వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా. కిండ్లే నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో రూ. 250 ప్రైమ్ వీడియో అమెజాన్ పే బ్యాలెన్స్ , ఉచిత 12 నెలల డ్యామేజ్ ఇన్సూరెన్స్ లభ్యం. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్ గమనిక: ఈ ఆఫర్లు అమెజాన్ లో మాత్రమే లభ్యం. మరిన్ని వివరాలకు కంపెనీ ఆన్లైన్ స్టోర్లను, అమెజాన్ ఇండియా వెబ్సైట్ను సందర్శించగలరు. -
అమెజాన్ ఆపిల్ ఫెస్ట్: డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా రెండు రోజుల ఆపిల్ ఫెస్టివల్కు తెరతీసింది. ఈ ఫెస్టివల్లో ఐఫోన్లు, వాచ్లు, ఐప్యాడ్లు, ఐమ్యాక్లపై డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. నేడు, రేపు ఈ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుహోల్డర్స్పై రూ.1500 క్యాష్బ్యాక్ను అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్ 7, ఐఫోన్6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డివైజ్ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్ 11,201 రూపాయల డిస్కౌంట్తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత డివైజ్తో ఎక్స్చేంజ్లో ఐఫోన్ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక 32జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 6 ధర 29,500 రూపాయలు కాగ, ఈ డివైజ్ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 6పై కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఆపిల్కు చెందిన మరో ఫేమస్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎస్ఈ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్లో 25,999 రూపాయలకే ఈ ఫోన్ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆపిల్ స్మార్ట్వాచ్లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. -
జెట్ ఎయిర్వేస్ డిస్కౌంట్ ధరలు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ తగ్గింపు ధరలను ప్రకటించింది. విమాన టికెట్ల కొనుగోలుపై 20-30శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఆగస్టు 11నుంచి 6 రోజులపాటు ఈ ప్రత్యేక సేల్ ద్వారా డిస్కౌంట్ ధరల్లో రెండు వైపులా (వన్ వే అండ్, రిటన్) టికెట్లను అందించనున్నట్టు ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎకానమీ టికెట్లపై 30 శాతం, ప్రీమియం ఛార్జీలపై 20 శాతం తగ్గించనున్నట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ టికెట్ల ద్వారా దేశీయ విమానాల్లో సెప్టెంబర్ 5 నుంచి ప్రయాణాలకు చెల్లుబాటు అవుతుంది. అలాగే అంతర్జాతీయ విమానాల్లో సెప్టెంబర్ 15 నుంచి చెల్లుబాటు అవుతాయి. జెట్ ఎయిర్వేస్ నెట్ వర్క్ పరిధిలోని మొత్తం 44 దేశీయ, 20 అంతర్జాతీయ రూట్లలో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని , రెండు వైపులా ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని చెప్పింది. -
విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్
ముంబై: ప్రముఖ ఎయిర్లెన్స్ విస్తారా విమాన టికెట్లలో భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. 'ఫ్రీడం సేల్' పేరుతో రెండు రోజుల అమ్మకాలను సోమవారం వెల్లడించింది. ఎంపిక చేసిన మార్గాలలో వన్ వేలో ఈ విమాన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. అతి తక్కువ ధరను రూ. 799లుగా నిర్ణయించింది. వీటిల్లో అదనపు చార్జీలు, హిడ్డెన్ ఫీజులు వుండవని స్పష్టం చేసింది. ఈ ఫ్రీడమ్ టు ఫ్లై (వన్-వే, అన్నీ కలిపి) ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే కొనసాగనుంది. ఆగష్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 23, 2017నుంచి ఏప్రిల్ 19, 2018 మధ్యకాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ను కేవలం రూ. 799లకు, ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ. 2,099 ధరల్లో అందిస్తోంది. 'ఫ్రీడమ్ టు ఫ్లై' సేల్ ద్వారా గోవా, పోర్ట్ బ్లెయిర్, లెహ్ (లడఖ్), జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గువహతి, అమృత్సర్, భువనేశ్వర్, అలాగే ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి తమ ఫ్యావరేట్ డిస్టినేషన్స్కు చేరుకోవచ్చని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పరిమిత సీట్లు అందుబాటులోఉంటాయని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ కింద టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా శ్రీనగర్-జమ్మూ మార్గంలో ఈ విక్రయానికి తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు కూడా రాయితీ ఛార్జీల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ-అమృత్సర్ మధ్య టికెట్ రూ. 1,199, ఢిల్లీ-చండీఘడ్కు ధర రూ. 1,299 గాఉండనుంది. ఢిల్లీ-శ్రీనగర్, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,499; ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పూణేలకు రూ. 2,099; ఢిల్లీ-కోల్కతా రూ. 2,199; ఢిల్లీ-గోవా రూ. 2,799 ఢిల్లీ- హైదరాబాద్ మధ్య ఎకనాకమీ రూ. 2,399, ప్రీమియం ఎకానమీ టికెట్ రూ.4,199లకే అందిస్తోంది.