Hemant Soren
-
హేమంత్ సోరేన్లా పట్టం కడతారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్రెడ్డిది రివేంజ్ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం(జనవరి 8) తెలంగాణభవన్లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.‘ఇప్పుడుఉన్న పరిస్ధితుల్లో ఇబ్బంది ఏం లేదు.పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమర వీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు.ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా.జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజలకోసం,రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు…40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి పెద్ద ఇబ్బందేం కాదు. మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు.మనం చేయాల్సింది రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి.ప్రతి రైతుకి కాంగ్రెస్ ఎకరానికి రూ.17 వేలు బాకీ ఉందని చెప్పాలి. రైతు రుణమాఫీ,కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలి.రానున్న సంవత్సరం మెత్తం రైతన్నలకు,తెలంగాణ ప్రజలకిచ్చిన హమీల అమలు,ప్రభుత్వ మోసంపైనే మాట్లాడుదాం.అంతేకానీ నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా.తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయ పడేది లేదు. హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ.కాంగ్రెస్ పార్టీ నేతలు డీల్లీలోనూ అబద్దాలు అడుతున్నారు.తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు.తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం.ఈ సంవత్సరాన్ని మెత్తంగా పోరాట నామ సంవత్సరంగా చేసి ప్రభుత్వంపైన పోరాటం చేద్దాం.ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్గా మారి పోరాటం చేయాలి.కాంగ్రెస్ చేస్తున్న అప్పుల తప్పులు,సాగునీటి ప్రాజెక్టులపైన చేస్తున్న దుప్ఫ్రచారంపైన మాట్లాడుదాం.రానున్న సంవత్సర కాలంలో నూతన కమీటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అద్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్తో పాటు విచారణకు న్యాయవాది..హైకోర్టు షరతులు -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్కు చెందిన దీపికా పాండే సింగ్లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్కు నాలుగు బెర్త్లు, సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను సోరెన్ బుధవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్తోపాటు భార్య కల్పన ఘన విజయం సాధించారు. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం మాన్, హిమాచల్ సీఎం సుఖీ్వందర్..ఇంకా సీపీఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆప్ నేత కేజ్రీవాల్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్దవ్ ఠాక్రే,, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ఇండియా కూట మి నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. పూర్వీకుల గ్రామంలో హేమంత్ దంపతులు కాబోయే సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం బెంగాల్ సరిహద్దుల్లోని రామ్గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రా ను సందర్శించారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే జన్మించారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపారు. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి మన ప్రభుత్వం పనిచేయనుందని వారికి చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ వారిని ఆహ్వానించారు. సీఎంగా నాలుగోసారి.. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. గురువారం ఆయన నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. -
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Jharkhand: ‘బంటీ-బబ్లీ’ ఆరోపణలు తిప్పికొట్టిన హేమంత్ దంపతులు
రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ సినిమా ‘బంటీ ఔర్ బబ్లీ’లో బంటీ, బబ్లీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమార్జన చేస్తుంటారు. ఈ పాత్రలను హేమంత్, కల్పనలకు ఆపాదిస్తూ బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది. అయితే ఇప్పుడు హేమంత్, కల్పనలు విజయం సాధించి, తామేమిటో బీజేపీకి చూపించారు.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్ ఇండియా అలయన్స్ మిత్రపక్షాలతో కలిసి జార్ఖండ్లో వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విజయం సాధించారు. దీంతో హేమంత్- కల్పన రాజకీయాల్లో శక్తివంతమైన జంటగా నిలిచారు. కల్పన తన భర్త హేమంత్ అరెస్ట్ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత సోరెన్ దంపతులు రాష్ట్రంలో 200 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు పార్టీ ఎదుర్కొన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న హేమంత్- కల్పన దంపతులు మరింత శక్తిని కూడదీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలకు ముందు జేఎంఎం సీనియర్ నేతలు చంపై సోరెన్, సీతా సోరెన్, లోబిన్ హెంబ్రోమ్ బీజేపీలో చేరారు. దీనికితోడు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత పార్టీ ఐక్యత దెబ్బతింది. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కల్పన పార్టీని ఐక్యంగా ఉంచడంలో విజయం సాధించారు. ఈ ప్రభావం వల్ల ఆ పార్టీకి గతంలో కంటే అధికంగా సీట్లు వచ్చాయి.గండేయ అసెంబ్లీ స్థానం నుంచి కల్పన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో కల్పనను బయటి వ్యక్తిగా చిత్రీకరించడానికి ‘హెలికాప్టర్ మేడమ్’ అంటూ కల్పనా సోరెన్ను బీజేపీ విమర్శించింది. అయితే దీనివలన ప్రతిపక్షం ఏమీ ప్రయోజనం పొందకపోగా కల్పనకు జనం మద్దతు లభించింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి రావడంలో గిరిజనులు కీలకపాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ అరెస్టును భావోద్వేగ సమస్యగా మార్చి, గిరిజన సమాజాన్ని తనవైపు తిప్పుకోవడంలో జేఎంఎం విజయం సాధించింది.హేమంత్-కల్పన నాయకత్వంలో సాగిన జేఎంఎం ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అలాగే జెఎంఎం ప్రభుత్వ మయ్యా సమ్మాన్ యోజన ఓటర్లపై ప్రభావం చూపింది. ఈ పథకంలో 18-50 ఏళ్లలోపు మహిళలకు నెలనెలా రూ.1000 సాయం అందుతుందని, ఎన్నికల అనంతరం దీనిని రూ.2,500కు పెంచుతామని హేమంత్ హామీ ఇచ్చారు. 1.75 లక్షలకు పైగా రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ప్రచారం సాగించినా ఇది ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపలేదు.ఇది కూడా చదవండి: ఒకే ఒక్కడు హేమంత్ -
జార్ఖండ్లో ఎన్డీఏ ఎందుకు ఓడింది ?
రాంచీ: ప్రధాని మోదీ మొదలు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంచేసినా మెజారిటీకి సరిపడా ఓట్లు రాలకపోవడంతో బీజేపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. స్థానిక అంశాలను పట్టించుకోకుండా జాతీయ అంశాలపై దృష్టిపెట్టిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. బీజేపీ కూటమి ఓటమికి కారణాలుగా చెబుతున్న వాటిల్లో కొన్ని... ⇒ జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తరఫున బలమైన హేమంత్ సోరెన్కు పోటీగా బీజేపీ కూటమి గిరిజన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ⇒ కేవలం సోరెన్ సర్కార్ అవినీతిపై, బంగ్లాదేశ్ చొరబాట్ల చుట్టూతా బీజేపీ ప్రచారం సాగింది. ⇒ సొంత రాష్ట్రంలోని నేతలను ముందుపెట్టి ప్రచారంచేయాల్సిందిపోయి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్రనేతలతోనే ప్రచారపర్వాన్ని పూర్తిచేసింది. ⇒ రాష్ట్ర సీనియర్ నేతలకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదు. చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్న వాళ్లను కాదని కాంగ్రెస్, జేఎంఎం నుంచి వలసవచి్చన నేతలకే పార్టీ టికెట్లు ఇచ్చారన్న విమర్శలొచ్చినా బీజేపీ కేంద్రనాయకత్వం పట్టించుకోలేదు. దీంతో కొందరు బీజేపీ నేతలు పార్టీని వీడారు. ⇒ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేదార్ హజ్రా, మాజీ మంత్రి లూయిస్ మరాండీలు జేఎంఎం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆ మేరకు ఓట్లు జేఎంఎం వైపునకు మళ్లాయి ⇒ రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి కేవలం జాతీయ అంశాలనే ప్రచారా్రస్తాలుగా చేసుకుని ముందుకెళ్లిన బీజేపీకి ఒరిగిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ బగీశ్ చంద్ర వర్మ చెప్పారు. ⇒ దశాబ్దాలుగా ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు జేఎంఎంకే ఓటేశారు. ఈసారి మహిళలు వాళ్లకు తోడయ్యారు ⇒ మైయాయ్న్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే రూ.1,000 ఆర్థికసాయాన్ని రూ.2,500కు పెంచుతానన్న జేఎంఎం హామీ బాగా పనిచేసింది. మహిళలను ఆకట్టుకునే హామీని బీజేపీ ఇవ్వలేదని తెలుస్తోంది. ⇒ నియోజకవర్గాలవారీగా చూస్తే 81 నియోజకవర్గాలకుగాను 68 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధిక మహిళల ఓట్లతోనే జేఎంఎం అధికారాన్ని కాపాడుకోగల్గిందని వర్మ విశ్లేషించారు ⇒ కొన్ని చోట్ల లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా, ఏజేఎస్యూ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయి. దీంతో బీజేపీకి నష్టం చేకూరింది. -
ప్రత్యర్థుల్ని మట్టికరిపించిన సోరెన్ దంపతులు
న్యూఢిల్లీ: ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయి’ అనే సామెత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో అక్షర సత్యమైంది. ఏడాది క్రితం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారు. ఇప్పుడే అదే హేమంత్ సోరెన్ మరోసారి సీఎం కుర్చీని అధిష్టించనున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.అయితే ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో హేమంత్ సోరెన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని ఆయన పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్.. ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్ఈ ఏడాది జనవరిలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన స్థానంలో తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ సోరెన్ తోటికోడలు సీతా సోరెన్తో పాటు ఇతర కుటుంబసభ్యులు విభేధించారు. బీజేపీలో చేరారు. దీంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలతో కలిసి హేమంత్ సోరెన్ కల్పనా సోరెన్ కేంద్రంపై తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన ఐదు నెలల తర్వాత ఈ ఏడాది జూన్లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమికంగా విచారణలో నిర్ధోషిగా పరిగణించింది. ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తనను తప్పుడుగా ఇరికించారని.. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని.. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్ ఆరోపించారు.హేమంత్ సోరెన్ రాకతో చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ మరో మారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీన్ని జీర్ణించుకోలేని చంపై సోరెన్ జేఎంఎంకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హేమంత్ సోరెన్ కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కల్పనా సోరెన్ ఒక్కరే 200పై చీలూకు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు.ఇలా ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పార్టీని ముందుండి నడిపించారు. తాజా, ఎన్నికల్లో అద్భత ఫలితాల్ని రాబట్టారు. దీంతో రెండో దఫా సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఎగ్జిట్పోల్స్ తలకిందులు: జార్ఖండ్లో మళ్లీ ఇండియా కూటమినే!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్లో ఇండియా కూటమి హవా సాగుతోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ బర్హైత్లో4,921 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆయన సతీమణి గాండే అసెంబ్లీ స్థానం నుంచి 4,593 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన మునియా దేవి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.జేఎంఎం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుంచి వెరెకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి గణేష్ మహాలీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో నాలుగుసార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంపైధన్మర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరండీ ఆధిక్యంలో ఉన్నారు.బీజేపీకి చెందిన సీతా సోరెన్ జమ్తారాలో వెనుకంజలో ఉన్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.చదవండి: ‘ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది’: మహా ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుజార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్యూ 10, జేడీయూ రెండు, లోక్జన్శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. -
‘బుల్డోజర్ సిద్దంగా ఉంది’.. సీఎం యోగీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో నిలిచారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధులను రికవరీ చేయడానికి ‘బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని హెచ్చరించారు. అయితే బుల్డోజర్ చర్య చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కొన్ని రోజులకే సీఎం ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జార్ఖండ్లోని సహజ వనరులను, ప్రధాని నరేంద్ర మోదీ అందించిన కేంద్ర నిధులను కొల్లగొట్టింది. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఇది 'బేటీ, మటీ, రోటీ' (కుమార్తె, భూమి, రొట్టె)కి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇప్పుడు దోచుకున్న నిధులను తిరిగి పొందేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని జమ్తారాలో ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. .జార్ఖండ్లో ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగియగా.. రెండో విడత ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా యూపీలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఆస్తులను కూల్చివేస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ‘బుల్డోజర్ బాబా’గా పేరొందారుఇక బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. బుల్డోజర్తో ఇంటిని కూల్చేసి మహిళలు, చిన్నారులు, వృద్ధులను రాత్రికి రాత్రి నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అధికారాలను వినియోగించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. -
Amit Shah: 23న హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలే
దుమ్రీ: జార్ఖండ్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు. జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు. చట్టంలో సవరణ తీసుకొస్తాం రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది. -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్కు ఘన నివాళి జమ్మూకశ్మీర్లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
బంగ్లా చొరబాటుదారుల్ని ప్రొత్సహిస్తున్నారు: సోరెన్ సర్కార్పై మోదీ విమర్శలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరో వారం రోజుల్లో పోలింగ్ ఉండటంతో.. ఎన్నికల్లో గెలుపోటములపై పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుజ్జగింపులే సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన ఎంజెడా అని మండిపడ్డారు.ఈ మేరకు రాష్ట్రంలోని గర్హ్వాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు. సంకీర్ణ ప్రభుత్వంలో బుజ్జగింపులు తీవ్రస్థాయికి చేరాయని, ఈ పార్టీలో రాష్ట్ర సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.‘బంగ్లాదేశ్చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోంది. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోండి. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. చొరబాటు సమస్య కోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. వారు మీ రోటీ, బేటీ, మాతాను తీసుకుంటున్నారని స్పష్టమైంది.జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుంది. కాబట్టి, ఈ చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించండి, కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.హేమంత్ సోరెన్ లక్ష్యంగా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్కు బెయిల్ లభించడంతో చంపాయ్ సోరెన్ను సీఎం పదవి నుంచి తప్పించాలని జేఎంఎం నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు జరిగిన తీవ్ర అన్యాయం. ఆదివాసీ బిడ్డను వారు అవమానించారు. కుటుంబం కంటే వారికి ఏది ముఖ్యం కానప్పుడు మిమ్మల్ని (రాష్ట్ర ప్రజలను) ఎలా చూసుకుంటారు. అలాంటి స్వార్థపూరిత పార్టీలకు గుణపాఠం చెప్పడం అవసరం, నాకు కుటుంబం లేదు. మీరే నా కుటుంబం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. -
జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్గంజ్ జిల్లాలోని బర్హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు. జార్ఖండ్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
Jharkhand: కుదిరిన పొత్తు.. 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పోటీ
రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసికట్టుగా పోటీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ క్రమంలో అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగానూ 70చోట్ల కాంగ్రెస్, జేఎంఎం పార్టీల అభ్యర్థులను నిలబెడతారని హేమంత్ సోరెన్ వెల్లడించారు. సీట్ల పంపకాలపై ప్రస్తుతం మరిన్ని వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదని, తమ మా కూటమి భాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరని తెలిపారు. వారు వచ్చినప్పుడు మిత్రపక్షాల నేతల సమక్షంలోనే సీట్ల సంఖ్యను, ఇతర వివరాలను ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. మిగతా 11 స్థానాల్లో ఇతర కూటమి భాగస్వాములు ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.కాగా జార్ఖండ్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గత ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి జేఎంఎం తమ సీట్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆర్జేడీ అసంతృప్తిసోరెన్ ప్రకటనపై ఆర్జేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ స్పందించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 15- 18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని వ్యాఖ్యానించింది. డీజీపీపై వేటుఇదిలా ఉండగా ఝార్ఖండ్ తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాపై భారత ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. -
జార్ఖండ్లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్నాథ్ ఆరోపించారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
దారుణంగా అవమానించారు
రాంచీ: ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచి్చందని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయ్ సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కలి్పంచారని చంపయ్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు: హేమంత్బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు. ‘సమాజాన్ని విభజించడం మాట అటుంచితే.. వీళ్లు కుటుంబాలకు, పారీ్టలను కూడా చీల్చుతారు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తారు. డబ్బు నాయకులను పార్టీలు మారేలా చేస్తుంది’ అని హేమంత్ పరోక్షంగా చంపయ్ను విమర్శించారు. -
ఈడీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు
ఢిల్లీ: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు మంజూరైన బెయిల్ను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన సుప్రీకోర్టు ఈడీ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందనేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్లు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జూన్ 28 హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ ప్రమేయం ఉన్నట్లు రికార్డులు సూచించటం లేదని జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. సోరెన్ బెయిల్ను రద్దు చేయాలని కోరింది. -
నాడు ఈడీ అరెస్ట్.. నేడు మోదీతో సీఎం సొరేన్ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, హేమంత్ సొరేన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.కాగా, మోదీని సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వంగా కలిసినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్లో ల్యాండ్ స్కామ్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సొరేన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. माननीय प्रधानमंत्री श्री .@narendramodi जी से शिष्टाचार मुलाक़ात हुई। pic.twitter.com/jByrjWHsUw— Hemant Soren (@HemantSorenJMM) July 15, 2024 ఈ క్రమంలో జనవరి 31వ తేదీన సీఎం పదవికి సొరేన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవలే జార్ఖండ్ కోర్టు హేమంత్ సొరేన్కు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, మళ్లీ జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు. -
సోనియాతో హేమంత్ సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ తన భార్య కల్పనతో పాటు 10, జనపథ్ నివాసంలో సోనియాను కలుసుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని అనంతరం మీడియాకు చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత సోనియా గాంధీతో సమావేశమవలేదని, జైలు నుంచి విడుదలైనందున ఆమెతో మాట్లాడేందుకు వచ్చినట్లు వివరించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారా అని అడగ్గా..రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో జనవరి 31వ తేదీన అరెస్టయిన హేమంత్ అంతకు కొద్ది గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. జైలులో 5 నెలలపాటు ఉన్న ఆయన బెయిల్ రావడంతో జూలై 4న విడుదలయ్యారు. అనంతరం మరోసారి సీఎం పదవి చేపట్టడం తెల్సిందే. -
జార్ఖండ్: బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం
జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది.భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు హేమంత్ సోరెన్ ఆ తరువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు.జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1). బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. -
హేమంత్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్ష.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?
జార్ఖండ్లో కొత్తగా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్లో సీఎం సతీమణి కల్పనా సోరెన్కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఎవరి బలం ఎంత?కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయసంగా సోరెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికవ్వడంతో జేఎంఎం బలం 27కు తగ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఇక ఇటీవల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను (బిషున్పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్ లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్ను కాషాయ పార్టీ బహిష్కరించింది.కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మూడోసారి ముఖ్యమంత్రిపీథాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వసీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. -
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ల్యాండ్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత.. హేమంత్కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్ సోరెన్ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్భవన్కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. జార్ఖండ్లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. -
బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: హేమంత్ సోరెన్
రాంచీ: జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానంటూ శపథం చేసిన ఆయన.. తనను జైలులో నిర్బంధించేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్, శనివారం.. జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సామాజిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో బీజేపీకి ఆరితేరిపోయిందని విమర్శలు గుప్పించారు. మాపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెబుతాం. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చిందని.. జార్ఖండ్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ధ్వజమెత్తారు.కాగా, భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
హేమంత్ సోరెన్కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
అయిదు నెలల తర్వాత.. బెయిల్పై హేమంత్ సోరెన్ విడుదల
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో దాదాపు అయిదు నెలల శిక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. -
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్కు బెయిల్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఊరట లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో సోరేన్కు బెయిల్ మంజూరైంది. సోరేన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు అవకాశం ఉంది.ఇక, ఐదు నెలల తర్వాత జైలు నుంచి హేమంత్ సోరేన్ విడుదల కానున్నారు. అయితే, ఆయనపై పెండింగ్ కేసులు ఏవీ లేకపోవడంతో నేడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ల్యాండ్ స్కామ్లో ఈడీ.. హేమంత్ సోరేన్ను జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లిన అనంతరం, సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
న్యూఢిల్లీ: భూ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్సోరేన్కు త్వరలో ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోరేన్ అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం(మే13) జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోరేన్ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లో స్పందించాలని ఈడీని సుప్రీంకోరింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున పిటిషన్పై విచారణ వేగవంతం చేయాలని సోరేన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం అంగీకరించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కల్పించిన ఊరటనే హేమంత్ సోరేన్కు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిబల్ సుప్రీంను కోరారు. అయితే ధర్మాసనం కేసును 20కి వాయిదా వేయబోతుంటే సిబల్ మళ్లీ జోక్యం చేసుకున్నారు. 20కి వాయిదా వేస్తే పిటిషన్ విత్డ్రా చేసుకుంటానని, తన క్లైంట్కు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ధర్మాసనం పిటిషన్ విచారణను 17కు వాయిదా వేసింది. -
‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త పిటిషన్ దాఖలు చేశారు.తన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న వాదనలు పూర్తి కాగా, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని లేదని తెలిపారు. ఈ మేరకు సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.చదవండి: కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పుహైకోర్టు తీర్పు నిరాకరించడం వల్ల తరువాత ఏం చేయాలనే విషయంలో సోరెన్ ప్రతిష్టంభనలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన పరిష్కారాల కోసం ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. తాము మళ్లీ హైకోర్టుకు వెళ్లి కనీసం తీర్పు ఇవ్వాలని కోరినా జడ్జి ఏం స్పందించలేదని చెప్పారు. సోరెన్ ఇక జైల్లోఏ ఉంటారా? లోక్సభ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా .. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ ఈ అంశాన్ని విచారించే తేదీలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేసింది. ఈ కేసులో గతంలోనే సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం తెలిపింది. సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
జైల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్.. ఈడీకి స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. లోక్సభ ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఈడీ ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు. రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు సోరెన్ బెయిల్ పిటిషన్పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సోరెన్ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్
రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీ ల్యాండరింగ్ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వాదనను సమర్ధించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్వాయిస్లను స్వీకరించింది. ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వాటిని జత చేసింది. సంతోష్ ముండా పేరుమీద ఈడీ వర్గాల సమాచారం మేరకు..హేమంత్ సోరెన్ ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్లను తన కుటుంబసభ్యుడు సంతోష్ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంతోష్ ముండానే సోరెన్ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల ల్యాండ్ వ్యవహరాలను గత 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది. సోరెన్కు ఈడీ సమన్లు.. రంగంలోకి పహాన్ మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆ 8.86 ఎకరాల ల్యాండ్కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్గా ఈడీ అధికారులు సంతోష్ ముండా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తొలిసారి గతేడాది ఆగస్టులో హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్కుమార్ పహాన్ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్కు లేఖ రాశారు. తద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖండించిన ఈడీ రాజ్కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్ ఆదేశానుసారం సంతోష్ ముండాకు ఆస్తి సంరక్షకుని బాధ్యతను అప్పగించారని ఈడీ చెబుతోంది. కేసులో మరొక నిందితుడు హిలారియాస్ కచాప్ అక్కడ విద్యుత్ మీటర్ను అమర్చారని వెల్లడించింది. ఇక సోరెన్ సంతోష్ ముండా పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, నవంబర్ 2022లో అతని కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం సంతోష్ ముండాతో పాటు, రాజ్కుమార్ పహాన్లు హేమంత్ సోరెన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ఆస్తి పహాన్ అతని కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు చూపించి సోరెన్ను రక్షించేలా సాక్ష్యాలు తారుమారు చేయడం, అతని ఆస్తులు బయట పడకుండా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఈడీ చెబుతోంది. జ్యుడీషియల్ కస్టడీలో హేమంత్ సోరెన్ కాగా, సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్ను మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని హోత్వార్లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
Enforcement Directorate: సోరెన్ భూమి అటాచ్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సన్నిహితులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్కు చెందిన రూ.31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. సోరెన్తోపాటు భాను ప్రతాప్ ప్రసాద్, రాజ్ కుమార్ పహన్, హిలరియాస్ కచ్ఛప్, బినోద్ సింగ్లపై మార్చి 30వ తేదీన రాంచీలోని మనీ లాండరింగ్ నిరోధక(పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టులో ఈడీ ఈమేరకు చార్జిషీట్ వేసింది. ఈ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సునీతా కేజ్రీవాల్తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్భంజ్లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
రాజకీయాల్లోకి హేమంత్ సోరెన్ భార్య
భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు కోర్టు నుంచి ఇంకా ఉపశమనం లభించలేదు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జేఎంఎం నేత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. ఇదిలావుండగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్ సోరెన్ను అరెస్టు చేసిన సమయంలో కల్పనను జార్ఖండ్కు కొత్త సీఎం చేయాలనే చర్చ జరిగింది అయితే, చివరి నముషంలో చంపై సోరెన్ను సీఎం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గిరిడిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హేమంత్ సోరెన్ను కూడా కలిశారు. కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయాన్ని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు నేను ప్రజా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. హేమంత్ మన మధ్యకు వచ్చే వరకు, నేను అతని వాయిస్ వినిపిస్తాను. అతని ఆలోచనలను అందరితో పంచుకుంటాను. నేను ప్రజాసేవ సేవ చేస్తూనే ఉంటాను. మీరు హేమంత్కు ఎంతటి ఆప్యాయత, దీవెనలు అందించారో అతని జీవిత భాగస్వామినైన నాకు కూడా అందిస్తారని నేను నమ్ముతున్నాను’ అని రాశారు. आज अपने जन्मदिन और कल गिरिडीह में झामुमो के स्थापना दिवस कार्यक्रम में शामिल होने से पहले आज झारखण्ड राज्य के निर्माता और झामुमो के माननीय अध्यक्ष आदरणीय बाबा दिशोम गुरुजी और मां से आशीर्वाद लिया। आज ही सुबह हेमन्त जी से भी मुलाकात की। मेरे पिता भारतीय सेना में थे। वह सेना से… pic.twitter.com/IBZmBVnXr9 — Hemant Soren (@HemantSorenJMM) March 3, 2024 -
విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు
రాంచీ: జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him 29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak — ANI (@ANI) February 5, 2024 జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం కూటమి బలపరీక్షలో విజయం సాధించింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్కు బలపరీక్ష -
నా అరెస్టులో రాజ్భవన్ ప్రమేయం ఉంది: హేమంత్ సొరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సొరెన్కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు హేమంత్ సొరెన్ సవాలు విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు. "మేము ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని భావిస్తే, జార్ఖండ్లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు." అని హేమంత్ సోరెన్ అన్నారు. 'కేంద్రం 2019 తర్వాత స్కామ్లను మాత్రమే చూస్తోంది. 2000లలో జరిగిన స్కామ్లను చూడలేరు. గిరిజనులు రాష్ట్రాలకు చీఫ్లుగా, IAS లేదా IPS కావాలని కేంద్రం కోరుకోవడం లేదు. గిరిజన నాయకుల ప్రభుత్వాల కాలవ్యవధిని శాంతియుతంగా పూర్తి చేయనివ్వరు. నాకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది' అని హేమంత్ సొరెన్ అన్నారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి తరుపున హేమంత్ సొరెన్ సన్నిహితుడు చంపయ్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని నేడు అసెంబ్లీలో బలప్రదర్శన జరుగుతోంది. ఇదీ చదవండి:రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్కు బలపరీక్ష -
రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్కు బలపరీక్ష
రాంచీ: జార్ఖండ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. దీంతో, జార్ఖండ్లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, హైదరాబాద్లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు. కాగా, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుత కూటమికి బలపరీక్షను గెలిచే ఛాన్స్ ఉంది. మరోవైపు.. జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హెమ్బ్రోమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్ హెమ్బ్రోమ్ అన్నారు. తన సలహాను పట్టించుకోనందుకే మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్పుర్ అద్దె చట్టం, సంథాల్ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే జార్ఖండ్ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక విష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి రాలేదు. ఆయన అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన అసలు ఎవరికీ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. సోమవారం విశ్వాసపరీక్షకు ఆయన గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నాయి. కాగా.. సోమవారం నాటి పరీక్షలో హేమంత్ సోరెన్ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. -
హేమంత్ సొరెన్పై సొంత ఎమ్మెల్యే విమర్శలు
రాంచీ: జార్ఖండ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో నూతనంగా సీఎం పదవి చేపట్టిన చంపయ్ సొరెన్ రేపు బలప్రదర్శన నిరూపించుకోవాల్సి ఉంది. ఈ కీలక సమయాల్లో జేఎంఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే మాజీ సీఎం హేమంత్ సొరెన్పై విమర్శలు చేయడం, ప్రస్తుతం సీఎం చంపయ్ సొరెన్ మద్దతుకు మరో ఎమ్మెల్యే దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపు జరగబోయే ఫ్లోర్ టెస్టుకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఈ పరిణామాలు జార్ఖండ్లో నాయకత్వ మార్పుల ముప్పు తొలగిపోలేదని గుర్తుచేస్తున్నాయి. సాహిబ్గంజ్ జిల్లాలోని బోరియో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోబిన్ హెంబ్రోమ్ ఒక రాజకీయేతర సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికలకు ముందు జేఎంఎం మేనిఫెస్టోలో చోటా నాగ్పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల అద్దె చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదు. 1996 కేంద్ర పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేదు. చోటానాగ్పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల చట్టాలు గిరిజనుల భూమి హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ఉండగా.. కేంద్ర గ్రామ పంచాయతీ చట్టం గిరిజనులను దోపిడీ నుండి రక్షించడానికి గ్రామసభకు అధికారం ఇస్తుంది. ఈ చట్టాలు అమలైతే గిరిజనుల భూములకు రక్షణ ఉంటుంది. చెప్పినా పట్టించుకోలేదు.. గిరిజన సంక్షేమం విషయంలో జేఎంఎం నుండి అన్ని సంబంధాలను తెంచుకుంటానని లోబిన్ హెంబ్రోమ్ హెచ్చరించారు. శిబు సోరెన్ ఆధ్వర్యంలో ఎంతో పోరాటం చేస్తే జార్ఖండ్ ఏర్పడింది, కానీ నేటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఈ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. విమానాశ్రయం, ఆనకట్టలు, పరిశ్రమల పేరుతో గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని హెంబ్రోమ్ ఆరోపించారు. జార్ఖండ్లో గిరిజనేతరుల పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రతీ విషయంలో బిహారీలు కల్పించుకుంటారు.. హేమంత్ సొరెన్కు తాను చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. బిషున్పూర్ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే చమ్ర లిండా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ పరీక్షకు ముందు జరిగిన పార్టీ సమావేశాలకు లిండా గైర్హాజరయ్యారు. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య ఈ అంశాలపై స్పందించారు. హెంబ్రోమ్తో మాట్లాడామని తెలిపారు. రేపు జరగబోయే ఫ్లోర్ టెస్ట్ కి ఆయన కూడా వస్తారని చెప్పారు. చమ్ర లిండా అనారోగ్యంతో ఉన్నారని వివరించారు. ఇదీ చదవండి: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు -
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్ను ఈడీ అరెస్ట్చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
జార్ఖండ్ సర్కార్ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
ఇంత నాటకీయత దేనికి?!
జార్ఖండ్ చుట్టూ ఈ వారమంతా చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజానీకాన్ని నివ్వెరపరిచాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జాడ తెలియడం లేదనీ, ఆయన గురించి జనవరి 27 నుంచి వెదుకుతున్నామనీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 28న చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 30 గంటల పాటు ఆయన ఆచూకీ లేదు. ఢిల్లీ వెళ్లారన్న సమాచారం ఉన్నా అక్కడి నివాసంలో ఆయన అధికారు లకు చిక్కలేదు. అన్ని మార్గాలనూ దిగ్బంధించి వెతుకులాడిన దర్యాప్తు అధికారులకు చివరకు నిరాశే మిగిలింది. జనవరి 31న ఆయన తనంత తానే రాంచీ నివాసంలో ప్రత్యక్షం కావటం, గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించటం, అటుపై ఆయన్ను రాత్రి 9.30కి ఈడీ అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. హేమంత్ స్థానంలో కొత్త సీఎంగా ‘జార్ఖండ్ టైగర్’గా పేరున్న చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ నెల 5 లోపు బలపరీక్ష నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు తరలివచ్చారు. రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారో లేదోనన్న ఆందోళన సమసిపోయాక, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఎలా అన్నది జేఎంఎంకు సమస్యగా మారినట్టుంది. కూటమి సర్కారులో భాగస్వామి అయినకాంగ్రెస్ మిత్రధర్మంగా తెలంగాణలో తలదాచుకోవటానికి చోటిచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ పట్టుదల... ఏదేమైనా దానికి చిక్కరాదన్న హేమంత్ తీరు... మీడియాకు కావలసినంత మేతనిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో వున్న నాయకుణ్ణీ, అందులోనూ ఒక ఆదివాసీ నేతనూ వెంటాడటం అంత అత్యవసరం ఎందుకైందో బోధపడదు. ఆయనపై వున్న కేసులు తీవ్రమైనవే కావొచ్చు, వాటి విషయమై ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించివుండొచ్చు... దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఫోర్జరీ పత్రాలతో ఆయన రాంచీలోనూ, వేరేచోట్లా భూములు కాజేశారని ఆ సంస్థ ఆరోపణ. కానీ ఆయన చట్టానికి దొరక్కుండా తప్పించుకుపోయే సాధారణ వ్యక్తేమీ కాదు. అలాగని బ్యాంకులకు వేలకోట్లు ఎగనామంపెట్టి విదేశాలకు పోయిన కొందరిలా వ్యాపారో, పారిశ్రామికవేత్తో కాదు. ఆయన ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు. జార్ఖండ్ సీఎం. జనం మధ్యనే ఉండి, వారి మద్దతుతో రాజకీయాల్లో కొనసాగదల్చు కున్నవారు. హేమంత్ సోరెన్ ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లను బేఖాతరు చేయటం వల్ల వారంలో పూర్తయ్యే దర్యాప్తు నెలరోజులు పట్టొచ్చు. లేదా మరికొన్ని నెలలు కొనసాగొచ్చు. ఈలోగా మిన్ను విరిగి మీద పడుతుందా? ఇప్పటికే 41 చోట్ల సోదాలు చేసి, అయిదు సర్వేలు నిర్వహించామని ఈడీ చెబుతోంది. హేమంత్ ఢిల్లీ నివాసంలో నిర్వహించిన దాడిలో భారీగా నగదు, కీలకమైన పత్రాలు లభించాయన్నది ఈడీ ప్రకటన సారాంశం. ఈ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా రని హేమంత్ సోరెన్ ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈడీ సిబ్బందిపై కేసు కూడా పెట్టారు. దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. మరో మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతు న్నాయి. ఈ ఏడాది ఆఖరుకు జార్ఖండ్ అసెంబ్లీ గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయాలనుకోవటం అప్రదిష్ట పాలు చేయటానికేననీ, తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రనీ హేమంత్ చేస్తున్న ఆరోపణ జనం విశ్వసించే అవకాశం లేదా? హేమంత్ కూడా ఇంత నాటకీయతకు తావివ్వకుండా ఉండాల్సింది. రాజకీయంగా ఆయన ఇబ్బందులు ఆయనకుండొచ్చు. తన అరెస్టు ఖాయమని తెలిశాక తదుపరి సీఎం ఎవరన్న అంశంలో గృహచ్ఛిద్రాలు కమ్ము కున్నాయి. సతీమణి కల్పనా సోరెన్ వైపు ఆయన మొగ్గుచూపగా, హేమంత్ దివంగత సోదరుడి సతీమణి, ఎమ్మెల్యే సీతా సోరెన్ పేచీకి దిగటం సమస్య అయిందంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో, మెరుగైన పాలన అందించటంలో హేమంత్ సర్కారుకు మంచిపేరే ఉంది. జార్ఖండ్ ఏర్పడి 24 ఏళ్లు కావస్తుండగా 2014–19 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తిగా అయిదేళ్లూ పాలించలేకపోయింది. అస్థిరత్వమే రాజ్యమేలిన ఆ రాష్ట్రంలో తొలిసారి 2019 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమికి 47 స్థానాలు లభించాయి. 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో అధికార కూటమికి ఇంత మెజారిటీ ఉండటం అదే మొదటిసారి. చిత్రమేమంటే అంతకు ఆర్నెల్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలకు బీజేపీ–ఏజేఎస్యూ కూటమి 12 గెల్చుకుంది. జార్ఖండ్లో గతంలో బీజేపీతో జేఎంఎం కూటమి కట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ మౌలికంగా రాష్ట్రంలో తనకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని గ్రహించాక గత దశాబ్ద కాలంగా బీజేపీతో పొత్తుకు జేఎంఎం సుముఖత చూపటం లేదు. పైగా ఆదివాసీలను హిందువులుగా చూపాలన్న సంఘ్ పరివార్ వైఖరికి భిన్నంగా వారిని ప్రత్యేక మతస్థులుగా గుర్తించాలని హేమంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణాల వల్లే ఈడీ ఆయన్ను వేధిస్తున్నదని ఆదివాసీలు నమ్మితే అది రాజకీయంగా బీజేపీకి నష్టంగా పరిణమిస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్న అప్రదిష్టను మూటకట్టుకుంది. ఇప్పటికే ఆ సంస్థ తీరును విపక్షాలు తూర్పారబడుతున్నాయి. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హేమంత్ సోరెన్ మాదిరే ఈడీ సమన్లను ధిక్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సంయమనంతో వ్యవహరించి నిందకు తావులేకుండా చూసుకోవాలి. అలాగే జార్ఖండ్లో ఎలాంటి రాజకీయ అస్థిరతకూ బీజేపీ తావీయరాదు. -
'హేమంత్ సొరెన్కు అండగా నేనున్నా'
కోల్కతా: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. హేమంత్ సొరెన్ శక్తివంతమైన గిరిజన నాయకుడని అన్నారు. సొరెన్ తన సన్నిహిత మిత్రుడని చెప్పారు. సొరెన్కు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు. "శక్తివంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సొరెన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సొరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుతమైన స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు." అని మమతా బెనర్జీ ట్వీట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. హేమంత్ సొరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ రెండు సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హేమంత్ సొరెన్కు ఐదు రోజుల కస్టడీ -
హేమంత్ సొరెన్కు ఐదు రోజుల కస్టడీ
రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్కు ఐదు రోజుల కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా.. సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంపయ్ సోరెన్ 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren's resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ -
సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. కాగా భూ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్లు సంజీవ్ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. కాగా హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జార్ఖండ్లో నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని జేఎంఎం శాసనసబాపక్షనేత చంపయ్ సోరెన్ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. చదవండి: ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత -
ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత
కోల్కతా: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైళ్లకు పంపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్తో జట్టుకట్టేందుకు తమ టీఎంసీ పార్టీ ఆసక్తి చూపినా ఆ పార్టీ తిరస్కరించిందన్నారు. కాగా మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆధీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జార్ఖండ్లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్కు ఎయిర్పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
Jharkhand: ‘గవర్నర్గారూ.. మా మెజార్టీ ఇది!’
రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్ను లెజిస్టేటివ్ లీడర్గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే? -
కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే?
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయడంతో రాష్ట్రానికి నూతన సీఎంగా చంపయ్ సొరెన్ను ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సొరెన్ అధికార మహాఘటబంధన్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాసిన లేఖలో చంపయ్ సొరెన్ను జేఎంఎం శాసనసభా పక్షానికి అధిపతిగా ప్రకటించారు. చంపయ్ సొరెన్ను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. హేమంత్ సొరెన్ తన వారసుడిగా చంపయ్ను ఎన్నుకునే ముందు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? హేమంత్ సొరెన్ తండ్రి శిబు సొరెన్తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక సభ్యులలో చంపయ్ సొరెన్ ఒకరు. అయితే హేమంత్ సొరెన్కు అతనిపై నమ్మకం ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. చంపయ్ సొరెన్.. హేమంత్ సొరెన్కు విధేయుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి శిబు సోరెన్కు సన్నిహితుడు. అదీగాక చంపయ్ సొరెన్ కొల్హాన్ ప్రాంతానికి చెందినవారు. కొల్హాన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. జార్ఖండ్కు ఇప్పటి వరకు కొల్హాన్ నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు బీజేపీ నుండి అర్జున్ ముండా (2010 నుండి 2013 వరకు), రఘువర్ దాస్ (2014 నుండి 2019 వరకు). జార్ఖండ్ రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు చెందిన మధు కోడా.. 2006 నుండి 2008 వరకు సీఎంగా పనిచేశారు. జార్ఖండ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాన్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేలవంగా ఉంది. అయినప్పటికీ సీఎం హేమంత్ సొరేన్కు ఈ ప్రాంతంపై సరైన ఆధరణ లేదు. చంపై సోరెన్ను తన వారసుడిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీకి ఎదురుదెబ్బ ఇచ్చినట్లవుతుందని సొరెన్ భావించారు. 'టైగర్ ఆఫ్ కొల్హన్' గా పేరున్న చంపయ్ సొరెన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి సులభమవుతుందని భావించినట్లు సమాచారం. ఇదీ చదవండి: రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం.. హైదరాబాద్ హోటల్కు ఎమ్మెల్యేలు -
ఈడీ అరెస్ట్ ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో సోరెన్ పిటీషన్
-
Jharkhand Crisis: హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్
రాంచీ: రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో 12 మంది సీఎంలు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంతటి అనిశ్చితిని ఎదుర్కొంటూ వస్తున్న జార్ఖండ్లో ఇప్పుడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్ను జేఎంఎం ప్రకటించినప్పటి గంటలు గడుస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జార్ఖండ్లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపయ్కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో.. ఈ గ్యాప్లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఎల్లా హోటల్కు.. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఖరారైంది. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఇండియా కూటమి ఎమ్మేల్యేలు. అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది. ఇదిలా ఉంటే.. జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ హింసిస్తోందని.. వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం కొనసాగవని అన్నారాయన. హేమంత్కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు. ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేపు(శుక్రవారం) ఆ పిటిషన్ను విచారణ చేపట్టనుంది చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు. -
అరెస్టులను ఎదుర్కొన్న ముగ్గురు జార్ఖండ్ సీఎంలు!
జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్ను నిర్దోషిగా విడుదల చేసింది. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు. -
సోరెస్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్ బంద్!
బీహార్ తర్వాత జార్ఖండ్లో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్కు చెందిన పలు సంస్థలు గురువారం జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈరోజు (గురువారం) హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్పై విచారణ జరగనుండగా, మరోవైపు చంపై సోరెన్ పట్టాభిషేకంపై చర్చలు జరుగుతున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఈడీ కార్యాలయంలో నేటి (గురువారం) ఉదయం నుంచి దర్యాప్తు సంస్థ అధికారులు హేమంత్ సోరెన్ను విచారిస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా ఈడీ తనను అరెస్ట్ చేయడంపై హేమంత్ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్పై ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. यह एक विराम है जीवन महासंग्राम है हर पल लड़ा हूं, हर पल लड़ूंगा पर समझौते की भीख मैं लूंगा नहीं क्या हार में, क्या जीत में किंचित नहीं भयभीत मैं लघुता न अब मेरी छुओ तुम हो महान, बने रहो अपने लोगों के हृदय की वेदना मैं व्यर्थ त्यागूंगा नहीं हार मानूंगा नहीं... जय झारखण्ड! pic.twitter.com/oduWMRGOmQ — Hemant Soren (@HemantSorenJMM) January 31, 2024 ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కవితను పోస్ట్ చేసి.. ఇది తనకు కేవలం విరామమేనని రాశారు. తాను ఎప్పుడూ పోరాడుతుంటానని, భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని, ఎప్పుడూ రాజీ కోసం వేడుకోననని దానిలో పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Morning visuals from Enforcement Directorate's office, in Ranchi where the ED is interrogating Hemant Soren in a money laundering case related to the alleged land scam. Hemant Soren stepped down as the Chief Minister of Jharkhand yesterday. pic.twitter.com/681hhYs5sy — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి చంపై సోరెన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. #WATCH | On Jharkhand CM Hemant Soren, state BJP spokesperson Pratul Shah Deo says, "...This was bound to happen in Jharkhand. CM was accused of being involved in a Rs 70,000 Crore scam. After selling everything, he sold defence land in Ranchi too. His problems increased after… pic.twitter.com/Na8fQ6Xmux — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ గురించి బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ మాట్లాడుతూ హేమంత్ సోరెన్ రూ. 70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, చివరికి రాంచీలోని డిఫెన్స్ భూమిని కూడా అమ్మేశారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ చట్టమే అత్యున్నతమనే విషయాన్ని మర్చిపోయారని, 40 గంటల పాటు కనిపించకుండా పోయారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జార్ఖండ్కు మచ్చతెచ్చారని ఆరోపించారు. -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్!.. కల్పనా సోరెన్కు షాక్?
రాంచీ: జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్ సోరెన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ తెలిపారు. ఆ తరువాత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. కాగా, చంపయ్ సోరెన్ 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. #WATCH | Jharkhand Minister Alamgir Alam says, "Hemant Soren has resigned from the post of CM...We have the support of 47 MLAs...We have proposed to form a new government. Champai Soren will be our new CM...We have not been given time for swearing in..." pic.twitter.com/AMjjoKNH1F — ANI (@ANI) January 31, 2024 సోరెన్ కుటుంబంలో పొలిటికల్ ట్విస్ట్.. ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తాను’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
చంపై సోరెన్ను ‘జార్ఖండ్ టైగర్’ అని ఎందుకంటారు?
చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు. చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు. చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు. -
మనీ లాండరింగ్ కేసు: సీఎం సోరెన్ అరెస్ట్
రాంచీ: జార్ఖండ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను బుధవారం రాత్రి 9.30 గంటలకు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సోరెన్ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అరెస్టు కంటే ముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్ పేరును అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)–కాంగ్రెస్–రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేతలు ప్రతిపాదించారు. మనీ లాండరింగ్ కేసులో తొలుత హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు పటిష్టమైన భద్రత మధ్య సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన తమ ఎమ్మెల్యేలతో రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ను కలిసి తన రాజీనామా పత్రాలు అందజేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ను నిమిషాల వ్యవధిలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు. తమ పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నికపై చర్చించారు. కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి వినోద్ పాండే చెప్పారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపయ్ సోరెన్ అన్నారు. అంతకుముందు హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ లేదా వదిన సీతా సోరెన్ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం మహిళా ఎంపీ మహువా మాఝీ చెప్పారు. 7 గంటలపాటు సోరెన్ విచారణ మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్ అధికార నివాసంలో 7 గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. సోరెన్కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఈడీ విచారణకు సోరెన్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా చెప్పారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోరెన్ను లక్ష్యంగా చేసుకొని, విచారణ పేరుతో వేధిస్తోందని వారు మండిపడ్డారు. దళితుడు కావడం వల్లే సోరెన్పై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి జైలుకు వెళితే తాము ఆయనతోపాటు వెళ్తామని తేలి్చచెప్పారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ నెల 20న హేమంత్ సోరెన్ను 7 గంటలపాటు విచారించారు. సోమవారం ఢిల్లీలో సోరెన్ నివాసంలో సోదాలు జరిపారు. చట్టవిరుద్ధంగా భూయాజమాన్య మారి్పడికి పాల్పడిన వ్యవహారంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ అధికారులపై సోరెన్ ఫిర్యాదు ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ/ఎస్టీ పోలీసు స్టేషన్లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురి చేస్తోందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఫిర్యాదులో సోరెన్ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదన అనుభవిస్తోందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు. రూ.36 లక్షల నగదు, కీలక పత్రాలతోపాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్ తేలి్చచెప్పారు. ఎవరీ చంపయ్ సోరెన్? జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. ఆయన 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జని్మంచారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. -
జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సొరెన్
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చంపై సొరెన్ నియమితులు కానున్నారు. చంపై సొరెన్ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ను కలిశారు చంపై సొరెన్. హేమంత్ సొరెన్పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్. చంపై సొరేన్ జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా ఉన్నారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ కృషి చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సొరెన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. నూతన సీఎంగా చంపై సొరెన్ను ఎన్నుకున్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు. ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సొరెన్ మొదట్లో ఆయన భార్య కల్పనా సోరెన్ నూతన సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ కల్పనా సొరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అటు ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కల్పనా సొరెన్కు సీఎం పదవి ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఇదీ చదవండి: ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్ -
ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్
రాంచీ: తనపై విచారణ చేపడుతున్న ఈడీ అధికారులపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సొరెన్ను ప్రశ్నించడానికి బుధవారం ఆయన నివాసానికి ఈడీ బృందాలు వెళ్లాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఆయనపై ఈడీ దర్యాప్తు చేయడం ఇది రెండోసారి. నేడు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో సొరెన్ అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సొరెన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో 144 సెక్షన్ను పోలీసులు విధించారు. అటు.. అరెస్టు వార్తల నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సొరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అటు సొరెన్పై ఈడీ దాడులు రాజకీయంగానూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జార్ఖండ్లో భారీ భూకుంభకోణంలో హేమంత్ సొరెన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా భూమి యాజమాన్యాన్ని మార్చే మాఫియాకు సహకరించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సొరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.36 లక్షలు, ఒక కారు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించేందుకే ఈడీ తనను టార్గెట్ చేసిందని సొరెన్ ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
నేడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించనున్న ఈడీ
-
హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?
జార్ఖండ్ రాజకీయాలు రోజరోజుకీ ఉత్కంఠగా మారాయి. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నించడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన భార్య కల్పనా సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది. సోరెన్ అరెస్ట్ అయితే కల్పనా తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తనను ఈడీ అరెస్ట్ చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హేమంత్ సోరెన్.. తన భార్య కల్పనా సోరెన్ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే. ఎవరీ కల్పనా కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు. కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. రాజకీయాల్లో హేమంత్కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది. కల్పనా ముఖ్యమంత్రి పదవిని చేపడితే... ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఓ ట్విట్స్ ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఏడాది కంటే తక్కే ఉంది. ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. మరి ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సి ఉంది. సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ ఇక ఒడిశాలోని మయూర్భంజ్కు చెందిన కల్పన 1976లో రాంచీలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. ఇంజనీరింగ్లో గ్రాడ్యూయెట్ చేసిన కల్పనా తరువాత ఎంబీఏ చేశారు. ఫిబ్రవరి 7, 2006న హేమంత్ సోరెన్ను వివాహం చేసుకుంది. వీరికి నిఖిల్, అన్ష్ ఇద్దరు పిల్లలు. కల్పనా సోరెన్ ఒక పాఠశాలను నడుపుతుండటంతోపాటు సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ 2022లో వార్తల్లోకి దాదాపు రూ. 5 కోట్ల ఖరీదు చేసే మూడు వాణిజ్య భవనాలు ఆమె పేరిట ఉన్నాయి. మహిళలు, పిల్లల సాధికారతపై కార్యక్రమాలకు కూడా తరుచుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే 2022లో తన భార్యకు(కల్పనా సోరెన్) చెందిన కంపెనీకి పారిశ్రామిక ప్రాంతంలో ప్లాట్ను కేటాయించేందుకు సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆరోపణలు చేయడంతో కల్పనా పేరు వార్తల్లో నిలిచింది. 30 గంటల తర్వాత ప్రతక్ష్యం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం, మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయన 27వ తేదీ రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టి రూ. 36 లక్షలతోపాటు బీఎండబ్ల్యూకారు, కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 గంటల తర్వాత సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం సాయంత్రం రాంచికీ చేరుకొని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా పాల్గొన్నారు. -
హేమంత్ సోరెన్ అరెస్ట్ కు రంగం సిద్ధం
-
అజ్ఞాతం వీడిన సోరెన్.. అరెస్టుకు రంగం సిద్ధం?
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నాం రాంచీలో ఆయన ప్రత్యక్షం అయ్యారు. తన అధికార నివాసంలో ఆయన మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆయన సతీమణి కల్పన కూడా హాజరయ్యారు. దీంతో తాజా ఊహాగానాలే నిజం కానున్నాయా? అనే అనే చర్చ మొదలైంది. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన సోరెన్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే ఆయన కోసం అక్కడికి వెళ్లిన ఈడీకి ఎదురు చూపులే మిగిలాయి. ఈ సాయంత్రంలోపు ఆయన అరెస్టు ఉంటుందా? ఉండదా? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. #WATCH | Jharkhand CM Hemant Soren holds a meeting of the state's ministers and ruling side's MLAs at CM's residence in Ranchi. His wife Kalpana Soren is also present at the meeting. pic.twitter.com/oo2GJhZ0gi — ANI (@ANI) January 30, 2024 ఇదీ చదవండి: 18 గంటలుగా మిస్సింగ్.. జరిగింది ఇదే..! ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
జార్ఖండ్ లో వేడెక్కిన రాజకీయం
-
Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం బాధ్యతలు?
జార్ఖండ్లో రాజకీయలు ఒక్కసారిగా వేడేక్కాయి. రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్..ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్చేసే అవకాశం ఉన్న క్రమంలో జార్ఖండ్లో సీఎం మార్పు జరగనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేఎమ్ఎమ్తోపాటు ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంగళవారం మధ్యాహ్నం సీఎం నివాసంలో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? జార్ఖండ్ రాజకీయ పరిణామలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని, తాను రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు దూబే ఎక్స్లో (ట్విటర్) పోస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన నీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ను విచారించేందుకు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీలోని సీఎం ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. దీంతో 13 గంటలపాటు ఆయన నివాసంలోనే ఉండి ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సీఎంకు చెందిన రెండు బీఎండబ్ల్యూ కార్లు, 32 లక్షల నగదుతోపాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోరెన్ జనవరి 27 రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరారని, త్వరలోనే తిరిగి వస్తారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31వ తేదీలలో విచారణకు హాజరవ్వాలని ఈడీ సోరెన్కు సమన్లు జారీ చేసింది. మరోవైపు జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని జార్ఖండ్ సీఎం ఇప్పటికే ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయనను విచారించే అవకాశాలున్నాయి. ఇక తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ పేర్కొన్నారు. -
జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం (జనవరి 29) ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే మకాంవేసి, సీఎం నివాసంలో సోదాలు జరిపింది. దర్యాప్తు సంస్థ జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారు (హర్యానా నంబర్తో నమోదైంది)ను స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఈడీ చర్యను హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది. సోమవారం నాడు ఢిల్లీ పోలీసులతో కలిసి ఈడీ బృందం దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసమైన శాంతి నికేతన్ భవన్కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు ఈడీ బృందం అక్కడే ఉంది. సోరెన్ నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు భయపడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ యూనిట్ పేర్కొంది. భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించారు. -
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
బీహార్లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్లో మొదలైంది?
బీహార్లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీహార్లో గత 15 రోజులుగా కొనసాగిన పొలిటికల్ గేమ్కు తెరపడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బీహార్లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ నుండి కూడా ఇటువంటి వార్తలు వెలువడుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ జనవరి 31న మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇందుకోసం హేమంత్ సోరెన్ తన నివాసం లేదా ఈడీ కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఇది రాజకీయవర్గాల్లో పలు చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి జనవరి 20న సీఎం హేమంత్ సోరెన్ను ఏడున్నర గంటల పాటు విచారించిన ఈడీ.. తదుపరి విచారణకు జనవరి 27 నుంచి 31 మధ్య ఏదో ఒక రోజు చెప్పాలంటూ హేమంత్ సోరెన్కు మరోసారి సమన్లు జారీ చేసింది. వీటిని అందుకున్న సీఎం హేమంత్ సోరెన్ నుంచి ఈడీకి సమాధానం అందిందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈడీ జనవరి 29 లేదా 31వ తేదీల్లో విచారణకు ఒక తేదీని కోరుతూ ప్రత్యుత్తర లేఖ రాసింది. దీనికి స్పందించకపోతే అధికారులే సీఎం ఇంటికి వస్తారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ అందించిన లేఖలోని స్పష్టతను గమనిస్తే, జార్ఖండ్లో అతి త్వరలో రాజకీయ పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
సోరెన్కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
సోరెన్పై ఈడీ ప్రశ్నల వర్షం
రాంచీ: జార్ఖండ్లో భూకుంభకోణం, సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకావాలని ఏడు సార్లు సమన్లు ఇచ్చినా బేఖాతరు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చివరకు ఆయన ఇంటికే వచ్చి విచారించారు. ఈడీ అధికారులు వస్తున్నారన్న వార్తతో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు రావడంతో ఈడీ అధికారుల రక్షణ కోసం భద్రతాబలగాలు భారీ ఎత్తున మొహరించారు. దీంతో ఇంటి పరిసరాలు ఖాకీవనాన్ని తలపించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు సోరెన్పై సుదీర్ఘంగా ఏడు గంటలకుపైగా ప్రశ్నలు సంధించారు. కేసుపై పలు వివరాలు అడిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి జోబా మాంఝీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, రాజ్యసభ ఎంపీ మహువా మాజీ, కొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉన్నారు. రాష్ట్ర డీజీపీ అజయ్సింగ్ సైతం అక్కడే ఉన్నారు. జేఎంఎం గిరిజన కార్యకర్తలు కొందరు విల్లు, బాణాలతో సోరెన్ ఇంటిపరిసరాల్లో గుమిగూడి ఈడీ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈడీ వ్యతిరేక ర్యాలీలు జరక్కుండా రాంచీ సబ్ డివిజనల్ మేజి్రస్టేట్ ఉత్కర్‡్ష ఇంటి పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈడీ చర్యపై జేఎంఎం కార్యకర్తలు, గిరిజన సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు. ఇప్పటికే 14 అరెస్ట్లు భూ హక్కులను మాఫియా అక్రమంగా చేతులు మార్చి కోట్లు కొల్లగొట్టారని ఈడీ గతంలో ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావీ రంజన్ సహా 14 మందిని ఈడీ అరెస్ట్చేసింది. ఈ కేసులో బాధితుడిగా నాటకం ఆడుతూ సీఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంను కేసులోకి లాగి ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ సర్కార్ కుట్ర పన్నిందని జేఎంఎం ఆరోపిస్తోంది. నా పై కుట్ర: సోరెన్ ఏడు గంటలపాటు ఈడీ విచారణ ముగిశాక ఇంటిబయట కార్యకర్తలనుద్దేశించి సోరెన్ మాట్లాడారు. ‘‘ నా పై కుట్ర పన్నారు. కుట్రను త్వరలోనే బయటపెడతా. మనం ఎవరికీ భయపడేది లేదు. మీ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేందుకు బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. నాకు మద్దతుగా ఇక్కడికొచి్చన మీకందరికీ ధన్యవాదాలు’’ అని సోరెన్ ప్రసంగించారు. -
ఈడీ దాడులపై జార్ఖండ్ సర్కార్ కీలక నిర్ణయం
రాంచీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్కు కేంద్రంకు మధ్య ప్రతిష్టంభణ కొనసాగుతోంది. ఈడీ ఏడుసార్లు పంపిన సమన్లను పక్కకు పెట్టిన సోరేన్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన సమన్లను పట్టించుకోవద్దని రాష్ట్ర అన్ని శాఖలకు తెలిపారు. ఎలాంటి ఫైల్స్, సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వకూడదని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమాచారాన్నైనా నేరుగా రాష్ట్ర కేబినెట్ సెక్రటేరియట్కు అందించాలని స్పష్టం చేశారు. కేంద్ర సంస్థల నోటీసులకు అధికారులు నేరుగా స్పందించవద్దని బదులుగా కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వందనా దాడెల్ అన్ని శాఖలకు రహస్యంగా పంపిన లేఖలో పేర్కొన్నారని సమాచారం. ఎలాంటి సమాచారాన్నైనా ఉన్నత అధికారులకు తెలియజేయకుండా రాష్ట్ర ఉద్యోగులు నేరుగా ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సరైన విధానం కాదని లేఖలో దాడెల్ తెలిపారు. ఈడీకి రాష్ట్ర అధికారులు అసంపూర్ణ సమాచారాన్ని అందజేయకుండా ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చర్య కేంద్ర సంస్థలకు సహకరించకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్కు వరుసగా ఏడుసార్లు సమన్లు పంపింది. కానీ వివిధ కారణాలతో ఆయన ఈడీ ముందు హాజరుకాలేదు. జార్ఖండ్లో కాంగ్రెస్తో కలిసి జార్ఖండ్ ముక్తీ మోర్చా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఈ ప్రభుత్వంలో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా కూటమిలో భాగంగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సోరెన్ సర్కార్ విమర్శిస్తోంది. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్ -
Jharkhand: సీఎం సోరేన్కు ఈడీ లాస్ట్ చాన్స్.. ఆయన సోదరి ఫైర్
భువనేశ్వర్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్కు వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) నోటీసులు పంపడంపై ఆయన సోదరి అంజలి సోరేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ఎస్టీ అయినందునే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఈ విషయమై భువనేశ్వర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసి ట్రైబల్స్ను బాగు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు మాట్లాడుతోంది. మరో వైపు ట్రైబల్స్ అయిన మమ్మల్ని వేధిస్తున్నారు. నా సోదరుని ప్రభుత్వం ట్రైబల్ ప్రభుత్వం. జార్ఖండ్లో ఈ ప్రభుత్వం కొనసాగితే ట్రైబల్ ఓట్లు తమకు రావని బీజేపీ భయపడుతున్నట్లుంది. ఇందుకే నా సోదురుడికి చెడ్డపేరు వచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. ట్రైబల్ వర్గానికి చెందిన ఆయనను వేధిస్తున్నారు’అని అంజలి అన్నారు. మీ సోదరుడికి ఈడీ సమన్లు ఎందుకు పంపిదో తెలుసా అని మీడియా అడగ్గా ఆ విషయం తనకు తెలియదని, కేంద్రం మాత్రం తన సోదరుడిని వేధిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈడీ హేమంత్ సోరేన్ను అరెస్ట్ చేస్తే సోరేన్ భార్య సీఎం అవుతారా అని ప్రశ్నించగా అది పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని సమాధానమిచ్చారు. కాగా, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ సోరేన్కు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపింది. అయితే ఆరుసార్లు ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ తాజాగా ఆయనకు ఏడోసారి సమన్లు పంపింది. ఇది మీకు చివరి అవకాశం. మీ స్టేట్మెంట్ రికార్డు చేయాలి. ప్లేస్, టైమ్ మీరే చెప్పండి. మీరు రాకపోవడం వల్ల విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి’ అని నోటీసుల్లో ఈడీ సోరేన్కు తెలపడం గమనార్హం. ఇదీచదవండి..ఇండియన్ ఎయిర్ ఫోర్సు సరికొత్త రికార్డు -
ఈడీ ఎఫెక్ట్.. జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం!
ఢిల్లీ: జార్ఖండ్, రాజస్థాన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు మరోసారి రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జార్ఖండ్లో అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 చోట్ల తనిఖీలు చేస్తోంది. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మీడియా అడ్వజర్ అభిషేక్ ప్రసాద్కు సంబంధించిన నివాసం, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే, హజారీబాగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక, రామ్ నివాస్కు రాజస్థాన్లో కూడా ఇళ్లు ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం కూడా నోటీసులు అందించింది. వాటిని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మరోసారి సోరెన్కు అవకాశమిచ్చింది. #WATCH | Ranchi: ED raids are underway at Jharkhand CM Hemant Soren's press advisor's residence Abhishek Prasad alias Pintu in connection with an illegal mining case. Searches are being carried out at 12 locations including Abhishek Prasad's residence and the residence of… pic.twitter.com/fRuJWQkxw8 — ANI (@ANI) January 3, 2024 మరోవైపు.. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి బుధవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. Ranchi- BJP leader Nishikant Dubey claimed that Jharkhand CM Hemat Soren's wife Kalpana Soren will take over as the Chief Minister of the state. Dubey's statement came after a Jharkhand Mukti Morcha (JMM) MLA resigned from the Assembly, citing personal reasons. pic.twitter.com/iZLPTf3MRZ — 🚩वसुधैव कुटुंबकम् 🚩 (@vasudhaiva1978) January 1, 2024 ఈడీ నోటీసుల నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాలకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈడీ కేసు వెంటాడుతున్న నేపథ్యంలో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారని, ఆ బాధ్యతలను సతీమణి కల్పనకు అప్పగిస్తారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గండేయ్ స్థానం నుంచి ఆమెకు అవకాశం కల్పించేలా.. అహ్మద్తో రాజీనామా చేయించారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేత, ఎంపీ నిషికాంత్ దూబే ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం సొరేన్ స్పందించారు. దీన్ని ఖండించిన సోరెన్.. తన సతీమణి పోటీ చేసే అవకాశం పూర్తిగా అబద్దమేనని కొట్టిపారేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వస్తున్న వార్తలను నిజం కాదన్నారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
జార్ఖండ్లో 50 ఏళ్లకే పెన్షన్
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు. గిరిజనులు, -
కేంద్ర ఆర్డినెన్స్పై ఆప్కు జేఎంఎం మద్దతు
రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్కు మద్దతిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు. కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో ఆప్కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్ చెప్పారు. ఆర్డినెన్స్పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. -
సోరెన్తో నితీశ్ భేటీ
రాంచీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్తో భేటీ తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం రాంచీకి చేరుకున్న నితీశ్.. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్తోపాటు సోరెన్తో చర్చలు జరిపారు. ‘ బీజేపీని ఓడించడం, విపక్షాలను ఏకతాటి మీదకు తేవడంపైనే చర్చించాం. ఈ సంప్రదింపుల ఫలితం వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరిత్రను తిరగరాయాలన్న బీజేపీ సర్కార్ కుతంత్రాలను మేం తిప్పికొడతాం. హిందూ–ముస్లిం ఐక్యతను మళ్లీ పునఃప్రతిష్టిస్తాం ’ అని నితీశ్ మీడియాతో అన్నారు. ఎన్డీఏయేతర పార్టీలను ఏకంచేసే క్రమంలో విపక్ష పార్టీల అగ్రనేతలతో వరసగా భేటీలను నితీశ్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీశ్ అక్కడ బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్తో గంటకుపైగా మంతనాలు జరిపారు. ఇటీవల ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్లనూ కలిశారు. ఏప్రిల్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనూ నితీశ్ కలిశారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతోనూ భేటీ అయ్యారు. -
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత..
రాంచీ: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో దా కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'తీరని నష్టం జరిగింది. మన టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు. జార్ఖండ్ గొప్ప ఉద్యమకారుడు, నిరంతరం శ్రమించే వ్యక్తి, విశేష ప్రజాధరణ గల నాయకుడ్ని మనం కోల్పోయాం. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఈ విపత్కర పరిస్థితిలో కుటుంబసభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.' అని సీఎం ట్వీట్ చేశారు. अपूरणीय क्षति! हमारे टाइगर जगरनाथ दा नहीं रहे! आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया। परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की… — Hemant Soren (@HemantSorenJMM) April 6, 2023 అయితే జగర్నాథ్కు ఇటీవలే చెన్నై ఆస్పత్రిలో ఊపరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. 2020లో కరోనా బారిన పడిన అనంతరం కూడా ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. గతనెల అనారోగ్యం బారినపడటంతో రాంచీ నుంచి హెలికాప్టర్ ద్వారా చెన్నై ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. చదవండి: దిగ్భ్రాంతికి లోనయ్యా... చాలా బాధగా ఉంది: ప్రకాష్ రాజ్ -
దారుణం.. నాలుగు రోజుల పసికందును తొక్కిన కానిస్టేబుల్..!
రాంచీ: జార్ఖండ్ గిరిడీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ తొక్కాడని ఓ కుటుంబం ఆరోపించింది. దీంతో నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చిన్నారి తాత భూషణ్ పాండే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు. అయితే భూషణ్ పాండే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగుతున్నాడు. ఈక్రమంలోనే అతడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఉదయం 3:20 గంటల సమయంలో లోనికి ప్రవేశించారు. వీరిని చూసి భూషణ్ పాండేతో పాటు ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు. కానీ భూషణ్ కోసం వెతికే క్రమంలో ఓ గదిలో నిద్రిస్తున్న నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ పారపాటున తొక్కాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెళ్లిపోయాక లోపలికి వెళ్లి చూస్తే బిడ్డ చనిపోయి ఉందని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే భూషణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని పేరొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
ఈడీ ముందుకు హేమంత్ సోరెన్
రాంచీ: అక్రమ గనుల తవ్వకం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. రాంచీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ కేసులో ప్రశ్నించేందుకు గతంలో ఆయనకు పలుమార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేయగా వ్యక్తిగత, అధికారిక కారణాలు చూపుతూ ఇన్నాళ్లూ గైర్హాజరైన విషయం విదితమే. గురువారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సోరెన్.. ఈడీకి ఒక లేఖ రాశారు. నిజాలేవిటో నిర్ధారించుకోకుండా ‘సంచలన ప్రకటనలు’ చేయొద్దని లేఖలో సూచించారు. ‘ మొత్తం జార్ఖండ్లో గత రెండేళ్లలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరేమో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో అవినీతి చేయాలంటే ఒక్క సాహెబ్గంజ్లోనే 8 కోట్ల మెట్రిక్ టన్నుల రాళ్లను తవ్వాలి. చట్టబద్ధంగా తవ్విన దానికంటే ఇది ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ. ఇది సాధ్యమా?’ అంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. ‘జేఎంఎం పార్టీ నుంచి నేను గెంటేసిన రవి కేజ్రీవాల్ బీజేపీ తరఫున మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఈ కేసును ఎలాంటి రహస్య అజెండా లేకుండా దర్యాప్తుచేయండి’ అని ఈడీని కోరారు. తనపై బీజేపీ కుట్ర పన్నుతోందని అంతకుముందు మీడియాతో అన్నారు. దర్యాప్తును ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభావితం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. -
అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం
రాంచీ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సోరెన్ స్పందించారు. తనను ఎమ్మెల్యేగా తొలగించాలని గవర్నర్కు ఈసీ సిఫారసు చేసిందని, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గవర్నర్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సోరెన్ చెప్పారు. అలాగే బీజేపీ తనపై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని సోరెన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులపైనా ఇలాంటి కేసులనే కేంద్రం పెడుతుందని జోస్యం చెప్పారు. రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్న తనకు సమన్లు పంపిన తీరు, విచారణ జరగుతున్న విధానం చూస్తుంటే తాను ఏదో దేశం వీడి పారిపోతానేమో అన్నట్లుగా చేస్తున్నారని సోరెన్ మండిపడ్డారు. ఇప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే దేశం విడిచిపారిపోయారని, ఒక్క రాజకీయనాయకుడు కూడా అలా చేయలేదని వివరించారు. తాను రెండేళ్ల కాలంలో రూ.1000కోట్ల మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారని, కానీ ఆ వ్యవధిలో మైనింగ్లో మొత్తం రూ.750కోట్ల వ్యాపారమే జరిగిందని సోరెన్ వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్రంపై సెటైర్లు వేశారు. చదవండి: గుజరాత్ ఎన్నికల వేళ ఆప్ నేత ఓవరాక్షన్.. కేసు నమోదు! -
ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్
-
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్గా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్
రాంచీ: ‘నేను తప్పు చేసినట్లయితే, ఈ ప్రశ్నించటాలేంటి? నేరుగా వచ్చి అరెస్ట్ చేయండి.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. బొగ్గు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని వేధింపులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసినట్లు ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నాకు ఛత్తీస్గఢ్లో కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఈరోజు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నేను పెద్ద నేరం చేసినట్లు అయితే, రండి, నన్ను అరెస్ట్ చేయండి. ఈ ప్రశ్నించటాలేందుకు?. ఈడీ ఆఫీస్ వద్ద భద్రత పెంచారు. జార్ఖండ్ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?. అధికార బీజేపీని వ్యతరేకిస్తున్న వారి గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయటమే ఇది. ఈ కుట్రకు తగిన సమాధానం లభిస్తుంది.’అని పేర్కొన్నారు సీఎం హేమంత్ సోరెన్. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు బీజేపీ పేరు చెప్పకుండానే ట్విటర్ వేదికగా పరోక్ష విమర్శలు చేశారు సీఎం. ‘నన్ను వేధించేందుకు జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు కుట్ర ట్రైబల్స్, వెనకబడినవారు, మైనారిటీల హక్కులను కాలరాసేందుకే. నాకు రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్నంత వరకు వారి కుట్రల్లోనే ఏ ఒక్కటి ఫలించదు.’అని పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. #WATCH | I've been summoned by ED today when I already have a program in Chhattisgarh today. If I've committed a crime that big, come & arrest me. Why the questioning?... Security near ED office has increased. Why, are you scared of Jharkhandis?, says Jharkhand CM Hemant Soren pic.twitter.com/41cR92FCHM — ANI (@ANI) November 3, 2022 ఇదీ చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం -
జార్ఖండ్ సీఎం కు ఈడీ నోటీసులు..
-
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ నోటీసులు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాంచీలోని కార్యాలయం ముందు గురువారం(నవంబర్ 3) విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్కు సంబంధించి పంకజ్పై మార్చిలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం గత జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంకజ్ మిశ్రా, అతని వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.42 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంకజ్, ఇతరులపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. సోరెన్తో రాజకీయ పలుకుబడి కలిగిన పంకజ్ మిశ్రా తన సహచరుల ద్వారా సాహెబ్గంజ్, దాని పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. విచారణ సందర్భంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఈడీ 47 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 5.34 కోట్ల నగదు, రూ. 13.32 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లను సీజ్ చేసింది. చదవండి: చెన్నైలో వాన బీభత్సం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు -
రెండో ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్ వ్యాఖ్య
రాయ్పూర్: లాభదాయక పదవి కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ‘ నేనేమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవాడిని కాదు. ఈసీ సిఫార్సు తర్వాత తుది నిర్ణయంపై తేల్చుకునేందుకు రెండో ఆప్షన్కు వెళ్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా’ అని గవర్నర్ రమేశ్ స్పష్టంచేశారు. గనుల తవ్వకం లీజును సీఎం సోరెన్ తనకు తానే మంజూరుచేసుకున్నాడనే కేసు నమోదైన విషయం తెల్సిందే. దీంతో లాభదాయక పదవి కోణంలో సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడా ? కాదా? అనేది స్పష్టంచేస్తూ ఈసీ నుంచి గవర్నర్కు∙లేఖ వచ్చింది. అందులో ఏముందో తెలీదు. అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసిందని వార్తలొచ్చాయి. ‘నిపుణుల సలహా తర్వాత జార్ఖండ్లో అణుబాంబ్ పేలొచ్చు’ అని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
నా ఎమ్మెల్యే పదవిపై త్వరగా తేల్చండి: హేమంత్
రాంచీ: జార్ఖండ్లో గత మూడు వారాలుగా కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించాలని, తన ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర గవర్నర్ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలను కొనేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గనుల లీజుల వ్యవహారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం ఈ ఏడాది ఆగస్టు 25న తన అభిప్రాయాన్ని గవర్నర్కు పంపించింది. హేమంత్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంపై గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. (చదవండి: లిక్కర్ స్కామ్లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్) -
‘అండర్వేర్లు కొనుక్కునేందుకు ఢిల్లీ వెళ్లా’!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో ఊగిసలాట కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయ్. అందులో సోదరుడు బసంత్ వ్యవహరశైలి కూడా మరింత కాకరేపుతోంది. డుమ్కా ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నియోజకవర్గాల్లో జరుగుతున్న అఘయిత్యాలపై స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. డుమ్కా ప్రాంతంలో ఓ ప్రేమోన్మాది.. మైనర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపిన ఘటన, ఆ వెంటనే ఇద్దరు మైనర్ల హత్యాచార ఘటన చోటు చేసుకుంది. గత ఆరు నెలల్లో డుమ్కాలో మైనర్లపై దాడుల ఘటనలు ఏడుకు పైనే జరిగాయి. దీంతో జేఎంఎం పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. ఈ తరుణంలో.. శాంతి భద్రతలు పర్యవేక్షించకుండా బసంత్ సోరెన్ ఢిల్లీ పర్యటించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం బసంత్.. మైనర్ల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఇక్కడ ఇంత నేరాలు జరుగుతుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన.. ‘‘నా దగ్గరి అండర్వేర్లు అయిపోయాయి. అందుకే వాటిని కొనుక్కునేందుకు ఢిల్లీకి వెళ్లా. కొనుక్కుని వచ్చా’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారాయన. నిజంగానే అందుకే వెళ్లారా? అని మీడియా మరోసారి ప్రశ్నించగా.. ‘అవును..’ అంటూ సమాధానం ఇచ్చారాయ. వెటకారంగా ఆయన ఇచ్చిన సమాధానంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. #WATCH | Dumka: "I had run out of undergarments, so I went to Delhi to purchase them. I get them from there," says JMM MLA and Jharkhand CM Hemant Soren's brother, Basant Soren when asked about his visit to Delhi amid recent political unrest in the state. (07.09.2022) pic.twitter.com/GBiNWZaLzr — ANI (@ANI) September 8, 2022 శిబు సోరెన్ కొడుకు, పేదల.. గిరిజనుల నేత అయిన బసంత్ సోరెన్.. ఢిల్లీకి అండర్వేర్లు కొనుక్కునేందుకు వెళ్లాడంటూ వెటకారంగా స్పందించింది బీజేపీ. ఇక జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి తలెత్తగా.. బల నిరూపణలో నెగ్గారు జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు నిలకడగానే ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మాది మెయిన్ ఫ్రంట్ -
బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజారిటీకి 42 సీట్లు అవసరం. విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆ పార్టీ పని చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు. ముందు రోజు రాంచీకి వచ్చిన ఎమ్మెల్యేలు.. బలపరీక్ష నేపథ్యంలో అధికార యూపీఏకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్గఢ్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. ఆగస్ట్ 30 నుంచీ వీరు రాయ్పూర్లోని ఓ విలాసవంతమైన రిసార్టులో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే. చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
జార్ఖండ్ సీఎం రాజీనామాపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యతం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయానికి ముందే సోరెన్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి చెందిన నేతలు రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ను గురువారం సాయంత్రం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం హేమంత్ సోరెన్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చీఫ్ బంధు టిర్కే. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయట్లేదని స్పష్టం చేశారు. ‘ఆయన రాజీనామా చేయటం లేదు. గవర్నర్ న్యాయ సలహా కోసం వేచిచూస్తున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం వెలువరుస్తామని మాకు చెప్పారు. మీడియాకు సమాచారం లీకవటంపై గవర్నర్ను ప్రశ్నించాం. అయితే, సమాచారం బయటకి వస్తోంది తన కార్యాలయం నుంచి కాదని చెప్పారు.’ అని పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చీఫ్ బంధు టిర్కే. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని గత మంగళవారం 32మంది శాసనసభ్యులను ఛత్తీస్గఢ్కు తరలించారు. ఈ క్రమంలో.. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్కు తరలించటం ఏడాదిన్నరలో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. హరియాణా కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాయ్పుర్కు తరలించింది. 2021, ఏప్రిల్లో బీపీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సైతం ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది. ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్ను కలవనున్న అధికార కూటమి నేతలు -
రసవత్తరంగా మారిన జార్ఖండ్ రాజకీయం
-
జార్ఖండ్ సంక్షోభంలో కీలక పరిణామం.. గవర్నర్తో యూపీఏ నేతల భేటీ!
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్. సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది. అధికార కూటమి నేతలు గురువారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గవర్నర్కు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఫోన్ చేసినట్లు పేర్కొన్నాయి. గవర్నర్తో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి నేతల భేటీతో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు గత మంగళవారం తరలించింది. గవర్నర్ను కలవనున్న నేపథ్యంలో వారు రాంచీకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్ -
కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్
రాంచీ: జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు మంగళవారం తరలించింది. వీరంతా తొలుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసం నుంచి రెండు బస్సుల్లో రాంచీ ఎయిర్పోర్టుకు వచ్చారు. సోరెన్ వెంట వచ్చారు. సోరెన్ మినహా ఇతర ఎమ్మెల్యేలు చార్టర్ట్ విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రాంచీ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 5.30 గంటలకు రాయ్పూర్లోని వివేకానంద ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దగ్గర్లోని నవ రాయ్పూర్లోని మేఫెయిర్ రిసార్ట్కు చేర్చారు. ఎమ్మెల్యేలు మకాం వేసిన రిసార్ట్ చుట్టూ ఛత్తీస్గఢ్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81 కాగా, అధికార యూపీఏకు 49 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉందని యూపీఏ అనుమానిస్తోంది. యూపీఏలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్నాయి. జేఎంఎంకు 30, కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం సూచించినప్పటికీ గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్భవన్ మౌనం వహిస్తుండడంపై యూపీఏ ఎమ్మెల్యేల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఆస్కారం కల్పిస్తున్నారంటూ గవర్నర్ తీరును ఆక్షేపిస్తున్నారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ అనిశ్చితిని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం హేమంత్ సోరెన్ నివాసంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. జార్ఖండ్ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 1న సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. -
హేమంత్ కాకపోతే మరో ‘సోరెన్’.. సీఎం పదవిలోకి మరొకరికి నో ఛాన్స్?
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు? అనే చర్చ మొదలైంది. అయితే.. మరో సోరెన్ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోరెన్ కుటుంబం నుంచి సీఎం పీఠం మరొకరికి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టే అర్హత కలిగిన మరో సోరెన్ ఎవరు? ఓసారి పరిశీలిద్దాం. సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేస్తే.. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికనే అంశం కీలకంగా మారింది. సోరెన్స్ కుటుంబం సైతం ఇతర ప్రాంతీయ పార్టీలకు అతీతం కాదు. రాజకీయ సంక్షోభం తెలత్తినప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరు ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ నేపథ్యం.. బిహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు కోసం జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు శిబు సోరెన్. ఆయన రెండో కుమారుడే హేమంత్ సోరెన్. సీనియర్ సోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎంకు రాజకీయ గురువుగా ముందుండి దారిచూపుతున్నారు. అయితే.. జేఎంఎం స్థాపించిన తర్వాత శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ ఆయన వారసుడిగా ఎదిగారు. మరోవైపు.. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న హేమంత్ సోరెన్ దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే.. 2009లో దుర్గా సోరెన్ బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు. ఆయన తర్వాత శిబు సోరెన్ వారసురాలిగా కుమార్తె అంజలీ పేరు తెరపైకి వచ్చినా ఆమె అంతగా ఆసక్తి చూపలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. దీంతో హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ఆయనే.. పార్టీని చేపట్టారు. 38 ఏళ్లకే 2013లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ, ఏడాది కాలంలోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చారు సోరెన్. తాజాగా వచ్చిన ఆరోపణలతో మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సోరెన్ కుటుంబంలోని కొన్ని పేర్లు పరిశీలిద్దాం. ఇదీ చదవండి: రిసార్ట్కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్ ► శిబు సోరెన్: 78 ఏళ్ల శిబు సోరెన్.. ప్రస్తుతం జేఎంఎం అధ్యక్షుడిగా, ఎంపీగా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టుల్లో చాలా కేసులు ఉండటం సహా.. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం వల్ల సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. ► రూపి సోరెన్: పార్టీ అధినేత శిబు సోరెన్ భార్య రూపి సోరెన్. ఆమెకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేనప్పటికీ ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తితే ఆమె పేరు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. ► కల్పనా సోరెన్: హేమంత్ సోరెన్ తన భార్య కల్పనా సోరెన్ను ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనిశ్చితి నెలకొంటే ఆమెను తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, ఆమె ఒడిశాకు చెందిన వ్యక్తి కావటం అడ్డంకిగా మారనుంది. ► సీతా సోరెన్: దుర్గా సోరెన్ మరణం తర్వాత శిబు సోరెన్.. తన కోడలు సీతా సోరెన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, ఆమె సైతం ఒడిశా నుంచి రావటం అడ్డంకిగానే మారనుంది. ► బసంత్ సోరెన్: శిబు సోరెన్ చిన్న కుమారుడు, హేమంత్ సోరెన్ తమ్ముడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఆయన కూడా హేమంత్ లాగే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వద్ద పెండింగ్లో ఉంది. అనర్హత వేటు ఎదుర్కునే అవకాశం ఉంది. ► అంజలీ సోరెన్: శిబు సోరెన్ కుమార్తె అంజలీ సోరెన్ వివాహం తర్వాత ఒడిశా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. దీంతో సీఎం పదవి రేసు నుంచి ఆమె లేనట్లే. మరోవైపు.. జేఎంఎం, హేమంత్ సోరెన్.. కుటుంబేతర వ్యక్తివైపు చూస్తే.. అప్పుడు పార్టీ సీనియర్ లీడర్, సెరైకేలా ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్ ముందంజలో ఉంటారు. ఇంటిపేరు ఒకే విధంగా ఉండటమే కాకుండా.. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్ -
రిసార్ట్కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్
రాంచీ: జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఈలోగా రిసార్టు రాజకీయాలకు తెర లేచింది. ఎమ్మెల్యేలు గోడ దూకుతారేమోనన్న భయంతో వారిని సోరెన్ క్యాంపుకు తరలించారు. శనివారం ఉదయం పాలక యూపీఏ భాగస్వామ్య పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సీఎం నివాసంలో మూడో దఫా సుదీర్ఘ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా నేరుగా లగేజీలతో పాటుగా భేటీకి రావడం విశేషం. ఆ వెంటనే వారందరినీ మూడు బస్సుల్లో గుర్తు తెలియని చోటుకి తరలించారు. వారిని పశ్చిమబెంగాల్కో, ఛత్తీస్గఢ్కో తీసుకెళ్లి ఉంటారంటూ వార్తలొచ్చాయి. కానీ ఎమ్మెల్యేలంతా కుంతీ జిల్లాలోని మూమెంట్స్ రిసార్ట్కు పిక్నిక్కు వెళ్తున్నారంటూ మంత్రులు ఆలంఘీర్ ఆలం, బన్నా గుప్తా చెప్పారు. సాయంత్రానికల్లా వారంతా రాంచీ తిరిగొచ్చినట్టు సమాచారం. సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫార్సుపై గవర్నర్ రమేశ్ బైస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్లో ఎవరికీ లేదు -
జార్ఖండ్ సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు
-
జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు
రాంఛీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్కు సంబంధాలున్నట్లు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్కు సూచించింది.ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. చదవండి: ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయింది: జైరాం రమేశ్ -
చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్
రాంచీ: అక్రమ మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తూ తనకు తానే మైనింగ్ లీజులను కేటాయించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్ రమేష్ బియాస్కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో పంపిందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తుది నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం రాంచీకి చేరుకున్న గవర్నర్ రమేష్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో రెండు రోజులు ఉండి వచ్చానని, రాజ్భవన్కు వెళ్లి ఆ లేఖ చదివే వరకు తాను ఏమీ చెప్పలేదన్నారు. గవర్నర్ నుంచి నిర్ణయం రాకుండానే ప్రభుత్వంపై బీజేపీ దాడికి దిగింది. జేఎంఎం నైతికంగా అధికారంలో కొనసాగలేదని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలే మీడియాలో చూశానే తప్ప అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న డిమాండ్లను జేఎంఎం నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ అన్నారు. సోరెన్పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. 2019లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. గనుల శాఖ వ్యవహారాలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సోరెన్ స్టోన్ చిప్ మైనింగ్ లీజుని తన కోసం తానే కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరిలో బీజేపీ నేత రఘుబర్దాస్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 9ఏని హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని, ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల సీఈసీ దర్యాప్తు పూర్తి చేసింది. అసలేమిటీ కేసు? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నేళ్ల క్రితం రాంచీలో అంగారా బ్లాక్లో మైనింగ్ లీజ్ దక్కించుకున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 18న అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణం... రెండు శాఖలూ హేమంత్ పరిధిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ అనుమతుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హేమంత్ తన భార్య కల్పనకు ఓ పారిశ్రామిక కారిడార్లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహాదారు ప్రసాద్ కూడా అక్రమంగా మైనింగ్ లీజులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పొరపాటు జరిగింది’ అని అడ్వొకేట్ జనరల్ స్వయంగా అంగీకరించారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్కు ఫిర్యాదు చేశారు. దీంతో హేమంత్కు కేటాయించిన మైనింగ్ లీజ్ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనర్హత వేటు వేస్తే? ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక జేఎంఎంలో వివాదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేసులో హేమంత్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ముందంజలో నిలువనున్నారు. కానీ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం లేవు. ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమంటూ కొందరు మంత్రులు, సీనియర్ జేఎంఎం నేతలు అప్పుడే గళం విప్పుతుండటం గమనార్హం. మరోవైపు హేమంత్ తన భార్య కల్పనను సీఎంగా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు బిగ్ షాక్
-
జార్ఖండ్ సీఎంకు పదవి గండం.. హేమంత్ సోరేన్కు బిగ్ షాక్!
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ కారణంగా పొలిటికల్గా సీఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆయన సీఎం పదవికే గండం ఏర్పడింది. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్పై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది. వివరాల ప్రకారం.. జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. దీనిపై గవర్నర్ రమేష్ బైస్కు.. ఈసీ అభిప్రాయం కోరారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టు సమాచారం. కాగా, ఈసీ నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్పై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది. #Jharkhand CM #HemantSoren's Assembly membership cancelled, Governor to pronounce opinion shortly #miningleasecasehttps://t.co/PFbUd9KtAc — India TV (@indiatvnews) August 25, 2022 -
జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు
రాంఛీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మైనింగ్ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్ గానీ స్పందించలేదు. చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు.. -
మరో రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’.. కాంగ్రెస్లో గుబులు
మహారాష్ట్రలో మహా అఘాడీ సంకీర్ణ సర్కారును కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేసినట్టు కనబడుతోంది. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది. కాంగ్రెస్ అలర్ట్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో సోరేన్ సర్కారుకు ఎసరు పెట్టుందుకు కమలనాథులు సిద్ధమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోరేన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తికాలం కొనసాగుతుందని ఏఐసీసీ రాష్ట్ర బాధ్యుడు అవినాష్ పాండే భరోసాయిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వాములైన వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, సరైన సమయంలో కుట్రదారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఫిరాయింపుదారులకు వార్నింగ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నకాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు.. సోరేన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠినవైఖరి అవలంభించాలని నిర్ణయించింది. అందుకే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటు చేసి ఫిరాయింపుదారులకు గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాదు జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం 18 జిల్లాల్లో ఆందోళనలు కూడా చేపట్టింది. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో శాసనసభ్యుడు బెంగాల్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది రెండోసారి.. నాకేం తెలియదు హేమంత్ సోరేన్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది రెండోసారని అవినాష్ పాండే తెలిపారు. ప్రస్తుత కుట్ర వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు. సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను ప్రయత్నించడం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 22 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగినందున ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, సీనియర్ నేతలు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనపై కాంగ్రెస్ ఎందుకు కేసు పెట్టిందో తెలియదన్నారు. హిమంత ప్రోద్బలంతోనే.. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హిమంత బిశ్వ శర్మ ప్రోద్బలంతో తనకు 10 కోట్ల రూపాయలు, కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఆశచూపారని ఆరోపిస్తూ బెర్మో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జయమంగళ్.. రాంచిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కారులో డబ్బు పట్టుబడిన తర్వాతే ఎందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నకు జయమంగళ్ వద్ద సమాధానం లేదు. మరోవైపు సీఎం సోరేన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికార పక్షంలో గుబులు మొదలైంది. (క్లిక్: రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్) -
ఆపరేషన్ వికర్ష్.. బీజేపీకి భారీ షాక్?
వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం బీజేపీకే భారీ షాక్ తప్పేలా కనిపించడం లేదు. రాంచీ: జార్ఖండ్లో అధికార పార్టీ తాజా ప్రకటన బీజేపీలో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో ‘టచ్’లో ఉన్నారంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా అనూహ్య ప్రకటన చేసింది. యూపీఏ మిత్రపక్షం అయినప్పటికీ.. జేఎంఎం మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే మద్ధతు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాంటిది.. సుమారు పదహారు మంది బీజేపీ ఎమ్మెల్యేలు జేఎంఎంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ ఆకర్ష్.. ఇక్కడ వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్లు(16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు) తమ పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్లంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. అవసరం అయితే బీజేపీ నుంచి చీలిపోయి.. ఒక గ్రూపుగా ఏర్పడి జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని సుప్రియో పేర్కొన్నారు. ప్రస్తుతం జేఎంఎం ప్రభుత్వ పాలన స్థిరంగానే కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెల్చుకుంది. అలాగే బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. యూపీఏ కూటమితోనే జేఎంఎం ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. అయితే.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్పై అక్రమ మైనింగ్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో జేఎంఎం.. బీజేపీ నుంచే తమవైపు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే జేఎంఎం ప్రకటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. అవినీతిలో కూరుకుపోయిన జేఎంఎం.. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసని, ప్రజావ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జేఎంఎంతో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు తప్పవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ ప్రకటించారు. -
presidential election 2022: జార్ఖండ్లోనూ మహా సీనే...!
మహారాష్ట్ర తరహాలో జార్ఖండ్లో కూడా ఆపరేషన్ కమలానికి రంగం సిద్ధమవుతోందా? జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లుతున్నాయా? రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ జై కొట్టడంతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది... జార్ఖండ్ గవర్నర్గా 2015–2021 మధ్య పని చేసిన ద్రౌపది ముర్ముకు అదే రాష్ట్రానికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు హేమంత్ సోరెన్ కూడా నిన్నామొన్నటిదాకా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెంటే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 17 విపక్షాల ఉమ్మడి భేటీలో సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది ఆయన తాజాగా ప్లేటు ఫిరాయించారు. ముగ్గురు జేఎంఎం ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేయాలని ఆదేశించారు. దాంతో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయా అన్న చర్చకు తెర లేచింది. సిన్హా జార్ఖండ్కు చెందినవారే అయినా ముర్ము వైపే హేమంత్ మొగ్గు చూపడం వెనుక బీజేపీ వ్యూహం దాగుందంటున్నారు. ముర్ము సంథాల్ తెగకు చెందిన గిరిజన మహిళ. హేమంత్ కూడా అదే తెగకు చెందినవారు. తాను జార్ఖండ్ మట్టి బిడ్డనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే జేఎంఎం ముర్ముకు ఓటేయనుందని పార్టీలో ఓ వర్గం చెబుతున్నా, హేమంత్ నిర్ణయంతో రాష్ట్రంలో పాలక సంకీర్ణం బీటలు వారుతుందనే చర్చ ఊపందుకుంది. వెంటాడుతున్న మైనింగ్ కేసు హేమంత్ను మైనింగ్ లీజ్ కుంభకోణం కేసు వెంటాడుతోంది. ఒక గనిని తనకు తానే కేటాయించుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల ఢిల్లీలో ఈసీ విచారణకు హాజరైన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హేమంత్ కలుసుకున్నారు. కేసు నుంచి బయట పడటానికే షాతో భేటీ అయ్యారని ప్రచారమూ జరిగింది. మనీ ల్యాండరింగ్ కేసుల్లో హేమంత్ సహాయకులపై ఈడీ దాడులు, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన ఐఏఎస్ పూజా సింఘాల్ అరెస్ట్ వంటివి కూడా సీఎం ఇబ్బందుల్లోకి నెట్టాయి. జేఎంఎంకు దూరంగా కాంగ్రెస్ తాజా పరిణామాల్లో మరో రాష్ట్రం తమ చేజారుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్లో నెలకొంది. నిజానికి జేఎంఎం బీజేపీతో చేతులు కలుపుతుందనే సందేహాలు ఆ పార్టీని కొద్ది రోజులుగా వేధిస్తున్నాయి. మేలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ ఒక సీటు డిమాండ్ చేయగా హేమంత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హేమంత్ సంకీర్ణ ధర్మం పాటించడం లేదంటూ అప్పటికే అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్, తమ నాయకులందరినీ సీఎంకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్టు స్థానిక మీడియా కథనాలు రాసింది. బీజేపీకి ఒరిగేదేమిటి? 2019లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులెవరూ బీజేపీకి మద్దతివ్వలేదు. గిరిజన ప్రాబల్యమున్న 28 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ఏకంగా 25 నెగ్గింది. బీజేపీ రెండింటికే పరిమితమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎంకు 30, కాంగ్రెస్కు 16, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎంను చేరదీసి ప్రభుత్వానికి మద్దతిస్తే ‘కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు 2024 ఎన్నికల్లో జేఎంఎంతో కలిసి రాష్ట్రంలో గిరిజన ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాథుల వ్యూహమంటున్నారు. మోదీపై ప్రశంసలు బీజేపీకి దగ్గరవాలని ప్రయత్నిస్తున్న హేమంత్ ఇటీవల ప్రధాని మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జార్ఖండ్లో దేవగఢ్ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి మోదీ జరిపిన రాష్ట్ర పర్యటనకు హేమంత్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూశారు. పైగా ఆ కార్యక్రమంలో మోదీ సమర్థతను బహిరంగంగానే ప్రశంసించారు. ‘‘కేంద్రం నుంచి మాకు సహకారముంటే వచ్చే ఐదేళ్లలో జార్ఖండ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెడతాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారముంటేనే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది’’ అన్నారు. ఆయన కూటమి మార్చేస్తారన్న ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. మోదీతో క్లోజ్గా సీఎం.. షాక్లో కాంగ్రెస్!
న్యూఢిల్లీ: జార్ఖండ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్లోని దేవ్ఘర్లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. ముర్ముకు ఘన స్వాగతం రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. జార్ఖండ్లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు. చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు -
పాత పెన్షన్ అమలు కోరుతా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తన తండ్రి శిబూ సోరెన్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసే అంశంపై మాట్లాడుతానని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. రాంచీలో సోమవారం జరిగిన ఓ బహిరంగసభలో ఆయన పాల్గొని ఆగస్ట్ 15 నాటికి ఆ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమలుతో దేశ వ్యాప్తంగా 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు సామాజిక భద్రతను కోల్పోయాయని స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన సీపీఎస్ ఉద్యమం నేడు 26 రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొన్నారు. అనంతపురంలో జూలై 17న వాక్ ఫర్ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సభలో తెలంగాణ సీపీఎస్ మూవ్మెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్, ఏపీ నుంచి రామాంజనేయులు పాల్గొన్నారు. -
హింసాత్మకంగా మారిన నిరసనలు.. రాజధానిలో కర్ఫ్యూ విధింపు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్లో నమాజ్ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. #WATCH | Jharkhand: Protest over the controversial remarks by suspended BJP leader Nupur Sharma turned violent in Ranchi. Vehicles were torched and vandalised and stone-pelting occurred. Injuries reported. pic.twitter.com/Z5FIndjZzf — ANI (@ANI) June 10, 2022 #WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF — ANI (@ANI) June 10, 2022 ఇది కూడా చదవండి: టెన్షన్.. టెన్షన్.. పాతబస్తీలో మోహరించిన పోలీసులు.. వీడియో -
అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు.. రంగంలోకి దిగిన సీఎం
దేశంలో మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారి సీఎం వరకు వెళ్లింది. దీంతో యువకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో స్కూల్ యూనిఫామ్లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొడుతూ, కాళ్లతో తంతుంటే.. అతని స్నేహితులు వీడియోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిరిజన బాలికపై దాడి జరిగిన వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో సీఎం హేమంత్ సోరేన్కు చేరింది. ఈ వీడియో ద్వారా స్కూల్ డ్రెస్ ఆధారంగా ఆ అమ్మాయి పాకూర్లోని సెయింట్ స్టానిస్లాస్ హెచ్ఎస్ హతిమారా పాఠశాలలో చదువుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో దాడి చేసిన యువకుడ్ని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పాకుర్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఎస్పీని సీఎం సోరెన్ ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడిన యువకుడు పాకుర్ జిల్లాలోని రోలమారా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. .@pakurpolice कृपया उक्त मामले की जांच कर आरोपियों पर कार्यवाई करते हुए सूचित करें।@dcpakur @JharkhandPolice https://t.co/UO6W841jqB — Hemant Soren (@HemantSorenJMM) May 22, 2022 ఇది కూడా చదవండి: ప్రేమికుల సజీవ దహనం -
ప్రాంతీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం రాత్రి ప్రగతిభవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలు, వర్తమాన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రాష్ట్రాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నాలు, మత ఘర్షణలతో పెట్టుబడుల రాకపై పడే దుష్ప్రభావాలు, విపక్షాలపై కక్ష సాధింపు కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల దుర్వినియోగం, గవర్నర్లు సృష్టిస్తున్న ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. మూడు రోజులు ఇక్కడే... తల్లి వైద్యం కోసం గురువారం రాష్ట్రానికి చేరుకున్న హేమంత్ సోరెన్ మూడు రోజులపాటు హైదరాబాద్లో ఉండనున్నారు. రాష్ట్ర అతిథిగా ఆయనకు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి శనివారం తిరిగి రానున్నారు. శనివారం రాత్రి ఇక్కడే హోటల్లోనే బస చేస్తారు. ఆదివారం సోరెన్ రాంచీకి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. -
ఝార్ఖండ్ సీఎం హేమంత్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిలకు ఆనంద్ మహీంద్రా సలహా.. అదేంటంటే?
Anand Mahindra: సోషల్ మీడియా వేదికగా వింతలు విశేషాలను పంచుకునే ఆనంద్ మహీంద్రా ఈసారి మరో కొత్త విషయంతో మన ముందుకు వచ్చారు. ఆ ప్రదేశం విశేషాలను చెబుతూనే తనలోని వ్యాపారిని తెర మీదకు తీసుకుచ్చారు. ఆ ప్రదేశాన్ని ఎలా అభివృద్ధి చేయోచ్చనే విషయాన్ని తెలిపారు. భూమండలంపై తొలి బీచ్ ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అనేక పరిశోధనల తర్వాత ఈ భూమండలం మొత్తం మీద తొలిసారిగా బీచ్గా మారిన ప్రాంతాన్ని కనుగొన్నామని ప్రకటించారు. ఈ ప్రదేశం ఇండియాలోని ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సింఘ్భూమ్ ప్రాంతంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒకప్పుడు భూమండలం అంతా సముద్రం వ్యాపించి ఉండేంది. ఆ తర్వాత కాలక్రమేనా టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు, భూఅంతర్భాగంలో పేలుడు తదితర చర్యల కారణంగా సముద్రం ఉపరితలం మీదకు తొలిసారిగా బయటకు వచ్చిన ప్రదేశంగా ఝార్ఖండ్ రాష్ట్రంలో సింఘ్భూమ్ని పేర్కొన్నారు. ఈ చర్య 3.2 బిలియన్ ఏళ్ల కిందట జరిగిందని అంటున్నారు. ఓ రకంగా భూమిపై తొలి బీచ్గా ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా తేల్చారు. అయితే ప్రస్తుతం ఝార్ఖండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్గా ఉంది. ఓ రకంగా భూగోళంపై జరిగిన అద్భుత ఘట్టాలకు నేటికి సింఘ్భూమ్ మౌన సాక్షిగా నిలిచి ఉంది. ఏకోటూరిజం సింఘ్భూమ్కి సంబంధించిన విశేషాలు ఇటీవల ఓ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ ఈ ప్రదేశాన్ని టూరిస్టులను ఆకర్షించే ఆయస్కాంతంలాగా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచలోనే తొలి బీచ్ దగ్గరికి వెళ్లాలనే గోల్ లేని వారిని కూడా ఇక్కడికి రప్పించవచ్చు. స్థానికంగా ఉన్న గిరిజనుల సంస్కృతి జీవితాలకు ఇబ్బంది రాకుండా ఏకోటూరిజంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిలను ట్యాగ్ చేశారు. I see an opportunity here to develop a magnet for global tourists. Who would not put the ‘world’s first ever beach’ on their travel bucket list? However the rights of tribal societies should not be trampled on & eco-tourism should be the goal. @HemantSorenJMM @kishanreddybjp https://t.co/5fHkUxZfkk — anand mahindra (@anandmahindra) November 24, 2021 చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా -
ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్లో కలకలం
రాంచీ: ఓ స్టార్ హోటల్లో ముగ్గురు పోలీసులకు చిక్కడం జార్ఖండ్లో కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెనకున్న వారిని బయటకు లాగుతామని, ఆ కుట్రను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. రాంచీలోని ఓ హోటల్లో మూడు రోజుల నుంచి ఆ హోటల్లో పెద్ద ఎత్తున ఓ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుట్ర విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జై మంగల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కొత్వాలి పోలీస్ స్టేషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరపగా ముగ్గురు అరెస్టయ్యారు. దీనిపై విచారణ చేపట్టి సోదాలు చేయగా అభిషేక్ దుబే, అమిత్ సింగ్, నివారణ్ ప్రసాద్ మహతో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ (ఆర్జేడీ) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 స్థానాలు ఉన్న జార్ఖండ్లో జేఎంఎం (30), కాంగ్రెస్ (18), ఆర్జేడీ (1)లకు మొత్తం కలిపి 47 స్థానాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే హోటల్లో ఓ రహాస్య కుట్రకు తెరతీశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
ఏపీ వేరియంట్: ఎ రియల్ విలన్!
యుద్ధ సందర్భం. భారతీయులమైన మనం మన రాజ్యాంగ నిర్మాతలెవరూ ఊహించని ఒక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొం టున్నాము. ఒకానొక భయానక వాతావరణం జనం మస్తిష్కా లను స్వాధీనం చేసుకుంటున్న సందర్భం. ఈ పరిస్థితి తలెత్తడా నికి చాలా కారణాలు ఉండవచ్చును. అవి మానవ కల్పిత కార ణాలు కూడా కావచ్చును. పాలకుల వైఫల్యాలూ కారణం కావ చ్చును. జనం నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా నిందించవచ్చును. మనల్ని ఇన్ని ఇక్కట్లపాల్జేస్తున్న దుస్థితి కారణాలపై ఆరా తీసే సమయం ఒకటి త్వరలో వస్తుంది. అప్పుడు ఈ పాపాన్ని ఎవరె వరికి ఎంత చొప్పున పంచి ఇవ్వాలో జనం లెక్క తేలుస్తారు. ప్రస్తుత తక్షణ కర్తవ్యం మాత్రం యుద్ధంలో గెలవడమే. శత్రు దేశాలతో యుద్ధాలు తలెత్తినప్పుడు జాతియావత్తు ఒక్కటై నిలవడం మనకు కొత్తకాదు. ఇప్పుడు కనిపించని శత్రువుతో మొత్తం ప్రపంచమే యుద్ధం చేస్తున్నది. ఈ ప్రపంచయుద్ధంలో పీకల్లోతు మునిగివున్న టార్గెట్ నంబర్వన్ మన దేశమే. మనం మరింత ఐక్యంగా నిలబడాలి. ఇదొక చారిత్రక అవసరం. కోవిడ్పై జరుగుతున్న యుద్ధ వ్యూహాలను సమీక్షించడానికి రెండు రోజుల క్రితం భారత ప్రధానమంత్రి కొందరు ముఖ్య మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. వీరిలో జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రితో సంభాషణ తర్వాత ట్విట్టర్లో సోరెన్ తన కామెంట్ పెట్టారు. ‘ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో ఆయన మన్కీ బాత్ తప్ప పెద్ద విషయమేమీ లేదంటూ’ వెటకారం ధ్వనించేలా ఆ కామెంట్ ఉన్నది. దీనిపై ట్విట్టర్ వేదికగా చాలామంది ప్రము ఖులు తమ అసహనాన్ని, అసమ్మతినీ వ్యక్తపరిచారు. వీరిలో అధికార పార్టీ ముఖ్యులు సహజంగానే ఉంటారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు కూడా సోరెన్ వైఖరిని ఖండించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ట్విట్టర్ వేదికగానే ఆయన సోరెన్కు బదులిచ్చారు. ‘ప్రియమైన సోరెన్, మీరంటే నాకెంతో గౌరవం ఉన్నది. కానీ, ఒక సోదరుడిగా చెబు తున్నా... మన మధ్యన ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు గాక, వాటినిప్పుడు ప్రదర్శించడం భావ్యం కాదు. అది మన జాతిని బలహీనపరుస్తుంద’ని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు రాజకీయవేత్తలను మినహాయిస్తే వైఎస్ జగన్ స్పందనపై నెటి జన్ల నుంచి పెద్దఎత్తున సానుకూలత వ్యక్తమైంది. సోరెన్ వ్యాఖ్యలను తప్పుపట్టినప్పటికీ, కేంద్రం తీరుపై వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏ ఫిర్యాదు లేదని చెప్పడానికి ఎటు వంటి ఆధారమూ లేదు. తమకు నెలకు కోటి డోసుల చొప్పున వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని పలుమార్లు అడిగారు. స్వయాన ముఖ్యమంత్రే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారు. రోజుకు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగలిగే యంత్రాంగం తమకు ఉన్నదని ఒకరోజు ప్రదర్శించి మరీ చూపెట్టారు. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారికి రెండు డోసుల చొప్పున ఇవ్వడానికి 6 కోట్ల 96 లక్షల డోసులు రాష్ట్రానికి కావాలి. కానీ ఇప్పటివరకూ కేంద్రం అందజేసింది కేవలం 73 లక్షల డోసులు. నాలుగు నెలల కాలంలో మొత్తం జనాభాకూ టీకాలు వేయగల వ్యవస్థాగత సామర్ధ్యం ఉన్నప్పటికీ, వాటి కేటాయింపూ, నియంత్రణాధి కారం కేంద్రం చేతిలో ఉన్న కారణంగా నిస్సహాయంగా ఉండి పోవలసి వస్తున్నదనే ఆవేదన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్ల విష యంలోనూ అవసరానికీ, సరఫరాకు మధ్యన వందశాతం తేడా ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతూ సంక్షో భాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ యుద్ధం జరుగుతున్న వేళ జాతి ఐక్యత విచ్ఛిన్నం కాకూడదనే వైఖరినే వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసు కున్నారు. ఈ వైఖరి దేశ ప్రజలకు ఒక కొత్త సందేశాన్ని అంద జేసింది. సంక్షోభ సమయాల్లోనే మనిషి అసలు స్వభావం బయట పడుతుందంటారు. విభేదాలు పక్కనబెట్టి జాతి యావత్తూ ఐక్యంగా నిలబడాలన్న రాజనీతిజ్ఞతను వైఎస్ జగన్ వ్యక్తపరిస్తే, ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వైఖరి ఆయన రాజకీయ ప్రత్యర్థి నుంచి వ్యక్తమైంది. కోవిడ్పై పోరాటం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై నిత్యం నిందారోపణలు చేస్తూ ఫక్తు స్వార్థ రాజ కీయవేత్త స్వభావాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఎల్లో మీడియా సహకారంతో ఆయన, ఆయన పార్టీ చేపట్టిన తప్పుడు ప్రచారం అన్నిరకాల సభ్యతా ప్రమాణాలను దాటిపోయింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తే బాగుండును, రాష్ట్రం అల్లకల్లోల మైతే బాగుండును, ఈ ప్రభుత్వం పడిపోతే, చంద్రబాబును ఏ అదృశ్యశక్తో అధికారంలో కూర్చోబెడితే బాగుండును... అనే ధోరణిలో ఆ పార్టీ ఆలోచన సాగుతున్నది. ఈ అభిప్రాయాలను వాళ్లేమీ దాచుకోలేదు. స్వయానా చంద్రబాబు, ఆయన ప్రతినిధులూ మీడియా సమావేశాల్లో వెళ్లగక్కిన అవాకులే ఇవన్నీ. ఏపీ వేరియంట్ పేరుతో ఒక ప్రమాదకరమైన వైరస్ మ్యూటెంట్ కర్నూలులో కనిపించిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైనదనీ, పదిహేను రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందనీ చంద్రబాబు నిరాధారపూరితమైన తప్పుడు ప్రచారాన్ని లేవదీశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలం గాణ ప్రజలు మా రాష్ట్రాలకొస్తే 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని పక్కరాష్ట్రాలు ప్రకటించాయి. చంద్రబాబు ప్రచా రాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలతో సహా పలువురు వైద్యనిపుణులు ఖండించారు. తనను అధికారానికి దూరం చేసిన ప్రజల మీద ఆయన కక్షబూనారేమోననిపిస్తున్నది. లేకపోతే జనంలో కల్లోలా నికి దారితీసే ఇటువంటి ప్రచారాన్ని ఇంత బాధ్యతారాహి త్యంతో ఎలా చేపట్టగలుగుతారు? తనకు దక్కని యువతి మరొకడికి దక్కకూడదంటూ యాసిడ్ చల్లే ప్రేమోన్మాదానికి, ఈ దుష్ప్రచారానికి తేడా ఏమైనా ఉన్నదా? మా నాయకుడికి ఒక వారం రోజులు అధికారం ఇచ్చి చూడండి అంటూ ఆ పార్టీ ప్రతి నిధులు మీడియా సమావేశాల్లో దేబిరించేందుకు దారితీసిన నిస్పృహకు కారణాలేమిటి? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభానికి దారితీసిన చారిత్రక పరిణామాల్లోనే ఈ స్వార్థ రాజకీయ శక్తుల కేరాఫ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. వాటి నేటి నిస్పృహకు కారణాలూ కనిపిస్తాయి. బ్రిటీష్వాళ్లు మన ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పిచేసిన కారణంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆరోగ్య రంగానికి మన దేశం పెద్దగా కేటాయింపులు చేయలేకపోయింది. జీడీపీలో ఒక్కశాతం మాత్రమే ఖర్చుపెట్టేవాళ్లు (ప్రభుత్వ వ్యయం ఇప్పుడు కూడా అంతే). అయినప్పటికీ పరిమిత సంఖ్యలోనైనా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవి. అందులో డాక్టర్, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేవాళ్లు. అత్యవసర మందులు లభ్యమ య్యేవి. ప్రతి గ్రామంలోనూ ఒకరో ఇద్దరో సంప్రదాయ వైద్యులు ఉండేవాళ్లు. ఊళ్లో ఎవరికి ఏ జబ్బు ఉందో, ఏ వైద్యం అవసరమో వీరికి తెలిసేది. జాతీయోద్యమం, సేవాభావాలతో ప్రభావితులైన కొత్తతరం డాక్టర్లు క్రమంగా చిన్నపట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులను నెలకొల్పారు. గ్రామీణ సంప్రదాయ వైద్యులు ఆర్ఎంపీలుగా, పీఎంపీలుగా రూపాంతరం చెందారు. వారికి పట్టణాల్లోని డాక్టర్లు కనీస వైద్యరీతులపై ఆధునిక శిక్షణ ఇచ్చేవారు. వైద్యునికి–రోగికీ మధ్యన ప్రత్యక్ష సంబంధం కొన సాగింది. వైద్యం ప్రజలకు తలకు మించిన భారంగా పరిణమిం చలేదు. ముప్పయ్యేళ్ల కింద దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారం భమయ్యేంతవరకూ ఈ పరిస్థితి కొనసాగింది. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరగడం మొదలైంది. పెరుగుతున్న సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం మొదలైంది. విద్య, వైద్యం సహా సమస్త జీవన రంగాలు వ్యాపార చట్రంలో బిగుసుకొని పోయాయి. కార్పొరేటీకరణ పొందిన వైద్యం పల్లెల్లో కనుమరు గైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాడుబెట్టారు. డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు పేషెం ట్లను తీసుకొని వచ్చే కమీషన్ ఏజెంట్లుగా ఆర్ఎంపీలను, పీఎంపీలను మార్చివేశారు. సంప్రదాయ వైద్యం అప్పటికే అంత రించిపోయింది. దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా పట్టణాల్లోని పెద్దాసుపత్రికి వెళ్లితీరాల్సిన దిక్కుమాలిన పరిస్థితి నెలకొన్నది. రోగం వస్తే అప్పులపాలు కావడం తప్ప మరో దారి లేని రోజులు ఆరోగ్యశ్రీ వచ్చేవరకూ కొనసాగాయి. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు హాలాహలం పుట్టినట్టే, ఆర్థిక సంస్క రణల ఫలితంగా సంపదతోపాటు స్వార్థం కూడా వృద్ధి చెందింది. నయా సంపన్నవర్గాలు సంపదను కేంద్రీకృతం చేసు కోవడానికి పోటీపడ్డారు. వీరికి అండగా ఒక నయా రాజకీయ నాయకత్వం పుట్టింది. కొత్త సంపన్నవర్గాలకు ఊడిగం చేయడం ఈ సరికొత్త రాజకీయ నాయకత్వం ప్రథమ కర్తవ్యం. ఈ నాయకుల సేవలకు మెచ్చి ప్రపంచ సంపన్నవర్గాలు వీరికి సంస్కరణల చాంపియన్లుగా బిరుదులిచ్చాయి. ఈ చాంపి యన్లలో అగ్రస్థానం అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుది. ప్రభుత్వరంగంలో కొత్త వైద్యకళాశాలలు రాకుండా, హాస్పిటల్లు తెరవకుండా, వైద్యులను భర్తీ చేయ కుండా, ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండా ప్రభుత్వ వైద్యరంగాన్ని పాడెపైకి చేర్చిన ఘనత, కార్పొరేట్ వైద్యసేవలో తరించిన కీర్తి ఆయనది. ఇప్పుడు మహమ్మారి విరుచుకుపడిన వేళ ప్రభుత్వ వైద్యరంగం చిగురుటాకులా వణికిపోవడానికి ఈ రాష్ట్రంలో ప్రధాన కారకుడు ఆయనే. ప్రభుత్వ వైద్యరంగం బలంగా ఉన్నట్లయితే ఇంతటి దారుణమైన పరిణామాలు సంభ వించేవి కావని ఇప్పుడు అందరూ చెబుతున్న మాట. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బహుశా ఒక వారం కూడా గడవకపోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని పునరుజ్జీవింపజేసే ఆలోచన లతో ‘నాడు–నేడు’ పేరుతో ఒక విజన్ను వాళ్లతో ఆయన పంచు కున్నారు. అప్పటికింకా కరోనా ఊసు మనం వినలేదు. కానీ వైద్యం ప్రజలకు సంక్రమించవలసిన ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ అందుకోసం ఒక బృహత్తరమైన అభివృద్ధి ప్రణాళికను ఆయన తయారుచేసుకున్నారు. ప్రభుత్వరంగంలో 16 కొత్త మెడికల్ కాలేజీలను ప్రకటించారు. హుటాహుటిన 12 వేల మంది కొత్త వైద్యసిబ్బందిని నియమించారు. కోవిడ్ను ఎదు ర్కొనేందుకు చేసిన నియామకాలు అదనం. 108, 104 సేవల కోసం మండలానికి రెండు అంబులెన్స్లను కొత్తగా ప్రవేశ పెట్టారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ క్లినిక్ ఉండే ఏర్పాటు చేశారు. మారుమూల పల్లెలోని ప్రతి కుటుంబం, ఆ కుటుంబం లోని ప్రతి సభ్యుడూ నిరంతరం వైద్యపర్యవేక్షణలో ఉండే విధమైన ‘ఫ్యామిలీ డాక్టర్’ వ్యవస్థ ఏర్పాటు తన తుది లక్ష్యమని అధికారులతో ముఖ్యమంత్రి తరచూ చెప్పుకొస్తున్నారు. ఈ సంక్షోభం దాపురించకపోయినట్లయితే ఈ దారిలో మరిన్ని అడు గులు వేసి ఉండేవారు. ఇప్పటికే ఏర్పాటయిన వ్యవస్థ కారణం గానే ఒకేరోజున 6 లక్షలమందికి రాష్ట్ర ప్రభుత్వం టీకాలు ఇప్పిం చగలిగింది. ఇప్పుడు కోవిడ్ సంక్షోభాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ప్రతిరోగికీ ఉచిత వైద్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఆర్థిక సంస్క రణల తర్వాత మూడు దశాబ్దాల కాలంలో సగం రోజులు చంద్రబాబే అధికారంలో ఉన్నాడన్నది వాస్తవం. ఆయన హయాం లోనే ప్రభుత్వ వైద్యరంగం శిథిలమైందన్నది నిఖార్సైన నిజం. భర్తకు జబ్బుచేస్తే భార్య పుస్తెలు, భార్యకు జబ్బు చేస్తే భర్త కిడ్నీలు అమ్ముకొని ఆస్పత్రుల బిల్లులు కట్టిన దౌర్భాగ్యపు రోజులను ఆయన కాలంలోనే చూశామన్నది ఒక కఠిన వాస్తవం. కొనఊపిరితో ఉన్న ప్రభుత్వ వైద్య రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసింద న్నది దాచేస్తే దాగని సత్యం. నిప్పులాంటి ఈ నిజాల మీద ఎందుకు నివురుగప్పుతున్నారు? ఎందుకంటే, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక వేరి యంట్. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కొత్త రూపం. నయా సంపన్నవర్గాల ప్రయోజనాల కోసమే మ్యూటేట్ అయిన వేరియంట్. ఈ రాజకీయ వేరియంట్కు స్వార్థమే పరమార్థం. రాజధాని పేరుతో ప్రారంభించిన తమ ట్రెజర్ హంట్ ఆగి పోయిందన్న నిస్పృహతో ఆ వేరియంట్ అల్లాడుతున్నది. అరా చకంగా ప్రవర్తిస్తున్నది. ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఈ ఏపీ వేరియంటే ఇప్పుడు నిజమైన విలన్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హేమంత్ సోరేన్.. మీరంటే ఎంతో గౌరవముంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చేసిన ట్వీట్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ‘‘ హేమంత్ సోరేన్.. మీరంటే ఎంతో గౌరవముంది. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలుండొచ్చు కానీ... విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని బలహీనం చేస్తాయి. కరోనా వేళ రాజకీయాలొద్దు. కోవిడ్-19పై చేస్తోన్న యుద్ధంలో మనమంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో ప్రధానిని నిందించే బదులు... పార్టీలకు అతీతంగా కోవిడ్పై పోరాటాన్ని బలోపేతం చేద్దా’’మని పేర్కొన్నారు. హేమంత్ సోరేన్ తన ట్వీట్లో.. ‘‘ ఈ రోజు ఆదర్శ ప్రాయుడైన ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఫోన్ చేశారు. ఆయన కేవలం తన మనసులోని మాటే చెప్పారు. ఆయన తను మాట్లాడటమే కాకుండా, నేను చెప్పేది కూడా వినుంటే బాగుండేది’’ అని అన్నారు. చదవండి : ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్ Dear @HemantSorenJMM, I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2) https://t.co/0HZr56nOj2 — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021 -
ఏప్రిల్ 22- 29 వరకు సంపూర్ణ లాక్డౌన్
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్డౌన్ విధిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 తేదీ వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ నిబంధలను అమల్లో ఉంటాయని ప్రకటించింది. అయితే ‘స్వస్థ్యా సూరక్షా సప్తా(వారం రోజుల పాటు లాక్డౌన్)' సందర్భంగా, అవసరమైన సేవలు మాత్రమే కొనసాగుతాయని, మిగతా అన్ని దుకాణాలు మూసివేయబడతాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకే మహరాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణ మృదంగాన్ని తట్టుకోలేక లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పడు రెండో రాష్ట్రంగా జార్ఖండ్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో చివరి అస్త్రంగా ఈ ప్రభుత్వాలు లాక్డౌన్కే మొగ్గు చూపాయి. ఆంక్షలు.. మినహాయింపులు.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్కు సహకరించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రజలను కోరారు. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహమ్మారి వైరస్ వ్యాప్తిని తప్పక అడ్డకోవాల్పిన పరిస్థితి ఏర్పడింది కనుక ప్రభుత్వం, ప్రజలు ఒక్కటై మహమ్మారిని అంతం చేయాలని సూచించారు. జార్ఖండ్ ఒక పేద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ప్రధాన ఆస్తులు మా ప్రజలు. వారిని కాపాడటమే మా ప్రథమ బాధ్యతని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ స్వస్థ్యా సూరఖ్సా సప్తాకు కట్టుబడి ఉండాలిని సూచించారు. కాగా రాష్ట్రంలో దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలు తెరిచి ఉంటాయి, కాని భక్తులకు అనుమతిలేదు. కొన్ని కేంద్ర, రాష్ట్ర రంగాలు, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు, నిర్మాణం, వ్యవసాయ, మైనింగ్ రంగంలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ఎక్కడైనా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఉండడం నిషేదించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4,969 కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 1,72,315 కేసులు ఉండగా, మరణాల సంఖ్య 1,547 కు చేరుకుంది. ( చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1 వరకు ) -
అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం
దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా గణ న సందర్భంగా ఆదివాసీలను ఇతర మతాల్లో కలపకుండా ప్రత్యేక గుర్తింపు కోడ్ కాలమ్లో చేర్చాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభలో చేసిన తీర్మానం సభ ఆమోదం పొందింది. జార్ఖండ్లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు కూడా, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, జనగణన విభాగం దీన్ని ఆమోదించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఖాయం. ‘‘జనాభా లెక్కల్లో ఆదివాసీలను హిందు వుల్లోగానీ, ఏ ఇతర మతాల్లోగానీ చేర్చకూ డదు. వారిని జనాభా లెక్కల్లో ‘సరన’ కోడ్ కాలమ్లో చేర్చాలి. గత నలభై ఏళ్ళుగా ఆదివాసీలు చేస్తున్న ఈ డిమాండ్ని శాసనసభ ఆమో దించాలి’’ అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నవంబర్ 11వ తేదీన ఒక రోజు ప్రత్యేక సమావేశం నిర్వ హించి, ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. కానీ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. సాంకేతికంగా సమస్యలున్నాయని ఆ పార్టీ నాయకులు బాబూలాల్ మరాండి పేర్కొన్నారు. అయితే సరన కోడ్ను జనాభా లెక్కల్లో చేర్చాలనే డిమాండ్ను హేమంత్ సోరెన్ నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాదు, ఈ విషయంపైన జార్ఖండ్లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం (ట్రైబల్ రిలీజియన్) పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జార్ఖండ్ శాసనసభ చేసిన తీర్మానం పైన కేంద్ర ప్రభుత్వం, జనాభా గణన విభాగం (సెన్సెస్ డిపార్ట్మెంట్) సానుకూలంగా ఉంటుందని ఎవ్వరూ భావించడం లేదు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఊపందుకునే అవకాశం మెండుగా ఉంది. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడు తుందన్నది వాస్తవం. భారతదేశంలో 1871లో జనాభా గణన ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివాసీలను ‘అబ్ ఆర్జినల్స్’గా పేర్కొన్నారు. 1901 నుంచి 1942 వరకు జనాభా లెక్కల్లో ఆది వాసీలను యానిమిస్ట్స్ అని పేర్కొన్నారు. దానర్థం ‘ప్రకృతి ఆరా ధకులు’ అని. అయితే భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆదివాసీలను ప్రత్యేకంగా గుర్తించడం ఆపేశారు. అప్పటి నుంచి వారిని హిందువులుగానో, క్రైస్తవులుగానో లేదా ఇతర మతాల గాటనో కట్టేశారు. నిజానికి చరిత్ర పరిశోధకులుగానీ, మానవ శాస్త్ర నిపుణులుగానీ ఆదివాసీలు ప్రత్యేక మత సాంప్రదాయాలు కలిగిన వారుగానే పేర్కొ న్నారు. ఏ దేశంలోనైనా అడవుల్లో, కొండల్లో నివసించే వారి సాంప్రదా యాలు విభిన్నంగానే ఉంటాయి. వాళ్ళల్లో విగ్రహారాధనగానీ, ఇతర మనుషుల రూపంలో ఉండే దేవుళ్ళు, దేవతలుగానీ ఉండరు. సమస్త ప్రకృతే వారి దైవం. చెట్లు, కొండలు, జంతువులు, పక్షులు, ప్రకృతి లోని ఇతర గాలి, నీరు లాంటివే వారికి ఆరాధ్యదైవాలు. ‘సరన’ అంటే ఒక చెట్టు పేరు. దానిని ‘సాల్ ట్రీ’ అంటారు. అంటే తెలుగులో మద్ది చెట్టు అన్నమాట. ఇది చరిత్రలో కూడా ఎంతో ఆరాధ్య వృక్షంగా వుంది. గౌతమ బుద్ధుడు జన్మించింది, మహాపరి నిర్వాణం పొందింది కూడా ఈ మద్దిచెట్ల మధ్యనే అని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మన దేశంలోని ప్రధాన ఆదివాసీ తెగలన్నీ కూడా ఏదో ఒక రకమైన ప్రకృతి ఆరాధనలోనే ఉన్నాయి. భారతదేశంలోని ప్రధానమైన ఆదివాసీ తెగల్లో సంతాల్ ఒకటి. తమ పూర్వీకుల ఆత్మలే తమకు మంచి, చెడు చేకూరుస్తాయని నమ్ముతారు. అదేవిధంగా ఒక తోటలోని చెట్లలో తమ పూర్వీకులు నివసిస్తుంటారని, తమకు సమీపంలోని కొండల్లో వాళ్ళు కొలువుదీరి ఉంటారని సంతాల్ తెగ నమ్ముతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెంచులు చెట్లకు ప్రతిరూపంగా గరెలైసమ్మకు పూజ చేస్తారని అంటారు. మన దేశంలోని మరో ప్రధానమైన తెగ గోండ్ తెగ. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. నాగజాతి ఆరాధకులు. నాగోబా జాతర పేరుతో జరిగే జాతర వీరి సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన జాతర. వీళ్ళ గూడేల్లో కూడా ఏ హిందూ దేవుళ్ళో, లేదా దేవతల విగ్రహాలో ఉండేవి కావు. వీరిలో మనిషిని బలిచ్చే సాంప్రదాయం ఉండేది. ఎంత శక్తిమంతులను బలిస్తే, అంత ఫలితం ఉంటుందని వీళ్ళు 1 9వ శతాబ్దం వరకు నమ్మేవారు. మరొక తెగ ‘ఖిల్’. వీళ్ళ ప్రకృతి ఆరాధనతో పాటు, మంత్రా లను, తంత్రాలను విశ్వసిస్తారు. కోయ, కొండరెడ్లు, కోంద్, ఇతర తెగలన్నీ గతంలో ప్రకృతి ఆరాధకులుగానే ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా, కొందరు క్రైస్తవులుగా, మరికొందరు హిందూ దేవత లను ఆరాధించేవాళ్ళుగా మారిన మాట వాస్తవమే. అయితే ఇటీవల ఆదివాసులలో పెరిగిన రాజకీయ చైతన్యం ఆదివాసీలను తమ అస్తిత్వ ఉద్యమంవైపు అడుగులు వేసేలా చేస్తోండడం ఆహ్వానించదగ్గ పరి ణామం. అయితే వాళ్ళు ఈ దేశంలోని మెజారిటీ మతం కలహించే సమాజం, సంస్థలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిరాశకు గురవుతున్నారు. రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తుంటారు. దానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. అవి 1. భౌగోళికంగా ప్రత్యేక ప్రాంతం, ప్రత్యేకించి అడవులు, కొండలు. 2. ప్రత్యేక భాష, 3. ప్రధాన సమాజానికి భిన్నంగా ప్రాచీన సాంప్రదా యాలు, ప్రత్యేకించి ప్రకృతి ఆరాధన. 4. వెనుకబడిన ఆర్థిక విధానం, ప్రకృతి వనరులపైన ఆధారపడిన జీవన విధానం, 5. ప్రత్యేక తెగగా ఉండడం, 6. అన్ని సమస్యలనూ, వ్యవహారాలనూ వారి సంఘం నేతృత్వంలో పరిష్కరించుకొనే తమదైన ప్రత్యేక పాలనా విధానం. ఈ విధమైన జీవనవిధానాన్ని బట్టి వారిని ఆదివాసీలుగా గుర్తించాలని భారత ప్రభుత్వమే ఎన్నో ఏళ్ళ కిందట నిర్ణయించింది. ఇప్పటికీ ఆదివాసీలు తమ మత విధానాలను వదులుకోలేదని, బయటి ప్రపంచం ప్రభావం కొంత ఉన్నప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నది వాస్తవం. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ప్రణాళికలు, పథకాలు రచించారు. మరెన్నో విధివిధానాలు రూపొందించారు. కానీ అవి మిగతా పేదలు, దళితులతో పాటు, ఆదివాసీలకు అందించాల్సిన స్థాయిలో అంద లేదు. ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధిలో భాగం కాలేకపోయారు. అంతేకాకుండా, మన ప్రభుత్వాలు, పాలకులు, పెద్దలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల ఆదివాసీలకు ప్రయోజనం చేకూరకపోవడం మాత్రమే కాదు, వారు అభివృద్ధిలో బలిపశువులుగా మారుతున్నారు. గత 30 ఏళ్లనుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది ఆదివాసీలు నిరాశ్ర యులయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, గనులు, బహుళజాతి కంపెనీల వల్ల, తాము వేల ఏళ్ళుగా నివసిస్తోన్న నేలను వీడి, తాము దైవ స్వరూపంగా భావించే భూమిని వదులుకొని, వలసపోతున్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై జరుగుతోన్న అకృత్యాలెన్నో లెక్కలో లేవు. అంతే కాకుండా రాజ్యాంగంలో పొందు పరిచిన ఐదవ, ఆరవ షెడ్యూల్స్లో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ ఆచరణలో అవి ఎంత మాత్రం అండగా నిలబడలేకపోతున్నాయి. రాజ్యాంగం అమలుకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయాయి. ఆదివా సీల ప్రగతికి పదికిపైగా కమిషన్లు, కమిటీలు నివేదికలు ఇచ్చాయి. కానీ ఏ ఒక్కటీ కూడా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలు, యువకుల చదువు అంతంత మాత్రంగానే ఉంది. అడవులు, కొండ కోనలు దాటి ఉన్నత విద్యను ఆర్జిస్తున్న వారు, వారి జనాభాలో రెండు శాతం మాత్రమే. అంటు వ్యాధులు, ఇతర సీజనల్ జబ్బులు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. టి.బి., ఇతర తీవ్రమైన రోగాలతో ప్రతి సంవత్సరం వేలాదిమంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఒక లక్షా నలభైవేల మంది మృత్యు వాత పడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అడవిలో లక్షల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ఆదివాసీలు తర తరాలుగా ఆ అడవే జీవితంగా బతుకుతున్నప్పటికీ వారి కాళ్ళకింది నేల వారిది కాదు. వారు జీవిస్తోన్న అడవిపై వారి హక్కు కాగితాలకే పరిమితం. రకరకాల పేర్లతో, అభివృద్ధి పథకాల నెపంతో ఆదివాసీ లకు చెందాల్సిన భూమి మొత్తం అన్యాక్రాంతమౌతోంది. అందుకే అవునన్నా, కాదన్నా జల్, జంగిల్, జమీన్ అనే నినాదం మరింత తీవ్ర తరం అవుతున్నది. భారత సమాజం, భారత ప్రభుత్వం అనుసరి స్తున్న దోపిడీ, నిర్లక్ష్యం ఆదివాసీలను ప్రత్యేక అస్తిత్వం వైపు నడిపిస్తు న్నది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక ఆది వాసులను ప్రత్యేక మతంగా గుర్తించాలని చేసిన తీర్మానం భారత సమాజానికి, కేంద్ర ప్రభు త్వాలకు చేసిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా వివక్షకు, విద్వేషానికి, విస్మరణకు గురౌతోన్న కులాల, తెగల విషయంలో సానుకూల దృక్పథం అనుసరించకపోతే ఫలితాలు మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉంటాయన్న విషయాన్ని మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా
రాంచీ : కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అయితే గుప్తాకు అంతకుముందు కాబినెట్ సమావేశంలో పాల్గొనడంతో మిగతా మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ గుప్తా పక్కనే కూర్చున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా గుప్తాకు కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారని ఆరోపించారు. గుప్తా అవలంభించిన నిర్లక్ష్య ధోరణి వల్ల మిగతా మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా అని తేలడంతో వెంటనే ఆయనతో పాటు హాజరైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్లారు. ఇక మరో నాయకుడు ఏజేఎస్యూ పార్టీ అధ్యక్షుడు సుదేష్ మహతోకు కూడా కరోనా సోకింంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి ఖశ్చితమైన నిబంధనలు పాటించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (ఎయిమ్స్లో చేరిన అమిత్ షా) -
సీఎంపై రేప్ ఆరోపణలు; 100 కోట్ల దావా!
సాక్షి, రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావాలో సోరెన్ తెలిపారు. ఈ మేరకు రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ దావాలో బీజేపీ ఎంపీతో పాటు ట్విటర్ కమ్యూనికేషన్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్లను రెస్పాండెంట్ 2, 3 లుగా పేర్కొంటూ పార్టీలుగా సీఎం చేర్చారు. సీఎం సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ దూబే ట్విటర్లో ఆరోపించారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. పరువునష్టం దావా వేసిన తరువాత కూడా బీజేపీ ఎంపీ హేమంత్ సోరెన్పై ట్విటర్ వేదికగా బాణాలు కురిపిస్తునే ఉన్నారు. ‘మీపై ముంబైలో ఒక యువతి రేప్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు. చదవండి: యువతిని కొట్టిన పోలీస్, సీఎం ఆగ్రహం -
యువతిని కొట్టిన పోలీస్
-
యువతిని కొట్టిన పోలీస్, సీఎం ఆగ్రహం
రాంచీ: పోలీసులు అంటే ప్రజలని రక్షించే వారు. అందుకే వారిని రక్షక భటులు అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం కొంత మంది పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతుంటారు. అలా రెచ్చిపోతే ఏం జరుగుతుందో జార్ఖండ్లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. నడిరోడ్డుపై ఓ యువతి చెంపను చెళ్లుమనిపించడంతో పాటు, ఆమె జుట్టు పట్టుకుని లాగిన ఓ పోలీసు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రే స్పందించి, ఆ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటన జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డుపై బందోబస్తులో ఉన్న ఓ పోలీసు, ఆ దారిలో వచ్చిన ఓ యువతిని ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. ఆపై చెంపమీద ఒక్కటిచ్చాడు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని మరీ లాగాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా అది సోషల్ మీడియాకు చేరడంతో వైరల్గా మారింది. సదరు పోలీసు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో కాస్త జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లగా, దాన్ని చూసిన ఆయన, రాష్ట్ర డీజీపీ ఎమ్ వీ రావుకు ట్యాగ్ చేస్తూ, వీడియోను షేర్ చేశారు. ఇటువంటి నీచమైన, అనుచిత ప్రవర్తనలను ఎంత మాత్రం భరించరాదని ట్వీట్ చేశారు. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు పోలీసును సస్పెండ్ చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: 11 మంది పోలీసులకు జీవిత ఖైదు -
భయపడకండి.. అందరినీ తరలిస్తాం
రాంచీ: లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కకుపోయిన జార్ఖండ్ వాసులకు తీసుకొచ్చే బాధ్యత తమదని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ భరోసాయిచ్చారు. తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, విద్యార్థులు, ఇతరులను స్వస్థలాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించి తామే సహాయం అందిస్తామని, కంగారు పడాల్సిన పనిలేదన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు పర్యాటకులను ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లలో స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హెంశాఖ శుక్రవారం అనుమతి ఇచ్చింది. దీంతో 400పైగా రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగిస్తుండటంతో లక్షల సంఖ్యలో వలస కార్మికులు, విద్యార్థులు తిండి తిప్పలు లేక చాలా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరంతా తమ ఊళ్లకు తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. (ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే..) కాగా, తమ రాష్ట్రంలోని వలస కూలీలను తరలించేందుకు తెలంగాణ ముందడుగు వేసింది. జార్ఖండ్ వాసులతో కూడిన ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం లింగపల్లి నుంచి హతియా బయలుదేరింది. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదే కావడం గమనార్హం. (3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా..) -
ఆమెకు కరోనా లేదు
జిల్లా ఎస్పీ విచారణ చేయించాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. డిప్యూటీ కమిషనర్ చూసొచ్చాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. బీడీవో ఆరా తీయించాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. స్టేషన్ ఇన్చార్జి మళ్లీ మళ్లీ వెళ్లొచ్చాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. రిపోర్ట్స్లోనూ.. ఆమెకు.. నో కరోనా. అయినా ఆ ఊరు వినడం లేదు. ‘దీదీ కిచెన్’ వంట మనిషిని.. ఊరొదిలి వెళ్లిపొమ్మంటోంది!! ‘మనుషులు దూరంగా ఉండండి. మనసుల్ని దూరం కానీయకండి’.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం చేసిన ట్వీట్ ఇది. రామ్గర్ జిల్లా గోలా బ్లాక్లోని మురుది గ్రామంలో ఒక కుటుంబం వెలివేతకు గురైందని ఆయన దృష్టికి రావడమే.. ఈ ట్వీట్కి కారణం. మురుది గ్రామంలో.. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కుటుంబాన్ని ఊరు ఊరంతా వెలి వేసింది. బావుల్లో నీళ్లు పట్టుకోనీయడం లేదు. బోరింగులు, కొళాయిల దగ్గరికి రానివ్వడం లేదు. కిరాణా దుకాణాలు దూరాన్నుంచే వీళ్లను చూసి షట్టర్లు మూసుకుంటున్నాయి. విషయం సీఎం వరకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్న వీడియోను ఆయన చూశారు. ఆ చిన్నారులిద్దరూ గీతాదేవి కూతురు, కొడుకు! గీతాదేవి.. ‘దీదీ కిచెన్’ వర్కర్. లాక్డౌన్లో పనులు కోల్పోయినవారికి, పస్తులుంటున్నవారికి జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు అన్నింట్లోనూ ఇటీవలే ‘దీదీ కిచెన్’లను ఏర్పాటు చేసింది. గోలా పోలీస్స్టేషన్ కిచెన్లో వంటమనిషిగా పని దొరికింది గీతాదేవికి. గీత భర్త ఈశ్వర్ కుమార్ మహతో ఇంట్లోనే ఉంటున్నాడు. రోజువారీ కూలీ అతడు. గీతాదేవి ఏప్రిల్ 18 శనివారం పనిలోకి దిగబోతుంటే అనుమానంగా చూశారు దీదీ కిచెన్లోని వాళ్లు. ‘‘నువ్వు రానక్కర్లేదు వెళ్లు’’ అన్నారు. ‘‘మీ మరిది చత్తీస్గఢ్ నుంచి మీ ఇంటికి వచ్చి వెళ్లాడట కదా. అతడికి పాజిటివ్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకైనా మంచిది నిన్ను రానివ్వొద్దని అనుకుంటున్నారు’’ అని.. వాళ్లలో ఒకావిడ ముక్కుకు చెంగు అడ్డుపెట్టుకుని వచ్చి గీతాదేవికి చెప్పింది. గీతాదేవి నిర్ఘాంతపోయింది. ‘‘మా ఇంటికి ఎవరూ రాలేదు. ఒట్టు పెట్టి చెబుతున్నా. నమ్మండి. నన్ను పనిలోకి రానివ్వండి’’ అని బతిమాలింది. రానివ్వలేదు. మర్నాడు గీతాదేవి నీళ్ల కోసం మోటారు బావి దగ్గరకు వెళ్లింది. వాళ్లూ రానివ్వలేదు. ఖాళీ బిందెలతో ఇంటికి వెళ్లిపోయింది. చుక్క నీరు లేదు. మెతుకు ఉడికే దారి లేదు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నా ఏం చేయలేకపోయింది. కిరాణా వాళ్లు, కూరగాయల వాళ్లు, తెలిసినవాళ్లు ఎవరూ గీతాదేవిని చేరనివ్వడం లేదు. ఊళ్లోని చాలా కుటుంబాలకు ఈ లాక్డౌన్లో రేషన్ అందకపోతే గీతాదేవే చేదోడుగా ఉండి అందరికీ అన్నీ అందేలా చేసింది. ఆ సంగతి కూడా మర్చిపోయినట్లున్నారు. తనకు కరోనా లేదని ఎంత చెప్పినా ఊరు నమ్మక పోవడంతో గోలా వెళ్లి పరీక్ష చేయించుకుని వచ్చింది గీతాదేవి. రిపోర్ట్స్లో నెగటివ్. అయినప్పటికీ ముందు జాత్త్రగా పద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పారు వైద్య అధికారులు. అది ఊళ్లో వాళ్లకు తెలిసింది. ఇంట్లో ఉండటం కాదు, ఊళ్లోనే లేకుండా వెళ్లిపొమ్మని గీతాదేవి కుటుంబంపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్కి వెళితే.. ‘నువ్వింకా ఊళ్లోనే ఉన్నావా!’ అని అన్నారు కానీ, ఫిల్లింగ్ చేయలేదు. ఏడుపు ఆపుకుంది గీతాదేవి. గోలా పోలీస్ స్టేషన్కి వెళ్లింది. అక్కడిక ఏడుపు ఆపుకోలేకపోయింది. ఊళ్లోవాళ్లంతా తమ కుటుంబాన్ని వెలి వేసిన విషయం చెప్పింది. మర్నాడు సాయంత్రం గోలా పోలీస్స్టేషన్ ఇన్చార్జి ధనుంజయ్ కుమార్, కొంతమంది పోలీసులు ఊళ్లోకి వచ్చారు. గ్రామపెద్దల్ని పిలిపించి గీతాదేవికి కరోనా లేదని చెప్పారు. వదంతుల్ని నమ్మి ఆ కుటుంబాన్ని వేధిస్తే చర్య తీసుకుంటాం అని హెచ్చరించారు. గీతాదేవి నీళ్లు పట్టుకునేంత వరకు అక్కడే ఉండి వెళ్లారు. బిందెలన్నీ నింపుకుంది గీతాదేవి. అయితే అవి రెండు రోజులకే. గురువారం (ఏప్రిల్ 23) గ్రామస్థులు ఆమె ఇంటిని కట్టడి చేశారు. బయటికి రానివ్వలేదు. వస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. పోలీసులు వచ్చి వెళ్లాక కూడా ఊరు మారలేదు. గీతాదేవి పిల్లలు ఏడుస్తుంటే ఎవరో సెల్ఫోన్లో తీసి నెట్లో పెట్టారు. అది సీఎం వరకు వెళ్లింది. వదంతుల్ని నమ్మి ఒక కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెంటనే స్పందించారు. రామ్గర్ డిప్యూటీ కమిషనర్ సందీప్సింగ్ని విచారణకు ఆదేశించారు. ‘‘వదంతుల్ని పట్టించుకోకండి. అందరం కలిసి కట్టుగా ఉంటేనే కరోనాపై గానీ, వదంతులపై గానీ పోరాడగలం. మనుషులుగా మాత్రమే దూరంగా ఉండండి. మనసుల్లో దూరాలు పెరగనీయకండి’’ అని ట్వీట్ చేశారు. కమిషనర్ విచారణలో కూడా గీతాదేవికి కరోనా లేదని నిర్థారణ అయింది. ఎస్పీ ప్రభాత్ కుమార్, బీడీవో కుల్దీప్ కుమార్ విచారణలోనూ అదే తేలింది. అయినా గ్రామస్థులు నమ్మడంలేదు. తనకు కరోనా లేదని రుజువు చేయడానికి గీతాదేవి టెస్టులు చేయించుకుంటే.. కరోనా లేకపోతే ఎందుకు టెస్టులు చేయించుకుంటుంది అని గ్రామస్తులు ఇప్పటికీ ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు. -
రాష్ట్రానికి కొత్త లోగో.. సూచనలు కోరిన సీఎం
భారత 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆదివారం రోజున ఒక అధికారికి ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11 లోగా ప్రజలు తమవంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విలువైన సూచనలు, సలహాలు ‘jharkhandstatelogo@gmail.com’కు తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ సమావేశంలో ఈ కొత్త లోగో ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి కొత్త లోగోను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉండబోతోందని హేమంత్ సోరెన్ ప్రభుత్వం పేర్కొంది. (మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!) కాగా.. గతేడాది డిసెంబర్లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించి హేమంత్ సోరెన్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో జేఎంఎం 29 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. గతంలో అధికారంలో కొనసాగిన బీజేపీ 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రఘుబర్ దాస్ సైతం ఓటమి పాలయ్యారు. (సోరేన్ సర్కారుకు మద్దతు ఉపసంహరణ) -
సోరేన్ సర్కారుకు మద్దతు ఉపసంహరణ
రాంచి: జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు నెల రోజుల క్రితం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో చేరిన జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) కూటమి నుంచి బయటకు వచ్చింది. హేమంత్ సోరేన్కు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మారాండీ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఆయన లేఖ రాశారు. ‘మీ నేతృత్వంలోని (హేమంత్ సోరేన్) ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తూ మా పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా డిసెంబర్ 24, 2019న లేఖ ఇచ్చింది. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని జేవీఎంను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు దినపత్రికలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించామ’ని లేఖలో బాబులాల్ మారాండీ పేర్కొన్నారు. జేవీఎం ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, బంధు టిక్రీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్టు వార్తలు రావడంతో వీరిద్దరూ కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు రేగాయి. రాహుల్ గాంధీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్లను కూడా వారు కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం మూడు స్థానాల్లో గెలిచింది. ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఒక్కరు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు. కాగా, జేవీఎం మద్దతు ఉపసంహరించుకున్నా హేమంత్ సోరేన్ సర్కారు ఎటువంటి ముప్పులేదు. -
పీఎంతో నూతన సీఎం తొలిసారి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం.. ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇటీవల వెలువడిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సోరేన్కు తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా సోరెన్ రాష్ట్రంలోని పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిసింది. గిరిజన రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో మరోసారి సమావేశవుతానని తెలిపారు. -
చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దాదాపు మూడువేల మందిపైన ‘దేశ ద్రోహం’ నేరం కింద జార్ఖండ్లోని ధన్బాద్ పోలీసులు మంగళవారం కేసు పెట్టారు. వాటన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు మరుసటిరోజే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న హక్కుల గురించి రాసిన శిలా ఫలకాలను ఊరూరా ఏర్పాటు చేసినందుకు గత నవంబర్లో కూడా పదివేల మందిపై కుంతీ జిల్లా పోలీసులు ‘దేశ ద్రోహం’ నేరం కిందనే కేసులు పెట్టారు. వాటిని గత నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్ కేబినెట్ నిర్ణయం తర్వాత కొట్టివేశారు. ఇలా తప్పుడు కేసులు పెట్టడం తప్పంటూ ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించి వాటిని ఎత్తివేసినప్పటికీ జార్ఖండ్ పోలీసులు తమ వైఖరి మార్చుకోక పోవడం ఆశ్చర్యం. బ్రిటీష్ వలస పాలకుల కాలం నాటి మనస్తత్వం నుంచి ఇంకా బయట పడడం లేదు. ఈ మనస్తత్వం ఒక్క జార్ఞండ్కే పరిమితం కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, వాటిపై నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేసి దేశ ద్రోహం నేరం కింద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారంటూ కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం లేదు. 2014 నుంచి 2016 మధ్య దేశంలో కొన్ని వందల మంది మీద దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టగా వాటిలో రెండంటే రెండు కేసులు మాత్రమే నిలబడ్డాయి. మిగితా వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. ‘ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం ఎన్నటికీ కాదు. పైగా అది భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు’ అని 1962లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. 2016లో కూడా దేశ ద్రోహం కేసులు తన దృష్టికి వచ్చినప్పుడు ఈ తీర్పునే పునరుద్ఘాటించింది. ఇలాంటి తీర్పులన్నీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతున్నాయి. -
జార్ఖండ్లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం
-
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని అభినందనలు జార్ఖండ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంగా రెండోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్ పకడ్బందీ వ్యూహాలనే రచించారు. -
సీఎంగా సోరెన్ ప్రమాణం.. హేమాహేమీలు హాజరు
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు కమల్నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సోరెన్కు శుభాకాంక్షలు తెలిపారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. ఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. -
నేడు సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
-
నేడు సీఎంగా హేమంత్ ప్రమాణం
న్యూఢిల్లీ/రాంచీ: హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్లో నూతన ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్క మంత్రి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, (జేఎంఎం) దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ల్లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. దీని ప్రకారం జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కాంగ్రెస్కు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. లేదా మరో మంత్రి పదవి వరించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్లో ఆ పార్టీ సీనియర్ నేతలు అలాంగిర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యారని, మరొకరిని ఎంపిక చేయాల్సి ఉందన్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రులు కమల్నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), హాజరుకానున్నారు. -
సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే. -
ప్రమాణ స్వీకారానికి రండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు. -
29న సీఎంగా హేమంత్ ప్రమాణం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్(44) ఈ నెల 29వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం హేమంత్ సోరెన్, సంకీర్ణంలోని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తదితర పార్టీల నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా గవర్నర్ అంగీకరించారని, ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అనంతరం హేమంత్ సోరెన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ..ఈ చట్టం కారణంగా తమ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి నష్టం జరిగే అవకాశమున్నా అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ వర్కింగ్గా ఉన్న ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతోపాటు కూటమికి మద్దతు ప్రకటించిన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) చీఫ్ బాబూలాల్ మరాండీతో కూడా సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందే ఏర్పాటైన జేఎంఎం– కాంగ్రెస్– ఆర్జేడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభలోని 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. బీజేపీ క్షీణతకు నిదర్శనం జార్ఖండ్:పవార్ ముంబై: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతోందని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత, జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు శరద్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై హేమంత్ ట్విట్టర్లో స్పందిస్తూ..మహారాష్ట్రలో పవార్ సాగించిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. -
బెడిసికొట్టిన అమిత్ షా అయోధ్య వ్యూహం!
రాంచీ: దేశ వ్యాప్తంగా తమకు తిరుగులేదనుకుంటున్న బీజేపీకి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించిన షాక్ ఇచ్చాయి. అధికార బీజేపీ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొన్న జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశంలో ఒకవైపు ఎన్ఆర్సీ, మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కాషాయ దళానికి ఈ ఫలితాలు మింగుడుపడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా, హోంమంత్రి అమిత్ షా విజయం కోసం శక్తివంచనలేకుండా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మోదీ 12, అమిత్ షా 14 బహిరంగసభల్లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయవాదం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. (జేఎంఎం కూటమి జయకేతనం) పనిచేయని షా పాచికలు.. ఎన్ఆర్సీ, సీఏఏపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని సాక్షాత్తూ ప్రధాని బహిరంగ విమర్శలకు దిగారు. మరో అడుగు ముందుకు వేసిన అమిత్ షా.. అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిర నిర్మాణం నాలుగు నెలల్లో మొదలుకానుందని ప్రకటించారు. కానీ షా పాచికలు పారలేదు. జార్ఖండ్లోని పకూర్ ప్రాంతంలో డిసెంబర్ 17న జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మందిర ప్రస్తావన తెచ్చారు. రామ జన్మభూమి అంశం కేసు కోర్టుల్లోనే నలిగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించే ప్రయత్నం చేశారు. గడిచిన మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిరంపై ప్రచారం చేసుకుంటూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ, జార్ఖండ్ ఎన్నికల్లోనూ అదే అస్త్రం ప్రయోగించింది. కానీ మందిర నిర్మాణ అంశం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. స్థానిక సమస్యల పరిష్కారంగా భావించిన ఓటర్లు.. అయోధ్య అంశాన్ని సీరియస్గా తీసుకోలేదు. అలాగే మోదీ, షా ప్రచారం చేసిన జాతీయ అంశాలనూ జార్ఖండ్ ప్రజలు ఏమాత్రం దరిచేరనీయలేదు. (సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!) ఫలించిన పవార్ వ్యూహం.. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అనుసరించిన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసిన హేమంత్ సొరెన్ ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. జాతీయ అంశాల జోలికి పోకుండా కేవలం స్థానిక సమస్యలు, గిరిజనుల అభివృద్దే ధ్యేయంగా కాగ్రెస్-జేఎంఎం ప్రచారం సాగింది. అలాగే జార్ఖండ్లో గడిచిన ఏడాది కాలంలో జరిగిన 20కి పైగా మూకదాడులు అల్పసంఖ్యాక వర్గాల్లో భయాందోళన రేపాయి. ముస్లింలపై దాడులు భారతీయ జనతా పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే ముఖ్యమంత్రి రఘుబర్దాస్ వ్యవహార శైలి కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు బీజేపీ ఓటమికి ఒక కారణంగా నేతలు వర్ణిస్తున్నారు. గిరిజన జనభా ఎక్కువగా గల జార్ఖండ్లో ఓబీసీకి చెందిన రఘుబర్ను ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు అంటే వ్యతిరేకత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అధికార బీజేపీకి జార్ఖండ్ ఫలితాలు భారీ ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.(జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం) -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
27న సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం