irrigation projects
-
ప్రాజెక్టుల నిర్మాణం.. ‘సాగు’దీతే
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగ చేసే.. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బడ్జెట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు.. కనీసం వాటినైనా గడువులోగా పూర్తి చేయడానికి సరిపడా నిధులను బడ్జెట్లో ఇవ్వకపోవడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.877.60 కోట్లు) కేటాయించారు. ఇందులో రూ.15,576 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులకు (కేపిటల్ వ్యయం) ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన రూ.5,756.82 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా, 2024–25 బడ్జెట్లో ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.15,483.35 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.1,221.97 కోట్లు) కేటాయించారు. అయితే, సవరించిన బడ్జెట్లో రూ.5,906.76 కోట్లు కోత పెట్టి రూ.10,798.56 కోట్లు కేటాయించినట్లు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే.. గత బడ్జెట్ నిధుల్లో 35.36 శాతం కోత విధించినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం కేటాయించిన నిధులను కూడా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట..» ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. తొలి దశలో పోలవరం, హంద్రీ–నీవా, వెలిగొండ, చింతలపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గోదా వరి–పెన్నా తొలి దశను చేపడతామంది. చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి–పెన్నా తొలి దశను 2026, జూన్ నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్కు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో గత ప్రభుత్వమే పోలవరాన్ని కొలిక్కితెచ్చింది. వెలిగొండ తొలి దశ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం దాదాపుగా పూర్తి చేసింది.» రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒకటో టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను గత సెప్టెంబరు–అక్టోబరు నాటికే తరలించే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు పనులకు గత బడ్జెట్లో 393.49 కోట్లను కేటాయించిన సర్కార్.. అందులో కోత వేసి రూ.300.52 కోట్లతో సరిపెట్టింది. కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేయలేదు. తాజాగా 309.13 కోట్లు కేటాయించింది. తొలి దశ పూర్తి కావాలంటే రూ.1,458 కోట్లు, రెండో దశకు రూ.2,180 కోట్లు అవసరం. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదు.» ఒడిశాతో వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార స్టేజ్–2లో అంతర్భాగమైన హిర మండలం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేలా వంశధార ఎత్తిపోతలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తయితే వంశధార ఆయకట్టు రైతులకు పూర్తి ఫలాలను అందించవచ్చు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.» చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి రూ.2043.38 కోట్లు అవసరం. 2026 జూన్ నాటికి నీళ్లందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత బడ్జెట్లో ఈ ఎత్తిపోతలకు రూ.150 కోట్లు చూపినా చివరకు రూ.3.08 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. ఆ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందన్నది సర్కారుకే తెలియాలి.» 2026 జూన్ టార్గెట్గా పెట్టుకున్న గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి కావాలంటే రూ.5,372.31 కోట్లు అవసరం. గత బడ్జెట్లో పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో ఎలా పూర్తవుతుందన్నది ప్రభుత్వమే చెప్పాలి.» హంద్రీ–నీవా సుజల స్రవంతిలో డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి 2026 జూన్కు నీళ్లందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులను.. 3,850 క్యూసెక్కులకు కుదించింది. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూర్ బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా వెనక్కుతగ్గకుండా పూర్తి చేసేందుకే మొగ్గుచూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు నిధులు కేటాయించని నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమే.» ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకే నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మిగతావాటికి కేటాయింపు, విడుదల ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.» కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించడానికి వీలుగా కాలువల మరమ్మతులు, డ్రెయిన్లలో పూడికతీత పనులకు అవసరమైన మేరకు నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.» పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా కాకుండా.. 41.15 మీటర్ల ఎత్తు వరకే 119.40 టీఎంసీలు నిల్వ చేసేలా 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లు ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు కేంద్రం గత, ప్రస్తుత బడ్జెట్లలో నిధులిచ్చింది. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీళ్లందించే అవకాశం ఉంటుంది. -
యాసంగిలో 42.48 లక్షల ఎకరాల ఆయకట్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కళంగా ఉండడంతో యాసంగి సీజన్లో సిరుల పంట పండనుంది. 2024–25 యాసంగి సీజన్లో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు, ఎత్తిపోతల కింద ఏకంగా 42,48,780 ఎకరాల ఆయకట్టుకు మొత్తం 354.88 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖలోని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందులో 24,54,429 ఎకరాల తడి (వెట్), 17,94,351 ఎకరాల పొడి (డ్రై/మెట్ట) పంటలున్నాయి. వర్షాభావంతో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక గతేడాది యాసంగిలో కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్తో పాటు కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద పంటల విరామం ప్రకటించాల్సి వచ్చింది. అప్పట్లో 28.95 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్కివం కమిటీ ప్రతిపాదించింది. మొత్తం మీద గత మూడేళ్లతో పోల్చితే 2024–25 యాసంగిలో ప్రాజెక్టుల కింద గణనీయంగా సాగు విస్తీర్ణం పెరగనుంది. ఎస్సారెస్పీ స్టేజీ–1,2 కింద 11.36లక్షల ఎకరాలకు నీళ్లు ఎస్సారెస్పీ స్టేజీ–1 కింద 4,40,903 ఎకరాల తడి, 3,58,569 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 7,99,472 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. స్టేజీ–2 కింద 2,59,230 ఎకరాల తడి, 77,400 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 3,36,630 ఎకరాల ఆయకట్టును కమిటీ ప్రతిపాదించింది. ఇక నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉండగా, సాగర్ ఎడమ కాల్వ కింద 6,38,385 ఎకరాలను కమిటీ ప్రతిపాదించింది. ఇందులో 4,75,890 ఎకరాల తడి, 475890 ఎకరాల పొడి పంటలున్నాయి. కాళేశ్వరం కింద 93 వేల ఎకరాలకు నీళ్లు!కాళేశ్వరం ప్రాజెక్టు కింద 93 వేల ఎకరాల ఆయకట్టును స్కివం కమిటీ ప్రతిపాదించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీళ్లను నిల్వ చేయడం లేదు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగుకు 34.86 టీఎంసీల జలాలు లభ్యతగా ఉన్నాయని స్కివం కమిటీ అంచనా వేసింది. మల్లన్నసాగర్, కొండపొచమ్మసాగర్ తదితర జలాశయాల్లో ఉన్న నిల్వలకు తోడు గా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయనున్న నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కేటాయింపులకు నీళ్లొదిలారు
సాక్షి, అమరావతి: భారీ నీటిపారుదల శాఖలో పోలవరం మినహాయిస్తే ఇతర ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ.4,873 కోట్లు కేటాయించింది. వంశధార స్టేజ్–2, చింతలపూడి ఎత్తిపోతలు, వెలిగొండ, హంద్రీ–నీవాకు అరకొరగా నిధులే విదిల్చింది. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2024–25 బడ్జెట్లో భారీ నీటిపారుదల రంగానికి (మేజర్ ఇరిగేషన్) రూ.15,483.35 కోట్లు, చిన్న నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్) రంగానికి రూ.1,221.97 కోట్లు కలిపి మొత్తంగా జలవనరుల శాఖకు ప్రభుత్వం రూ.16,705.32 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పోలవరానికి రూ.2,807.68 కోట్లిచ్చిన కేంద్రంపోలవరం ప్రాజెక్టుకు 2024–25లో రూ.7,218.68 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రూ.4,841.93 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ.. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపి రూ.4,873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం ఇప్పటికే అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు, రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.68 కోట్లు వెరసి మొత్తం రూ.2,807.68 కోట్లను అక్టోబర్ 9న విడుదల చేసింది. ఇందులో 75 శాతం ఖర్చు చేసి, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపితేనే నిధులు విడుదల చేస్తామని షరతు విధించింది. వీటికి అరకొర కేటాయింపులే⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువకు లైనింగ్ పనులకు రూ.2,516 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.867.75 కోట్లను కేటాయించింది. ⇒ జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలంటే రూ.3,782 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదలు పంపారు. ప్రభుత్వం రూ.150 కోట్లనే కేటాయించింది.⇒ గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి చేసి.. సాగర్ కుడి కాలువ ఆయకట్టును స్థిరీకరించాలంటే రూ.4,966.09 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ⇒ వెలిగొండ తొలి దశ పనులకు రూ.1,458 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. రూ.393.49 కోట్లు కేటాయించింది. ⇒ వంశధార స్టేజ్–2లో మిగిలిన పనుల పూర్తికి రూ.134.32 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో రూ.92.12 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.63.50 కోట్లు కేటాయించడం గమనార్హం.ఉత్తరాంధ్ర, సీమకు తీవ్ర అన్యాయంవెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. పోలవరం ఎడమ కాలువను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకముందే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలను తెస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. దీనికి కేవలం రూ.63 కోట్లే కేటాయించారు. ఇక రాయలసీమలో తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోపాటు తెలుగుగంగ, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
12 ప్రాజెక్టుల పేర్ల మార్పు
సాక్షి, అమరావతి: ఏపీలో 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. గోదావరి, కృష్ణా జలాలతో పల్నాడును సుభిక్షం చేయడానికి గత ప్రభుత్వం వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం (వైఎస్సార్పీ డీఎంపీ) కింద గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలను చేపట్టింది. ఇప్పుడు వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం పేరును రద్దు చేసి ..గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలుగా ఆ ప్రాజెక్టు పేరును మార్పు చేసింది.వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పేరును ముక్త్యాల ఎత్తిపోతలుగా, వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరును వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, నర్రెడ్డి శివరామరెడ్డి రిజర్వాయర్ పేరును సర్వారాయసాగర్గా, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజీ పేరును నెల్లూరు బ్యారేజీగా, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ పేరును సంగం బ్యారేజీగా మార్చింది.గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయర్ పేరును తాటిపూడి రిజర్వాయర్గా, అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరును హంద్రీ–నీవా సుజల స్రవంతిగా, వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పేరును పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా మార్చింది. బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును మొగలిగుండాల మినీ రిజర్వాయర్గా, రాకెట్ల నారాయణరెడ్డి ఎత్తిపోతల పేరును రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోతలుగా మార్చింది. -
భారీ వరదతో పెరుగుతున్న మిడ్ మానేరు నీటి మట్టం
-
ఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలపై ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు నిధులు ఖర్చుపెట్టి మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయ -
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
-
సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..
లక్ష్యాన్ని సాధించలేని వారే సాకులు వెతుక్కుంటారు. కార్యసాధకులకు సాకులు అడ్డురావు. అవకాశాలను అన్వేషించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ఇందులో మొదటి తరహా వ్యక్తి చంద్రబాబు అయితే రెండో తరహా నేత సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేశానని గొప్పలు చెప్పుకుంటూ.. తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ఐదేళ్ల పాలనలో మూడేళ్లలోనే ఆరుప్రాజెక్టులు పూర్తి చేసి, మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన జల రుషి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి. చంద్రబాబు పాలనంతా కరవు మయం. ఏటా కరవు మండలాల ప్రకటన. ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు రెండేళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమేపరమావధి అనుకున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఉరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్కు మాత్రమే దక్కుతుంది. - ఆలమూరు రాంగోపాల్రెడ్డి, సాక్షి, అమరావతి:సాక్షి, అమరావతి: రాష్ట్ర సాగునీటిరంగంలో నవచరిత్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఖించారు. కరోనా మహమ్మారి ప్రభావం.. లాక్ డౌన్ల దెబ్బతో దాదాపు రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. కేవలం మూడేళ్లలోనే ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా.. బ్రహ్మంసాగర్ మట్టికట్టలకు డయాఫ్రమ్ వాల్ వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం 6 రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. చరిత్రలో మహోజ్వల ఘట్టం వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా చేపట్టి, పూర్తి చేస్తున్నారు. 2019, మే 30 నుంచి ఇప్పటి వరకూ పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.35,268.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులపై పెట్టిన ప్రతి పైసాను సది్వనియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. రైతులకు అందించారు. పెన్నా డెల్టా సుభిక్షం జల యజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్ రూ.216.88 కోట్లు వెచ్చిచి పూర్తి చేసి.. 2022, సెపె్టంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి ప్రారంభించిన బ్యారేజ్ల పనులను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడాన్ని సాగునీటిరంగ చరిత్రలో మహోజ్వలఘట్టంగా అధికారవర్గాలు అభివరి్ణస్తున్నాయి. పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ రెండు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.580 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల 2019 వరకూ కేవలం నాలుగైదు టీఎంసీల నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ నిర్మించి.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు.రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ. పనులను పూర్తి చేసి.. రెండు సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్ చానల్, నల్లమలసాగర్ పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. బాబు జమానా అవినీతి ఖజానా కడలిపాలవుతోన్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే సారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో(పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి) మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని 2014, జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293.94 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం మినహా మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే రూ.24,465.12 కోట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే.. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల రంగ చరిత్రలో రికార్డు కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. జగన్ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. కోటి ఎకరాలకు జలధారలు విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా కోటి ఎకరాలకు జగన్ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేశారు.రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు సాధించి రాష్ట్రాన్ని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం వైఎస్ జగన్ నిలిపారు. వాతావరణ మార్పుల వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజుల్లో దానిపై ఆధారపడ్డ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శరవేగంగా పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి.. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021, జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవునా మళ్లించారు. చంద్రబాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై కేంద్ర జలసంఘం స్పష్టత ఇచ్చాక.. ఆ పనులు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించి.. జాతికి అంకితం చేయనున్నారు.గండికోటలోకి బిరబిరా కృష్ణమ్మ గాలేరు–నగరిలో అంతర్భాగంగా అవుకు వద్ద రెండు సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. రెండు సొరంగాలను రూ.567.94 కోట్లతో పూర్తి చేసి.. నవంబర్ 30, 2023న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవుకు వద్ద మూడో సొరంగం పనులను చేపట్టారు. ఈ పనులకు ఇప్పటికే రూ.934 కోట్లు ఖర్చు చేశారు. మూడో సొరంగమూ దాదాపు పూర్తయింది. దాంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించి.. గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు..: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.560.29 కోట్లతో సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి, ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి, 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే.. జగన్ పూర్తి చేయడం అబ్బురం...అపూర్వం.వలసలకు అడ్డుకట్ట హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా పది వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని రూ.224.31 కోట్లు వెచ్చిచి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు. కోనసీమలా రెండు పంటలు బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల గతంలో ఎన్నడూ మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసిన దాఖాలాలు లేవు. తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. బ్రహ్మంసాగర్ ఉన్నా ఏం ప్రయోజనం లేదని బాధపడేవాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్ లీకేజీలకు డయాఫ్రమ్ వాల్ వేసి అడ్డుకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు 17.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. దాంతో కోనసీమ తరహాలో ఆయకట్టులో రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ఫలాలు నిజంగా రైతులకు అందుతున్నది ఇప్పుడే. – పోచంరెడ్డి రఘురాంరెడ్డి, సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమఠం మండలం, వైఎస్సార్ జిల్లా. సంగం బ్యారేజ్తో కష్టాలు తీరాయి బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలమవడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు 2004లో మహానేత వైఎస్ నాడు సంగం బ్యారేజ్ పనులు చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా సాగాయి. మహానేత వైఎస్ మరణించాక బ్యారేజ్ పనులు పడకేశాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనులు పూర్తి చేసి సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. దాంతో నాకున్న 13 ఎకరాలతోపాటు 40 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. – మల్లవరం రామకృష్ణ, పడుగుపాడు, కోవూరు మండలం -
ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపించలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయవివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటిలాగే విషంకక్కారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగునపరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్రవారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మడ్డువలస విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామలంగా మారాయి. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది. అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. మహేంద్రతనయ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీతమైన జాప్యంతో ఆ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. జంఝావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచేయడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. తారకరామతీర్థ సాగర్ ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయనగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసేకరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.56.56 కోట్లను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. తోటపల్లి ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చారు. ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామోదాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
మీలా ఆత్రుత పడం.. తప్పులు చేయం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్ను ఆర్సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే.. కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అంచనాలు పెంచి అవినీతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ల అంచనాలు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్సాగర్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
CWC సూచనల ప్రకారమే ప్రాజెక్ట్లు కట్టాం: హరీష్
-
Fact Check: గొప్పగా చేసినా.. ‘పచ్చ’ రాతలేనా?
పాలన సవ్యంగా సాగిపోతుంటే పాపం రామోజీకి నిద్రపట్టడం లేదు. పథకాలు సక్రమంగా అమలవుతుంటే ఆయన విష‘పత్రిక’కు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ప్రజాభిమానం రోజురోజుకూ పెరిగిపోతుంటే సహించడం లేదు. క్రమ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఆ ‘పచ్చ’కళ్లకు కనిపించడం లేదు. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయి... తప్పుడు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టించి... వికృతానందం పొందాలని తెగ తాపత్రయపడుతున్నారు. ‘బాబు’ కళ్లలో ఆనందం చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తున్నా... జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే ప్రాజెక్టులపైనా లేనిపోని ఆరోపణలు చేసి ఓ కథనాన్ని వండివార్చేశారు. కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టింది ఈ ప్రభుత్వంలోనే అన్నదిప్రజలందరికీ అర్థమవుతున్నా... పాపం ఈనాడుకే ఎందుకో తెలియడం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే ‘ఈనాడు’ రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. రైతుల్లో సీఎం వైఎస్ జగన్కు మద్దతు రోజురోజుకూ పెరుగుతుండటం.. అది చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూండటంతో పచ్చబ్యాచ్ ఆందోళన చెందుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుంఖానుపుంఖాలుగా సీఎం వైఎస్ జగన్పై విషపు రాతలకు తెగబడుతున్నారు. అ కోవలోనే ప్రాజెక్టులపై అబద్ధాలను అచ్చేసింది. గడచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి, జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ♦ తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఏటా కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. ♦ చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి.. ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసి తులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, స్పిల్ చానల్, స్పిల్ వేను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించారు. ♦ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి.. ప్రధాన డ్యామ్ను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ♦ 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకోసం వెచ్చించినది రూ.32,161.49కోట్లు ♦ సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు నాడు బాబు నిర్లక్ష్యంపై ప్రశ్నించలేదెందుకు? 2014 జూలై 28వ తేదీన టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని ప్రకటించారు. 2014, జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.68,293.95 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. ఆస్థాన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తికి పోలవరం పనులే తార్కాణం. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికే చంద్రబాబు ప్రతి సోమవారాన్ని సమీక్షల పేరుతో పోల‘వరం’గా మార్చుకున్నారని అప్పటి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలవరంలో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. చంద్రబాబు దోపిడీలో రామోజీ కి వాటా ఉండటం వల్లే అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులో సాగిన దోపిడీపై ఒక్క అక్షరమైనా ఈనాడులో అచ్చేయ లేదన్నది బహిరంగ రహస్యం. -
తెలంగాణ ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్పై విచారణ వాయిదా -
రెండేళ్లలో పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంబేడ్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చర్చ జరుగుతోంది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి... అక్కడి నుంచి కాల్వలు, సొరంగాలు, లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నీళ్లను ఎత్తిపోసే అంశాన్ని కొత్త ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పోల్చితే తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోయడానికి నిర్వహణ వ్యయం తక్కువ కానుంది. ఈ నేపథ్యంలో వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం పక్కనబెట్టనుందని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి డి.శ్రీధర్బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేసింది. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడాన్ని కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా ఎంచుకొనే అవకాశం ఉంది. వార్ధా, చెన్నూరు లిఫ్ట్ బదులు తుమ్మిడిహట్టి... గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద గతంలో ప్రతిపాదించిన బ్యారేజీకి బదులుగా.. వార్ధా బ్యారేజీని నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు సరఫరా చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీపీఆర్ను సైతం సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యాక్వాటర్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీటి సరఫరా చేసేందుకు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సైతం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే చెన్నూరుకు గ్రావిటీతోనే సాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉండగా గత ప్రభుత్వం అనవసరంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని అప్పట్లో పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు ఆరోపించారు. వేచిచూస్తున్న కాంట్రాక్టర్లు.. బిల్లులు వస్తాయనే భరోసా లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎత్తిపోతల పథకాల పనుల కొనసాగింపుపై కాంట్రాక్టర్లు సైతం పునరాలోచనలో పడ్డారు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూసే ధోరణిలో కాంట్రాక్టర్లు ఉన్నారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ప్రభు త్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర, నాగమడుగు వంటి ఎత్తిపోతల పథకాల పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు బయటపడటంతో వాటిపై ఆధారపడి నిర్మిస్తున్న ఈ మూడు ఎత్తిపోతల పథకాలను కొనసాగిస్తారా లేదా? అనే అంశంపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూడాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది. భూసేకరణకు సంబంధించిన న్యాయ చిక్కులతో కొంతకాలం కిందే సంగమేశ్వర ఎత్తిపోతల పనులు ఆగిపోగా బసవేశ్వర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నాబార్డు నుంచి సంగమేశ్వర కోసం రూ. 2,392 కోట్లు, బసవేశ్వర కోసం రూ. 1,774 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు మంజూరు కాలేదు. -
ప్రాజెక్టులపై రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, లిఫ్టులు, వందల కిలోమీటర్ల కాలువలు అని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దని, వాటిని బదనాం చేసి తెలంగాణకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బ్యారేజీల్లో సమస్యలు అత్యంత సాధారణమన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్మాణం తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పవర్ హౌస్ పంపులు కూడా నీట మునిగాయని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, రంగాల వారీగా రాష్ట్రం పురోగమించిన తీరుపై గురువారం హైదరాబాద్లో ఆయన గణాంకాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిండుకుండల్లా 46 వేల చెరువులు ‘మిషన్ భగీరథ ద్వారా రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి 58 లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. దీని స్ఫూర్తితో కేంద్రం ‘హర్ ఘర్ జల్’పథకాన్ని ప్రారంభించింది. దీనితో పాటు అనేక తెలంగాణ పథకాలు కేంద్రం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన 46 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. సాగునీటితో సంపదను సృష్టించాం. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలపగా, జీఎస్డీపీ అత్యంత వేగంగా పెరిగింది. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది. పేదరికాన్ని తగ్గించిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. తండాలు గ్రామ పంచాయతీలుగా మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటివి కేసీఆర్ పాలనలోనే జరిగాయి..’అని కేటీఆర్ తెలిపారు. ధరణితో పారదర్శకంగా రిజిస్ట్రే షన్లు ‘భూ యజమానుల వేలి ముద్రకు అధికారమిచ్చి ‘ధరణి’ద్వారా పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా చూస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం, గ్రీన్ కవర్ 7.7శాతానికి పెంపు, హరిత నిధి ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చాం. మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, వేయి గురుకుల పాఠశాలల ఏర్పాటు, 32 కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటివి మా ప్రభుత్వం సాధించిన విజయాలు. గ్రేటర్లో మెట్రో రైలు వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)కింద రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ జామ్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు వ్యవస్థను అభివృద్ధి చేశాం. మరో 450 కిలోమీటర్ల మేరకు దీన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతోంది. భవిష్యత్తులో ప్రతిరోజు నీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నాం. మురుగునీటి పారుదల శుద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మునిసిపాలిటీలో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం..’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలోని దుర్మార్గ ప్రభుత్వం తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తోందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ప్రజలకు కరెంటు ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
రామోజీ.. వంచనలు మీ బాబు పేటెంట్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నేతృత్వంలోని గజదొంగల ముఠాలో సభ్యుడైన రామోజీరావుకు ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతిదీ తప్పుగానే కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం ఏం చేసినా అందులో కోడిగుడ్డుపై ఈకలు పీకడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత చంద్రబాబు పాలనలో సాగు నీటి రంగం కుదేలైనప్పటికీ మారుమాట్లాడని ఈ పెద్దమనిషి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ‘నిర్మించకుండా వంచన.. అడ్డగోలుగా అంచనా’ అంటూ మంగళవారం మరోమారు విషం కక్కారు. ఎందుకంటే.. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో..) పద్ధతిలో ప్రభుత్వ ఖజానాను అప్పట్లో దోచుకున్నారు కాబట్టి. ఇప్పుడూ చంద్రబాబు హయాంలో సాగినట్లు సాగుతోందని భ్రమపడి వాస్తవాలను వక్రీకరించారు. ఈ దుష్ప్రచార కథనంలో ఆరోపణలు.. వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. సవరించిన అంచనాలతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సాగు, తాగునీటి సౌకర్యం మృగ్యం. వాస్తవం: సాగునీటి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాధాన్యతా క్రమంలో వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. గతేడాది నెల్లూరు, సంగం బ్యారేజ్లను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 68 చెరువులను నింపే పథకం పూర్తి చేశారు. వెలిగొండ మొదటి సొరంగం ఇప్పటికే పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తి కావస్తోంది. వెలిగొండ తొలి దశ దాదాపుగా పూర్తయింది. వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 కూడా పూర్తి కావస్తోంది. పోలవరం, తోటపల్లి బ్యారేజ్, తారకరామతీర్థసాగరం నుంచి హంద్రీ–నీవా వరకు అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.28 వేల కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014 జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు చంద్రబాబు రూ.68,293.34 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. దీన్ని బట్టి చూస్తే అడ్డగోలుగా అంచనాలు పెంచింది.. పనులు చేయకుండా వంచించింది.. బిల్లులు కాజేసింది చంద్రబాబేనన్నది నిజం కాదా రామోజీ? ఆరోపణ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంచనా వ్యయం 2019లో రూ.2022.20 కోట్లు ఉంటే ఇప్పడు రూ.18,271.31 కోట్లకు.. వెలిగొండ ప్రాజెక్టు అంచనా రూ.5,564.22 కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 8,054.30 కోట్లకు ఇలా ప్రాజెక్టుల అంచనా వ్య యాన్ని రూ.24,827.23 కోట్లకు పెంచేశారు. నిర్మాణాలు చేపట్టడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల అంచనాను రూ.4,909 నుంచి రూ.9,543 కోట్ల కు పెంచుతూ ప్రతిపాదనలు పంపారు. వాస్తవం: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో రూ.7,214.10 కోట్లతో 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ పథకంలో తొలి దశ కింద 5.8 టీఎంసీలను తరలించే పనులను రూ.2022.20 కోట్లతో 2018లో చంద్రబాబు చేపట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 63.2 టీఎంసీలను తరలించి.. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూ.17,050.20 కోట్లతో పనులు చేపట్టడానికి 2022 జూన్ 17న అనుమతి ఇచ్చింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ వ్యయం, నిర్వాసితుల పునరావాస వ్యయం, 2019 నాటితో పోల్చితే పనుల పరిమాణం పెరిగింది. దీని వల్లే అంచనా వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డిజైన్లను ఇప్పటికే జల వనరుల శాఖ ఆమోదించింది. భూ సేకరణ చేస్తూ వడివడిగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టును 2016, 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తానంటూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాటలు మార్చుతూ వచ్చారు. సొరంగాల తవ్వకంలో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం)లకు మరమ్మతుల పేరుతో రూ.66 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. వాటిని మింగేశారు. రెండు సొరంగాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. అస్మదీయులకు అప్పగించిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప పనులు చేయలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండను ప్రాధాన్యతగా చేపట్టి.. 2021 జనవరి 13 నాటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేశారు. రెండో సొరంగం దాదాపుగా పూర్తికావొచ్చింది. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు భూసేకరణ చేయాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టాల్సి ఉంది. అందువల్లే వాటి అంచనా వ్యయం పెరిగింది. చింతలపూడి ఎత్తిపోతలను 53.5 టీఎంసీల మేరకు చేపట్టినా జల్లేరు రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీలకే అప్పట్లో పరిమితం చేశారు. ఇప్పుడు ఆ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు పెంచారు. దీని వల్ల అదనంగా భూసేకరణతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అందువల్లే దాని అంచనా వ్యయం పెరిగింది. ఇంత చిన్న విషయం మీకు తెలియదా రామోజీ? రాష్ట్ర విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టులను కమీషన్లు కురిపించే కామధేనువుగా మల్చుకున్నారు. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆపై అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు ఇదే లక్ష్యంగా సాగిన పాలనపై పల్లెత్తు పదం రాయని రామోజీ.. ఉల్టా చోర్ కొత్వాల్ కా డాంటే అన్నట్లు.. అంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఇప్పుడు రోత రాతలు రాస్తున్నారు. నిజంగా ఈ సామెత నాడు దోపిడీలో భాగస్వామియైన ‘ఈనాడు’ రామోజీకి అతికినట్లు సరిపోతుంది. అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ ♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ 2013–14 ధరలతోనే పూర్తి చేస్తానని అంగీకరిస్తూ 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని 2015–16 ధరలను వర్తింపజేస్తూ రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. ఇదీ వంచన అంటే. అడ్డగోలుగా అంచనాల పెంపు అంటే ఇదీ రామోజీ! అందులో రూ.2,917.78 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తన కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు చంద్రబాబు కట్టబెట్టడంతో అప్పట్లో మీరు నోరుమెదపలేదన్నది వాస్తవం కాదా రామోజీ? ♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మిగిలింది. ఆ కాంట్రా క్టర్పై 60–సీ నిబంధన కింద వేటు వేసి, అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్కు అప్పగించింది ఎవరు? ప్రభుత్వ ఖజానా నుంచి రూ.వంద కోట్లకుపైగా దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నది చంద్రబాబు కాదా? దీనిని వంచన, దోపిడీ అనక ఇంకేమంటారు రామోజీ? -
ఎలాంటి సింహమో ప్రజలు తేలుస్తారు..
పులివెందుల : మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్దే. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు. అలాగే, గండికోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 27టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా. తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్ద మనిషి చంద్రబాబు. డ్రిప్లో రూ.వెయ్యి కోట్ల బకాయి పెట్టి అబద్ధాలా.. డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి చంద్రబాబు హయాంలో ఆయా కంపెనీలకు రూ.1,000 కోట్ల బకాయిలు పెట్టడంతో స్కీం నిర్విర్యమైపోయింది. జగనన్న సీఎం అయ్యాక వాటిని చెల్లించి గత ఏడాది పునఃప్రారంభించారు. పంటల బీమా విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండు రెట్లకు పైగా జగన్ ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ జిల్లాలో 2012కు సంబంధించిన శనగపంట బీమా 2014–19 వరకు పెండింగ్లో ఉండేది.. జగనన్న వచ్చాక తొలి ఏడాదిలోనే రూ.112కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. పైడిపాలెం వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్.. పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయన హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. దానిని కూడా బాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. కడప ఎయిర్పోర్ట్ రన్వే కోసం రూ.75కోట్లు జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు రన్వే విస్తరణ జరిగి పెద్ద ఫ్లైట్లు వస్తున్నాయంటే అది జగన్ చలవే. అలాగే, కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. ఇక జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ చంద్రబాబుకు కనిపించడంలేదు. మరోవైపు.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తన సోదరి, చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థలోని ఒక పెద్ద మనిషి కలిసి రెండున్నరేళ్లుగా పన్నాగం పన్నారు. వారి అంతిమ లక్ష్యం వైఎస్సార్సీపీని, జగన్ను ఇబ్బంది పెట్టడమే. వివేకా కేసులో వాస్తవాలను పక్కన పడేసి రాజకీయ కోణంలో ముందుకు తీసుకువెళుతున్నారు. క్షమాపణ చెప్పి మాట్లాడాలి ఇక తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మం సాగర్కు నీరు రావాలంటే కావాల్సిన కాలువ రిపేర్లు చేయాలని అనేకసార్లు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్ చేయించారు. ముందు ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పి మాట్లాడాలి. -
‘చంద్రబాబూ.. ఒక్క ఎకరాకైనా నీరిచ్చావా?’
ఢిల్లీ: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పులివెందుల మీటింగ్లో తనపై చేసిన విమర్శలకు ఢిల్లీ వేదికగా ఘాటుగా స్పందించారాయన. తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని.. ఆ మాటకొస్తే పొలవరాన్ని అనుకున్న టైంకి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చంద్రబాబును నిలదీశారాయన. ‘‘చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం 2018కల్లా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు ?. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు?. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు ?. రాయల సీమలో ఒక్క ప్రాజెక్టు కు అయినా బాబు శంకుస్థాపన చేశారా ? అని నిలదీశారాయన. బ్రో సినిమాలో నన్ను గిల్లారు బ్రో చచ్చిన సినిమా. అయినా బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి?. బ్రో సినిమాలో నన్ను పొలి ఉన్న క్యారెక్టర్ చూపించి నన్ను గిల్లారు. నా పేరు తో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు అందుకే నేనీ సినిమా గురించి మాట్లాడుతున్నా. బ్రో సినిమాకి పవన్ నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?. నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు. వాళ్ల చలవవల్లే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు అయినా నీరిచ్చావా?.. ఇవ్వలేదు అంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు. ఆ 14 ఏళ్లు ఏం చేయలేనివాళ్లు.. ఇప్పుడేం చేస్తారు. రాయలసీమ ప్రాజెక్టులు దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ చలవ వల్లే పూర్తయ్యాయి. ఢిల్లీ పర్యటన సారాంశం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశా. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేశాం అని అంబటి మీడియాకు వివరించారు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
ఆ జిల్లాలు పచ్చబడటం మీకు ఇష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివక్షా పూరితంగా ఉందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్య శ్యామలం చేసేందుకు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ఈ జిల్లాలు పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇంకా అదే ధోరణితో వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి రాసిన బహిరంగ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిపై తీవ్ర నిరాశతో ఈ లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం ‘తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, నారా యణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాని పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుంది. తెలంగాణ రాకముందు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు కరువు కాటకాలతో తల్లడిల్లేవి. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్నగర్ జిల్లా వలసల పాలయింది. అయితే మిషన్ భగీరథతో నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాం. కానీ కేంద్రం అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోంది. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ను పెడచెవిన పెట్టింది. పాలమూరు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్రం, పాలమూరు రంగారెడ్డికి మొండిచేయి చూపించడం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం..’ అని కేటీఆర్ ఆ లేఖలో ధ్వజమెత్తారు. నీటివాటా తేల్చలేదు.. ‘కృష్ణా జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్రం తాత్సారం చేస్తోంది. నీటి వినియోగ అంశం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేశారు. కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ను పట్టించుకోకుండా, కనీసం ట్రిబ్యునల్కి పంపకుండా 9 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు. -
మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో?
మంగపేట: మండల పరిధిలోని నర్సింహాసాగర్ వద్ద మల్లూరువాగుపై నిర్మించిన మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టు మరమ్మతు పనులు ఇంకెప్పుడు చేస్తారని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అధికారులను, పాలకులను ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్పా శ్రద్ధ చూపడం లేదని మండిపడుతున్నారు. 26 అడుగుల నీటిమట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాల్వ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందాల్సి ఉంది. 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకపోవడం ప్రాజెక్టు అభివృద్ధిపై పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో నిరాదరణకు గురైంది. 2007లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరు అయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కాజేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుడి ఎడమ కాల్వల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిని మరిచి సంబురాలు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప్రాజెక్టు అభివృద్ధిని మరిచి సంబురాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. 2015లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధికి, కుడి, ఎడమ కాల్వలు, తూముల నిర్మాణం ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా అతీగత లేదు. ఇప్పుడేమో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చెరువుల పండుగలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని ప్రాజెక్టులో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారుల తీరు రైతులకు శాపం ప్రాజెక్టుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టిచుకోక పోవడం తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీల పనులు వేసవి కాలంలో చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తరువాత కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతో యథావిథిగా లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. కాల్వల్లో షిల్టు పేరుకుపోయి సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరువు కట్టపై చెట్లను తొలిగించక పోవడంతో కట్టపై నుంచి నడిచి వెళ్లే వీలులేకుండా మారింది. చెరువు మత్తడి వద్ద గైడ్ వాల్స్ కోతకు గురై ధ్వంసమయ్యాయి. అపరాన్ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. -
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
ప్రాజెక్టులకు నిధుల పరవళ్లు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులకు 2023–24 వార్షిక బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,908.10 కోట్లను కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన సీఎం వైఎస్ జగన్ గతేడాది పెన్నా డెల్టా జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి సెపె్టంబరు 6న జాతికి అంకితం చేయడం తెలిసిందే. తద్వారా పెన్నా డెల్టాలో 4.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందేలా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించారు. ఈ ఏడాదీ ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తయ్యేలా తగినన్ని నిధులు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనుల పూర్తికి నిధులు కేటాయించారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను మళ్లించి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 68 చెరువులను నింపి సాగు, తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు. పోలవరంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. కేంద్రం రూ.3 వేల కోట్లకుపైగా రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తున్నా రాష్ట్రమే నిధులను వెచ్చిస్తోంది. ఈ బడ్జెట్లోనూ పోలవరంకు సింహభాగం నిధులు రూ.5,042.47 కోట్లు కేటాయించింది. చంద్రబాబు నిర్వాకాలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతతో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పద్ధతులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సూచనల మేరకు దృష్టి పెట్టాం. తర్వాత వరదల్లోనూ ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. జలయజ్ఞం ఫలాలే లక్ష్యంగా.. సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుల జీవనోపాధులను పెంచడానికి దోహదం చేసేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తోటపల్లి, పుష్కర, తాటిపూడి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లందించే ఉప కాలువలు, పిల్ల కాలువలను పూర్తి చేయడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు చేశాం. ఉత్తరాంధ్రలో కీలకమైన తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా నిధులు కేటాయించింది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పూర్తి చేసి రాష్ట్ర కోటా నీటిని పూర్తి స్థాయిలో రాబట్టి రాయలసీమ రైతులకు నీళ్లందించడమే లక్ష్యంగా తుంగభద్ర బోర్డుకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. -
ఏది నిజం?: ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఎందుకంత కుళ్లు రామోజీ?
అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే..? ఆ ప్రభుత్వం చేసే మంచిపనులేవీ రామోజీరావుకు కనిపించవు. చంద్రబాబు గనక ఉంటే... ఆయనెంత దుర్మార్గం చేసినా అస్సలు కనిపించదు. అదే తన మార్కు పాత్రికేయమని ఆయన పదేపదే నిరూపిస్తున్నారు. మంగళవారం నాడు ‘ప్రాజెక్టులకు పైసల్లేవు’ అంటూ అచ్చేసిన కథనమూ అలాంటిదే. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం రూ.17,368 కోట్లతోనే 40 జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ప్రకటించారు. అంతకు రెండున్నర రెట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించలేకపోయారు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో– పంచుకో– తినుకో) పద్ధతిలో బాబు దోచుకున్నదాంట్లో తన వాటా భేషుగ్గా అందేసింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం రైతుకు దక్కాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. అది బాబుకే కాదు. ఎల్లో ముఠాలో ఎవ్వరికీ సుతరామూ నచ్చటం లేదు. అందుకే ఈ రాతలు. అసలీ రాతల్లో నిజమెంత? కొంతైనా ఉందా? చూద్దాం... వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రక్షాళన చేసి.. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకత తెచ్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో ఏకంగా రూ.865 కోట్లు ఆదా చేశారు. అన్ని ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ వల్ల రూ.2,090 కోట్లు ఆదా అయింది. కానీ కరోనా మహమ్మారి విజృంభణతో రెండేళ్లు ప్రాజెక్టుల పనులపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ దెబ్బతింది. అయినా సరే.. నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. పెట్టే ప్రతి పైసా ప్రతిఫలం రైతులకు దక్కేలా ప్రణాళికాయుతంగా సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటిదాకా రూ.23,289 కోట్లను ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేసి.. కొత్తగా 1,03,692 ఎకరాలకు సాగునీరు అందించారు. 4,84,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2019, 2020, 2021, 2022లలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించి చరిత్ర సృష్టించారు. కాకపోతే ఇవేవీ రామోజీ కళ్లకు కన్పించవు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నది వైఎస్ జగన్ కాబట్టి!. తమ డీపీటీకి అడ్డుకట్ట పడింది కాబట్టి!!. మహోజ్వల ఘట్టం కన్పించలేదా? పెన్నా డెల్టాకు జీవనాడుల్లాంటి మేకపాటి గౌతమ్రెడ్డి సంగం, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు వాటిని పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి గత సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజ్లను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడం నీటిపారుదల రంగ చరిత్రలో మహోజ్వల ఘట్టమని రైతులు, నిపుణులు ప్రశంసించారు. కానీ.. ఇది రామోజీకి కన్పించకపోవడం దురదృష్టకరం. కళ్లుండి చూడలేకపోతే ఎలా..? ► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 160 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో ఐదేళ్లపాటు పనులు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొరంగాన్ని పూర్తి చేయించారు. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట రిజర్వాయర్కు తరలించడానికి సిద్ధమయ్యారు. ► వెలిగొండ ప్రాజెక్టును ఇదిగో అదిగో అని ఐదేళ్లూ దాటవేసిన చరిత్ర చంద్రబాబుది. కానీ.. వైఎస్ జగన్ వెలిగొండపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే మొదటి సొరంగాన్ని పూర్తి చేయించారు. రెండో సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ఈ ఏడాదే వెలిగొండ తొలి దశ ద్వారా కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలను సుభిక్షం చేయడానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ► కర్నూల్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎంసీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు. ► అత్యంత వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లాను సుభిక్షం చేయడమే లక్ష్యంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో మిగిలిన పనులతోపాటు వంశధార–నాగావళి అనుసంధానాన్ని ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచారు. వంశధార ఫలాలను పూర్తి స్థాయిలో అందించడానికి హిరమండలం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో చేపట్టిన తారకరామతీర్థసాగరం, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల పనుల్లోనూ వేగం పెంచారు. మరి శరవేగంగా పూర్తవుతోన్న ఈ ప్రాజెక్టులను కళ్లుండి చూడలేకపోతే ఎలా రామోజీరావు గారూ? బాబు పాపం వల్లే పోలవరం పనుల్లో జాప్యం.. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్లు, అప్రోచ్ చానల్, స్పిల్ వే, íస్పిల్ చానల్, పైలట్ చానల్లను పూర్తి చేయకుండా చంద్రబాబు.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. 2019, జూన్లో గోదావరికి వచ్చిన వరదలు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక కోతకు గురైంది. కోతకు గురైన ప్రదేశాన్ని యథా స్థితికి తెచ్చి... డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దాకనే ప్రధాన డ్యామ్ పనులు చేయాలి. చంద్రబాబు ఈ పాపానికి పాల్పడకపోయి ఉంటే.. ఈ పాటికి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారు. బాబు చేసిన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో పాటు జాతీయ స్థాయిలో అనేక మంది నిపుణులను సంప్రతిస్తూనే... స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి, 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. ఈ నెలాఖరుకు దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి కానుంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు డయాఫ్రమ్వాల్ను సరిదిద్ది.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ చేపట్టి, శరవేగంగా పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం.. జలాశయాల్లో గరిష్ట నిల్వ ► కృష్ణా డెల్టాకు జీవనాడి వంటి పులిచింతల ప్రాజెక్టులో 2019, మే వరకూ ఎన్నడూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణకు పరిహారం చెల్లించకపోవడమే అందుకు కారణం. కమీషన్లు రావనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ పనులు చేయలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు పరిహారం చెల్లించి 2019, ఆగస్టులోనే పులిచింతలలో గరిష్ట స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. ► బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గరిష్ట సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీలతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ► గండికోట రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం గురించి బాబు ఆలోచించనే లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్టంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్లో 26.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ► చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్లో 9.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా సోమశిల, కండలేరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో 2019, సెప్టెంబరు నాటికే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేశారు. ఇలాంటి వాస్తవాలను రాస్తే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!! ఇదీ... బాబు అడ్డగోలు దోపిడీ.. ► పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014, జూలై 8న నీటిపారుదల ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో నాటి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ► 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లు ఖర్చు చేసినట్లు టీడీపీ చెబుతోంది. కానీ ఇందులో నీరు–చెట్టు పథకానికి, పోలవరానికి పెట్టిన వ్యయాన్ని మినహాయిస్తే ప్రాజెక్టులపై రూ. 45,393 కోట్లు ఖర్చుపెట్టింది. కానీ.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదు. ► దీనికి ప్రధాన కారణం... జీవో 22, జీవో 63లను అడ్డంపెట్టుకుని అంచనా వ్యయాలను భారీగా పెంచేశారు. కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచుకున్నారు చంద్రబాబు. ► ఈ దోపిడీ రామోజీకి కమ్మగా కన్పించింది. ఎందుకంటే దోపిడీ చేసిన సొమ్మును ఈ ఎల్లో ముఠా మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో పద్ధతిలో పంచేసుకున్నారు కాబట్టి. ► ఇక నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలు పనులు చేయకుండానే చేసినట్లు చూపించి రూ.10 వేల కోట్లకుపైగా లాగేశారు. ► పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ రూ.10,584 కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.పది వేల కోట్లకుపైగా కేంద్రం రీయింబర్స్ చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై నీళ్లందించవచ్చు. కానీ.. కుడి కాలువ ద్వారా నీళ్లందించడానికి రూ.1,900 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల, ఎడమ కాలువ ద్వారా నీళ్లందించడానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టిన చంద్రబాబు.. ఆ రెండు ప్రాజెక్టు పనులను ఒకే కాంట్రాక్టర్కు ఇచ్చి.. భారీ కమీషన్లు కొట్టేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ రూ.250 కోట్లను ప్రభుత్వానికి జరిమానాగా విధిస్తే.. దానిపై సుప్రీం కోర్టులో పోరాటం చేయాల్సి వస్తోంది. 2019 నుంచి ఆ రెండు ఎత్తిపోతల పథకాల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడలేదు. అంటే.. వాటిపై వ్యయం చేసిన రూ.3800 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే కదా? ఇలాంటి కఠిన వాస్తవాలను ‘ఈనాడు’ పత్రిక ఎందుకు రాయదు? ► చివరకు కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.477 కోట్లతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచి.. అస్మదీయ కాంట్రాక్టర్తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చంద్రబాబు చేతులు దులుపుకుంటే.. ఇప్పుడు ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు దరిద్రపు మోసాలేవీ రామోజీకి కనిపించకపోవటమే ఈ రాష్ట్రం దురదృష్టం. -
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్లను గతేడాది సెప్టెంబర్లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
జూన్లో కుప్పానికి హంద్రీ-నీవా జలాలు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం నియోజకవర్గానికి వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించి గడువులోగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పూర్తి స్థాయి ఫలాలను ముందస్తుగా అందించడానికి గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్కు నీటి ఎత్తిపోత పనుల టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఎత్తిపోతలకు డిసెంబర్లో శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగరంలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టి రూ.852 కోట్లతో అంచనాలను సవరించామని, మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపట్టామని తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 3.4 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు పేర్కొనగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కొత్తవి పూర్తి చేయటంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి క్రమం తప్పకుండా తనిఖీలతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్దేశించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం.. పోలవరంను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం(అగాధాలు), డయాఫ్రమ్వాల్ పటిష్టతను తేల్చడం, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా తొలుత కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు పరీక్షలు, వాటిలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తేగానీ చేపట్టమలేమన్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికి, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం సీడబ్ల్యూసీ సూచించిన మేరకు పరీక్షలను నవంబర్ మధ్యలో ప్రారంభిస్తామన్నారు. వాటి తుది ఫలితాలు డిసెంబరు ఆఖరుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత విధానం, డిజైన్లను సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందన్నారు. పరీక్షల్లో వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్పై సీడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పరీక్షలు చేస్తున్న సమయంలోనే దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తి కాగానే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గోదావరికి రెండో అతి పెద్ద వరద ప్రవాహం గోదావరిలో వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది గోదావరికి అతి పెద్ద వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఈ ఏడాది జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కులు, ఆగస్టు 19న 15.92 లక్షల క్యూసెక్కులు, సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 1990లో 355 రోజుల పాటు ప్రవాహం రాగా 7,092 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. 1994లో ధవళేశ్వరం బ్యారేజీకి 188 రోజులు వరద ప్రవాహం రాగా 5,959 టీఎంసీలు కడలిలో కలిశాయి. 2013లో 213 రోజులు వరద రాగా 5,921 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి 136 రోజుల పాటు వరద ప్రవాహంతో 6,010 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు. సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,164.10 టీఎంసీలు కృష్ణా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 119.2 టీఎంసీల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 34.8 టీఎంసీల నాగావళి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 92.41 టీఎంసీల పెన్నా జలాలు ఇప్పటిదాకా కడలిలో కలిశాయని అధికారులు వెల్లడించారు. నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని, ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో 90 శాతాన్ని నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తున్నామన్నారు. వరదను సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు ప్రాజెక్టుల ఫలాలు అందించాలని సీఎం జగన్ సూచించారు. ఎత్తిపోతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేక మూలనపడుతున్నాయని అధికారులు పేర్కొనగా నిర్వహణపై ఎస్వోపీ (నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక)లు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో నిర్వహించడంపై కసరత్తు చేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మెరుగైన పద్ధతి రూపొందించాలన్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతుల పర్యవేక్షణలో ఎత్తిపోతలను సమర్థంగా నిర్వహించేలా అవగాహన కల్పించి శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల సీఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
రుణ ఆంక్షలపై తగ్గిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్ఈసీ, పీఎఫ్సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్కో చెబుతోంది. బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్ఈసీ/పీఎఫ్సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో.. కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్తో ఆర్ఈసీ/పీఎఫ్సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్కు ఆర్ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ప్రాజెక్టులన్నీ చకచకా
దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అంతటా ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు.. దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నాం. ప్రతి ప్రాజెక్టును కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలతో దేవుడు మరింతగా మంచి చేసే అవకాశం ఇవ్వాలని.. తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంగం, నెల్లూరు బ్యారేజీలు మాత్రమే కాకుండా, దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నాన్నగారు ప్రదర్శించిన చిత్తశుద్ధిని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ.. 26 ప్రాజెక్టులనూ నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగం బ్యారేజీ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మనందరి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.320 కోట్లు ఖర్చు చేసి.. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీటిని స్థిరీకరించామని.. తద్వారా ఆత్మకూరు, నెల్లూరు రూరల్.. సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.85 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టి, నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేశామని చెప్పారు. ‘మనం అధికారంలోకి వచ్చాక 9 నెలలు తిరక్క ముందే కోవిడ్ సమస్య వచ్చింది. మరోవైపు పెన్నా నదిలో వరుసగా రెండేళ్ల పాటు వరదలు వచ్చాయి. అయినా అన్ని ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఈ ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి పూర్తి చేశాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చిత్రంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తదితరుల దివంగత సీఎం వైఎస్సార్ వల్లే మోక్షం ► దాదాపు 140 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో సంగం వద్ద కట్టిన ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అయినా గత పాలకులెవరూ దీనిని పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టు చేపట్టి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచించలేదు. ► దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 2006లో సంగం బ్యారేజ్ పనులు, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. ► 2009లో నాన్నగారు మన మధ్య నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీడీపీ హయాంలో ముహూర్తాలు తప్ప పనుల్లేవు ► 2014లో రాష్ట్రం విడిపోయాక టీడీపీ ప్రభుత్వ హయాంలో.. సంగం బ్యారేజీ కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి.. 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి.. 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు. ఇలా ముహూర్తాల మీద ముహూర్తాలు మార్చుకుంటూ పోయారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదు. ► వారు చేసిందల్లా ప్రాజెక్టుల్లో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్ ఇచ్చేయడం.. ఆ తర్వాత కమీషన్లు దండుకోవడమే. చంద్రబాబు హయాం అంతటా ఇదే తీరున అడుగులు పడటం చూశాం. గౌతమ్ జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు.. ► మనందరి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు కోవిడ్ సమస్యలు, మరోవైపు వరదల వంటి ప్రతికూల పరిస్థితులు. అయినా మూడేళ్లనే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి సంగం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాకు మిత్రుడు, మంచివాడు, ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతంరెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. ► గౌతమ్ హఠాన్మరణంతో మనందరికీ దూరమయ్యాడు. ఆ రోజు గౌతమ్ సంస్మరణ సభలో చెప్పిన మాటను ఈ రోజు నిలుపుకున్నాం. అతని జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడుతున్నాం. తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటాడు. ఈ బ్యారేజ్ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింది 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63 వేల ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75 వేల ఎకరాలు వెరసి.. 3.85 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది. బ్యారేజీల ప్రారంభోత్సవ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం నెల్లూరు బ్యారేజీకి వైఎస్సార్ శ్రీకారం ► 150 సంవత్సరాల క్రితం నిర్మించిన నెల్లూరు ఆనకట్ట శిథిలావస్థకు చేరితే, పట్టించుకునే నాథుడు లేక దాదాపు లక్ష ఎకరాలకు నీరందించలేని స్థితికి చేరింది. అప్పట్లో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి చొరవ చూపడం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. ► ఆనాడు ప్రాజెక్టు వ్యయం రూ.147 కోట్లుగా అంచనా వేస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేసి, ప్రియతమ నేత ప్రాజెక్టును పరుగులు తీయించగలిగారు. నాన్నగారు చనిపోయాక ఈ ప్రాజెక్టు మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టునూ పూర్తి చేసి.. జాతికి అంకితం చేస్తున్నాం. రూ.85 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ► సోదరుడు, ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి.. కొన్ని సమస్యలు చెప్పారు. జాతీయ రహదారి నుంచి సంగం బ్యారేజ్కు నేరుగా రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందన్నారు. అది మంజూరు చేస్తున్నాను. ► ఆత్మకూరు నియోజకవర్గంలో 12 ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. నియోజకవర్గంలో 25 ఊళ్లకు రహదారి నిర్మాణానికి రూ.14 కోట్లు, ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్ గ్రాంట్ కింద రూ.12 కోట్లు, సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయతీకి నీటి సదుపాయం కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. మొత్తమ్మీద దాదాపు రూ.85 కోట్ల విలువైన ఈ పనులన్నింటికీ అనుమతులు మంజూరు చేస్తున్నాను. ► ఈ కార్యక్రమంలో దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మానుగుంట మహీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్రావు, కమ్యూనిటీ డెవెలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. వరుణుడి ఆశీర్వాదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి, నెల్లూరు బ్యారేజీ జాతికి అంకితం చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి వరకూ ఎండ వేడిమితో ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జోరున వర్షం ప్రారంభమెంది. సీఎం పర్యటన ముగిసే వరకు నెల్లూరులో వర్షం కురుస్తూనే ఉంది. బ్రిడ్జి కమ్ బ్యారేజీ ప్రారంభించి, సీఎం తిరుగు ప్రయాణం కాగానే అక్కడా వర్షం ఆరంభమైంది. సంగంలో సైతం బహిరంగ సభ తర్వాత వాన జల్లులు పడ్డాయి. ఇదంతా కళ్లారా చూసిన వారు.. ముఖ్యమంత్రికి దేవుడి చల్లని దీవెనలు ఉన్నాయని, వరుణ దేవుడూ ఆశీర్వదించారని చర్చించుకున్నారు. ఇదో అద్భుత సన్నివేశం సంగం, నెల్లూరు బ్యారేజ్లను సీఎం జగన్ ఒకేసారి ప్రారంభించడం అద్భుతమైన సన్నివేశం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండిటికీ శంకుస్థాపన చేశారు. తండ్రి సంకల్పించిన ఈ రెండు ప్రాజెక్టులను తనయుడు సాకారం చేయడం చరిత్రలో అరుదుగా జరిగే విషయం. స్వాతంత్య్రానంతరం వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకోవడానికి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్సార్ వచ్చాకే జలయజ్ఞం పేరుతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఆ మహానేత మనందరి మధ్య నుంచి వెళ్లిపోయాక ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. – జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు -
వైఎస్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు
వంగూరు: దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డికి పాలమూరు జిల్లా అంటే అమితప్రేమ అని, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా డిండిచింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లోని కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, అయితే కల్వకుర్తి ప్రాజెక్టులో మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. డిండిచింతపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు దుందుభి వాగుపై వైఎస్సార్ వంతెన నిర్మిస్తే, కేసీఆర్ ఆ వంతెనపై బస్సులు కూడా నడిపే పరిస్థితిలో లేరన్నారు. ఉద్యమకారుడని తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే పాలనను గాలికి వదిలి ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉన్నత చదవులు చదివిన విద్యార్థులు సైతం కూలీ పనులకు వెళున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు మళ్లీ వైఎస్సార్ పాలన రావా లని కోరుకుంటున్నారని, అది కేవలం వైఎస్సార్టీపీతోనే సాధ్యమని అన్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) చీఫ్ అడ్వైజర్ డి. పాండురంగారెడ్డితో పాటు ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల శక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నంబర్ కేటాయించండి... తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై తాము పిల్ దాఖలు చేయలేదని, పిల్కు నంబర్ కేటాయించేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై నియంత్రణ, నిర్వహణ చేసేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకుంటోందని చెప్పారు. ‘తెలంగాణకు జలవనరుల వాటాను పెంచకుండా కేంద్రం దగా చేస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఇది తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటయ్యే నదీ జలాల యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు.. సిబ్బంది, అధికారులు, ఫైళ్లు, వాహనాలను అందించాలి. అంతేకాకుండా రివర్ బోర్డులకు తెలంగాణ, ఏపీ రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందీ కేంద్రం చెప్పలేదు. నిధులు ఇచ్చేందుకు, నోటిఫికేషన్ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. హైకోర్టు జోక్యం చేసుకుని.. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణార్హత ఉంది.. పిల్లోని అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన నోటిఫికేషన్ను సవాలు చేసిన పిల్కు విచారణార్హత ఉందన్నారు. పిల్ దవిచారణార్హతపై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. -
కృష్ణాపై 6 ప్రాజెక్టులకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలోని కల్వకుర్తి (అదనపు 15 టీఎంసీలతో సామర్థ్యం పెంచింది), నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకాలకు మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఈ ఆరు ప్రాజెక్టులను చేర్చి వాటి నిర్మాణం పూర్తికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న తెలంగాణ, ఏపీ వాదనలతో కేంద్ర జలశక్తి శాఖ ఏకీభవించింది. ఈ ఆరు ప్రాజెక్టులకు మరోసారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇందుకు అనుగుణంగా 2021 ఏప్రిల్ 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్కు సవరణలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిగా వివాదం: రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ద్వారా కృష్ణా బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలతోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండకు ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర మంత్రి చైర్మన్గా, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులు) నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని గెజిట్లో రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించాలని రెండు రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఒత్తిడి తెచ్చింది. గడువులోగా అనుమతులు పొందకుంటే పనులు నిలుపుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. విభజన చట్టం ద్వారా ఆ ఆరు ప్రాజెక్టులకు కేంద్రమే అనుమతి ఇచ్చిందని.. ఈ నేపథ్యంలో మళ్లీ వాటికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇటు కృష్ణా బోర్డుకు, అటు కేంద్ర జలశక్తి శాఖకు ఇరు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. దీంతో ఈ ఆరు ప్రాజెక్టులకు తాజాగా కేంద్రం మినహాయింపు కల్పించింది. అనుమతుల కోసం వీటి డీపీఆర్లను కేంద్రానికి సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణను మాత్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా బోర్డుకు అప్పగించాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. నెట్టెంపాడు విస్తరణకు అనుమతి తప్పదు... తెలంగాణ వచ్చాక కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా అదనంగా 15 టీఎంసీలు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా అదనంగా 2.5 టీఎంసీల కృష్ణా జలాల తరలింపునకు విస్తరణ పనులు చేపట్టగా కల్వకుర్తి విస్తరణకు మాత్రం కేంద్రం మినహాయింపు కల్పించింది. దీంతో నెట్టెంపాడు విస్తరణ పనులకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని లేనిపక్షంలో పనులు నిలుపుదల చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నెట్టెంపాడు విస్తరణతోపాటు తెలంగాణలో కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, కోయిల్సాగర్, ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాలు, ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు అనుమతి తీసుకోవాల్సి రానుంది. -
'అప్పు'డేమైంది..?.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే నిలిపివేసిన రుణాల విడుదలకు అనుమతి స్తామని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. రుణమిచ్చే సంస్థ, రుణం తీసుకునే సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగస్వామ్యం కావాలని కేంద్రం పట్టు పడుతోంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలా జరిగితే కార్పొరేషన్లు తీసుకునే రుణాలు రాష్ట్ర రుణ ఖాతాలోకి వెళ్తాయి. తద్వారా రాష్ట్రం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకునే రుణాలు తగ్గుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అప్పుడు లేని షరతులు ఇప్పుడెందుకు? రుణ ఒప్పందాల సమయంలో లేని షరతులు అకస్మాత్తుగా ముందుకు తీసుకుని రావడంపై రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రుణాల్లో ఇప్పటికే 70 శాతం వరకు విడుదల చేశాక ఇప్పుడు ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటూ మెలిక పెట్టడంపై సీఎం కేసీఆర్ కూడా అగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తీసుకున్న రుణాలపై నెలవారీ చెల్లింపుల్లోనూ ఎక్కడా డిఫాల్ట్ కాలేదని, అయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం.. చివరి ఆప్షన్గా కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం ఉత్తర్వులతో నిలిచిన నిధులు రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సహా నాబార్డ్ వంటి సంస్థలు రూ.76,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.43 వేల కోట్లు విడుదల చేయగా, వాటి ఖర్చు సైతం జరిగిపోయింది. మరో రూ.33 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా త్రైపాక్షిక ఒప్పందాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఫలించని అధికారుల చర్చలు త్రైపాక్షిక ఒప్పందం అంటే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. అదే జరిగితే కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి చేరుతాయి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ఇతర రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంతో చర్చలకు రాష్ట్ర ఉన్నతాధికారులు నడుం బిగించారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు ఢిల్లీకి వచ్చిన సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థిక, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్కుమార్లు కేంద్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల అంశంపై ఆర్ధిక రంగ నిపుణులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీలోని తన నివాసంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం కూడా ఇద్దరు, ముగ్గురు ఆర్థిక, న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు అనుమతులకూ కొర్రీలు! కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు గడిచిన మూడురోజులుగా ఇరిగేషన శాఖ అధికారులు ఈ విషయమై కేంద్ర జల సంఘం, జల శక్తి శాఖల చుట్టూ తిరుగుతున్నా పెద్ద ఫలితం లేదని చెబుతున్నారు. ఒక అంశంపై స్పష్టత ఇస్తే, మరో అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకొస్తోందని, సీతారామ, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, రామప్ప–పాకాల, తుపాకులగూడెం ప్రాజెక్టుల విషయంలో కాలుకు వేస్తే వేలికి..వేలికేస్తే కాలుకు అన్న చందంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కూడా కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి తదుపరి కార్యాచరణపై గురువారం ఇద్దరు, ముగ్గురు ఎంపీలతో మాట్లాడినట్లు తెలిసింది. -
ప్రాజెక్టుల అప్పగింతపై మళ్లీ పాతపాటే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) అధికార పరిధిని నిర్వచిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్లోని షెడ్యూల్–2లో పొందుపర్చిన 11 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు మళ్లీ పాతపాటే వినిపించాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మినహా మరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తేలేదని తెలంగాణ మరోసారి తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ పట్టుబట్టింది. దీంతో ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు మెంబర్ కన్వీనర్ అజగేషన్ నేతృ త్వంలో గురువారం జలసౌధలో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం ఫలితం లేకుండానే ముగి సింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహ న్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్య ప్రసాద, ఏపీ నుంచి సీఈ పుల్లారావు పాల్గొన్నారు. ఏపీ తమ పరిధిలోని తోట వెంకటాచలం లిఫ్టు, తాడిపూడి పంప్హౌస్, సీలేరు పవర్ కాంప్లెక్స్ల అప్పగింతపై బోర్డుకు నోట్ను అందించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను సైతం స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరిస్తామని షరతు విధించింది. తెలంగాణ లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఉన్న కాకతీయ క్రాస్ రెగ్యులేటర్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గంగారం పంప్హౌస్, దుమ్ముగూడెం వెయిర్, నావిగేషన్ చానల్, లాక్స్లను అప్పగిం చాలని గోదావరి బోర్డు కోరగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. సీడ్మనీ కింద రూ.200 కోట్లు కోరిన బోర్డు సీడ్మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడుదల చేయాలని బోర్డు కోరగా, ఖర్చుల ప్రతిపాదనలను సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ తెలిపింది. పెద్దవాగు నిర్వహణకు సీడ్మనీగా రూ.1.45 కోట్లతోపాటు సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బదులిచ్చింది. పెద్దవాగు ఆధునీకరణకు రూ.78 కోట్ల వ్యయం కానుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే బోర్డుకు నిధులిస్తామని తెలిపింది. ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈ, నలుగురు జేఈ, ఇతర ఉద్యోగులను బోర్డుకు కేటాయించేందుకు తెలంగాణ అంగీకరించింది. -
రాష్ట్రాన్ని తడిపిన తపన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పచ్చబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాల కల సాకారమయ్యే క్రమంలో రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన సత్ఫలితాలిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతరీతిలో సాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. రీడిజైనింగ్, రీ–ఇంజనీరింగ్ చేపట్టడంతో ప్రాజెక్టులన్నీ కొత్తరూపు సంతరించుకున్నాయి. దీంతో సాగునీటి విస్తీర్ణం పెరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల ప్రాజెక్టుల పూర్తితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా–కొరాటా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరామ్సాగర్ వంటి ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఏకంగా రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రగతినివేదికలో ఈ విషయాలను పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం ముందు తీరం నుంచి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలన్న లక్ష్యంతో రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి. 6 జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో గల 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరి నీటిని తరలించి భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేసి రాష్ట్రంలో బీడువారిన భూములకు అందించడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్హౌస్లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ. పొడవున సొరంగాలు, పైప్లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్ను కేవలం 36 నెలల రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరందిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరంగా 100 టీఎంసీల జలాలను నిల్వ చేయవచ్చు. -
Andhra Pradesh: సాగునీటి సవ్వడులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి నిధులను ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. దీనికి సంబంధించి రూ.2,559.37 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, జల్ శక్తితో చర్చించి త్వరగా నిధులు రప్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్ను నింపేలా ఎత్తిపోతల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాగునీటి పనులపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 29న జరిగిన సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలు, తీసుకున్న చర్యలపై అధికారుల నివేదిక ఆధారంగా ప్రాజెక్టుల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యాంశాలు ఇవీ... సాగునీటి పనులపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సీడబ్ల్యూసీ రాక.. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తి కాగా కోతకు గురైన ప్రాంతం ఇసుకతో పూడ్చివేత పనులు 76 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్ పూర్తైన నేపథ్యంలో ఈనెల 11న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈనెల 18న డిజైన్లపై డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం జరగనుంది. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. పీపీఏ అనుమతితోనే పోలవరం పనులు.. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.2,559.37 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రతి పనీ జరుగుతోందన్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. కేంద్ర అధికారులతో సమావేశం సందర్భంగా రీయింబర్స్ అంశాన్ని ప్రస్తావించాలని ఆదేశించారు. పెన్నాపై సకాలంలో జంట బ్యారేజీలు.. నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని వివరిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. వాయువేగంతో వెలిగొండ సొరంగం ► వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని సమీక్షలో అధికారులు తెలిపారు. ► 2014–19 మధ్య గత సర్కారు హయాంలో టన్నెల్ –1 పనులు కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పని మాత్రమే గత ప్రభుత్వ హయాంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. ► వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019–2022 వరకు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 2.8 కిలోమీటర్లు తవ్వి మొదటి టన్నెల్ను పూర్తి చేశారు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్ పనులు జరిగాయని అధికారులు తెలిపారు. ► వెలిగొండ టన్నెల్–2కు సంబంధించి 2014–2019 మధ్య రోజుకు 1.31 మీటర్ల పని మాత్రమే జరగ్గా 2019–22 మధ్య రోజుకు 2.46 మీటర్ల పనులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 500 మీటర్లపైన టన్నెల్ తవ్వకం పనులు చేస్తున్నట్లు చెప్పారు. ► సెప్టెంబరులో టన్నెల్–1 ద్వారా వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ► టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తూనే టన్నెల్–2లో పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్లోకి వంశధార ఎత్తిపోత.. ► కేంద్రానికి సమర్పించిన వంశధార ట్రిబ్యునల్ తుది నివేదికపై ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్సెల్పీ) దాఖలు చేయడంతో ఆ అవార్డు అమల్లోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడంలో జాప్యం చోటు చేసుకుని హిర మండలం రిజర్వాయర్ను నింపడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్ నింపవచ్చునని ప్రతిపాదించారు. దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ ఈ ఎత్తిపోతలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సుమారు రూ.189 కోట్లు వ్యయం కానుంది. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ► వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారం చెల్లింపుపై సీఎం జగన్ సమీక్షించారు. ఇందుకు దాదాపు రూ.226.71 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను శరవేగంగా పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ► గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వలసలను నివారించేలా.. ► తాగు, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి నీటి ఎద్దడిని నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు. ► చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్ కెనాల్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్ –2 (కోడూరు వరకు), జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్ స్కీం, ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి యూసీఐఎల్ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు (కుందూ నది), రాజోలి బండ డైవర్షన్ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిఫ్ట్ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
పరవళ్లు.. పరుగులు
గడువులోగా పోలవరం.. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్కు సంబంధించిన అన్ని డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, జూలై 31 నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే విధానంపై ఏప్రిల్ 1న ఢిల్లీలో జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందని, మిగతా డిజైన్లు కూడా వీలైనంత త్వరగా ఖరారవుతాయన్నారు. సీడబ్ల్యూసీ అధికారుల వెంటపడి మరీ డిజైన్లకు అనుమతులు సాధించి గడువులోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వెంటబడి మరీ ఆమోదించుకోవడం ద్వారా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ పూర్తైన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. నగదు బదిలీ రూపంలో పరిహారం పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ముంపు గ్రామాల నుంచి తరలించే నిర్వాసితులకు ఆగస్టు నాటికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందులో 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 7,962 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. 3,228 నిర్వాసిత కుటుంబాలు ఓటీఎస్(వన్టైమ్ సెటిల్మెంట్)కు దరఖాస్తు చేసుకున్నాయని, మిగతా 9,756 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టుకు అవుకు టన్నెల్–2 సిద్ధం నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల పనులను 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి లైనింగ్తో సహా టన్నెల్ను పూర్తి చేసి ప్రస్తుత సామర్థ్యం మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉదయగిరి, బద్వేలుకు వెలిగొండ జలాలు.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని మరింత పెంచి నెలకు 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేపడతామని తెలిపారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించి తొలిదశ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్ని రకాల పనులను పూర్తిచేసి రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించే పనులకు టెండర్లు పిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరడి బ్యారేజీతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్టోబరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వంశధారపై గొట్టా బ్యారేజి ఎగువ నుంచి హిర మండలం రిజర్వాయర్లోకి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని దాదాపుగా ఆంధ్రప్రదేశే భరిస్తోందని.. బ్యారేజీని నిర్మిస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇరు రాష్ట్రాలకూ నేరడి బ్యారేజీ ప్రయోజనకరమన్నారు. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► తారకరామ తీర్థసాగరంలో రిజర్వాయర్ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని సీఎం సూచించారు. సారిపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► మహేంద్ర తనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మిగిలిన పనులకు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రధాన కాలువ తవ్వడానికి అవసరమైన భూమిని వేగంగా సేకరించి పనులు వేగవంతం చేయాలన్నారు. ► సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వీలైనంత త్వరగా ప్రాజెక్టు డిజైన్లు తెప్పించుకోవాలన్న:సీఎం జగన్
-
Irrigation Projects: గడువులోగా పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇరిగేషన్ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ ►డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని తెలిపిన అధికారులు ►ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని తెలిపిన సీఎం ►వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలన్న సీఎం ►వెంటపడి మరీ పనులు చేయించుకోవాలన్న సీఎం ►ఆర్ అండ్ ఆర్పైన ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు ►ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామన్న అధికారులు ►మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించామన్న అధికారులు. ►3228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలన్న అధికారులు. ►వీరిని త్వరగా పునరావాసం కల్పించాలన్న సీఎం. ►డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలన్న సీఎం. ►నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ –2లో ఫేజ్–2 పనులపైనా సీఎం సమీక్ష ►నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు ►సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్న అధికారులు. మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామన్న అధికారులు సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించిన సీఎం ►అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్లో పనులు పూర్తిచేస్తామన్న అధికారులు ►120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామన్న అధికారులు. ►లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనులపై సీఎం సమీక్ష ►నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామన్న అధికారులు ►ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామన్న అధికారులు. టన్నెల్ 1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం ►2023 నాటికి టన్నెల్ –2 సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ►వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు ►అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం ►వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్లోకి పంపింగ్కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని ఆదేశం ►వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి సన్నాహాలపైనా సీఎం సమీక్ష. ►ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశాకూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్న సీఎం. ►ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమన్న సీఎం. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష. ►తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు. ►గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద పనులనూ వేగవంతం చేయాలన్న సీఎం. ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►తారకరామ తీర్థసాగర్లో రిజర్వాయర్ పనులు పూర్తికావొచ్చాయన్న అధికారులు. మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశాలు ►సారిపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని ఆదేశాలు ►టన్నెల్ సహా ఇతర పనులూ కొనసాగుతున్నాయన్న అధికారులు ►మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష ►ప్రాజెక్టును పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలన్న సీఎం ►ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం ►ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►మెయిన్ కెనాల్ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్న సీఎం ►దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం సమీక్షా సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్రావు (జహీరాబాద్), మదన్రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
పనులు పరుగెత్తాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాదిలో చేయాల్సిన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. అలాగే డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన బ్యారేజీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని సూచించారు. నీటిపారుదల, వైద్యారోగ్యం, రోడ్లు, భవనాల శాఖలపై ఆదివారం ప్రగతిభవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. అనుమతులు రాకపోవడంపై అసహనం సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించి ఐదు నెలలు గడిచినా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ కోరుతున్న అన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ను సత్వరం సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపాలని సూచించారు. సచివాలయం పనుల్లో వేగం పెరగాలి ! కొత్త సచివాలయం భవనం పనులతో పాటు లాండ్ స్కేపింగ్, రక్షణ వ్యవస్థ వంటి అనుబంధ భవనాల పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించడానికి కావాల్సిన సదుపాయాలపై డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతికతతో 24 గంటల నిఘా కోసం నిర్మిస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. -
ఏకపక్ష వైఖరిని ఒప్పుకోం.. గోదావరి బోర్డు తీరును ఆక్షేపిస్తూ తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల అప్పగింత నోట్ రూపకల్పన ప్రక్రియల్లో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. జీఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యులెవరినీ ఇందులో భాగస్వాములుగా చేయకపోవడాన్ని తప్పుబట్టింది. సాధారణ ప్రక్రియకు విరుద్ధమైన ఈ వ్యవహార శైలిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ సోమవారం జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. ప్రాజెక్టు సైట్ల సందర్శన, అప్పగింత నోట్ తయారీకి బోర్డు/సబ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ లేఖలో తెలిపింది. బోర్డు/సబ్ కమిటీ నిర్ణయాల మేరకే బోర్డు అధికారులు పనిచేయాలని కోరింది. బోర్డు సచివాలయం అధికారులెవరు సందర్శనకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, బోర్డు అనుమతి లేకుండా సందర్శన జరిపే అధికారుల అభిప్రాయాలను ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. -
చేతులెత్తేసిన సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి ఆపరేషన్, ప్రొటోకాల్ అంశాలపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగిన కృష్ణా బోర్డు సబ్ కమిటీ దీనిపై ప్రాథమిక దశలోనే చేతులెత్తేసింది. కేంద్ర జల సంఘం ఇంజనీర్లతో కలిసి తయారు చేసిన ముసాయిదా నివేదికపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలోనే ఈ అంశాన్ని తేల్చుదామంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖల ద్వారా సమాచారమిచ్చింది. కృష్ణా స్పెషల్ బోర్డు భేటీలో చేసిన నిర్ణ యం మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వం లో సబ్ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్పై అధ్యయనం చేసేందుకు గత నెల 25, 26 తేదీల్లో శ్రీశైలం పరిధిలో పర్యటించింది. అనంతరం ఒక ముసాయిదా నివేదికను రూపొందించి రాష్ట్రాల పరిశీలనకు అందజేసింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల కనీస నీటి మట్టం వరకు విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చని, 854 అడుగుల మట్టంలో నీరున్నప్పుడు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోచ్చని పేర్కొంది. బచావత్ అవార్డుకు విరుద్ధం: తెలంగాణ ఈ ముసాయిదాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కమిటీ మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ పేర్కొన్న నేపథ్యంలో ఆ విధానాన్నే అమ లుచేయాలని డిమాండ్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అని పేర్కొన్నారని, కరెంట్ ఉత్పత్తి మినహా శ్రీశైలం నుంచి మరో ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఆస్కారమే లేదని ఇటీవల లేఖలో స్పష్టం చేసింది. బోర్డుకు గానీ, కేంద్రానికి గాని బచావత్ అవార్డులో ని నిబంధనలను పునర్నిర్వచించే అధికారం లేదని తేల్చిచెప్పింది. దీంతో సబ్ కమిటీ వెనక్కి తగ్గింది. ఆయా అంశాలపై పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చ జరగాలని, అక్కడి అభిప్రాయం మేరకే నడుచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మేరకు బోర్డుతెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
CM YS Jagan: మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యా రంగంలో మనబడి నాడు–నేడు, ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి కూడా పెద్దపీట వేయాలని స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్ప్లాంట్ తదితర కార్యక్రమాలు, అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు–నేడు’ సమర్థవంతంగా సాగాలి విద్యారంగంలో నాడు–నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మనబడి నాడు–నేడు మొదటి విడతలో ఇప్పటివరకూ రూ.3,650 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడత కింద 12,663 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, ఆస్పత్రుల నాడు–నేడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సమీక్షిస్తూ.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్లలో కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పనులను వేగంగా పనులు పూర్తిచేయాలని, అలాగే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021–22లో విద్యా కానుకకు రూ.790 కోట్లు విద్యాకానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, బూట్లు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2021–22లో రూ.790 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే.. జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. రోడ్లపై మరింత దృష్టి రహదారుల నిర్మాణం, మరమ్మతులపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని.. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించగా వీటి టెండర్లపైనా మరింత దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఇక పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయలు కూడా పెద్దఎత్తున ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీటితోపాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శులు ఎన్. గుల్జార్, కేవీవీ సత్యనారాయణ, జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డీ మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏఎంఆర్డీఏ కమిషనర్ కే విజయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పూర్తి చేసేదెప్పుడో’ అంటూ వంకర రాతలు.. పూర్తి చేస్తోంది ఇప్పుడే..
..అస్మదీయుడు అధికారంలో ఉంటే.. తప్పు చేసినా ఒప్పేనని వంకర రాతలు అచ్చేయడంలో ‘ఈనాడు’ తనకు తానే సాటి. ..అదే తస్మదీయుడు అధికారంలో ఉంటే.. ఒప్పు చేసినా తప్పేనని నీచపు రాతలు అచ్చేయడంలో ఆ పత్రికే మేటి. గడచిన రెండున్నరేళ్లలో దాదాపు 16 నెలలపాటు కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇన్ని ఇబ్బందుల్లోనూ.. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు దన్నుగా నిలవడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులకూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వచేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తున్నారు. 2019, 2020లలో కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు.. ఈ ఏడాదీ అదే స్థాయిలో నీళ్లందిస్తున్నారు. ..తన వాడు కాకుండా.. పరాయివాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఈనాడుకి కడుపుమంట. నిజమైన కడుపులో మంటకు చికిత్స చెయ్యొచ్చు. కానీ.. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వచ్చే కడుపుమంటకు ఏ మందు ఉంటుంది? ‘‘పూర్తి చేసేదెప్పుడో’’ శీర్షికతో సోమవారం ఆ పత్రికలో అదే కడుపుమంటతో ఓ కథనం ప్రచురించారు. అందులోని నిజానిజాలేమిటో చూద్దాం.. సాక్షి, అమరావతి: కరోనా ప్రతికూల పరిస్థితులు.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. వరదలు ముంచెత్తినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు భరోసా కల్పిస్తూనే 28 నెలల్లో రూ.14,971.79 కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుచేసింది. 2019, 2020లలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఓ వైపు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూనే.. పంట విరామ సమయంలో ప్రాజెక్టుల పనులను సర్కారు పరుగులు పెట్టిస్తోంది. దాంతో సకాలంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. పెన్నా డెల్టాకు పునరుజ్జీవం పోసే నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో జీవచ్ఛవంలా మార్చిన పోలవరం ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవం పోశారు. రీయింబర్స్ చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నా.. రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ పోలవరం పనులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్పిల్ వే పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తిచేసి జూన్ 11 నుంచే గోదావరి వరదను స్పిల్ వే గేట్ల ద్వారా మళ్లించారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తికానుంది. చదవండి: (ఏపీపై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం) సుభిక్షం చేసే దిశగా వడివడిగా అడుగులు.. అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులవల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోగానే ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేందుకు కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా శ్రీశైలం నుంచి నీటిని తరలించి.. సాగు, తాగునీటి కష్టాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. తద్వారా దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక రచించారు. గోదావరి జలాలను తరలించి పల్నాడును.. కృష్ణాపై మూడు బ్యారేజీల ద్వారా కృష్ణా డెల్టా, కొల్లేరును పరిరక్షించడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ కేటాయింపులతోపాటూ నాలుగు ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)లను ఏర్పాటుచేశారు. జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తేవడం ద్వారా నిధుల కొరతలేకుండా చేసి.. సకాలంలో పూర్తిచేయడానికి ప్రణాళిక రచించారు. ‘చంద్ర’ దోపిడీ ఇంపుగా కనిపించిందా? పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తిచేస్తామని జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై నాటి సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టంచేశారు. 2014, జూన్ 8 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.56,228.75 కోట్లను టీడీపీ సర్కార్ ఖర్చుచేసింది. ఈ సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి.. అడిగినంత కమీషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాను దోచేయడంవల్లే రూ.56,228.75 కోట్లు ఖర్చుచేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయింది. కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు మార్చారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సాగించిన దోపిడీ అప్పట్లో ఈనాడుకు ఇంపుగా అనిపించినట్లుంది. ఈ పనులు కంటికి కన్పించడం లేదా? ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు అభివృద్ధిచేసే పనులను రూ.570.45 కోట్లతో చేపట్టారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు 2020లో పీహెచ్ఆర్ ద్వారా దాదాపు 8 నెలలపాటు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది జూలై నుంచి విడుదల చేస్తున్నారు. పంట విరామ సమయంలో ఈ పనులు చేస్తున్నారు. ► ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచడం.. ఈ క్రమంలో అవుకు వద్ద 10వేల క్యూసెక్కులు, గండికోట వద్ద మరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనపు టన్నెళ్ల తవ్వకం పనులు చేపట్టారు. ఈ టన్నెళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పంట విరామ సమయంలో కాలువ పనులు చేస్తున్నారు. ► రూ.3,825 కోట్ల వ్యయంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను డీపీఆర్ తయారీకి అవసరమైన మేర పూర్తిచేశారు. ఈ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ అనుమతి తీసుకుని.. ఆ ఎత్తిపోతలను పూర్తిచేసే దిశగా సర్కార్ చర్యలు చేపట్టింది. ► కమీషన్ల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులకు 2019 ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తొలిదశతోపాటూ రెండో దశ పనులను వైఎస్సార్సీపీ సర్కార్ చేపట్టింది. ఈ రెండు దశల పనులు సర్వే పూర్తి కాగా.. పనులు జరుగుతున్నాయి. ► దుర్భిక్ష పల్నాడుకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.6,020 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులు చకచకా సాగుతున్నాయి. ► తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రూ.2,145 కోట్లతో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులను సర్కార్ చేపడితే.. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, మోకాలడ్డుతున్నారు. ఇవేవీ ఈనాడు కంటికి కన్పించలేదేమో!? -
విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ
సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని) టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం, సాగర్
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి నేరుగా నీటిని తీసుకునే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. శ్రీశైలం, సాగర్ల కింద తెలంగాణ పరిధిలోని 9 అవుట్లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే తమ భూభాగంలోని 6 అవుట్లెట్లను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డుకు షరతు పెట్టింది. శ్రీశైలం స్పిల్వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం (మల్యాల పంపు హౌన్), ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ సర్కిల్ ఆఫీస్ సిబ్బంది 39 మంది, శ్రీశైలం సెక్షన్ ఆఫీసు, సబ్ డివిజన్ ఆఫీసుకు చెందిన సిబ్బంది 142 మంది.. మొత్తం 181 మంది సిబ్బందిని కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని, నాగార్జున్సాగర్ కుడికాలువపై ఉన్న విద్యుత్ కేంద్రాన్ని కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలోని శ్రీశైలం, సాగర్, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్ స్పిల్వే, సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్, ఎడమకాలువ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్ వరద కాలువలను బోర్డు స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం షరతు విధించింది. అలాగే శ్రీశైలం ఎగువన జూరాల ప్రాజెక్టుతోపాటు, దానిపై అవుట్లెట్ల నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డును కోరింది. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువనున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన రిజర్వాయర్లపై నేరుగా నీటిని తీసుకునే ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. స్వాధీనం సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ, జెన్కో సీఈలు బోర్డుకు సహకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
తొలుత ఉమ్మడి ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చే గెజిట్లో భాగంగా కృష్ణాబోర్డు మొదట శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను, గోదావరి బోర్డు పెద్ద వాగు ప్రాజెక్టునుతమ ఆధీనంలోకి తీసుకోను న్నాయి. ఈ మేరకు కేంద్రం సైతం స్పష్టత ఇచ్చి నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అంశాలపై స్పష్టత కోసం, రాష్ట్రాల అభిప్రాయాలను వినేందుకు 10, 11 తేదీల్లో బోర్డుల సబ్ కమిటీ భేటీలు, 12న పూర్తి స్థాయి భేటీలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేర కు తెలుగు రాష్ట్రాలకు బోర్డులు లేఖలు రాశాయి. చైర్మన్లతో కేంద్ర అదనపు కార్యదర్శి భేటీ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ.. గురువారం ఉదయం రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్తో భేటీ అయ్యారు. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, రాష్ట్రాలు అందించిన సమాచారం, వాటి అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తి చేసిన చర్యలు తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ఆధీనానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని, మూడు ప్రాజెక్టుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు సానుకూలతతో ఉన్నాయని తెలిపినట్లుగా సమాచారం. శ్రీశైలం, సాగర్, పులిచింతల విషయంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో వాటిని మొదటగా బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షణ మొదలు పెట్టాలని సూచించినట్లుగా తెలిసింది. మిగతా ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు భేటీలు నిర్వహించి రాష్ట్రాల అభిప్రాయం కోరాలని చెప్పినట్లుగా బోర్డుల వర్గాలు తెలిపాయి. వరుస భేటీలు పెట్టిన బోర్డులు గెజిట్ అమలుకు మరో వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, బోర్డులు తమ పనిలో వేగం మరింత పెంచనున్నాయి. వచ్చే ఆది, సోమ వారాల్లో రెండు బోర్డుల సబ్ కమిటీల భేటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ వెంటనే పూర్తి స్థాయి స్పెషల్ బోర్డు భేటీలను ఈ నెల 12న నిర్వహించనున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల కార్యదర్శులకు బోర్డులు లేఖలు రాశాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచాలన్న దానిపై ఈ సమావేశాల్లో మరింత స్పష్టత తీసుకోనున్నాయి. -
Telangana: నిండుకుండలా చెరువులు
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండుగా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని సగానికి పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు దుంకుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 27 వేల చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. మరో 6,243 వేలకు పైగా ఏ క్షణమైనా నిండి పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా స్థానికంగానే ఉండి ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలుగు దుంకుతున్నాయి.. ప్రస్తుతం కరీంనగర్, గజ్వేల్, ఖమ్మం, వరంగల్ డివిజన్ల పరిధిలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కరీంనగర్ డివిజన్లో 2,889 చెరువులకు గానూ 1,500, వరంగల్ జిల్లాలో 2,946 చెరువులకు 1,720 చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో 1,409 చెరువులకు గానూ ఏకంగా 1,400 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గజ్వేల్ డివిజన్లోని 6,308 చెరువుల్లో 4 వేల చెరువులు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1,246 చెరువుల్లో మూడు, నాలుగు చెరువులు మినహా మిగతా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. కృష్ణా బేసిన్లో సూర్యాపేట జిల్లాలో 1,314 చెరువుల్లో 985 చెరువులు, నల్లగొండలోని 1,927 చెరువుల్లో 800 చెరువులు నిండినట్లు సాగునీటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. చెరువుల కట్టలు తెగకుండా రెవెన్యూ, మున్సిపల్, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం నిండేందుకు సిద్ధంగా నిజాంసాగర్, సింగూరు ప్రస్తుత వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకోగా, సింగూరు, నిజాంసాగర్లు కూడా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజాంసాగర్కు స్థానిక వాగుల నుంచి 26,823 క్యూసెక్కుల మేర వరద కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నిల్వ 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 12.93 టీఎంసీలకు చేరింది. ఇక సింగూరుకు 23,646 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్కు 24,510 క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదవుతుండగా, 44,940 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లికి 86 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 58 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. -
ప్రాజెక్టులపై వివరణివ్వండి
సాక్షి,హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వార్థపూరిత వైఖరి వల్ల రాష్ట్ర ప్రజల నీటి హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలు, విషయాలపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోల్పోతున్నామని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలకు ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చి తద్వారా వచ్చే కమిషన్ల కోసం పొరుగు రాష్ట్రానికి సహకరిస్తున్నారని, కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆర్ఎల్ఐఎస్ టెండర్ ప్రక్రియ పూర్తికి అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. ఇరురాష్ట్రాల జలవివాదాలపై చర్చకు రెండుబోర్డులూ కేఆర్ఎంబీ సమావేశాలు నిర్వహిస్తున్నా ఈ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని తాము హెచ్చరించినా సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతోందన్నారు. -
చంద్రబాబుపై శ్రీకాంత్రెడ్డి ధ్వజం
-
చంద్రబాబుకు ఆ అర్హత లేదు: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, కడప: సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమ నీటి కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట అని, ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతలపై తన విధానామేమిటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. గడికోట శ్రీకాంత్రెడ్డి బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘‘796 అడుగులు దాటకుండా తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే.. చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడికి వెళ్లారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు కాబట్టి భయపడ్డారా?.. పాలమూరు - రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు నీటిని తరలించి.. రాయలసీమను ఎందుకు ఎండగడుతున్నారు?రాయలసీమ హక్కులను కాపాడేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే వరకు పోరాటం చేస్తాం. శ్రీశైలంలో నీటి కేటాయింపులు జరిగినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో.. తెలంగాణ నీటిని తోడేస్తుంది..ఇది న్యాయమా’’ అని ప్రశ్నించారు. ‘‘నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్సార్, వైఎస్ జగన్లకు తప్ప.. ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ట్రిబ్యునల్పై తెలంగాణ ప్రభుత్వం ఏ వైఖరి ఉందో.. చంద్రబాబు కూడా అదే ధోరణిలో వంత పాడుతున్నారు’’ అని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. -
దోచుకోవడానికే రీ డిజైన్
అశ్వాపురం: సాగునీటి ప్రాజెక్టులు రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటున్నారని సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులను రూ.3,400 కోట్లతోనే పూర్తి చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టులకు ఇప్పుడు రీడిజైన్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మెరుగైన పరిహారం డిమాండ్ చేస్తూ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శనివారం వారు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబూరావు, ఎన్డీ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, ఆయకట్టు విస్తీర్ణం ఏమాత్రం పెరగకుండా అంచనా వ్యయం మాత్రం వేల కోట్లకు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద నాడు వైఎస్ హయాంలో 6 లక్షల ఎకరాలే సాగయిందని, ఇప్పుడు కూడా సీతమ్మ సాగర్ కింద కూడా 6 లక్షల ఎకరాలే సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. -
జల వివాదం: నిరంతర విద్యుదుత్పత్తి.. ఇద్దరికీ నష్టమే
శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే.. ఆ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించాలి. కానీ ప్రస్తుత నీటి సంవత్సరం మొదటి రోజునే అంటే జూన్ 1న శ్రీశైలంలో 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేసింది. జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు వదిలేసింది. విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే 848 అడుగులు దాటి ఉండేది. శ్రీశైలం.. తెలంగాణ: జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో నీటి మట్టం ఎంత గరిష్టంగా ఉంటే.. విద్యుత్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ ఎత్తులో నీటి మట్టం ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. నీటి మట్టం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్కు సమానం. తక్కువ ఎత్తు నుంచే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం నీటి మట్టం పెరగలేదు. దీనివల్ల తెలంగాణకూ నష్టమే. శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లందించలేని దుస్థితి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు: శ్రీశైలంలో నీటి మట్టం కనీసం 848 అడుగులకు చేరితేనే దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, చెన్నై నగరానికి అత్యవసరాల కోసం రెండు వేల క్యూసెక్కులనైనా తరలించే వీలు ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నాగార్జునసాగర్.. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి వదిలేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షం వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో జూన్ 1 నుంచి ఇప్పటిదాకా నాగార్జునసాగర్లోకి 28.26 టీఎంసీలు వచ్చాయి. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ 31.22 టీఎంసీలను దిగువకు వదిలేసింది. తెలంగాణ: సాగర్లో 510 అడుగుల కంటే నీటి మట్టం దిగువకు చేరితే హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కాదు. సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్: సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. పులిచింతల.. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. విజయవాడ సర్కిల్ ఎస్ఈ ఆయకట్టుకు రోజు నిర్దిష్టంగా ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలో ప్రతిపాదనలు పంపితేనే.. ఆ మేరకు నీటిని వినియోగిస్తూ తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేయాలి. కానీ తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సాగర్ నుంచి తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న ప్రవాహానికి స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వచ్చే ప్రవాహం తోవడంతో ఇప్పటిదాకా పులిచింతల ప్రాజెక్టులోకి 36.64 టీఎంసీలు వస్తే విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు. 6.67 టీఎంసీలను తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేసింది. ఇందులో 5.55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలో కలిశాయి. మిగిలిన జలాలు నదిలో ప్రవాహం రూపంలో ఉన్నాయి. తెలంగాణ: తక్కువ ఎత్తు నుంచి ఉత్పత్తి చేయడం వల్లే.. ఎక్కువ నీటిని ఉపయోగించినా తక్కువ విద్యుత్తే అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్: కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, పశ్చి మగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్ పంటలకు రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. దీంతో పులిచింతల నుంచి తెలంగాణ వదిలేసిన నీటిని వదిలేసినట్లుగా వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఇలా ఇప్పటిదాకా 5.55 టీఎంసీలు వృథా అయ్యాయి. బోర్డు పరిధి.. ప్రాజెక్టులు కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసినా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దీంతో తరచూ జల వివాదాలు ఉత్పన్నమవుతున్నా బోర్డు చేతులెత్తేస్తోంది. ఈ వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదాను ఇరు రాష్ట్రాలకు పంపింది. ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తిని సైతం పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఏడేళ్లుగా బోర్డు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా దీనిపై తేలడం లేదు. పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇవే... బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. -
'నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతుంది..'
సాక్షి, అమరావతి: సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్లకు అడ్డుతగులుతూ, తన అనూనయులతో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయించిన చంద్రబాబు రైతు ద్రోహి అని, అలాంటి వ్యక్తి చిత్తూరు గడ్డపై పుట్టడం ఆ జిల్లా వాసుల దురదృష్టమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గతంలో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్లపై ప్రసాద్ నాయుడు అనే తన అనుకూలస్తుని చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకంతో పాటు జగన్ గారు మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయించాడు రైతు ద్రోహి. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 రైతులు చల్లగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు.. సొంత జిల్లా ప్రాజెక్ట్లపైనే స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు. తనకు రాజకీయ బిక్షపెట్టిన సొంత గడ్డకు మేలు చేయాల్సింది పోయి, సాగునీటి ప్రాజెక్ట్లకు అడ్డుతగులుతూ, ఆ ప్రాంత రైతుల కడుపు కొడుతున్న రైతు ద్రోహి చంద్రబాబు అని విమర్శించాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించిన చంద్రబాబును చూసి నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ!— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 -
జల జగడం
సాక్షి నెట్వర్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కాగా సాగర్ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు. పులిచింతలలో వినతిపత్రం అందజేత మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చెక్పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు.. కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. -
ఆ పాపం కేసీఆర్దే: భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్కు స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగుగంగ ప్రారంభమైందని.. అప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నారని.. ఆ సమయంలో తెలంగాణ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. జనంలో ఇప్పుడు కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ఇలా ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క శుక్రవారం మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కృష్ణ, గోదావరి నీళ్ళును పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలనే మన ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ రెండు నదులపై కేసీఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు పాపం... కేసిఆర్దే.. ‘‘1985-86 ప్రాంతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు నువ్వేం చేశావు. ఆనాడు కరువు మంత్రిగా ఉన్న కేసీఆర్.. పోతిరెడ్డిపాడుకు నాంది పలికాడు. దానికి ఆయనే బాధ్యుడు. మీ నాయకత్వంలోనే పోతిరెడ్డిపాడు మొదలైంది. దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక్క టీఎంసీ లెక్కన 15 టీఎంసీలు చెన్నై నగరానికి తాగునీళ్లు తీసుకునిపోయే పోతిరెడ్డిపాడును మొదలు పెట్టిందే మీరు. ఓపెన్ కెనాల్ పెట్టడం వల్లే వాళ్లు రిజర్వాయర్లు పెట్టి నీళ్లు తోడుకోవడం, ఇంత అడ్డగోలుగా నీళ్లు తీసుకెళ్లడం జరిగేది కాదు. అప్పుడు మంత్రిగా ఉన్న కేసీఆర్ ఏం చేశారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్పై భట్టి ధ్వజమెత్తారు. పాపం కేసీఆర్ చేసి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్పై నిందలా? ‘‘కృష్ణా నదిపై కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు - రంగారెడ్డి, డిండి మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ కొన్ని వేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకూ కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?? కొత్త ప్రాజెక్టులతో కేసీఆర్ నీళ్లు ఇవ్వకపోగా.. గత ప్రాజెక్టులు కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో 3.4 లక్షల ఎకరాలు, ఎస్సెల్బీసీ ఎఎంఆర్ తో 3.7 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, మొత్తం 9 లక్షల 10 వేల ఎకరాలు. వీటితో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 6 లక్షల 40 వేల ఎకరాలు15 లక్షల 50 వేల ఎకరాలకు కేసీఆర్ రాకముందే నీళ్లు ఇచ్చాయి. భావోద్వేగాలు రెచ్చ గొట్టి .. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తప్పంతా కేసీఆర్దే. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏడాది పాటు ఆగి ఇప్పుడు... మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు. కేసీఆర్కు చిత్తశుద్ది రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన రోజే మాట్లాడేవారు. ఏడాది వరకూ ఎందుకు మాట్లాడలేదు. పాపం మీరు చేసి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై నిందలా’’ అని భట్టి.. సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. చదవండి: Huzurabad: బిగ్ఫైట్కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
అవుకు సొరంగం పనులు కొలిక్కి..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్ శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్ జోన్ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్ ఫిల్లింగ్’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్ నుంచి నిపుణులను రప్పించారు. -
Kharif Crop: ఖరీఫ్కు రెడీ
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటలకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు జూన్ 15న నీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులు పూర్తవడం ఆధారంగా రెం డు మూడ్రోజుల ముందే అంటే జూన్ 12నే గోదా వరి డెల్టాకు నీటి విడుదల చేసే అవకాశాలను పరి శీలిస్తున్నట్లు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే జలాలు, కృష్ణా వరద ప్రవాహాల ఆధారంగా కృష్ణా డెల్టా, వంశధారలో ప్రవాహాల ఆధారంగా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, నీటి లభ్యతను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని నీటిని విడుదల చేయనున్నారు. రెండేళ్లుగా కళకళ.. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, చిన్న నీటివనరుల విభాగం కింద రాష్ట్రంలో 1.33 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ పంటల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అదే తరహాలో ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టి సమర్థవంతంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది. స్పిల్ వే మీదుగా వరద మళ్లింపు.. పోలవరం స్పిల్ వే మీదుగా గోదావరి వరద మళ్లింపు పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వే పనులు పూర్తవుతూనే వరదను పోలవరం స్పిల్ వే మీదుగానే దిగువకు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవుతూనే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 11.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరి వరద మట్టం 14 మీటర్లు దాటాక పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించడాన్ని ప్రారంభిస్తారు. పులిచింతల్లోకి వచ్చే వరద, ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వంశధారలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే గొట్టా బ్యారేజీ కుడి కాలువ ద్వారా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. నాగావళిలో వరద ప్రవాహం ఆధారంగా తోటపల్లి బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. శివారు భూములకూ నీళ్లందేలా.. గత రెండేళ్ల తరహాలోనే ఆయకట్టు చివరి భూములకూ సమర్థంగా నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాలువలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 807 మరమ్మతుల పనులను కడా(ఆయకట్టు ప్రాంత అభివృద్ది సంస్థ) నేతృత్వంలో రూ.104.21 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు డెడ్లైన్ విధించారు. కాలువలోకి నీటిని విడుదల చేసేలోగా మరమ్మతు పనులు పూర్తయితే నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందన్నది అధికారుల ఉద్దేశం. తద్వారా ఆయకట్టు చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించనున్నారు. -
సకాలంలో ప్రాజెక్టుల ఫలాలు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా సకాలంలో పూర్తి చేసి, వాటి ఫలాలను రైతులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రణాళికాయుతంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా అవాంతరాలు లేకుండా చూడటం ద్వారా గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై బుధవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరంతో సహా ఇతర ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోల్చితే.. ఈ 18 నెలల కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాక, మిగిలిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 45 రోజులు అత్యంత కీలకం ► వర్షాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులపై మరింతగా దృష్టి సారించడంలో భాగంగా కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి చేయడం, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ గేట్ల బిగింపు, ప్రధాన డ్యాం (ఈసీఆర్ఎఫ్ – ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) తదితర కీలక పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ► మే నెలాఖరుకు కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి సంబంధించిన అప్రోచ్ చానల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటిని కూడా మే నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ► దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తి చేయడం, అప్రోచ్ చానల్ను పూర్తి చేయడం అన్నది అత్యంత ఆవశ్యకమన్నారు. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్పిల్ చానల్లో మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ► రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వర్షాలు వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గోదావరికి వరద వచ్చినా స్పిల్ వే మీదుగా మళ్లించి.. కాఫర్ డ్యాంల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులను చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని చెప్పారు. జలవనరుల శాఖపై సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి ► ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, వెలిగొండ ప్రాజెక్టు, వంశధార – నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్–2 స్టేజ్ –2 పనులపై సీఎం వైఎస్ జగన్ లోతుగా సమీక్షించారు. ► నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అవుకు టన్నెల్–2లో కెమికల్ పోరింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తద్వారా ఆగస్టు నాటికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించేలా అవుకు టన్నెళ్లను సిద్ధం చేస్తామన్నారు. ► వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1 ఇప్పటికే పూర్తయిందని, డిసెంబర్ నాటికి రెండో టన్నెల్ను పూర్తి చేస్తామని వివరించారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్ నాటికి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ► దీనిపై సీఎం స్పందిస్తూ.. నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టండి ► వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2లో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ► నేరడి బ్యారేజీ నిర్మాణంలో ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్–2, తారక రామ తీర్థసాగరం తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టి శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ► రాయలసీమ కరువు నివారణ పథకం, పల్నాడు కరువు నివారణ పథకం కింద చేపట్టనున్న ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ► ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవాంర సమీక్ష నిర్వహించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. కాఫర్ డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పిల్ ఛానల్లో మట్టి, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్ నాటికి వెలిగొండ రెండో టన్నెల్ పూర్తవుతుందన్నఅధికారులు.. వంశధారలో ఫేజ్-2, స్టేజ్ -2 పనులు జులై నాటికి పూర్తి చేస్తామన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్లను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: బీళ్ల చెంతకు నీళ్లు -
నీటి పారుదలకు భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా.. ఈసారి సర్కారు అధికంగా ఇచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని పారించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్లో నిధులను పెంచింది. శాఖకు మొత్తంగా రూ. 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉండటంతో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాదికన్నా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు రూ. 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాలే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో... ఈసారి బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు రూ. 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ. 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపుల్లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు రూ.8 వేల కోట్ల మేర కోరారు. అయినా రూ. 918 కోట్లే్ల కేటాయించారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు కోరినా రూ. 960 కోట్లు, సీతారామకు రూ.689 కోట్లు, డిండికి రూ.545 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం రూ. వెయ్యి కోట్లు కోరగా రూ. 50 కోట్లు కేటాయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ. 400కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయి చెక్డ్యామ్ల నిర్మాణమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్కు కోతపడింది. ఈ ఏడాది రూ. 1,196 కోట్లే సర్దారు. మళ్లీ రుణాలే.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం ఒక టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతోనే కనీసం రూ. 15 వేల కోట్ల మేర ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను గట్టెక్కించేలా ప్రణాళికలు వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతలలో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం లక్ష ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100 శాతం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనుల పూర్తికి కనీసం రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రూ. 17 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 20 వేల కోట్లకుపైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి. ‘కాళేశ్వరం’ నిర్వహణకే రూ. 7 వేల కోట్లు... బడ్జెట్లో నిర్వహణ పద్దుకు కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.10,506.58 కోట్లకు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్దు కింద రూ. 5,219 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో రూ. 76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ. 44 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 32 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. చీఫ్ ఇంజనీర్ డివిజన్లవారీగా ప్రగతి పద్దు కింద కేటాయింపులు (రూ. కోట్లలో) విజన్ కేటాయింపు రామగుండం 100 గజ్వేల్ 930 కరీంనగర్ 100 ఆదిలాబాద్ 255 నిజామాబాద్ 54 వరంగల్ 85 సంగారెడ్డి 20 నల్లగొండ 959.89 మహబూబ్నగర్ 25 ఖమ్మం 5 మంచిర్యాల 100 కామారెడ్డి 100 జగిత్యాల 50 ములుగు 50 సూర్యాపేట 40.30 వనపర్తి 312 నాగర్ కర్నూల్ 1,035 కొత్తగూడెం 700 హైదరాబాద్ – ప్రధాన ప్రాజెక్టుల కింది కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో) ప్రాజెక్టు కేటాయింపు కాళేశ్వరం 918 పాలమూరు–రంగారెడ్డి 960 సీతారామ 689.48 డిండి 545.42 ఎస్ఎల్బీసీ 331.41 కల్వకుర్తి 75 నెట్టెంపాడు 192.75 భీమా 57 దేవాదుల 49.90 ఎల్లంపల్లి 99.88 లోయర్ పెన్గంగ 199.50 మిషన్ కాకతీయ 750 -
సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో తొలివిడత కింద చేపట్టిన పోలవరం, వెలిగొండ, నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు సొరంగం (టన్నెల్), వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను గడువులోగా పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ ఛానల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేయాలని.. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యామ్వల్ల నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా వారికి పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రెండో విడత ప్రాధాన్యత కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షిస్తున్న సీఎం జగన్ గడువులోగా పోలవరం పూర్తిచేయాల్సిందే.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని.. అందువల్ల దీనిని నిర్దేశించుకున్న గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ఫిబ్రవరి 10 నాటికి స్పిల్ వే బ్రిడ్జి పూర్తిచేస్తామని.. స్పిల్ ఛానల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ నాటికి స్పిల్ వేకు 48 రేడియల్ గేట్లను అమర్చుతామని.. అప్రోచ్ ఛానల్ను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాంలో రీచ్–1ను మార్చి నెలాఖరుకు, రీచ్–2ను ఏప్రిల్ నెలాఖరుకు, రీచ్–3ను మే నెలాఖరుకు, రీచ్–4ను మార్చికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని.. స్పిల్ వే మీదుగా గోదావరి వరదను మళ్లించి.. కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)ను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా గడవులోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ప్రత్యేకాధికారిని నియమించండి కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిజైన్ల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రేడియల్ గేట్లకు అమర్చే హైడ్రాలిక్ సిలిండర్లలో మిగిలిన వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం కాకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యాం కారణంగా నిర్వాసితులు ఎవరూ ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని.. గోదావరికి వరద వచ్చేలోగా ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించకున్న ప్రణాళిక ప్రకారం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. శరవేగంగా పెన్నాపై జంట బ్యారేజీలు పెన్నా నదిపై నిర్మిస్తున్న నెల్లూరు, సంగం బ్యారేజీల పనులను కూడా గడువులోగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మార్చి 31లోగా గేట్లను బిగించే పనులు పూర్తవుతాయని.. ఏప్రిల్లో బ్యారేజీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే, సంగం బ్యారేజీలో రెండు వారాల్లో గేట్లను బిగించే పనులను ప్రారంభిస్తామని.. మార్చి ఆఖరుకు పూర్తిచేసి దీనిని కూడా ఏప్రిల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు వివరించారు. వేగంగా అవుకు టన్నెల్ పనులు.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో ఇప్పటికే రెండు టన్నెల్స్ నుంచి దాదాపు 14వేల క్యూసెక్కుల వరకూ నీటిని సరఫరా చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. వర్షాలు, లూజ్ సాయిల్వల్ల అవుకు రెండో టన్నెల్లో 134 మీటర్ల తవ్వకం పనులు సంక్లిష్టంగా మారాయని.. సొరంగంలో విరిగిపడ్డ మట్టిని తొలగించే పనులు, పటిష్టం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామని అధికారులు వివరించారు. జూలై నాటికి రెండో టన్నెల్ పనులు పూర్తిచేస్తామని.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను సరఫరా చేస్తామని చెప్పారు. సకాలంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి.. ఇక వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1 తవ్వకం పనులపై అధికారులు మాట్లాడుతూ.. అవి పూర్తయ్యాయని.. లైనింగ్ పనులు చేస్తున్నామని సీఎంకు వివరించారు. టన్నెల్–1 హెడ్ రెగ్యులేటర్ పనులూ పూర్తిచేశామన్నారు. టన్నెల్–2 హెడ్ రెగ్యులేటర్ పనులను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి.. మూడున్నర నెలల్లో పూర్తిచేస్తామన్నారు. వీటిని ఆగస్టుకల్లా పూర్తిచేసేందుకు ప్రయస్తున్నామని చెప్పారు. ఈ రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామన్నారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు అక్టోబర్ నాటికి పునరావాసం కల్పించే పనులను పూర్తిచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఆయకట్టుకు నీళ్లందించే కాలువల తవ్వకం పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. వేగంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు.. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల అంశం చర్చకు రాగా.. వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశలోని మూడు ప్యాకేజీల్లో మిగిలిన పనులను జూలై నాటికి పూర్తిచేసి.. ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్కల్లా పూర్తిచేస్తామన్నారు. – అలాగే, తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ బ్యారేజీలో మిగిలిన పనులను 2022, జూన్ నాటికి పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలకు 2022, జూన్ నాటికి నీళ్లందించేలా పనులను పూర్తిచేస్తామని చెప్పారు. తారాకరామ తీర్థసాగరం పనుల్లో న్యాయపరమైన వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుని.. డిసెంబర్, 2022 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వారు వివరించారు. మహేంద్రతనయ ప్రాజెక్టును జూన్, 2022 నాటికి పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేశామన్నారు. – ఇదిలా ఉంటే.. రెండో దశ ప్రాధాన్యత కింద చేపట్టే ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వాటితోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కూడా కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ఐదు ఎస్పీవీలపై ప్రత్యేక దృష్టి మరోవైపు.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, కృష్ణా–కొల్లేరు సెలైనటీ మిటిగేషన్ ప్రాజెక్టులు, ఏపీ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి సంబంధించి ఏర్పాటుచేసిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్)లపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపైనా సీఎం జగన్ సమీక్షించారు. వీటికి నిధుల సమీకరణపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. రాయలసీమ, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు వివిధ ఆర్థిక సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించాయని చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టామన్నారు. వరికిపూడిశెల ఎత్తిపోతల పనులు వేగంగా చేస్తున్నామని అధికారులు వివరించారు. -
కృష్ణా బోర్డే సుప్రీం
సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో బోర్డు కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కోరారు. ♦ కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం) –2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ♦ కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలి్చచెప్పారు. (కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’) కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు తుంగభద్ర నదిపై.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెచ్చెల్సీ తుమ్మిళ్ల ఎత్తిపోతల ఎల్లెల్సీ - కేసీ కెనాల్ ఆర్డీఎస్ కృష్ణా నదిపై.. జూరాల ప్రాజెక్టు: తెలంగాణ 1.జూరాల ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం 2.జూరాల కుడి కాలువ, ఎడమ కాలువ 3.భీమా ఎత్తిపోతల 4.నెట్టెంపాడు ఎత్తిపోతల 5.కోయిల్సాగర్ ఎత్తిపోతల శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, (తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి) 1.కల్వకుర్తి ఎత్తిపోతల 2.కుడి విద్యుత్కేంద్రం 2.ఎడమ విద్యుత్కేంద్రం 3.హంద్రీ–నీవా (మల్యాల) 3.పాలమూరు–రంగారెడ్డి, డిండి 4.హంద్రీ–నీవా (ముచ్చుమర్రి) 4.ఎస్సెల్బీసీ 5.వెలిగొండ - నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ 1.సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2.జలవిద్యుత్కేంద్రం 3.ఏఎమ్మార్పీ 4.ఎఫ్ఎఫ్సీ 5.హైదరాబాద్ తాగునీటి పథకం పులిచింతల ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే 1.జలవిద్యుత్కేంద్రం ప్రకాశం బ్యారేజీ 1.కృష్ణా డెల్టా కాలువలు చిన్న నీటి వనరుల విభాగం: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1.భైరవానితిప్ప ప్రాజెక్టు 1.సీతారామభక్త ఎత్తిపోతల 2.గాజులదిన్నె ప్రాజెక్టు 2.డిండి ప్రాజెక్టు 3.మూసీ ప్రాజెక్టు 4.పాలేరు ప్రాజెక్టు.. తదితర చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ► కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 23న బోర్డు పరిధిపై ముసాయిదాను కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం కేంద్రానికి పంపారు. దిగువ కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ► ఈ ప్రాజెక్టుల స్పిల్ వే లతోపాటు జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన భైరవానితిప్ప, గాజులదిన్నె, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులు, సీతారామభక్త ఎత్తిపోతల పథకాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ శాఖ మంత్రి ఆమోద ముద్ర వేయగానే బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేయనుంది. ► ఈ ప్రాజెక్టుల వద్ద పనిచేసే ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు పరిధిలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి లభ్యతను బట్టి.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. () -
గజేంద్ర సింగ్తో ముగిసిన కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. శనివారం పౌరవిమానయాన, హౌసింగ్శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
ప్రాజెక్టులకు ప్రాధాన్యం
గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రూ.803.96 కోట్ల వ్యయంతో అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పనులు చేపట్టే విధంగా గత ప్రభుత్వ హయాంలో 2018 జనవరి 24వ తేదీన జీఓ జారీ చేసినా పనులు మాత్రం జరగలేదు. మన ప్రభుత్వం అదే సొమ్ముతోనే అదనంగా రెండు రిజర్వాయర్లను నిర్మించి, అదనంగా మరో 3.3 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏరకంగా లంచాలు కట్టడి చేస్తున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. హంద్రీ–నీవాలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టిఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన ప్రధాన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మిస్తాం. తద్వారా 75 వేల ఎకరాలకు సాగునీటితో పాటు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. సాక్షి, అమరావతి: సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగు పడి, పేదరిక నిర్మూలనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతులు, రైతు కూలీల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే కాకుండా.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్ విధానంలో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హంద్రీ–నీవాలో అంతర్భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు నామ్ కే వాస్తేగా చేపట్టామంటే.. చేపట్టామన్నట్లు చేసి, ఆ తర్వాత వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ పథకం పనులు మొదలు పెట్టడమే కాకుండా.. వాటి సామర్థ్యం పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్ల పనులు కూడా చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలప్పుడు ఇదే రాప్తాడు నియోజకవర్గం మీదుగా నేను పోతున్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ, అభిమానం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అడుగు ముందుకు వేస్తున్నాను. వర్చువల్ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి అనిల్ 75 వేల ఎకరాలు సస్యశ్యామలం ► అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 90 రోజుల్లో 7.216 టీఎంసీలను తరలించి.. అప్పర్ పెన్నార్తోపాటు కొత్తగా నిర్మించే సోమరవాండ్లపల్లి, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాలను నింపుతాం. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించి, సస్యశ్యామలం చేస్తాం. ► ఈ ప్రాజెక్ట్ కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ. ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలను నిర్మిస్తాం. ► కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దలచెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. ప్రస్తుతం 1.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న అప్పర్ పెన్నార్ జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.024 టీఎంసీలు, తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీలు, దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు, సోమరవాండ్లపల్లి జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ► అప్పర్ పెన్నార్ జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18 వేల ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమరవాండ్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా పేరు పెడుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. అనంతపురం పరిస్థితుల్లో మార్పు దేవుడి దయతో కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. జలాశయాలన్నీ నీటితో నిండాయి. మీ అందరి చల్లని దీవెనలతో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలూ అమలు చేస్తున్నాం. ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, విలేజ్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి మంత్రి అనిల్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వెంకటంపల్లి పైలాన్ వద్ద కార్యక్రమంలో మంత్రులు బొత్స, అప్పలరాజు, శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్రెడ్డి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
బీళ్ల చెంతకు నీళ్లు
సాక్షి, అమరావతి: బీడు భూముల్లోనూ నీరు పారించి.. రైతన్నల ఇంట సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికతో వడివడి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేసేలా మున్ముందుకు వెళుతోంది. ఇందుకు రూ.20,264 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 24,82,071 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. వీటిని పూర్తి చేయడం ద్వారా 25,54,285 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి.. మొత్తమ్మీద 50,36,356 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సీజన్లోనే 6 ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా.. గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార ప్రాజెక్టు స్టేజ్-2 ఫేజ్-2, వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులను ఈ సీజన్లోనే పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా కరువన్నదే లేని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. అందులో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. దానికయ్యే వ్యయాన్ని భరిస్తామని హామీ ఇచ్చింది. దీనిని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘జలయజ్ఞం’ కింద చేపట్టిన మిగిలిన 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించింది. మూడు విభాగాలుగా.. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ, సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మూడు విభాగాలుగా జల వనరుల శాఖ వర్గీకరించింది. కొత్తగా లక్ష ఎకరాలు సాగులోకి వచ్చే, రూ.500 కోట్లలోపు వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద గుర్తించింది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం చేయాల్సిన ప్రాజెక్టులు, కొత్తగా లక్ష కంటే ఎక్కువ ఎకరాలు సాగులోకి వచ్చే వాటిని రెండో ప్రాధాన్యతగా గుర్తించింది. ఈ రెండు విభాగాల కిందకు రాని ప్రాజెక్టులను మూడో ప్రాధాన్యత కింద వర్గీకరించింది. ఈ మూడు విభాగాల్లోని ప్రాజెక్టుల పనులను సమాంతరంగా చేస్తూ.. 2024లోగా అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. పకడ్బందీగా ప్రణాళికతో.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం పెరగడంతోపాటు.. వాటి ఫలాలను రైతులకు అందించడం ఆలస్యమవుతుందని భావించిన ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తోంది. మొదటి ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో ఆరింటిని వచ్చే మార్చిలోగా పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. మరోవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2022 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేసింది. ద్వితీయ ప్రాధాన్యం కింద చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్, ముసురుమిల్లి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ తదితర ప్రాజెక్టులను 2022 నాటికి పూర్తి చేయనుంది. తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో హెచ్చెల్సీ ఆధునికీకరణ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాలను 2024 నాటికి సమగ్రంగా పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. 2024 నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టి, నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేస్తాం. జలయజ్ఞ ఫలాలను రైతులకు పూర్తి స్థాయిలో అందించి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం. - డాక్టర్, పి.అనిల్కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి 50 లక్షల ఎకరాలు సస్యశ్యామలం: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే 50.36 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. వీటిని 2024 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ దిశగా పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. - ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జల వనరుల శాఖ 42 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక ఇదీ.. ప్రాధాన్యత విభాగం ప్రాజెక్టుల సంఖ్య పూర్తి చేసేందుకు అయ్యే నిధులు (రూ.కోట్లలో) కొత్త ఆయకట్టు స్థిరీకరణ అయ్యే ఆయకట్టు (ఎకరాలు) మొదటి 19 15,005 22,77,039 8,82,214 ద్వితీయ 9 1,104 1,35,547 1,43,722 తృతీయ 14 4,155 69,485 15,28,349 మొత్తం 42 20,264 24,82,071 25,54,285 -
మే నాటికి పనులు పూర్తవ్వాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి అంశంపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే నాటికి పనులు పూర్తవ్వాలి సమీక్షా సమావేశంలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. అంతేగాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. అదే విధంగా, ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్ (అప్లెక్స్ లెవల్)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ అదేశించారు. (చదవండి: మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు) పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ వారిని ఆదేశించారు. అవుకు టన్నెల్-2 అవుకు టన్నెల్-2 పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. అదే విధంగా, అవుకు మూడో టన్నెల్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా... సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. ఇందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్... ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసిన విషయాన్ని తెలపగా... ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు నింపగలిగామని అన్నారు. అదే విధంగా గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు.. గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వచేయగలిగామని అధికారులు తెలపగా... 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. -
మెట్ట రైతు మేలు కోసం
-
3 రాజధానులతో మూడు ప్రాంతాలకు సమన్యాయం
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేలకోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. పల్నాడులో కరువు నివారణ కోసం వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి ఎత్తి పోతలను శర వేగంగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టాం. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.3,500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులతోపాటు మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, వ్యవసాయం విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెన్నా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. మొత్తంగా మెట్ట ప్రాంతాలైన దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్ మిషనరీ (సీఎం), క్రాస్ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం, పంపింగ్ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇదే ప్రాజెక్టుకు సంబంధించి రూ.527.53 కోట్లతో ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించామని చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయిందని, అవినీతికి చెక్ పెట్టామని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కండలేరు, రాళ్లపాడు జలాశయాలను వేగంగా నింపేలా చర్యలు ► నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. వాటి పనులు నత్తనడకన జరుగుతుంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. ► పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి, కండలేరు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–కండలేరు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచేలా అభివృద్ధి (డబ్లింగ్ వర్క్స్) పనులను రూ.918 కోట్ల వ్యయంతో చేపడతాం. ► రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–రాళ్లపాడు కాలువ సామర్థ్యాన్ని 720 క్యూసెక్కుల నుంచి 1,440 క్యూసెక్కులకు పెంచుతూ అభివృద్ధి చేసే పనులను రూ.632 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాం. ► కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పైలాన్ వద్ద మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్రెడ్ది తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాదే ఆరు ప్రాజెక్టులు పూర్తి ► జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ► వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ఈ ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. -
ప్రాజెక్టుల పురోగతిపై నిజాలకు నీళ్లు
ఎల్లోవైరస్ కమ్మేసిన కళ్లకు ఇంతకన్నా ఏం కనిపిస్తుంది? ఎందుకంటే వీళ్లకు చంద్రబాబైతే ఓకే!. చంద్రబాబు మాత్రమే ఓకే!!. ఆయన నిద్రపోతున్నా రామోజీ కళ్లకు రన్నింగ్ చేస్తున్నట్లే కనిపిస్తాడు. అదంతే!!. టీడీపీ సర్కారు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగాన్ని సగటున రోజుకు ఒకే ఒక్క అడుగు తవ్వారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సొరంగం పనులను చూస్తే సగటున రోజుకు 7 మీటర్లు తవ్వుతున్నారు. కానీ ‘ఈనాడు’ కళ్లకు ఏనాడూ ఇది కనిపించదు. అధికారంలో ఉన్నది బాబు కాదు కనుక ఇప్పుడు పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని రాసేస్తారు. ఇక సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో పనులు కదిలితే ఒట్టు. అదనపు బిల్లుల రూపంలో కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించేసి మరో 20 కోట్లు బాకీ పెట్టారు తప్ప పనులైతే కదల్లేదు. వైఎస్ జగన్ హయాంలో పనులు ఊపందుకుని 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతావి వేగంగా పూర్తిచేసి త్వరలో బ్యారేజీని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ఇవేవీ రామోజీ కళ్లకు కనిపించవు. నీళ్లొదిలేశారు కనక నిజాలతో వీళ్లకు పనిలేకపోవచ్చు. కానీ నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ సవివర కథనం... 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 600 మీటర్ల పనులు మాత్రమే చేశారు. అంటే రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే పనులు జరిగాయి. 2019 నవంబర్ నుంచి 2020 అక్టోబర్ 30 వరకు 2,512 మీటర్ల పనులు చేశారు. అంటే.. రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు. మార్చి నుంచి జూలై వరకూ లాక్డౌన్ కొనసాగింది. జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు. సాక్షి, అమరావతి: కడలిలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి.. బంజరు భూములకు మళ్లించి.. కరువన్నదే ఎరుగని నేలగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి రచించిన ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ సీజన్లో గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం–2, వెలిగొండ తొలి దశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార ఫేజ్–2, స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్ డౌన్ విధించడంతో కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. జూన్ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరదలు వస్తున్నాయి. అయినప్పటికీ షెడ్యూలు ప్రకారమే పనులు సాగుతుండటం గమనార్హం. ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయకుండానే రూ.68,293.94 కోట్ల వ్యయం ► 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులు, నీరు–చెట్టు పథకాల కింద రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయింది. ► జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63(పరిమాణాల ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్లకు అదనపు నిధులను దోచిపెట్టారు. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు. ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తన ఖాతాలో వేసుకునే దుస్సాహసానికి టీడీపీ సర్కార్ పాల్పడింది. అప్పట్లో సింహభాగం పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంలోనూ టీడీపీ సర్కార్ విఫలమైంది. కానీ ఈ వైఫల్యాలు అప్పట్లో ‘ఈనాడు’కు కన్పించకపోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. 17 నెలల్లో రూ.8,090.4 కోట్లు వ్యయం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రాధాన్యత ప్రాజెక్టులకు రూ.8,090.4 కోట్లు ఖర్చు చేసింది. మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ప్రాజెక్టులను వరుసగా మూడేళ్లలో పూర్తి చేయడం ద్వారా బంజరు భూములను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పోలవరం పనులు చకచకా ఐదు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ అడుగులు ముందుకు వేశారు. కుడి, ఎడమ కాలువ పనులు సింహభాగం పూర్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, తామే పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కమీషన్ల కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిరీ్వర్యం చేశారు. నిర్మాణ బాధ్యతను తీసుకుని.. జలాశయం పనుల్లో స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేసి గ్రామాలను గోదావరి వరద ముంపునకు గురిచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేసి రూ.838 కోట్లు ఆదా చేసింది. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం జగన్ కార్యాచరణ రూపొందించి, పనులను పరుగెత్తిస్తున్నారు. వరద ఉధృతిలోనూ 24 గంటలూ స్పిల్ వే పనులు జరుగుతున్నాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు, వాటి మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు, కాలువలను జలాశయానికి అనుసంధానించే కనెక్టివిటీ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వంశధార–నాగావళి అనుసంధానం ► శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. వంశధారలో జూన్ నుంచే వరద ప్రారంభమైతే.. నాగావళి నదిలో వరద ఆలస్యంగా ప్రారంభమవుతుంది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్లో నీళ్లందించలేని పరిస్థితి. ► వంశధార రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 33.583 కి.మీ పొడవున తవ్వే హైలెవల్ కెనాల్ ద్వారా రోజుకు 600 క్యూసెక్కుల వంశధార జలాలను తరలించి.. నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతం వద్ద నాగావళిలోకి తరలించడం ద్వారా నారాయణపురం ఆనకట్ట ఆయకట్టులో ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాలను స్థిరీకరించనున్నారు. హైలెవల్ కెనాల్ తవ్వకం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్లోగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవుకు సొరంగం ► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట జలాశయానికి తరలించాలి. కాలువలో అవుకు జలాశయానికి ముందు పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 5.75 కి.మీల పొడవున రెండు సొరంగాలు(టన్నెల్స్) తవ్వాలి. కుడి సొరంగంలో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు) అడ్డు రావడంతో ప్రత్యామ్నాయంగా రెండు మళ్లింపు సొరంగాలు తవ్వి పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించేలా పనులు చేపట్టారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కుడి సొరంగంలో 165 మీటర్ల మేర ఏర్పడిన ఫాల్ట్ జోన్ను, ఎడమ సొరంగాన్ని పూర్తి చేసి.. 20 వేల క్యూసెక్కులు తరలించేలా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ► 22 మీటర్ల పని పూర్తయ్యింది. ఆ తర్వాత వర్షాలతో మట్టి పెళ్లలు ఊడిపడటంతో పనులకు సాంకేతిక సమస్య ఏర్పడింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కెమికల్ గ్రౌటింగ్ ద్వారా పైకప్పును స్థిరీకరించి.. పైపులను అమర్చి లైనింగ్ చేసే పనులు చేపట్టారు. నిపుణులైన కార్మికులను రప్పించి.. 143 మీటర్ల మేర గ్రౌటింగ్ పనులను వేగవంతం చేశారు. వెలిగొండ ► శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద జలాల్లో 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాళెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడం.. 15.25 లక్షల మంది దాహార్తి తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టును 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ చేపట్టారు. ► ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయాన్ని అనుసంధానం చేసేలా 18.820 కి.మీల పొడవున ఒకటి.. 18.838 కి.మీల పొడవున మరో సొరంగం తవ్వాలి. వైఎస్సార్ హయాంలో మొదటి సొరంగంలో 15.2 కి.మీ మేర పనులు, రెండో సొరంగంలో 10.75 కి.మీ పనులు పూర్తయ్యాయి. ► టీడీపీ సర్కార్ హయాంలో మొదటి టన్నెల్లో 600 మీటర్లు.. రెండో సొరంగంలో 416 మీటర్ల మేర మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొదటి టన్నెల్లో 2,512 మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 265 మీటర్ల పనులను పూర్తి చేసి, డిసెంబర్లో ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో టన్నెల్ను జూన్కు పూర్తి చేయనున్నారు. వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ► శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార ప్రాజెక్టు రెండో దశకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శ్రీకారం చుట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలని ప్రాజెక్టు డిజైన్ల్లో మార్పులు చేశారు. ► భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్ (మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను వరద కాలువ ద్వారా తరలించి 0.0686 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలతో పారాపురం వద్ద మరొకటి.. హిరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో ఇంకో రిజర్వాయర్ను నిర్మించే పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే 75 శాతం పనులు పూర్తయ్యాయి. ► గత టీడీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో మిగిలిన పనులు పూర్తి చేసింది. హిరమండలం రిజర్వాయర్లో మిగిలిన పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఆయకట్టుకు నీళ్లందించే పిల్ల కాలువల పనులు జరుగుతున్నాయి. 2021 జూలైలో ప్రాజెక్టును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగం బ్యారేజీ ► పెన్నా నదిపై బ్రిటీష్ సర్కార్ హయాంలో 1882–86లో నిర్మించిన సంగం బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కాన్పూర్ కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కష్టంగా మారింది. ► ఈ నేపథ్యంలో పాత బ్యారేజీకి దిగువన 0.45 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా సంగం బ్యారేజీ కమ్ వంతెన నిర్మాణ పనులను 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి పెన్నా డెల్టాకు జీవం పోసేందుకు శ్రీకారం చుట్టారు. బ్యారేజీ పనులకు రూ.32 కోట్లు ఖర్చు చేశారు. సాంకేతిక సమస్యల వల్ల 2013 ఆగస్టు నుంచి పనులు ఆగిపోయాయి. ► బ్యారేజీని పరిశీలించిన నిపుణుల కమిటీ బ్యారేజీ పొడవును 846 నుంచి 1,195 మీటర్లకు పెంచాలని సూచించింది. ఆ మేరకు 2016 ఫిబ్రవరిలో పనులు చేపట్టారు. 2016 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు చేసిన పనులకు బిల్లులు, ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లుల రూపంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించింది. మరో రూ.20 కోట్లు బకాయి పెట్టింది. ఊపందుకున్న పనులు ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీ పనులు ఊపందుకున్నాయి. పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. ► బ్యారేజీకి కుడి వైపు అప్రోచ్ బండ్స్, దిగువన గైడ్ బండ్స్ పనులు పురోగతిలో ఉన్నాయి. బ్యారేజీకి 85 సర్వీసు గేట్లకు గాను 70 గేట్లు పూర్తయ్యాయి. 9 స్టాప్ లాగ్ గేట్లకు గాను ఒక గేటు పూర్తయ్యింది. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. గేట్లను ఎత్తడానికి, దించడానికి వాడే హాయిస్ట్ మెకానిజం పనులకు సంబంధించి 85 గేట్లకుగాను 37 గేట్లకు బిగించే పనులు పూర్తయ్యాయి. 200 మంది కార్మికులు పగలు, రాత్రి షిఫ్టుల ప్రకారం పని చేస్తున్నారు. ► పెన్నా నదిలో వరద ఉధృతి తగ్గగానే మిగిలిన కాంక్రీట్ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 2019 మే నుంచి ఇప్పటి వరకు బ్యారేజీ పనులకు రూ.41 కోట్లు ఖర్చు చేశారు. బ్యారేజీ పనుల్లో 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతా 17.74 శాతం పనులను త్వరితగతిన పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద బ్యారేజీ పనులకు ఇప్పటిదాకా రూ.163.00 కోట్లు ఖర్చు చేశారు. నెల్లూరు బ్యారేజీ ► సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై 1855లో బ్రిటీష్ సర్కార్ నిర్మించిన నెల్లూరు బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో 99,925 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ ఆయకట్టుకు జీవం పోయడానికి పాత బ్యారేజీకి 50 మీటర్ల దిగువన కొత్తగా బ్యారేజీ నిర్మాణ పనులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ► 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు బ్యారేజీ పనులకు గ్రహణం పట్టుకుంది. కాంట్రాక్టర్ చేసిన పనులకు రూ.1.54 కోట్లను కూడా టీడీపీ సర్కార్ చెల్లించలేదు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు గాడిలో పడ్డాయి. లాక్డౌన్ సమయంలో మినహా మిగిలిన రోజుల్లో నిర్విరామంగా పనులు జరుగుతున్నాయి. ► ఇప్పటి వరకు 86.35 శాతం పనులు పూర్తయ్యాయి. వాటికి రూ.127.64 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 13.65 శాతం పనులను శరవేగంగా పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఆయకట్టుకు సాగు నీరుతోపాటు నెల్లూరు నగర దాహార్తి తీరుతుంది. కోవూరుకు రవాణా ఇబ్బందులు తీరతాయి. -
సిబ్బంది లేనిదే నిర్వహణ ఎలా?
తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తోంది. కానీ ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రాజెక్టులలో ఇంజ నీర్లను భర్తీ చేస్తున్నది గానీ, ప్రాజెక్టుల నిర్వహణలో కీలకమైన వ్యవస్థ వర్క్ ఛార్జ్డ్ సాంకేతిక ఉద్యోగులను, కార్మికులను భర్తీ చేయడం లేదు. ప్రాజెక్టులు, కాల్వల ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందించే లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు నేడు నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రాజెక్టులపై వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది మెకానికల్ పనులను నిర్వహిస్తూ ప్రాజెక్టులను కాపాడేవారు. నట్లు, బోల్ట్, స్పానర్, స్టీరింగ్, విద్యుత్ సిబ్బంది ప్రాజెక్టులకు జవసత్వాలుగా పని చేస్తారు. వీరు మజ్దూర్, హెల్పర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్, ఫోర్మెన్ పేర్లతో వివిధ కేటగిరిల్లో ప్రాజెక్టులపై పని చేస్తుంటారు. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఐదు వేల మంది వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది పని చేశారు. ప్రాజెక్టుల భారీ గేట్లు ఆపరేట్ చేయడం, వాటికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు, మాన్యువల్స్ ప్రకారం మరమ్మతులు నిర్వహించడం లాంటి పనులు సాంకేతిక సిబ్బంది చేయాల్సి ఉంటుంది. బ్రిటిష్ హయాంలో, ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలలో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది సాంకేతికపరమైన అనుభవం కలిగి స్కిల్డ్, సెమీ స్కిల్ట్ నిపుణులుగా నిర్వహణ, మరమ్మత్తుల పనులు నిర్వహించేవారు. అదే ఒరవడిని స్వాతంత్య్రానంతరం వివిధ ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2/94 యాక్ట్ తెచ్చింది. దీనివలన రెగ్యులరైజేషన్ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి 212 జీవో తెచ్చుకున్నారు. అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది. ఎన్ఎంఅర్లుగా, కంటింజెంట్గా పనిచేస్తున్న సిబ్బంది 20, 30 ఏళ్లు గడిచినా పర్మినెంట్ కాలేదు. గత 30 సంవత్సరాలుగా కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో అనుభవం కలిగిన సిబ్బంది క్రమంగా రిటైర్ అవుతున్నారు. వారి స్థానాలలో సిబ్బందిని మాత్రం భర్తీ చేయడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిర్వహణ అనుభవం, అర్హత కలిగిన వాళ్లు లేకపోవడంవల్ల తరచుగా ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతోంది. 2009లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు గత వంద సంవత్సరాలలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది. ఆనాడు కొద్దిమందిగా ఉన్న అనుభవం కలిగిన సిబ్బంది ప్రాణాలకు తెగించి గేట్ల సమర్థవంత నిర్వహణ ఫలి తంగా ప్రాజెక్టులకు పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వం వర్క్ఛార్జ్డ్ సిబ్బందిని ప్రశంసించింది. ప్రాజెక్టులపై ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది నియామకాలను త్వరలో చేపడతామని శాసనసభలో నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. కానీ నేటికీ అతీగతీ లేదు. ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని మీద ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఏ కేటగిరిలు కావాలి? తగు విధంగా నివేదికలను అందజేయాలని ప్రభుత్వాలు వివిధ కమిటీలు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐజే.నాయుడు చైర్మన్గా మరో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ, అర్.కె.కొండల్రావు ఆధ్వర్యంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన కమిటీ, ఆ తర్వాత ఎన్.సుబ్బరామిరెడ్డి కమిటీ... ఆయా కమిటీలు ప్రభుత్వాలకు నివేదికలను అందించడం జరిగింది. వివిధ సిఫార్సులను చీఫ్ ఇంజనీర్స్ బోర్డు కూడా ఆమోదించింది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ సిఫార్సులు అమలు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 170 ప్రాజెక్టుల వరకూ ఉండేవి. ప్రతి ప్రాజెక్టులో వర్క్ ఛార్జ్డ్ సిబ్బంది కీలకంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/94 యాక్ట్కు సవరణలు తీసుకొచ్చి సిబ్బంది భర్తీతో పాటు, ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తారని భావించారు. ఆనాడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న హరీశ్రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని సంఘాలు తీసుకువెళ్ళాయి. మాకోసం కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవటం కోసం సిబ్బంది అవసరమని చెప్పారు. అలాగే కేసీఆర్ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘అధికారం చేపట్టగానే ముందుగా శ్రమదోపిడీకి మారుపేరైన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్త్తం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మాటే వినబడదు. ప్రభుత్వ వ్యవస్థలలోని అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ జరిపి తీరుతాం’. అధికారంలోకొచ్చి ఆరేండ్లు గడిచిపోయింది. 2/94 యాక్ట్ సవరణ జరగలేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కాలేదు. ప్రభుత్వ ఖాళీల భర్తీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వాగ్దానాలను నిలుపుకోవాలి. -జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని రూ.84092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి రూ.72458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తుంది. ఓ వైపు పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు చేయిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఇతర ప్రాజెక్ట్లపైన అదే విధంగా దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్ట్లో కుడి, ఎడమ కాలువులు గతంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తయ్యాయి. ప్రధాన జలాశయ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తుండడంతో గతంలో పనిచేసిన సంస్థను ప్రభుత్వం రద్దు చేసి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు అప్పగించిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్ట్లో 71.46 శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ లలో ఎంఈఐఎల్ పనిచేపట్టిన తరువాత 2.80 లక్షల ఘనపు మీటర్ల పని ఆరు నెలల కాలంలో జరిగింది. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన తరువాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్లను గ్యాప్ - 1,2,3 పనులను ఎంఈఐఎల్ ఏకకాలంలో చేపడుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ర్టంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు. ప్రాజెక్ట్ల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధం కానుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎసస్పీవీలను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39980కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింది ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తిచేయడానికి ఐదేళ్ల కాలంలో రూ. 8787 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్పీవీ - 3 ద్వారా ఏపి రాష్ర్ట నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12702 కోట్లు ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా - పెన్నాల అనుసంధానం కోసం రూ.7636కోట్లు ఐదేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పీవీ-5 కార్యక్రమం క్రింద కృష్ణా-కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3356 కోట్లు సమీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్ట్లకు నిధుల సమీకరణకు ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లను పరుగులు పెట్టించి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదేళ్ళలో రూ. 39980 ఖర్చు.. ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు పరుగులు పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని అలాగే ఆ ప్రాజెక్ట్ ల్లో నీరు నిండితే ఆయా ప్రాంత రైతులు ఉపయోగకరం అన్న విషయంపై రైతులకు నచ్చచెప్పి, అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ ఇప్పటికే పూర్తయిందని, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగించేలా పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి.. ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నరు. వంశధార–నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో ఏపి ప్రభుత్వం ఉంది. వంశధార స్టేజ్–2 సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే 24,600 ఎకరాలకు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
సకాలంలో ప్రాజెక్టులు పూర్తవ్వాలి
గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందని రైతులకు వివరించాలి. వరుసగా రెండో ఏడాది సోమశిల నిండింది. గేట్లు ఎత్తడంతో కండలేరుకు జలాలు చేరుతున్నాయి. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కుల నీటిని మనం తీసుకెళ్లొచ్చు. నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు 881 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. అందుకే వరద జలాలను ఒడిసి పట్టి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్లో కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. ఆ మేరకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీటిని ఒడిసి పట్టి, ప్రాజెక్టులను నింపాలి. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందే. –సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులను పూర్తి చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. వేగంగా సాగుతున్న పనులు ► ‘ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు సొరంగం–2 పనులు వేగంగా సాగుతున్నాయి. సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరింది’ అని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహా ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 413 మీటర్ల మేర పనులు మిగిలాయి. వర్షాల వల్ల నల్లమల అడవుల్లో పనుల్లో జాప్యం జరుగుతోంది. మొదటి సొరంగం పనులు నవంబర్ నాటికి, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► వంశధార–నాగావళి అనుసంధానం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. మొత్తం 33.5 కి.మీల హైలెవల్ కెనాల్కుగాను 25 కి.మీల పనులు పూర్తయ్యాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను మార్చి నాటికి పూర్తి చేస్తాం. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి.. ఒడిశా సీఎంతో సమావేశం కోసం లేఖ రాశాం. సమాధానం రావాల్సి ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయితే నందిగం, మెలియపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశామని.. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామన్నారు. ► తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ► తోటపల్లి ప్రాజెక్టులో భాగమైన గజపతినగరం బ్రాంచ్ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తయితే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ► షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరానికి రీయింబర్స్మెంట్ రూపంలో రావాల్సిన రూ.3,805 కోట్ల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో చర్చించడానికి సోమవారం ఢిల్లీ వెళ్లాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్లను ఆదేశించారు. ► ‘పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువల పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్లు్ల బిగిస్తాం. కోవిడ్ వల్ల స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కాస్త జాప్యం జరిగింది’ అని అధికారులు వివరించారు. అవసరమైన ఉద్యోగుల సర్దుబాటు ► జల వనరుల శాఖలో అవసరాలను బట్టి అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని.. డ్యామ్లు, కాలువలు, వాటర్ రెగ్యులేషన్కు అవసరమైన లష్కర్లను, అవసరమైన చోట మెకానికల్, ఎలక్ట్రికల్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవాలని సీఎం ఆదేశించారు. ► సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.