jyothula nehru
-
తిరుమల తొక్కిసలాటపై జ్యోతుల నెహ్రూ వివాదాస్పద వ్యాఖ్యలు
-
తిరుపతి తొక్కిసలాట ఘటన : ‘దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం’
సాక్షి,విశాఖ : తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జ్యోతిల నెహ్రూ.. టీటీడీ చేతగానితనాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం: జ్యోతుల నెహ్రూ
-
బాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. స్పష్టమైన ప్రభుత్వ వైఫల్యం..
-
ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.తాను అందరికంటే సీనియర్నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
ఉచిత సిలిండర్.. బాబుకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే
సాక్షి, కాకినాడ: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ డబ్బులు కట్టించుకోవడం ఏంటి? అని టీడీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ముఖ్మమంత్రి చంద్రబాబును దీనిపై ప్రశ్నిస్తానని కామెంట్స్ చేశారు.టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలును వ్యతిరేకిస్తున్నాను. లబ్ధిదారుల నుండి డబ్బులు కట్టించుకోవడం సరికాదు. ఉచితం అంటే ఉచితంగానే కనిపించాలి. ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు రూ.2,800 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అలాంటప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి.. లేదంటే ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలో వేయాలి.అంతేకానీ ఇలా చేయడం సరికాదు. సిలిండర్ కోసం డబ్బులు లేకపోతే సామాన్య ప్రజలు రూ.5,10 వడ్డీకి దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్ధితి ఉంటుంది. దళారులు బాగుపడటానికి అధికారులే ఈ వ్యవస్ధను పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంపై నిర్మోహమాటంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబును అడుగుతాను. చంద్రబాబు నిల్చోబెట్టి ఈ విధానాన్ని మారుస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
వాలంటీర్లు వేస్ట్.. తేల్చి చెప్పిన టీడీపీ నేత
-
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
జ్యోతుల నెహ్రుపై జనసేన ఫైర్..ఓపెన్ ఛాలెంజ్
-
సీనియర్లకు నచ్చని నవీన్! ఆల్రెడీ బాస్కు కంప్లైంట్.. కాకరేపుతున్న కాకినాడ
ఆంధ్రప్రదేశ్లో పచ్చ పార్టీ తెలంగాణ కాంగ్రెస్లా తయారవుతోంది. ఓ జిల్లాలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ వార్ జరుగుతోంది. ఓ సీనియర్ నేత తనయుడు ఒకానొక పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్లకు నచ్చడంలేదని టాక్. జూనియర్లను ప్రోత్సహించడం అసలు సహించలేకపోతున్నారట. అందుకే ఆ నాయకుడు తమకొద్దని పార్టీ చీఫ్కు తేల్చి చెప్పేశారట. కాకినాడ టీడీపీలో రగులుకున్న మంటలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తనయుడుగా.. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్గా నవీన్ సుపరిచితం. ఇటీవల కాలంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నవీన్ అనుసరిస్తున్న విధానాలు కొందరు సీనీయర్ నేతలకు మింగుడు పడడం లేదని టాక్. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణీ నేతలను నవీన్ ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. అలా ప్రోత్సహించిన నేతలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారట. దీంతో నవీన్ నాయకత్వం తమకు వద్దని మరో నేతను నియమించాలంటూ కొందరు తమ బాస్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సైకిల్ ఎక్కేది నేనే.! గతంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో నవీన్ రెండు నెలల పాటు పాదయాత్ర చేశారు. తొలుత ఈ పాదయాత్రకు యనమలతో పాటుగా పలువురు సీనియర్లు.. మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆ తరువాత నవీన్ ముఖం చూడడమే మానేశారట. అంతేకాదు గత నెలలో పాదయాత్ర ముగింపు సందర్భంగా నవీన్ను కలవడానికి ఒక్క నేత కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవీన్ నిర్వహించిన యాత్ర తుస్సు మన్నట్లు అయిందని పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్ధినని నవీన్ తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం యనమల రామకృష్ణుడు.. నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లుకు రుచించడం లేదని టాక్. తండ్రి జగ్గంపేట నుండి ఎమ్మెల్యేగా.. కొడుకు కాకినాడ పార్లమెంట్ సీటుకు ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నించుకుంటున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికి సీట్లు ఎలా ఇస్తారని చర్చించుకుంటున్నారట. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ జిల్లా పార్టీలో మంటలు రేపారు. ఒక వైపు జూనియర్లను ప్రోత్సహిస్తూ సీనియర్లకు కంటగింపుగా మారారు. మరోవైపు తండ్రీ, కొడుకులిద్దరూ పోటీ చేస్తున్నారనే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అసమ్మతిని పెంచి పోషిస్తున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో..? -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విడదీయాలని చూస్తున్న జ్యోతుల నెహ్రు: ప్రేమజంట
-
'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్పల్లి ఆర్యసమాజ్లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు. చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?) తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్ కత్తి పద్మ అన్నారు. ఈ విషయంపై అపర్ణను సంప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్ మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. -
టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు గుండెపోటు
జగ్గంపేట: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. పొలంలో ఉండగా సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. జగ్గంపేట నుంచి వైద్యులు హుటాహుటిన చేరుకుని, ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జగ్గంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెహ్రూకు డాక్టర్ రమేష్ ఆక్సిజన్ అందించి ఉపశమనం కల్పించారు. అనంతరం రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన అపాయం నుంచి బయటపడ్డారని టీడీపీ నేతలు తెలిపారు. -
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
-
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
జగ్గంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపోటములు సహజమని, వాటికి సిద్ధపడి ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపం కలిగించిందని తెలిపారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా చోట్ల గెలిచే అవకాశాలున్న తరుణంలో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకోం రావికమతం : పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన తాము ఎన్నికల బరిలోంచి తప్పుకోమని విశాఖ జిల్లా రావికమతం మండల టీడీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మేడివాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారని ధిక్కార స్వరం వినిపించారు. -
టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా జ్యోతుల నెహ్రూ గళం విప్పారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేడర్ అభిప్రాయాలు చంద్రబాబుకు పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
ఫైల్స్ మోసావ్.. ఎమ్మెల్యే సీటు ఇప్పించారు
సాక్షి, తూర్పుగోదావరి : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయింది నువ్వు.. నేను కాదు. ఆనాడు తోట సుబ్బారావు వెనుక మావయ్య మావయ్య అంటూ ఫైల్స్ మోసావ్. ఆయనకు ఎంపీ సీటు రావడంతో తన వారిని కాదని నీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. తోట సుబ్బారావు వల్లే నీకు అదృష్టం కలిగింది. సీఎం వైఎస్ జగన్ మిమ్మల్ని నమ్మి సీటు ఇస్తే.. టీడీపీకి అమ్ముడు పోయి పార్టీని మోసం చేశారు’ అంటూ మండిపడ్డారు. (‘ఈటలను ఓడించకుంటే నా పేరు కౌశిక్ కాదు’) శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై టీడీపీ దాడులు చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోంది. జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చెయ్యాలని టీడీపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోంది. కుల,మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేద్దాం అంటే ఎప్పటికీ చెల్లు బాటు కాద’’ని అన్నారు. -
టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు మహానాడు వేదికగా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కొంత మంది నేతలు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్రలు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవరు ఏ విధంగా వ్వవహారిస్తున్నారో చంద్రబాబు గమనించాలని చినరాజప్ప అన్నారు. (‘రెండు కుటుంబాల గొడవను రాజకీయం చేస్తున్నారు’) చినరాజప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు పట్టుకొని మాట్లాడితే సరిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్కు నమ్మకం కలిగించాలన్నారు. నాయకుని చుట్టు ప్రదక్షణ చేస్తే నాయకత్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడర్ చూట్టు ప్రదక్షణలు చేయాలన్నారు. చినరాజప్ప మరింత బాద్యతగా వ్యవహరించాలన్నారు. పదవులు రావడమనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియకుండానే పలు కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర కమిటీ నాయకులు వస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..
వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. ►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. ►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్కు ఆధారాలున్నాయ్ ►తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీఎన్టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్ సీపీలో చేరారు. ►కాకినాడ రూరల్ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్ యూనియన్ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరారు. ► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ►ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. -
ఇదేంటి సార్.. ఎన్నికల కోడ్ పట్టదా..?
సాక్షి, కిర్లంపూడి: సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి వారం రోజులు దాటింది. ఎన్నికల నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం పని చేయాలి. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలి. సార్వత్రిక ఎన్నికలు వస్తాయని ముందుగానే భావించిన అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో హడావుడి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో మండలంలో చాలా గ్రామాల్లో అధికారులు ఆయా పార్టీల నాయకులకు సమాచారం అందించి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. కొందరు స్పందించకపోవడంతో పలు చోట్ల ఫ్లెక్సీలు తొలగించారు. కృష్ణవరం గ్రామంలో మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, అందువల్లే ఫ్లెక్సీలు తొలగించలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రాజుపాలెం గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. గురువారం రాజుపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే తమను అవమానించారని, తమ మనోభావాలను కించపరిచేలా దూషించారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జన్మభూమి సభలో భాగంగా తమ గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరినందుకు.. పోలీసులకు తమను సభ నుంచి గెంటేయాలని ఎమ్మెల్యే సూచించారని వారు మండిపడ్డారు. దళితులమనే చిన్న చూపుతోనే ఎమ్మెల్యే నెహ్రూ తన అగ్రకుల అహంకారం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రాజుపాలెం దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపట్ల నిరసన గళాలు వినిపిస్తునే ఉన్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వారిని అడుగడుగునా టీడీపీ నాయకులు ఇబ్బందులకు, అవమానాలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. -
ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన జ్యోతుల నవీన్
-
ఐటీ దాడులపై జ్యోతుల తనయుడి వివరణ
సాక్షి, కాకినాడ : ఐటీ దాడులపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ... గతంలో తమ ఉమ్మడి ఆస్తి అయిన గోదాముల విక్రయానికి సంబంధించి తక్కువగా చూపించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్పై అధికారులు వివరణ అడిగారే తప్ప, ఎలాంటి దాడులు జరపలేదన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వల్ల గత కొంతకాలంగా ఐటీ రిటన్స్ పట్టించుకోలేదన్నారు. వాటిని కూడా చెల్లిస్తామని ఐటీ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు నవీన్ పేర్కొన్నారు. కాగా జ్యోతుల నెహ్రు ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. -
ఎమ్మెల్యే జ్యోతుల ఇంటిపై ఐటీ దాడులు
తూర్పుగోదావరి, జగ్గంపేట: జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలో మరికొందరి ఇళ్లపై దాడులు జరిగినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. -
జ్యోతుల X తోట
సాక్షి ప్రతినిధి, తూర్పు గోదావరి, కాకినాడ : ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామమది. ఆ పార్టీకి చెందిన సర్పంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకపోతే, ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉంటున్నారు. ఇప్పుడదే కొంప ముంచింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కంటగింపుగా మారింది. ఎంపీ వెంట తిరుగుతున్నారని సర్పంచిపై కక్షగట్టారు. టీడీపీలోకి వచ్చిన దగ్గరి నుంచి అణగదొక్కుతున్నారు. ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తున్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మంజూరైన అభివృద్ధి పథకాలు అమలు కాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర సంక్షేమ పథకాలు ఎంపీ అనుచరులకు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న వివక్షను భరించలేక బూరుగుపూడి సర్పంచి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జ్యోతుల నెహ్రూ తీరుకు నిరసనగా ఆరు రోజులపాటు దీక్ష చేశారు. చివరికి పోలీసులు భగ్నం చేశారే తప్ప ఎమ్మెల్యే కనీసం స్పందించలేదు. ♦ జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు బండారు రాజా పరిస్థితి కూడా ఇంతే. ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉన్న పాపానికి అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా వీరికి ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేదు. సరికదా పార్టీ వ్యవహారాల్లో కూడా దూరంగా ఉంచుతున్నారు. ♦ టీడీపీకి చెందిన మరో నేత తోట అయ్యన్న దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంపీ అనుచరునిగా నియోజకవర్గంలో కొనసాగుతుండటంతో సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా పెడుతున్నారు. వీరికెటువంటి సమాచారం ఇవ్వలేదు. రాజకీయంగా అణగదొక్కుతూనే ఉన్నారు. ♦ ఇలా చెప్పుకుని పోతే ఎంపీ తోట నరసింహం అనుచరులు అనేక మంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధితులుగా మిగిలిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించిన దగ్గర నుంచి ఎంపీ అనుచరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరికీ, ఎమ్మెల్యే తీరుతో నిలబడలేక కొందరు వర్గాన్ని మార్చేశారు. మరికొందరు చెల్లాచెదురై మౌనంగా ఉన్నారు. సమయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ♦ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఎంపీ తోట నరసింహం నిలిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున జ్యోతుల నెహ్రూ ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ జంపయ్యారు. ఒప్పందాలు, ప్రలోభాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వచ్చాక అప్పటికే టీడీపీలో ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. తనతోపాటు టీడీపీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేసి, టీడీపీ పాత నేతలను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే అనేక మంది టీడీపీకి దూరమై వైఎస్సార్సీపీలోకి చేరారు. మరికొందరు ఎంపీ తోట నరసింహం అనుచరులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ పంథా ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఉంటే తనతో ఉండాలి...లేదంటే చుక్కలే అన్నట్టుగా రాజకీయాలు నెరిపారు. ఇంకేముంది తోట నర్సింహం అనుచరులంతా టార్గెటయ్యారు. రెండున్నరేళ్లుగా పాత నేతలకే ఇక్కట్లు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి కష్టపడి పనిచేసిన వారందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీలోకి వచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయి. తన అనుకూల వ్యక్తులకు తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మేలు చేయడం లేదన్న వాదనలున్నాయి. రానున్న ఎన్నికల నాటికి తాను మాత్రమే ఉండాలని, మరొకరికి నియోజకవర్గంలో పట్టు ఉండకూడదని, తనకు ఎదురు నిలిచే నాయకుడు లేకుండా చూసుకోవాలన్న ధోరణితో పక్షపాత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంకేముంది టీడీపీలో ఉన్న పాత వారందరికీ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తనకు భవిష్యత్లో ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉందన్న దూరదృష్టితో ఎంపీ తోట నరసింహం అనుచరుల్ని టార్గెట్ చేసినట్టు ఆ పార్టీలో చర్చ నడిచింది. అనుకున్నట్టుగా ఎంపీ కేడర్ను చెల్లాచెదురు చేయడంలో విజయం సాధించారన్న వాదనలున్నాయి. ఇక, కరుడుగట్టిన ఎంపీ అనుచరులు మాత్రం జ్యోతులకు సరెండర్ కాకుండా కొనసాగుతున్నారు. అలాంటి వారందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకుండా కట్ చేశారన్న విమర్శలున్నాయి. ఏ ఒక్కరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా మొండి చేయి చూపుతూ వస్తున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర వాటిలో వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎంపీకి విలువ లేకుండా చేశారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో ఎంపీ తోట నరసింహం ఎక్కడా బయట పడకుండా మౌనంగా ఉంటున్నారు. తన వర్గీయులకు జరుగుతున్న అన్యాయంపై బాధపడుతూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప జ్యోతులతో పోరాడేందుకు సాహసించడం లేదు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేట నియోజకవర్గంలో క్యాడర్ చెల్లాచెదురు అవుతున్నా మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారు. మరీ, మున్ముందు బయటపడతారో...రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారో ఏమో గాని ప్రస్తుతానికి మాత్రం ఎంపీ అనుచరులంతా తీవ్ర ఆవేదనతో, అవమానంతో పార్టీలో కొనసాగుతున్నారు. -
జ్యోతుల ఫ్యామిలీ జులుం
టోల్రుసుం కోసం అల్లుడి కారు ఆపినందుకు సిబ్బందిపై దాడి నిజాయతీగా టోల్ ఫీజు అడిగితే ఏకంగా జులుం ప్రదర్శించారు. మంగళవారం రాత్రి దాడులకు దిగారు. ఎమ్మెల్యే స్థాయిలో, అదీ సీనియారిటీ వెలగబెడుతున్న జ్యోతుల నెహ్రూ అయినా కొడుకును మందలించి ఉంటే హుందాగా ఉండేది. మహరాజా అని అభ్యర్థించుకుంటే మరి రెండు తన్నమన్నట్టుగా ప్లాజా సిబ్బందిపై బుధవారం మరింత రెచ్చిపోయి దాడులకు దిగడమే కాకుండా ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయించారు. రక్షక భటులు కూడా పెద్దలకే కొమ్ముకాస్తూ చిన్నలపై చిర్రుబుర్రులాడారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా ప్రతినిధులైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ బాధ్యత విస్మరించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద నెహ్రూ అల్లుడి కారును ఆపారని టోల్గేట్ సిబ్బందిపై అనుచరులతో దాడి చేయించారు. అంతటితో ఆగకుండా క్షమాపణ చెప్పేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందిపై మరోసారి దాడి చేయించారు. టోల్గేట్ యాజమాన్యంతో ఇద్దరు సిబ్బందిపై వేటు వేయించారు. అధికార బలంతో చిరు ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డ జ్యోతుల కుటుంబంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రాత్రి బావమరిది సమక్షంలో దాడి జ్యోతుల నెహ్రూ అల్లుడు తోట బబ్బీ వాహనాన్ని మంగళవారం రాత్రి కృష్ణవరం టోల్ప్లాజా వద్ద టోల్ రుసుంకోసం ఆపారు. తన కారునే ఆపుతారా? అంటూ ఆయన టోల్ ప్లాజా సిబ్బందిపై చిందులు తొక్కారు. క్షణాల్లో బావమరిది, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ను రప్పించారు. కారును ఆపిన సిబ్బందిని అప్పగించాలంటూ నవీన్ ఉసిగొల్పడంతో అనుచరులు దౌర్జన్యకాండకు దిగారు. -
తూగో జడ్పీ ఛైర్మన్గా జ్యోతుల నవీన్
అమరావతి: అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేసే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నైజం మరోసారి బయటపడింది. స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్ఆర్ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ కుమార్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు వేళ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నవీన్ను జిల్లా షరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ... అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును బలవంతంగా ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆయనను జెడ్పీ పీఠం నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిన్న (ఆదివారం) రాజీనామా చేశారు. అయితే ఫిరాయింపు సమయంలో జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి ఆశ చూపి చివరకు ఆయన కుమారుడికి తాత్కాలిక జెడ్పీ చైర్మన్ పదవితో చంద్రబాబు సరిపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో నెంబరు 473ను జారీ చేసింది. కాగా తూర్పుగోదావరి తాత్కాలిక జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ గా జ్యోతుల నవీన్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈనెల 15వ తేదీన జడ్పీ తాత్కాలిక ఛైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని వెల్లడించారు. అదేవిధంగా జడ్పీ వైస్ ఛైర్మన్గా నళినీకాంత్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని చెప్పారు. ఆయన కూడా 15వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. అయితే జ్యోతుల నెహ్రు కుమారుడు నవీన్కు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంపై మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెజార్టీ జెడ్పీటీసీల్లో అసంతృప్తి నెలకొంది. -
పాపం.. పెద్దోళ్లు..!
► పార్టీలు మారినా ఫలితం లేదాయే : జ్యోతుల ► సిద్ధాంతకర్తనైనా గుర్తింపు రాకపోయే : గోరంట్ల ► ఇద్దరు సీనియర్ నేతల అంతర్మథనం ► జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు ► రాజీలు కుదిర్చినా ససేమిరా... ఒకరు పలు పార్టీలకు వ్యూహకర్త ... ఇంకొకరు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే పురుడు పోసిన సిద్ధాంత కర్త. ఇందులో ఒకరు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ...ఇంకొకరు రాజమహేంద్రవరం శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏ పార్టీలోనూ జ్యోతులకు స్థిరత్వం లేక చంచల స్వభావంతో ఎటు గాలివీస్తే అటు అడుగులు వేయడంతో ఆ అడుగులు ఎక్కడా బలంగా నిలదొక్కుకోలేని దుస్థితి. ‘ఉన్నది వదిలేవు ...లేనిది కోరేవు ... ఒక పొరపాటుకి యుగములు వగచేవు’ అంటూ ఓ సినీ రచయిత గీతా విలాపంలా తయారయింది నెహ్రూ పరిస్థితి. ఇక గోరంట్ల వ్యథ మరో విధంగా ఉంది. టీడీపీ సిద్ధాంత కర్తల్లో ఒకరినైన నన్నా విస్మరించేదంటూ చిందులు తొక్కుతున్నారు. పార్టీ అధినేత ఎన్టీ రామారావునే అత్యంత క్రూరంగా బయటకు పంపించేసి ... ఆయన మరణానికి కారణమైన ‘బాబు’ దగ్గరా ఆ సుద్దులంటూ ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. వీరి ఎదుగుదలను వెనుకనుంచి అడ్డుకున్నది యనమలేనని అనుచర వర్గం ఆగ్రహంతో ఉంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు కొందరు నేతలను అత్యున్నత స్థాయికి తీసుకుపోతుంటాయి. మరికొందరినైతే రాజకీయంగా అధఃపాతాళానికి నెట్టేస్తాయి. ఇందులో రెండో రకం నాయకుడిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మూడు దశాబ్దాల చరిత్ర కలిగి అపారమైన అనుభవం ఉన్న జ్యోతుల కూడా రాజకీయాల్లో ఒక దాని తరువాత మరొకటి తప్పటడుగులే వేశారు. టీడీపీ సైకిల్ చక్రాన్ని వదిలేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో ముందడుగు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఆ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును జగ్గంపేటలోనే జగన్మోహన్రెడ్డి ప్రకటించి నెహ్రూకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నమ్మి వచ్చిన నెహ్రూకు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. జగన్మోహన్రెడ్డి అంతటితోనే సరిపెట్టకుండా శాసనసభా పక్ష ఉప నేతను చేసి నెహ్రూ గౌరవాన్ని ఇనుమడింప జేశారు. ఇంతా చేస్తే టీడీపీకి ఫిరాయించేశారు. అందుకు మంత్రి పదవా లేక, ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయో తెలియదుగానీ నమ్మి ఒక మెట్టుపైకి తీసుకువెళ్లిన పార్టీని నడిసంద్రంలో ముంచేశారు. ఆ ప్రభ ఏదీ...? ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీని వీడకుండానైనా ఉండాల్సింది. ఎంతకాలం తాను ఆ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు ఉన్నంత కాలం ఇక మంత్రి పదవి అనేది అందని ద్రాక్ష అనే నిర్థారణకు వచ్చి టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఆ పార్టీని వీడి బయటకు వస్తే వచ్చారు, ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంచి నిర్ణయమే తీసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. అటువంటి పార్టీని కాదనుకుని నెహ్రూ బయటకు వెళ్లి మరో తప్పటుడుగు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథిగా జిల్లాలో ఏమూలకు వెళ్లినా ప్రజలు, పార్టీ నేతలు వెన్నంటి నిలిచేవేవారు. అటు నియోజకవర్గంలో ఇటు జిల్లా అంతటా చక్రం తిప్పే పరిస్థితి. అటువంటిది తిరిగి టీడీపీకి వెళ్లాక నియోజకవర్గ నాయకుడిగానే మిగిలిపోయారు. మెట్ట ప్రాంతంలో ఏలేరు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నెహ్రూ అదే ఏలేరుకు నీరు సరఫరా చేసే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పిఠాపురంలో సీఎం శంకుస్థాపన కార్యక్రమంలో అందరిలో ఒకరిగా మిగిలిపోయారు. అందరికంటే చివర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే నెహ్రూ స్థాయిని ఏ రకంగా తగ్గించేశారోనని ఆ రోజే మెట్ట నేతల మధ్య గుసగుసలు వినిపించాయి. పాపం సిద్ధాంతకర్త...? నెహ్రూ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పదవి రాలేదని పార్టీ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. గోరంట్లకు మద్ధతుగా నగరపాలక సంస్థ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో రాజీనామాలకు కూడా సిద్ధపడతామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటై ఉంటుందా అని పార్టీలో చర్చ నడుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని నిరాశ చెందిన మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను విలేకర్లు కలిసిన సందర్భంలో ఆయన కాస్త వేదాంత «ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపించింది. ‘మంత్రి పదవి ఆశిస్తాం, కానీ అధినేత పెట్టుకున్న ప్రమాణాలకు ఫిట్ అవ్వలేకపోయి ఉండవచ్చునని’ చెప్పుకు రావడం గమనార్హం. బాబు తీరుపై కొందరు బయటపడగా ... లోలోన అంతర్గతంగా గుర్రుగా ఉన్న మరికొందరు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నీడలా యనమల టీడీపీలో మంత్రి కాకుండా అడ్డుపడ్డ నాయకుడే తాజా మంత్రివర్గ విస్తరణలో సైతం మోకాలడ్డటంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఎంత పనిచేశాయనే నిర్వేదం తప్ప నెహ్రూ చేయగలిగిందేముంటుందని అనుచరులే సముదాయించుకుంటున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోయారు. జిల్లా స్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగినా నలుగురిలో ఒకరిగానే మిగిలే వారు. ఈ రకంగా ఒక దాని వెంట మరొకటి వేసిన తప్పటడుగులు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత ఉనికినే సవాల్ చేశాయి. నెహ్రూలో ఉన్న మునుపటి పోరాట పటిమ ఇప్పుడు కూడా ఉంటాదనుకుంటే పొరపాటే. వయస్సు కూడా ఇందుకు సహకరించాలి. తాజా విస్తరణలో ఛాన్స్ వస్తేగిస్తే పూర్వపు ప్రాభవాన్ని తిరిగి పొందవచ్చునన్న నెహ్రూ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తు అంధకారమై నిర్వేదంలో ఉన్నారంటున్నారు. నెహ్రూను బుజ్జగించేందుకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆశ పెడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ పదవులేవీ తమ నాయకుడి ప్రతిష్టను పెంచలేవనే అభిప్రాయంతో జ్యోతుల అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. పదవుల పందేరంపై భగ్గుమంటున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా రాష్ట్రంలో పలువురు నేతల స్పందనలను గమనిస్తూ కిం కర్తవ్యం ఏమిటా అని నెహ్రూ అనుచరవర్గం తర్జనభర్జనపడుతోంది. -
నెహ్రూకు మొండిచేయి
♦ మోకాలొడ్డినపార్టీ సీనియర్లు ♦ రెంటికీ చెడ్డరేవడిగా జ్యోతుల ♦ ఆయన అనుచరుల్లో అయోమయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకోలేదు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలో యథాతథంగా కొనసాగనుండడంతో కొత్తవారికి నో ఛాన్స్ బోర్డు పెట్టేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ మంత్రి వర్గ విస్తరణౖపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పాతవారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఎవరికి ఇచ్చినా తేనెపుట్టను కదిలించినట్టవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మెట్ట ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకులుగా ముద్ర పడిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. వైరి వర్గమే కొరివి పెట్టిందా...? చిరకాల కోరికైన మంత్రి పదవి ఈసారి కూడా నెహ్రూకు దూరమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నెహ్రూ మంత్రి పదవి కోసమే టీడీపీలోకి ఫిరాయించినట్టు చెప్పుకుంటూ వచ్చారు. విస్తరణలో బెర్త్ ఖాయమని అనుచరులు విస్తృతమైన ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ముఖ్య అనుచరులతోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా శనివారం విజయవాడ తరలివెళ్ళారు. తీరా చంద్రబాబు వద్ద సీన్ రివర్స్ అయింది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచీ నెహ్రూకు రాజకీయంగా వైరి వర్గంగా ఉన్న యనమల రామకృష్ణుడు తెర వెనుక జరిపిన మంత్రాంగం ఫలితంగానే నెహ్రూ ఆశలు ఆవిరయ్యాయని పలువురు భావిస్తున్నారు. నమ్మి టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్ పార్టీని కాదని ప్రలోభాలతో పార్టీ ఫిరాయించినా చివరకు ఫలితం దక్కలేదని నెహ్రూ వర్గం డీలా పడింది. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన నెహ్రూకు మంత్రి పదవి కట్టబెడతారని విస్త్రృతమైన ప్రచారం జరిగింది. కానీ రాజప్పను కదిపి నెహ్రూకు పట్టం కడితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని బాబు వెనుకడుగు వేశారు. కాపు సామాజిక వర్గం నుంచి నెహ్రూ, రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గొల్ల పల్లి సూర్యారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవులు ఆశించారు. సామాజిక సమతూకంలో భాగంగా ఒకిరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కొత్త సమస్యలు వచ్చిపడతాయని యనమల తదితర నాయకులు సూచించడంతో విస్తరణలో జిల్లా నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పూర్వ స్థితినే కొనసాగించారు. పార్టీని కాదనుకుని రెండు పార్టీలు మారి నిన్నగాక మొన్న తిరిగి వచ్చిన నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే సీనియర్లు ఏమైపోతారని నెహ్రూ వ్యతిరేకవర్గం గట్టి వాదనను వినిపించింది. ప్యాకేజీ పాత్ర ఎంత...? పార్టీ ఫిరాయించిన సందర్భంలోనే నెహ్రూకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు నిర్ధిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదన్న వాదన ఉంది. పార్టీ మారడం వెనుక ప్యాకేజీయే కీలకపాత్ర పోషించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నెహ్రూకు స్థానం లభించలేదంటున్నారు. నెహ్రూతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలకు స్థానం దక్కినప్పటికీ నెహ్రూకు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఈ పరిణామాలు పార్టీలో ఎక్కడకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సిందే. -
రాజకీయ విలువలు వీడి...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి.. స్వీయ ప్రయోజనాలే పరమావధిగా.. అధికార దాహంతో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు జిల్లా నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆదిరెడ్డి అప్పారావులు.. అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రలోభాల వలలో పడి.. దానికి అభివృద్ధి ముసుగు తొడిగి.. ఓటేసిన తమను వంచించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిరాయించే ముందు.. వైఎస్సార్సీపీతో దక్కిన పదవులకు రాజీనామా చేయాలనే నైతికతను కూడా పాటించకపోవడం.. విలువలను తుంగలో తొక్కడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీలో తమను తొక్కేస్తున్నారని చెబుతూ ఈ ముగ్గురు నేతలూ అప్పట్లో వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పెద్దపీట వేసి, పదవులు ఇచ్చిన ఆ పార్టీని కాదని.. ఆ ముగ్గురు నేతలూ మళ్లీ అదే సైకిల్పై సవారీ చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు. గోరంట్లతో విభేదాలు తప్పవా? ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు భార్య వీరరాఘవమ్మ గతంలో టీడీపీ హయాంలో రాజమహేంద్రవరం మేయర్గా పని చేశారు. ఆమె పదవీ కాలం పూర్తయ్యాక అప్పారావు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. జిల్లా నుంచి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి నాయకుడు ఆయన. ఈ పదవీ కాలం ఇంకా రెండేళ్లుంది. అయినప్పటికీ ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్సీపీని కాదని, అదురూ బెదురూ లేకుండా సైకిలెక్కేశారు. ఎమ్మెల్సీ పదవికి మించిన గౌరవం,∙హోదా ఆయనకు అక్కడ లభించాయా అంటే అవేమీ కనుచూపు మేరలో కూడా అక్కడ కనిపించడం లేదు. అప్పారావుపై భగ్గుమనే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ఆయన అక్కడుండగా టీడీపీలో అప్పారావుకు రాజకీయ భవిష్యత్తు ఒక భ్రాంతేనని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఫిరాయించడానికి ముందే వైఎస్సార్సీపీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న నైతికత ఉన్నత విద్యావంతుడైన అప్పారావుకు లేకపోవడాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తనవెంట 6 వేల మంది వచ్చారని అప్పారావు చెబుతున్నారు. వారిలో ఆయన వద్ద అప్పులు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారని పలువురు అంటున్నారు. వాస్తవంగా ఒకరిద్దరు మాత్రమే కొద్దోగొప్పో ప్రభావంతమైన ద్వితీయ శ్రేణి నేతలున్నారని, మిగిలినవారి పరిస్థితి తమకు తెలియనిది కాదని గోరంట్ల వర్గం అంటోంది. అప్పారావు పునరాగమనంతో తమకు కొత్తగా కలిసివచ్చేదేమైనా ఉందంటే అది పార్టీలో అంతర్గత కుమ్ములాటలేనని తమ్ముళ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగ్గంపేటకే పరిమితమైన జ్యోతుల మరో ఫిరాయింపు నేత∙జ్యోతుల నెహ్రూ. రాష్ట్ర మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరిక. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఆ పదవి ఆయనకు రానివ్వకుండా మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారు. నెహ్రూ వెంట తిరిగేవారిని ఎవరినడిగినా ఈ మాట చెబుతారు. తన రాజకీయ ఎదుగుదలకు యనమల ఆటంకంగా మారారన్న ఉద్దేశంతో నెహ్రూ.. అప్పట్లో టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ అదృశ్యమైన తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. అటువంటిది మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్లారో అర్థం కావడం లేదని ఆయన అభిమానులే అంటున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని నెహ్రూ అనుచరులు కొందరు చెబుతూంటారు. కానీ, ‘సైకిల్’ ఎక్కాక ఈ నాలుగు నెలల్లో నియోజకవర్గానికి ఏం సాధించారనే ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. వాస్తవానికి ఈ నాలుగు నెలల్లో కనబరిచింది అధికార దర్పమే. పోలవరం కాలువను ఆనుకుని నిరుపేదల ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు సాధించలేకపోయారని స్థానికులు మండిపడుతున్నారు. మరోపక్క నెహ్రూ చిరకాల కోరిక అయిన మంత్రి పదవిపై కనీస గ్యారంటీ లభించలేదనే చెబుతున్నారు. వైఎస్సార్సీపీలో ఉండగా పార్టీ జిల్లా పగ్గాలతో పాటు అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా తన వాణి వినిపించే నెహ్రూ.. టీడీపీలోకి ఫిరాయించాక జగ్గంపేటకే పరిమితమైపోవాల్సి వచ్చిందని అనుచరగణం ఆవేదన చెందుతోంది. కుమారుడికి దక్కని జెడ్పీ చైర్మన్ గిరీ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ప్రతిపక్ష నేతగా పని చేసిన జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్కు టీడీపీలో చేరితే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. నెహ్రూకు మంత్రి పదవి, కుమారుడికి జెడ్పీ చైర్మన్ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని అప్పట్లో చెప్పుకున్నారు. చివరికి వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకూ వారికి దక్కనేలేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల సుబ్బారావు గెలుపొందారు. ఆయన ఎక్కడ కనిపించినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సుబ్బన్నా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరవంగా చూసేవారు. ఎంతోమంది నేతలను కాదనుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్రెడ్డి టిక్కెట్టు ఇచ్చి సుబ్బారావును ఎమ్మెల్యేను చేశారు. అటువంటి సుబ్బారావు కూడా టీడీపీ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించడంపై విమర్శలు వస్తున్నాయి. విలువలకు కట్టుబడి.. ఈ ముగ్గురితో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజాలు.. అధికార టీడీపీ నుంచి అనేక ప్రలోభాలు వచ్చినా తప్పటడుగు వేయకుండా నిలిచారు. వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వైఎస్సార్సీపీకే కట్టుబడి నిలవడం విశేషం. -
'జ్యోతులకు ప్రజలే బుద్ధి చెబుతారు'
ఆయన పార్టీ మారడం సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కాకినాడ : తమ పార్టీ టిక్కెట్పై నెగ్గిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏ మాత్రం సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట సుబ్బారావు నాయుడును జక్కంపూడి రాజా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జ్యోతులు నెహ్రూ 2004లో టీడీపీ తరఫున, 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాక శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలు అప్పగిస్తే డబ్బు, అధికారానికి ఆశపడి జోత్యుల పార్టీ మారారని విమర్శించారు. జ్యోతులకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూపు, వర్గ రాజకీయాలతో ఆయన పార్టీని కలుషితం చేశారని.. ఈ సందర్భంగా జోత్యులపై జక్కంపూడి రాజా నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి జ్యోతుల నెహ్రూనే కారణం అని రాజా పేర్కొన్నారు. ఆయన నిష్ర్కమణ తమ పార్టీకి శుభపరిణామమన్నారు. ఎందరు నాయకులు వెళ్లినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నవారిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తారనడానికి తన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావే ఓ నిదర్శమన్నారు. నాన్న గారి ఆరోగ్యం అనుకూలించక పోయినా చివరి వరకూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తన మంత్రివర్గంలో ప్రధానమైన రోడ్లు, భవనాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన తండ్రిని కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించేందుకు యువజన విభాగం సారథిగా ప్రత్యేక పాత్ర పోషిస్తానన్నారు. పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి సుంకర చిన్ని, పలువురు పార్టీ నాయకులు జక్కంపూడి రాజా వెంట ఉన్నారు. -
ఆ నేతల ప్రయాణం ఎందాకా..
ఒకే పార్టీలో మెట్టప్రాంత నేతలు పైకి కలసిన ఎంపీ తోట, ఎమ్మెల్యే జ్యోతుల, ఇన్చార్జి చంటిబాబు లోలోన రాజకీయ భవిష్యత్ కోసం పైఎత్తులు గ్రామస్థాయిలో కేడర్లో అయిష్టత తామరాడలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల ఘర్షణ పోలీసు పికెట్ ఏర్పాటు జగ్గంపేట : రైలు పట్టాలు కలుస్తాయా... ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుస్తాయా... అంటే కలువవని చిన్న కుర్రాడయినా చెబుతాడు. ఏపీలో ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ చిన్నకుర్రాడికి సైతం ఉన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో ఎడాపెడా చేర్చుకుంటూ పోతున్నారు. అయితే ఆయన ఇంద్రజలానికి ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు కానీ వారి అనుచరులు మాత్రం కలవలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్తిపాడులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి వరుపులకు కాస్త కలిసొచ్చింది. అయితే జగ్గంపేటలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆ నియోజకవర్గంలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఒక సారి మంత్రి హోదాను పొందిన తోట నరసింహం ప్రస్తుతం టీడీపీ కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆయన అనుచరులు నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకు చూస్తున్నారు. మరోవైపు టీడీపీ టికెట్పై రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు పార్టీలో సానుభూతితో కేడర్ను నిలుపుకుంటూ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మెట్టప్రాంతంలో తనకంటూ ప్రత్యేక రాజకీయ శైలి కలిగిన జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే హోదాలో టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరారు. దాంతో నియోజకవర్గంలో మూడు వర్గాలయ్యాయి. నేతలు పైకి పెదాలపై చిరునవ్వులను చిందిస్తూ కలిసి ఉన్నామని చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో కేడర్ను నిలుపుకోకపోతే దెబ్బతింటామని ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ పోతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ముగ్గురు నేతలు కలిసి పాల్గొన్నారు. ఎవరి అనుచరులు వారి వెంటే ఉండడం చర్చనీయాంశం అయింది. గ్రామస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారిని కలుపుకునేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దానికి కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గాల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలే అద్దంపడుతున్నాయి. గతంలో పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీ నరసింహం శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆ గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే అనుచరుడు తొలగించి లోపల ఏర్పాటు చేయించారు. ఆ శిలాఫలకాన్ని యధాస్థానంలో ఉంచాలని ఎంపీ వర్గం పట్టుపట్టగా పోలీసు స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. దాంతో కిర్లంపూడి ఎస్సై బీవీ రమణ ఆధ్వర్యంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
ఇదేమి దిగజారుడు రాజకీయం?
అడ్డూఅదుపూ లేని ‘పచ్చ’నోట్ల ప్రవాహం సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. నైతిక విలువలన్నింటికీ తిలోదకాలిచ్చి రకరకాల ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ప్రలోభాల పర్వంలో నిమగ్నం కావడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీ స్థాయిలో ఆఫర్లు ఎరవేస్తున్నారు. రూ.30 కోట్లకుపైగా నగదు, రాజధానిలో విలువైన భూములు, పదవులను ఎర చూపుతున్నారు. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తరహాలోనే మరోసారి ప్రయత్నాలను ముమ్మరం ప్రారంభించారు. వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన అధికార పార్టీ.. దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. అవినీతితో అన్ని రంగాలనూ భ్రష్టుపట్టించారు. అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పరువు పూర్తిగా పోవడంతో వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అవినీతి సొమ్మును వెదజల్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. సమర్థుడినని, తాను వస్తే రాజధానిని సింగపూర్ చేస్తా, బీజింగ్ చేస్తానంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు రాజధానిలో చిన్న భవనం కూడా కట్టలేని పరిస్థితి. కేవలం డిజైన్లు విడుదల చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. రైతులు, యువకులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే రెండేళ్ల నుంచి వెనకేసిన అవినీతి డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి కాదు... డ్రామా ‘మమ్మల్ని చూసి వస్తున్నారు. మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. ‘అభివృద్ధిపై మీకు అంత నమ్మకం ఉంటే.. మీరు ఏమన్నా అభివృద్ధి చేశామని అనుకుంటే మీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేయించండి’ అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. దానిపై స్పందించడానికి అధికార పార్టీ సాహసించడం లేదు. దానిని బట్టే ఈ 22 నెలల్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని అర్థమవుతోందని విశ్లేషకులంటున్నారు. నిజంగానే అభివృద్ధి చేశామని అధికార పార్టీకి నమ్మకముంటే ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయించవచ్చు కదా అని అంటున్నారు. సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా అధికార పార్టీ అనేక అడ్డదారుల్లో బయటపడాలని చూసింది. ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే గత సాంప్రదాయాలకు విరుద్ధంగా అదే రోజు చర్చ చేపట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయించి, ప్రతిపక్ష పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేసింది. సభ్యులంతా డివిజన్కు పట్టుబడుతున్నా మూజువాణి ఓటుతో తప్పించుకుంది. స్పీకర్పై అవిశ్వాసం పెట్టిన సందర్బంలోనూ ఇలాగే పలాయనం చిత్తగించింది. ఇపుడు ద్రవ్య వినిమయ బిల్లు విషయంలోనూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓటింగ్ కోరుతోంది. సభ్యులందరికీ విప్ జారీ చేసింది. అయితే, టీడీపీ నాయకత్వం మందబలంతో రాజ్యాంగ వ్యవస్థలను కూడా మేనేజ్ చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధిపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలను ఎదుర్కోవాలి. లేదంటే అవిశ్వాస తీర్మానాలనన్నా నిబంధనల ప్రకారం ధైర్యంగా ఎదుర్కోవాలి. అలా చేయడం లేదు కాబట్టి అధికార పక్షం చేస్తున్న ‘అభివృద్ధి వాదం’ ఉత్తడొల్లేనని తేలిపోతుంది. ఎన్నికలకు వెళ్దాం రండి అని సవాలు చేయడంతోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టిందంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ప్రజల్లో మద్దతుపై నమ్మకం ఉండబట్టేనని విశ్లేషకులంటున్నారు. తప్పు చేస్తూ ప్రతిపక్షంపై దుష్ర్పచారం అధికార పక్షం ఒకవైపు ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగిస్తూనే రకరకాల దుష్ర్పచారాలకు దిగుతుండడం గమనార్హం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయిస్తుండడానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని, కార్యకర్తల అభీష్టమని, రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అలాగే అనుకూల మీడియాలోనూ దుష్ర్పచారాలకు తెరతీశారు. ఉన్నవి లేనట్లు... లేనివి ఉన్నట్లు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమని వైఎస్సార్సీపీ అంటోంది. ఇటీవల పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేకు ఇవ్వలేదు కాబట్టి కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, అందువల్లే ఆయన అలకబూనారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారంలో అందెవేసిన అధికారపార్టీ నాయకులకు.. వారి అనుకూల మీడియా యథాశక్తి సహకరిస్తోంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూకు అన్యాయం జరిగినట్లుగా పచ్చ మీడియాలో గోబెల్స్ ప్రచారం జరుగుతోంది. ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. జ్యోతుల నెహ్రూ అసంతృప్తితో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ ఇప్పటికే అటు పార్టీలోనూ, ఇటు సభలోనూ కీలకమైన నేతగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ప్రతిపక్షనేత జగన్తో కలసి ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. అన్నిటికీ మించి పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు. వీటన్నిటితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని కీలకమైన బాధ్యతల్లో ఉండడం వల్ల పీఏసీ చైర్మన్గా కేంద్రీకరించి పనిచేయలేనని ఆయనే స్వయంగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా పీఏసీ చైర్మన్గా ఉన్న నేతనే మంత్రిపదవి ఎరవేసి అధికారపార్టీ ఆకర్షించింది. అలాంటపుడు పీఏసీ పదవో లేదా మరొకటో ఈ ఫిరాయింపులకు కారణం కాదని అర్థమవుతోంది. ఇదంతా పథకం ప్రకారం అధికార పార్టీ ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. విలువలకు తిలోదకాలు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారదలచుకుంటే ముందు ఆ పార్టీకి రాజీనామా చేయడం, పదవికి రాజీనామా చేయడం సాంప్రదాయం. కానీ, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తూ వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకోవడం, విలువలకు తిలోదకాలివ్వడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడినని, తనను ప్రపంచమంతా గౌరవిస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇలాంటివి మామూలేనని విశ్లేషకులంటున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఏపీలో కూడా అలాంటి వ్యవహారాలు చేయకుండా ఉంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా రంగంలో దిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ చంద్రబాబు.. రాజకీయాల్లో విలువలను అథఃపాతాళానికి తీసుకెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. సీనియర్లతో చర్చించే నిర్ణయం పీఏసీ చైర్మన్గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై వైఎస్సార్సీపీలో సీనియర్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ పథకాలలో విపరీతమైన అవకతవకలు జరుగుతుండడం, నిధులు పక్కదారి పట్టించడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక విషయాలలో మంచి పట్టు ఉన్న, ఫోకస్డ్గా ఉండే వ్యక్తి అయితే బాగుంటుందని అధినాయకత్వం ఆలోచించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ, బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానూ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక విషయాలలో మంచి అవగాహన ఉందన్న విషయం వెల్లడయ్యింది. సభలో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించడం నాయకత్వాన్ని ఆకర్షించింది. ఆర్థిక అంశాలలో కేంద్రీకరించి పనిచేయగలగడంతోపాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తోనూ సమన్వయం చేసుకునే నేర్పు ఉన్న వ్యక్తిగా గుర్తించింది. అవకతవకలకు పాల్పడుతున్న అధికార పార్టీని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఇరుకున పెట్టగలుగుతాడని పార్టీ నాయకత్వం భావించింది. అందుకే పీఏసీ చైర్మన్ బాధ్యతలకు బుగ్గనను ఎంపిక చేసినట్లు వైఎస్సార్సీపీ వర్గాలంటున్నాయి. -
'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చర్చలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరినట్లు వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. వారిపై తక్షణమే వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. స్పీకర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విధివిధానాల బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారని జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై చర్యలతో ప్రజాస్వామ్యాన్ని స్పీకరే రక్షించాలని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. అలా జరిగితే రాజకీయాల్లో నీతి, నిబద్ధత అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు కనువిప్పు కలుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుందని జ్యోతుల నెహ్రు అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రజల మనోభావాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి (వాయిస్, వీడియో రికార్డులు, ఫోటోలు) అన్ని ఆధారాలను స్పీకర్కు అందచేశామన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పీకర్ న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యే బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళతామన్నారు. ముందుగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టి ఆయనపై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తామన్నారు. -
'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వం వహిస్తే వైఎస్ఆర్ సీపీ మద్ధతు పలుకుతుందని స్పష్టంచేశారు. ఈ విషయంపై రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. -
చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం
చంద్రబాబు చేస్తున్నది ఒక రకంగా రాజకీయ వ్యభిచారమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, దాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్లు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారని మండిపడ్డారు.ఇలాంటి జిమ్మిక్కులు చేసి ఒకరిద్దరిని ప్రలోభపెట్టి పార్టీని బలహీనపరచాలన్న దురాలోచన చేస్తున్నారన్నారు. ఎంతగా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంతగా నీ పార్టీ కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. చంద్రబాబు పాలన మీద, ఆయన మీద ఎవరికీ నమ్మకం లేదని.. ఆ విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో టీడీపీ కొట్టుకుపోయిందని, ఈ విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేటతెల్లం అయ్యిందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ఓటర్లందరూ టీఆర్ఎస్కే పట్టంగట్టారని, జీహెచ్ఎంసీలో చంద్రబాబుకు వచ్చిన బలం.. ఏకో నారాయణ అని ఎద్దేవా చేశారు. ఆరోజు ఆయన గగ్గోలు పెట్టారని, కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా తమ మనుషులను తీసుకుంటోందన్నారని గుర్తు చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలను నీతిమాలిన రాజకీయంతో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక తమ పార్టీ నుంచి వెళ్లిన పెద్ద మనుషులు అక్కడ ఏం చూసి వెళ్లారని అడిగారు. పాలన సక్రమంగా ఉందని వెళ్లారా, ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారని వెళ్లారా అని ప్రశ్నించారు. రైతు రుణాల పరిస్థితి ఏంటో, రైతులు చంద్రబాబు పాలనను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎవరినీ సంతృప్తి పరచలేని అసమర్థ పాలనపై ఏ నమ్మకంతో వెళ్లారని అడిగారు. కేవలం దొంగ కేసులు, అవినీతి సూట్కేసులు.. ఈ రెండు ప్రలోభాలకే లొంగి వెళ్లినట్లు కనిపిస్తోందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజలు నూటికి నూరుశాతం జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని నమ్ముతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేద్దామా అని చూస్తున్నారని ఆయన చెప్పారు. -
'4న ఏపీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, ఇతర అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన ఈ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు, వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై మండలి బుద్ధప్రసాద్కు ఇచ్చిన నివేదిక.. ప్రివిలేజ్ కమిటీకి అందిందనీ, నివేదిక కాపీలను మాకివ్వలేదని జ్యోతుల నెహ్రు అన్నారు. గతంలో ఇతర ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటిసులనే పరిశీలించామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి రావడం లేదని చైర్మన్ను అడిగామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాట్లాడి అన్నిపార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి వచ్చేలా చేయాలని కోరామన్నారు. వచ్చే నెల 4న ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని జ్యోతుల నెహ్రు వెల్లడించారు. -
ఇరిగేషన్ దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జీఎన్ఎస్ఎస్ 29వ ప్యాకేజీకి అంత పెంపా? మండిపడిన జ్యోతుల నెహ్రూ సాక్షి, హైదరాబాద్ : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో 29వ ప్యాకేజీ పనుల వ్యయం పెంపుపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైన టీడీపీ నేత సీఎం రమేష్కు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. వాస్తవంగా 29వ ప్యాకేజీ తొలి అంచనా వ్యయం రూ.12 కోట్లు కాగా, ఏకంగా రూ.110 కోట్లకు పెంచడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ ప్యాకేజీలో డిజైన్ మార్పు లేకపోయినా ఎందుకు వ్యయం పెరిగిందన్నారు. జీవో నెంబర్-22 ప్రకారం సాగునీటి ప్రాజెక్టులన్నింటి వ్యయం విషయంలోనూ ఇలాగే దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు. మొత్తం ఏపీలో 40 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.11,229 కోట్లుగా ఉంటే దానిని టీడీపీ ప్రభుత్వం ఏకంగా రూ.24,700 కోట్లకు పెంచేసిందని తెలిపారు. తెరవెనుక చినబాబు ఆదేశిస్తే తెరముందు పెద్దబాబు (చంద్రబాబు) మంత్రివర్గాన్ని అడ్డం పెట్టుకుని పెంపు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అందుకు అనుగుణంగా సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ పెంపులో వారు రూ.6,000 కోట్లు దోచుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ఈ దోపిడీ ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఆపేయకపోతే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. పట్టిసీమలాగే ఫాస్ట్ట్రాక్ ప్రాజెక్టులాగా గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని సంకల్పించి తామేదో కొంత వ్యయం పెంచితే దానికి తాము రాధ్దాంతం చేస్తున్నట్లు దేవినేని తేలిగ్గా చెప్పడం విడ్డూరమన్నారు. ఇనుము రేట్లు తగ్గాయని, సిమెంటు రేట్లు మాత్రమే కొద్దో గొప్పో పెరిగాయని, అంతమాత్రానికి మూడు రెట్లు వ్యయం పెంచుతారా? ఇదేమి దోపిడీ అని నెహ్రూ ప్రశ్నించారు. -
ఏపీలో సర్కారు అడ్డగోలు దోపిడీ:జ్యోతుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందని వైఎస్ఆర్ కీంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి వేలకోట్ల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం పేరుతో రూ.6వేల కోట్ల దోపిడీకి తెర తీశారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించినా... దారుణంగా దోచుకునేందుకు ఏపీ కేబినెట్ సిద్ధమైందని జ్యోతుల నెహ్రు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాన్ని తాము ఒప్పుకోమని ఇద్దరు సీఎస్లు చెప్పినప్పటికీ, మందబలాన్ని ఉపయోగించుకుని దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. చంద్రబాబు తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే ఈ దోపిడీ ఉద్దేశమన్నారు. ఆ దోపిడీని ప్రశ్నించిన తాము అభివృద్ధి నిరోధకులమంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ అంచనాల పెంపుపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మానేసి వాస్తవాలు వెల్లడించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. -
'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని బలోపేతం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, జ్యోతుల నెహ్రు శనివారం తెలిపారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు కుట్రపన్నుతోందని వారు ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తొలి సంతకం చేస్తారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆర్టీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కోరారు. -
బీసీలకు అన్యాయం జరగనివ్వం
పిఠాపురం : కాపు ఉద్యమం ద్వారా బీసీలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ సామాజిక వర్గమైన కాపులను బీసీల్లో చేర్చాలని అడుగుతున్నామే తప్ప బీసీ సోదరులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో మార్పు చేయమనడం లేదని స్పష్టం చేశారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమానికి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తప్పక తన పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే వైఎస్సార్సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాపు సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన అదనంగా రిజర్వేషన్లు అడుగుతున్నామన్నారు. ఒకరికి అన్యాయం జరగడానికి కాపు సామాజిక వర్గం ఎప్పుడూ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ సామాజిక వర్గంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే కాపు ఉద్యమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేపట్టిన కాపు ఉద్యమం తమ హక్కును సాధించుకోవడం ఖాయమని జ్యోతుల పేర్కొన్నారు. 27న కాకినాడలో వైఎస్సార్ సీపీ యువభేరి ఈనెల 27న కాకినాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువభేరి నిర్వహిస్తున్నామని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని జ్యోతుల తెలిపారు. 21న నిర్వహించాల్సిన యువభేరి అనివార్యకారణాల వల్ల వాయిదా పడిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచీ పార్టీలకతీతంగా ఉన్నత విద్యావంతులు యువభేరికి హాజరయ్యేలా ప్రతి నాయకుడూ, కార్యకర్తా పనిచేయాలన్నారు. విద్యార్థి సమస్యలు, ఉపాధి అవకాశాలపై ప్రశ్నించగలిగే విద్యావంతులం తా యువభేరికి వచ్చి సమస్యలను తెలియజేయాలని కోరా రు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కన్వీనర్ పెం డెం దొరబాబు మాట్లాడుతూ యువభేరి విజయవంతానికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం సభ్యుడు మధుసూదన్రెడ్డి, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, పార్టీ నేతలు గండేపల్లి బాబీ, అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి, కారే శ్రీనివాసరావు, మొగిలి అయ్యారావు, ఆనాల సుదర్శన్, జ్యోతుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
'కాపునాడు సదస్సును అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర'
తుని(తూ.గో): త్వరలో జిల్లాలో జరిగే కాపునాడు సదస్సను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు. తునిలో జరిగే కాపునాడు సదస్సుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పలువురు కాపునాడు నాయకులు జ్యోతుల నెహ్రును కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాపునాడు ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దుతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
'స్పీకర్ తీరులో మార్పు వస్తుందని ఆశ'
కాకినాడ: తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై నోటీసులు ఇచ్చామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పాలక పక్షానికి మద్దతుగా స్పీకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. మా అవిశ్వాస తీర్మానంతోనైనా స్పీకర్లో మార్పు వస్తుందని ఆశ పడుతున్నామన్నారు. మా నోటీసుతో స్పీకర్ తీరు పై చర్చించే అవకాశం దొరుకుతుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. శాసన సభ వ్యవహారాలను ఎన్టీఆర్ భవన్కు తాకట్టు పెడుతున్నట్టుగా కనిపిస్తుందని మండిపడ్డారు. -
ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహారిస్తోంది: జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో 15 అంశాలపై చర్చించాలని బీఏసీలో లేవనెత్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు. ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని నిర్ణయం తీసుకోగా.. తాము ఎక్కువ రోజులు నడపాలని కోరామని ఆయన అన్నారు. తమతో పాటు బీజేపీ కూడా సమావేశాలు పొడిగించాలని కోరినట్టు జ్యోతుల చెప్పారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం 5 రోజులే సభను పరిమితం చేసిందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని జ్యోతుల నెహ్రు విమర్శించారు. -
'కాల్మనీ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం'
హైదరాబాద్: ప్రజలను పీడించి, వేధింపులకు గురిచేసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోటస్పాండ్లో బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ఏం చెప్పారంటే.. కాల్ మనీ కేసుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం వీఆర్ఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను ప్రస్తావిస్తాం విచ్చలవిడి కల్తీమద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తాం ఏపీలో మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తాం గిరిజనుల మనుగడుకు నష్టం వాటిల్లేలా ఉన్న బాక్సైట్ విధానాన్ని మార్చాలి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తాం ఆకాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి ప్రజా సమస్యలన్నింటీపై చర్చ జరిగి పరిష్కారం చూపేంతవరకు అసెంబ్లీ సమావేశాలు జరగాలి శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం -
కాల్మనీ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం
-
'వరి క్వింటాల్కు రూ.300 బోనస్ ఇవ్వాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు సర్కార్ రుణమాఫీని అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. వరి క్వింటాల్కు 300 రూపాయలు బోనస్ ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ కోరారు. -
ప్రాణత్యాగాలు చేస్తున్నా బాబు వైఖరిలో మార్పులేదు
హైదరాబాద్ : ప్రత్యేక హోదాల శకం ముగిసిందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అనడం పచ్చి మోసమని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... జైట్లీ వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమన్నట్లు ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయడ్డారు. ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నా.. చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు లేదని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. -
'వారి అంతర్నాటకంలా ఉంది'
రాజమండ్రి: ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ఆ ఏపీకి నిధులిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. హోదా ఇవ్వకపోయినా దానికి తగిన స్థాయిలో హామీ ఇస్తారని ప్రజలు ఆశించారని చెప్పారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ఇదంతా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిన అంతర్నాటకంలా కనిపిస్తుందని చెప్పారు. యమునా నది నుంచి నీరు తెచ్చి సరిపెట్టుకోమని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
-
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
గుంటూరు: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోర వైఫల్యం చెందారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రం దుర్భిక్షంలో ఉంటేనే తన దుష్టపన్నాగాలు అమలవుతాయని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల మాట్లాడుతూ రైతుల దుస్థితిని ఆయుధంగా వాడుకుని, వారికి భ్రమలు కల్పించి చంద్రబాబునాయుడు మోసం చేశారని చెప్పారు. యువతను కూడా ఉద్యోగాలిస్తామని.. నిరుద్యోగ ఉదృతి భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, అది తెచ్చి ఎవరికి పెడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, తనకు ఎక్కడ లంఛాలు రావో అని పోలవరం పక్కకు పెట్టేశారని, దానిని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుంటే పోలవరం పూర్తి కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. పోలవరం కాలువ వైఎస్ తవ్విస్తే దానిని ప్రారంభించి తానేదో గొప్పలు సాధించినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా దీక్ష కొనసాగించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసుల కుంభకోణంలో ఇరుక్కుని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చెప్పారు. -
హోదా అవసరం లేదన్నట్టుగా....
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్టుగా మంత్రులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్యాకేజీలు తెచ్చుకుని జేబులు నింపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలు అమలు కాకపోవడం కేంద్రం చేతగానితనమే అని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. -
గండేపల్లి బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ వారికి చెక్కులు అందజేశారు. జ్యోతులనెహ్రూతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పిచ్చి తుగ్లక్లా చంద్రబాబు పాలన
చంద్రబాబు పరిపాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యముంటే నీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని అన్నారు. నీటి సంఘం ఎన్నికల్లో 75 శాతం టీడీపీపై వ్యతిరేకత రాకపోతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆయన సవాలు చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలపై రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టిసీమ పంపులు ఎక్కడున్నాయో తెలియకుండానే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గండేపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో శవ రాజకీయాలు చేసింది ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడేనని జ్యోతుల ఆరోపించారు. పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబు కారణమనే అక్కడి మృతులకు రూ. 10 లక్షల వంతున పరిహారం ఇచ్చారన్నారు. -
'ఎగనామం పెట్టే పనులు చేయొద్దు'
హైదరాబాద్: నదుల అనుసంధానం ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిందని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏలూరు దగ్గర కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడో జరిగిందని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల ఫలితాలను తమవిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాయాల గారడీ ప్రభుత్వం ప్రజలను పాలిస్తోంది, దానికి నాయకుడు మహా మాంత్రికుడు అని ఎద్దేవా చేశారు. వాస్తవాలకు దగ్గర ఆలోచన చేయాలని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. రైతాంగానికి ఎగనామం పెట్టే పనులు చేయొద్దని హితవు పలికారు. -
'ఎగనామం పెట్టే పనులు చేయొద్దు'
-
ధనార్జనకే పట్టిసీమ
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ధ్వజం సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ధనార్జన కోసం చేపట్టారే తప్ప ప్రజల కోసం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టిసీమతో వచ్చే రూ.1300 కోట్ల ముడుపులపైనే తప్ప నీటిపైన ఆసక్తి లేదని విమర్శించారు. నదుల అనుసంధానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపైనే అభ్యంతరమని స్పష్టంచేశారు. గతంలోనే తమ పార్టీ నాయకుడు జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని, తాము అదే వైఖరికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.పట్టిసీమ ప్రాజెక్టుపై బుధవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ జ్యోతుల నెహ్రూ అధికార పార్టీ వైఖరిపై విరుచుకుపడ్డారు. వృధాగా పోతున్న గోదావరి జలాలను వినియోగంలోకి తేవడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదని, దాన్ని ఉపయోగించే విధానంపైనే అభ్యంతరమని చెప్పారు. 13 జిల్లాల నీటి సమగ్రత కాపాడుకోవాలనుకున్నప్పుడు గోదావరి, కృష్ణ, నాగావళి, వంశధార, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కానీ అధికారపక్షం పట్టిసీమలో వచ్చే రూ.1300 కోట్లపై ఆసక్తితో దానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.ఓ వైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటూ ఈ వ్యయం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఖర్చును పోలవరం ప్రాజెక్టుపై పెడితే ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేస్తానని కేంద్రం చెబుతున్నా ఏం ఆశించి పట్టిసీమకు ప్లాన్ చేశారని నిలదీశారు. కృష్ణా నదిని కర్ణాటకకు, గోదావరి నదిని మహారాష్ట్రకు అప్పగించిన ఫలితమే నీటి కొరత కాదా? అని ప్రశ్నించారు.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం ఎవరి పాలనలో కట్టారో చెప్పాలని నిలదీశారు. ‘‘పులిచింతల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చు పెడితే 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం వస్తుంది. కానీ తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమపై అధిక ఆసక్తి చూపిస్తూ వైఎస్సార్ హయాంలో చేపట్టిన పులిచింతలకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారు. పట్టిసీమవల్ల గోదావరి జిల్లాలకు నష్టం ఉండదని, గోదావరి డెల్టా రైతులు త్యాగధనులనీ అంటున్నారు.వందేళ్ల సైక్లింగ్ను చూడండి వాస్తవం మీకే బోధ పడుతుంది. ఈసారి తొలకరికే నీళ్లు ఇవ్వలేని స్థితి ఏర్పడింది’’ అని నెహ్రూ వివరించారు. నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టిందే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. (ఈదశలో ముఖ్యమంత్రికి, నెహ్రూకి మధ్య సంవాదం నడిచింది). ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయవద్దని, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయనే ఆలోచన చేసిందే వైఎస్సార్ అని, జలయజ్ఞాన్ని చేపట్టిందే అందుకని వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేస్తే సీమకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. రాయలసీమకు కేటాయించిన నిధులెన్నని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై రూ.200 కోట్లే ఖర్చు పెట్టడాన్ని తప్పుబట్టారు. నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నామన్నారు. (మళ్లీ సీఎం అడ్డుతగిలి రాయలసీమ నీటి ప్రాజెక్టులకు వ్యయం చేసిన మొత్తాలను వివరించారు. హంద్రీ నీవాకు రూ.665.66 కోట్లు, గాలేరు-నగరికి రూ.267.70 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు) పూర్తికాని ప్రాజెక్టు జాతికి అంకితమా? పట్టిసీమ ప్రాజెక్టును దశల వారీగా పూర్తి చేస్తామని ఓ వైపు చెప్తూనే... పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కిందని నెహ్రూ విమర్శించారు. ‘‘ఎక్కడయినా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 20 శాతమో, 30 శాతమో, 50 శాతమో నీళ్లు వదిలిన తర్వాత జాతికి అంకితం చేస్తారు. కానీ అసంపూర్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారా?’’ అంటూ ఫోటోలను సభకు చూపారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే బయటపడుతోందని, ఇది రాయలసీమను, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. కుడికాల్వ సామర్థాన్ని కూడా బాగా కుదించి తవ్వుతున్నారని, దీనివల్ల భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక బక్కెట్ నీళ్లను కృష్ణా నదిలో పోసి అదే నదుల అనుసంధానం అనుకోమంటారా? అని నిలదీశారు. ‘‘పోలవరం నాలుగేళ్లలో పూర్తయితే.. ఈలోపు తాత్కాలిక పద్ధతిలో నీటిని తరలించలేమా? అలాచేస్తే నిధుల దుర్వినియోగం జరిగేది కాదు. శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పులిచింతలను, పోతిరెడ్డిపాడును పక్కనబెట్టి, తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమకు ప్రాధాన్యం ఇస్తారా? ఇదేనా మీ చిత్తశుద్ధి? సీమకు నీళ్లు ఇచ్చే పద్ధతి ఇదేనా? సమగ్రంగా నీళ్లు ఇవ్వాలన్నదే మా పార్టీ విధానం’’ అని చెప్పారు. ప్రాజెక్టుల కోసం బస్సు యాత్ర చేసింది కూడా తమ పార్టీయేనన్నారు. టీడీపీకి తోకపార్టీ : నెహ్రూ ఓ దశలో బీజేపీని టీడీపీకి తోకపార్టీ అన్నందుకు ఆ పార్టీ శాసనసభ్యులు ఏ.సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు అభ్యంతరం తెలిపారు. నెహ్రూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సైతం ఈ వ్యాఖ్యపై అభ్యంతరం తెలిపారు. పట్టిసీమ విధాన ప్రకటనపై జరిగిన చర్చలో మంత్రులు అచ్చన్నాయుడు, దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. నెహ్రూ మాట్లాడుతున్నంతసేపూ అధికార పక్ష సభ్యులు అడ్డుతగులుతూనే వచ్చారు. -
'పట్టిసీమ.. ధనార్జన ప్రాజెక్టు'
-
సభలో పట్టిసీమ మంటలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు బుధవారం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ సభ్యుల మధ్య ప్రాజెక్టులపై వాడివేడి చర్చసాగింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగా, అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దివంగత మహానేత వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తికాకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితమిస్తారని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం ధనార్జన కోసం చేపట్టిన ప్రాజెక్టు అని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమపై వాస్తవాలు చెప్పాలని, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టరాదని హితువు పలికారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వైఎస్ఆర్ తపించారని, చంద్రబాబుకు చిత్తుశుద్ధిలేదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు అన్నది దశల వారీ పూర్తి అవుతుందని మంత్రి చెప్పారు.. చెబుతూనే ఉన్నారు. పట్టిసీమ పూర్తి కాకుండానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి ఎలా అంకితం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అని దానికి సంబంధించిన పత్రాలను అసెంబ్లీలో చూపిస్తూ.. ప్రజాస్వామ్యానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి పట్టిసీమే నిదర్శనమని ఎద్దేవా చేశారు. 'రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 15 కల్లా కృష్ణానదిలోకి నీరు వదులుతామని చెప్పారు. ఇప్పటికీ కాలేదు. రూ.450 కోట్లు ఇస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. పట్టిసీమ ద్వారా నీళ్ల తరలింపు దుర్మార్గం. సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉన్నా కూడా ఎందుకు వినియోగించలేదు' అని ప్రశ్నించారు. చర్చలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎదురుదాడి చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ దశలో అధికార పార్టీ సభ్యుల అరుపులు, కేకలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం తర్వాత సభ రేపటికి వాయిదాపడింది. -
'నాటి కృషి వల్లే మీరు నీళ్లు ఇవ్వగలిగారు'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రాజెక్టులపై చర్చలో నెహ్రూ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వైఎస్ఆర్ తపించారని చెప్పారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు అందించేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషిచేశారని నెహ్రూ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ బస్సు యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం పులివెందులకు 2 టీఎంసీలు ఇచ్చామంటున్నారని, ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఇచ్చారని, వైఎస్ఆర్ చేసిన కృషి వల్లే నీళ్లు ఇవ్వగలిగారని నెహ్రూ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమపై వాస్తవాలు చెప్పాలని, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టరాదని హితువు పలికారు. ఈ సమయంలో అధికార పార్టీ సభ్యుల అరుపులు, కేకలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ సీపీ నాయకులపై చంద్రబాబు ఎదురుదాడి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
'మహానేత ఫోటో తొలగించడం దారుణం'
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎవరికీ చెప్పకుండా తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... మానవతావాదిగా గుర్తింపు పొందిన వైఎస్సార్ ఫోటోను తొలగించడం దారుణమన్నారు. ఆయన ఫోటోను యధాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు. మహానేత చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కరువు కోరల నుంచి రాష్ట్రం బయట పడుతుందన్నారు. కరువు పరిస్థితులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ నేడు వాయిదా తీర్మానం ఇచ్చింది. -
'మహానేత ఫోటో తొలగించడం దారుణం'
-
'కనీసం 3 రోజులైనా పెంచాలి'
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తమ ఎజెండాను స్పష్టంగా చెప్పామని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... కనీసం మూడు రోజులైనా పెంచాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని వెంటనే చర్చకు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు పలు ప్రజాసమస్యలపై చర్చించాలంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. దురాలోచనతో తాము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేశారు. -
'కనీసం 3 రోజులైనా పెంచాలి'
-
చంద్రబాబు..అంత టైమ్ లేదన్నారు
-
నేతల అరెస్ట్పై న్యాయవిచారణ జరపాలి
రాజమండ్రి : రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్పై ఆ పార్టీ శాసనసభ ఉప నేత జ్యోతుల నెహ్రు మండిపడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన బంద్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం అయిందనే దురుద్దేశంతో సర్కార్ అణిచివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందిం పెడితే ఊరుకోమని జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు ప్రధాని మోదీని కలసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 29వ తేదీన బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బంద్ నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రుపై విధంగా స్పందించారు. -
'బంద్ అడ్డుకునేందుకు సీఎం కుట్ర'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ చేపట్టనున్న బంద్ కు వామపక్షాలు మద్ధతు పలకడం సంతోషంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.గురువారం పట్టణంలోని మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బంద్ను నిర్వీర్యం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సంజీవని కాకపోతే ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు హామీ ఇచ్చినట్లు అని ఆయన ప్రశ్నించారు. మోసపూరిత విధానంతో వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం కోసం బాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్పీకర్ దాటవేత ధోరణితో వ్యవహరించారు
హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫొటోతో సహా మిగిలినవారి ఫొటోలు కూడా తిరిగి ఆయా స్థానాల్లో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో సమావేశమైయ్యారు. అనంతరం జ్యోతుల నెహ్రు విలేకర్లతో మాట్లాడుతూ... దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్న స్పీకర్ సమాధానంతో తమకు అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఆధునీకరణ పనులు జరుగుతున్నందునే ఆ ఫొటోలన్నీ పక్కన పెట్టామని స్పీకర్ చెప్పారు. అయితే ఎప్పట్లోగా తిరిగి ఆ ఫొటోలు ఏర్పాటు చేస్తారని తాము అడిగిన ప్రశ్నకు స్పీకర్ దాటవేత ధోరణితో వ్యవహరించారని జ్యోతుల నెహ్రు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను పక్కదోవపట్టించేందుకు టీడీపీ రాజకీయ ఎత్తుగడను అనుసరించిందని విమర్శించారు. ప్రజాసమస్యలపై తెలుగుదేశం పలాయనం చిత్తగించేలా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తన స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు. -
'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు'
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు పర్యటనలకు తీసుకెళ్లాలన్న స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ యాత్రకు వెళ్లకూడదని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా నిర్ణయించారని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర పరిస్థితులు బాలేదని చెబుతూనే ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం 5 రోజుల్లో ముగించాలన్న నిర్ణయానికి తాము వ్యతిరేకమన్నారు. కనీసం 20 రోజులైన సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజా సమస్యలపై తన వైఖరిని అసెంబ్లీలో వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
'రైతాంగం అయోమయ పరిస్థితిలో ఉంది'
-
'కోతలే.. చేతల ప్రభుత్వం కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుది కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. 10 లక్షల మందికి పింఛన్లు ఎగనామం పెట్టిన ప్రభుత్వం, 16 లక్షల మందికి రేషన్ కార్డుల్లో కోత విధించిందన్నారు. హుద్ హుద్ తుపాను వల్ల లక్షలాది ఇళ్లు నేలమట్టం అయినా కొత్తవి మంజూరు చేసింది కేవలం వేలల్లో మాత్రమే అని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రైతుల ఆత్మహత్యలను సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. -
'చెప్పడమే కాని.., చేతలు లేని ఏపీ ప్రభుత్వం'
-
'తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు మొదలైన తొలిరోజే తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనను మరిపించేందుకు అభినందన సభలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలు విజయవంతం అయ్యాయని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. -
'పుష్కరాల్లో అంతా చంద్రజపమే'
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో పుష్కరాలకు వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శుక్రవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించడం లేదని, అంతా చంద్రజపంగా మారిందని ఆరోపించారు. -
ఇవే చర్యలు ముందు తీసుకుంటే ...
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో భక్తులపై పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు కుటుంబ సభ్యులతో కలసి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం జ్యోతుల నెహ్రు విలేకర్లతో మాట్లాడారు. పుష్కరాలలో అధికారుల వైఖరిపై మండిపడ్డారు. అధికారులు పనితీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు. ప్రస్తుతం అధికారులు చేపడుతున్న చర్యలు పుష్కరాల ప్రారంభ సమయంలో కూడా తీసుకుని ఉంటే అంతటి ఘోరం జరిగేది కాదన్నారు.పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ముద్ర వేసుకోవడానికి యత్నించి విఫలమయ్యారని జ్యోతుల నెహ్రు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద భక్తుల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ఆర్ ఫౌండేషన్ ఉచిత శిబిరాలు
రాజమండ్రి: గోదావరి పుష్కర యాత్రికుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఉచిత సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా పాలు, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. రాజమండ్రి నగరంలో పలు చోట్ల ఫౌండేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ శిబిరాల్లో ప్రత్యేకంగా యాత్రికుల కోసం లాకర్లను అందుబాటులో ఉంచారు. సహాయ శిబిరాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సందర్శించారు. -
సీఎం పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి :పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్లో జరిగిన తొక్కిసలాట మరణాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఏ మాత్రం నైతిక విలువలున్నా ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. కిర్లంపూడి మదీనా జామియా మసీదులో పార్టీ నాయకులు తూము కుమార్, కుర్ల చినబాబు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో జ్యోతుల ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన నెల అని, నియమనిష్టలతో వారు ఉపవాస దీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. గోదావరి పుష్కరాల్లో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని అన్నారు. ప్రపంచంలో తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో ఆయన చేసిన తప్పిదంవల్లే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. గవర్నర్కు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి గాడి తప్పిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి, పుష్కర పర్యవేక్షణ బాధ్యతను అధికారులకు అప్పగించాలని, పుష్కరాలకు వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పుష్కరాలను విజయవంతం చేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశింబాబు, వైఎస్సార్సీపీ బీసీ విభాగం కార్యదర్శి కర్రి సూర్యనారాయణమూర్తి(దత్తుడు), జిల్లా సంయుక్త కార్యదర్శి జంపన సీతారామచంద్రవర్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తూము చినబాబు, కంచుమర్తి రాఘవ, భూపాలపట్నం ప్రసాద్, గౌతు చిన్న, గుడాల రాంబాబు, కాల దొంగబాబు, నీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ'
రాజమండ్రి:టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. దీనిలో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్టు చేశారన్నారు. భూమాకు ఏమి జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేతిలో డీజీపీ రాముడు కీలుబొమ్మగా మారిపోయారని జ్యోతుల ఎద్దేవా చేశారు. -
జూలై 2, 3 తేదీల్లో తూర్పు, విశాఖల్లో జగన్ పర్యటన
వాయుగుండం, రోడ్డు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరామర్శ కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 2, 3 తేదీల్లో తూర్పు, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. సోమవారం కాకినాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రెండున రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గంలోని సూరంపాలెం వెళ్లి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ ప్రాంతవాసుల కుటుంబాలను పరామర్శిస్తారన్నారు. అనంతరం ఇటీవల వాయుగుండం కారణంగా మరణించిన మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు కాకినాడ, కాకినాడరూరల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. రాత్రికి కాకినాడలో బస చేసి 3వ తేదీ ఉదయం తుని నియోజకవర్గంలోని పెరుమాళ్లపురం వెళ్లి బాధిత మత్స్యకారులను, అక్కడి నుంచి విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం వెళ్లి ధవళేశ్వరం వద్ద తూఫాన్ వ్యాన్ గోదావరిలో పడి మృతి చెందిన వారి బంధువులను పరామర్శిస్తారన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. -
'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమకాయల చినరాజప్పపై వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారంటూ చినరాజప్ప వ్యాఖ్యానించడం సరికాదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఓటుకు కోట్లు వంటి టీడీపీ నీచ సంస్కృతిని వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.