k taraka rama rao
-
మూడోసారీ మా ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్ఎస్కు 72 నుంచి 82 సీట్లు వస్తాయని స్పష్టంగా తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాపై వ్యతిరేకత ఉన్నట్టు సోషల్ మీడియాలో హడావుడి జరగడం, అక్కడక్కడా మౌఖిక ప్రచారమే (మౌత్ టాక్) తప్ప క్షేత్రస్థాయిలో ఓటరుకు ఎలాంటి గందరగోళం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మేం కూడా కొంత గందరగోళపడినా క్షేత్రస్థాయి నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో, కొడంగల్లో రెండో స్థానంలో నిలిచే పరిస్థితి ఉన్నపుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్ దిగ్గజాలైన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి కుమారుడు, జగ్గారెడ్డి వంటివారు కూడా ఓడిపోతున్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. మేం ఖమ్మంలో ఆరు స్థానాల్లో, నల్లగొండలో 7 నుంచి 9 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్నా మా పార్టీ పరిస్థితి నిక్షేపంగా ఉంది. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి ఆరంభంలో కొంత కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది పాలపొంగు వంటి హడావుడి మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ కసిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్, కోరుట్లలోనూ గెలుస్తున్నాం. మాకు 15 నుంచి 18 చోట్ల బీజేపీ నుంచి, మిగతా చోట్ల కాంగ్రెస్ నుంచి పోటీ ఉండగా.. మేం మాత్రం అన్నిచోట్లా పోటీలో ఉన్నాం. ముదిరాజ్లకు టికెట్ల సర్దుబాటులో అవకాశం ఇవ్వలేకపోయాం. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్ తదితరుల చేరికతో ఈ విషయాన్ని ఆ సామాజికవర్గం అర్థం చేసుకుంది. బీజేపీతో ఎన్నడూ అంటకాగలేదు కేసీఆర్ 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీతో అంటకాగలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్లపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ ఏజెంట్గా పనిచేస్తూ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదు. విపక్ష నేతల ఇళ్లపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను మాకు అంటగట్టడం సరికాదు. రైతుబంధు దుబారా, ధరణి రద్దు అంటూ కాంగ్రెస్.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేయడం విడ్డూరం. మోదీ ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు మోపారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కేసీఆర్ అంటే భయంతోనే.. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్. ఆయన జాతీయ పార్టీలకు కొరుకుడు పడని కొయ్య. మూడోసారి అధికారంలోకి వస్తే ఏకు మేకు అవుతాడనేది కాంగ్రెస్, బీజేపీల భయం. కర్నాటక, గుజరాత్ల నుంచి రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలకు వస్తున్న డబ్బుకు అడ్డూ అదుపు లేదు. ఆ రెండు జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ మాకు మాత్రం తెలంగాణే కేంద్రం. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఏకైక గొంతు కేసీఆర్ను కాపాడుకోవాలా వద్దా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇస్తాం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తాం. బీడీ కార్మీకులకు 2023 వరకు కటాఫ్ పెంచి కొత్తగా లక్షన్నర మందికి పింఛన్లు ఇస్తాం. భర్తను కోల్పోయిన భార్యల పేరిట పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ కార్మీకులకు ఉచిత బీమా కల్పిస్తాం. ఆటో డ్రైవర్లకు రూ.వంద కోట్ల మేర వాహన ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తాం. జాబ్ క్యాలెండర్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఇప్పటికే యువతకు స్పష్టత ఇవ్వడంతోపాటు దీనిని మరింత బలంగా ప్రచారం చేస్తాం. ఈసీ అనుమతివ్వగానే రైతుబంధు సొమ్ము రూ.19,445 కోట్ల పంట రుణాల మాఫీకిగాను ఇప్పటికే రూ.14వేల కోట్ల పైచిలుకు క్లియర్ చేశాం. మిగతా రూ.5వేల కోట్ల మాఫీ ప్రక్రియ ప్రతిపక్షాల ఫిర్యాదు వల్ల ఆగింది. రుణమాఫీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాం. అనుమతి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం. రైతుబంధు 12వ దఫా సొమ్ము విడుదల కోసం కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాం. పీఎం కిసాన్ డబ్బులు వేసే వెసులుబాటు కల్పించి రైతుబంధు విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదు. మా మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు వెళ్తాం..’’అని కేటీఆర్ తెలిపారు. -
అసైన్డ్ భూములకు హక్కులిస్తాం
సిరిసిల్ల: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం.. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్సభ, ఇతర ఎన్నికల కోడ్తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాధ్యతలు పెరిగాయి ‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్షోలలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రేవంత్ కాదు.. రేటెంతరెడ్డి
సాక్షి, కామారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని, ఆయన ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సీటుకు రేటు కడుతున్నాడు. అందుకే వాళ్ల పార్టీ నేతలే ఆయనను రేటెంతరెడ్డి అంటున్నారు..’’ అని విమర్శించారు. శనివారం కేటీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్య కర్తల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ భారత దేశం నుంచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఎవరూ కాలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారితో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ గురించే చర్చ నడుస్తోందని, ఇక్కడ బీఆర్ఎస్ విజయం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు బీఆర్ఎస్తో కలసి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో గెలి చాక మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా రాష్ట్రలో సాధించే విజయంతో కేంద్రంలో కీలక భూమిక పోషిస్తామని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే నని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదట సిద్దిపేటలో పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ను స్థాపించారు. కరీంనగర్లో పోటీచేసి ఢిల్లీకి తెలంగాణవాదాన్ని తీసుకువెళ్లారు. మహబూబ్నగర్లో పోటీ చేసి దేశాన్ని ఒప్పించి రాష్ట్రం సాధించారు. గజ్వేల్లో పోటీచేసి ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. పదేళ్ల స్వల్పకాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం ద్వారా హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సాధించి, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తారు..’’ అని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాంగ్రెస్, బీజేపీల నాయకులు వణికిపోయి పోటీచేయడంకన్నా ఇంట్లో పడుకోవడమే మంచిదనే భావనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను దేశంలోనే అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్లకు అడ్డగోలుగా డబ్బులు వస్తాయని, అదానీ నుంచి బీజేపీ వాళ్లకు డబ్బులు వస్తున్నాయని.. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నామినేటెడ్ పదవులు ఇస్తాం. రకరకాల సమీకరణాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ముదిరాజ్లు, మరికొన్ని కులాలకు అవకాశం దక్కలేదని.. అయితే వారికి ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీచేసే కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతోపాటు మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. ఏ ఊరికి ఏం కావాలో నివేదికలు రూపొందించి అప్పగించాలన్నారు. సభలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఇప్పటిదాకా చూసింది ట్రైలరే..
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు తాము చూపినది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే ప్రతిపక్షాలకు అసలు సినిమా చూపిస్తామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్లో కులమతాల పేరిట చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గులు, చిల్లర పార్టీల ఆటకట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ మధ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని దుర్మార్గులు.. ఇప్పుడు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయని అసమర్థులు.. మళ్లీ వస్తున్నారు. మతం పేరిటో, కులం పేరిటో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న మనకు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏడాదిలో వారం పదిరోజులపాటు కర్ఫ్యూ ఉండేది. ప్రజల మధ్య ఏదో ఓ పంచాయతీ పెట్టి కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనేవి. ఇప్పుడు మతాలు, కులాలకు అతీతంగా అంతా కలసిమెలసి ముందుకు పోతున్నాం, చిల్లర పార్టీలు, నాయకుల మాటలకు మోసపోతే హైదరాబాద్ మళ్లీ వందేళ్లు వెనక్కుపోతుంది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి, కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం ఒకప్పుడు అందరం ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతంలో సినిమాలు చూసిన వాళ్లమేనని.. సినిమా చూసి బయటికి వచ్చాక ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందిపడిన వారమేనని కేటీఆర్ చెప్పారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఫ్లైఓవర్కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. కార్మికుల తరఫున పోరాడిన నాయిని పేరు దీనితో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇందిరాపార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. లోయర్ ట్యాంక్బండ్, అప్పర్ ట్యాంక్బండ్ను కలుపుతూ టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన కల్వకుర్తి నేత ఉప్పల వెంకటేశ్ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్, మరికొందరు ఇతర పార్టీల నాయకులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఆగం కావొద్దని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలన్నారు. -
ఇంతకంటే అభివృద్ధా?.. రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన అభివృద్ధి జరుగుతున్నట్టు నిరూపిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పురపాలక, ఐటీశాఖల మంత్రి కె. తారక రామారావు సవాల్ చేశారు. ఔటర్ రింగ్రోడ్డు లీజులో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాసనసభ వానాకాల సమావేశాల్లో భాగంగా శనివారం ‘రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు– సాధించిన ఫలితాలు’అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తాను చెబుతున్నవి తప్పు అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలని, లేదంటే కాంగ్రెస్కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డిలపై ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణలో ఉన్నదంతా సంక్షేమమే.. ‘‘రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమాఖర్చుల లెక్క మాత్రమే. బీఆర్ఎస్కు ఇది రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. ఇక్కడ సంక్షేమమే తప్ప సంక్షోభం లేదు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలో టాప్. 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, రైతులకు జీవితబీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా పనితనం. ప్రతిపక్ష నేతల్లా మేం ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్రావులకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగ్గా అభివృద్ధి ఉందని రుజువు చేస్తే.. రేపు పొద్దున్నే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ ఇచ్చింది మేమేనని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలికనా? 1968లో 370 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది ఎంపీలను గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్లో కలిసిపోయింది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది కాంగ్రెస్ వారు కాదా? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్రెడ్డి అన్నమాటలు మరిచిపోయారా? కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. నలుగురు నాయకులు కలసి కూర్చుని మాట్లాడలేని వాళ్లు.. 4 కోట్ల మందిని పాలిస్తారంటే నమ్మాలా? కాంగ్రెస్కు నాయకుల్లేక పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకున్నారు. మేం ప్రధాని మోదీకే భయపడలేదు. ఇక్కడ వీళ్లకు భయపడతామా? ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధం తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ తన కవితలో ‘‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం..’’అని చెప్పారు. ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళంలో పడతారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం. తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాలనను, నాటి అంధకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంతు చూస్తాం! ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్రాజెక్టు (టీవోటీ)ను ఐఆర్బీ సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఒకాయన (రేవంత్రెడ్డి) బయట ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రభావం భట్టి మీద పడినట్టు ఉంది. ఐఆర్బీ సంస్థ దివాలా తీసిందంటూ ఏదేదో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, కర్ణాటకలలోనూ పలు టోల్స్ నిర్వహణ కాంట్రాక్టులను ఆ సంస్థ పొందింది. మహారాష్ట్రలో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా టెండర్ నిర్వహించి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆయన (రేవంత్) ఎందుకు ఈ సంస్థ గురించి మాట్లాడారో, దానికి కారణమేంటో మాకు తెలుసు. ఆర్టీఐ (సమాచార హక్కు) అంటే కొందరికి ‘రూట్ టు ఇన్కం’గా మారిపోయింది. రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై ఐఆర్బీ సంస్థ వెయ్యికోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ కూడా కేసు పెట్టారు. రేవంత్ అంతు చూస్తాం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. కోనరావుపేటనా.. కోనసీమనా? ఇటీవల దర్శకుడు వెల్దంటి వేణు బలగం సినిమాను సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట గ్రామంలో తీశారు. ఆ సినిమా చూసి మా కుటుంబసభ్యులే ఇది కోనరావుపేటనా? కోనసీమనా? అని ఆశ్చర్యపోయారు. తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా ఇప్పుడు ఇదే పరిస్థితి. రివర్స్ మైగ్రేషన్ చూస్తున్నాం ఇప్పుడు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను పొరుగు రాష్ట్ర నేతలు గుర్తించారు. వారికి అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు. -
అభివృద్ధిని చూడలేకే చిల్లర మాటలు..
వనస్థలిపురం (హైదరాబాద్): బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్ష నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ వయసును గౌరవించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని హస్తినాపురం జీఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లపై ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న కాలనీలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 118 కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 4వేల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలసి రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. దేశంలో నంబర్వన్గా నిలిపాం ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’అని సామెత ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు పేద అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సాయం కూడా చేస్తాందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తిచేశామని, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్, పాలమూరు వలసల సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. గతంలో గాందీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలా 10వేల బెడ్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. వేల కుటుంబాలకు లబ్ధి: సుధీర్రెడ్డి తాను కాంగ్రెస్లో ఉన్నప్పట్నుంచే రిజిస్ట్రేషన్లపై ఆంక్షల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని, దీనికోసమే బీఆర్ఎస్లో చేరానని ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్తా, ఎగ్గె మల్లేశం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూపు మారిన పురాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం 2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే.. పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీ, ఎస్ఎన్డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు. 2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది!
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95–100 సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పట్లేదని, తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్రాంగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నామని, ఆ సమయంలో 10 సీట్లు అటుఇటు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొందరు కుయుక్తులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. చిన్న రాష్ట్ర ఏర్పాటే విఫలమని ప్రకటించి ఏదో చేద్దామని ప్రయత్నించారని, కానీ ప్రజలకు స్పష్టత ఉండటంతో 2018 ఎన్నికల్లో తమకు 88 సీట్లిచ్చి గెలిపించారని చెప్పారు. అభివృద్ధి కేవలం డైలాగ్లు కొడితేనే, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తేనో జరగదని, నాయకుడికి స్థిరచిత్తం, ధృడసంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే ఆరాటం ఉంటేనే సాక్షాత్కారం అవుతుందన్నారు. సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధికి తార్కాణం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఐపీఎస్, ఐఏఎస్లకు టెంపర్.. ‘రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే తొలి ఏడాది విధానాలను అర్థం చేసుకోవడానికి, కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. చివరి ఏడాది మళ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మధ్యలో ఉండేది మూడేళ్లే. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నాయకులకేం తెలుసు.. మేము కదా పర్మినెంట్ ఆర్టిస్టులం.. వాళ్లు గెస్ట్ అర్టిస్టులు. ఐదేళ్లకొకసారి మారిపోతారని అనకుంటారు. వాళ్ల టెంపర్ వాళ్లది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 250 కి.మీ. వరకూ మెట్రో విస్తరణ... హైదరాబాద్లో మెట్రో రైలును 250 కి.మీ. వరకూ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 31 కి.మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి హయత్నగర్ వరకు, ఈసీఐఎల్ నుంచి నానక్రాంగూడ వరకూ మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు ఒక్కోటి 18.5 కి.మీ. మేర స్కైవాక్ను నిర్మించనున్నామని... భవిష్యత్తు అవసరాల రీత్యా ఈ స్కైవాక్ల మధ్యలో మెట్రో పిల్లర్లను సైతం నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన 16 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణం సెపె్టంబర్కు పూర్తవుతుందన్న కేటీఆర్... ఎస్టీపీల నుంచి వచ్చే నీటిని నిర్మాణరంగ అవసరాలకు వినియోగించుకోవాలని డెవలపర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్గౌడ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాల సమస్యలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. మ్యాన్హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మునిసిపాలిటీలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యత అని, ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. -
కరీంనగర్ పేరు చెబితే.. ప్రతిపక్షాల గుండెఝల్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉద్యమకాలం నుంచి ‘కరీంనగర్ పేరు చెబితే ఝల్లు మనాలే’ అని పాటలు పాడుకున్నామని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు గుండెఝల్లు మంటోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్లోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్లతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్లో రూ.220 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు నది మొత్తం 180 కి.మీల పొడవునా సుజల దృశ్యంగా మార్చాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యమకాలంలో జలదృశ్యంలో మొదలై.. రాబోయే దసరా నాటికి మానేరు సుజల దృశ్యంగా ఆవిష్కారం కాబోతుందని ప్రకటించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కాళోజీ అన్నట్లుగా.. ‘నా తెలంగాణ కోటి మాగాణం’గా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో గోదావరి–కృష్ణా నీటిని ఒడిసి తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టండి.. కరీంనగర్ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్ సంకల్పాన్ని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం ముద్దుగా ‘కరీంనగర్ భీముడు’ అని పిలుచుకునే గంగుల కమలాకర్ చొరవతోనే అందమైన జంక్షన్లు, రోడ్లతో నగరం సర్వాంగ సుందరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వెన్నుదట్టి మరోసారి ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అదే సమయంలో ప్రణాళికా సంఘం బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ను ఎంపీగా కోల్పోయామని వాపోయారు. ఇపుడున్న ఎంపీ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదని విమర్శించారు. నగరంలో పదెకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గుడి కట్టిన నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పల్లెప్రగతి నుంచి పట్టణప్రగతి వరకు దేశంలో మనమే నెంబర్ వన్గా ఉన్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని, అందులో కరీంనగర్ తెలంగాణలోనే అగ్రభాగంలోనే ఉందని తెలిపారు. అందుకే, పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. పనిచేయని వారిన చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని.. అభివృద్ధే తమ కులమని.. జనహితమే తమ మతం అని ముగించారు. ప్రాజెక్టులతో కరీంనగర్కు ప్రపంచస్థాయి గుర్తింపు : గంగుల అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని గుర్తుచేశారు. కేబుల్ వంతెన, మానేరు రివర్ఫ్రంట్ ఆగస్టు 15 నాటికి మొదటి దశ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాటర్ ఫౌంటేన్ ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా కరీంనగర్ను లండన్ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రం ఇస్తే ఏం చేస్తారన్న వెక్కిరింపులను దాటి.. నదులను ఎత్తి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చామని, నిరంతర కరెంటు ఇస్తున్నామని చెప్పారు. -
మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు?
సిరిసిల్ల: ఉచితాలు వద్దని, రేవుడీ కల్చర్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఏటా మూడు సిలిండర్లు, నిత్యం అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఒక్క కర్ణాటకకేనా అని ప్రశ్నించారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన బీజేపీ సర్కార్.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వదని, మిగతా రాష్ట్రాల్లోనూ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలపైనా జీఎస్టీ వేసిన కేంద్ర ప్రభుత్వం హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 90 శాతం వరకు వరి నష్టం రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా యాసంగి సీజన్లో వరిని సాగు చేశారని, అయితే అనూహ్యంగా వచ్చిన వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని కేటీఆర్ చెప్పారు. వరి పంట 30 శాతం నుంచి 90 శాతం మేరకు నష్టం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 19 వేల ఎకరాల్లో 17 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదు జిల్లాల్లో పర్యటించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్ను ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. ఇలావుండగా.. రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, నీరు ఇచ్చే తెలంగాణ వ్యవసాయ విధానం కావాలని దేశమంతా కోరుకుంటోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఈ సమయానికి కేవలం 4 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పంటలు వేసిన అసైన్డ్ భూములు, పోడు భూములకు కూడా నష్ట పరిహారం ఇస్తామన్నారు. మహిళల భద్రతకు ‘అభయ’యాప్ మహిళల భద్రతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రూపొందించిన ‘అభయ’యాప్ను మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మినీ స్టేడియంలో ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో రాష్ట్రంలోనే తొలిసారి రూపొందించిన ‘అభయ’యాప్ను ఆవిష్కరించారు. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉమెన్ సెఫ్టీ కోసం ఈ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందని, ట్రాక్ మై లొకేషన్ పోలీసులకు షేర్ అవుతుందన్నారు. ఈ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా సచివాయంలోకి ఎంపీ రేవంత్రెడ్డిని ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘అది సచివులు ఉండే చోటు, సచివులకే ప్రవేశం ఉంటుంది..’అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మోదీకి ఘర్వాపసీ తప్పదు
ప్రజలు కేసీఆర్ను ఆశీర్వదిస్తారు.. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండాయే ఎగురుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా రికార్డు సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావనంలో ప్రజలు ఉన్నారు. రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసేందుకు బయలుదేరిన కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, బీజేపీపై బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విరుచుకుపడ్డారు. ఏటీఎం అంటే అదానీ టూ మోదీకి డబ్బుల ప్రవాహమే అని ఆయన కొత్త భాష్యం చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీకి ఈసారి కూడా వందకుపైగా సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ఈ నెల 27న బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... ఏటీఎం అంటే... ఏటీఎం అంటే అదానీ నుంచి మోదీకి డబ్బుల ప్రవాహం సాగడమే. అవినీతి గురించి మోదీ ఆయన మంత్రులు మాట్లాడటం విడ్డూరం. సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకొని కేంద్రం ఆటలాడుతోంది. కానీ ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ç2024లో మోదీకి గుజరాత్కు ఘర్ వాపసీ తప్పదు. 2024లో ప్రధాని పదవి ఖాళీ కాక తప్పదు. ఎవరేం అనుకున్నా తెలంగాణలో గత ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి ఈసారి 103 స్థానాల్లో మళ్లీ డిపాజిట్లు దక్కవు. మోదీ అప్పట్లో రాష్ట్రం విడిచి తిరగలేదా..? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ మోదీ 2010 నుంచి 2014 వరకు పాలన గాలికొదిలేసి గాలి తిరుగుడు తిరగలేదా? తెలంగాణలో మౌలికవసతులు కల్పించాకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. గుజరాత్లో నేటికీ మంచినీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో సమస్యలు లేవనడం లేదు. మా కార్యకలాపాలకు కేంద్రం తెలంగాణయే. ఢిల్లీ కేంద్రంగానే పార్టీని నడపాలనే ఖానూన్ ఏమీ లేదు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించవచ్చు. ప్రజల ఆశీర్వాదం, ఆదరణ మాకు లభిస్తే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి... పరివార్వాదీ, ఎంఐఎంతో అనుబంధం, మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని తిరస్కరిస్తారు. కర్ణాటకలో 40–50 మంది బీజేపీ నేతల కుటుబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం పరివార్వాదీ కాదా? అక్కడ బీజేపీకి వర్తించని నిబంధనలు మాకే వర్తిస్తాయా?. కరప్షన్ క్యాప్టెన్ మోదీ.. క్యాప్షన్ బీజేపీ. అదానీ, ప్రధాని అవిభక్త కవలలు. మోదీ అత్యంత అవినీతిపరుడు. పాలన చేతకాని అసమర్థుడు. బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 20 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎంఐఎం అనే పార్టీ భుజంపై తుప్పుబట్టిన తుపాకీ పెట్టి ఎన్నిసార్లు కాల్చినా ప్రజలకు స్పష్టత ఉంది. పేదల కోసం పనిచేసే వారిని ప్రజలు ఆదరిస్తారు. బీజేపీ చేసే మతపరమైన రాజకీయం తెలంగాణ చైతన్యం ముందు చెల్లదు. విస్తరణ బాటలో ఉన్నాం... 60 లక్షల సైన్యంగల పార్టీ బీఆర్ఎస్. దేశంలోనే ఇంత పెద్ద బలగం, సైన్యం ఉన్న పార్టీ మరొకటి లేదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోకి ఇంకా బలంగా వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా మా జెండా, ఎజెండా, మా నాయకుడు, గుర్తు మారలేదు. తెలంగాణనే మాకు మొదటి ప్రాధాన్యం. తెలంగాణ మోడల్ను దేశానికి చూపుతున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఇతర రాష్ట్రాల్లో ఎగురవేయడానికి బయలుదేరాం. అంతే కాని తెలంగాణను వదిలి వెళ్లలేదు. శిఖండి రాజకీయం.. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు నేరుగా గెలవలేక కొత్త పార్టీలు, చిన్న పార్టీలను అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ పార్టీల నాయకులు నిద్రలేచింది మొదలు కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడినా ఒక్కరూ ప్రశ్నించరు. బీజేపీపై మరకపడకుండా చూస్తూ బీఆర్ఎస్ ఓట్లను చీల్చడమే వారి పని. తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని బీఆర్ఎస్కు అండగా నిలుస్తారు. ఎన్నికల సమాయత్తానికే సమ్మేళనాలు.. ఎన్నికల ఏడాదిలో కేడర్ను సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని చిన్నాచితకా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటాం. మే నుంచి యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం. విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేలా జూన్ నుంచి బీఆర్ఎస్వీ ఎన్రోల్మెంట్ ప్రారంభిస్తాం. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్ష, రాష్ట్ర ప్రభుత్వ విజయాలను విద్యార్థులు, యువతకు వివరించి మత కలహాలతో చిచ్చు పెట్టే పార్టీ కావాలా లేదా తెలంగాణను పచ్చగా చేసే పార్టీ కావాల ఆలోచించుకోవాలని చెప్తాం. వారికి భవిష్యత్తులో అవకాశాలు.. పార్టీలో టికెట్లు ఆశించడం అసహజ విషయమేమీ కాదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనే స్పష్టత మా పార్టీ నేతలకు ఉంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారు ఎన్నికల్లో కొట్లాడతారు. రాకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడే వారికి రేపు మరో అవకాశం వస్తుంది. తొమ్మిదేళ్లలో అనేక మంది విద్యార్థి, యువజన నాయకులకు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా, కమిషన్ల సభ్యులుగా అవకాశం ఇచ్చాం. మాట ఇచ్చిన వారందరినీ అకామిడేట్ చేసుకున్నాం. ఎవరికైనా అవకాశాలు రాకుంటే భవిష్యత్తులో ఇస్తాం. గవర్నర్ వ్యవస్థతో కేంద్రం రాజకీయం... గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ప్రభుత్వాల గొంతును కేంద్రం నులుముతున్న తీరును దేశం గమనిస్తోంది. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేసి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కొందరికి ఆదరణ లేకే... పాదయాత్రల పేరిట కొందరు ఆపసోపాలు పడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, అస్తిత్వం కోల్పోతామనే చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ, ఇతర ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఏకమై పనిచేశాయి. అదానీతో మోదీకి సంబంధం లేదని బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? ప్రమాణాలు, ఇమానాల మీద తేలేదుంటే కోర్టులు ఎందుకు? ఇంకో పార్టీకి డబ్బులు పంపే ఖర్మ మాకేంటి? వాళ్లందరికీ పంచేంత డబ్బులు మా వద్ద లేవు. బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ఉపద్రవాలు. ఎంత త్వరగా వదిలించుకుంటే తెలంగాణకు అంత మంచిది. జాతీయ పార్టీ ఒకేసారి దేశమంతా పోటీ చేయాలని లేదు... బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినంత మాత్రాన దేశమంతా ఒకేసారి పోటీ చేయాలన్న రూలేమీ లేదు. రెండు స్థానాల నుంచి 300 స్థానాలకు చేరుకొనేందుకు బీజేపీకి 30–40 ఏళ్లు పట్టింది. 2024లో 543 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనే తొందరేమీ మాకు లేదు. పట్టుదొరికి బలంగా ఉన్న చోట, గెలిచే అవకాశం, పార్టీ విస్తరణకు అవకాశం ఉన్న చోట పోటీ చేస్తాం. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామా, ఇతరులతో అవగాహన ఉంటుందా ఇప్పుడే చెప్పలేము. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు పనిచేస్తూనే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడాన్ని మొదటి కర్తవ్యంగా పనిచేస్తాం. దేశంలో రాజకీయ శూన్యత నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదుగుతుంది. కుమారస్వామికి మద్దతు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యులర్) నేత కుమారస్వామికి మద్దతివ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కుమారస్వామి కోరితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ప్రత్యర్థి కాంగ్రెస్సే.. తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. క్షేత్రస్థాయిలో అంతోఇంతో కాంగ్రెస్ ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో కేడర్, లీడర్లు నిరాసక్తతతో ఉన్నారు. 2018లో 19 సీట్లు వస్తే ఈసారి కాంగ్రెస్కు డబుల్ డిజిట్ వస్తుందో రాదో తెలియదు. కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో వారితో పనిచేసే విషయంలో ఎన్నికల నాటికి నిర్ణయం ఉంటుంది. అదానీ షేర్ల స్కాం అంశం విషయంలో పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఏర్పాటు డిమాండ్ కోసం కాంగ్రెస్తోపాటు ఇతర విపక్షాలతో కలసి కేవలం ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం పనిచేశాం. -
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ
అమిత్ షా జీ.. త్వరలో అధికారంలోకి కాదు..బీజేపీ అంధకారంలోకే. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్వాపసీ తప్పదు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే బలమైన భావనలో ప్రజలున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘డియర్ అమిత్షా జీ..త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్వాపసీ తప్పదు.. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే భావనలో ప్రజలున్నా రు’ అంటూ అమిత్షా వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇలా.. అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్ ‘కారు స్టీరింగ్ కాదు.. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధహస్తాల్లో కమలం విలవిలలాడుతోంది. హిండెన్బర్గ్ రిపోర్ట్తో బీజేపీ ఫుల్ పిక్చర్ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రైలర్ అవసరం లేదు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటివేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటికలలు నెరవేరవు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కుందా?. ముక్కునేలకు రాసినా..మోకాళ్ల యాత్ర చేసినా..మోసాల మోదీని తెలంగాణ నమ్మదు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు. కరప్షన్కు కెప్టెన్.. మోదీ. క్యాప్షన్.. బీజేపీ. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు?. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్’. నిస్సిగ్గుగా సుద్దులా? ‘బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదే. అదానీ విషయంలో జేపీసీ కాదు కదా కనీసం సిట్ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గుజరాత్లో మోదీ హయాంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ నంబర్వన్గా ఉన్నమాట నిజం కాదా?. గత ఎనిమిదేళ్లలో గుజరాత్లో 13సార్లు పేపర్లు లీక్ కాలేదా?. ఈ దేశంలో ‘వ్యాపం’ లాంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా?. అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం మీకే చెల్లింది’. పీఎం కేర్స్లో ఎంత జమైందో చెబుతారా? ‘పీఎం కేర్స్లో ఎంత జమైందో, ఏవిధంగా ఖర్చ యిందో చెప్పని వారు, కాగ్ ఆడిట్ పీఎం కేర్స్కు వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు, కాగ్ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరేమిటి?. ఎనిమిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికొచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తే నమ్మేదెవరు?’ అంటూ కేటీఆర్ తన వరుస ట్వీట్లను ముగించారు. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్.. ‘ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో రెండోదశ, ఐఐఎం, ఐసెర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్తాపన చేసినందుకు కృతజ్ఞతలు. ఓహ్.. ఆగండాగండి.. ఇవేవీ ఆయన చేయలేదు’ అంటూ అమిత్ షాను ఉద్దేశించి రాష్ట్రమంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఒక్కటీ ఎందుకు చెప్పలేకపోయారు’ అని మంత్రి కేటీఆర్ అమిత్షాను ప్రశ్నించారు. ‘ఆకాశాన్నంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు. ప్రజలపై పెట్రోధరల భారాన్ని తగ్గంచాలన్న సోయి కూడా లేదు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు. కానీ ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం. దేశం కోసం కాదు.. దోస్తు కోసం ప్రజల రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న వైనం. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ?. దేశానికి అర్దమైంది.. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్’ అంటూ కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. -
ఊరూరా పండుగలా..
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోపాటు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల్లో మంచి స్పందన వస్తుండటంతో.. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఊరూరా పండుగలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని.. అన్ని స్థాయిల పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని నిర్ణయించింది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని సూచించారు. 25 నుంచి కార్యక్రమాలు.. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని, కనీసం 2.5 వేల నుంచి 3 వేల మంది వరకు సభలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో అదే రోజున ఉదయం పార్టీ జెండాలను ఎగరవేసి.. పండుగలా జరుపుకోవాలని, ఆ తర్వాత నియోజకవర్గ సమావేశాలకు రావాలని నేతలకు సూచించారు. రోజంతా జరిగే పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతినిధుల సభకు నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు అన్నిస్థాయిల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు హాజరుకావాలని చెప్పారు. తెలంగాణభవన్లో ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడకలను నిర్వహించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. అదేరోజున పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని.. సుమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెడతారని.. వాటిపై విస్తృతంగా చర్చించి, ఆమోదిస్తారని వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా ఈ నెలాఖరులో వరి కోతలు ఉండటం, ఎండల తీవ్రత దృష్ట్యా.. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించే బహిరంగసభ, ప్రతినిధుల సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలిపి అక్టోబర్ 10న వరంగల్లో మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాల కొనసాగింపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారని కేటీఆర్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు దాకా కొనసాగించాలని కేసీఆర్ సూచించారని.. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జులు సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతి నేపథ్యంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్రెడ్డిని కేసీఆర్ నియమించారు. ఇక గోషామహల్ ఇన్చార్జిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం ఇన్చార్జిగా ఎంపీ మాలోతు కవితలను నియమించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు బాధ్యులుగా ఉంటారని ప్రకటించారు. -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్రూఫ్ విధానాన్ని ఆప్షన్గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్పాత్లు, సైక్లింగ్ ట్రాక్లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్ఆర్సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం ద్వారా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటు పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.1,300 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నందునే బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వివరించారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని కేటీ ఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్చార్జీలతో సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 27న జెండా పండుగ పార్టీ జిల్లా ఇన్చార్జీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయడంతో పాటు బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నట్టుగా.. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు చేసిన కృషిని, పార్టీతో వారి అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం అందరికీ అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షపై ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి, 25న నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమా వేశాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్లీనరీకి ఆహ్వానం అందిన ప్రతినిధులు హాజరు కావాలని కేటీఆర్ సూచించారు. -
వాళ్లవి దివాళాకోరు రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. పచ్చటి తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని.. అంబానీలు, అదానీలకు ఊడిగం చేయడంలోనే మునిగిపోయాయని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. కరువు, కరెంటు కోతలు, దారిద్య్రాన్ని మిగిల్చిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అరాచకపాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో సుమారు రూ.152 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సోడాషపల్లి క్రాస్రోడ్లో నిర్వహించిన రైతు కృతజ్ఞత సభలో ప్రసంగించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కొందరు రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పీసీసీ అధ్యక్షుడు అడుక్కుంటున్నాడు. మీ దిక్కుమాలిన పార్టీకి ప్రజలు 10 చాన్సులు ఇచ్చారు. ఏం చేశారు? గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? కరెంట్, సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే మీకు ఓటెయ్యాలా? రేవంత్రెడ్డి రెచ్చగొట్టే మాటలను ఎవరూ నమ్మరు. మతం పేరుతో మంటపెడ్తున్న బీజేపీ బీజేపీ మతం పేరుతో మంటలు రేపుతూ, కులం పేరిట కుంపట్లు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. ఎందాకైనా పోరాడుతాం. అన్నింటి ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు మోదీని దేవుడని అనాలా? బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. కిషన్రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో, అరికాళ్లలో ఉందో అర్థం కాదు. ప్రజలంతా మా కుటుంబమే.. కేసీఆర్ను విమర్శించేందుకు విపక్షాలకు ఏ కారణమూ దొరకక కుటుంబ పాలన అని విమర్శలు చేస్తున్నారు. బరాబర్ చెప్తున్నా.. మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామే. 65లక్షల మందికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతులందరికీ పెద్దన్న అయ్యారు. 45లక్షల మందికి ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నారు. 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు. ఇందులో కులం పంచాయతీ లేదు. మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతంగా పని చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు బాగు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో పంజాబ్, హరియాణాలతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వొడితెల సతీశ్కుమార్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదలం.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీపరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల మనస్తాపానికి గురై డాక్టర్ ప్రీతి చనిపోవడం చాలా బాధాకరమని.. కానీ ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేది లేదు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టబోం..’’అని వ్యాఖ్యానించారు. -
శత్రుదేశంపై దండయాత్రలాగా తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు: కేటీఆర్
భూపాలపల్లి: ‘శత్రుదేశం మీద కక్ష గట్టి దండయాత్రకు దిగినట్లుగా.. ప్రధాని నరేంద్ర మోదీ వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు. పీఎం మోదీ దేవుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటాడు. అదానీకి దేవుడా? లేక ఆయనకు దేవుడా? ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి 75 ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే అభివృద్ధి జరిగిందా?..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రూ.276 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా? ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్న ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కుంటున్నాడు. 75 ఏళ్లలో పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా.. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా?.. ఇవ్వాళ మళ్లీ మొరుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్, పేలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, పాము కాట్లు, విద్యుత్ షాక్తో రైతులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం. మనిషి చచ్చిపోతే దహనం అనంతరం స్నానం చేసేందుకు కరెంటు సరఫరా కోసం బతిమిలాడే పరిస్థితి ఉండేది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా 13,662 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 14,700 మెగావాట్ల డిమాండ్ ఉందంటే రాష్ట్రం ఏమేరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. మాది వసుదైక కుటుంబ పాలన.. ‘రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే రకరకాల మాటలు మాట్లాడతారా? మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా?. ప్రజల మనసులను గెలవాలంటే ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కావాల్సిన పథకాలు అందిస్తూ ఒక మామలా, అన్నలా, పెద్ద కొడుకులా, తాతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందీ కేసీఆర్ కుటుంబమే. మాది వసుదైక కుటుంబ పాలన..’అని చెప్పారు. పార్టీ పేరు మాత్రమే మారింది.. ‘ఎన్నికల యుద్ధానికి యువత సిద్ధం కావాలి. పార్టీ పేరు మాత్రమే మారింది. డీఎన్ఏ రంగు, గుర్తు కూడా అలాగే ఉంది. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. నిన్న, మొన్న వచ్చిన కొంతమంది చిల్లరగాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం ఇవ్వాలి. ఆ పార్టీలు పిచ్చోళ్ల చేతిలో ఉంటే తెలంగాణ ఆగమైతది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మీకు పదవులు వచ్చేవా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, జి.జగదీశ్రెడ్డి, ఎంపీ దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంపై ‘శత్రు’ వైఖరి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్ఎన్డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం. మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం. ఎస్ఎన్డీపీ ఏ నగరంలోనూ లేదు హైదరాబాద్లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)) చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు! సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు. తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు. ప్రతిపాదనలన్నీ వెనక్కే.. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది. – మంత్రి కేటీఆర్ -
కోట్ల వసూళ్లకు పాల్పడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో పద్దుల గురించి చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ధరణికి సంబంధించి లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ రేవంత్తో సహవాసంతో సభలోని కాంగ్రెస్ సభ్యులు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే భాషేనా అది? ముఖ్యమంత్రి ఎవరు అయితే వారు ప్రగతి భవన్లో ఉంటారు. అది అధికార నివాసం. అలాంటి ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానని ఎలా మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సహచర్యంతో శ్రీధర్బాబు సైతం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి శ్రీధర్బాబు, భట్టి మంచివారే. కానీ పార్టీలో సహవాస దోషంతో ఇలా తయారయ్యారు. వాళ్ల అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడే అలవాటుతో వీళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల అధ్యక్షుడు బ్లాక్మెయిల్ చేసి రూ. కోట్లకు కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. ఇందుకోసం కొందరు విశ్రాంత తహసీల్దార్లు, ప్రైవేటు వ్యక్తులతో ఓ దఫ్తర్ (కార్యాలయం)నే తెరిచాడు. చివరకు సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. అట్లాంటి వాళ్లకు ధరణితో ఇబ్బందులు అనిపిస్తాయి... సాధారణ ప్రజలకు కాదు. ధరణి రద్దు, ప్రగతి భవన్ పేల్చివేతే మీ విధానామా? ధరణిని రద్దు చేసి లంచాల కోసం రైతులను పీడించిన కాంగ్రెస్ హయాంలోని పద్ధతినే తేవాలనుకుంటున్నారా? ఏ విషయం చెప్పండి’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ధరణిని రద్దు చేయాలంటూ భట్టి, శ్రీధర్బాబు చేసిన డిమాండ్పై మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జోక్యం చేసుకుని, ‘‘మరి మీ అధ్యక్షుడు ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానంటున్నాడు. దానిపై సీఎల్పీ వైఖరి ఏమిటో కూడా చెబితే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. లోపాలపుట్ట ధరణి.. దాన్ని రద్దు చేయాలి: భట్టి, శ్రీధర్బాబు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి పోర్టల్ను రద్దు చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. పద్దులపై చర్చలో భాగంగా వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల పట్టాకు సంబంధించి గతంలో ఉన్న చాలా కాలమ్స్ను తొలగించి ధరణిని తీసుకొచ్చారని, ఇది పేదల తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. పట్టా రికార్డుల్లో దశాబ్దాలుగా పేరు ఉన్నప్పటికీ ధరణిలో కాస్తు కాలమ్ను తొలగించడంతో చాలా మంది భూమి హక్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ భూములు బడా బాబుల పరమయ్యాయని భట్టి, శ్రీధర్బాబు ఆరోపించారు. కొంత భూభా గానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని విమర్శించారు. గతంలో అసైన్ చేసిన భూములను కూడా ఇప్పుడు వెనక్కు తీసుకొని వేలం ద్వారా బడాబాబులకు కేటాయిస్తున్నారని శ్రీధర్బాబు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం పేదల భూములను ఎకరా రూ. 8 లక్షలకు తీసుకొని రూ. 1.30 కోట్లకు ఎకరం చొప్పున బడా బాబులకు కట్టబెట్టారని ఆరోపించారు. ధరణితో ప్రజల్లో సంతోషం: మంత్రి ప్రశాంత్రెడ్డి ధరణి పోర్టల్పై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను మంత్రి ప్రశాంత్రెడ్డి తోసిపుచ్చారు. సాధారణ ప్రజలు ధరణితో పూర్తి సంతోషంగా ఉన్నారని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత 24 లక్షల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ధరణిని రద్దు చేసి మళ్లీ లంచాల బాగోతం, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే ధరణి బాధలు ఏమిటో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తాయని, ఓ తహసీల్దార్ను హత్య చేసే వరకు సమస్య ఏర్పడిందంటే సమస్య తీవ్రత తెలియడం లేదా? అని భట్టి ప్రశ్నించారు. నిరూపించకుంటే శ్రీధర్బాబు క్షమాపణ చెప్పాలి.. శ్రీధర్బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అలా ఎకరం కాదుకదా.. కనీసం ఒక్క గజం ఇచ్చినట్లు నిరూపించాలని, లేనిపక్షంలో శ్రీధర్బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని శ్రీధర్బాబు... ధర విషయంలో తాను చెప్పింది తప్పయితే ఎంతకు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. భూసంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే వేరే వ్యవస్థలు పుట్టుకొస్తాయని, ఇది మంచి పరిణామం కాబోదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు. ఏకగ్రీవ ఆమోదం కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
రోడ్లపై రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కార్ల రేసింగ్ ఈవెంట్ ‘ఫార్ములా ఈ– రేసింగ్’(ఈ–ప్రిక్స్)కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ–చాంపియన్షిప్ తొమ్మిదో సీజన్ (2022–23)లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన నగరంలో ఈ–రేసింగ్ (సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహించే పోటీలు) జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు చైర్మన్గా మేనేజింగ్ కమిటీని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ (అర్వింద్కుమార్) చైర్మన్గా ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. ఈ మేరకు సోమవారం అర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ‘ఈ–రేసింగ్’కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. సర్క్యూట్లలో కాదు.. వీధుల్లో రోడ్లపైనే ఫార్ములా వన్ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన పర్పస్ బిల్డ్ (తాత్కాలిక) సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఫార్ములా ఈ–ప్రిక్స్ మాత్రం నగర వీధుల్లోని రోడ్లపైనే జరుగుతాయి. మోటార్ స్పోర్ట్ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్డులో సచివాలయం కాంప్లెక్స్, లుంబినీ పార్కు మీదుగా ఏర్పాటు చేసిన 2.37 కిలోమీటర్ల ట్రాక్ మీద ఈ–రేసింగ్ సాగనుంది. భారత్ తరఫున బరిలో ‘మహీంద్రా’ విద్యుత్ కార్లతో జరిగే ఈ తొమ్మిదో సీజన్ రేసింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో ‘ఫార్ములా ఈ’సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రేసింగ్ చాంపియన్షిప్ క్యాలెండర్ను గత జూన్ 29న ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి–ఎల్ ఆటోమొబైల్ ) వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆమోదించింది. సుమారు పదేళ్ల క్రితం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించిన ఫార్ములా వన్ పోటీల ద్వారా ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ మ్యాప్లోకి భారత్ ప్రవేశించింది. వచ్చే ఏడాది జరిగే ఈ–రేసింగ్ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రేసింగ్కు ఆతిథ్యం ఇస్తున్న 13 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఈ రేసింగ్లో భారత్ నుంచి మహీంద్రా కంపెనీకి చెందిన ‘మహీంద్ర రేసింగ్’జట్టు పోటీ పడుతోంది. మేనేజింగ్ కమిటీలో.. చైర్మన్గా మంత్రి కేటీఆర్,సభ్యులుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ టీమ్ ప్రిన్సిపాల్, సీఈవో దిల్బాగ్ గిల్, ఏస్ అర్బన్ రేస్ ఏండీ అండ్ సీఈవో, ఎఫ్ఐఏ ప్రతినిధి, కమిటీ నిర్ణయించిన ముగ్గురు నిపుణులు లేదా బ్రాండ్ అంబాసిడర్లు, చైర్మన్ నిర్ణయం మేరకు ఇతర సభ్యుడు, మెంబర్ కన్వీనర్గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో చైర్మన్గా ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ), సభ్యులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జాయింట్ సీపీ ట్రాఫిక్, ఏస్ అర్బన్ గ్రీన్కో గ్రూప్ ఎండీ, అర్బన్ రేస్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీ, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హెచ్ఎండీఏ సీఈ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, కలెక్టరేట్ తదితర విభాగా లకు చెందిన అధికారులు ఉంటారు. -
ప్రగతిలో తెలంగాణ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు సాగుతూ తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబడే స్థాయికి చేరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర పురోగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోపాటు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు ఆశించిన గౌరవం లభించడం లేదని, కానీ తెలంగాణలో పారిశ్రామికవేత్తలను సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా గుర్తిస్తున్నామని అన్నారు. ఒక్కటీ లాకౌట్ పడలేదు.. అందరి అంచనాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉండగా, ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందన్నారు. పరిశ్రమల శాఖలో ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు రాష్ట్రంలో రిపీట్ పెట్టుబడులు 24 శాతం ఉండటమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం రికార్డుస్థాయిలో కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 184 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు అభివద్ధి చెందనున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినందున త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తోపాటు ఎఫ్టీసీసీఐకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాకతీయ వైభవ సప్తాహంపై సమీక్ష కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల్లో అన్ని పార్టీలు, అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి వారంపాటు జరిగే ఈ కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్షించారు. -
యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ప్రకటన రాకున్నా కేటీఆర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం గమనార్హం. విపక్షాలతోనే టీఆర్ఎస్ పార్టీ ఉందనే సంకేతాలు పంపించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతున్నట్లు సమాచారం. -
కేంద్రం తీరు మారితేనే ‘ఆత్మ నిర్భర్’ ఫలప్రదం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలప్రదం కావాలంటే కేంద్రం ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఓట్లు్ల.. సీట్లు ఉన్నాయని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని కేంద్రం పరిశ్రమలను ఇష్టారీతిన తరలించడం సరికాదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో సుమారు 512 ఎకరాల విస్తీర్ణంలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ భారతదేశపు లాక్హీడ్ మార్టిన్ (అమెరికా ఆయుధ కంపెనీ)గా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాల మధ్య రక్షణ రంగ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించామని తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్ కారణంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా.. కేంద్రం దాన్ని ఎకాఎకిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని బుందేల్ఖండ్కు తరలించిందని, ఇది సరికాదని ఆన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి వెమ్ టెక్నాలజీస్ నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలన్నీ తయారవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టనున్న ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు. ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వెమ్ టెక్నాలజీస్ వంటి సంస్థలపై ఉందని అన్నారు. అవసరమైతే స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిననిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తున్న రైతులకు తగినంత పరిహారం ఇచ్చేందుకు కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. స్వదేశీ క్షిపణి ‘అసిబల్’ తయారీకి సిద్ధం: వి.వెంకటరాజు 1988లో స్థాపితమైన వెమ్ టెక్నాలజీస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని ‘అసిబల్’ పేరుతో తయారయ్యే ఈ క్షిపణి ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న జావెలిన్ తరహా క్షిపణి అని వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకట రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పూర్తిస్థాయి క్షిపణిని తయారు చేసిన కంపెనీగా వెమ్ రికార్డు సృష్టించనుందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సృష్టికర్త బ్రహ్మ చేతి ఖడ్గం పేరు ‘అసి’ కాగా.. బల్లెం అనే అర్థంలో బల్ను ఉపయోగించి క్షిపణి పేరును అసిబల్గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి పదివేల క్షిపణులను తయారు చేసేందుకు సంస్థకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ టెక్నాలజీతో ఒక యుద్ధ విమానాన్ని, అత్యాధునిక స్నైపర్ ఆయుధాలు, డ్రోన్లు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
ఆటోమొబైల్ హబ్గానూ ఎదుగుతాం
మణికొండ: ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలోనూ హబ్గా మారుతుందనే నమ్మకం తనకు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి్ద శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా నిలుస్తోందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో ఉందని చెప్పారు. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందిన అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సోమవారం నార్సింగి మున్సిపాలిటీ కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోపార్ట్స్కు సాఫ్ట్వేర్ను అందించే అతిపెద్ద సంస్థ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్కు రావడం గర్వకారణమన్నారు. నేటి ఆధునిక యుగంలో ఆటోమొబైల్ అంటే నాలుగు చక్రాలపై కదిలే కంప్యూటరేనని... ప్రస్తుతం తయారవుతున్న వాహనాల్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్వేర్లు ఉంటున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగానికి సం బంధించిన అన్ని అవసరాలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రతిపాదిత ‘మొబిలిటీ వ్యాలీ’ కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకన్నా భిన్నంగా అనేక రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుండటంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇలాంటి సంస్థలు వస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. గత కొంతకాలంగా కరోనా వ్యాప్తి సంస్థలను కుంగదీసినా ప్రస్తుతం కంపెనీలన్నీ కుదుటపడి తిరిగి వ్యాపార విస్తరణ బాట పడుతున్నాయన్నారు. త్వరలోనే పెట్టుబడిదారులను ఆకర్షించేలా పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. దేశంలో జీసీసీ ఏర్పాటు వ్యూహాత్మకం... దేశంలో నైపుణ్య శక్తిని అందిపుచ్చుకుంటూ సంక్లిష్ట ప్రక్రియలు, వినూత్న కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు జీసీసీ ఏర్పాటు ఓ వ్యూహాత్మక చర్య అని అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ టామ్ గ్రీకో పేర్కొన్నారు. కోకాపేటలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో మొదటి విడతగా 430 మంది ఉద్యోగులు, 150 భాగస్వామ్య వనరుల సామర్ద్యం, 65 వేల చదరపు గజాల కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామన్నారు. స్థానికంగా ఉత్తమ ప్రతిభను ఆకర్షించాలని తమ సంస్థ చూస్తుందని, తమ కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని సంస్థ ఎండీ మహేందర్ దుబ్బా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కారు కౌంటర్ అటాక్.. అమిత్ షాపై విరుచుకుపడిన టీఆర్ఎస్ నేతలు
కేంద్ర హోంమంత్రి అమిత్షాపై రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. జూటేబాజ్, బట్టేబాజ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తుక్కుగూడ సభలో టీఆర్ఎస్ పాలనపై అమిత్ షా చేసిన విమర్శలు, ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఆదివారం మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు నేతలు జీవన్రెడ్డి, బాల్క సుమన్ మాటల దాడి చేశారు. అమిత్ షాను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు. రాష్ట్రం గురించి పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని చేతగాని దద్దమ్మ అని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. మరోవైపు టీఆర్ఎస్ దాడిని తిప్పి కొట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ల మాటల తూటాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సాక్షి, హైదరాబాద్: అసమర్థుడైన ప్రధానమంత్రి ఉండడం వల్లే దేశం అప్పుల పాలైందని, చేతకాని దద్దమ్మకు అధికారం ఇవ్వడంతో దేశంలో ధరలు భగభగమంటున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ద్రవ్యోల్బణం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా గ్యాస్ సిలిండర్ ధర మన దగ్గర ఉందని, పెట్రోల్, డీజిల్ ధరలకు అదుపే లేదని విమర్శించారు. 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు దేశంలో ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్ హయాంలో రూ.56.69 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎన్డీఏ హయాంలోని ఎనిమిది సంవత్సరాల్లోనే రూ.100 లక్షల (కోటి) కోట్లు అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సామాన్యుల నుంచి రూ.26.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం, ఇందులో నుంచి రూ.11.68 లక్షల కోట్ల మేరకు తన కార్పొరేట్ మిత్రుల బ్యాంకు రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పైనా నిప్పులు చెరిగారు. నాలాయక్, జూటేబాజ్లంటూ మోదీ, షా పై తీవ్ర విమర్శలు చేశారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ సింగరేణినీ అమ్మేసేటట్టున్నారు ఒకప్పుడు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్న వ్యక్తికి ప్రధాని పదవి ఇస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం.. విశాఖ ఉక్కు సంస్థను అమ్మేసింది. త్వరలో సింగరేణిని కూడా అమ్మేసేటట్టున్నారు. మత రాజకీయాలతో మభ్య పెట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. అప్పుల్లో ముందుంది బీజేపీ పాలిత రాష్ట్రాలే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరు అబద్ధాల బాద్షా అంటే సరిగ్గా ఉంటుంది. తుక్కుగూడకు వచ్చిన ఆయన అన్నీ తుక్కు మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లారు. తెలంగాణ అప్పుల పాలైందని షా అంటున్నాడు. అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కింది నుంచి ఐదో ది. పైన ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. డబుల్ ఇంజన్ అని మాటిమాటికీ చెప్పే బీజేపీ నేతలు.. డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారో చెప్పాలి. ఆ రాష్ట్రాల్లో అప్పులు తప్ప చెప్పుకోడానికి ఇంకేం లేవు. మోదీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో తాగునీటికి కటకట ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. రాష్ట్రానికి ఇచ్చింది 1.68 లక్షల కోట్లు మాత్రమే. షా మాటలకు జనం నవ్వుకుంటున్నారు మోదీ హయాంలో కేవలం కార్పొరేట్ మిత్రులకు మాత్రమే అచ్ఛేదిన్. సామాన్యులకు మాత్రం చచ్చేదిన్. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లతో నిరుద్యోగ యువతను ప్రోత్సహిస్తుంటే కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తూ ప్యాకప్ చెబుతోంది. అమిత్ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. అబద్ధాల బాద్షాకు వాటి గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక్కడి నేతలు తమకు తోచిన స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదివి వెళ్లిపోయాడు. కేంద్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీల గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. బీజేపీవన్నీ జూటా, బట్టేబాజ్ మాటలే.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను యాభై పెసలు పెంచితే లొల్లి చేస్తున్న బీజేపీ నేతలు.. గుజరాత్లో 5 నెలల్లో ఐదుసార్లు కరెంటు బిల్లులు పెం చితే ఏం చేస్తున్నారు? బీజేపీ నేతలు చెప్పేవన్నీ జూటా మాటలు, బట్టేబాజ్ మాటలే. నాలాయక్, జూటేబాజ్లు ఏంచేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో సరైన సమయంలోనే ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వస్తే మేము కూడా అసెంబ్లీని రద్దు చేసి బరిలో దిగుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడిగే ప్రశ్నలకు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్తో సమాధానం చెప్పిస్తాం. -
గవర్నర్లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘గవర్నర్తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్ నిలదీశారు. నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. (చదవండి: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు..) -
ప్రైమ్ వాలీబాల్ లీగ్కు మద్దతు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్ను వేదికగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లీగ్కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, బేస్లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి సోమవారం కేటీఆర్ను కలిసి ఈ లీగ్ మ్యాచ్ బాల్ను, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని ఆయనకు అందజేశారు. ఈనెల 5 నుంచి 27 వరకు ఏడు జట్ల మధ్య గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమాని శ్యామ్ గోపు, బెంగళూరు టార్పెడోస్ సహ యజమాని యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ అ‘ద్వితీయం’
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్ హైదరాబాద్.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్ల కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఐటీ హబ్ జిల్లాల్లోని ఐటీ హబ్లకు బడా కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్ ఐటీ హబ్లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కరీంనగర్ ఐటీ హబ్లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్’ రీజనల్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరంగల్లోని ఐటీ హబ్లో టెక్ మహీంద్రా కార్యాలయం నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవనం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలో ఐటీ హబ్ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్నగర్ ఐటీ హబ్లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. – కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. – భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా ప్రభుత్వ చర్యలతో ఊతం రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ హబ్లతోపాటు లాజిస్టిక్స్కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. – మనోజ్ శశిధర్, సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్, కరీంనగర్ సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఐటీ హబ్లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్ కంపెనీలో జావా ఫుల్స్టాక్ డెవలపర్గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. – మారేపల్లి కౌశిక్ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www.teamtsic.telangana,gov.in/intinta-innovator-exhibition-2021 పోర్టల్లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’
సాక్షి, హైదరాబాద్: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేటీఆర్ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి ఉన్నారు. -
కంటోన్మెంట్ రోడ్లను తెరిపించండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ అధికారులు మూసివేసిన అలహాబాద్ గేట్ రోడ్, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్లను వెంటనే తెరిపించాలని కోరుతూ రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం లేఖ రాశారు. కోవిడ్ కారణం చూపుతూ రోడ్లను మూసివేయడంతో ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు తగ్గాయని, అయినా మళ్లీ రోడ్లను మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు. రోడ్లను ఇష్టారీతిన మూసివేయకుండా మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై గతంలోనూ కేంద్రానికి లేఖలు రాసినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డును సంప్రదించకుండానే లోకల్ మిలటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ చట్టంలోని సెక్షన్–258కి ఇది విరుద్ధమని తెలిపారు. గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా రోడ్లను మూసివేయవద్దని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అంశంపై గతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, అందులో సూచనప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. -
ఆగస్టు చివరిలోగా సంస్థాగత కమిటీలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 20 నాటికి పూర్తిచేయాలని, ఆగస్టు నెలాఖరులోగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్నిరకాల సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి, కార్యకర్తలకు సంస్థాగత శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు కీలక నేతలతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, పార్టీ కార్యాలయాల ప్రారంభం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. 2021–23 సంవత్సరాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైన సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు 61 లక్షల మంది టీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించారని.. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో మరో 9 లక్షల మంది చేరొచ్చని ఈ సందర్భంగా అంచనా వేశారు. దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీలోనూ ఇంత భారీగా సభ్యత్వ నమోదు జరగలేదని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలంతా లక్ష్యం చేరుకునే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను 20వ తేదీనాటికి డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. కాగా.. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రూ.18 కోట్లు పార్టీ కార్యాలయానికి చేరాయని.. మరో రూ.24 కోట్లు ఇంకా రావాల్సి ఉందని సమావేశంలో నేతలు వివరించారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేలకు పైబడి సభ్యత్వాలు నమోదయ్యాయని, 20 నియోజకవర్గాల్లో 20 వేలలోపే సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలతో కేటీఆర్ నేరుగా మాట్లాడారు. వారం తర్వాత మరో భేటీ ఏడేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అమలవుతున్న ప్రమాద బీమా గడువు ఈ నెల 30న ముగియనుం డటంతో.. 20వ తేదీలోగా కార్యకర్తల వివరాలను డిజిటలైజ్ చేయాలని భేటీలో నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరులోగా వార్డు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. 2019లో 31 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించగా, ఇప్పటివరకు 24 జిల్లా కేంద్రాల్లో పనులు పూర్తయ్యాయని.. సూర్యాపేట, సిరిసిల్ల సహా మరో ఏడు జిల్లాల్లో 90 శాతం పనులు అయ్యాయని తెలిపారు. జిల్లా కార్యాలయాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల ప్రారంభం తర్వాత.. కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై సమీక్షించేందుకు ఈ నెల 21న మరోమారు పార్టీ కార్యనిర్వాహక సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చురుకైన కార్యకర్తలను గుర్తించి సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త పదవులు వచ్చినపుడు కొత్త భాష .. తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద కూడా లోతుగా విశ్లేషణ జరిగింది. రాజకీయ పార్టీలకు కొత్త అధ్యక్షులు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు, కొత్త భాష సహజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాటిపై టీఆర్ఎస్ కూడా తగిన కార్యాచరణతో ముందుకు పోతుందని తెలిపారు. ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తావనకు రాగా.. టీఆర్ఎస్ ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ గుర్తింపునే ఇచ్చిందని కేటీఆర్ పేర్కొ న్నట్టు తెలిసింది. ఈటల టీఆర్ఎస్లో ఉంటూ కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆలోచించాడని, అయినా చివరి నిమిషం వరకు ఆయనను పార్టీలో కొనసాగించేందుకు తాను వ్యక్తిగతంగా కూడా ప్రయత్నించానని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. కొండల్ కుటుంబానికి అండగా ఉంటాం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి గత నెల క్రితం వరకు చికిత్స పొందుతూ మరణించిన కొండల్ కుటుం బం బుధవారం తమకు సహాయం అందించాల్సిందిగా తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసింది. ఈ సందర్భంగా కొండల్ భార్యను ఓదార్చిన మంత్రి కేటీఆర్, తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
దేవుడితోనైనా కొట్లాడుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్తోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా పోరాడుతామని, పాలమూరుకు నీటినందించే విషయంలో ఎలాంటి రాజీలేదని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో శనివారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి నారాయణపేట జిల్లాకు నీరందించే కెనాల్ కోసం వచ్చే నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన వారే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కరివెన నుంచి నారాయణపేట వరకు చేపట్టే కెనాల్కు అవసరమైన భూసేకరణకు మద్దతు తెలపాలని కోరారు. నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం.. రూ.5 లక్షల బీమా వర్తింపజేసే పథకాన్ని రాష్ట్రంలోని నేత కార్మికులకు త్వరలో వర్తించేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలను ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిని పండించామని.. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, ప్రభుత్వ విప్లు కూచకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ సభ ప్రారంభానికి ముందు మంత్రి కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తర్వాత సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా పీడీఎస్ విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
ఎంఎస్ఎంఈలకు అండగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రుణాలు, ఫండింగ్ విషయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు అండగా ఉండాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల నుంచి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు రుణాల వసూళ్ల విషయంలో కొంత ఉదారతతో వ్యవహరించాలని, పరిశ్రమలు తిరిగి గాడినపడేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ‘ప్రేరణ’కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో ప్రారంభించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాయిలా పడిన ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు కృషి చేస్తున్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్తో ఇండియన్ బ్యాంక్ భాగస్వామిగా మారి సహాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘాలు రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ రేటును కలిగి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగి ఉందని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని బ్యాంక్ సీఈఓ, ఎండీ పద్మజా చుండూరును మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రారంభించిన టీ–హబ్, వీ–హబ్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా దేశవ్యాప్తంగా ‘ప్రేరణ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందులోభాగంగా అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని పద్మజా చెప్పారు. రాష్ట్రంలో తమ బ్యాంకు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాన్ని పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందు లో భాగంగా కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వ్యవసా య అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ద్వారా రాష్ట్రంలో సాగు ఉత్పత్తులు భారీగా పెరిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన పంట వరితోపాటు ఆయిల్పామ్ వంటి నూతన పంటల భవిష్యత్ ప్రాసెసింగ్ అవసరాలను కూడా ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామ న్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తోపాటు పరిశ్రమలు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే ఆర్థిక పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా సాగు ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో పాటు దీర్ఘకాలంలో లాభసాటి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు. పెరిగిన వరి ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సుమారు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎఫ్సీఐకి అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా కొత్త పాలసీ రూపొందించాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో.. తొలి విడతలో హైదరాబాద్ మినహా పూర్వ ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో కనీసం 225 ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్ ఫుడ్ ప్రాసిసెంగ్ జోన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోంది. ఈ జోన్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు తదితర మౌలిక వసతులన్నీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మిరప, పసుపు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జోన్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 350 దరఖాస్తులు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబం ధించి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే 350 దరఖాస్తులు అందగా, మరిన్ని కం పెనీలను భాగస్వాములను చేసేందుకు గడువు పెంచాలని కేటీఆర్ ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. హరిత విప్లవంతోపాటు మాంసం, పాలు, మత్య్స రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సం సిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. -
కేటీఆర్కు ఉక్కు పోరాట కమిటీ ఆహ్వానం
ఉక్కు నగరం (గాజువాక): తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్)ను విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్ గంధం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. స్టీల్ప్లాంట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, చేస్తున్న ఉద్యమం గురించి ఆయనకు వివరించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కోరారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తాను విశాఖ వస్తానని చెప్పారన్నారు. -
వెయ్యి కోట్లతో ‘మాస్’... జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ నగరంలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా ఈ పెట్టుబడులను మాస్ మ్యూచువల్ సంస్థ పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో మాస్ మ్యూచువల్ ఇండియా అధిపతి రవి తంగిరాల, సంస్థ కోర్ టెక్నాలజీ విభాగాధిపతి ఆర్థర్ రీల్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్లతో మాట్లాడారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ కోసం మాస్ మ్యూచువల్ సంస్థ ఇప్పటికే నియామకాలను చేపట్టిందని, 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించనుందన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకున్నాయని, ఈ రోజు 170 సంవత్సరాల చరిత్ర కలిగి, ‘ఫార్చూన్ 500’కంపెనీల్లో ఒకటిగా ఉన్న మాస్ మ్యూచువల్ అమెరికా వెలుపల తమ మొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మరోసారి రుజువైందన్నారు. రానున్న కాలంలో నగరంలో కంపెనీ పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో ప్రపంచస్థాయి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో రవి తంగిరాల చూపిన చొరవను కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ ది బెస్ట్: రవి తంగిరాల మాస్ మ్యూచువల్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని, హైదరాబాద్లో చక్కటి నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ సానుకూల విధానాలకు ఆకర్షితులై ఈ నగరాన్ని ఎంపిక చేశామని మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల పేర్కొన్నారు. 1851లో ఏర్పాటైన తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక, ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా తమ లక్ష్యాలు, అవసరాలను ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్ సహకారంతో అందిపుచ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజనీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున తమ కంపెనీ నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలోని నిపుణులైన ఉద్యోగుల ద్వారా తమ ఇన్నోవేషన్ లక్ష్యాలను కచి్చతంగా అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆర్థర్ రీల్ వ్యక్తం చేశారు. జీసీసీలు ఏం చేస్తాయి? గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి. బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి. అలాగే ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇ్రన్ఫాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. ఈ ఏకీకృత సేవల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయి. కొన్ని పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఈ జీసీసీలను నూతన అవిష్కరణల కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటాయి. ఈ సామర్థ్య కేంద్రాల మూలంగా మాతృసంస్థలకు మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో నిర్వహణ వ్యయంలో సగటున దాదాపు 45 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా. -
ఐటీకి తెలంగాణ బంగారు గని
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ రాష్ట్రం బంగారు గనిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు గణనీయంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), క్రెడిట్ రిపోర్టింగ్ బహుళ జాతి సంస్థ ఈక్విఫాక్స్ శుక్రవారం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రెండు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఉపాధి కల్పన ప్రక్రియ మెరుగ్గా, మరింత పారదర్శకంగా జరుగుతుంది. ఉద్యోగ కల్పన రంగంలో ఈ ఒప్పందం మైలురాయి వంటిది. సమర్థత కలిగిన ఉద్యోగులను సంస్థలు నియమించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది’అని వ్యాఖ్యానించారు. డీట్ వేదిక ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగార్థులు తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను వెతుక్కోవచ్చని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నియామక సంస్థలకు కూడా తమకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఉపాధి కల్పన రంగంలో ఈ తరహా వేదిక దేశంలోనే మొదటిదని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో ఈక్విఫాక్స్ ఇండియా ఎండీ కేఎం నానయ్య, వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ ప్రతినిధి నిపా మోదీ, వర్క్రూట్ సీఈఓ మణికాంత్ చల్లా పాల్గొన్నారు. డీట్తో సత్వర ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వర్క్రూట్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ను రూపొందించింది. ఉద్యోగాల కోసం అన్వేషించే వారు, ఉద్యోగాలిచ్చే వారు డీట్ వేదికగా సంప్రదింపులు జరుపుకునేలా యాప్ను సిద్ధం చేశారు. ఇలా ఎంపికైన ఉద్యోగుల వివరాలను వెరిఫై చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 10 రోజుల సమయం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈక్విఫాక్స్తో డీట్ భాగస్వామ్యం ద్వారా ఇంటర్వ్యూలో ఎంపికైన ఉద్యోగుల వివరాలను తక్షణమే తెలుసుకునే అవకాశముంటుంది. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన వాతావరణానికి డీట్, ఈక్విఫాక్స్ భాగస్వామ్యం కొత్త రూపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
నల్ల చట్టాలు పోవాల్సిందే..
షాద్నగర్ టౌన్, రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కర్షకులు తమ కడుపులు మాడ్చుకొని.. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో వారం రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కితీసుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నల బాగు కోసం.. వారికి అండగా నిలవాలనే సంకల్పంతో భారత్ బంద్ విజయ వంతానికి సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారని చెప్పారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మంగళ వారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల పరిధిలోని బూర్గుల గేట్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఈ చట్టాల పర్యవసానాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా టీఆర్ఎస్ తర ఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపడతామన్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్రం వ్యవసాయ చట్టా లను చేయ డం సరికాదన్నారు. కేంద్రం బ్లాక్ మెయిలింగ్ రాజకీయా లకు పాల్పడుతోందని, వీటిని మానుకొని రైతుల సంక్షేమానికి పాటు పడాలని కేటీఆర్ హితవు పలికారు. సన్నాల మద్దతు ధరకు కేంద్రమే అడ్డు సన్నధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అడ్డుతగులుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలు మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లను నిలిపివేస్తామని కేంద్రం నియంత్రణలో పనిచేసే ఎఫ్సీఐ స్పష్టంగా చెబుతోందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది రైతుల్లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని... వారికి కార్పొరేట్ శక్తులతో కొట్లాడే బలం లేదన్నారు. మార్కెట్ కమిటీలు రద్దు చేస్తామని కేంద్రం చెప్పడం సరికాదన్నా రు. రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోందని.. చిన్న, సన్నకారు రైతులు తమ పంటలను మరోచోటికి తరలించి అమ్ముకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘భారత్ బంద్’లో మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్కు మద్దతుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు.. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న భారత్ బంద్కు సంఘీభావంగా పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూరు, ఎర్రబెల్లి దయాకర్రావు మడికొండ, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. బంద్కు బందోబస్తు.. కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పలు రైతు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు కూడా బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుకోవాలని సూచించారు. బంద్ అనుకూల, వ్యతిరేక నేతలపై ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. వీలును బట్టి హౌస్ అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
ఆ మాటలను మీడియా ఆపాదించింది
సాక్షి, హైదరాబాద్: ‘నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్ రెండోవారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది’అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ట్వీట్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో బల్దియా ఎన్నికలపై కేటీఆర్ సంకేతాలిచ్చినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
జీరో అవర్లో హీరోగిరి చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి వేగం ఊపందుకుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత కార్యక్రమాలన్నీ మా ప్రభుత్వం చేసింది. ఆ కృషిని ప్రజలు గుర్తించి అధికారాన్ని కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాం. ఇదంతా గమనించాలి. వాస్తవాలను గుర్తించాలి. జీరో అవర్లో అవకాశం దొరికిందని హీరోగిరి చేస్తే కుదరదు’అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వసతులు కల్పించాలని కోరారు. మంత్రి కేటీఆర్ కలగజేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ‘పట్టణ ప్రగతి కింద రూ.138 కోట్లు విడుదల చేశాం. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం. ఆరేళ్లుగా మేము పనిచేయకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయి? అన్ని మున్సిపాలిటీల్లో మా పార్టీ ఎలా అధికారం కైవసం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. -
టెక్నాలజీతోనే వినూత్న మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి నూతన సాంకేతికత సామాన్యుడి జీవితంలో మార్పులు తెచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆహారభద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, పాలన, శాంతిభద్రతలు వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ)ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే వీలుందన్నారు. ‘ఎక్స్పీరియెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరిట నాస్కామ్ బుధవారం నిర్వహించిన వర్చువల్ ఇష్టాగోష్టిలో ‘ఐటీ పరిశ్రమలో ఏఐ పాత్ర – భారత్ చేపట్టాల్సిన చర్యలు’అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఏఐ ఉపయోగాలు, తెలంగాణ ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకుంటు న్న తీరును వివరిస్తూ 2020ని తమ ప్రభు త్వం ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక, ఇంటెల్, ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ఏఐ రంగంలో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఓపెన్ డేటా పాలసీ ద్వారా సమాచారం ఏఐ టెక్నాలజీ వినియోగంలో పెద్ద ఎత్తున సమాచారం(డేటా) అవసరమని, డేటా వినియోగంలో ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోందని కేటీ ఆర్ వెల్లడించారు. ‘డేటా వినియోగం’, ‘వ్యక్తిగత గోప్యత’వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో డేటా వినియోగంపై లోతైన చర్చ జరగాలన్నారు. ఓపెన్ డేటా పాలసీలో భాగంగా వివిధ శాఖల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల నడుమ భాగస్వామ్యం ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలోనూ.. వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా లాభం పొందేందుకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్’అనే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాగా, ఏఐ రంగంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని నాస్కామ్ ఇండియా ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ హామీ ఇచ్చారు. ఏఐపై నాస్కామ్ రూపొందించిన ‘సర్వే ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్’నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. -
ఆవిష్కరణలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి సంస్థలు ఏర్పాటైనట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్’ద్వారా గ్రామీణ యువతకు, విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అండగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ కల్చర్ను అలవాటు చేయాలని, ఈ దిశగా విద్యా శాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. టీ హబ్ ద్వారా సాంకేతిక ఆవిష్కరణలతో పాటు గ్రామీణ, సామాజిక ఆవిష్కరణల పైనా దృష్టి సారించాలన్నారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థల ద్వారా సహకారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో రవి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. టీ హబ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యకలాపాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
85 వేల ‘డబుల్’ ఇళ్లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందులో 85 వేల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసీ హౌసింగ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రూ.9,700 కోట్లతో డబుల్ ఇళ్లు.. దేశంలోని ఏ ఇతర మెట్రో నగరంలో లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9,700 కోట్ల వ్యయంతో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు చాలా చోట్ల ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన చోట అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 10 వేల ఇళ్లు జేఎన్యూఆర్ఎం, వాంబే పథకం కింద నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ దాని పరిసర జిల్లాల్లోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని ప్రజల (ఇన్స్ట్యూ) జాబితా రూపొందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిసర జిల్లాల్లోని ప్రజల కోసం 10 శాతం ఇళ్లు కేటాయించినందున లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. విండ్ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
పూర్తి నివేదికతో రమ్మన్నారు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును ‘ఉడాన్’ పథకంలో చేర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.2537.81 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రితో సోమవారం భేటీ అయిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. (మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!) ఈ సందర్భంగా.. కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టంలోని అంశాలను హర్దీప్సింగ్ పూరికి వివరించినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఆయన.. అక్టోబర్లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్వచ్ఛ భారత్, అమృత్ పథకం నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.784 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. -
ప్రపంచం చూపు మన వైపు
సాక్షి, హైదరాబాద్: ‘టీకా’తాత్పర్యం తెలంగాణ చెప్పగలదని మన దేశమే కాదు, ప్రపంచదేశాలూ భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేస్తోంది. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. వ్యాక్సి న్ల తయారీలో ప్రపంచానికి తెలంగాణ రాజ ధాని కావడంతో కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద’ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరోనా సమస్య పరిష్కారానికి యావత్ ప్రపంచం మరోసారి భారతదేశం వైపు చూస్తోందన్నా రు. కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సి న్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం కరోనా వ్యా క్సిన్ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశా రు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతిని తెలుసుకోవడానికి కేటీఆర్ మంగళవారం ఇక్కడి జినోమ్ వ్యాలీని సందర్శించి భా రత్ బయోటెక్, ‘బయోలాజికల్ ఇ’ సంస్థల నాయకత్వ బృందాన్ని కలుసుకున్నారు. టీకా అభివృద్ధిలో ఈ కంపెనీలు ఎదుర్కొం టున్న సవాళ్లను తెలుసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి మంత్రి కేటీఆర్ ఈ పర్యటన జరిపారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ కీలకం ‘వ్యాక్సిన్ రేస్: బ్యాలెన్సింగ్ సైన్స్ అండ్ అర్జెన్సీ’అనే అంశంపై జినోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ చర్చ నిర్వహించడంతోపాటు సం ధానకర్తగా వ్యవహరించారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలకంగా ఉద్భవించిందని, టీకా పరిశ్రమ అతిపెద్ద ఆశాకిరణంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్త పం పిణీ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిలో భారత వ్యాక్సిన్ రంగం కీలక పాత్ర పోషి స్తుందని పదేపదే చెప్పుకుంటున్నారన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ చిత్రపటంలో హైదరాబా ద్కు మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో టీకాల పరిశ్రమల అభివృద్ధి, కొత్త ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ దూరదృష్టితో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్లా ప్రశంసించారు. వ్యాక్సిన్లకు అనుమతిచ్చే ప్ర క్రియను వికేంద్రీకరించాలని, రాష్ట్రాల్లో వీటి కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని బయోలాజికల్ ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల కొనియాడారు. ప్రపం చంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు చేరాలనేది తమ కంపెనీ అభిమతమని చెప్పారు. విస్తృ త స్థాయిలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష లు నిర్వహించి వైద్యసదుపాయం కల్పించడానికి ప్రభుత్వం సమగ్ర ప్యాకేజీని తీసుకురావాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అ న్నారు. దేశంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేపనిలో ఉన్న సంస్థలన్నీ ఒకేతాటిపైకి రావాలని, డాక్టర్ ఆనంద్కుమార్ సూచించారు. -
హ్యాపీ బర్త్డే తారక్.. ధన్యవాదాలు అన్నా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’’అని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘ధన్యవాదాలు అన్నా’’ అని బదులిచ్చారు.(కేటీఆర్కు శుభాకాంక్షలు వెల్లువ) Many thanks Anna 🙏 https://t.co/Zm5sXBYa8n — KTR (@KTRTRS) July 24, 2020 అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా ట్విటర్ వేదికగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్ఫూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలి అని ఆకాంక్షించారు. కాగా శుక్రవారం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి, కేటీఆర్ బావ హరీష్ రావు, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు కేటీఆర్ను విష్ చేశారు. Birthday Greetings to @KTRTRS Garu who has been an inspiration to youth in public life. May you be blessed with good health and happiness.🎂#KTR pic.twitter.com/n8j5f5SC9T — Rajini Vidadala (@VidadalaRajini) July 24, 2020 -
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు: కేటీఆర్
సాక్షి, మహబూబ్నగర్: వెనకబడిన పాలమూరు జిల్లాను తెలంగాణ అగ్రగామి జిల్లాగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మహబూబ్నగర్లో సోమవారం పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా జిల్లాలో ఎక్స్పో ప్లాజాను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి బాటలో నిలుపుతామన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని నిరాటంకంగా చేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరంధిస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని లేదని మంత్రి పేర్కొన్నారు. చదవండి: మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్ -
కరోనాపై పైశాచికానందం
కరీంనగర్ రూరల్: కరోనాపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వంపై బురద చల్లడం కేవలం పైశాచికానందం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. బుధవారం కరీంనగర్ శివారు నగునూరులో ప్రతిమ సంచార వైద్యశాలను మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో కరోనా టెస్టులు, చేయడం లేదు.. డేటా దాస్తున్నారు.. కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందింది’అని విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, అదే నిజమైతే మరణాలు సంఖ్య ఎలా దాచగలమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాతో 98 శాతం రోగులు కోలుకుంటున్నారని, దేశవ్యాప్తంగా 3 శాతం మరణాల రేటుంటే.. తెలంగాణలో 2 శాతం మాత్రమే ఉందని, ఇది ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ కట్టడి చర్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు లాక్డౌన్ విధించి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ, ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. అందరికి జీవితం.. జీవనోపాధి ముఖ్యమని, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కరోనాతో రాజకీయాలు చేయడం ఇది సరైన సమయం కాదని, ఇంకా నాలుగేళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను అనడం లేదని, వాటిని సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే, అందరూ బాధ్యతగా మెలగాలని కేటీఆర్ కోరారు. ఆరోగ్య రంగంలో మంచి అవకాశాలు ఆరోగ్య రంగంలో మన దేశానికి మంచి అవకాశాలు రాబోతున్నాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మారంగంపై మన రాష్ట్రం నుంచి పనిచేస్తున్న నాలుగు కంపెనీలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 22 వైద్య కళాశాలలు..15 వేలకు పైగా పడకలు: ఈటల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా టెస్టులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై మొదట స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్లో కంటైన్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యసేవలపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. 22 వైద్య కళాశాలల్లో కలిపి 15 వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని ఈటల వెల్లడించారు. సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లే.. ఒక కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్ ఇచ్చానని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ పద్మారావు మాస్క్ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదన్నా.. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారని, చివరకు ఆయనకే కరోనా సోకిందన్నారు. జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసమని పేర్కొన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ వైద్యుల్లా సలహాలు ఇస్తున్నారని చలోక్తులు విసిరారు. -
ఇంటింటికీ ఇంటర్నెట్
సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీ–ఫైబర్ పనులు సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరి తహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యాయమైన వాటా వాడుకుంటున్నాం కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశానికి రైతులే వెన్నెముక అని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని, పెట్టుబడి సాయం గా ఇంతటి కరోనా కష్టకాలంలో 57 లక్షల మంది రైతులకు రూ. 7,200 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు బీమా కల్పించి ధీమా ఇస్తున్నామని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న, దక్షత ఉన్న, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల లాభం కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదన్నారు. అక్కరకొచ్చే పంటలు వేస్తే లాభదాయకం అవుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారని, పంటల సాగులో మార్పు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 30 రెవెన్యూ డివిజన్లను 73 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. 439 మండలాలు ఉండగా అదనంగా 131 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3,400 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇకపై అభివృద్ధిపైనే దృష్టి వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో వీర్నపల్లి మం డలం రాశిగుట్టతండా, మద్దిమల్ల, సోమారం పేట, వన్పల్లి, శాంతినగర్ వద్ద నిర్మించిన ఐదు వంతెనలను మంత్రి ప్రారంభించారు. కంచర్లలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గర్జనపల్లిలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
నిర్మాణ సామగ్రి పరిశ్రమలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో నిర్మాణ రంగ యంత్ర సామగ్రి తయారీదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లోనూ నిర్మాణరంగ యంత్రపరికరాల తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వీటి తయారీదారులు ఏటా నిర్వహించే ‘ఎక్స్కాన్’వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తే ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు. హైస్పీడ్ నెట్వర్క్, నూతన ఎయిర్పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి మౌలిక వసతుల ద్వారానే భారత్ అగ్ర దేశాల సరసన చేరుతుందన్నారు. దీనిలో కీలక పాత్ర పోషించే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కరోనా సంక్షోభంలోనూ వలస కార్మికులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది. సిమెంటు ధరల తగ్గింపు దిశగా చర్యలు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం గత ఆరేళ్లుగా అభివృద్ధిపథాన కొనసాగుతోందని, కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు మార్గనిర్దేశంపై చర్చించేందుకు శనివారం ప్రగతిభవన్లో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సిమెంట్ ధరల పెరుగుదలపట్ల నిర్మాణరంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయగా, ధరల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. దేశంలోని ఇతర మెట్రోనగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్లో పర్వాలేదని నిర్మాణ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి వారిచ్చిన సూచనల పట్ల మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రస్తుతంæ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలని, సంక్షోభ సమయాల్లో వారికి తొందరగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తామని నిర్మాణ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్ ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వివిధ వస్తువుల పుట్టుపూర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్–జీఐ) గుర్తులు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువుల కు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా విడుదలైన ‘ఈ బుక్’ద్వారా రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సా«ధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ‘ఈ బుక్’ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాం డ్ సాధించి పేరు గడించాలని కేటీఆర్ సూచిం చారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
10 నెలల్లో ‘టీ–ఫైబర్’ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టును వచ్చే 10 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన టీ–ఫైబర్ నెట్వర్క్ను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే ‘రైట్ టు వే’చట్టాన్ని వినియోగించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కరోనాపై యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయన్నారు. ఆన్లైన్ విద్య, వైద్యం, ఈ–కామర్స్ సేవలకు ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ కలిగి ఉండటం అత్యవసరమని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకుని ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ, అనుబంధ రంగాల్లో ఈ ట్రెండ్ భవిష్యత్తులో సైతం కొనసాగే అవకాశముందన్నారు. ఈ అవసరాలను తీర్చడానికి ఎలాంటి లోపాలు లేని పటిష్టమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవసరమని, టీ–ఫైబర్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని వెల్లడించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (ఏ2ఏ), ప్రభుత్వం నుంచి పౌరులకు (ఏ2ఈ) అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ విద్య/వైద్యం/వ్యవసాయ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుందని, దీం తో డిజిటల్ కంటెంట్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రైతు వేదికల అనుసంధానం కొత్తగా నిర్మించనున్న రైతు వేదికలన్నింటిని టీ–ఫైబర్తో అనుసంధానం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాల్లోని రైతు వేదికల నుంచి రైతులు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రి, వ్యవసాయ అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, దిగుబడుల పెంపకం వంటి విషయాల్లో గణనీయమైన లబ్ధి పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న డిజిటల్ నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్లను టీ–ఫైబర్ పరిధిలోకి తేవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
రైతులు సంఘటితం కావాలి
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్లో బుధవారం గోదావరి జలాలతో నిండిన ఊర చెరువు వద్ద జలహారతి పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని చెప్పారు. రాష్ట్రంలో జల విప్లవంతో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం వస్తుందన్నారు. ఐదు విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, సారవంతమైన భూములతో దేశానికి ఆదర్శంగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపుతామని, దీంతో కరెంటు అవసరం లేకుండా రెండు పంటలు పండుతాయని తెలిపారు. ఇంటింటికీ పాడి గేదెలను అందించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగింది ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడాదిలోనే ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే యువ ఐఏఎస్లకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలో సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ పాఠ్యాంశమైందని, ఇది గర్వకారణమన్నారు. సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందన్నారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు రావడం ఒక అద్భుతమని, అది కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమైందన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తుకు తరలించి రైతుల సాగు నీటి కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు. కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తే ఓర్వలేరని, ఏది చేసినా వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరికీ రైతు బంధు ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీ జల దీక్ష చేస్తామని ప్రకటించిందని, కుందేళ్లను చంపి న నక్కలే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెరువులు నిండుతుంటే, పంటలు పండుతుంటే కాం గ్రెసోళ్ల కళ్లు మండుతున్నాయని ఆరోపించారు. ఎగువ మానేరును దసరా నాటికి నింపుతామని, మధ్యమానేరుతో పాటు మల్లన్నసాగర్ నుంచి కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరులోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు. -
వంతెన కింద వంతెన
సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను మునిసిపల్ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్తో బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి దీని వల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. దీని వ్యయం రూ.30.26 కోట్లు. (భయం భయంగా ఆసుపత్రులకు) ఎస్సార్డీపీ ప్యాకేజీ–4 పూర్తి: ఈ ఫ్లైఓవర్ పూర్తితో ఎస్సార్డీపీలో ప్యాకేజీ–4 కింద మొత్తం రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మైండ్స్పేస్ అండర్పాస్, మైండ్స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్పాస్, రాజీవ్గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాయి. దీంతో బయోడైవర్సిటీ జంక్షన్ (ఓల్డ్ ముంబై హైవే) నుంచి జేఎన్టీయూ(ఎన్హెచ్–65) మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గినట్టేనని, మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్ పనులు పూర్తయ్యాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. -
స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పరిశ్రమలను చైనా నుంచి భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా దేశంలో పెద్దెత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా నేపథ్యంలో జపాన్ లాంటి దేశాలు తమ కంపెనీలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సూచించారు. స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయండి... కరోనా కట్టడి, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల నిర్వహణకు సంబంధించి పలు దేశాలు పారిశ్రామికవేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూప్లను (వ్యూహ బృందాలు) ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలోనూ ఐటీ పరిశ్రమకు సంబంధించి స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నందున, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగినందున బ్రాడ్ బ్యాండ్, నెట్వర్క్ల బలోపేతానికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. మరో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరో రెండింటిని మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నం అవుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో ఐటీ ఆధారిత అవకాశాలు లేదా అయా రంగాల సమ్మిళితం ద్వారా వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కామర్స్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున జీఎస్టీ, ఆదాయ పన్ను తదితరాల్లో మినహాయింపులు ఇవ్వాలన్నారు. అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు భారతీయ ఐటీ, అనుబంధ రంగాలపై ప్రభావం చూపే పక్షంలో, అందులోని మానవ వనరులను ఇతర రంగాలకు తరలించేలా ప్రణాళికలు అవసరమని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రత్యేక పోర్టల్ కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆదర్శవంతమైన పద్ధతులు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మిగిలినవారు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేక పోర్టల్ను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కామర్స్ రంగానికి చేయూతను అందిస్తామన్నారు. -
రంగనాయక సాగర్లోకి గోదారి జలాలు
-
కరువు నేల.. మురిసే వేళ
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. నేడు రంగనాయక సాగర్లోకి గోదావరి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కు.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్ రిజర్వాయర్కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్ వరకు చేరుతాయి. రంగనాయకసాగర్ పంప్హౌస్ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్రావు ‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలం కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. – హరీశ్రావు, ఆర్థిక శాఖ మంత్రి -
మీ సేవలకు వెలకట్టలేని అభినందన..
-
కరోనాపై యుద్ధంలో తొలి సిపాయిలు మీరే!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏమ్మా.. నీ పేరేంటి?.. ‘‘పిల్లలెంత మంది?.. ఏం చదువుతున్నారు?’’ ‘‘మీకేమైనా సమస్యలున్నాయా..?’’ ఇలా పేరుపేరునా మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల యోగక్షేమాలను ఆరా తీశారు. సంజీవయ్య పార్కు ఎదుట ఉన్న జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఆయన జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. లాక్డౌన్ సమయంలో మీరంతా డాక్టర్లు, పోలీసులకు ధీటుగా పనిచేస్తున్నారని వారిని మంత్రి అభినందించారు. కరోనాపై యుద్ధంలో మీరే తొలి సిపాయిలని, మీరంతా కష్టపడుతున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా ఇప్పుడు మిమ్మల్ని, మీ సేవల్ని గుర్తిస్తున్నారని కితాబునిచ్చారు. కొందరికి తానే వడ్డించారు. వారి కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిని, వారేం చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ వెంటే మేమున్నామంటూ ధైర్యమిచ్చారు. ‘పనికి వెళ్లొద్దంటూ మీ ఇంట్లో వాళ్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయా?, కరోనా వల్ల మీకేమైనా భయంగా ఉందా?’అంటూ వారితో ముచ్చటించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుంది.. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టుపక్కల వారికి వివరించాలని కోరారు. వర్షాకాలం రానున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగానికి సూచించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, అదనపు కమిషనర్ (శానిటేషన్) రాహుల్రాజ్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్కరినీ తొలగించొద్దు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. పరిశ్రమలు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని,∙విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి సోమ వారం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి అన్నిజిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు విషయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు. వారి బాధ్యత మనమీదే... శాశ్వత ఉద్యోగులతో పాటు వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవీయకోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీల వద్దే ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డులేని వారికి బియ్యం, నగదు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వలస కార్మికులు రోడ్డు మీదకు వస్తే ఇప్పటి వరకు అమలు చేసిన లాక్డౌన్ వృథా అవుతుందని, అందుకే ఎక్కడి కార్మికులను అక్కడే ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లలోనే రంజాన్ పవిత్ర రంజాన్ నెల ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకుంటూ కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిం చనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్ కోసం వచ్చిన మంత్రి కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలను ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషాల బృందం స్వచ్ఛందంగా కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించడానికి తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. -
అంతా బాగుంటాంరా
కరోనా వైరస్పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బంది కృషిని అభినందిస్తూ మంచు మనోజ్ ఓ పాటను విడుదల చేశారు. ‘‘అంతా బాగుంటాంరా ...’’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, అచ్చు కంపోజ్ చేశారు. తన మేనకోడలు విద్యా నిర్వాణతో (మంచు లక్ష్మి కుమార్తె) కలసి ఈ పాటను పాడారు మంచు మనోజ్. ఆదివారం ఈ పాటను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఈ పాట కొందరి మనస్సులో అయినా ఆశను, స్ఫూర్తిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మనోజ్. -
ఉద్యోగులను తొలగించొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా సవాల్ను సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ సంభాషించారు. మరోవైపు పారిశ్రామిక వర్గాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. లే ఆఫ్లు లేకుండా ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అవసరమైతే కంపెనీలు ఇతర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. నమ్మకం, భరోసా ద్వారానే లాక్డౌన్ తర్వాత కూడా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అన్నిరంగాల మద్దతు కోరుతున్నాం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్ సీఐఐ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సంక్షోభంలో పారిశ్రామిక రంగానికి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో హెల్త్కేర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఐఐ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి సహకారం అందించాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటాం లాక్డౌన్ తర్వాత ఆర్థిక అభివృద్ధి తిరిగి గాడిన పడుతుందనే విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించినా భౌతిక దూరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వైద్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పనకు కంపెనీలు తమ సీఎస్సార్ ని«ధులు వెచ్చించాలని కేటీఆర్ కోరారు. -
ఆ మందులు ఎవరెవరు కొన్నారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం మరింత ప్రమాదమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి నివారణకు ఇటీవల కాలంలో మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల్లోని ఫార్మసీ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సమాచారాన్ని సేకరించాలన్నారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్తో కలసి మంత్రి కేటీఆర్ శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లను కేటీఆర్ ఆదేశించారు. ఉల్లంఘిస్తే కేసులే.. కరోనా వైరస్ను అరికట్టేందుకు కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తే, జీహెచ్ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీల్లో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయించాలన్నారు. వీలైతే వలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరాదన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని కుటుంబాల మొబైల్ నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు మంత్రి ఉదహరించారు. వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారున్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
పాప ఏడుస్తోంది.. పాలు కావాలి
వెంగళరావునగర్: తల్లిలేని 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్రమంత్రి కేటీఆర్కు ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి స్పందించి డిప్యూటీ మేయర్ ద్వారా సాయం అందించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్లో లకాన్సింగ్, జ్యోతిలు దినసరి కూలీలు . వారికి 5 నెలల పాప ఉంది. అనారోగ్య కారణాలతో నెలరోజుల కిందట పాప తల్లి జ్యోతి మృతి చెందింది. దాంతో తండ్రి లకాన్సింగ్ పాపకు తానే ప్యాకెట్ పాలు పట్టిస్తూ ఉన్నాడు. లాక్డౌన్ కారణాల వల్ల ఆ పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్ తీసుకురాలేకపోయాడు. పాలులేక ఆ రాత్రి పాప ఏడుస్తుంటే ఈ విషయాన్ని వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్ అనే యువకుడు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడు స్పందిస్తూ సమీపంలో బోరబండ వద్ద నివసిస్తున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కు తెలియజేసి పాపకు పాలను చేరేలా చూడాలని కోరారు. కేటీఆర్ సూచన మేరకు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమ యంలో డిప్యూటీ మేయర్ బాబా హుటాహుటిన ఎర్రగడ్డకు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యా వసర సరుకులు అందించారు. తమ కుటుంబానికి సాయం అందించడంతో పాటుగా పాపకు పాలు సకాలంలో అందించిన కేటీఆర్కు, డిప్యూటీ మేయర్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విషయం తెలుసుకుని మంత్రి కేటీఆర్ డిప్యూటీ మేయర్ను అభినందించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను 99 చోట్ల పార్టీ అభ్యర్థు లు కార్పొరేటర్లుగా విజయం సాధించడంతో పా టు సొంత బలంతో జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ పాలక మం డలి పదవీ కాలం ఏడాది లోపు ముగియనుండటంతో, మరోమారు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లోనూ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహా న్ని రూపొందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లోగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన కీలక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి హోదా లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాల్లో అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరోమారు పార్టీ వ్యూహం అమ ల్లో కీలక పాత్ర పోషించేలా వ్యూహ రచన చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో వరుసగా రెం డో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో నూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గతేడాది ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్ర త్యర్థి పార్టీలపై స్వల్ప ఆధిక్యత చూపిన టీఆర్ఎస్, స్థానిక సంస్థలు, మున్సిపల్, సహకార ఎన్నికల్లో మాత్రం విజయాలను నమోదు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించేం దుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. డివిజన్ల వారీగా నివేదికలు.. గత ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తాగునీరు తదితర పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ గడువు నిర్దేశించారు. 2020–21 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో పాటు, ఐదేళ్ల పాటు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఓవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిపైనా కేటీఆర్ దృష్టి సారించారు. మున్సిపల్ ఎన్నికల తరహాలో జీహెచ్ఎంసీ డివిజన్ల పరిధిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమవుతారు. డివిజన్ల వారీగా ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, పార్టీ యంత్రాంగం తదితరాలపై పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తారు. నివేదికలు అందిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పనితీరును మదింపు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా కేటీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
త్వరలో వరంగల్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం వెల్లడించారు.అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్ తేనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్లోని జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా అడక్కల్ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎయిర్పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్గా నియమించాం. వరంగల్ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది.మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్’లో భాగంగా వరంగల్ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్లో తొలి అటానమస్ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్ ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. -
మార్పునకు ముందడుగు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి విజయవంతమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. పట్టణాల్లో గుణాత్మక మార్పునకు తొలి అడుగుగా భావిస్తున్నామని, మార్పుదిశగా ఒక ముందడుగు పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అది ముగిసిన అనంతరం పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శుక్రవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమై పట్టణ ప్రగతి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. -
‘లంచం అడిగితే తాట తీస్తాం..’
సాక్షి, జనగామ: ‘లంచాలను అరికట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు.. 600 గజాల లోపు ఇల్లు కట్టుకునే వారు ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్తే అనుమతి పత్రాలు 21 రోజుల్లో మీ ఇంటికే వస్తాయి. ఎవరినీ అడగక్కరలేదు. ఎవరైనా లంచం అడిగితే తాట తీస్తాం’అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం జనగామ మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘పట్టణ ప్రగతి’సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çపట్టణాల్లోని నిరుపేదలకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని, ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేది’కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా పట్టణాల్లో నాటిన మొక్కల్లో 85% బతక్కపోతే కౌన్సిలర్, చైర్మన్ పోస్టులు ఊడుతాయని ఆయన హెచ్చరించారు. ఊరూ రా, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లు, కాలనీల్లో మొక్కలు పెంచాలని కోరారు. పుట్టినప్పటి నుంచి కాటికిపోయే వరకు.. పుట్టినప్పటి నుంచి కాటికి పోయే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లను రెట్టింపు, ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, హాస్టళ్లల్లో చదువుకునే పిల్లలకు సన్న బియ్యం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు. ప్రజల మధ్యలో ఉండాలనే కేసీఆర్ మమ్మల్ని జనంలోకి పంపిస్తున్నారని, దళిత కాలనీల్లో పర్యటించాలని చెప్పారన్నారు. పేదల కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు సహకరించాలి తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరా రు. తడి చెత్తను కరెంటు ఉత్పత్తి కోసం, పొడి చెత్తతో ఎరువు తయారు చేసి రైతులకు వినియోగిస్తామన్నారు. సిరిసిల్లలో పొడి చెత్తతో మెప్మా మహిళలు నెలకు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నారు.. చూడటానికి బస్సు తీసుకొని సిరిసిల్లకు రావాలని కోరారు. కేసీఆర్కు మొక్కలంటే మహా ఇష్టమని, జనగామ పక్కనే ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో 1985–86 ప్రాంతంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ ఆ కాలంలోనే హరిత సిద్ధిపేట కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ కె.నిఖిలతో కలసి జనగామ మున్సి పాలిటీల్లోని 13, 30 వార్డుల్లోని అంబేడ్కర్ కాలనీల్లో గడపగడపకు వెళ్లారు. నమస్తే అమ్మా.. నీ పేరేంటి తల్లీ.. పింఛన్ వస్తుందా.. అంటూ వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. -
వైద్య పరికరాల దిగుమతులకు చెక్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. 17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు అవార్డులు... బయో ఆసియాలో భాగంగా స్టార్టప్ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోకనాథన్ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్ హెల్త్ కేర్’, డాక్టర్ల అపాయింట్మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్’కు ఈ అవార్డులు లభించాయి. -
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో వాస్ (వసంత్) నరసింహన్ స్పష్టం చేశారు. దేశంలోని మేధో సంపత్తిని దృష్టిలో ఉంచుకున్నా, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో మన శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్నా భారత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసేం దుకు ఇది మంచి తరుణమని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్ర పరిశ్రమల రంగంలో విశేష కృషి జరిపేందుకు బయో ఆసియా ఏటా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును వాస్ నరసింహన్ మంగళవారం అందుకున్నారు. మంత్రి కె.తారక రామారావు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై వాస్ ప్రసంగించారు. మందులనేవి వచ్చి కేవలం రెండు మూడు వందల ఏళ్లు మాత్రమే అయిందని మందులతో చేసే వైద్యం కూడా ఇప్పుడు మారి పోయి.. కణ ఆధారిత, జన్యు ఆధారిత వైద్యంగా పరిణమిస్తోందన్నారు. కేన్సర్తోపాటు గుండె జబ్బులకు, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా కణ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బయోమ్.. నోవార్టిస్కు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కేంద్రం ఉందని, దీనికి అదనంగా బయోమ్ పేరుతో ఇంకో వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వాస్ నరసింహన్ ప్రకటించారు.