Kapil Dev
-
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి! -
నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు. అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.దారుణ వైఫల్యాలుఅంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లియామ్ లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లోఇక ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా.అదే విధంగా కోచ్ గౌతం గంభీర్కు కూడా గుడ్లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవుఅయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!పొగిడినవాళ్లు.. తిడతారు కూడానేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా
అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పరామర్శించాడు. కాంబ్లీతో ఫోన్లో సంభాషించి అతడికి ధైర్యం చెప్పాడు. అదే విధంగా కాంబ్లీకి చికిత్స అందించిన వైద్యులకు కపిల్ దేవ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.కపిల్ దేవ్తో వీడియో కాల్మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా కాంబ్లీకి చికిత్స అందించిన ఆకృతి ఆస్పత్రి డైరెక్టర్.. కపిల్ దేవ్(Kapil Dev)కు వీడియో కాల్ చేసి కాంబ్లీతో మాట్లాడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన కాంబ్లీ.. ‘‘హాయ్.. కపిల్ పాజీ ఎలా ఉన్నారు’’ అంటూ పలకరించగా.. కపిల్ దేవ్ కూడా ఆప్యాయంగా బదులిచ్చాడు. లవ్ యూ.. తొందర్లోనే వస్తాను‘‘నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తాను. మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తే మాత్రం అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! గడ్డానికి కూడా రంగేసుకున్నావు. కానీ దేనికీ ఇప్పుడే తొందరపడవద్దు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మునుపటి జీవితం గడుపగలవు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పక పాటించు. తొందర్లోనే నేను వచ్చి కలుస్తాను. సరేనా.. లవ్ యూ’’ అని కపిల్ దేవ్ కాంబ్లీకి భరోసా ఇచ్చాడు. కాగా ఇంటికి చేరుకున్న అనంతరం కాంబ్లీ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. ‘‘మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది’’ అని పేర్కొన్నాడు. సచిన్ టెండుల్కర్ బాల్య మిత్రుడుమరోవైపు.. కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని... కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది పేర్కొన్నారు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండుల్కర్(Sachin tendulkar)కు బాల్య మిత్రుడు. ఇద్దరూ ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.అయితే, సచిన్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ లెజెండరీ బ్యాటర్గా ఎదగగా.. కాంబ్లీ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఇటీవల తమ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్ను కలిసిన కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. కపిల్ సేన ఆర్థిక సాయం!ఈ క్రమంలో అతడిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తగా. కపిల్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, కాంబ్లీ చెడు అలవాట్లు మానేసి.. పునరావాస కేంద్రానికి వెళ్తేనే సహాయం అందిస్తామని షరతు పెట్టగా.. అతడు అందుకు అంగీకరించాడు. తాను మందు, పొగ తాగటం మానేశానని చెప్పాడు. చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!? -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్టైమ్ రికార్డు బ్రేక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సైతం బుమ్రా నిప్పుల చేరిగాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లోనూ 4 వికెట్లతో సత్తాచాటాడు. ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ వంటి కీలక వికెట్లను పడగొట్టి భారత్ను తిరిగి గేమ్లోకి తీసుకువచ్చాడు.ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. బుమ్రా ఇప్పటివరకు ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) పేరిట ఉండేది. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.తాజా మ్యాచ్తో కపిల్ దేవ్ అల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో బుమ్రా తన 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.ఇక మ్యాచ్ విషయాని వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో నాథన్ లియోన్(41 నాటౌట్), స్కాట్ బోలాండ్(10 నాటౌట్) ఉన్నారు.చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్ -
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే? -
రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి: కపిల్ దేవ్
టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఆసీస్తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం బరిలోకి దిగాడు. ఈ డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.అదేవిధంగా కెప్టెన్సీ పరంగా రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫామ్, కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం రోహిత్కు మద్దతుగా నిలిచారు. రోహిత్ సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని కపిల్ అన్నారు.‘రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి. ఏళ్ల తరబడి భారత క్రికెట్లో చిరస్మరణీయ విజయాలకు అవసరమైన పరుగులెన్నో చేశాడు. అలాంటి క్రికెటర్ సామర్థ్యంపై ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు. నాకైతే అస్సలే డౌటు లేదు.త్వరలోనే తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడు. ఒకట్రెండు ప్రదర్శనలతోనే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేయడం తగదు. ఆ నాయకుడే ఆరు నెలల క్రితం భారత్ టి20 ప్రపంచకప్ అందించాడన్న సంగతి మరిచిపోవద్దు. రోహిత్ మరింత బలంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాను" అని కపిల్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.చదవండి: PKL 2024: తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి.. -
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.అయితే, అతడు రిహాబ్ సెంటర్కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా మొదటి టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలాఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21)ని అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. ఓవరాల్గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సారథిగా మొదటిది.ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్ మన్కడ్, బిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు1. వినోద్ మన్కడ్(1)2. బిషన్ బేడి(8)3. కపిల్ దేవ్(4)4. అనిల్ కుంబ్లే(2)5. జస్ప్రీత్ బుమ్రా(1)టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లు1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్లు) 2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్లు) 3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్లు) 4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్లు) 5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్లు) 6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్లు) 7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్లు) 8. సుభాశ్ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్లు) 9. జస్ప్రీత్ బుమ్రా - 11 (41 మ్యాచ్లు) 10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్లు) 11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్లు)ఇదిలా ఉంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Make that FIVE! There's the first five-wicket haul of the series #MilestoneMoment #AUSvIND @nrmainsurance pic.twitter.com/t4KIdyMTLI— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్లో 7 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్గా తన రెండో టెస్ట్లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆసీస్తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు తెరలేవనుంది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్దేవ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్కు తప్పని ఓటమి -
'రూమ్లో కూర్చుంటే కుదరదు'. భారత ప్లేయర్లపై కపిల్దేవ్ ఫైర్
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో టీమిండియా వైట్వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్లో వైట్వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.రూమ్లో కూర్చుంటే కుదరదు.."క్రికెట్ బేసిక్స్కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.కాగా కివీస్ టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్స్టోరీ! (ఫొటోలు)
-
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్కు చోటు లేదుఅయితే, వరల్డ్కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్కాస్ట్లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్రౌండర్గా ఎదిగిన యువీ.. క్యాన్సర్ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్లో కాదు. ప్రపంచకప్లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్కప్లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్కప్లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్కప్ ఫైనల్లో భారత్పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్కు ఐదో స్థానం.. 1997లో భారత్పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్కు ఆరో స్థానం.. 2023 వరల్డ్కప్లో భారత్పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్కు పదో స్థానం దక్కాయి. -
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్..
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచేందుకు మనం తీవ్రంగా శ్రమించాలి. ఇది మనకు చావో రేవో. ప్రత్యర్ధి ఎవరన్నది మనకు అనవసరం.మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే తప్ప తర్వాత అనవసర చర్చలు పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు భారత ఆటగాళ్లకు కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన మాటలు.25 జూన్ 1983.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్కప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్కప్ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాపడించింది. ఈ విజయంతో యావత్తు భారత్ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ వరల్డ్కప్తో పాటు భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది.నిప్పులు చేరిగిన విండీస్ బౌలర్లు..అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. లక్ష్యచేధనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు.కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ను ఔట్ చేసి విండీస్ బౌలర్లు భారత్ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్డౌన్లో వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ భారత స్కోర్ 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాంత్(38), అమర్నాథ్(26) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.ఆరంభం ఆదుర్స్..ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊదిపడేస్తుందని అంతా భావించారు. భారత ఓటమితో ఇంటిముఖం పట్టకతప్పదని అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ను ఔట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మదన్లాల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. అయితే ఈ సమయంలో దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.మదన్ లాల్ మ్యాజిక్..మ్యాచ్పై భారత పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్స్ ఎటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కన్పించింది. రెండు వికెట్ల పడగొట్టిన మదన్లాల్ను సైతం రిచర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్లాల్ వేసిన ఓ ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ను తమవైపు తిప్పే ప్రయత్నం రిచర్డ్స్ చేశాడు. ఈ క్రమంలో రోజర్ బిన్నీని కపిల్ దేవ్ ఎటాక్లోకి తీసుకువచ్చి రిచర్డ్స్ దూకుడును కట్టడి చేయాలని భావించాడు. బిన్నీ పరుగులు రాకుండా ఆపినప్పటికి.. అతడి వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే మళ్లీ మదన్లాల్.. కపిల్ దగ్గరకు వచ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.కానీ అంతకుముందు ఓవరే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్లాల్ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా సరే మదన్ మాత్రం తనకు ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. అందుకు సరే అని కపిల్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవర్లో మదన్ లాల్ మ్యాజిక్ చేశాడు.కపిల్ సూపర్ క్యాచ్..ఈసారి మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని మదన్లాల్ వమ్ముచేయలేదు. ఆ ఓవర్లో మదన్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మదన్ లాల్ కంటే కెప్టెన్ కపిల్ దేవ్కే ఇవ్వాలి. సంచలన క్యాచ్తో వీవియన్ను కపిల్ దేవ్ పెవిలియన్కు పంపాడు. ఆ ఓవర్లో మూడో బంతిని మదన్ లాల్ రిచర్డ్స్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. అతడు ఆ డెలివరీని హుక్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా షాట్ కనక్ట్కాకపోవడంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ సమయంలో మిడ్-ఆన్లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి సంచలన క్యాచ్ను అందుకున్నాడు.ఆ క్యాచ్తో విండీస్ ఖేల్ ఖతమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింంది. దీంతో 43 పరుగులతో భారత్ చారిత్రత్మక విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అమర్ నాథ్, మదన్ లాల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు. -
‘ఆ ఇద్దరూ లెజెండ్స్.. వారి స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు'
టీ20 వరల్డ్కప్-2024 విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ టీ20లకు విడ్కోలు పలికినప్పటకి.. పొట్టి ఫార్మాట్లో తమకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్నారు.టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ టాప్-2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 'రోకో' ద్వయంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో విరాట్, రోహిత్ స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు. టీ20ల్లో మాత్రం కాదే ఇతర ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ లాంటి ఆటగాళ్లు మరి రారు. భారత క్రికెట్కు చాలా ఏళ్ల నుంచి వారు తమ సేవలను అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘనమైన విడ్కోలు. కానీ టీ20ల్లో వారిద్దరి లేని కచ్చితంగా భారత జట్టులో కన్పిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిల మాదిరిగానే వీరిద్దరి పేర్లు కూడా భారత క్రికెట్ చిరస్మణీయంగా నిలిచిపోతాయని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇంకా సందిగ్థం నెలకొంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. -
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇందులో.. భారత్కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024 -
బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.అన్షుమన్ గైక్వాడ్కు బ్లడ్ క్యాన్సర్కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.బీసీసీఐ సాయం చేయాలిబీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.ట్రస్టు ఏర్పాటు చేయాలిమా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!టీమిండియా హెడ్ కోచ్గానూ కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
ఇదేం టెస్టు మ్యాచ్ కాదు: రోహిత్పై మండిపడ్డ కపిల్ దేవ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మండిపడ్డాడు. టీ20 మ్యాచ్లలో టెస్టు మ్యాచ్ మాదిరి వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. వరల్డ్క్లాస్ బౌలర్, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను ఎలా వాడుకోవాలో తెలియదా అంటూ కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడేసింది.రెండు మ్యాచ్లలో తొలుత అతడి చేతికే బంతిగ్రూప్-ఏలో భాగమైన రోహిత్ సేన తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత పాకిస్తాన్పై గెలుపొంది టాపర్గా కొనసాగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్లలో టీమిండియా బౌలింగ్ అటాక్ను యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభించాడు.రెండో ఓవర్లో మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఐర్లాండ్తో మ్యాచ్లో ఆరో ఓవర్లో బుమ్రాను బరిలోకి దింపిన హిట్మ్యాన్.. పాకిస్తాన్తో మ్యాచ్లో మూడో ఓవర్ సందర్భంగా బాల్ అతడికి ఇచ్చాడు.అద్భుత స్పెల్తో దుమ్ములేపిన బుమ్రాఈ రెండు లో స్కోరింగ్ మ్యాచ్లలోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్తో ఆకట్టుకుని భారత్కు విజయాలు అందించాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో మూడు ఓవర్ల కోటాలో కేవలం ఆరు పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు బుమ్రా.ఇక పాక్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫలితంగా రెండు మ్యాచ్లలోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, పేస్ దళ నాయకుడైన బుమ్రాను కాదని.. యంగ్స్టర్ అర్ష్దీప్ సింగ్తో బౌలింగ్ అటాక్ ఆరంభించడం ఏమిటని ఇప్పటికే మాజీ సారథి సునిల్ గావస్కర్ ప్రశ్నించగా.. తాజాగా మరో దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇవేమీ టెస్టు మ్యాచ్లు కాదు‘‘అతడు వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే మొదటి ఓవర్లోనే బంతిని అతడికి ఇవ్వాలి. ఇవేమీ టెస్టు మ్యాచ్లు కాదు కదా! టీ20 ఫార్మాట్ ఇది.ఎంత త్వరగా వికెట్లు తీస్తే.. అంత త్వరగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్ అటాక్ ఆరంభించి.. ఆదిలోనే రెండు వికెట్లు తీసినట్లయితే.. మిగతా బౌలర్లు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.తప్పని నిరూపించాడుఅదే విధంగా.. ‘‘అతడి శరీరం.. ముఖ్యంగా భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పెడతాడు కాబట్టి బుమ్రా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగలేడని మనమంతా భావించాం.అయితే, అందరి ఆలోచనలు తప్పని అతడు అనతికాలంలోనే నిరూపించాడు’’ అంటూ బుమ్రాను కొనియాడాడు కపిల్ దేవ్. ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా బుధవారం నాటి మ్యాచ్లో న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడనుంది.చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్దేవ్తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్స్టార్తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. నీ కోసం..
భారత్లో క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్ డెవిల్స్కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్కప్-1983లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్దేవ్ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి.. ఆ మ్యాజిక్ను రిపీట్ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే వరల్డ్కప్-2023లో అజేయ రికార్డుతో ఫైనల్తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్వి అయిపోయావు. నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్ షేర్ చేశాడు. ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్ దేవ్ బాసటగా నిలిచాడు. -
అప్పుడు కపిల్ దేవ్, ధోని.. ఇప్పుడు! అది గతం.. హిట్మ్యాన్ భావోద్వేగం
వన్డే వరల్డ్కప్-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్గా బరిలోకి.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిపించిన నాయకుడిగా సరికొత్త గుర్తింపు.. అజేయంగా నిలిచి ఫైనల్ వరకు ప్రయాణం.. ఆ ఒక్క అడ్డంకి దాటేస్తే.. ప్రపంచకప్ గెలిచిన మూడో కెప్టెన్గా చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం.. అవును.. రో‘హిట్’ శర్మ గురించే ఇదంతా!! ఒకప్పుడు ప్రపంచకప్ జట్టులో చోటే లేని ఆటగాడు ఇప్పుడు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ గెలిచేందుకు సంసిద్ధమయ్యాడు. 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోని చేసిన అద్భుతాలను పునరావృతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భావోద్వేగాలపరంగా యావత్ భారతానికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో.. నాయకుడిగా రోహిత్కు, జట్టుకు అంతే ముఖ్యం. హిట్మ్యాన్ కూడా ఇదే మాట అంటున్నాడు. మ్యాచ్ గెలిస్తే మంచిదే ‘‘భావోద్వేగాలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద క్షణం అనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో నాకు బాగా తెలుసు. కఠోర శ్రమ తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఈరోజు ఎంతో ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టి నాతో పాటు మిగతా సహచరులంతా ఆటపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం. మ్యాచ్ గెలిస్తే మంచిదే కానీ అనవసరంగా ఒత్తిడి పెంచుకోను. అది ఇప్పుడు అనవసరం ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడటం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ రోజున పిచ్ను చూసిన తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. 2011లో నాకు ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం. కానీ ఈ వయసులో ఫైనల్ మ్యాచ్కు సారథిగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. 1983లో కపిల్ డెవిల్స్ భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఏడాది.. అప్పటివరకు అడపా దడపా క్రికెట్ మ్యాచ్లు చూసిన సందర్భాలే తప్ప ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే కపిల్ డెవిల్స్ జగజ్జేతగా నిలిచిందో అప్పటి నుంచి టీమిండియా భవిష్యత్తు మారిపోయింది. భారత్ క్రికెట్లో నూతన శకం మొదలైంది. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇంగ్లండ్ వేదికగా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రయాణం భారత్కు నల్లేరు మీద నడకలా సాగలేదు. అనూహ్యరీతిలో విండీస్ను చిత్తు చేసి లీగ్ దశలో అనూహ్య రీతిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను 34 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తర్వాత జింబాబ్వేతో మ్యాచ్లో 135 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది కపిల్ బృందం. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి మరోసారి విండీస్కు షాకిచ్చి 66 పరుగుల తేడాతో గెలిచింది మళ్లీ విజయాల బాట పట్టింది. ఆ తర్వాత జింబాబ్వేను 31 రన్స్తో ఓడించిన టీమిండియా ఆస్ట్రేలియాపై కూడా ప్రతీకారం తీర్చుకుంది. 118 పరుగుల తేడాతో ఆసీస్ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి సెమీస్కు చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ను మట్టికరిపించి సత్తా చాటి ఫైనల్కు చేరింది. అయినప్పటికీ టీమిండియాను తక్కువ చేసి మాట్లాడిన వారే ఎక్కువ. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచి వెస్టిండీస్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరడంతో కపిల్ సేనను మట్టికరిపించడం ఖాయమని భావించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. కపిల్ దేవ్ దూకుడైన విధానం, చావో రేవో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించే తీరు భారత్కు తొలి టైటిల్ అందించింది. మిస్టర్ కూల్ ధోని సేన సొంతగడ్డపై ఇక 2011లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్పై (87 పరగుల తేడాతో) గెలుపుతో ఆరంభించిన ధోని సేన.. తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్ను టై చేసుకుంది. ఆ తర్వాత.. పసికూనలు ఐర్లాండ్, నెదర్లాండ్స్లను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. అనంతరం సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అటు పిమ్మట వెస్టిండీస్ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ చేరింది. ఇక మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో శ్రీలంకను చిత్తు చేసి మిస్టర్ కూల్ ధోని జట్టు ట్రోఫీని ముద్దాడిన దృశ్యాలను అభిమానులెవరు మర్చిపోగలరు!! View this post on Instagram A post shared by ICC (@icc) -
వారి అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగపాటు!
రెండు అడుగులు.. రెండే రెండు అడుగులు దాటితే చాలు.. వరల్డ్ కప్ టైటిల్ మరోసారి టీమిండియా సొంతమవుతుంది. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం భారత జట్టుకు లభిస్తుంది. సొంత గడ్డ మీద 2011లో ధోని సేన చేసిన అద్భుతం పునరావృతం అవుతుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ వరకు రోహిత్ సేన కొనసాగించిన జైత్రయాత్ర పరిపూర్ణం అవుతుంది. ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో టీమిండియా ఏడుసార్లు సెమీఫైనల్ చేరుకుంది. 1983, 1987, 2003, 2011, 2015, 2019 ఎడిషన్లలో ఆడింది. ఇందులో మూడుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓటమిపాలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా 1983 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన భారత జట్టు సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఆరు వికెట్ల తేడాతోచిత్తు చేసింది. ఆ తర్వాత ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కు ఊహించని షాక్ ఇచ్చి జగజ్జేతగా అవతరించింది. అలా తొలిసారి సెమీస్ గండాన్ని దాటేసి ట్రోఫీని ముద్దాడింది కపిల్ డెవిల్స్. అయితే.. 1987 ఎడిషన్ లో మాత్రం సొంత గడ్డపై సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. వాంకడే వేదికగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమిస్లోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ లోను మరోసారి ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. నాడు టీమిండియాని ముందుండి నడిపించింది మహమ్మద్ అజారుద్దీన్. ఇక 1996 సెమీఫైనల్ లో చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు శ్రీలంక చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం వల్ల మ్యాచ్ కు కలిగిన అంతరాయం టీమిండియా కొంపముంచింది. నాడు లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా.. 34 ఓవర్ల వద్ద 120/8 స్కోరుతో కొనసాగుతున్న సమయంలో.. స్టేడియంలోని ఫ్యాన్స్ హంగామా చేశారు. దీంతో ఆట ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అప్పటికి భారత్ పై పై చేయి సాధించిన శ్రీలంకను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అలా అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా పై నెగ్గిన శ్రీలంక ఫైనల్ లోను విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీ 2003 లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. స్టార్ ఆటగాళ్లంతా నిలకడైన ఫామ్ తో జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటర్లు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును సెమీస్కు చేర్చారు. నాడు ఊహించని రీతిలో సెమీస్కు వచ్చిన కెన్యాపై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెంది రన్నరప్తో పెట్టుకుంది. ఇక 2011 వరల్డ్ కప్ గురించి టీమిండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జట్టు భారత్ ను రెండోసారి జగజ్జేతగా నిలిపింది. సెమీఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించి ఫైనల్కు అర్హత సాధించిన ధోని సేన.. ఆఖరిమెట్టుపై శ్రీలంకను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఐసీసీ ట్రోఫీని బహుమతిగా అందించింది. వన్డే వరల్డ్ కప్ 2015 సెమీఫైనల్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో దారుణ వైఫల్యంతో ఇంటి బాట పట్టింది. అదేవిధంగా 2019 లోను భంగపాటుకు గురైంది. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. నాటి మ్యాచ్లో ఫినిషర్ ధోని రన్ అవుట్ రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడినా 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. -
CWC 2023: మాక్సీ డబుల్ సెంచరీని కపిల్ 175తో పోల్చగలమా..?
క్రికెట్లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం సర్వ సాధారణం. ఇక్కడ ఓ ప్రదర్శనను తక్కువ చేసి, మరో దాన్ని ఎక్కువ చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. కానీ, ఏ ప్రదర్శన జట్టు విజయానికి ఎక్కువగా దోహదపడిందని విశ్లేషించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి ఓ పోలికనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) గెలిపించాడు. 1983 ప్రపంచకప్లోనూ ఇలాంటి ఓ మెరుపు ఇన్నింగ్స్ను మనం చూశాం. నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు, నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 175 పరుగులు చేశాడు. కపిల్ ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్ కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. తాజాగా మాక్సీ మెరుపు ఇన్నింగ్స్ చూశాక చాలా మంది అభిమానులు నాటి కపిల్ ఇన్నింగ్స్ను గుర్తు చేసుకుంటున్నారు. కొందరేమో మాక్సీ డబుల్ను కపిల్ 175తో పోలుస్తున్నారు. ఈ విషయంపై సోషల్మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ రెండు ఇన్నింగ్స్ల మధ్య పోలిక పెట్టి, ఏది గొప్ప అని నిర్ణయించడానికి ఆస్కారమే లేదు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇక్కడ అభిమానులు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు. అది తక్కువ, ఇది ఎక్కువ అని తేల్చడానికి వీలు లేదు. రెండు సందర్భాల్లో ఆటగాళ్లు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి భారీ ఇన్నింగ్స్లు ఆడారు. నాడు కపిల్ బరిలోకి దిగిన సందర్భంలో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఆ సమయంలో కపిల్ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా మ్యాక్స్వెల్ సైతం తన జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు (292 పరుగుల లక్ష్యఛేదనలో 91/7 స్కోర్ వద్ద) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అయితే ఈ రెండు ఇన్నింగ్స్ల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కపిల్ ఇన్నింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ చేసినది కాగా, మాక్సీ ఛేదనలో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ, అక్కడ ఆటగాళ్లు తమతమ జట్ల గెలుపుకు వంద శాతం దోహదపడ్డారు. ఇద్దరూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఇక్కడ మ్యాక్సీ పోరాడితే పోయేది ఏమీ లేదని సక్సెస్ సాధించగా.. నాడు కపిల్ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి ఫలితం రాబట్టాడు. -
కపిల్ దేవ్, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకు ముందు భారత జట్టుకు సారథ్యం వహించిన ఆటగాళ్లెవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. కాగా భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2011 ఫైనల్లో ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకను చిత్తు చేసి నాటి జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరోసారి ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది భారత్. ఈ క్రమంలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేన.. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఏ వేదిక మీదైతే టైటిల్ గెలిచిందో అదే వేదిక మీద తాజా వరల్డ్కప్ ఎడిషన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కాగా వాంఖడే రోహిత్ శర్మకు సొంతమైదానం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ చరిత్రలో అతడు అరుదైన ఘనత సాధించిన కెప్టెన్గా నిలిచాడు. ఇంతకు ముందు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో వరల్డ్కప్ టోర్నీలో హోంగ్రౌండ్లో సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. 1983లో తొలిసారి టీమిండియాకు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన కపిల్ దేవ్ 1987లోనూ కెప్టెన్గానూ ఉన్నాడు. అయితే, అప్పుడు భారత్లోనే ఐసీసీ ఈవెంట్ జరిగినప్పటికీ కపిల్ దేవ్ స్వస్థలం చండీగఢ్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక వరల్డ్కప్-1996లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా కూడా అజారుద్దీన్ సొంత మైదానం హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. అదే విధంగా 2011 ప్రపంచకప్ టోర్నీలోనూ ధోని స్వస్థలం రాంచిలోనూ భారత జట్టు మ్యాచ్ ఆడలేదు. నిజానికి 2013 తర్వాత అక్కడ తొలి అంతర్జాతీయ స్టేడియం నిర్మించారు. చదవండి: వారసత్వాన్ని నిలబెడతాడని తండ్రికి నమ్మకం! వివాదాలు చుట్టుముట్టినా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి
కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్ వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్ స్క్రీన్ క్రికెట్ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో డాన్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ క్రికెట్ గ్రౌండ్లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్గా నటించగా, ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రల్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ముత్తయ్య 800 లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్గా ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్ లైఫ్ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్గారిలా నటించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్ సాధన చేశానని, మేకప్ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్ మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్ మిట్టల్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ది టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తమిళంలో ‘టెస్ట్’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్ చేస్తుండగా, నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ను బట్టి ఈ సినిమా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్లలో ఎవరు క్రికెటర్స్గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చక్దా ఎక్స్ప్రెస్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్ క్రికెట్ ఆడారు జులన్ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్ప్రెస్’. జులన్గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుందట. క్రికెటర్ మహి జాన్వీ కపూర్ క్రికెటర్గా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’. రాజ్కుమార్ రావు మరో లీడ్ రోల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రికెట్ బ్యాక్డ్రాప్లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యాడా..? సంచలన వీడియో షేర్ చేసిన గంభీర్
భారత వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ (1983), దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన ఈ వీడియోలో కపిల్ దేవ్ కిడ్నాప్కు గురైనట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్లా కనినిస్తున్న వ్యక్తిని చేతులు వెనుక్కు కట్టి, మాట్లాడకుండా నోటిని బట్టతో కట్టేసి బలవంతంగా లాక్కెళ్లుతున్నారు. ఆ సమయంలో కపిల్లా కనిపిస్తున్న వ్యక్తి వెనక్కు చూస్తూ ఏవో సైగలు చేస్తూ కనిపించాడు. Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp — Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023 ఈ వీడియోలో నిజానిజాలెంతో తేలాల్సి ఉంది. కొందరు ఈ వీడియోను మార్పింఫ్ చేశారంటుంటే, మరికొందరు ఇది అడ్వటైజ్మెంట్ కోసం చేసిన వీడియో అని అంటున్నారు. ఈ వీడియోను భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎక్స్లో షేర్ చేస్తూ.. ఈ క్లిప్ను నాలా ఇంకెవరైనా అందుకున్నారా అని ప్రశ్నించాడు. ఈ వీడియోలో ఉన్నది కపిల్ కాకుడదని అనుకుంటున్నానని.. కపిల్ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నానని గంభీర్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ఈ వీడియోలో నిజానిజాలటుంచితే.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట వైరలవుతుంది. -
ఇంత దారుణమా..కపిల్ దేవ్ కిడ్నాప్?
-
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్
Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. #WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi (Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR — ANI (@ANI) September 23, 2023 -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
IND VS BAN: అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్గా, వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. The moment when Jadeja completed 200 wickets in ODIs.- A historic moment....!!!!!!!pic.twitter.com/uv4ulOrYpk— Johns. (@CricCrazyJohns) September 15, 2023 ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్లో షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు. కాగా, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 45 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. నసుమ్ అహ్మద్ (35), మెహిది హసన్ (13) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్గా..
England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్కప్-2023 నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్ రీఎంట్రీలో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కివీస్తో తొలి వన్డేతో పునరాగమనం చేసిన స్టోక్స్ 52 పరుగులతో రాణించాడు. అయితే, తదుపరి మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసి అవుటయ్యాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగాడు. సంచలన ఇన్నింగ్స్తో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డులు బద్దలు.. ప్రపంచంలో రెండో క్రికెటర్గా ఈ క్రమంలో జేసన్ రాయ్ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్లను అధిగమించాడు. వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు వీరే! ►వివియన్ రిచర్డ్స్- 189 ►బెన్ స్టోక్స్- 182 ►వివియర్ రిచర్డ్స్- 181 ►రాస్ టేలర్- 181 ►ఏబీ డివిలియర్స్- 176 ►కపిల్ దేవ్- 175 ఒక్క రన్తో ధోని, కోహ్లి రికార్డు మిస్ కివీస్పై ఇన్నింగ్స్(182)తో.. వన్డేల్లో నాన్ ఓపెనర్గా బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. చార్ల్స్ కొవంట్రీ(194), వివియన్ రిచర్డ్స్(189), ఫాఫ్ డుప్లెసిస్(185), మహేంద్ర సింగ్ ధోని(183), విరాట్ కోహ్లి(183) ఈ జాబితాలో స్టోక్స్ కంటే ముందున్నారు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. One of the greatest of this generation. PERIOD. 🐐 📹 | @BenStokes38 sent New Zealand bowlers to the cleaners, scoring 182 in just 124 balls 🥵#SonySportsNetwork #ENGvsNZ #BenStokes pic.twitter.com/OytoOEqNOb — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2023 -
బజ్బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
Indian cricket legend Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న ‘బజ్బాల్’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్లలో యాషెస్ అద్భుతమని కొనియాడాడు. కాగా న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత.. బెన్స్టోక్స్ సారథంలో బజ్బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్తో కలిసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. అయితే, సిరీస్ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్బాల్ అద్భుతం. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి ఇటీవల నేను చూసిన సిరీస్లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలి. కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్ దేవ్ ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ను ఉద్దేశించి కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్కప్లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్కు కెప్టెన్గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్తో విభేదాల కారణంగా వరల్డ్కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్కప్కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్గా కొనసాగాడు. కెప్టెన్గా తన టర్మ్లో కపిల్ వరల్డ్కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్కప్కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. కెప్టెన్గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్లో అంపైర్ పొరపాటున సిక్సర్ను ఫోర్గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్కప్లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్కు వరల్డ్కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్గా కపిల్కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్కప్లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. -
మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్
Ravindra Jadeja Responds to Kapil Dev's Money Making Players Arrogant Remark: టీమిండియాను ఉద్దేశించి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కష్టపడితేనే జట్టులో చోటు దక్కుతుందని.. అంతేతప్ప తేరగా ఎవరూ తమకు అవకాశాలు వస్తున్నాయని భావించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. డబ్బు వల్ల అహంకారం పెరిగింది! కాగా ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు.. దేశం కోసం ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కపిల్ దేవ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆటగాళ్లలో అహంకారం పెరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదేనన్న కపిల్.. అయితే, అన్నీ తమకే తెలుసనన్న భావన పనికిరాదని చురకలు అంటించాడు. మాకేమీ ఊరికే అవకాశాలు రావు! ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు.. ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరంటూ ‘ది వీక్’తో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో మూడో వన్డే ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా ముందు విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. ‘‘ఆయన ఎప్పుడు ఈ మాటలు అన్నారో నాకు తెలియదు. జట్టు ఓడిపోయినప్పుడల్లా.. నేను సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేయను. అయినా, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయం అనేది ఉంటుంది. ఆయన విషయంలోనూ అంతే! ప్రతీ ఆటగాడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ.. జట్టులో స్థానం కాపాడుకోవడానికి శ్రమిస్తూనే ఉంటాడు. టీమ్లో చోటు ఆయాచితంగా వచ్చిందన్నట్లు ప్రవర్తించరు. ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి కచ్చితంగా 100 శాతం ఎఫర్ట్ పెట్టి టీమిండియాను గెలిపించడానికే కృషి చేస్తారు. అయితే, ఎప్పుడైతే జట్టు ఓడిపోతుందో అలాంటపుడు.. ఇలాంటి మాటలు వినిపించడం సహజం. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. ఎవరికీ ఎలాంటి అహంకారం, అహంభావం లేదు. దేశం కోసమే ఆడుతున్నాం.. అంతేగానీ.. ప్రతి ఒక్కరు భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లే. మేమంతా దేశం కోసమే ఆడుతున్నాం. మాకు వ్యక్తిగత ఎజెండాలంటూ ఏమీ ఉండవు’’ అంటూ జడ్డూ.. కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య మంగళవారం(ఆగష్టు 1) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా మీడియాతో ముచ్చటించాడు. ఆఖరి మ్యాచ్లో కచ్చితంగా గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం
What Happened To Jasprit Bumrah?: ‘‘దేవుడి దయ వల్ల.. నా విషయంలో అంతా బాగుంది. అప్పుడప్పుడు గాయాలపాలు కావడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. మన వాళ్లు ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి.. గాయాల బారిన పడకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ చాలా గొప్ప లీగే.. కాదనను. అయితే, అదే ఏదో ఒకరోజు మిమ్మల్ని నాశనం చేస్తుంది కూడా! చిన్నపాటి గాయాలు ఉన్నా మీరు ఐపీఎల్ ఆడతారు. కానీ దేశం కోసం మాత్రం ఆడరు. దీర్ఘకాలం పాటు బ్రేక్ తీసుకుంటారు.. అంతే కదా!. ఇక్కడ బీసీసీఐ గమనించాల్సిన విషయం ఒకటుంది. మన ఆటగాళ్లకు స్వల్ప గాయమైనపుడు.. ఐపీఎల్లో ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉంటే కచ్చితంగా బరిలోకి దిగుతారు. కాబట్టి మన వాళ్లు ఏడాదిలో ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు. ఎంతకాలం ఆడుతున్నారన్న విషయాలపై దృష్టి సారించాలి. ఈరోజు మీ దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి. కావాల్సినంత డబ్బుంది. కానీ.. ఏడాదికి 3-5 క్యాలెండర్లు మాత్రం ఉండవు కదా! అసలు మన క్రికెట్ బోర్డు తీరే తప్పుగా ఉంది’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. బీసీసీఐ, టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్కు ఉన్న విలువలేదు! భారత ఆటగాళ్లు ఐపీఎల్కు ఇస్తున్న విలువ.. దేశం కోసం ఆడటానికి ఇవ్వడం లేదని మండిపడ్డాడు. ‘ది వీక్’తో ముచ్చటించిన ఈ లెజెండరీ ఆల్రౌండర్.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమవడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలు బుమ్రాకు ఏమైంది? ‘‘అసలు బుమ్రాకు ఏమైంది? అతడు కోలుకున్నాడని చెబుతున్నారు.. ఒకవేళ తను వరల్డ్కప్ సెమీస్, ఫైనల్ నాటికైనా అందుబాటులో లేకపోతే అతడి కోసం సమయం వృథా చేసినట్లే కదా! ఇక రిషభ్ పంత్.. గొప్ప క్రికెటర్. ఒకవేళ అతడే గనుక జట్టుతో ఉంటే మన టెస్టు క్రికెట్ పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ ఏం జరిగింది?’’ అంటూ కపిల్ దేవ్.. యువ ఆటగాళ్ల తీరును విమర్శించాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా బుమ్రా దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన ఆసియా కప్, ప్రపంచకప్ ఈవెంట్లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక రిషభ్ పంత్ స్వయంగా కారు నడుపుతూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు కూడా దాదాపు ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ వీరిద్దరిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్కు మాత్రం.. -
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత ఆటగాడిగా!
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆట తీరు మార లేదు. టీమిండియాతో టెస్టు సిరీస్లో పేలవ ప్రదదర్శన కనబరిచిన విండీస్.. ఇప్పుడు వన్డే సిరీస్లోనూ అదే పునరావృతం చేస్తోంది. బార్బోడస్ వేదికగా భారత్ జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్(43) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు. అనంతరం 115 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై తీసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు విండీస్పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం కపిల్దేవ్(43 వికెట్లు) రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. అదే విధంగా భారత్-వెస్టిండీస్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా, దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును సమం చేశాడు. చదవండి: IND vs WI: తీరు మారని వెస్టిండీస్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం -
అరుదైన రికార్డు ముంగిట జడ్డూ! అదే జరిగితే కపిల్ను వెనక్కి నెట్టి.. ఏకంగా
Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే. కుంబ్లేతో సంయుక్తంగా ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఒకవేళ తాజా సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్లు బార్బడోస్లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా.. -
ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం
ODI World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. సొంతగడ్డపై టోర్నీ జరగడం సానుకూల అంశమని.. అయితే, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న అంశంపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కీలక ఆటగాళ్లకు పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించాడు. అప్పుడు కపిల్ డెవిల్స్.. తర్వాత ధోని సేన కాగా 1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ఏకంగా చాంపియన్గా నిలిచింది. నాటి పటిష్ట వెస్టిండీస్ను ఓడించి భారత్కు తొలిసారి ప్రపంచకప్ (వన్డే) అందించింది. ఆ తర్వాత మళ్లీ 2011లో ధోని సేన సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడింది. పుష్కరకాలం తర్వాత భారత్లో ఈ క్రమంలో పుష్కరకాలం తర్వాత స్వదేశంలో మరోసారి టోర్నీ ఆడే అవకాశం రోహిత్ సేనకు దక్కింది. అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిసారి మనమే ఫేవరెట్.. అయితే.. బెంగళూరులో గోల్ఫ్ ఫిట్టింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ‘‘ఇదంతా ఎలా జరుగుతుందో ముందుగా చెప్పలేం. అయితే, బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమిండియా ప్రతిసారి టోర్నమెంట్ ఫేవరెట్గానే రంగంలోకి దిగుతోంది. భారత జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో స్వదేశంలో వరల్డ్కప్ గెలిచిన రికార్డు ఉంది. ఈసారి ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ప్రతి ఒక్కరు గత చరిత్రను పునరావృతం చేసేలా శ్రమించి ఆశించిన ఫలితం పొందుతారనే అనుకుంటున్నా. గాయాల బారిన పడితే మాత్రం అందుకోసం వాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంటారని భావిస్తున్నా. మన ఆటగాళ్లలో చాలా మంది దాదాపు 10 నెలల పాటు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లపై కాస్త పనిభారం తగ్గించి.. గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలి’’ అని కపిల్ బోర్డుకు సూచించాడు. కాగా గాయాల నుంచి కోలుకుంటున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ప్రసిద్ కృష్ణ తదితరులు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. చదవండి: వరల్డ్కప్నకు ముందు ఆసీస్తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ -
WC: టీమిండియా లక్ వల్ల గెలిచింది! అంతేకానీ ఒక్కరూ: విండీస్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
World Cup, 1983 India vs West Indies, Final: ‘‘మేమప్పుడు మంచి ఫామ్లో ఉన్నాం. కానీ ఒక్క మ్యాచ్ వల్ల అంతా నాశనమైంది. నిజానికి 1983లో అదృష్టం ఇండియా వైపు ఉంది. ఆ సమయంలో మా జట్టు గొప్పగానే ఉన్నప్పటికీ ఎందుకో ఓటమి పాలయ్యాం. ఫైనల్ తర్వాత బహుశా ఐదారు నెలల వ్యవధిలో మేము టీమిండియాను 6-0 తేడాతో చిత్తు చేశాం. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఒక్క మ్యాచ్ టీమిండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందని చెప్పవచ్చు. ఆనాడు మేము 183 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. ఇదేదో అతి విశ్వాసమో, అతి జాగ్రత్త వల్లో జరిగింది కాదు’’ అంటూ వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కేవలం లక్ వల్లే గెలిచింది లక్ వల్లే టీమిండియా గెలిచిందన్నట్లు వ్యాఖ్యలు చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. ఆ మ్యాచ్లో ఒక్క బ్యాటర్, బౌలర్ కూడా తనను ఇంప్రెస్ చేయలేకపోయారన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్స్టార్తో రాబర్డ్స్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఫిఫ్టీ సాధించలేకపోయారు. ఇక బౌలర్లు.. ఒక్కరు కూడా కనీసం 4 లేదంటే 5 వికెట్లు తీయలేకపోయారు. ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు వికెట్లు కూలుస్తూనే ఉండాలి. కానీ టీమిండియా నుంచి ఏ ఒక్కరు అలా చేయలేకపోయారు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వివియన్ రిచర్డ్స్ అవుట్ కావడం(మదన్లాల్ బౌలింగ్లో) మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తాము ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. 1975, 1979 ఫైనల్స్.. 1983 ఫైనల్కి తేడా ఒక్కటే.. ఆ రెండు దఫాలు మేము తొలుత బ్యాటింగ్ చేశాం. 83లో ఛేజింగ్ చేశాం’’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. 1983 వరల్డ్కప్ ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్ మొహిందర్ అమర్నాథ్ 26, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్లెవరూ 20 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. రాబర్ట్స్కు అత్యధికంగా ఈ క్రమంలో 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి కపిల్దేవ్ సేన ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే చాపచుట్టేయడంతో 43 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. కాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజంగా పేరొందిన ఆండీ రాబర్ట్స్ 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు. ఇప్పుడు ఇదంతా దేనికి? ఇదిలా ఉంటే.. ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అవును మరి.. ఒక్క మ్యాచ్తోనే ఫలితాలు తారుమారవుతాయి.ఘే జట్టు విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ బృందం విజేతగా నిలిచి టీమిండియా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి చెత్త మాటలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. విండీస్ కనీసం వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
ధోనీ కాదు.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ అతడే: సునీల్ గవాస్కర్
భారత క్రికెట్లో 'కెప్టెన్ కూల్' అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. అతడు తన కూల్ కెప్టెన్సీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దృష్టిలో కెప్టెన్ కూల్' అంటే ధోని కాదంట. భారత్కు తొలి ప్రపంచకప్ను అందిచిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన 'కెప్టెన్ కూల్' గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 1983 ప్రపంచకప్ను సొంతం చేసుకుని నిన్నటికి(జూన్25) 40 ఏళ్లు పూరైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోగవాస్కర్ ఈ వాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచకప్లో కపిల్ దేవ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ను కపిల్ అద్భుతంగా అందుకున్నాడు. అదే మేము వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్ ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. కపిల్ ఒక డైనమిక్ లీడర్. ఒక కెప్టెన్కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉండేవి. ఒక ఆటగాడు క్యాచ్ వదిలినా, మిస్ ఫీల్డ్ చేసినా.. కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించకపోయేది. కపిల్ అసలైన కెప్టెన్ కూల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా 1983 ప్రపంచకప్లో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో పటిష్ట విండీస్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..! -
1983 World Cup: ఆ అపురూప విజయానికి 40 ఏళ్లు
-
చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ సెలబ్రేషన్స్
టీమిండియా తొలి ప్రపంచకప్ను సాధించి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1983 వన్డే ప్రపంచకప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఫైనల్లో పటిష్ట వెస్టిండీస్ను ఓడించి ఛాంపియన్స్గా నిలిచింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కపిల్ డేవిల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క విజయంతో ప్రపంచక్రికెట్లో తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు భారత జట్టు ఏర్పరుచుకుంది. స్పెషల్ సెలబ్రేషన్స్.. ఇక తొలి ప్రపంచకప్ సాధించి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని 1983 భారత హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలు జరపుకున్నారు. వరల్డ్కప్ జట్టులో భాగమైన లెజెండ్స్ ఓ మినీ ఎయిర్ క్రాప్ట్లో స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్కప్ విన్నింగ్ హీరోస్లో ఒకడైన కీర్తి ఆజాద్ సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇందులో కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, శ్రీకాంత్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్నాథ్, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సింగ్, రోజర్ బిన్నీలు ఉన్నారు. "35,000 వేల అడుగుల ఎత్తులో 1983 వరల్డ్కప్ ఛాంపియన్ టీమ్ 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోంది. భారతీయుడుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. లవ్ ఇండియా, భారత్ మాతాకీ జై "అంటూ కీర్తి ఆజాద్ ట్విటర్లో పేర్కొన్నాడు. మరోవైపు అదానీ గ్రూప్ తమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1983 ప్రపంచకప్ విజేత ఆటగాళ్లను సత్కరించింది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ‘జీతేంగే హమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచకప్ విన్నింగ్ హీరోస్ తమ సెలబ్రేషన్స్ను జరపుకున్నారు. చదవండి: #1983WorldCup: రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది The World Cup champion 1983 team travelling together to celebrate our 40th anniversary victory on 25th June, 35,000 feet up in the air. We are proud Indians and love India Bharat Mata Ki Jai @therealkapildev @RaviShastriOfc @BCCI @JayShah pic.twitter.com/xR1VxFSbys — Kirti Azad (@KirtiAzaad) June 25, 2023 -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించిన భారత్ ప్రపంచకప్ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్కప్లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్కు భారత్, పాక్లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్లో పాకిస్థాన్ కౌన్సిల్తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్కప్కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
WTC Final: రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు తలపడనుంది. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి.. తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. కాగా టీమిండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. దాదాపు 10 ఏళ్లగా అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ ట్రోఫీని.. కనీసం రోహిత్ శర్మ అయినా అందిస్తాడో లేదో వేచి చూడాలి. అయితే రోహిత్కు ఇది కెప్టెన్గా తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ కావడం కావడం గమనార్హం. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్-2021 ఫైనల్కు చేరిన భారత జట్టు.. విరాట్ కోహ్లి సారధ్యంలో న్యూజిలాండ్తో తలపడనుంది. అయితే తుదిపోరులో ఓటమి పాలైన టీమిండియా రన్నరప్గా నిలిచింంది. అరుదైన రికార్డుకు చేరువలో.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్-2023కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్గా బరిలోకి దిగితే.. ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు సారధ్యం వహించిన ఐదో కెప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ధోనితో పాటు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. కాగా ఐసీసీ టోర్నీలో ఫైనల్స్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన జాబితాలో ఆగ్రస్ధానంలో కపిల్ దేవ్ ఉన్నాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన జాబితాలో కపిల్ దేవ్ తర్వాత సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అనంతరం మూడో స్థానంలో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధోని టీమిండియాకు నాయకత్వం వహించాడు. కాగా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో భారత జట్టుకు సారధ్యం వహించిన భారత కెప్టెన్ కూడా ధోనినే కావడం గమనార్హం. ఇక నాలుగో కెప్టెన్గా విరాట్ కోహ్లి ఉన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్గా కోహ్లి ఉన్నాడు. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా -
రెజ్లర్లకు 1983 వరల్డ్కప్ విన్నింగ్ బ్యాచ్ మద్దతు..
రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నవారిలో 1983 వరల్డ్ కప్ నెగ్గిన భారత మాజీ క్రికెటర్లు చేరారు. కపిల్దేవ్ నేతృత్వంలో ఈ బృందం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. ‘మన చాంపియన్ రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ వేసింది. వారి ఫిర్యాదులు విని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే తమ పతకాలను పడేయడం వంటి తీవ్రమైన పనులు చేయవద్దని రెజ్లర్లను కోరుతున్నాం. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, త్యాగాల ఫలితం ఆ పతకాలు’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ‘సంయుక్త ప్రకటన’తో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఈ జట్టులో సభ్యుడైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు. మరో వైపు నిందితుడిని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన మన బిడ్డలు న్యాయం కోసం వీధికెక్కారు. 15 తీవ్ర ఆరోపణలతో రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన వ్యక్తి ప్రధాన రక్షణ కవచంలో ఉన్నాడు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చదవండి: IRE VS ENG One Off Test: టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? -
గిల్లో అద్బుతమైన టాలెంట్ ఉంది.. కచ్చితంగా లెజెండ్స్ సరసన చేరుతాడు: కపిల్ దేవ్
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఓపెనర్ , గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో 890 పరుగులు చేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్స్లతో మరోసారి ప్రపంచ క్రికెట్కు తన టాలెంట్ ఎంటో చూపించాడు. Shubman Gill's performance this season has been nothing short of unforgettable, marked by two centuries that left an indelible impact. One century ignited @mipaltan's hopes, while the other dealt them a crushing blow. Such is the unpredictable nature of cricket! What truly… pic.twitter.com/R3VLWQxhoT — Sachin Tendulkar (@sachin_rt) May 28, 2023 ఈ ఏడాది ఐపీఎల్లో గిల్ మూడు సెంచరీలతో పాటు నాలగు హాఫ్సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ తన ఆటతీరుతో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను గుర్తుచేస్తున్నాడని కపిల్ దేవ్ కొనియాడాడు. అయితే గిల్ మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని కపిల్దేవ్ అభిప్రయపడ్డాడు. "భారత్ క్రికెట్ ప్రపంచానికి ఎంతోమంది లెజెండ్స్ను పరిచయం చేసింది. వారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు శుబ్మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. Memorable one pic.twitter.com/2jnfJz6Kqr — Shubman Gill (@ShubmanGill) May 30, 2023 కానీ ఇప్పుడే అతడిని ఆకాశానికి ఎత్తేయకూడదు అనుకుంటున్నాను. గిల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ అతడికి ఇంకా మరింత మెచ్యూరిటీ కావాలి. అతడు వచ్చే ఏడాది సీజన్లో కూడా ఇలాగే ఆడితే.. కచ్చితంగా గొప్ప ఆటగాళ్ల జాబితాలోకి చేరుతాడు. అతడు మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని" ఏబీపీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. Shubman Gill bags four awards but misses on the most precious Trophy 😐 📷: Jio Cinema #ShubmanGill #GujaratTitans pic.twitter.com/XFtIzAXnrw — CricTracker (@Cricketracker) May 30, 2023 చదవండి: IRE vs ENG: ఐర్లాండ్తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు -
15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం..
IPL 2023- MS Dhoni: ‘‘ఇప్పటికే అతడు పదిహేనళ్లపాటు ఐపీఎల్ ఆడాడు. అయినా.. మనం ప్రతిసారి ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ధోని తన పని తాను చేశాడు. ఇంకా మనం తన నుంచి ఆశించడానికి ఏం మిగిలి ఉంది? జీవితాంతం అతడు ఐపీఎల్ ఆడుతూనే ఉండాలా?’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో సీఎస్కేను నాలుగు సార్లు చాంపియన్గా నిలిపాడు. తలా ఒక్క షాట్ ఆడినా చాలు ఇక ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆరంభ మ్యాచ్ నుంచే ఎక్కడ చూసినా తలా మేనియా కొనసాగుతోంది. ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలోనూ ప్రేక్షకులు ధోనికి మద్దతుగా నిలవడం చూశాం. ధోని ఒక్క షాట్ ఆడినా చాలు.. ప్రత్యక్షంగా చూడాలంటూ కేవలం తలా కోసమే మైదానానికి పోటెత్తిన ఫ్యాన్స్కు లెక్కేలేదు. తన అద్భుతమైన వ్యూహాలతో అంచనాలు లేని జట్టును ఐపీఎల్-2023 ఫైనల్కు తీసుకువచ్చిన 41 ఏళ్ల ధోని రిటైర్మెంట్ గురించి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్కు సైతం ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా అతడు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జీవితాంతం ఆడలేడు కదా! ‘‘ధోని ఇప్పటికే ఐపీఎల్లో చేయాల్సిందంతా చేశాడు. తను జీవితాంతం ఆడుతూ ఉండలేడు కదా! అది ఎప్పటికీ జరగని పని. తను ఆడుతూ ఉండాలని కోరుకోవడం కంటే కూడా.. ఈ 15 ఏళ్లలో అతడు క్రికెట్కు చేసిన సేవలకు కృతజ్ఞతా భావం చాటుకోవడం అత్యంత ముఖ్యం. కెప్టెన్ ఎలా ఉండాలో చూపించాడు వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేడా అన్న విషయం చెప్పలేం. నిజానికి ఈ ఏడాది ధోని భారీగా పరుగులు రాబట్టలేకపోయినా.. జట్టును ఫైనల్కు చేర్చి.. కెప్టెన్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. క్రికెట్లో నాయకుడి పాత్ర ఏమిటో చాటిచెప్పాడు’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో చెన్నై- గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా.. ఈ క్రమంలో ఆదివారం (మే 28) మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డంకిగా మారింది. వరుణుడు కరుణించకపోవడంతో ఫైనల్ మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం చెన్నై- గుజరాత్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఒకవేళ ఈరోజు కూడా వర్షం కొనసాగి.. మ్యాచ్ రద్దయితే.. టేబుల్ టాపర్గా ఉన్న హార్దిక్ పాండ్యా సేన (గుజరాత్) చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: ఐపీఎల్ ఫైనల్.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే? రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Smash and Walk!🔥#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/bRNoZwdrOI — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 -
ఒక్క సీజన్కేనా? సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు: టీమిండియా దిగ్గజం
IPL 2023- Shubman Gill: ‘‘సునిల్ గావస్కర్ వచ్చాడు... అదరగొట్టాడు.. తర్వాత సచిన్ టెండుల్కర్.. అనంతరం రాహుల్ ద్రవిడ్.. అటు పిమ్మట వీవీఎస్ లక్ష్మణ్.. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి... ఇలాగే అద్బుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. శుబ్మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్పై ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పుడే గిల్ ఆట తీరుపై పూర్తి అంచనాకు రాలేమని వచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడితే అతడికి తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఏకంగా మూడు సెంచరీలు కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ సెంచరీలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్లలో 851 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గిల్ బాదిన బౌండరీల సంఖ్య 78. సిక్సర్లేమో 33. అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న గిల్.. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అవతరించాడు. పరుగుల వరద పారించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక ఆదివారం నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై మరోసారి చెలరేగితే గిల్కు తిరుగుండదు. అద్భుత ఆటగాడే కానీ.. ఈ నేపథ్యంలో శుబ్మన్ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కపిల్ దేవ్.. గిల్ను కొనియాడుతూనే.. ఆటలో నిలకడ అవసరమని పేర్కొన్నాడు. ‘‘గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. బ్యాటింగ్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలకు కొదువలేదు. అయితే, తను ఆటలో ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. రానున్న సీజన్లో కూడా ఇదే నిలకడైన ఆట తీరు కొనసాగిస్తే అతడిని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చడం ఖాయం. ఇప్పుడే వద్దు కాబట్టి నేను ఇప్పుడే గిల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేను. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత తన గురించి మాట్లాడతా. ఇప్పుడే గొప్ప ప్లేయర్ అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా సీఎస్కే- గుజరాత్ ఐపీఎల్-2023 ట్రోఫీ కోసం ఆదివారం తలపడనున్నాయి. చదవండి: చరిత్రకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు! ఒకవేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్
సిల్వర్స్క్రీన్ సూపర్స్టార్ రజనీకాంత్, క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ ‘లాల్సలామ్’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ముంబైలో మొదలైంది. ఈ చిత్రంలో కపిల్దేవ్ నటిస్తున్నారు. ‘‘ప్రముఖులు, మానవతావాది, భారతదేశానికి క్రికెట్లో తొలి వరల్డ్ కప్ను తీసుకువచ్చిన కపిల్దేవ్గారితో వర్క్ చేయడం గౌరవంగా ఉంది’’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఇద్దరు లెజండ్స్ (రజనీ, కపిల్దేవ్) ‘లాల్ సలామ్’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు’’ అన్నారు విష్ణు విశాల్.క్రికెట్ బ్యాక్డ్రాప్లో ‘లాల్ సలామ్’ రూపొందుతోంది. అందుకే కపిల్ దేవ్ని కీలక పాత్రకు సంప్రదించి ఉంటుంది చిత్ర యూనిట్. -
సంజూను సూర్యతో పోల్చకండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం
Suryakumar Yadav- Sanju Samson: ‘‘ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారో వాళ్లకు తప్పకుండా వరుస అవకాశాలు లభిస్తాయి. సూర్యతో సంజూ శాంసన్ను పోల్చకండి. ప్రస్తుతం ఇలాంటి పోలికలు సరికాదు. ఒకవేళ సంజూకి సూర్య లాంటి పరిస్థితే ఎదురైతే మనం వేరొకరి గురించి మాట్లాడే వాళ్లం కదా!’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. ఎవరికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలనేది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్గా వెనుదిరిగి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు. వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను కాదని సూర్యకు అవకాశం ఇస్తే.. మరీ ఘోరంగా విఫలమయ్యాడంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘‘టీమ్ మేనేజ్మెంట్ సూర్యకుమార్ యాదవ్కు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికే వరుస అవకాశాలు ఇస్తుంది. బయట జనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ, జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. కాబట్టి ఇలాంటి పోలికలు వద్దు’’ అని ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. ఇదేమీ కొత్తకాదు అదే విధంగా సూర్య బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ..‘‘మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆఖరి వన్డేలో ఫినిషర్ పాత్ర పోషిస్తాడనే భావనతో సూర్యకుమార్ను ఏడో స్థానంలో పంపినట్లు అనిపిస్తోంది. వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం సర్వసాధారణమే. ఇంతకుముందు కూడా టీమిండియా ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసింది. అయితే, కొన్నిసార్లు టాపార్డర్ బ్యాటర్ను డౌన్ ఆర్డర్లో పంపితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జట్టుకు సంబంధించిన ప్రతి విషయంలో కోచ్, కెప్టెన్ ప్రధాన పోషిస్తారు కదా! ఎవరైనా ఆటగాడు తనకు బ్యాటింగ్ పొజిషన్లో ఇబ్బంది ఉందని చెబితే.. వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. కాగా తొలి రెండు వన్డేల్లో తన రెగ్యులర్ పొజిషన్ అయిన నాలుగో స్థానంలో వచ్చిన సూర్య మూడో వన్డేలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్ వేదికగా జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని టీమిండియా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ సొంతం చేసుకుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్కు దూరమైనా పంత్కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! Kane Williamson: 99వ పుట్టినరోజుకు ముందు.. వీరాభిమానికి కేన్మామ సర్ప్రైజ్ గిఫ్ట్! ఫొటో వైరల్ -
Ind Vs Aus: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత
India vs Australia, 3rd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ను అధిగమించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో అశూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో ఆరు వికెట్లతో సత్తా చాటి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ 1గా అవతరించాడు. 688వ వికెట్.. ఈ క్రమంలో ఇండోర్లో జరుగుతున్న మూడో టెస్టులోనూ అశ్విన్ ప్రభావం చూపుతున్నాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా మూడు వికెట్లు పడగొట్టాడు అశూ. తొలుత హ్యాండ్స్కోంబ్(19) తర్వాత అలెక్స్ క్యారీ(3)ని అవుట్ చేశాడు. కాగా క్యారీ వికెట్ అశ్విన్ కెరీర్లో 688వది. దీంతో అతడు ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఇక ఆఖర్లో అశూ నాథన్ లియోన్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ టెస్టులో టీమిండియా 109 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించగా.. ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజాకు నాలుగు, అశ్విన్కు మూడు, ఉమేశ్ యాదవ్కు మూడు వికెట్లు దక్కాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు(ఇప్పటివరకు) 1.అనిల్ కుంబ్లే- 953(499) 2.హర్భజన్ సింగ్- 707(442) 3.రవిచంద్రన్ అశ్విన్- 688*(347) 4.కపిల్ దేవ్- 687(448) 5.జహీర్ ఖాన్- 597(373) నంబర్ 1 అశ్విన్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన ప్రదర్శన... భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను మళ్లీ ప్రపంచ నంబర్వన్ బౌలర్గా చేసింది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ను రెండో స్థానానికి పంపించి అశ్విన్ నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల అశ్విన్ తొలిసారి 2015లో టాప్ ర్యాంక్లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్ ర్యాంక్లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్లు ఆడిన అశ్విన్ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్ 864 రేటింగ్ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా... అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్ మూడో స్థానానికి చేరుకోగా... భారత్కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్లో, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్) ఐదో ర్యాంక్లో ఉన్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? -
లావుగా ఉన్నందుకు సిగ్గు పడాలి.. రోహిత్ శర్మపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఫిట్నెస్పై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఓవర్ వెయిట్పై అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్ శర్మ సిగ్గు పడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లో చూస్తే హిట్మ్యాన్ అస్సలు ఫిట్గా కనిపించడని, 140 కోట్లకు పైగా భారతీయులను రెప్రజెంట్ చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఫిట్గా లేకపోవడం అవమానకరమంటూ సరికొత్త వివాదానికి తెరలేపాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్గా ఉండటం ఏ క్రీడకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో జట్టు సారధి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బరువు విషయంలో రోహిత్ ఇకనైనా జాగ్రత్త పడాలని, బరువు తగ్గించుకునేందుకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే కానీ ఇది సాధ్యపడదని అన్నాడు. రోహిత్ గొప్ప ఆటగాడు, గొప్ప కెప్టెన్ అన్న విషయంతో ఏకీభవిస్తానని, టీవీల్లోనైనా సన్నగా కనిపించేందుకు కావాల్సిన కసరత్తులు చేయాలని సూచించాడు. ఓ వ్యక్తి టీవీల్లో కనిపించేదానికి, నేరుగా చూసేదానికి చాలా వ్యత్యాసముంటుందని.. లావుగా ఉన్నవారు సైతం టీవీల్లో సన్నంగా కనపడతారని అన్నాడు. ఇంతటితో ఆగకుండా రోహిత్ను ఫిట్నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లితో పోలుస్తూ ఇరువురు స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ కొట్టుకునేందుకు కావాల్సి మసాలాను అందించాడు. కెప్టెన్ అనే వాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో కోహ్లి యావత్ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని పరుగుల యంత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని చూస్తే ఫిట్నెస్ అంటే ఇదీ అనేలా ఉంటాడని ఆకాశానికెత్తాడు. రోహిత్పై కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, హిట్మ్యాన్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేరు. రోహిత్-కోహ్లి అభిమానులు ఇప్పుడిప్పుడే కలిసిపోతుండగా.. కపిల్ ఈ తరహా కామెంట్స్ చేసి మళ్లీ ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేశాడు. కాగా, రోహిత్ ఫిట్నెస్, అతని బరువుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలామంది దిగ్గజాలు కూడా హిట్మ్యాన్ బరువు తగ్గాలని సూచించారు. రోహిత్ ఓవర్ వెయిట్ కొన్ని సందర్భాల్లో ఆటపై కూడా ప్రభావం చూపింది. మధ్యమధ్యలో కొద్దికాలంపాటు వెయిట్ను కంట్రోల్లో పెట్టుకునే రోహిత్.. కొంచం గ్యాప్ దొరికిందంటే మళ్లీ మొదటికొస్తాడు. రోహిత్ బొద్దుగా ఉండటాన్ని ఉద్దేశిస్తూ అతనంటే సరిపడని వారు 'వడా పావ్' అని ఎగతాళి చేస్తుంటారు. ఇలాంటి కామెంట్లు చేసే వారి కోసమైనా రోహిత్ సన్నబడాలని ఆశిద్దాం. కాగా, రోహిత్పై గతంలో ఈ తరహా కామెంట్స్ చేసిన వారిని ఫ్యాన్స్ ఆడుకున్నారు. బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని, ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే చెప్పాల్సిన పద్దతి ఇది కాదంటూ చురకలంటించారు. -
దిగ్గజ ఆల్రౌండర్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తన ప్రదర్శనతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. రీఎంట్రీ ఇస్తూనే బౌలింగ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న జడేజా.. బ్యాటింగ్లో అర్థసెంచరీతో రాణించాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై నింపాదిగా బ్యాటింగ్ చేసి అర్థసెంచరీ మార్క్ను అందుకున్నాడు. టెస్టు కెరీర్లో జడ్డూకు ఇది 18వ అర్థశతకం. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా తరపున ఒక టెస్టు మ్యాచ్లో ఐదు వికెట్లు సహా అర్థసెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకముందు కపిల్ దేవ్ నాలుగుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా జడ్డూ ఐదోసారి ఈ ఫీట్ సాధించి కపిల్ రికార్డును చెరిపేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో అజేయ అర్థశతకాలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్లో 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించనుంది. And the trademark celebration is here 😀😀@imjadeja 💪 Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Q1TPXZVLfE — BCCI (@BCCI) February 10, 2023 చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
BGT 2023: కేఎల్ రాహుల్ను తప్పించండి.. వైస్ కెప్టెన్ అయితేనేం..?
Kapil Dev Comments On KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ సంచలన కామెంట్స్ చేశాడు. తొలి టెస్ట్ కోసం భారత తుది జట్టు కూర్పు విషయంపై కపిల్ మాట్లాడుతూ.. టీమ్ కాంబినేషన్లో రాహుల్ సెట్ కాకపోతే, తుది జట్టులో ఆడించకండి అంటూ కెప్టెన్, కోచ్లకు సలహా ఇచ్చాడు. వైస్ కెప్టెన్ అయినంత మాత్రనా తుది జట్టులో ఆడించాలా అని ప్రశ్నించాడు. గతంలో చాలా సందర్భాల్లో వైస్ కెప్టెన్లను ఆడించలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. జట్టు కాంబినేషన్లో సెట్ కాకపోతే కెప్టెన్ను కూడా తప్పించవచ్చని అన్నాడు. కెప్టెన్ను కానీ వైస్ కెప్టెన్ను కానీ తప్పక ఆడించాలన్న రూల్ ఏమీ లేదని తెలిపాడు. కేఎల్ రాహుల్ను తప్పక తుది జట్టులో ఆడించాలనుకుంటే వికెట్కీపింగ్ చేయించమని అన్నాడు. గతంలో చాలా మ్యాచ్ల్లో రాహుల్ వికెట్ కీపింగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. రాహుల్తో వికెట్కీపింగ్ చేయిస్తే, ఎక్స్ట్రా ప్లేయర్ను తీసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించాడు. వ్యక్తిగతంగా తనకు రాహుల్పై ఎలాంటి ద్వేషం లేదని, తాను ఏది చెప్పినా జట్టు ప్రయోజనాల కోసమేనని తెలిపాడు. వాస్తవానికి రాహుల్ ఆటతీరు తనకు బాగా నచ్చుతుందని, జట్టు సమతూకం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా రేపటి (ఫిబ్రవరి 9) నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే కపిల్.. రాహుల్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంగా కపిల్.. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత అతని చెంప పగలగొట్టాలని ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పంత్ గాయపడటంతో టీమిండియా లయ తప్పిందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాని కపిల్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
రిషబ్ పంత్ చెంప పగలకొట్టాలి.. అతని వల్లే టీమిండియాకు ఈ దుస్థితి..!
Kapil Dev Comments On Rishabh Pant: గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు, యంగ్ వికెట్కీపర్ రిషబ్ పంత్పై క్రికెట్ దిగ్గజం, భారత వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చావును అతి సమీపంగా చూసి వచ్చిన పంత్ను చూసి అందరూ జాలి పడుతుంటే, కపిల్ మాత్రం ఘాటు వ్యాఖ్యలతో పంత్పై విరుచుకుపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో మూడు లిగ్మెంట్లు (కుడి మోకాలిలో) తెగిపోయి మంచానికే పరిమితమైన పంత్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తుంటే కపిల్ మాత్రం నిర్దయగా నోరు పారేసుకున్నాడు. ఇంతకీ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. యువకుడైన పంత్ నిర్లక్ష్యంగా కారు నడిపి తన ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవడంతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును ఏడాది కాలం పాటు అగమ్యగోచరంగా మార్చేశాడంటూ మండిపడ్డాడు. టెస్ట్ల్లో రెగ్యులర్ సభ్యుడైన పంత్.. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్స్ ఉన్నాయన్న ధ్యాసే లేకుండా కారు నడిపి తన ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడంటూ ధ్వజమెత్తాడు. పంత్ జట్టులో లేకపోవడం వల్ల జట్టు కాంబినేషన్ పూర్తిగా దెబ్బతినిందని, దీని వల్ల టీమిండియా లయ కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. పంత్ లేని లోటు నిజంగా తీర్చలేనిదని, ఈ ప్రభావం BGT 2023పై తప్పకచూపుతుందని అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టులో ఓ వ్యక్తిని (వికెట్కీపర్) అదనంగా తీసుకోవాల్సి వస్తుందని, దీంతో పాటు బ్యాటింగ్ లైనప్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని తెలిపాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఏడాది పాటు జట్టును శూన్యంలోని నెట్టిన పంత్ను పూర్తిగా కోలుకున్న తర్వాత చెంపదెబ్బ కొట్టాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అన్నాడు. జట్టులో సమస్యలకు పంత్ కారకుడయ్యాడంటూనే అతను త్వరగా కోలుకోవాలని అన్నాడు. తనకు పంత్పై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అతను అందుబాటులో లేకపోవడం వల్ల టీమిండియాకు సమస్య వచ్చిందన్నదే తన బాధ అని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న పంత్ ఏడాదికాలం పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంది. ఈ సమయంలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్స్ వంటి కీలక టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. -
రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే!
India vs Sri Lanka- Suryakumar Yadav: ‘‘అతడి ఇన్నింగ్స్ గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... ఈ జాబితాలో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన ఎప్పుడో కలిగించాడు. భారత్లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదు. అందులోనూ ఇలాంటి ప్లేయర్లు సూపర్. తన ఆట అత్యద్భుతం. ముఖ్యంగా ఫైన్ లెగ్ దిశగా తను కొట్టే ల్యాప్ షాట్ అమోఘం. తను అలా ఆడుతుంటే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. తను ఎటూ కదలకుండానే మిడాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదగలడని వాళ్లకు తెలుసు. షాట్ సెలక్షన్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రిక్కీ పాంటింగ్.. లాంటి ఎంతో మంది బ్యాటింగ్ దిగ్గజాలను చూశాను. కానీ.. అతడిలా బంతిని ఇంత క్లీన్గా హిట్ చేయగల బ్యాటర్ను చూడలేదు. హ్యాట్సాఫ్’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. సూర్యకుమార్ యాదవ్ను ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా ‘స్కై’ కాగా శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన ఆఖరి మ్యాచ్లో సూర్య విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న ‘స్కై’.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 112 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి.. సిరీస్ గెలవడంలో సహాయపడ్డాడు. కపిల్ దేవ్- స్కై శతాబ్దానికి ఒక్కడు ఈ నేపథ్యంలో.. కపిల్ దేవ్.. సూర్య ది గ్రేట్ ఇన్నింగ్స్ గురించి ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘హ్యాట్సాఫ్ సూర్యకుమార్ యాదవ్.. తనలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు’’ అంటూ కొనియాడాడు. కాగా లంకతో మ్యాచ్లో సెంచరీ సూర్య కెరీర్లో మూడోది. మిగతా రెండూ కూడా ఇంగ్లండ్, న్యూజిలాండ్తో టీ20 మ్యాచ్లలో సాధించినవే!! ఈ శతకంతో సూర్య పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. రోజుల వ్యవధిలోనే దంపతుల హఠాన్మరణం Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్ -
డ్రైవర్ను పెట్టుకునే స్థోమత ఉన్నపుడు ఎందుకిలా: టీమిండియా దిగ్గజం
Rishabh Pant Car Accident: ‘‘మీకో మంచి కారు ఉంటుంది. అత్యంత వేగంగా రయ్మని దూసుకుపోగలదు కూడా! కానీ ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవర్ను పెట్టుకునే స్థోమత మీకు ఉంటుంది. కాబట్టి ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లకండి. అయితే, ఒక్కొక్కరికి ఒక్కో విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్యాషన్ ఉంటుంది. యవ్వనంలో ఉన్నపుడు ఇలాంటివి సహజం. కానీ మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏదేమైనా మీ పట్ల మీరే శ్రద్ధ వహించాలి. మీకేం కావాలో.. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోగలగాలి. అంతా సాఫీగా ఉండాలంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ యువ క్రికెటర్లకు సూచించాడు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తవహించాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడ్డ అతడికి చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థాంక్ గాడ్! పంత్ బయటపడ్డాడు పంత్ క్షేమంగా బయటపడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కపిల్ దేవ్.. ఏదేమైనా వాహనాలు నడిపే సమయంలో ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అదే విధంగా గతంలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు. ‘‘నేను క్రికెట్ ఆడుతున్న తొలినాళ్లలో మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత నుంచి నా సోదరుడు నన్ను మోటార్ బైక్ నడిపేందుకు అస్సలు అనుమతి ఇవ్వలేదు’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకోగలిగారని పేర్కొన్నాడు. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు BBL: సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా? -
అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్.. మరో 11 పరుగులు చేస్తే..!
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీ (58) సాధించిన అశ్విన్.. ఇదే ఇన్నింగ్స్లో మరో 11 పరుగులు చేసి ఉంటే, టెస్ట్ క్రికెట్లో 3000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆరో ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కేవాడు. ప్రస్తుతం అశ్విన్ 87 టెస్ట్ మ్యాచ్లు ఆడి 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యాష్ ఖాతాలో 442 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. అశ్విన్కు ముందు టెస్ట్ల్లో 3000 పరుగులు, 400 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), షాన్ పొలాక్ (3781, 421), స్టువర్ట్ బ్రాడ్ (3550, 566), షేన్ వార్న్ (3154, 708), రిచర్డ్ హ్యాడ్లీ (3124, 431) ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 8వ స్థానంలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాను (12) అధిగమించి, కపిల్ దేవ్ (27) తర్వాతి స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్ శర్మ (3137) తర్వాత అశ్విన్వే అత్యధిక టెస్ట్ పరుగులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 271 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్.. తమ తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ విజేత దబాంగ్ డేర్ డెవిల్స్
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్ను ఓడించింది. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్కు రూ. 5 లక్షల ఫ్రైజ్మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. -
ప్రొటీస్నే కాదు టీమిండియాను 'చోకర్స్' అని పిలవొచ్చు
క్రికెట్లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్లను చోకర్స్ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్ అనే ముద్ర క్రికెట్లో సౌతాఫ్రికాకు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐసీసీ టోర్నీల్లో ఆరంభంలో వరుస విజయాలు సాధించే ప్రొటీస్ కీలకమైన మ్యాచ్లు లేదంటే నాకౌట్ దశలో చేతులెత్తేయడం చూస్తుంటాం. వాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేకపోయారు. ఈసారి ప్రపంచకప్లో కూడా సౌతాఫ్రికాకు అదే పరిస్థితి ఎదురైంది. గ్రూప్-2లో ఉన్న సౌతాఫ్రికా నెదర్లాండ్స్పై గెలిస్తే సెమీస్ చేరుకునేది. కానీ దురదృష్టం వారి పక్కనే ఉంటుంది కదా.. అందుకే డచ్ చేతిలో ఓడి అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా టీమిండియా కూడా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చూసింది. కనీసం పోరాటం కూడా చేయకపోవడం అభిమానులను మరింత బాధపెట్టింది. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014 నుంచి ఐసీసీ ఈవెంట్లలో వరుసగా విఫలమవుతూ వస్తున్న టీమిండియాను ఇకపై చోకర్స్ అని పిలవొచ్చని పేర్కొన్నాడు. ''టీమిండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు. ఇటీవలే ఐసీసీ ఈవెంట్లలో చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రమే చోకర్స్ అని పిలవొచ్చు. కానీ వ్యక్తిగతంగా జట్టులో కొంత మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ పదం వాడడానికి వీల్లేదు. మరీ అంత కఠినంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇండియా చెత్తగా ఆడిందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఒక్క మ్యాచ్తో మరీ అంతగా విమర్శించాల్సిన పని లేదు" అని కపిల్ స్పష్టం చేశాడు. ఇక కపిల్ దేవ్ సారధ్యంలో టీమిండియా తొలిసారి 1983 వన్డే వరల్డ్కప్ గెలిచింది. ఆ తర్వాత ధోని సారధ్యంలో 2007 టి20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఆఖర్లో బోల్తా కొడుతూ వస్తుంది. 2014 టి20 వరల్డ్కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై ఇండియా బోల్తా పడుతూ వస్తోంది. 2015 వన్డే వరల్డ్కప్ సెమీస్, 2016 టీ20 వరల్డ్కప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్, తాజాగా 2022 టీ20 వరల్డ్కప్లోనూ ఇండియా సెమీస్లో ఓడిపోయింది. చదవండి: ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా -
'టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే'
టి20 ప్రపంచకప్లో టీమిండియా మరోసారి ఫేవరెట్గానే బరిలోకి దిగింది. గతేడాది ఘోర వైఫల్యంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. 2007 తొలి ఎడిషన్ మినహా మరోసారి కప్ కొట్టలేకపోయిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాపై దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''టి20 క్రికెట్లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్ తర్వాతి మ్యాచ్లో ఓడిపోవచ్చు. ఇండియా వరల్డ్కప్ గెలిచే అవకాశాల గురించి మాట్లాడడం చాలా కష్టం. అసలు టీమిండియా సెమీస్కు చేరుతుందా అంటే అనుమానమే. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం. నా వరకు ఇండియా టాప్ ఫోర్లోకి చేరడానికి కేవలం 30 శాతం అవకాశమే ఉంది." అని పేర్కొన్నాడు. అయితే దీని వెనుక కారణమేంటన్నది మాత్రం కపిల్ వివరించలేదు. ఆల్రౌండర్ల విషయం ప్రస్తావిస్తూ.. "వరల్డ్కప్ అనే కాదు ఏ మ్యాచ్లు లేదా ఈవెంట్లు గెలిపించే ఆల్రౌండర్లు టీమ్లో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? హార్దిక్ పాండ్యాలాంటి ప్లేయర్ ఇండియాకు ఎంతో ఉపయోగపడతాడు. ఏ టీమ్కైనా ఆల్రౌండర్లు కీలకం. వాళ్లే టీమ్కు బలం. తుది జట్టులో ఆరో బౌలర్ను తీసుకునే స్వేచ్ఛను హార్దిక్లాంటి ప్లేయర్స్ రోహిత్కు ఇస్తారు. అతడు మంచి బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ కూడా. రవీంద్ర జడేజా కూడా ఇండియాకు మంచి ఆల్రౌండరే" అని వెల్లడించాడు. ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్పై స్పందిస్తూ.. "నిజానికి సూర్యకుమార్ ఇంతగా ప్రభావం చూపుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతడు బ్యాటింగ్లో ఎంతో గొప్పగా రాణించి ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు అతడు లేని ఇండియన్ టీమ్ను ఊహించలేం. విరాట్, రోహిత్,రాహుల్లాంటి వాళ్లతో కలిసి సూర్య ఉండటం ఏ టీమ్నైనా బలంగా మారుస్తుంది" అని పేర్కొన్నాడు. చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?! -
జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు!
Robin Uthappa Comments In Virat Kohli Form: ‘‘విరాట్ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్కింగ్స్ వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ మేరకు తనదైన శైలిలో కోహ్లి విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమవుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కపిల్దేవ్ వంటి లెజెండ్స్ అతడిని పక్కనపెట్టాలని సూచిస్తుండగా.. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సహా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విదేశీ సారథులు కూడా కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: CSK) 70 సెంచరీలు చేశాడు కదా! ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన ఊతప్ప షేర్చాట్ ఆడియో చాట్రూమ్ సెషన్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కోహ్లి ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంతటి గొప్ప ప్రతిభ కలిగి ఉండి భారత క్రికెట్ పేరును నిలబెట్టిన అతడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు కూడా అతడు 30 లేదంటే 35 పరుగులు చేయగలుగుతున్నాడు. కొన్నిరోజులు కోహ్లిని ఒంటరిగా వదిలేయండి. తనదైన శైలిలో క్రికెట్ ఆడే వరకు వేచి చూడండి. తనకు ఏది మంచో మనకంటే తనకే బాగా తెలుసు. తన సమస్య ఏమిటో కూడా తనకే తెలుసు. అంతేకాదు దానిని అధిగమించగల సత్తా కూడా అతడికి ఉంది. అంతవరకు అతడి మానాన అతడిని వదిలేసి కాస్త ఓపికగా ఎదురు చూడటం కంటే మనం చేసేదేమీ లేదు’’ అని ఊతప్ప కోహ్లికి మద్దతుగా నిలిచాడు. అతడు మ్యాచ్ విన్నర్.. ఎవరికీ ఆ హక్కులేదు! అదే విధంగా టీమిండియా వరుస సిరీస్ల నేపథ్యంలో విశ్రాంతి పేరిట కోహ్లి జట్టుకు దూరం కావడంపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ తనకు బ్రేక్ కావాలని కోరుకుంటే కోహ్లి తప్పక విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతడికి ఫలానా సిరీస్ లేదంటే ఫలానా టోర్నీ ఆడాలని ఉందంటే తప్పకుండా ఆడతాడు. అందుకు యాజమాన్యం అంగీకరించాలి. అంతేగానీ.. జట్టులో అతడి స్థానం ఏమిటన్న విషయంపై బయట పెద్దగా చర్చ అవసరం లేదు. అతడు మ్యాచ్ విన్నర్. ప్రపంచంలోని బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఊతప్ప ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. కాగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన కోహ్లి.. ఆసియా కప్ టోర్నీ నేపథ్యంలో ఆగష్టులో తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: Axar Patel: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? Rohit Sharma Latest Photo: వెస్టిండీస్కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా!
గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బందులు పడుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఫామ్లేమి కారణంగా కెరీర్లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోహ్లితో కాసేపు ముచ్చటించే సమయం దొరికితే అతడి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. తన సలహాలు కోహ్లికి ప్రయోజనకరంగా ఉంటాయో లేదో తెలీదన్న ఆయన.. ప్రయత్నం చేయడంలో తప్పేమీ ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడేతో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడితో 20 నిమిషాలు మాట్లాడే సమయం దొరికితే చాలు.. తను చేయాల్సిన పనులేమిటో.. తక్షణ కర్తవ్యం ఏమిటో చెబుతాను. నా సూచనలు అతడికి ఉపయోగపడొచ్చు! ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లైన్ విషయంలో తనకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. ఓపెనింగ్ బ్యాటర్గా నేను కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను. ఆఫ్స్టంప్ అవతల పడే బంతులను ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఒక్క 20 నిమిషాలు చాలు. తనకు వీటి గురించి వివరించడానికి’’ అని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లి పట్ల దృష్టికోణం కాస్త వేరుగా ఉండాలన్న గావస్కర్.. అతడు 70 సెంచరీలు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.ఎంతటి ఆటగాడికైనా కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని కోహ్లి విషయంలో కాస్త ఓపిక పట్టాలని విమర్శకులకు సూచించారు. కాగా కోహ్లిని జట్టు నుంచి తప్పించాలంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించిన సందర్భంలోనూ గావస్కర్ ఈ మాజీ సారథికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! Trolls On Virat Kohli: వీడియో షేర్ చేసిన కోహ్లి! నువ్వు ఇందుకే పనికివస్తావంటూ ట్రోలింగ్.. -
ఏపీఎల్ తుది పోరు.. కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ ఢీ
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగే పోరులో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎవరు ఎగరేసుకు పోనున్నారో తేలిపోనుంది. టైటిల్ పోరులో రన్నరప్గా నిలిచిన జట్టు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకోనుంది. కాగా.. తొలి సీజన్కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్లను కుదించి నిర్వహించారు. నాలుగు మ్యాచ్లను రద్దు చేశారు. టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ ఏపీఎల్ క్వాలిఫైయర్ రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లలిత్కు లెగ్బిఫోర్గా ప్రశాంత్(29) దొరికిపోగా.. మరో ఓపెనర్ అభిషేక్(41) మనీష్ బౌలింగ్లో షార్ట్ ఫైన్లెగ్లో సాయితేజకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్(16) లలిత్ బౌలింగ్లోనే డీప్ స్క్వేర్లెగ్లో అఖిల్కు క్యాచ్ ఇ చ్చాడు. కెప్టెన్ గిరినాథ్ 53 పరుగులు, రషీద్ 40 పరుగులతో నిలిచారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెజవాడ టైగర్స్ ఓపెనర్ మహీప్ ఒక్క పరుగే చేసి సంతోష్ బౌలింగ్లో డీప్ పాయింట్లో కార్తికేయకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అతని స్థానంలో వచ్చిన అవినాష్ ఒక పరుగుతో, మరో ఓపెనర్ ప్రణీత్ 24 పరుగులతో ఆడుతుండగా వర్షం వచ్చింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్కు 29 పరుగుల వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ఫలి తం తేలేందుకు కనీసం మరో ఓవర్ జరగాల్సి ఉండగా స్టేడియంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. లీగ్ దశలో పాయింట్ల ఆధారంగా బెజవాడ టైగర్స్ను విజేతగా ప్రకటించారు. దీంతో ఏపీఎల్ తొలి సీజన్ టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి ఆరున్నరకు ప్రారంభం కానుండగా విజేతకు ట్రోఫీ అందించేందుకు క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ రానున్నారు. ఈ నాకవుట్ మ్యాచ్ను ఉచితంగానే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
టీ20లో కోహ్లిని మించిన మొనగాడు లేడు.. అయినా రెస్ట్ అని చెప్పి: కపిల్ దేవ్
‘‘విరాట్ కోహ్లి లాంటి కీలక ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలని నేను అనను. నిజానికి తను గొప్ప క్రికెటర్. అలాంటి బ్యాటర్కు సముచిత గౌరవం ఇచ్చే క్రమంలో సెలక్టర్లు విశ్రాంతినిచ్చామని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. దుమారం రేపిన కపిల్ వ్యాఖ్యలు కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించిన కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తరచుగా విఫలమవుతున్న విరాట్ కోహ్లిని టీ20 జట్టుకు ఎందుకు ఎంపిక చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోహ్లి ఫామ్పై కపిల్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. కొంతమంది కపిల్ దేవ్ను సమర్థిస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు సైతం కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కపిల్ దేవ్ తాజాగా స్పందించారు. కోహ్లిని మించిన మొనగాడు లేదు.. అయితే! ఏబీపీ న్యూస్తో మాట్లాడిన ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోహ్లి సాదాసీదా క్రికెటర్ కాదు. అతడో గొప్ప ఆటగాడు. అలాంటి ప్లేయర్ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఏం చేయాలి? అతడికి ప్రాక్టీసు అవసరం. ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. టీ20 ఫార్మాట్లో కోహ్లిని మించిన మొనగాడు ఈ ప్రపంచంలోనే లేడు. అయితే, ఫామ్లో లేకుంటే సెలక్టర్లు తమ నిర్ణయం తాము తీసుకోకతప్పదు కదా! నా దృష్టిలో ఓ క్రికెటర్ మెరుగ్గా రాణించలేకపోతే రెస్ట్ ఇస్తారు.. లేదంటే జట్టు నుంచి తప్పిస్తారు. ఒకవేళ కోహ్లిని తప్పించి రెస్ట్ ఇచ్చామని చెప్పి అతడిని గౌరవాన్ని కాపాడారేమో’’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. రంజీల్లో ఆడాలి.. ‘విరాట్ లేకుండా ఇండియా గత ఐదారేళ్లలో అసలు మ్యాచ్లే ఆడలేదా? ఏదేమైనా అతడు ఫామ్లోకి రావాలన్నదే నా ఆశ. తనకు విశ్రాంతినిచ్చినా.. జట్టు నుంచి తప్పించినా.. అతడికి ఇంకా క్రికెట్ ఆడగల సత్తా ఉందన్న మాట వాస్తవం. అయితే, జట్టులోకి వచ్చే మార్గాలను అతడు అన్వేషించాలి. రంజీ ట్రోఫీ లేదంటే ఇతర టోర్నీలు ఆడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. గొప్ప క్రికెటర్ అయిన కోహ్లి.. మునుపటి ఫామ్ను అందుకోవడానికి మరీ ఇంత ఎక్కువ సమయం తీసుకోకూడదు. తనతో తాను పోరాటం చేయాలి. పునరాలోచన చేయాలి. తనను జట్టు నుంచి తప్పించినా.. విశ్రాంతినిచ్చినా నాకే సమస్య లేదు. అతడు ఫామ్లోకి రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఒక్క మ్యాచ్ చాలు ఆటగాడి తలరాతను మార్చడానికి! రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. అయినా పెద్దగా తేడా ఏమీ కనబడటం లేదు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఇంతకీ మీరేమంటున్నారు కపిల్? కాగా కపిల్ ఇంతకు కోహ్లిని సమర్థించాడా లేదంటే.. మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడా అన్న విషయం అర్థంకాక టీమిండియా ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆఖరికి మీరేమంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ను పొడిగించుకునేందుకు యువ బౌలర్ల అవకాశాలు దెబ్బతీసి.. రిటైర్మెంట్ ప్రకటించకుండా జిడ్డులా వేలాడిన విషయం మర్చిపోయారా అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ..
Sourav Ganguly Comments On Virat Kohli Form: ఫామ్లేమితో సతమతమవుతూ విమర్శల పాలవుతున్న టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. కోహ్లి గొప్ప క్రికెటర్ అని, త్వరలోనే అతడు తిరిగి పుంజుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆటలో ఇలాంటి ఆటుపోట్లు సహజమేనని.. తాను కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు దాదా తెలిపాడు. విమర్శల జల్లు! అదే విధంగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ సైతం ఒకానొక దశలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లే అని పేర్కొన్నాడు. కాగా రన్మెషీన్గా పేరొందిన విరాట్ కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. మరోవైపు టీమిండియాలో చోటు కోసం యువ క్రికెటర్లు దూసుకువస్తున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్లేమిపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఆ విషయం కోహ్లికి తెలుసు! అతడిని పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందని కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు సూచిస్తున్నారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా సునిల్ గావస్కర్ వంటి లెజెండ్స్ సైతం త్వరలోనే పాత కోహ్లిని చూస్తామంటూ అతడికి అండగా నిలిచారు. తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించిన విజయాలు గమనిస్తే ఎంతటి సమర్థత కలిగిన ఆటగాడో అర్థమవుతుంది. తను క్వాలిటీ బ్యాటర్. అయితే, ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ సంగతి అతడికి కూడా తెలుసు. నిజానికి తను గొప్ప క్రికెటర్. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని తనకూ తెలుసు. ఇదే కొనసాగితే తన కెరీర్ ఏమవుతుందో కూడా తెలుసు. అయితే, తను తిరిగి ఫామ్లోకి వస్తాడని భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లికి తిరిగి ఫామ్లోకి రావడం ఏమంత పెద్ద విషయం కాదు’’ అని ఎన్డీటీవీతో పేర్కొన్నాడు. అవన్నీ పట్టించుకోవద్దు! అదే విధంగా.. ‘‘కెరీర్లో ఇలాంటి ఎత్తుపళ్లాలు సహజం. ప్రతి ఒక్కరికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సచిన్, రాహుల్.. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు కోహ్లి వంతు! భవిష్యత్తులో మరికొంత మందికి ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు. అలాంటపుడు విమర్శలు పట్టించుకోవద్దు. పొరపాటు ఎక్కడ ఉంది.. దానిని ఎలా సరిదిద్దుకోవాలి? అన్న విషయాలపై దృష్టి సారించాలి. మైదానంలోకి దిగినపుడు ఇవన్నీ పక్కనపెట్టి నీ ఆటను నువ్వు ఆడాలి’’ అని గంగూలీ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్కు కోహ్లి దూరం! ఫ్యాన్స్కు గుడ్న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
Virat Kohli: రోహిత్ ఆడనపుడు వీళ్లెవ్వరూ మాట్లాడలేదు.. మరి కోహ్లి: గావస్కర్
‘‘రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. నిజానికి ఫామ్ అనేది తాత్కాలికం. క్లాస్ అనేదే శాశ్వతం’’ అని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత కొంతకాలంగా కోహ్లి తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించినా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ కింగ్ కోహ్లికి కొన్ని సిరీస్లలో విశ్రాంతినిచ్చినా.. కీలక సిరీస్లకు మాత్రం ఎంపిక చేస్తున్నారు. రోహిత్ ఫుల్ సపోర్టు! ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కోహ్లి మరోసారి విఫలం కావడంపై టీమిండియా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు కోహ్లికి అవకాశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అతడిని జట్టు నుంచి తప్పించాలని సూచించారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తమ వ్యూహాలకు అనుగుణంగానే బ్యాటర్లు ఆడతారని, ఇందులో వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. పొట్టి ఫార్మాట్ వేరు! తాజాగా ఈ విషయంపై స్పందించిన గావస్కర్ సైతం స్పోర్ట్స్తక్తో మాట్లాడారు. టీ20 ఫార్మాట్లో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఉంటాయన్న గావస్కర్.. ఆ క్రమంలో భారీ షాట్లకు యత్నించినపుడు ఒక్కోసారి సక్సెస్ అయితే.. మరోసారి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కోహ్లి విషయంలోనూ అదే జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో.. ‘‘కోహ్లికి సరైన సమయంలో వన్డే సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. ఎందుకంటే.. అతడు వన్డే ఫార్మాట్లో తన అత్యుత్తమ ప్రదర్శన, సహజమైన ఆటతీరును కనబరచగలడు. టెస్టుల్లో మాదిరి ఇక్కడ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. హడావుడిగా కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా బంతిని అంచనా వేస్తూ ఆడే వెసలుబాటు ఉంటుంది’’ అని గావస్కర్ పేర్కొన్నారు. నువ్వు చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లది తప్పా!? అలా కోహ్లి విమర్శలకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అరుదైన వికెట్ల ఫీట్ అందుకునేందుకు రిటైర్ కాకుండా తన కెరీర్ పొడిగించుకుంటూ యువకులకు అవకాశం రాకుండా చేసిన విషయం కపిల్ దేవ్కు గుర్తులేదా అంటూ ఇప్పటికే కోహ్లి ఫ్యాన్స్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య మంగళవారం(జూలై 12) నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. IND VS ENG 1st ODI: అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ఉన్న రోహిత్-ధవన్ జోడీ -
కోహ్లి చేసింది సరైందే.. అయినా కపిల్ దేవ్కు తెలియదు కదా!: రోహిత్ శర్మ
Ind Vs Eng- Rohit Sharma Defends Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా మాజీ కెప్టెన్, ‘స్టార్’ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. రీషెడ్యూల్డ్ టెస్టులో కోహ్లి చేసిన మొత్తం పరుగులు కేవలం 31. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20లో రాణించిన దీపక్ హుడాను పక్కనపెట్టి రెండు, మూడు మ్యాచ్లలో కోహ్లికి అవకాశం ఇచ్చారు. అయితే, ఒకప్పటి ఈ రన్మెషీన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుసగా 1, 11 పరుగులకే పెవిలియన్ చేరి మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు.. ముఖ్యంగా అతడికి ఛాన్స్ ఇవ్వడం కోసం ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం ఏమిటని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కోహ్లికి అండగా నిలబడ్డాడు. కోహ్లి రోహిత్ సపోర్టు మూడో టీ20 మ్యాచ్లో ఓటమి నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘టీ20 ఫార్మాట్లో.. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వంటి మేటి జట్టుపై పైచేయి సాధించాలంటే ఏం చేయాలో కోహ్లి అదే చేశాడు. నిజం చెప్పాలంటే మేము ముగ్గురం(రోహిత్ శర్మ(11), రిషభ్ పంత్(1), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(11) విఫలమయ్యాం. తప్పులను సమీక్షించుకుంటాం. ఏదేమైనా రోజు కోహ్లి ఆడిన తీరు సరైందే. అయితే, తన వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోయాడు. ఆఖరి వరకు నిలబడలేకపోయాడు. భారీ టార్గెట్ ముందున్న తరుణంలో కోహ్లి బ్యాటింగ్ చేసిన విధానం పట్ల అతడు సంతోషంగానే ఉంటాడు’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా మూడో టీ20లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కోహ్లి 6 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 11 పరుగులు చేశాడు. కపిల్ దేవ్కు తెలియదు! అదే విధంగా.. కోహ్లిని పక్కనపెట్టాలన్న టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ వ్యాఖ్యలను ఉద్దేశించి స్పందిస్తూ.. ‘‘ఆయన బయట నుంచి చూస్తున్నారు. జట్టులో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవచ్చు. మా వ్యూహాలు, ఆలోచనా విధానాలు మాకుంటాయి. పటిష్ట జట్టును తయారు చేసే క్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. మా ఆటగాళ్లకు మేము అవకాశాలు ఇస్తాం. అయినా బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్న అంశం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. జట్టులో ఏం జరుగుతుంది అన్న దానిపైనే మా దృష్టి ఉంటుంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20: టాస్: ఇంగ్లండ్- బ్యాటింగ్ ఇంగ్లండ్ స్కోరు: 215/7 (20) టీమిండియా స్కోరు: 198/9 (20) విజేత: ఇంగ్లండ్.. 17 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రీస్ టోప్లే(4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు) చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! Victory secured in style 👌 Scorecard/clips: https://t.co/AlPm6qHnwj 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/B8M5ys1moz — England Cricket (@englandcricket) July 10, 2022 -
స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)
లార్డ్స్ మైదానంలో ఆ రోజున భారత క్రికెట్ జట్టు ఓ అత్యద్భుత పరిణామం దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది జూన్ 25న భారత జట్టు సాధించిన విజయం భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ స్ఫూర్తితో దేశంలో క్రికెట్ క్రీడ అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ క్రీడలో రారాజులుగా వెలిగిపోతున్న వారిని దాదాపు నలభై ఏళ్ల క్రిందట ఓడించినప్పుడు కపిల్ బృందం ఈ పరిణామాన్ని ఊహించి ఉండదు. నాటి 60 ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచ్లో అప్పటికి రెండుసార్లుగా డిఫెండింగ్ చాంపియన్గా ఉన్న వెస్ట్ ఇండీస్పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: (Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం) -
Ind Vs Eng: 100 వికెట్లతో బుమ్రా అరుదైన రికార్డు.. విదేశీ గడ్డపై..
India Vs England 5th Test: టీమిండియా స్టార్ పేసర్, తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సేనా దేశాల్లో(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై 36, ఆస్ట్రేలియాలో 32, న్యూజిలాండ్లో ఆరు, సఫారీ గడ్డపై 26 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ సేనా దేశాల్లో 100 వికెట్లు తీసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు బుమ్రా కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. WHAT. A. JAFFA. 🔥#TeamIndia needed something special to break this ominous opening partnership, and Bumrah delivered 🤩 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/6TCIm8TY62 — Sony Sports Network (@SonySportsNetwk) July 4, 2022 ఇక ఈ మ్యాచ్లో మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగోరోజు అంతా తలకిందులైంది. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ చివరి రోజు మరో 119 పరుగులు చేస్తే చాలు! మ్యాచ్ టీమిండియా చేజారుతుంది. అలాగే సిరీస్ సమమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగో రోజు ఆట వరకు మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: IND VS ENG: తొలి టీ20కి కోచ్గా లక్ష్మణ్.. ద్రవిడ్కు ఏమైంది..? A rapid 5️⃣0️⃣ @aleesy14 🔥 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/PIsXWRZlTP — England Cricket (@englandcricket) July 4, 2022 -
కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. 40 ఏళ్ల తర్వాత..!
టెస్టుల్లో ఇంగ్లండ్పై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కరోనా కారణంగా గతేడాది ఇంగ్లండ్తో వాయిదా పడిన ఐదో టెస్టు ఎడ్డ్బాస్టన్ వేదికగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్తో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు 1981-82 ఇంగ్లండ్ సిరీస్లో భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇంగ్లండ్పై 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా సిరీస్లో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఇక 14 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ICC Player Of Month Nominations: ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే -
Ind Vs Eng: ఇంగ్లండ్తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా?
Ind Vs Eng Test- Aakash Chopra Comments on Jasprit Bumrah Likely To Lead Team India: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు సారథిగా జస్ప్రీత్ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ తర్వాత కెప్టెన్గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్గా బుమ్రా నిలవనున్నాడు. అయితే, కొంతమంది మాత్రం బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ఏ స్థాయిలోనూ.. ఏ ఫార్మాట్లోనూ ఇంత వరకు కెప్టెన్గా పనిచేయని కారణంగా అతడు ఏ మేరకు రాణిస్తాడో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లకు మెదడు తక్కువా? కానేకాదు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఎడ్జ్బాస్టన్ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయితే.. నిజంగా అది పెద్ద విషయమే. అంతేకాదు అతడికి దక్కే గొప్ప గౌరవం కూడా! ఒక బౌలర్ కెప్టెన్ ఎందుకు కాకూడదని చాలా మంది అడుగుతూ ఉంటారు? అంతేకాదు బౌలర్లకు ఏమైనా బ్రెయిన్ తక్కువగా ఉంటుందా? వారు జట్టును ముందుకు నడిపించే వ్యూహాలు రచించలేరా? అంటే కాదనే చెప్తాను. నిజానికి బ్యాటర్ల కంటే బౌలర్ల మెదళ్లు మరింత చురుగ్గా పని చేస్తాయి. ఎందుకంటే.. వాళ్లు తమ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్ల ఆట తీరును గమనిస్తూ ఉంటారు. పని భారాన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటారు. ఎవరికి ఎలా బౌలింగ్ చేయాలో ప్రణాళికలు రచించుకుంటారు. ఇది ఎంతో అత్యుత్తమైన జాబ్! కాబట్టి బౌలర్లు మంచి కెప్టెన్లు కారన్న అపోహ నుంచి బయటపడాలి’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో బౌలర్ అనిల్ కుంబ్లే తదితరులు టీమిండియాకు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సమకాలీన క్రికెట్లో మేటి జట్టు అయిన ఆస్ట్రేలియాకు పేసర్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఉన్నాడు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
'సంజూ శాంసన్లో అదే పెద్ద మైనస్.. అందుకే'
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఒకటి రెండు మ్యాచ్ల్లో బాగా ఆడుతాడని.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన కొనసాగించడంలో విఫలమవుతాడని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ''రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదు. అన్ని విభాగాల్లోకెల్లా మనకు నలుగురు వికెట్ కీపర్లు అందుబాటులో ఉంటారు. ఆ నలుగురే సంజూ శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఇషాన్ కిషన్లు. విడివిడిగా చూస్తే ఈ నలుగురు ఎవరికి వారే. బ్యాటింగ్, స్టంపింగ్ చేయడంలో మంచి నైపుణ్యం కలిగినవారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉంది. అయితే నా దృష్టిలో ఒక వికెట్ కీపర్ మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడు. ఆ క్రికెటర్ సంజూ శాంసన్. కెప్టెన్గా అతను సమర్థుడే కావొచ్చు.. టాలెంట్కు కొదువ లేదు. కానీ వరుసగా అవకాశాలు ఇస్తే సంజూ ఒకటి రెండు మ్యాచ్ల్లో మంచి ఇన్నింగ్స్లు ఆడినప్పటికి.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న మైనస్ పాయింట్.'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అద్బుత ప్రదర్శనతో రన్నరప్గా నిలిచింది. సంజూ కెప్టెన్సీలో లీగ్ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్తాన్ రెండో సారి ఫైనల్ చేరినప్పటికి.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 17 మ్యాచ్ల్లో 863 పరుగులు చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. బట్లర్ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: దినేశ్ కార్తీక్ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
పేరు పెద్దదే.. కానీ ఆటే: కోహ్లి, రోహిత్పై టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ విమర్శలు గుప్పించారు. ఈ ముగ్గురు జట్టుకు అవసరమైన సమయంలో చేతులెత్తేస్తున్నారని పెదవి విరిచారు. ఇకనైనా వీరు ముగ్గురు బాధ్యతాయుతంగా ఆడాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్ ఫామ్లేమి జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కాబట్టి వారు ఇప్పటికైనా ఆటను మెరుగుపరచుకోవాలని హితవు పలికారు. కోహ్లి, రోహిత్ ఫ్లాప్ షో! కాగా గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఐపీఎల్-2022లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ 341 పరుగులు చేస్తే... ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేగాక అతడి సారథ్యంలోని ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఘోర వైఫల్యంతో ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగించిన వీరిద్దరు దక్షిణాఫ్రికాతో సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి, రోహిత్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో వైస్ కెప్టెన్ ప్రొటిస్తో టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కపిల్ దేవ్ సత్తా ఉంది.. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో కోహ్లి, రాహుల్, రోహిత్ను ఉద్దేశించి కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఒత్తిడి సహజం. అయితే, కేవలం దానిని సాకుగా చూపితే సరిపోదు. ఒత్తిడిని అధిగమించి బ్యాట్ ఝులిపించగలగాలి. వాళ్లకు 150-160 స్ట్రైకు రేటుతో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. కానీ, ఎప్పుడైతే వాళ్లు మెరుగైన స్కోరు సాధించాలని మనం కోరుకుంటామో అప్పుడే చేతులెత్తేస్తారు. అప్పుడు ఒత్తిడి ఇంకాస్త ఎక్కువవుతుంది’’ అని అనకట్ యూట్యూబ్ చానెల్తో కపిల్ దేవ్ పేర్కొన్నారు. అలా అయితే అన్యాయం చేసినట్లే! అదే విధంగా కేఎల్ రాహుల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ ఆశిస్తున్నామన్న కపిల్ దేవ్.. ఐపీఎల్ క్వాలిఫైయర్-1లో ఆర్సీబీతో మ్యాచ్లో అతడి ఆట తీరును ప్రస్తావించారు. ‘‘కేఎల్ రాహుల్ గురించి చెప్పాలంటే.. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలని మేనేజ్మెంట్ కోరుకుందంటే.. దాని అర్థం కేవలం 60 పరుగులు చేసి నాటౌట్గా నిలవడం కాదు. ఇలా చేస్తే జట్టుకు అన్యాయం చేసినట్లే. ఆడే విధానం మార్చుకోవాలి. ఒకవేళ అలా కుదురకపోతే ఆటగాళ్లను మార్చేయాలి. భారీ అంచనాలు ఉన్న ఆటగాడు బాగా ఆడతాడనే ఎవరైనా ఊహిస్తారు.పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు రాణించాలి కూడా’’ అని కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన రాహుల్.. జట్టును తొలి సీజన్లో ప్లే ఆఫ్స్ చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్లలో ఎక్కువ బంతులు తీసుకుని తక్కువ స్కోరు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి👉🏾Test Cricket: రూట్ త్వరలోనే సచిన్ రికార్డు బద్దలు కొడతాడు: ఆసీస్ మాజీ కెప్టెన్ చదవండి👉🏾IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్కు నో ఛాన్స్..! -
రాజకీయాల్లోకి కపిల్ దేవ్..?
భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ (1983) అందించిన దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ పొలిటికల్ ఎంట్రీపై గతకొంత కాలంగా వివిధ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై హర్యానా హరికేన్ స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు రాజకీయాల పట్ల ఆసక్తే లేదని చెప్పుకొచ్చాడు. కొంతమంది ఇలా ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తుండటం బాధాకరమని అన్నాడు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఇన్స్టా వేదికగా స్పష్టం చేశాడు. కాగా, ఈ టీమిండియా మాజీ కెప్టెన్ పలువురు రాజకీయ నాయకులతో టచ్లో ఉన్నాడని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కపిల్ బీజేపీలో చేరుతున్నాడని కొందరు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నాడని మరికొందరు ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కపిల్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పని కట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారు. కపిల్ బీజేపీలో చేరి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు వెళ్తారని, అలాగే ఆప్లో చేరి హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. -
సంచలనం, భారత్లో ఎయిర్టెల్ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా!
న్యూఢిల్లీ: అధునాతన 5జీ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తే చాలా అంశాలను సాధ్యం చేసుకునేందుకు అవకాశం ఉందని టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. ఇందులో భాగంగా 1983 క్రికెట్ వరల్డ్ కప్లో దిగ్గజం కపిల్దేవ్ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా స్టేడియంలో చూస్తున్న అనుభూతిని కలిగించేలా ప్రదర్శన నిర్వహించింది. దీని కోసం 5జీ సాంకేతికతతో కపిల్దేవ్ వర్చువల్ అవతార్ హోలోగ్రామ్ రూపొందించింది. రియల్ టైమ్లో ఆడియన్స్తో సంభాషిస్తున్న అనుభూతి కల్పించింది. ఈ ప్రదర్శన సందర్భంగా వర్చువల్ రూపంలో స్టేజీపైన ప్రత్యక్షమైన కపిల్దేవ్, ఆడియన్స్తో సంభా షించడంతో పాటు అప్ప ట్లో ఇన్నింగ్స్ గురించిన విశేషాలు కూడా వివరించారు. సెకనుకు 1 గిగాబిట్ స్పీడ్ ఇంటర్నెట్ వేగంతో ఏకకాలంలో 50 మంది యూజర్లు తమ 5జీ స్మార్ట్ఫోన్లలో 4కే నాణ్యతతో దీన్ని వీక్షించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. 2022–23లో 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. -
Ben Stokes: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. క్రికెట్ దిగ్గజాలతో పాటుగా..
England Tour Of West Indies 2022- Ben Stokes Century: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ బాది ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. క్రికెట్ దిగ్గజాలు సర్ గ్యారీ సోబర్స్, సర్ ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు.. 150కి పైగా వికెట్లు సాధించిన టాప్-5 ఆల్రౌండర్లు ►గ్యారీ సోబర్స్ – 8032 పరుగులు, 235 వికెట్లు- 93 టెస్టుల్లో ►ఇయాన్ బోథమ్– 5200 పరుగులు, 383 వికెట్లు- 102 టెస్టుల్లో ►కపిల్ దేవ్– 5248 పరుగులు, 434 వికెట్లు- 131 టెస్టుల్లో ►జాక్వస్ కలిస్– 13289 పరుగులు, 292 వికెట్లు- 166 టెస్టుల్లో ►బెన్ స్టోక్స్- 5005* పరుగులు, 170 వికెట్లు, 78 టెస్టుల్లో Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 చదవండి: Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్ చెంప చెల్లుమనిపిస్తా: అక్తర్ -
Ind Vs Sl: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆటే ఇష్టం.. ఎందుకంటే: కపిల్ దేవ్
Kapil Dev Comments On Jadeja: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలవడమే గాక.. 9 వికెట్లు కూల్చి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్గా జడ్డూ భాయ్ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, వరల్డ్కప్ విజేత కపిల్ దేవ్.. జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త తరం క్రికెటర్లలో జడ్డూ ఆట తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లోని సర్వోదయ ఆస్పత్రిలో జాయింట్ రీప్లేస్మెంట్ రోబో ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘జడేజా ఒత్తిడి లేకుండా ఆడతాడు. అందుకే నవతరం క్రికెటర్లలో అతడి ఆట అంటేనే నాకు ఇష్టం. తను క్రికెట్ను పూర్తిగా ఆస్వాదిస్తాడు. బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ అద్బుతంగా రాణించగలడు. ఫీల్డింగ్లోనూ తనకు తానే సాటి. నిజానికి ఓ ఆటగాడు ఒత్తిడికి గురైనట్లయితే ఇవన్నీ చేయలేడు. ఒత్తిడిని అధిగమించాడు కాబట్టే జడేజా మంచి ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాడు’’ అని కపిల్ జడేజాకు కితాబిచ్చారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రిషభ్ పంత్ టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు. చదవండి: Ind Vs Sl- Rishabh Pant: ఫార్మాట్ ఏదైతే నాకేంటి! పంత్ అరుదైన రికార్డు.. ధోని, గిల్క్రిస్ట్లను ‘దాటేశాడు’! ఇంకా.. A round of applause 👏👏 for @imjadeja for his Man of the Match performance 🔝 Victory for #TeamIndia indeed tastes sweet 🍰😉#INDvSL @Paytm pic.twitter.com/8RnNN7r38w — BCCI (@BCCI) March 6, 2022 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 -
అశ్విన్ ఖాతాలో మరో మైలురాయి.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో అసలంకను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ సాధించాడు. తద్వారా అశ్విన్.. టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్(434 వికెట్లు) రికార్డును బద్దలుకొట్టాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే 619 వికెట్లతో ఉండగా.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్( శ్రీలంక, 800 వికెట్లు), దివంగత మాజీ దిగ్గజం షేన్ వార్న్(708 వికెట్లు, ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్, 640 వికెట్లు), అనిల్ కుంబ్లే( 619 వికెట్లు, టీమిండియా), గ్లెన్ మెక్గ్రాత్(563 వికెట్లు, ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్( 537 వికెట్లు, ఇంగ్లండ్), కౌట్నీ వాల్ష్(వెస్టిండీస్, 519 వికెట్లు), డేల్ స్టెయిన్(439 వికెట్లు, దక్షిణాఫ్రికా) ఉన్నారు.. తాజాగా అశ్విన్(435 వికెట్లు, టీమిండియా) వీరి సరసన చేరాడు. చదవండి: Jasprit Bumrah: వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్ సూపర్ Ravindra Jadeja: ఆ నిర్ణయం నాదే.. రోహిత్, ద్రవిడ్ల పాత్ర లేదు 🎥 🎥 That moment when @ashwinravi99 picked the landmark 4⃣3⃣5⃣th Test wicket 👏 👏 #TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/RKN3IguW8k — BCCI (@BCCI) March 6, 2022 -
IND VS SL 1st Test: కపిల్ రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో ఐదు వికెట్ల దూరంలో..!
మొహాలీ వేదికగా ఈనెల 4 నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న తొలి టెస్ట్కు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో అశ్విన్ మరో ఐదు వికెట్లు తీస్తే.. లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొడతాడు. కపిల్ 131 టెస్ట్ల్లో 434 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ కేవలం 84 మ్యాచ్ల్లోనే 430 వికెట్లు పడగొట్టి కపిల్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 టెస్ట్ల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్.. కపిల్ రికార్డును బద్దలు కొట్టే క్రమంలో మరో ఇద్దరు దిగ్గజ బౌలర్ల రికార్డులను కూడా అధిగమించనున్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే న్యూజిలాండ్ మాజీ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టులలో 431 వికెట్లు)ని, మూడు వికెట్లు తీస్తే శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు)లను అధిగమిస్తాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్ల్లో 800 వికెట్లు), ఆసీస్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్ల్లో 640 వికెట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా, ప్రస్తుతానికి ఈ జాబితాలో అశ్విన్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, లంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో అశ్విన్ మరో 10 వికెట్లు తీయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సిరీస్లో అశ్విన్ 10 వికెట్ల మార్కును దాటగలిగితే సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (93 టెస్ట్ల్లో 439 వికెట్లు)ను వెనక్కునెట్టి టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకుతాడు. స్వదేశంలో టెస్ట్ల్లో ఘనమైన రికార్డు కలిగిన అశ్విన్కు ఈ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇదిలా ఉంటే, ఈ రికార్డులతో పాటు అశ్విన్ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. లంకపై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ జాబితాలో అనిల్ కుంబ్లే (18 మ్యాచ్ల్లో 73 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో హర్భజన్ (16 మ్యాచ్ల్లో 53 వికెట్లు), అశ్విన్ (9 టెస్ట్ల్లో 50 వికెట్) ఉన్నారు. లంకతో సిరీస్లో యాష్ మరో నాలుగు వికెట్లు తీస్తే భజ్జీని అధిగమిస్తాడు. ఈ సిరీస్లో బౌలింగ్ రికార్డులతో పాటు ఓ బ్యాటింగ్ రికార్డుపై కూడా యాష్ గురిపెట్టాడు. లంకపై మరో 166 పరుగులు చేస్తే టెస్ట్ల్లో 3000 పరుగుల మైలరాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం అశ్విన్.. 120 ఇన్నింగ్స్ల్లో 2844 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: రోహిత్ శర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోహ్లి చిన్ననాటి కోచ్..! -
అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది?
టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మరి అంతలా షేక్ చేస్తున్న ఆ ఫోటోలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1992 వరల్డ్కప్కు సంబంధించి ప్రతిష్టాత్మక సిడ్నీ హార్బర్లో దిగిన రెండు ఫోటోలను అజారుద్దీన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. తొలి ఫోటోలో ఆ వరల్డ్కప్లో పాల్గొన్న తొమ్మిది దేశాల కెప్టెన్లు.. ఇక రెండో ఫోటోలో టీమ్కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అజారుద్దీన్.. ''1992 వరల్డ్కప్ ఆస్ట్రేలియా. సిడ్నీ హార్బర్ వేదికగా జట్లతో పాటు కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. అయితే ఈ ఫోటోలో ఒక గ్రేట్ ఆల్రౌండర్ మిస్ అయ్యాడు.. ఎవరో కనుక్కోండి'' అని క్యాప్షన్ జత చేశాడు. అజారుద్దీన్ ఎవరి గురించి చెబుతున్నాడో క్రికెట్ ఫ్యాన్స్ పసిగట్టేశారు. మిస్ అయింది ఎవరో కాదు.. టీమిండియా గ్రేట్స్ట్ ఆల్రౌండర్ కపిల్ దేవ్. ఎమర్జెన్సీ పని ఉండడంతో కపిల్ దేవ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కపిల్ జీ ఈ ఫోటోషూట్కు మిస్సయ్యాడు. అజారుద్దీన్ షేర్ చేసిన ఫోటోను 12,500 మంది వీక్షించారు. వేలాది మంది కపిల్ దేవ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 1992 ప్రపంచకప్ను పాకిస్తాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్ను 22 పరుగుల తేడాతో ఓడించి పాక్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగాటోర్నీలో టీమిండియా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన టోర్నీలో టీమిండియా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. లీగ్ దశలో పాకిస్తాన్పై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించడం ఒక్కటే గొప్పగా చెప్పుకోవచ్చు. చదవండి: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ కోహ్లి నా సాయం కోరాడు.. సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడు 1992 World Cup in Australia. At Sydney Harbour with the teams and their captains. The greatest all rounder is missing in the picture. Can you guess who? pic.twitter.com/JU0dPAyR2q — Mohammed Azharuddin (@azharflicks) February 23, 2022 -
"కపిల్ దేవ్ కోసం వెతకడం ఆపండి.. వాళ్లపై దృష్టిపెట్టండి"
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరన్నది అందరి మెదడులని తొలుస్తున్న ప్రశ్న. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. కపిల్ దేవ్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత్కు దొరకకపోతే, తర్వాత ఏమి చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని గంభీర్ తెలిపాడు. "భారత జట్టులో కపిల్ దేవ్లాంటి ఆల్రౌండర్ లేరని మనకు తెలుసు. జట్టులో లేని దానికోసం ప్రయత్నించకూడదు. ఈ నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. తదుపరి కపిల్ దేవ్ను వెతికే ప్రయత్నాలనుంచి భారత్ బ్రేక్ తీసుకోవాలి. జట్టును నడపించగల సత్తా ఉన్న ఆటడాడికి భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి. ఇక క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయిలో కాకుండా దేశీయ స్థాయిలోనే అత్యత్తుమ ఆటగాడిగా తీర్చిదిద్దాలి. రంజీ ట్రోఫీ స్థాయిలో క్రికెటర్లను అభివృద్ధి చేయాలి. అనంతరం వారికి అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం ఇవ్వండి. విజయ్ శంకర్, శివమ్ దూబే, వెంకటేష్ అయ్యర్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు అక్కడి నుంచి వచ్చిన వారే" అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
కోహ్లి ఇగో వదిలేయాలి.. వాళ్ల కెప్టెన్సీలో ఆడాలి: టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
Virat Kohli Quit Test Captaincy: టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లి ప్రస్థానం పూర్తిగా ముగిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్గా రోహిత్ శర్మ ఇప్పటికే పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి ఎవరన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో కోహ్లి ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు గాయం కారణంగా హిట్మ్యాన్ దూరం కాగా.. రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. ఈ జట్టులో కోహ్లి సభ్యుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్, అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు. ఒత్తిడికి లోనయ్యాడు.. తాజా పరిణామాల గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న నాటి నుంచి అతడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. బ్యాటర్గా తను మరింత స్వేచ్చగా ఆడటానికి కెప్టెన్సీ వదులుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈ ఆప్షన్ను తను ఎంచుకోవడం మంచిదే. తను పరిణతి కలిగిన వాడు. ఇంతటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటాడు. కెప్టెన్సీని భారంగా భావించినట్లున్నాడు. అందుకే ఇలా చేసి ఉంటాడు. అయితే, ఒక విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. కోహ్లి ఇప్పుడు తన ఇగోను వదిలేసి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సిన పరిస్థితి. నిజానికి సునిల్ గావస్కర్ నా సారథ్యంలో ఆడాడు. నేను క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఆడాను. నామోషీ అనుకోలేదు. కోహ్లి కూడా అంతే. అహాన్ని పక్కన పెట్టాలి. భారత క్రికెట్ను ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేయాలి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లకు అతడు దిశా నిర్దేశం చేయాలి. ఒక బ్యాటర్గా కోహ్లి సేవలను కోల్పోవడం అంటే భారత జట్టుకు తీర్చలేని లోటు. కాబట్టి తను ఆడాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మిడ్ డేతో కపిల్ దేవ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం! India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే... -
బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన
Seventh Five Wicket Haul For Bumrah 27 Test Joins Elite List.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. కేప్టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించాడు. కేప్టౌన్లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్ 2010-11లో ఏడు వికెట్లు తీయగా.. అదే మ్యాచ్లో శ్రీశాంత్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. ఇక 27 టెస్టుల్లో అత్యధికంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించిన బుమ్రా కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. A five-wicket haul for Jasprit Bumrah and South Africa's innings is wrapped up for 210 👏🏻 India lead by a slender 13 runs. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/cmqKWckoIX — ICC (@ICC) January 12, 2022 -
83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు
Super Star Rajinikanth Reaction On 83 Movie: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్గా మారిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. నిమా తెరకెక్కించిన చిత్ర బృందానికి, ముఖ్యంగా కపిల్ దేవ్ను యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన రణ్వీర్ సింగ్కు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 83 సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ చిత్రాన్ని పొగడ్తలతో బౌండరీలు దాటించారు. 'వావ్ వాట్ ఏ మూవీ.. అద్భుతం..' అంటూ ఆకాశానికెత్తారు రజనీ కాంత్. అలాగే నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్. ఈ ట్వీట్లో చిత్ర నిర్మాత కబీర్ ఖాన్, కపిల్ దేవ్, హీరో రణ్వీర్ సింగ్, నటుడు జీవాను మెన్షన్ చేశారు. #83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew … — Rajinikanth (@rajinikanth) December 28, 2021 ఇదీ చదవండి: 1983 వరల్డ్ కప్ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ -
'83' సినిమా రివ్యూ
టైటిల్: 83 నటీనటులు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్ భాసిన్, చిరాగ్ పాటిల్, సాకిబ్ సలీమ్ తదితరులు దర్శకుడు: కబీర్ ఖాన్ నిర్మాతలు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణు వర్దన్ ఇందూరి, సాజిద్ నడియడ్వాలా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ అసీమ్ మిశ్రా ఎడిటింగ్ నితిన్ బెద్ సంగీతం: జూలియస్ పేకియం స్వరాలు: ప్రీతమ్ విడుదల: డిసెంబర్ 24, 2021 క్రికెట్ను గ్రౌండ్లో, టీవీల్లో చూసి ఎంజాయ్ చేయడమే కాదు సినిమాగా వెండితెరపై ఆవిష్కరించిన అంతే ఉత్సాహం చూపిస్తారు అభిమానులు. క్రికెట్.. అంటే కేవలం ఒక ఆట కాదు. ఎందరో అభిమానులకు అది ఒక ఎమోషన్. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం క్రికెట్. ఈ మతం 1983 భారత క్రికెట్ టీమ్ సాధించిన వరల్డ్ కప్తో పునాది వేసుకుందని చెప్పవచ్చు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించిన తాజా సినిమా '83'. ఈ సినిమాలో భారతదేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా జర్నీని వెండితెరపై ఆవిష్కరించారు. అప్పుడు జరిగిన మ్యాచ్ను కొంతమంది టీవీల్లో వీక్షించగా.. మరికొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ గెలుపుగా భావించి సంబురాలు చేసుకున్నారు. తర్వాతి తరానికి 25 జూన్, 1983 ఒక చరిత్ర. ఆ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. మరీ ఈ రోజు విడుదలైన '83' సినిమా ఎలా ఉందంటే? కథ: 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇండియా టీమ్ను ఒక జట్టుగా కూడా చూడలేదు క్రికెట్ ప్రపంచం. అనేక అవమానాలు అడుగడునా ఎదుర్కొన్న భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్పై ఎలాంటి అంచనాలు లేని భారత్ గెలిచి వరల్డ్ కప్ ఎలా కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లకు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్ ఎలా ఉంది. వరల్డ్ కప్ గురించి ఇండియన్ క్రికేట్ టీమ్ సభ్యులు ఏమనుకున్నారు. కప్ గెలవడానికి ముందు క్రికెట్లో ఇండియాను భారతీయులు, విదేశీయులు ఎలా చూశారనేదే 83 చిత్రం కథ(83 movie review). విశ్లేషణ: క్రికెట్లో తమకంటూ ఒక స్థానం ఉండాలని పరితపించిన సగటు భారతీయుడి కథ ఇది. 1983 వరల్డ్ కప్ను భారత్ గెలుచుకోవడం ఒక భావోద్వేగపు సంఘటన. అందుకే దీన్ని ఒక సినిమాలా చూడలేం. సగటు సినీ ప్రేక్షకుడిగా కాకుండా క్రికెట్ ఆడే చిన్న పిల్లాడిలా చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 1983లో హర్యనా హరికేన్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుడికి కథ ఎలాగు ముందే తెలుసు. కాబట్టి తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే సినిమా బాగా కనెక్ట్ కావాలి. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పటి ఎమోషన్ను కళ్లకు కట్టనట్లు చూపించాలి. ఆ ఎమోషన్ను సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కొనసాగించడంలో దర్శకుడు కబీర్ ఖాన్ కొంతవరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం నుంచి కప్ గెలిచే వరకూ భారత్ ఎలా నిలదొక్కుకుందని దర్శకుడు బాగా చూపించాడు. అప్పటివరకు ఇండియాలో మత ఘర్షణలు అనేకంగా జరిగేవి. ఈ మత ఘర్షణలకు ఒక్కసారిగా ముగింపు పలికింది 1983 వరల్డ్ కప్. ఈ అంశాన్ని తెరపై ఆవిష్కరించి విజయం సాధించాడు కబీర్ ఖాన్. ఈ సినిమాలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ ఆర్మీ ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్లో పనిచేస్తున్న భారతీయుల ఎమోషన్, పలు చోట్ల అల్లర్లను సినిమాలో సాధ్యమైనంత వరకూ బాగానే చూపించారు. అయితే కపిల్ భార్య రోమి భాటియా, మదన్ లాల్ భార్య అను మోహన్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందని స్టేడియం నుంచి హోటల్కు వెళతారు. ఈ దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ స్లోగా నడిచినట్లు అనిపించినా.. సెకాండాఫ్ మాత్రం బాగుంటుంది. క్యాస్టింగ్, సాంకేతికంగా బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అప్పటి కాలాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్, కమెరా పనితనం మొత్తంగా చిత్ర బృందం ఎఫర్ట్ స్క్రీన్పై కనిపించింది. చిత్రంలో 1983 వరల్డ్ కప్లో జరిగిన పలు దృశ్యాలను చూపించడం బాగుంది. అప్పటి మ్యాచ్ను మళ్లీ లైవ్లో చూసిన అనుభూతిని ఇస్తుంది. సినిమాలో అక్కడక్కడ పలువురు ప్రముఖ క్రికెటర్లు కనిపించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే ? సినిమాలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి వంటి భారీ తారగణంతో అప్పటి విజయాన్ని తెరపై చూపించిన ప్రయత్నమిది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. గెటప్ దగ్గర నుంచి ఆట ఆడే తీరు వరకు కపిల్ను దింపేశాడు రణ్వీర్ సింగ్. ఆ పాత్రకు ఏం చేయాలో అంతా చేసి విజయం సాధించాడు. కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రభావం సినిమాలో అంతగా కనిపించదు. మాన్ సింగ్గా పంకజ్ త్రిపాఠికి మరో ఛాలెంజ్ రోల్ దక్కింది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశాడు పంకజ్ త్రిపాఠి. క్రిష్ణమాచారి శ్రీకాంత్గా జీవా తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. రణ్వీర్ సింగ్కు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పగా.. జీవాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయింది. మొహిందర్ అమర్నాథ్ పాత్రలో సాకీబ్ నటించగా.. అతడి తండ్రి పాత్ర లాలా అమర్నాథ్గా మొహిందర్ అమర్నాథ్ నటించడం విశేషం. అలాగే సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ నటించాడు. 1983 వరల్డ్ కప్ విశేషాలు, హైలెట్స్, అభిమానుల సందడి ఎలా ఉందో చూడాలంటే '83' చిత్రం మంచి ఎంపిక. -
కపిల్దేవ్తో కింగ్ నాగార్జున.. 83 ప్రెస్మీట్లో స్టార్స్ సందడి
-
38 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ క్షణాలు.. కపిల్ దేవ్ భావోద్వేగపు వ్యాఖ్యలు
‘‘1983 జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో నా సార థ్యంలోని భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచిన క్షణాలు మరచిపోలేనివి. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకోన్, సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘1983లో ఇండియా వరల్డ్ కప్ గెలవగానే భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ‘83’ ట్రైలర్ చూశాక కపిల్ దేవ్ నటించారా? అనిపించింది. ఆ పాత్రలో రణ్వీర్ అంతలా ఒదిగిపోయారు’’ అన్నారు. రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ– ‘‘కపిల్దేవ్లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు. విష్ణు ఇందూరి మాట్లాడుతూ– ‘‘83’ రషెస్ చూసుకున్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి.. అంతలా ఈ చిత్రంలోని భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశాడు. నేను, నాగార్జున ఇంజినీరింగ్లో క్లాస్మేట్స్. కాలేజ్లో సైలెంట్గా ఉన్న నాగ్.. ‘శివ’తో వైలెంట్గా ట్రెండ్ సెట్ చేశాడు’’ అన్నారు. కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం కపిల్తో పాటు అప్పటి టీమ్ని కలిసి సలహాలు తీసుకున్నాను. అప్పటి వార్తా కథనాలనూ రిఫరెన్స్గా తీసుకున్నాను. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న క్షణాలు, ఆ తర్వాత పరిస్థితులను చూపించాం’’ అన్నారు. ‘‘అందరూ... ముఖ్యంగా యువతరం చూడాల్సిన సినిమా ఇది’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సుభాశిష్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
1983 వరల్డ్కప్: టీమిండియా సభ్యుల మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో '1983' సంవత్సరం ఒక పెను సంచలనం. దేశంలో క్రికెట్ను పిచ్చిగా అభిమానించే స్థాయికి కారణమైన ఏడాది. క్రికెట్లో ఉండే మజాను భారత అభిమానులకు పరిచయం చేసింది ఆ సంవత్సరం. 1983 వన్డే ప్రపంచకప్లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్లో కపిల్ డెవిల్స్ సాధించిన 1983 వరల్డ్కప్ను బేస్ చేసుకొని కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' సినిమా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ మధ్యన విడుదలైన ట్రైలర్తో తెరపై ఒక అద్భుతం చూపించబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కపిల్ దేవ్గా రణ్వీర్సింగ్ నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న '83' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవడం ఖామమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగారాసే అవకాశముందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా సంచలనం చేస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. 1983 ప్రపంచకప్లో టీమిండియా జట్టు సభ్యుల పారితోషికం విలువ సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. చదవండి: 83 Movie Trailer Out: '83' ట్రైలర్ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు ఇప్పుడంటే టీమిండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ.. క్రికెట్ను కనుసైగలతో శాసిస్తోంది. ఏకంగా ఐసీసీని కూడా ఒప్పించగల శక్తి ఉంది. మరి 1983 ప్రపంచకప్లో పాల్గొన్న టీమిండియా జట్టు సభ్యుల రోజువారి అలవెన్స్, మ్యాచ్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. అప్పట్లో కపిల్ సేనకు ఒక్కో మ్యాచ్కు ఫీజు రూ. 1500, అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున మూడురోజులకు గానూ రూ.600.. మొత్తంగా రూ.2100 అందించారు. ఆ ప్రపంచకప్లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ జట్టు సభ్యులు ప్రతీసారి రూ.2100 మాత్రమే అందుకోవడం విశేషం. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. 2019లో మర్కండ్ వెయిన్గాంకర్ అనే జర్నలిస్ట్.. 1983 వరల్డ్కప్ టీమిండియా జట్టు 14 మంది సభ్యుల వేతనాలకు సంబంధించిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అప్పటి ఆటగాడు కనీస విలువ రూ.10 కోట్లుగా ఉంటుంది. అని చెప్పడం వైరల్గా మారింది. తాజాగా '83' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆటగాళ్ల వేతనాల ఫోటోను షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా 83 సినిమా నేపథ్యంలో 1983 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ అయిన కపిల్దేవ్ సేనకు సినిమా టీమ్ ప్రత్యేకంగా రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. ఈ మేరకు కెప్టెన్ అయిన కపిల్ దేవ్ రూ. 5 కోట్లు తీసుకోనున్నాడని.. మిగతా రూ. 10 కోట్లను జట్టులోని మిగతా 13 మంది సభ్యలకు సమానంగా పంచనున్నట్లు సమాచారం. Each one of them deserve 10 Cr. pic.twitter.com/BzBYSgqit6 — Makarand Waingankar (@wmakarand) July 16, 2019 ఇక ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్కు ఇస్తున్న పారితోషికం ఈ విధంగా ఉంది ►ఒక టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్కు రూ.6 లక్షలు.. టి20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అందుతుంది. ►సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాడికి ఏడాదికి గానూ రూ. 7 కోట్లు.. ఇక గ్రేడ్ ఏ కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. కోటి అందజేస్తున్నారు ►ఒక మ్యాచ్లో ఎవరైనా బ్యాట్స్మన్ డబుల్ సెంచరీ సాధిస్తే రూ. 7 లక్షలు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్కు.. టెస్టులో సెంచరీ సాధించిన బ్యాట్స్మన్కు రూ. 5లక్షలు అదనంగా ఇస్తున్నారు. 1983 ప్రపంచకప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొలుత ఓటములు ఎదురైనప్పటికీ బెరుకు లేకుండా ముందుకు సాగుతూ ఒక్క మెట్టు ఎక్కింది. చూస్తుండగానే సెమీస్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. ఫైనల్కు ముందు ''టీమిండియా ఇంతవరకు రావడమే గొప్ప.. బలమైన విండీస్ను మీరు ఓడించలేరు.. వట్టి చేతులతో ఇంటికి వెళ్లండి'' అంటూ పలువురు అవమానకరంగా మాట్లాడారు. వీటన్నింటిని ఒక చాలెంజ్గా స్వీకరించిన భారత్ ఫైనల్లో విండీస్తో పోరాడైనా కప్ సాధించాలనుకుంది. జూన్ 25, 1983న జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన విండీస్ బౌలర్ల దాటికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకేముంది ఈసారి కూడా టైటిల్ విండీస్దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్లైవ్ లాయిడ్ సేన బ్యాటింగ్ సాగుతున్న కొద్దీ టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. చివరికి విండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు -
కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు!
Balwinder Sandhu: ‘‘కపిల్లా బ్యాటింగ్ చేయండి.. కపిల్లా ఫీల్డింగ్ చేయండి. కపిల్లా కెప్టెన్సీ చేయండి. అప్పుడే వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్... 2023లో వన్డే ప్రపంచకప్ గెలవగలం’’- వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి సహా భారత ఆటగాళ్లను ఉద్దేశించి 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా సభ్యుడు బల్వీందర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇవి. అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఐసీసీ టైటిల్ గెలుస్తారని.. అందుకోసం అలుపెరుగక కృషి చేయాలని సూచించారు. కాగా భారత్కు మొట్టమొదటి వరల్డ్కప్ అందించిన దిగ్గజ సారథి కపిల్ దేవ్ జీవితం ఆధారంగా.. 1983 వరల్డ్ కప్ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్లో 83 మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ వీక్షించిన సందర్భంగా జీ న్యూస్తో ముచ్చటించిన సంధు.. భారత జట్టును ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ... ‘‘అప్పట్లో మాకు సోషల్ మీడియా లేదు. క్రీడాస్ఫూర్తిలో వివాదాలు కొట్టుకోపోయేవి. ప్రతి ఒక్కరు ఆటపై దృష్టి పెట్టి... కెరీర్లో ముందుకు వెళ్లేవారు. అయితే, చరిత్ర సృష్టించేవాళ్లు కూడా కావాలి కదా. ఆ చరిత్రను చెప్పేవాళ్లు కూడా కావాలి. ఆ మధుర జ్ఞాపకాలను వెండితెర మీద చూడటం సంతోషంగా ఉంది’’ అని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. విమర్శలకు కృంగిపోతే ఏమీ సాధించలేమని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు దరిచేరతాయని యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. నాడు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు బలమైన విండీస్ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ IPL 2022- SRH: సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్దేవ్ సంచలన వాఖ్యలు
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. బీసీసీఐపై చేసిన వాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కోహ్లి బీసీసీఐపై సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని కోహ్లి ఆరోపించాడు. అదే విధంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తనకు ఎవరూ చెప్పలేదు అని కోహ్లి తెలిపాడు. అయితే కోహ్లి చేసిన వాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చిది. ఛీప్ సెలెక్టర్ చేతన్ శర్మ.. కోహ్లితో కెప్టెన్సీ గురించి ముందుగానే చర్చించాడని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కాగా ఈ వివాదంపై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది అని అతడు అభిప్రాయపడ్డాడు. "సెలెక్టర్లు విరాట్ కోహ్లి ఆడినంతగా క్రికెట్ ఆడకపోవచ్చు, కానీ సారథ్య బాధ్యతల గురించి నిర్ణయించే హక్కు వారికి ఉంటుంది. వారు తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం విరాట్ కోహ్లికే కాదు ప్రతీ ఒక్క ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్టు కెప్టెన్సీపై ప్రభావం చూపదని నేను ఆశిస్తున్నాను. విరాట్ ఇప్పుడు కెప్టెన్సీ వివాదాన్ని విడిచిపెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెడతాడని నేను భావిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నాడు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: Ashes 2021-22 Adelaide Test: ఆఖరి నిమిషంలో మార్పు.. పాట్ కమిన్స్ అవుట్.. కెప్టెన్గా మళ్లీ స్టీవ్ స్మిత్! -
కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు
Ranveer Singh and Deepika Padukone's Film 83 in Legal Trouble: టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. చదవండి: బిగ్బాస్పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాదా దీనికి విశేష స్పందన వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి 1983 నాటి ప్రపంచ కప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రంలో రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య రూమీ భాటియాగా దీపికా కనిపించబోతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. -
ఇది సిక్సర్కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు
Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్. ధోనీ చిత్రానికి ఎంత హిట్ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. గత క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ క్రికెట్ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్ను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్ను రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా గ్రామ్లో 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్ ట్రూ స్టోరీ #83 ట్రైలర్ హిందీ భాషలో వచ్చేసింది. డిసెంబర్ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్ చేశాడు. ఈ పోస్ట్పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ షేక్హ్యాండ్ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్ ఏ వావ్... ఇది సిక్సర్ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్వీర్ సింగ్. గూస్బంప్స్ తెప్పించింది. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది. ఇషా డియోల్ 'ఔట్ స్టాండింగ్. రణ్వీర్ సింగ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. -
హార్దిక్ పాండ్యాను ఆల్రౌండర్గా పిలవడం వ్యర్థం
Kapil Dev Dismisses All-rounder Tag For Hardik Pandya.. టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాపై మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. '' హార్దిక్ పాండ్యాను ఆల్రౌండర్ అని పిలవడం ఆపేయండి.. బౌలింగ్ చేయనప్పుడు అతనికి ఆ ట్యాగ్ వ్యర్థం.. వెంటనే తొలగించండి. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్ బౌలింగ్ చేయడం ఒక్కసారి కూడా చూడలేదు. ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అతను బౌలింగ్ చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఇది ఇలాగే ఉంటే బౌలింగ్ పూర్తిగా చేయడం మరిచిపోతాడు. ఇకముందు హార్దిక్ బౌలింగ్ చేయాలంటే చాలా మ్యాచ్ల్లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ 1st Test: 'పాకిస్తాన్ ముర్దాబాద్'.. స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులు ఇక కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ దానిని నిలుపుకోలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం బ్యాటింగ్కే పరిమితమైన హార్దిక్ ఒక్క మ్యాచ్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆల్రౌండర్ అంటేనే అన్ని విభాగాల్లో తన వంతు సాయం అందించాలి. కానీ ఇవేమీ చేయకపోగా జట్టుకు భారంగా మారాడు. దీంతో న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన పాండ్యా ప్రస్తుతం రీహాబిటేషన్ కోసం ఎన్సీఏకు వెళ్లాడు. చదవండి: Shreyas Iyer: దిగ్గజాల సరసన శ్రేయాస్ అయ్యర్.. 16వ ఆటగాడిగా -
కపిల్ దేవ్ బయోపిక్: ఉత్కంఠ రేపుతున్న ‘83’ మూవీ టీజర్
Ranveer Singh 83 Movie Teaser Out:1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా 83 టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్ను వదిలారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ఈ టిజర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కపిల్ దేవ్గా రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్తో ఈ టీజర్ ముగిసింది. ఈ సిన్నివేశంలో చూస్తుంటే క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రాకతప్పదు అనేలా టీజర్ను ఆసక్తిగా మలిచారు మేకర్స్. కాగా ఈ మూవీలో కపిల్ దేవ్గా రణ్వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రొమి భాటియా పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: బిగ్బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో -
ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారు..!
Players Prefer IPL Over Country, Kapil Dev Slams Team India And BCCI: టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీమిండియా నిష్క్రమించడంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్కు ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని విస్మరించే వాళ్లకు ఏం చెప్పలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్లు దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలంటూ హితవు పలికాడు. టీమిండియాకు ఆడాలనుకునేవాళ్లు ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్లో టీమిండియా పేలవ ప్రదర్శనకు తీరిక లేని షెడ్యూలే కారణమని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కపిల్ ఈ మేరకు స్పందించారు. ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న టీమిండియా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. సెమీస్ చేరాలంట అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్లో అఫ్గాన్ ఏదైనా అద్భుతం చేయాలని అంతా ఆశించినప్పటికీ, అలాంటిదేమీ జరగకపోవడంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తొలిసారి నాకౌట్ దశకు చేరకపోవడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు టీమిండియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టీమిండియా నిష్క్రమణపై పాక్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు.. కౌంటరిచ్చిన వసీం జాఫర్ -
కేఎల్ రాహుల్ టీమిండియాకు గొప్ప ఆస్తి...
Kapil Dev Comments on Kl Rahul: భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తిగా అతడు కొనియాడాడు. "యూఏఈలో జరిగే టి20 వరల్డ్ కప్లో రాహుల్ భారత జట్టుకు భారీ ఆస్తిగా మారుతాడు. అలాగే భవిష్యత్తులో భారత్ సాధించే ప్రతీ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు ఆడే షాట్లపై అతనికి చాలా నమ్మకం ఉంది. ఈ మెగా టోర్నీలో రాహుల్ అధ్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను. టి20 ప్రపంచకప్లో భారత్ ఖచ్చితంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తుందని" కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా భారత జట్టుకు మెంటార్గా ఎంపికైన ధోని.. తన అనుభవంతో జట్టును విజయపథంలో నడిపించగలడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. కాగా కెఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్లో భాగంగా జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్పై 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 23 బంతుల్లో మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లోను రాహుల్ 39 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్–12 దశకు శ్రీలంక అర్హత -
అసలు ఇతను కపిల్ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..!
Kapil Dev Channels Ranveer Singh In Hilarious Advertisement: క్రికెట్ దిగ్గజం, భారత్కు తొలి ప్రపంచకప్ అందించిన యోధుడు, లెజండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వెక్కిలి చేష్టలు చేస్తూ, రంగురంగుల దుస్తుల్లో.. భిన్నంగా కనిపించాడు. ఇదంతా చేసింది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' ప్రకటన కోసం కపిల్ ఇలా నటించాడు. ఈ యాడ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్ని అనుకరిస్తూ.. కపిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. Heads, I'm fashionable. Tails, I'm still fashionable. pic.twitter.com/vyKIrmLLOD — Kapil Dev (@therealkapildev) October 15, 2021 క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించి, ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేస్తూ.. సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన సహజత్వానికి భిన్నంగా కపిల్ ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వంటి ప్రముఖులు గతంలో ఈ యాడ్లో సందడి చేశారు. ఇదిలా ఉంటే, కపిల్ దేవ్ టీమిండియాకు 1983 వన్డే ప్రపంచకప్ను అందించిన వైనాన్ని ఆధారంగా చేసుకుని.. రణ్వీర్ సింగ్ హీరోగా 83 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్వీర్ ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు రివర్స్గా కపిల్ కూడా రణ్వీర్ను అనుకరించేందుకు ఈ యాడ్లో నటించినట్లు సమాచారం. ఈ వీడియోను కపిల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఎంతో ఫ్యాషన్గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్గా ఉన్నాను' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. చదవండి: రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం.. -
సారికతో కపిల్దేవ్ బ్రేకప్ లవ్స్టోరీ
ఇద్దరు సెలబ్రిటీలు కలిస్తే భలే ముచ్చటగా ఉంటుంది.. అందునా భిన్నరంగాలకు చెందిన ఇద్దరు. అలా కలసిన వాళ్లే క్రికెట్ స్టార్.. హర్యానా హరికేన్ కపిల్దేవ్.., ఫిల్మ్స్టార్.. బాలీవుడ్ బ్యూటీ సారిక. వీళ్లిద్దరూ ములాఖాత్ అయ్యేలా చేసింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. ఒక పార్టీలో సారికను కపిల్దేవ్కు పరిచయం చేసింది. అలా మొదలైంది ఆ ఇద్దరి మధ్య స్నేహం. విరామ సమయాల్లో కలుసుకోవడమూ స్టార్ట్ చేశారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. బంధంగా ఇమిడేందుకూ సిద్ధపడింది. ఆ టైమ్లో వీళ్ల లవ్ స్టోరీ హల్చల్ కూడా చేసింది. సారిక ముందే రోమీతో ప్రేమాయణం కపిల్దేవ్, సారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలనూ మోసింది మీడియా. నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకెళ్లాడు కపిల్. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇంకేం.. ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా కుతూహలం రేగింది ఇరువురి అభిమానుల్లో. కానీ.. కపిల్ బ్రేక్ చేసుకున్నాడు ఆ బంధాన్ని. కారణం.. సారికకు అతనికి స్పర్థలు రావడం కాదు. రోమీతో స్పర్థలు సర్దుకోవడం. అవును..సారిక.. కపిల్ జీవితంలోకి రాకముందే రోమీతో అతనికి ప్రేమాయణం ఉంది. రోమీ భాటియాను కపిల్కు పరిచయం చేసింది అతని అత్యంత ఆప్తమిత్రుడు సునీల్ భాటియా. సారికకు సారీ చెప్పీ రోమీతో లవ్ తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయాడు కపిల్. ఆమె చురుకుదనం అతన్ని కట్టిపడేసింది. ఆ ప్రేమ అలా సాగుతుండగా.. స్పర్థలు వచ్చాయి. దానికి కారణం.. సారికతో పరిచయం సన్నిహితంగా మెలిగేంత స్నేహంగా మారడమే అంటుంది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఓ కథనం. అందువల్లే రోమీ మనసు నొచ్చుకొని సైలెంట్గా ..కపిల్కు దూరంగా ఉండిపోయిందనీ అంటారు కపిల్, రోమీ దోస్తులు కూడా. కాదు.. కపిల్ ప్రపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఆ మౌనాన్ని కపిల్ అపార్థం చేసుకుని సారికకు దగ్గరయ్యాడనీ చెప్తారు కపిల్ మిత్రులు. సారికతో కపిల్ పెళ్లి అనే వార్తలు వినే రోమీ మళ్లీ కపిల్ను చేరుకుందనీ అంటారు. రోమీని మరచిపోలేని కపిల్ అందుకే వెంటనే సారికకు సారీ చెప్పేసి రోమీ చేయి అందుకున్నాడు.. అని వివరణ ఇస్తారు. కమల్ హాసన్తో ప్రేమలో పడ్డ సారిక ఏమైనా ఈ మొత్తం వ్యవహారం సారికను షాక్కి గురిచేసింది. జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. కమల్ హాసన్ స్నేహంతో త్వరగానే అందులోంచి బయటపడింది. అదే సమయంలో కమల్తో ప్రేమలోనూ పడింది సారిక. మళ్లీ రోమీ, కపిల్ ప్రేమ కథకు వస్తే.. పెళ్లి ప్రపోజల్ను ఈసారి కొంచెం సినిమా స్టయిల్లో రోమీ ముందు ఉంచాడట కపిల్. ఎలాగంటే.. ఒకసారి ఇద్దరూ కలసి రైల్లో ప్రయాణిస్తున్నారు (బహుశా ముంబై నుంచి కావచ్చు). సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేసిన కపిల్దేవ్ రైలు ఒక అందమైన ప్రదేశానికి రాగానే.. కపిల్ వెంటనే సీట్లోంచి లేచి.. రోమీ ముందు మోకాళ్ల మీద వంగి.. కిటికీలోంచి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ‘ఈ బ్యూటిఫుల్ ప్లేస్ను ఫొటో తీయగలవా డియర్.. భవిష్యత్లో మన పిల్లలకు ఈ ఫొటోస్ చూపిస్తూ మన ఈ ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు!’ అంటూ! ఆ మాట విన్న రోమీ సిగ్గు పడిపోయిందట.. పెళ్లికి ఓకే చెప్పేసిందట. అలా కపిల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రోమీ భాటియాను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. పెళ్లి కాకముందు తండ్రి వ్యాపారాలు చూసుకున్న రోమీ పెళ్లయ్యాక కపిల్దేవ్కున్న హోటల్ వ్యాపారాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం ఇండియన్ సెలబ్రిటీస్లోనే అన్యోన్యమైన జంటగా పేరు కపిల్, రోమీ దంపతులకు. - ఎస్సార్ -
అనుకోకుండా ఆల్రౌండర్ అయ్యాను: టీమిండియా క్రికెటర్
దుబాయి: భారత జట్టులో అత్యత్తమ ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో కలిసి హార్దిక్ పాండ్యా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో తన కెరీర్కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పాండ్యా బయటపెట్టాడు. ‘‘నాకు గతంలో ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి సరైన బూట్లు కూడా లేవు. నేను అనుకోకుండా ఆల్ రౌండర్ అయ్యాను’’ అని తెలిపాడు. ‘‘నేను 19 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆల్ రౌండర్గా మారాను. టీమిండియాకు ఆడే ముందు ఒక సంవత్సరం మాత్రమే బౌలింగ్ చేశాను హార్దిక్ చెప్పాడు. నేను మెదట బ్యాట్స్మెన్ని. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. మొదటిసారిగా అండర్-19 మ్యాచ్ల్లో బౌలింగ్ చేశాను’’ అని వివరించాడు. ఈ మ్యాచ్లే తనను ఆల్రౌండర్గా మర్చాయని, ఇది తన అదృష్టమని చెప్పాడు. ‘‘శరత్ కుమార్ సార్ మా అండర్-19 ప్రాక్టీస్ను దూరం నుంచి ప్రతిరోజు గమనించేవారు. ఒక రోజు నేను కిరణ్ మోర్ అకాడమీ తరుపన ఓ మ్యాచ్లో పాల్గొన్నా.. ఆ మ్యాచ్లో ఓ ఫాస్ట్ బౌలర్ అందుబాటులో లేక పోవడంతో ఆనుహ్యంగా నాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. కానీ ఆ సమయంలో ఫాస్ట్ బౌలింగ్ చేయడానకి నా దగ్గర షూస్ లేవు..అయితే వేరే వాళ్లవి వేసుకుని నేను బౌలింగ్ చేశాను. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాను. ఈ ప్రదర్శరనే నా కెరియర్ ను మలుపు తిప్పింది. ఆ మ్యాచ్ చూసిన శరత్ కుమార్ సార్ ఒక నెల రోజుల్లోనే రంజీ ట్రోఫీకు నన్ను సెలక్ట్ చేశారని హార్దిక్ పాండ్యా చెప్పాడు. కాగా తాజాగా బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు -
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ను సాధించాడు. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. అత్యంత తక్కువ టెస్టుల్లో
లండన్: టీమిండియా ఫాస్ట్బౌలర్ ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనతను అందుకున్నాడు. అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్ల ఫీట్ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్ఖాన్తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కపిల్దేవ్ 39 టెస్టుల్లో 150 వికెట్ల మార్క్ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జగవల్ శ్రీనాథ్(40 టెస్టులు), మహ్మద్ షమీ( 42 టెస్టులు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జహీర్ఖాన్ కూడా 49 టెస్టుల్లో 150 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ENG Vs IND Intruder Jarvo 69: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
క్రికెట్ దిగ్గజంతో చిరంజీవి దంపతుల సెల్ఫీ
Chiranjeevi Meets Kapil Dev: ప్రముఖ హీరో చిరంజీవి, ప్రఖ్యాత మాజీ క్రికెటర్ కపిల్దేవ్ హైదరాబాద్లోని ఓ హోటల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము కలిసి దిగిన ఫోటోలను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. ‘‘చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్దేవ్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది.. పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తుచేసుకున్నాం’’ అన్నారు చిరంజీవి. Wonderful meeting my old friend @therealkapildev after a long time. The exquisite #FalaknumaPalace setting made it even more special. Travelled back in time at multiple levels & Fondly recalled old memories.He is very much the #HaryanaHurricane who won us our #FirstWorldCup pic.twitter.com/Y4Ezfhp65j — Chiranjeevi Konidela (@KChiruTweets) August 29, 2021 -
అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం..
లండన్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్లో మరో 5 వికెట్లు తీస్తే.. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్గా రికార్డు నెలకొల్పనున్నాడు. 2018లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటి వరకూ 22 టెస్ట్ల్లో 22.62 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా ఆరు సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం కపిల్ దేవ్ టాప్లో ఉన్నాడు. కపిల్.. 25 టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ను అందుకోగా, ఇప్పుడు ఆ రికార్డుపై బుమ్రా కన్నేశాడు. లీడ్స్ టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 23 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి బౌలర్గా కపిల్ రికార్డును తిరగరాయనున్నాడు. ఇదిలా ఉంటే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమాన్ పేరిట నమోదై ఉంది. జార్జ్.. కేవలం 16 టెస్ట్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో పాక్ స్పిన్నర్ యాసిర్ షా(17 టెస్ట్ల్లో) రెండో స్థానంలో ఉండగా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(18 టెస్ట్ల్లో) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో 5 టెస్ట్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. మూడో టెస్ట్లోనూ విజయఢంకా మోగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లీడ్స్కు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు -
39 ఏళ్ల రికార్డు బద్దలు.. కపిల్ తర్వాత సిరాజ్ మాత్రమే
లార్డ్స్: ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్ లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇక లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1982లో కపిల్ దేవ్ ఈ ఫీట్ను సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ టెస్టు మ్యాచ్లో కపిల్ తొలి ఇన్నింగ్స్లో ఐదు.. రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఓవరాల్గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇక 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) టాప్ స్కోరర్కాగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల మార్క్ని అందుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 391 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ జో రూట్ (180: 321 బంతుల్లో 18x4) రికార్డు శతకం నమోదు చేయగా.. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు. 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టులో అజింక్య రహానె (61: 146 బంతుల్లో 5x4), మహ్మద్ షమీ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దాంతో.. రెండో ఇన్నింగ్స్ని 298/8తో భారత్ డిక్లేర్ చేయగా.. 272 పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందు నిలిచింది. ఛేదనలో సిరాజ్ 4, బుమ్రా 3 దెబ్బకు ఇంగ్లాండ్ 120 పరుగులకే చాప చుట్టేసి 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. -
రవిశాస్త్రి బాగానే పనిచేస్తున్నప్పుడు ద్రవిడ్ ప్రస్తావన ఎందుకు..?
ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బాధ్యున్ని చేస్తూ.. అతనిపై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ అతనికి మద్దతు పలికాడు. కోచ్ బాధ్యతలను రవిశాస్త్రి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నప్పుడు అతన్ని తొలగించాలని డిమాండ్ చేయడంలో అర్ధం లేదన్నాడు. రాహుల్ ద్రవిడ్ రూపంలో కొత్త కోచ్ను తయారు చేసుకోవడంలో తప్పేమీలేదు కానీ, కోచ్ మార్పు విషయమై అనవసర చర్చల వల్ల జట్టు ప్రదరన్శ లయ తప్పుతుందని అభిప్రాయపడ్డాడు. మూడు సంవత్సరాల పాటు కోచ్గా రవిశాస్త్రి బాగానే పని చేశాడని, ఇప్పుడు అనసరంగా ద్రవిడ్ ప్రస్తావన తెచ్చి కొత్త సమస్యలకు తెరలేపొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. రవిశాస్త్రి మంచి పనితీరు కొనసాగిస్తుంటే.. అతన్ని తొలగించాల్సిన అవసరం లేదని, ఈ చర్చ ఆటగాళ్లతో పాటు, ఇరు జట్ల కోచ్లపై అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుంది అని కపిల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండు వేర్వేరు జట్లను పంపించే అరుదైన అవకాశం బీసీసీఐకి కలిగిందంటే, ఆ ఘనత టీమిండియా రిజర్వ్ బెంచ్కే దక్కుతుందన్నాడు. భారత రెండు జట్లు ఇంగ్లండ్, శ్రీలంకల్లో విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, కోహ్లీ నేతృత్వంలో భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే ధవన్ సారధ్యంలో మరో జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ జట్టుకు ద్రవిడ్ను కోచ్గా నియమించడంతో కోచ్ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. దీంతో అతని తర్వాత కోచ్ రేసులో ద్రవిడ్ ఉన్నాడని బీసీసీఐ పరోక్ష సంకేతాలు పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నాలుగు ఓవర్లకే అల్లాడిపోతున్నారు..వీళ్లేం బౌలర్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా ఓటమికి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడమే ప్రధాన కారణమని దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ ఆరోపించారు. పేసర్లకు అనుకూలించే సౌథాంప్టన్ పిచ్పై పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను కాదని ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగడం కోహ్లీసేన కొంపముంచిందని పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా చెప్పుకునే కొందరు కనీసం నాలుగు ఓవర్లు వేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వారిని ఆల్రౌండర్లుగా ఎలా పరిగణించాలని హార్ధిక్ ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యాలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం ఆల్రౌండర్లుగా చెప్పుకునే ఆటగాళ్లు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అలిసిపోవడం చూస్తే బాధగా ఉంటుందని, అతిగా బ్యాటింగ్పై దృష్టి సారించడం వల్లే వాళ్లంతా ఇలా తయారవుతున్నారని విమర్శించాడు. ఈ తరం ఆటగాళ్లు మల్టిపుల్ రోల్ పోషించేందుకు ఆసక్తి చూపించడం లేదని, తమ జమానాలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు ఆటగాళ్లంతా సిద్దంగా ఉండేవారని, స్పెషలిస్ట్బ్యాట్స్మెన్కు కూడా 10 ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన 20 మంది టీమిండియా సభ్యుల్లో ఒక్క నిఖార్సైన పేస్ ఆల్రౌండర్ కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యా జట్టులో పేస్ ఆల్రౌండర్ రోల్ పోషించినప్పటికీ వెన్నుగాయం తర్వాత అతను బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పేస్ ఆల్రౌండర్లతో కలిపి మొత్తం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో 8 వికెట్లతో కోహ్లీ సేనను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు
ఢిల్లీ: క్రికెట్ అనే పదం భారతీయుల గుండెల్లోకి మరింత చొచ్చుకుపోయిన రోజు ఇదే. బ్రిటీష్ పరిపాలనలోనే మనవాళ్లు క్రికెట్ ఆడడం అలవాటు చేసుకున్నా.. టీమిండియా అంటే 1983 ముందు.. ఆ తర్వాత అని చరిత్ర చెప్పుకుంటుంది. అప్పటివరకు క్రికెట్లో భారత్ అనే పేరు అనామకంగానే ఉండేది. కాగా అప్పటికే క్రికెట్లో పాతుకుపోయిన వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్ల ముందు మన ఆటలు సాగేవి కావు. ఒకవేళ వాళ్లు మనం దేశంలో పర్యటించినా.. లేక మనం వాళ్ల దేశంలో పర్యటించిన రిజల్ట్ మాత్రం మనకు ప్రతికూలంగానే వచ్చేది. కానీ 1983 సంవత్సరం క్రికెట్లో టీమిండియా ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ చేరింది. కపిల్దేవ్ సారధ్యంలోని భారత జట్టు ఫైనల్లో బలమైన విండీస్ను ఓడించి జగజ్జేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టంది. భారత్లో క్రికెట్కు మతం అనే పదానికి భీజం పడింది ఇక్కడే. అప్పటివరకు హాకీని ఇష్టపడినవాళ్లు క్రమంగా క్రికెట్కు పెద్ద అభిమానులుగా మారిపోతువచ్చారు. మరి అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఇదే.. జూన్ 25, 1983. నేటితో భారత్ మొదటి ప్రపంచకప్ గెలిచి 38 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆనాటి ఫైనల్ విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటింగ్లో శ్రీకాంత్ 38, మోహిందర్ అమర్నాథ్ 26, ఎస్ఎమ్ పాటిల్ 27 పరుగులు చేశారు. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్కు ఇదేం పెద్ద టార్గెట్ కాకపోవచ్చని.. మరోసారి కప్పును విండీస్ గెలుచుకుంటుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే విండీస్ ఇన్నింగ్స్ సాగింది. తొలి వికెట్ను ఐదు పరుగులకే కోల్పోయినా.. 50/1తో పటిష్టంగా కనిపించింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. భయంకరమైన ఫామ్లో ఉన్న వివ్ రిచర్డ్స్ 33 పరుగుల వద్ద మదన్లాల్ బౌలింగ్లో కపిల్దేవ్ తీసుకున్న సూపర్ క్యాచ్ మ్యాచ్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు విసురుతూ చెమటలు పట్టించగా.. విండీస్ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయి 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొహిందర్ అమర్నాథ్, మదన్లాల్ ద్వయం చెరో మూడు వికెట్లతో చెలరేగారు.అలా తొలిసారి కపిల్ సారధ్యంలోని టీమిండియా జగజ్జేతగా అవతరించింది. అంతకముందు లీగ్ దశలో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175* పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ను ఎవరు మరిచిపోలేరు. సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో కపిల్ పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్ తీసుకొని బరిలోకి దిగడం.. 175 నాకౌట్ ఇన్నింగ్స్ ఆడడం చరిత్రలో మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ సరిగ్గా 28 ఏళ్లకు 2011లో ధోని సారధ్యంలో టీమిండియా రెండో ప్రపంచకప్ను సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL-6 Final: విజేత ముల్తాన్ సుల్తాన్స్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు.. వీడియో వైరల్ #OnThisDay in 1983, a moment of triumph for India 🌟 Kapil Dev led them to their first @cricketworldcup win with a 43-run victory over West Indies in the final 🏆 pic.twitter.com/u3oewIaJnX — ICC (@ICC) June 25, 2021 -
క్రికెట్ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్కు 38 ఏళ్లు..
న్యూఢిల్లీ: సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత క్రికెట్ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్లో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి ఆ ఇన్నింగ్సే నాంది పలికింది. 1983 వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేశ్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన కపిల్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రపంచకప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 17 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్ లాంటి స్టార్లు సింగల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు. దీంతో ప్రపంచ కప్లో భారత్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అప్పుడే వచ్చాడు టార్చ్ బేరర్ కపిల్ దేవ్. తన సారథ్యంలో భారత్ను ఎలాగైనా విశ్వవిజేతగా నిలపాలనుకున్న ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన ఆయన.. ఓవైపు వికెట్లు పడుతున్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్మెన్లు బంతిని బ్యాట్కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్లో అలవోకగా షాట్లు కొడుతూ చెలరేగిపోయాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను.. ఆల్రౌండర్ కెవిన్ కర్రన్ (73) ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 235 పరుగలకు ఆలౌట్ కావడంతో, భారత్ ఓడాల్సిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్ బంతితో కూడా రాణించి 11 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లలో మదన్లాల్ 3, రోజర్ బిన్నీ 2, సంధూ, అమర్నాథ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు ఇచ్చిన స్పూర్తితో భారత్ ఆ ప్రపంచ కప్లో వెనక్కి తిరగి చూడలేదు. ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ను 118 పరుగులతో గెలిచిన కపిల్ డెవిల్స్ సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. అనంతరం ఇంగ్లండ్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత నాటి ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్కు దక్కని చోటు -
లార్డ్స్ మైదానంలో టీమిండియా తొలి విజయం.. నేటితో 35 ఏళ్లు
చాలా మంది క్రికెటర్లు లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని దేవాలయంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్ మైదానంలో ఆడలాని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. కాగా ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 35 సంవత్సరాల క్రితం 1986 లో ఈ రోజున తొలి విజయాన్ని నమోదుచేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా అతిథ్య ఇంగ్లండ్ జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కపిల్దేవ్ ఫీల్డింగ్ను ఎంచుకోగా, బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్సింగ్స్లో 294 పరుగులకు ఆలౌట్ అవ్వగా , రెండో ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్సింగ్స్లో గ్రహమ్ గూచ్ 114 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 341 పరుగులను చేయగా రెండో ఇన్సింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులను చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో క్రీజులోకి వచ్చిన కపిల్దేవ్ కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్కు లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం వరించింది. ఈ మ్యాచ్లో కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైయ్యాడు టీమిండియా నుంచి తొలి ఇన్నింగ్స్లో దిలీప్ వెంగ్సర్కార్ 126 పరుగులు చేశాడు. లార్డ్స్లో తొలి విజయాన్నిఅందుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్తో అతిథ్య ఇంగ్లండ్ జట్టును ముప్ఫుతిప్పలు పెట్టారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, మొహిందర్ అమర్నాథ్, రవిశాస్త్రి, మనీందర్ సింగ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టు తరపున ఆడారు. ప్రస్తుత టీమిండియా జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్దమౌతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: WTC Final : లెజెండ్తో నేను సిద్ధంగా ఉన్నా -
పంత్కు క్రికెట్ దిగ్గజం వార్నింగ్..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్కు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ సున్నితమైన వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ గడ్డపై దూకుడు తగ్గించుకొని బ్యాటింగ్ చేయాలని హెచ్చరించాడు. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించకూడదని, క్రీజులో ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాడు. గతంలో రోహిత్ శర్మకు కూడా ఇదే సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కపిల్ మాట్లాడుతూ.. పంత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పరిణితి చెందాడని, అందుకు అతని ఇటీవల కాలంలో ఫామే నిదర్శనమని చెప్పుకొచ్చాడు. అయితే అతని సహజ సిద్దమైన ఆటతీరుకి ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పిచ్ లపై ప్రతి బంతిని బాధాలని ప్రయత్నించకూడదని, క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపితే పరుగులు ఆవంతకవే వస్తాయని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ ఈ ప్రణాళికను అమలుచేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. కాగా, గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మకు కూడా ఇదే విషయాన్ని చెప్పానని కపిల్ ప్రస్తావించాడు. రోహిత్ కూడా పంత్ లాగే ప్రతి బంతిని బలంగా బాధాలనుకుండేవాడని, అయితే ఈ సలహాను పాటించడం వల్ల అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు. రోహిత్ లాగే పంత్ కూడా చాలా తెలివైన, విలువైన ఆటగాడని.. తాను చెప్పిన ఫార్ములాను ఇంగ్లండ్ గడ్డపై అమలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు అతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను బెస్టాఫ్ 3 ఫార్మాట్లో నిర్వహించాలని కపిల్ బీసీసీఐ కి సూచించాడు. రెండేళ్ల పాటు సాగిన టోర్నీలో ఒక్క మ్యాచ్తో విజేతను తేల్చడం కంటే, బెస్టాఫ్ 3 పద్దతిలో ఫైనల్ నిర్వహించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈ టోర్నీ ని ప్రవేశపెట్టడం వల్ల టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరిగిందని, బెస్టాఫ్ 3 పద్దతి వల్ల ప్రేక్షకులకు కావాల్సిన మజా లభించడంతో పాటు టెస్ట్ ఫార్మాట్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: ఏంటి కోహ్లి.. ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ? -
కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి..
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజాలతో పోల్చకండని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్. భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాను కపిల్తో పోలుస్తూ.. విశ్లేషకులు చేసే రచ్చను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో ఒకే కపిల్, ఒకే ధోని, ఒకే గవాస్కర్ ఉంటారని, అలాంటి దిగ్గజాలను యువ ఆటగాళ్లను పోల్చడం వల్ల యువకులపై ఒత్తిడి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కపిల్, తన జమానాలో వికెట్లు తీస్తూ... భారీగా పరుగుల చేస్తూ నిఖార్సైన ఆల్రౌండర్ పాత్రను పోషించాడని... ఈ జనరేషన్లో హార్ధిక్ కూడా అసలుసిసలైన ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయగల సమర్ధుడని అంటూనే ఇద్దరిని పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. కపిల్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత పని భారం ఉండేది కాదని, ఆ పని భారం కారణంగానే నేటి తరంలో అసలుసిసలైన ఆల్రౌండర్లు తయారు కాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ మేటి ఆల్రౌండర్గా కొనసాగాడని, ప్రస్తుత తరంలో ఆల్రౌండర్గా కొనసాగడం చాలా కష్టమని ఆయన వెల్లడించాడు. భారత జట్టు మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్రౌండర్గా ఎదిగే శక్తి సామర్థ్యాలున్న ఓ ఆటగాడు గాయంబారిన పడటంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందని హార్ధిక్పై పరోక్ష వ్యాఖ్యలు చేరాడు. ఈ ఏడాది చివర్లో భారత్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ను ఆడించాలని ఆయన సూచించాడు. సంజూ సామ్సన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్లో మాత్రం పంత్నే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: ఒక్క ఓవర్ పొదుపుగా బౌల్ చేయాల్సింది.. కేకేఆర్ ఓటమికి నేనే కారణం -
కపిల్దేవ్ తర్వాత ఇషాంత్ శర్మదే ఆ రికార్డు
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ముంగిట అరుదైన రికార్డు ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్బాల్ టెస్టు ఇషాంత్కు వందో టెస్టు కావడం విశేషం. కాగా టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన రెండో ఫాస్ట్ బౌలర్గా అతను చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకముందు టీమిండియా నుంచి 100 టెస్టులు ఆడిన ఒకే ఒక ఫాస్ట్ బౌలర్గా కపిల్దేవ్ ఉన్నాడు. ఇషాంత్ కన్నా ముందు జహీర్ ఖాన్ 92 టెస్టులు, జగవల్ శ్రీనాథ్ 67 టెస్టు మ్యాచ్లు ఆడారు. 2007 లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఇశాంత్ శర్మ 99వ టెస్టులోనే 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఇషాంత్ ఇప్పటివరకు టీమిండియా తరపున 99 టెస్టుల్లో 302 వికెట్లు, 80 వన్డేల్లో 112 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్పై అత్యధికంగా 61 వికెట్లు పడగొట్టగా.. ఆస్ట్రేలియాపై 59 వికెట్లు తీశాడు. ఒక ఏడాదిలో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో ఇషాంత్కు 2011, 2018 బాగా కలిసివచ్చాయి. 2011 లో 12 టెస్టుల్లో 43 వికెట్లు, 2018 లో 11 మ్యాచ్లాడి 41 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇషాంత్ ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో 45 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. చదవండి: అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్బ్యాక్ కష్టమే ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ -
జూన్లో ‘83’ వరల్డ్ కప్
1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకోన్, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా కబీర్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘1983లో భారతదేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవతరించింది. కపిల్ దేవ్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజయంతో చాలామందికి క్రికెట్ ఫేవరేట్ గేమ్గా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నాం. 1983 వరల్డ్ కప్కు సంబంధించి నా దగ్గర ఉన్న వంద కథల్లో 25 కథలను ఆధారంగా చేసుకుని ‘83’ సినిమాను తెరకెక్కించాను. కేవలం ఆటగాళ్ల కోణంలోనే కాక కామెంటేటర్స్, ప్రేక్షకుల కోణంలోనూ సినిమా సాగుతుంది’’ అన్నారు. చదవండి : భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక -
40 ఏళ్లలో ఇదే అద్భుతమైన గెలుపు: కపిల్
హైదరాబాద్: ఆటగాళ్లకు గాయాలు, కెప్టెన్ కోహ్లీ గైర్హాజరు.. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం అద్భుతమని క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాల్లో తాను చూసిన అపూర్వ గెలుపు ఇదేనన్నాడు. రానున్న ఇంగ్లండ్తో సిరీస్లోనూ భారత్ ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. వికారాబాద్లోని హల్దీ గోల్ఫ్ క్లబ్లో ఓ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ పలు అంశాలపై ముచ్చటించాడు. 'ఆస్ట్రేలియాలో భారత జట్టు అద్భుతం చేసింది. అత్యంత ముఖ్యమైన బ్యాట్స్మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. షమీ, ఉమేశ్ ఆ తర్వాత అశ్విన్, జడేజా, విహారి ఇలా సగం జట్టుకన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. అలాంటి సమయంలో ఆసీస్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలుస్తుందని నేను ఊహించలేదు. అయితే టీమ్ఇండియా వీరోచితంగా పోరాడింది. అలాంటి ఆట ఆడిన భారత జట్టుకు హ్యాట్సాఫ్. గత నాలుగు దశాబ్దాల్లో నేను చూసిన అద్భుతమైన ఆట ఇదే. స్వదేశంలో త్వరలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ భారత్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. ఆసీస్లో చరిత్రాత్మక విజయం తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. చదవండి: అతన్ని ఎదుర్కోవడం కష్టమే కెప్టెన్ ఎంపిక అంశం సెలెక్టర్లకే వదిలేయాలి. ఒకవేళ మూడు ఫార్మాట్లకు సారథ్యం వహించి విపరీతమైన ఒత్తిడికి గురయితే విశ్రాంతి ఇవ్వొచ్చని నేను అనుకుంటా. మన దేశంలో ఫార్మాట్కో కెప్టెన్ ఉండడం కష్టం. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించగల ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ వల్ల చాలా మంది ప్లేయర్లు అనుభవం గడించారు. విరాట్ లేకపోయినా ఆస్ట్రేలియాలో భారత జట్టు ఏం చేసిందో చూశాం. రహానే అమోఘంగా జట్టును ముందుకు నడిపాడు. ఉన్నది తక్కువ అనుభవమే అయినా.. ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రోహిత్ కూడా మెరుగైన కెప్టెన్గానే పరిగణించవచ్చు. భారత క్రికెట్లో యువ ప్రతిభావంతులకు కొదువ లేదు. ఎందరో టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు. అయితే నిలకడగా సత్తాచాటాలి. శుభ్మన్ గిల్, పృథ్వీ షా లాంటి అద్భుతమైన ఆటగాళ్లు వస్తున్నారు. అయితే యువ ప్లేయర్లు సుదీర్ఘ కాలం పాటు నిలకడగా ఆడడం పట్ల దృష్టిసారించాలి. యువకులు అదరగొడుతుంటే చూడాలనదే నా ఆశ. 'అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'స్వదేశానికి వచ్చాక అస్సలు టైం దొరకలేదు' -
గుండెపోటును దాటి గోల్ఫ్కు...
న్యూఢిల్లీ: ఇటీవలే గుండెపోటుకు గురైన భారత విఖ్యాత కెప్టెన్ కపిల్ దేవ్ మళ్లీ మైదానంలోకి దిగారు. తన ఫిట్నెస్ స్థాయి ఏంటో చాటారు. 61 ఏళ్ల కపిల్కు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. కాస్త విశ్రాంతి తీసుకున్న ఆయన వైద్యుల అనుమతితో గురువారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడారు. భారత్కు తొలి ప్రపంచకప్ (1983) అందించిన ఆయన తదనంతరం తనకెంతో ఇష్టమైన గోల్ఫ్ వైపు మళ్లారు. మళ్లీ మైదానంలోకి దిగడంపై కపిల్ ట్వీట్ చేశారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వివరించలేను. గోల్ఫ్ కోర్స్, క్రికెట్ గ్రౌండ్... ఏదైనా సరే మళ్లీ ఆడటమనేది చాలా ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా ఉంది. నా మిత్రులతో కలిసి ఇలా సరదాగా ఆడటం నిజంగా తృప్తినిచ్చింది. జీవితమంటే ఇదేనేమో!’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాక 1994 నుంచి కపిల్ దేవ్ రెగ్యులర్గా గోల్ఫ్ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు. -
‘చాలా బాగున్నాను’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి దీవెనలతో తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన ఇంటి ముందు నిలబడి రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. గత వారం గుండెపోటుకు గురైన కపిల్కు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. ‘నా 83 కుటుంబానికి...వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మీ అందరినీ కలవాలని ఉత్సాహంగా ఉన్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ దీవెనలకు నా కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరలో అందరినీ కలుసుకుంటా. ఈ ఏడాది చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని కపిల్ అన్నారు. -
పెళ్లైన 16 ఏళ్లకు పుట్టింది.. అ చిరునవ్వే
కపిల్ దేవ్ చాలా వికెట్లు పడగొట్టాడు గాని కూతురి ప్రేమకు ప్రతిసారీ బౌల్డ్ అవుతూనే ఉన్నాడు. వివాహం అయిన 16 ఏళ్లకు జన్మించిన ఏకైక కుమార్తె అమియా దేవ్. తండ్రిని ఈ కాలంతో కనెక్ట్ చేస్తూ ఎప్పుడూ అప్డేట్గా ఉంచుతూ ఉంటుంది. మొన్న కపిల్ దేవ్కు యాంజియోప్లాస్టీ జరిగితే డిశ్చార్జ్ అయ్యే వరకు అమియా పక్కనే ఉండి అన్నీ చూసుకుంది. కపిల్ దేవ్, రొమి భాటియాల ప్రేమ,పెళ్లి, కుమార్తె జననం అన్నీ విశేషమే. 1980లకు ముందు కపిల్ దేవ్ చాలాసార్లు హాఫ్ సెంచరీ 49 దగ్గర, సెంచరీ 97 దగ్గర మిస్ అయ్యాడుగానీ ప్రేమలో రోమి చేయి పట్టుకోవడం మిస్ కాలేదు. ఢిల్లీని తమ నివాస స్థలంగా చేసుకున్న వీరిద్దరు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. కపిల్ దేవ్ అప్పటికే క్రికెట్ స్టార్. కాని రోమి మీద ప్రేమ పెంచుకున్నాడు. రోమి వారి స్నేహ బృందంలో నాయక స్థానంలో ఉండేది. ఆ వయసులోనే 80 కేజీల బరువుతో బెరుకు లేకుండా అబ్బాయిలంటే లెక్క లేనట్టుగా ఉండేది. ఆమెను చూసి అందరూ జంకే వారు కాని క్రీజ్ మీద ఎంతటి భీకర బ్యాట్స్మెన్కైనా బంతి వేయడానికి భయపడని కపిల్ దేవ్ రోమీని ప్రేమపూర్వకంగా దక్కించుకోవడానికే నిశ్చయించుకున్నాడు. ఢిల్లీ సబర్బ్ ట్రైన్లో తన ప్రేమను ప్రతిపాదించాడు. రోమి అంగీకరించింది. ఒకటి రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత 1980లో వాళ్లు వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి కపిల్ దేవ్కు 21 సంవత్సరాలు.(చదవండి: గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్లు) సంతానం కోసం ఎదురు చూపు పెళ్లయ్యాక రోమి, కపిల్ల జీవితంలో సహజంగానే సంతానం కోసం ఎదురు చూపు మొదలయ్యింది. ఒకటి రెండు సంవత్సరాలు ఇద్దరూ పట్టించుకోలేదు. మూడో సంవత్సరం కొంచెం బెంగ పడ్డారు. నాలుగో సంవత్సరం నుంచి రోమి తీవ్రంగా సంతాన వాంఛతో ఇబ్బంది పడింది. ‘నేను ఎక్కే క్లినిక్ దిగే క్లినిక్తో రోజులు గడిపేదాన్ని’ అని ఆమె చెప్పుకుంది. గర్భం రావడానికి అప్పటికి వీలైన వైద్య విధానాల కోసం ప్రయత్నించేది. కపిల్ భార్య పడే శ్రమ చూడలేకపోయేవాడు. ‘మనిద్దరం బాగున్నాం కదా. పిల్లలు ఇవాళ కాకపోయినా రేపయినా పుడతారులే’ అని ధైర్యం చెప్పేవాడు. కాని రొమి హాస్పిటళ్ల చుట్టూ తిరగడం మానలేదు. ‘పద్నాలుగేళ్లు అలా హాస్పిటళ్లకు తిరిగి అలసిపోయాను. ఒకరోజు క్లినిక్లో నాకే అనిపించింది. ఇచ్చేవాడు భగవంతుడు. ఆయన ఇవ్వదలిస్తే ఇస్తాడు. లేకుంటే లేదు అనుకుని ప్రయత్నాలు మానేశాను. ఇది జరిగిన ఒక సంవత్సరానికి గర్భం దాల్చాను. అసలది నేను నమ్మలేకపోయాను. హాస్పిటల్కు వెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడి నుంచే కపిల్కు ఫోన్ చేసి చెప్పాను’ అంటుంది రోమి. ‘దాదా’ అన్న పిలుపు కపిల్, రోమిలకు 1996లో అమియా పుట్టింది. తండ్రిని ‘దాదా’ అని పిలవడం కపిల్ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. ‘నేను క్రికెట్లో పీక్లో ఉండగా అమియా పుట్టి ఉంటే ఆమె బాల్యాన్ని నేను మిస్ అయి ఉండేవాణ్ణి. రిటైర్ అయ్యాక పుట్టడంతో ఆమె ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. పని తర్వాత సాయంత్రం ఇల్లు చేరుకున్నప్పుడు కూతురు ఎదురొస్తే కలిగే ఆనందం ఏ తండ్రికైనా అంతా ఇంతా కాదు’ అంటాడు కపిల్. తల్లిదండ్రులు ఇద్దరూ అమియాను తమ అభిప్రాయాల ప్రతిబింబంలా కాకుండా ఆమె స్వేచ్ఛాలోచనలకు వీలుగా పెంచడానికే ఇష్టపడ్డారు. ప్రాథమిక చదువు గుర్గావ్లో, పై చదువు లండన్లో చదువుకుంది అమియా. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ యువతరంతో, కాలంతో తండ్రి కనెక్ట్ అయ్యేలా అమియా సహాయం చేస్తోంది. సోషల్ మీడియాలో కపిల్ ప్రెజెన్స్ను అమియా పర్యవేక్షిస్తోంది. అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను హ్యాండిల్ చేస్తోంది. తండ్రి సినిమాలో అమియాకు బాలీవుడ్లో పని చేయాలని ఒక కోరిక. అందుకే దేశానికి కెప్టెన్గా కపిల్ దేవ్ క్రికెట్లో వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కథతో ‘83’ సినిమా మొదలైనప్పుడు అమియా దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది. ఇలా ఒక క్రీడాకారుడి జీవితంపై సినిమా వస్తున్నప్పుడు దానికి ఆ క్రీడాకారుని కుమార్తె పని చేయడం ఎక్కడా జరిగి ఉండదు. దానివల్ల తండ్రి సినిమా సరిగ్గా రావడంలో పాత్ర వహించడంతోపాటు తండ్రి బాడీ లాంగ్వేజ్ను ఆ పాత్ర పోషిస్తున్న రణ్వీర్ సింగ్కు చెప్పడానికి కూడా అమియా తోడ్పడింది. అత్యవసరంలో వెన్నుదన్నుగా మొన్న అక్టోబర్ 22 గురువారం పొద్దుపోయాక కపిల్ దేవ్ ఛాతీలో అసౌకర్యం చెప్పగానే దక్షిణ ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో హుటాహుటిన చేర్చడం, తెల్లారే సమయానికి డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించడం, కపిల్ కోలుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని తల్లితో కలిసి నిర్వర్తించింది అమియా. తండ్రి పక్కనే ఉండి అనుక్షణం బలాన్ని ఇచ్చింది. కూతురు ఎదురుగా ఉండే ఏ తండ్రైనా శక్తిసంపన్నుడు కాకతప్పదు. అందుకే హాస్పిటల్ బెడ్ మీద కపిల్ నవ్వుతూ తన అభిమానులను ఫొటో ద్వారా పలకరించగలిగాడు. ఆ నవ్వు పక్కన అమియాను చూడొచ్చు. కూతురి చిరునవ్వే ఇంటికి శ్రీరామరక్ష. – సాక్షి ఫ్యామిలీ -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కపిల్ దేవ్
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోలుకుని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కపిల్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పిత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు మాజీ క్రికెటర్ చెతన్శర్మ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. కపిల్ దేవ్ ఆస్పత్రి వైద్యుడితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘వైద్యుడు అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశాడు. ప్రస్తుతం కపిల్ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్ చేశారు’ అంటూ చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. (చదవండి: గుండెకు ఆపరేషన్: కపిల్దేవ్ ట్వీట్) Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea — Chetan Sharma (@chetans1987) October 25, 2020 అయితే అక్టోబర్ 23(శుక్రవారం) రాత్రి కపిల్కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయనను ఐసీయుకు తరలించారు. ఇదే విషయాన్ని కపిల్ తర్వాత రోజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆస్పత్రి యాజమాన్యం కూడా కపిల్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేస్తూ.. ‘కపిల్ ఐసీయు ఉన్నారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: బ్రేకింగ్: కపిల్దేవ్కు గుండెపోటు) -
గుండెకు ఆపరేషన్: కపిల్దేవ్ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ కోలుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని, రెండు మూడురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. కాగా కపిల్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్యానా హరికేన్ శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్క్షతలు తెలిపారు. (కపిల్దేవ్కు గుండెపోటు) -
బ్రేకింగ్: కపిల్దేవ్కు గుండెపోటు
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్దేవ్కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. హర్యానా హరికేన్గా పేరొందిన కపిల్ సారథ్యంలోనే భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్ను తొలిసారి కైవసం చేసుకుంది. Hope The captain recovers soon !! 🤞 https://t.co/zKo0uIyh8L — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 23, 2020 Praying for your speedy recovery. 🙏🏻 Get well soon paaji. @therealkapildev — Virat Kohli (@imVkohli) October 23, 2020 -
క్రిస్మస్కి 83
కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలన్నీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయాయి. సినిమా థియేటర్స్ ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో కొత్త తేదీలను, పండగ సీజన్లను టార్గెట్ చేసి తమ చిత్రాల విడుదల తేదీలను లాక్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ‘83’ విడుదల తేదీని ఖరారు చేశారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
సచిన్ బ్యాటింగ్పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళ క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరుగులకు సంబంధించి సచిన్ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయని, అయితే టెస్టు క్రికెట్ విషయానికొస్తే డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ టాప్ పదిలో కనిపించడని అన్నారు. మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లాగే సచిన్ కూడా టెస్ట్ క్రికెట్లో ఆరు డబుల్ సెంచరీలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. కాని డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ 12వ స్థానంలో ఉన్నాడన్నారు. ఎందుకంటే 200 టెస్టు మ్యాచుల్లో సచిన్ కేవలం ఆరు డబుల్ సెంచరీలు చేశాడని ఆయన పేర్కొన్నారు. (షెడ్యూల్ ఖరారు చేసేందుకు...) కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “సచిన్ చాలా ప్రతిభావంతుడు. క్రికెట్ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో అతనికి తెలుసు, కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత అతను సింగిల్స్ తీసుకునేవాడు.. ఎక్కువ స్పీడ్గా ఆడేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్మన్ కాలేడు. సచిన్ కనీసం అయిదు ట్రిపుల్ సెంచరీలు, పది డబుల్ సెంచరీలు చేయాల్సి ఉండేది. ఎందుకంటే అతను ప్రతి ఓవర్లో బౌండరీ బాదేవాడు. టెస్ట్ క్రికెట్లో 51 సెంచరీలు సాధించిన సచిన్కు తన మొదటి డబుల్ సెంచరీ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది 1999లో న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో సాధ్యమైంది. వాస్తవానికి, టెండూల్కర్ 51 సెంచరీలలో కేవలం 20 మాత్రమే 150 కి పైగా స్కోర్లుగా నిలిచాయి. అయితే, 2010లో దక్షిణాఫ్రికాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్ సచిన్’ అని పేర్కొన్నారు. సచిన్ తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్ల్లో 54.04 సగటుతో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 44.83 సగటుతో18,426 పరుగులు చేశాడు. 2013 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు (కపిల్ సలహాతోనే కోచ్నయ్యా) (ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!) -
కపిల్ సలహాతోనే కోచ్నయ్యా
న్యూఢిల్లీ: ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక తదుపరి ఏం చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పడు దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెరీర్ చివరి దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్, కోచ్గానూ వ్యవహరించిన తాను అదృష్టవశాత్తు ఇంకా కోచింగ్తోనే కొనసాగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. భారత మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్తో జరిపిన సంభాషణలో ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా కెరీర్ ముగించాక తదుపరి నాకు చాలా దారులు కనబడ్డాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ మంచి సలహా ఇచ్చారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు రాహుల్... కొన్నేళ్లు అన్నీ ప్రయత్నించి నీకు ఏది నచ్చుతుందో చివరకు దానికే కట్టుబడి ఉండు అని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. కొన్నాళ్లు వ్యాఖ్యాతగా పనిచేశాను. కానీ ఆటకు దూరంగా వెళ్తున్నట్లు అనిపించింది. అందుకే సంతృప్తినిచ్చే కోచింగ్ వైపే మొగ్గు చూపాను. అండర్–19, భారత ‘ఎ’ జట్లకు కోచ్గా అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించా’ అని ‘ది వాల్’ వివరించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వన్డే జట్టుకు తాను సరితూగననే అభద్రతా భావానికి గురయ్యానని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. నిజానికి తాను టెస్టు ప్లేయర్ని అని పేర్కొన్న ద్రవిడ్ తన శిక్షణ కూడా టెస్టు క్రికెటర్లాగేó సాగిందన్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్ 10889 పరుగులు సాధించాడు. -
బయో పీక్
రెండేళ్లుగా వెండితెరపై బయోపిక్ల హవా నడుస్తోంది. ఈ ఏడాది కూడా కొన్ని బయోపిక్లు థియేటర్స్కు రావాల్సింది కానీ కరోనా కారణంగా ఆగాయి. షూటింగ్లకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో సెట్స్పైకి వెళ్లేందుకు కొన్ని బయోపిక్లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరికొన్ని బయోపిక్లు ముస్తాబు అవుతున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన ఈ ఏడాది బయోపిక్ల హవా పీక్లో ఉంది. 20 సినిమాల వరకూ ఉండటం విశేషం. ఇక ప్రముఖుల జీవితాల ఆధారంగా రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. విశ్వదర్శనం ‘స్వాతిముత్యం, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వయంకృషి , శృతిలయలు’.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఘనవిజయాల జాబితాకు ఫుల్స్టాప్ పెట్టడం కాస్త కష్టమే. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. ఆయన గురించి ఎవరికీ తెలియని తెరవెనక దాగి ఉన్న సంగతులు, ఆయన గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు ‘విశ్వదర్శనం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విశ్వనాథ్ జీవితం ఆధారంగా ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ ‘విశ్వదర్శనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాళన్న సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన కృషి అక్షరాలతో కుదించి రాయలేనిది. తెలుగులోనే కాదు ఉర్దూ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్.. ఇలా పలు భాషల్లో రచనలు చేసిన ఘనత కాళోజీది. కాళన్నగా సుపరిచితులైన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సామాజిక కార్యక్రమల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న కాళోజీ స్వాతంత్య్ర పోరాటంలోనూ పాలుపంచుకున్నారు. ఇన్ని గొప్ప విశేషాలు దాగి ఉన్న కాళోజీ జీవిత చరిత్ర వెండితెరకు రానుంది. ‘కాళన్న’ టైటిల్తో డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేపర్బాయ్ నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకూ ఎదిగిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో ఆయన పోషించిన పాత్ర విశ్వానికి మనల్ని దగ్గర చేసింది. కలాంను ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారంటే ఆయన గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా స్ఫూర్తిదాయకంగా సాగిన కలాం జీవితం ఆధారంగా ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దర్శక ద్వయం జగదీష్ తానేటి, జానీ మార్టిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కలాం పాత్రలో అలీ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శక–నిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా కలాం బయోపిక్ను ప్రకటించారు. చాంపియన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (2001)ను సాధించి, చరిత్ర సృష్టించారు పుల్లెల గోపీచంద్. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వ్యక్తి (తొలి వ్యక్తి ప్రకాష్ పదుకొనే) ఆయనే కావడం విశేషం. గోపీచంద్ జీవితం కూడా తెరకు రానుంది. ఆయన బయోపిక్లో సుధీర్బాబు నటిస్తారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. శభాష్ మిథూ ఇల్లు వదిలి గ్రౌండ్లోకి అడుగుపెట్టి తమలో దాగి ఉన్న క్రీడా సత్తాను నిరూపించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఆ కష్టాలను ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్ అవతలికి కొట్టారు క్రికెటర్ మిథాలీ రాజ్. భారతీయ మహిళా క్రికెట్లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా కొన్ని రికార్డులను సాధించారు. భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’గా తెరపైకి రానుంది. మిథాలీ రాజ్గా తాప్సీ నటిస్తారు. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారు. సైనా బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబర్వన్ స్థాయికి చేరుకున్న ఘనత సైనా నెహ్వాల్ది. అంతేకాదు.. ఒలింపిక్స్లో భారత్ తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన సైనా ఓ ఒలింపిక్ మెడల్ను కూడా సాధించారు. సైనా జీవితం ‘సైనా’ పేరుతో ఆవిష్కృతం కానుంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. తలైవి తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె బయోపిక్ తలైవి (హిందీలో ‘జయ’)గా తెరకెక్కుతోంది. జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. జయలలిత జీవితంపై రూపొందనున్న మరో చిత్రం ‘ది ఐరన్ లేడీ’లో జయలలితగా కనిపించనున్నారు నిత్యామీనన్. దర్శకురాలు ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే జయలలిత జీవితంపై రూపొందిన వెబ్సిరీస్ ‘క్వీన్’లో జయలలితగా నటించారు రమ్యకృష్ణ. తొలి పార్ట్ విడుదలైంది. రెండో భాగానికి రంగం సిద్ధమౌతోంది. మల్లేశ్వరి తొలి ఒలింపిక్ మెడల్ (వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో) సాధించిన కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. ఒలిపింక్స్లో మెడల్ సాధించక ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచారు మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి బయోపిక్ను దర్శకురాలు సంజన తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ నిర్మాత కావడం విశేషం. ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనుంది. మరికొన్ని... ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్ను నిర్మించనున్నారు రోనీ స్క్రూవాలా. నటుడు, నిర్మాత సోనూ సూద్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘కలియుగ భీమ, ఇండియన్ హెర్క్యూలెస్’ కోడి రామ్మూర్తి బయోపిక్లో రానా నటించబోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్’గా చెప్పుకునే పీటీ ఉష బయోపిక్ గురించి గతంలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో పోరాడి మరణించిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’గా తెరపైకి వస్తోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. పుట్టుకతోనే అంధుడైనా ఉన్నత చదువులు చదివి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు మచిలీపట్నంకు చెందిన బొళ్ల శ్రీకాంత్. ఆయన బయోపిక్ను బాలీవుడ్ దర్శక–నిర్మాత తుషార్ హీరానందన్ రూపొందించనున్నారు. ‘ఎల్టీటీఈ’ ప్రభాకరన్ బయోపిక్ ‘సీరుమ్ పులి’గా రూపొందనుంది. జి. వెంకటేష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా టైటిల్ రోల్ చేస్తున్నారు. భారతీయ మొదటి ఫీల్డ్ మార్షల్ శ్యాం మానెక్ షా బయోపిక్లో నటిస్తున్నారు విక్కీ కౌశల్. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకురాలు. పరమ్వీర చక్ర విక్రమ్ బాత్ర జీవితం ఆధారంగా విష్ణువర్ధన్ తెరకెక్కిస్తోన్న ‘షేర్షా’లో నటిస్తున్నారు సిద్దార్ధ్ మల్హోత్రా. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి విజయ్ కార్నిక్గా నటించారు అజయ్ దేవగన్. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ బయోపిక్ను తెరకెక్కించునున్నట్లు నిఖిల్ ఆనంద్ తెలిపారు. అలాగే సుశాంత్ జీవితం ఆధారంగా ఒక సినిమాను సంజోయ్ మిశ్రా, మరో సినిమాను నిర్మాత విజయ్శేఖర్ గుప్తా రూపొందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో క్రికెటర్ కపిల్ దేవ్గా రణ్వీర్సింగ్ (’83), ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్గా అజయ్ దేవగన్ (‘మైదాన్’), కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్గా అక్షయ్ కుమార్ (‘పృథ్వీరాజ్’), పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దామ్సింగ్గా విక్కీ కౌశల్ (‘సర్దార్ ఉద్దామ్సింగ్’) నటిస్తున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. గుంజన్ పాత్రను జాన్వీ కపూర్ చేశారు. ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని బయోపిక్స్ కూడా తెరపైకి వచ్చేందుకు ముస్తాబు అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
‘తొలి ప్రేమ’ పుట్టిన వేళా విశేషం..
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటి గెలుపు ఇచ్చే కిక్కే వేరప్పా! మన గురించి మనం చెప్పుకుంటే ఇలాంటి భావన చాలా మందిలో సాధారణమే. సరిగ్గా ఇలాంటిదే భారత క్రికెట్కు కూడా వర్తింపజేస్తే ఆ తొలి గెలుపు విలువేమిటో మనకు తెలుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్కప్ టైటిల్ను భారత్ గెలవడం అలాంటి అపూర్వ ఘట్టమే. రోజుకు 1500 రూపాయల మ్యాచ్ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్ చేరిందంటే అది ఈ గెలుపు చలవే. భారత క్రికెట్ గతిని మార్చేసిన ఈ ఘనతకు నేటితో 37 ఏళ్లు. క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచే సమయానికి భారత్లో హాకీదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్ గెలవగా... 1980 మాస్కో ఒలింపిక్స్లో సాధించిన స్వర్ణంతో ఏకంగా ఎనిమిది పసిడి పతకాల రికార్డు మన ఖాతాలో ఉంది. అలాంటి సమయంలో వచ్చిన కపిల్దేవ్ బృందం సాధించిన వరల్డ్కప్ విజయం దేశంలో క్రికెట్కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ ఆట పంచిన వినోదం దేశంలో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్కప్ తర్వాత ఒకవైపు క్రికెట్ ఉజ్వలంగా వెలుగుతూ ఉవ్వెత్తున దూసుకుపోగా.... దానికి వ్యతిరేక దిశలో హాకీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్లో తిరుగులేని ఆటగా, ఒక మతంగా క్రికెట్ మారిపోయింది. అంచనాలు లేకుండా... 1975లో జరిగిన తొలి ప్రపంచకప్లో భారత్ 3 మ్యాచ్లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్ ఆఫ్రికాపై గెలిచింది. 1979లో రెండో ప్రపంచకప్లో ఆ విజయం కూడా దక్కకుండా సున్నాకు సున్నా మార్కులే వచ్చాయి. పైగా వరల్డ్కప్లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్లే ఆడిన భారత్ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్లో కపిల్దేవ్ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్ అర్హత సాధించింది. లీగ్ దశలో గ్రూప్లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్ తలపడింది. వెస్టిండీస్పై 34 పరుగులతో గెలుపు... 66 పరుగులతో ఓటమి; ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి... 118 పరుగులతో విజయం; జింబాబ్వేపై 5 వికెట్లతో... 31 పరుగులతో విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. 4 మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్ చేరిన మన టీమ్ సెమీస్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. అద్భుతం ఆవిష్కృతం... జూన్ 25, 1983... ఫైనల్కు వెళ్లినా, అప్పటికే లీగ్లో ఓడించినా సరే... దుర్బేధ్యమైన లైనప్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. పైగా ముందుగా బ్యాటింగ్ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్ డెవిల్స్ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్పై భారత్ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మద్రాసులో ‘టై’తక్కలాట...
అద్భుత విజయాలు, ఏకపక్ష ఫలితాలు... అసాధారణ పోరాటాలు, పస లేని ‘డ్రా’లు... 2384 టెస్టు మ్యాచ్ల చరిత్రలో ఎన్నో విశేషాలు జరిగాయి. కానీ రెండు టెస్టు మ్యాచ్లకు మాత్రం క్రికెట్ పుస్తకంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు మ్యాచ్లలో ఇరు జట్ల మొత్తం స్కోర్లు సమమై అసాధారణ రీతిలో ‘టై’గా నిలిచాయి. ఇందులో 1960లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటిది కాగా, రెండో దాంట్లో భారత జట్టు భాగంగా ఉంది. మద్రాసులో 1986లో భారత్–ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు ‘టై’ అయి చరిత్రకెక్కింది. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా 1986 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు మద్రాసులోని చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. భారత్లో ఏ విదేశీ జట్టుకైనా టెస్టు సిరీస్లు పెద్ద సవాలే. ఒకవైపు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై ఓడించి భారత్ అమితోత్సాహంతో ఉండగా... మరోవైపు చాపెల్, రాడ్ మార్‡్ష, లిల్లీ వంటి దిగ్గజాల రిటైర్మెంట్తో బలహీనపడిన ఆసీస్ ఈ సిరీస్కు వచ్చింది. అసాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత, తీవ్ర ఉక్కపోతతో చెన్నపట్నం ఉడికిపోతున్న వేళ ఈ మ్యాచ్ జరిగింది. భారత క్రికెటర్లే తీవ్రంగా ఇబ్బంది పడగా... ఆసీస్ ఆటగాళ్ల గురించి చెప్పేదేముంది. జోన్స్ హీరోచితం... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. డీన్ జోన్స్ (క్రీజులో 502 నిమిషాలు; 330 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత డబుల్ సెంచరీతోపాటు డేవిడ్ బూన్ (332 నిమిషాలు; 258 బంతుల్లో 122; 21 ఫోర్లు), కెప్టెన్ అలన్ బోర్డర్ (255 నిమిషాలు; 172 బంతుల్లో 106; 14 ఫోర్లు, సిక్స్) శతకాలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ను ఆ జట్టు 7 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 397 పరుగులకు ఆలౌటై 177 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయింది. కెప్టెన్ కపిల్ దేవ్ (214 నిమిషాలు; 138 బంతుల్లో 119; 21 ఫోర్లు) వీరోచిత సెంచరీతో జట్టును ఫాలోఆన్ నుంచి తప్పించగా... రవిశాస్త్రి (106 బంతుల్లో 62; 8 ఫోర్లు, సిక్స్), అజహరుద్దీన్ (64 బంతుల్లో 50; 8 ఫోర్లు), కృష్ణమాచారి శ్రీకాంత్ (62 బంతుల్లో 53; 9 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. హోరాహోరీ... ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. చివరి రోజు ఇరు జట్లు కొద్దిసేపు ఆడుకున్నా మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. అయితే బోర్డర్ భిన్నంగా ఆలోచించాడు. మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాలని భావించి ఓవర్నైట్ స్కోరు వద్దే డిక్లేర్ చేశాడు. దాంతో భారత్కు 87 ఓవర్లలో 348 పరుగుల లక్ష్యం ఎదురైంది. మామూలుగానైతే ఇది చాలా కష్టసాధ్యమైన లక్ష్యం కాబట్టి భారత్ జాగ్రత్తగా ఆడుకుంటే టెస్టు ‘డ్రా’ కావడం ఖాయం. అయితే టీమ్లో ప్రతీ ఒక్కరు విజయం కోసం ప్రయత్నించాలని, దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నారు. సునీల్ గావస్కర్ (168 బంతుల్లో 90; 12 ఫోర్లు, సిక్స్), మొహిందర్ అమర్నాథ్ (113 బంతుల్లో 51; 8 ఫోర్లు), అజహరుద్దీన్ (77 బంతుల్లో 42; 3 ఫోర్లు, సిక్స్), శ్రీకాంత్ (49 బంతుల్లో 39; 6 ఫోర్లు), చంద్రకాంత్ పండిత్ (37 బంతుల్లో 39; 5 ఫోర్లు) తలా ఓ చేయి వేశారు. ఒకదశలో 5 వికెట్లకు 291 స్కోరుతో జట్టు సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే తక్కువ వ్యవధిలో 4 వికెట్లు పడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఆసీస్కు అనుకూలంగా మారిపోయింది. అయితే రవిశాస్త్రి (40 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో జట్టును గెలుపు వరకు తీసుకొచ్చాడు. చివరి ఓవర్ డ్రామా... ఆఫ్ స్పిన్నర్ గ్రెగ్ మాథ్యూస్ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 4 పరుగులు కావాలి. అప్పటికే జోరు మీదున్న రవిశాస్త్రి క్రీజ్లో ఉండగా, నాన్స్ట్రయికర్ స్థానంలో స్పిన్నర్ మణీందర్ సింగ్ నిలబడ్డాడు. తొలి బంతిని డిఫెన్స్ ఆడిన రవిశాస్త్రి రెండో బంతిని స్క్వేర్లెగ్ వైపు ఆడాడు. స్టీవ్ వా ఫీల్డింగ్ వైఫల్యంతో రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతికి సింగిల్ తీయడంతో స్కోర్లు సమం కావడంతో పాటు మణీందర్ సింగ్కు స్ట్రయికింగ్ లభించింది. నిజానికి రవిశాస్త్రి ఉన్న ఫామ్కు ఆ సింగిల్ తీయకుండా మిగతా బంతులు తానే ఆడి మ్యాచ్ ముగిస్తే బాగుండేదని అంతా భావించారు. కానీ ఎందుకో శాస్త్రి అలా చేయలేదు. మణీందర్ మూడు బంతులు సమర్థంగా ఎదుర్కొంటే మ్యాచ్ ‘డ్రా’ అవుతుంది. సింగిల్ తీస్తే భారత్ గెలుస్తుంది. తొలి బంతిని ఎలాగోలా ఆడిన అతను తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి ప్యాడ్లను తాకడమే ఆలస్యం... అంపైర్ విక్రమ్ రాజు వేలెత్తేశాడు. నిజానికి ఆసీస్ కూడా గట్టిగా అప్పీల్ చేయలేదు. ఇదేంటి ఇలా అంటూ మణీందర్ అసహనం ప్రదర్శించాడు కానీ అప్పటికే ఆట ముగిసిపోయింది. బంతి తన బ్యాట్కు తాకిందని అతను నమ్మాడు. ఆస్ట్రేలియా జట్టు తాము గెలిచామని భావించి సంబరాల్లో మునిగింది. కాస్త తేరుకున్న తర్వాత టెస్టు ‘టై’గా ముగిసిందని వారికి అర్థమైంది. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 86.5 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు వివాదాస్పద రీతిలో అంపైర్ విక్రమ్ రాజు కూడా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే బంతికి, బ్యాట్కు మధ్య చాలా దూరం ఉందనేది స్పష్టంగా చూశానని, మణీందర్ వికెట్లకు అడ్డంగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పటికీ కూడా తాను సరైన నిర్ణయమే ఇచ్చానని ఆయన చెబుతుంటారు. -
వెలుగులోకి ‘83’ నాటి ఆసక్తికర సంఘటన
న్యూఢిల్లీ: దర్శకుడు కబీర్ ఖాన్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 83. ఇది 1983లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించిన నిజమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఇక చిత్రంలో కపిల్దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి భారత జట్టు ఎలాంటి మలుపుల మధ్య ప్రపంచ కప్ సాధించిందో.. ఆ సమయంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటనలు వంటి ఆసక్తికర అంశాలను, వాస్తవాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు తెరపై చూపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా 1983 క్రికెట్ జట్టు గురించి ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20, 1983.. ఆరోజు జరిగిన గ్రూప్ మ్యాచ్లను దాటి టీమిండియా ముందుకు వెళ్తుందని జట్టు సభ్యులేవరికీ ఆశలు లేవు. గ్రూప్ దశలోనే భారత్ ఇంటి దారి పడుతుందేమోనని టోర్నీ మధ్యలోనే జట్టు తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లను బుక్ చేసుకుంది. ఇంకా చెప్పాలంటే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఆ మధ్యే వివాహం చేసుకున్నారు. గ్రూప్ మ్యాచ్లు ముగిసిన వెంటనే వారి భార్యలతో సెలవులు ప్లాన్ చేసుకుని.. జూన్ 20 రాత్రి న్యూయార్క్ చుట్టేయడానికి టిక్కెట్లను కూడా బుక్ చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏటంటే అప్పటికే జూన్ 22 నుంచి సెమీ ఫైనల్స్ షెడ్యూల్ కూడా ఖరారవడం గమనార్హం. (కపిల్దేవ్కు నిజమైన అభినందన దక్కలేదు) ఇక ఈ టోర్నమెంట్లో భారత్ అంచనాలకు మించి ప్రదర్శన ఇస్తుందని.. సెమీ ఫైనల్స్ చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కనీసం జట్టు సభ్యులు కూడా. ఇక ఆ రోజు అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచడమే కాకుండా మొత్తం టోర్నమెంట్ను గెలుచుకుని క్రికెట్ చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని భారత క్రికెట్ చరిత్రలో చీరస్మరనీయమైన రోజును సంపాదించింది. అయితే 1983కి ముందేప్పుడూ కూడా క్రికెట్ ప్రపంచ కప్ విజయాల పట్టికలో భారతదేశ పటం లేదు. ఇక భారత్ సెమీ ఫైనల్స్ చేరి కప్ సాధింస్తుందని ఎవరూ ఊహించలేదు. కాగా కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజయం వైపు పరుగులు తీస్తుంటే స్టేడియంలో నెలకొన్న ఉత్కంఠ.. కప్ గెలవడంతో జట్టు సభ్యుల్లో మొదలైన భావోద్యేగం, అభిమానుల ఆనంద కేకలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు. ఇక రిలయన్స్ ఎంటర్టైనమెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కపిల్ భార్య పాత్ర నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
175 కు నమో నమః
ఆ జ్ఞాపకాలన్నీ.... మిమ్మల్ని క్రికెట్ వీరాభిమానిగా మార్చిన ఒక్క మ్యాచ్కానీ ఇన్నింగ్స్కానీ గుర్తుందా...? మీరు గ్రాండ్స్లామ్కు సలామ్ కొట్టేందుకు కారణమైన సమరాలు గుర్తున్నాయా...? ఒలింపిక్ క్రీడలు, భారత విజయాలు, ఘనతలు ఏవైనా సరే మనం ఫ్యాన్లుగా భావోద్వేగాలు ప్రదర్శించిన క్షణాలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే ఆ అనుభూతే వేరు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబసభ్యులంతా పాత ఆల్బమ్లు తిరగేస్తున్న వేళ... ఆపాత క్రీడా ఘట్టాలను రోజూ మీ ముందు ఉంచే ప్రయత్నమిది. దాదాపు 37 సంవత్సరాల సమయం ఆ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని, అది చూపిన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేదు. వన్డే క్రికెట్లో వేయికి పైగా శతకాలు నమోదైనా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఈ సెంచరీకి ఉండే ప్రత్యేకతే వేరు. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాచ్లో ఉన్న క్లిష్ట పరిస్థితి, చేసిన పరుగులు, దూకుడైన షాట్లు, తుది ఫలితం... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఇదంతా 1983 ప్రపంచకప్లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ గురించే. అసలు ఆ మ్యాచ్ లేకపోతే భారత క్రికెట్ భిన్నంగా కనిపించేదేమో. టన్బ్రిడ్జ్వెల్స్లోని నెవిల్ గ్రౌండ్ కపిల్ దేవ్ విధ్వంసానికి వేదిౖకైంది. టాస్ గెలిచిన కెప్టెన్ కపిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొంత సమయం ఉందనుకొని షవర్ కోసం బాత్రూమ్కు వెళ్లిపోయాడు. అయితే సహచరుడు వచ్చి రెండు వికెట్లు పడ్డాయని చెప్పగా, ఆ వెంటనే మరొకరు వచ్చి మూడో వికెట్ కూడా పోయిందనడంతో హడావుడిగా బయటకు వచ్చి బ్యాటింగ్కు సిద్ధమయ్యాడు. 9 పరుగులకు నలుగురు ఆటగాళ్లు గావస్కర్, శ్రీకాంత్, మొహిందర్, సందీప్ పాటిల్ అవుట్ కాగా ఆరో నంబర్గా కపిల్ బరిలోకి దిగాడు. ఆ వెంటనే యశ్పాల్ శర్మ కూడా వెనుదిరగడంతో స్కోరు 17 పరుగులకు 5 వికెట్ల వద్ద నిలిచింది. ఈ దశలో ముందుగా నిలదొక్కుకొని ఆపై చెలరేగి ఆడిన కపిల్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. చిన్న మైదానం కావడం కపిల్ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని తగ్గించలేదు. ఒకవైపు బౌండరీ దగ్గరగా ఉండటంతో ఫోర్ల ద్వారా పరుగులు రాబట్టిన ‘పాజీ’... బౌండరీ దూరంగా ఉన్న వైపు నుంచి రెండు, మూడు పరుగులు తీసి తెలివిగా స్కోరును పరుగెత్తించాడు. బౌలర్ తల మీదుగా నేరుగా బాదిన సిక్సర్లు దీనికి అదనం. కపిల్ అద్భుత ప్రదర్శనలో రోజర్ బిన్నీ (22), సయ్యద్ కిర్మాణీ (24 నాటౌట్) అండగా నిలిచారు. చివరకు 181 నిమిషాల తన ఇన్నింగ్స్లో కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 72 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. భారత్ 8 వికెట్లకు 266 పరుగులతో ముగించింది. అనంతరం జింబాబ్వే 235 పరుగులకు ఆలౌట్ కావడంతో కపిల్ సేనకు 31 పరుగుల విజయం దక్కింది. ఆపై ఇండియా సెమీస్ చేరడం, విశ్వవిజేతగా కూడా నిలవడంతో చరిత్ర మారిపోవడం తెలిసిందే. విశేషాలు... అప్పట్లో బ్యాట్స్మన్ ఇన్నింగ్స్ మధ్యలో బ్యాట్ మార్చడం కనిపించకపోయేది. సెంచరీ ముగిశాక కపిల్ బ్యాట్ మార్చి మరింత చెలరేగిపోయాడు. టేపులు చుట్టి ఉన్న ఆ బ్యాట్ బేస్బాల్ బ్యాట్ను తలపించిందని నాటి జింబాబ్వే ఆటగాళ్లు చెప్పుకునేవారు. ఆరంభంలో భారత స్కోరు చూసి నిర్వాహకులు మ్యాచ్ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి లంచ్కి ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని సంశయపడ్డారు. చివరకు 35 ఓవర్ల వద్దే లంచ్ తీసుకున్నాక భారత సహచరులు కపిల్ వద్దకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. అప్పట్లో కపిల్కు పోటీగా భావించిన గావస్కర్... ఒక గ్లాసు మంచి నీరు తీసుకొని అద్భుత ఇన్నింగ్స్ ఆడి వస్తున్న కెప్టెన్కు ఎదురెళ్లి అభినందించడం ప్రత్యేకంగా కనిపించింది. చివరి వికెట్ తీసి మ్యాచ్ను గెలిపించాక కపిల్ కిందకు వంగి మైదానాన్ని ముద్దాడటం విశేషం. అన్నట్లు ఈ మైదానంలో ఇదే, చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాతా మరే మ్యాచ్ జరగలేదు కానీ ఒక్క మ్యాచ్తోనే చరిత్రకు సాక్షిగా నిలిచింది. వీడియో లేదు... దురదృష్టవశాత్తూ ఇంత గొప్ప ఇన్నింగ్స్ను టీవీ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసారంలోగానీ వీడియో రికార్డింగ్కానీ చూసే అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ నిర్వాహకులు ఆస్ట్రేలియా–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ చూపించేందుకు మొత్తం ఎక్విప్మెంట్ తరలించగా... ప్రఖ్యాత బీబీసీ సంస్థ ఆ రోజు సమ్మెలో ఉండటంతో లైవ్ సాధ్యం కాలేదు. అయితే సమ్మెలో ఉన్నా ఒక దశలో బీబీసీ రిపోర్టర్ ఒకరు భారత్ ఇన్నింగ్స్ సమయంలోనే జింబాబ్వే గెలుస్తుందని భావించి మైదానానికి రావాలా అని జట్టు మేనేజర్ డేవ్ బ్రౌన్ను కోరగా... ఆయన తొందరపడవద్దని తిరస్కరించాడు. అయితే వీడియో రికార్డింగుకు సంబంధించి ఒక కథనం ప్రచారం ఉన్నా దానిపై సందేహాలున్నాయి. మ్యాచ్కు హాజరైన ఒక భారత అభిమాని తన వీడియో కెమెరాతో కపిల్ ఇన్నింగ్స్ షూట్ చేసి భారీ మొత్తాలకు చాలా మందికి అమ్ముకున్నాడని వినిపించింది. చివరకు కపిల్ దేవ్ కూడా పెద్ద మొత్తం అతనికే చెల్లించి సంతోషంగా ఆ టేపును తీసుకున్నాడని కూడా అన్నారు. అయితే యూట్యూబ్తో పాటు ఇంతగా సోషల్ మీడియా పెరిగిపోయిన కాలంలో కపిల్ సహా అభిమానులు ఎవరైనా ఇప్పటి వరకు దానిని పోస్ట్ చేయకుండా ఉంటారా...? -
కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం!
కరోనా వైరస్ కష్టాలు పేద వారికే కాదు సంపన్నులకు, సెలబ్రెటీలకు కూడా తప్పటం లేదు. ఏదో ఒక విషయంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా భారత క్రికేట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్ లాక్డౌన్ కారణంగా కూతురితో చేయించుకున్న హేయిట్ కట్ వికటించి, నున్నగా గుండు గీయించుకోవాల్సి వచ్చింది. తన న్యూలుక్ గురించి మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ జుట్టు బాగా పెరగటంతో అమియా(కూతరు)ను హేయిర్ కట్ చేయమని అడిగాను. తను నా జుట్టును చాలా చిన్నగా కత్తిరించింది. దీంతో నేను పూర్తిగా గుండు గీయించుకుని, ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకున్నాన’’ని చెప్పారు. ( కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్ ) అనంతరం లాక్డౌన్ అనుభవాలను పంచుకుంటూ.. ‘‘ ప్రస్తుతం ఇంట్లో వారికి అన్ని రకాలుగా సహయపడుతున్నాను. రోమీ(భార్య), అమియాలకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. ఇంటి పనుల్లోనూ, వంట పనుల్లోనూ సహాయపడుతున్నా. నా షూలను పాలిష్ చేసుకోవటం మాత్రం నావల్ల కావటం లేద(నవ్వుతూ)’’ని అన్నారు. కాగా, కపిల్ న్యూలుక్పై స్పందించిన మాజీ భారత క్రికేటర్ సంజయ్ మంజ్రేకర్. కపిల్ న్యూలుక్ తనకెంతో నచ్చిందని, దాన్నలగే కొనసాగించాలని కోరారు. ( గాళ్ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే.. ) -
మా దగ్గర సరిపడా డబ్బు ఉంది!
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్–19)పై పోరాడటానికి అవసరమైన డబ్బును విరాళాల రూపంలో సేకరించడానికి భారత్, పాకిస్తాన్ మధ్య ప్రేక్షకులు లేకుండా మూడు వన్డే మ్యాచ్లు నిర్వహిస్తే బాగుంటుందని సూచించిన పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్కు భారత దిగ్గజ ఆల్రౌండర్, కపిల్దేవ్ కౌంటర్ ఇచ్చాడు. ‘భారత్ దగ్గర తగినంత డబ్బు ఉంది. దాని కోసం క్రికెట్ ఆడుతూ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం భారత క్రికెటర్లకు లేదు. ఇప్పటికే కరోనాపై పోరడటానికి తమ వంతుగా రూ.51 కోట్లను భారత ప్రభుత్వానికి బీసీసీఐ అందజేసింది. ఒకవేళ అవసరం అయితే మరింత డబ్బును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు డబ్బు కోసం మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇటువంటి సమయంలో క్రికెటర్లతో రిస్క్ చేయాలని బీసీసీఐ భావిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం మేమంతా ఈ సంక్షోభం నుంచి ఎలా భయటపడాలనే దాని గురించి ఆలోచిస్తున్నాం. అయినా మూడు మ్యాచ్లతో నువ్వు ఎంత డబ్బు సేకరిస్తావు’ అక్తర్కు చురకంటించాడు. -
అక్తర్ వ్యాఖ్యలకు కపిల్ కౌంటర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంతో పాటు.. పాకిస్తాన్లోనూ కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా ఇరు దేశాలు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడితే బాగుంటుందని సూచించాడు. తద్వారా వచ్చే విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించకుండా.. కేవలం టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నాడు. దీనిపై ఇప్పటివరకూ భారత్ నుంచి స్పందన రాకపోగా, తొలిసారి టీమిండియా మాజీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ మాత్రం కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదంటూ అక్తర్కు చురకలంటించాడు. (భారత్ సాయం కోరిన అక్తర్) ‘భారత్-పాక్ల మధ్య సిరీస్ జరగాలని కోరడం అతని అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కరోనా కట్టడి కోసం భారత్ విరాళాలు కోసం ఇలా సిరీస్లు సిద్ధ కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. తాజా పరిస్థితుల్లో ఏది ముఖ్యం. .ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడం కావాలి. అది వదిలి క్రికెట్ సిరీస్లు ఏమిటి. ఇప్పటికే కరోనా సంక్షోభంతో ప్రభుత్వానికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ పరిస్థితుల్లో భారత్ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. క్రికెటర్లతో ఎలా రిస్క్ చేస్తాం. అసలు మూడు మ్యాచ్లతో ఎంత నగదును సంపాదిస్తాం. నాకు తెలిసినంత వరకూ ఐదు-ఆరు నెలల పాటు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరమేలేదు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలి. అదే సమయంలో పేద వారి ఆకలి బాధను తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వైరస్పై ఎవరూ రాజకీయాలు చేయొద్దు. నేను ఇప్పటికే టీవీల్లో చూశా. ఈ వైరస్ నియంత్రణలో కూడా రాజకీయ కోణాలు కనబడుతున్నాయి. ఇది సరైనది కాదు’ అని కపిల్ పేర్కొన్నాడు. (ధోని గేమ్ మార్చాడు.. అందుకే పట్టు కోల్పోయాడు) -
‘కరోనాపై పోరాటంలో గెలుస్తాం’
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో అంతా సానుకూల ధోరణితో ముందుకు సాగాలని టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్దేవ్ పిలుపునిచ్చాడు. ఈ పోరాటంలో గెలవడానికి ముందుగా మనమంతా చేయాల్సింది ఇంట్లో ఉండటమేనన్నాడు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వైరస్ను నిరోధించాలంటే ఎవరు ఇళ్లల్లో వారు ఉండటమే ఉత్తమం అని పేర్కొన్నాడు ప్రస్తుత పరిస్థితిని ప్రతీ ఒక్కరూ చాలెంజ్గా తీసుకోవాల్సి ఉందని కపిల్ తెలిపారు. ఇప్పుడు నీ ప్రపంచం నీ ఇంట్లోనే ఉందనే విషయం తెలుసుకోవాలన్నాడు. పుస్తకాలు చదువుతూ, టీవీ చూస్తూ, మ్యూజిక్ వింటూ నచ్చిన పనులు చేస్తూ వచ్చే వినోదాన్ని ఆస్వాదించాలన్నాడు. (సచిన్ తలో రూ. 25 లక్షలు..) ఈ ఖాళీ సమయంలో తాను కూడా లాక్డౌన్లో ఉండి కొన్ని ఇంటి పనులను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని కపిల్ తెలిపాడు. ‘నేను ఇంటిని ఊడ్చుతున్నా. గార్డెన్ను క్లీన్ చేస్తున్నా. నా చిన్న గార్డెన్ ఇప్పుడు గోల్ఫ్ ఆడే స్థలంగా కూడా మారిపోయింది. ఇక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మిస్సయ్యానో దాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నా’ అని కపిల్ పేర్కొన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దన్నాడు. ఇక్కడ ధైర్యాన్నికోల్పోవడం అంటే బయటకెళ్లి తిరగడం కాదని, ఇంటి పట్టునే ఉండి కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలన్నాడు. అలా చేస్తే కరోనాపై మనదే విజయమన్నాడు. ఇక క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే.. ‘ నీవు సెంచరీ చేసిన తర్వాత ఇన్నింగ్స్లో డకౌట్ అయినా, ఒక మంచి బౌలింగ్ స్పెల్ తర్వాత వికెట్ లేకండా మరొక ఇన్నింగ్స్ను ముగించినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాంటిదే ఇప్పుడు కరోనాపై చేస్తున్న పోరాటం. నమ్మకాన్ని వదలొద్దు’ అని కపిల్ తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు అంతా సహకరించాల్సి ఉందన్నాడు. (ఏమిరా చహల్.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో!) -
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ఫండ్ రైసింగ్ కార్యక్రమం
-
'కెరీర్లో ధోనీ చివరిదశలో ఉన్నాడు'
నోయిడా : ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనాలంటే ఎంఎస్ ధోనీ ఈసారి వీలైనన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. హెచ్సీఎల్ 5 వ వార్షికోత్సవం గ్రాండ్ ఈవెంట్ను గురువారం నోయిడాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కపిల్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' ఐపీఎల్లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలో మనం గర్వించే ఆటగాళ్లను వచ్చే పదేళ్లలో చూడనున్నాం.నా దృష్టిలో ధోనీ ఇప్పటికే దేశానికి చాలా సేవలందించాడు. అయితే ఒక అభిమానిగా మాత్రం ధోనీ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఇదంతా జట్టును ఎంపిక చేసే మేనేజ్మెంట్పై ఆధారపడి ఉంటుంది. కాగా ధోని అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఏడాది పూర్తి కావొస్తోంది. అక్టోబర్లో మొదలయ్యే టీ20 విశ్వసమరంలో పాల్గొనే టీమిండియా జట్టులో ఉండాలంటే ధోని వచ్చే ఐపీఎల్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలి. ధోని తన కెరీర్లో చివరి దశలో ఉన్నాడు. ఒక అభిమానిగా తను జట్టులో ఉండాలని కోరుకుంటున్నా.. కానీ కొత్త తరానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తా' అని పేర్కొన్నాడు. (ధోని.. ఈసారి పిచ్ను దున్నేశాడుగా..!) ఇక కివీస్ పర్యటనలో వరుసగా తమ ఆటతీరులో విఫలమవుతూ వస్తున్న జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లిల ప్రదర్శనపై ఆందోళన అక్కర్లేదని కపిల్ తెలిపాడు. 'ఆటగాళ్లు గాయపడి తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు వారు నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు బుమ్రా కూడా అదే స్టేజీలో ఉన్నాడు. వెన్నుముక గాయం నుంచి కోలుకొని తిరగివచ్చిన బుమ్రా కివీస్తో జరిగిన వన్డే సిరీస్లో వికెట్లు తీయడంతో విఫలమయ్యాడు. ఒక బ్యాట్స్మెన్ ఒక మంచి ఇన్నింగ్స్ కోసం ఎలా ఐతే ఎదురుచూస్తాడో.. ఒక బౌలర్ కూడా గుడ్స్పెల్ కోసం అదే విధంగా ఎదురుచూస్తాడు. కోహ్లి ప్రదర్శనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతను ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశం ఉందని' తెలిపాడు.(అలా అయితే ఐపీఎల్ మానేయండి: కపిల్) కివీస్తో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ను తీసుకోకపోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, అది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయమని కపిల్ పేర్కొన్నాడు. తొలి టెసుట్లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలవడం క్రైస్ట్చర్చిలో శనివారం నుంచి జరగనునన్న రెండో టెస్టులో ఎలాంటి ప్రభావం చూపదన్నాడు. ఇంతకుముందు కూడా ఫాస్ట్, బౌన్సీ పిచ్లపై షార్ట్బాల్స్తో తడబడినా టీమిండియా ఫుంజుకుందని తెలిపాడు. ఇక మహిళల టీ20లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న మహిళల జట్టును కపిల్ ప్రశంసించారు. మహిళల జట్టు బాగా ఆడుతోందని, పైనల్లో గెలిచి ఎలాగైనా కప్ గెలవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కపిల్దేవ్ వెల్లడించాడు. (మార్చి 2న మైదానంలోకి ధోని) -
అలా అయితే ఐపీఎల్ మానేయండి: కపిల్
న్యూఢిల్లీ: తీరిక లేని క్రికెట్ కారణంగా అలసిపోతున్నామని భావించే భారత క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించారు. విశ్రాంతి లేకుండా విపరీతంగా క్రికెట్ ఆడుతున్నామనుకునేవారు ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ఉత్తమం అని అన్నారు. ‘బిజీ షెడ్యూల్తో తీరిక దొరకడం లేదని భావించే వారు ఐపీఎల్ నుంచి తప్పుకోండి. అక్కడ మీరేమీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు కాబట్టి లీగ్కు బ్రేక్ ఇచ్చే వెసులుబాటు మీ చేతుల్లోనే ఉంది. దేశానికి ఆడటంలో ఉండే అనుభూతి వేరు. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు అత్యుత్తమ ఆట కనబరచాలి. ఫ్రాంచైజీ క్రికెట్ కారణంగా ఆ ఆట వెనుకబడకూడదు. లీగ్ల్లో శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డి జాతీయ జట్టు తరఫున విఫలమవ్వకూడదు’ అని కపిల్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం) అలసట అనేది కేవలం శారీరక మార్పులపైనే కాకుండా మానసిక స్థితి, ఉద్వేగాలపై కూడా ఆధారపడుతుందని కపిల్ అన్నాడు. ‘ఒక సిరీస్లో ప్రతీ మ్యాచ్ ఆడుతూ పరుగులు చేయడంలో విఫలమైతే అలసిపోయిన భావన కలుగుతుంది. అదే సమయంలో వికెట్లు పడగొడుతున్నప్పుడు ఏకధాటిగా 30 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా మనలో అలసట ఉండదు. ఇది మన ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది’ అని కపిల్ వివరించాడు. (ఇక్కడ చదవండి: సమం చేస్తారా?) -
టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం
వెల్లింగ్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో ఘోర ఓటమి తర్వాత పుంజుకున్న ఆతిథ్య కివీస్ జట్టు వన్డే సిరీస్, తొలి టెస్టుల్లో అద్వితీయమైన ఆటతీరుతో అబ్బురపరిచే విజయాలను అందుకుంటోంది. ఇక టీమిండియా తొలి టెస్టు ఓటమిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి కపిల్ దేవ్ టెస్టు ఓటమిపై స్పందిస్తూ పలు ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘వన్డే, తొలి టెస్టుల్లో కివీస్ ఆడిన తీరు అమోఘం. ఓటమి తర్వాత వారు పుంజుకున్న విధానం, సారథిగా విలియమ్సన్ ముందుండి నడిపించే విధంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే మేనేజ్మెంట్ను పలు ప్రశ్నలు అడగదల్చుకున్నా. ప్రతీ మ్యాచ్కు కొత్త జట్టా? పదకొండు మందితో కూడిన ఓ జట్టును వరుసగా మ్యాచులు ఆడించరా? ప్రతీ మ్యాచ్ కోసం జట్టులో మార్పులు చేస్తునే ఉంటారా? ఇలా మార్చుకుంటూ వెళ్లడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు? గత కొంతకాలంగా సీనియర్ ప్లేయర్స్ మినహా ఏ ఒక్క యువ ఆటగాడినైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా? జట్టులో తన స్థానంపై నమ్మకం లేనప్పుడు ఆ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఏలా చేయగలడు?’అంటూ టీమ్ మేనేజ్మెంట్ను కపిల్దేవ్ ప్రశ్నించాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్లో ప్రపంచ శ్రేణి మేటి బ్యాట్స్మెన్ ఉన్నా తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్లో కూడా 200 పరుగులు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతీసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు.. కొన్ని సార్లు పోరాడి జయించాలి. అంతేకాని పరిస్థితులకు దాసోహం కాకూడదు. తుది జట్టును ఎంపిక చేసేముందు ఆటగాడికి బలమైన నమ్మకాన్ని ఇవ్వాలి. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తనను తాను ప్రశ్నించుకోవాలి. ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను టెస్టు జట్టులోకి తీసుకోలేదు. టీ20, వన్డేల్లో పరుగులు రాబట్టిన ఆటగాడిని పక్కన కూర్చోబెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? ఫామ్లో ఉన్న ఆటగాడిని ఆడించడం జట్టుకు, ఆ క్రికెటర్కు ఎంతో లాభం’అంటూ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. చదవండి: సిగ్గు పడాల్సిందేమీ లేదు: కోహ్లి ‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’ ‘ఆ విషయంలో ఆమెకు ఫుల్ లైసెన్స్’ -
కపుల్ దేవ్
‘‘తన కలల కంటే కూడా తన భర్త కలల్ని తనవిగా భావించే స్త్రీలందరికీ ఈ సినిమా అంకితం’’ అంటున్నారు దీపికా పదుకోన్. 1983లో భారత జట్టు తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ను గెలిచిన సంఘటన ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకోన్ చేశారు. ఆల్రెడీ రణ్వీర్ లుక్ని విడుదల చేశారు. రణ్వీర్–దీపికా కలిసి ఉన్న లుక్ను బుధవారం విడుదల చేశారు. వివాహం తర్వాత ఈ కపుల్ కలసి నటించిన చిత్రమిది. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన సంఘటనతో తీసిన సినిమాలో చిన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు దీపికా. ‘83’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
ధోని రిటైర్మెంట్పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని కెరీర్పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచప్లో ఓటమి తరువాత అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మహీ.. అప్పటి నుంచి మైదానంలో కనిపించలేదు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లోనూ మాజీ కెప్టెన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. మహేంద్రుడు ఇక ఆటకు గుడ్బై చెప్పినట్లే అని సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఈ క్రమంలోనే ధోని భవిష్యత్తుపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగానూ మారాయి. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ సారథి కపిల్ దేవ్ ధోని భవిష్యత్తుపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. (ధోని భవితవ్యంపై రవిశాస్త్రి) సోమవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ తరువాత ధోని మళ్లీ మైదానంలో కనిపించలేదు. దాదాపు ఆరునెలల సమయం ఆటకు దూరంగా ఉంటే.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అంత సాధారణమైన విషయం కాదు. అయితే ధోనికి ముందు ఐపీఎల్ రూపంలో మంచి అవకాశం ఉంది. అక్కడ ధోని కనుక రాణిస్తే బీసీసీఐ నుంచి మళ్లీ పిలువు ఊహించవచ్చు. ఐపీఎల్లో ఆడే ఆటతోనే అతని భవితవ్యం ముడిపడి ఉంది. లేకపోతే ధోనిని జట్టులోకి ఎంపికచేయడం చాలా కష్టం. ధోని భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడు. కానీ ఆరునెలల పాటు జట్టుకు దూరంగా ఉంటే రిటైర్మెంట్పై సందేహాలు రావడం సహజమే’ అని కపిల్ అభిప్రాయపడ్డాడు. -
రిషభ్ పంత్కు కపిల్ సూచన
చెన్నై: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతేనే మంచిదని దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. తన ఆట తీరుపై ఎవరూ విమర్శలు చేసినా వారికి తిరిగి నోటితో సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. రిషభ్కు సమయం వచ్చినప్పుడు బ్యాట్తోనే అందుకు బదులిస్తే బాగుంటుందన్నాడు. ‘ రిషభ్.. నీపై వస్తున్న విమర్శలపై కౌంటర్ ఎటాక్ చేయాల్సిన అవసరం లేదు. వారి మాటలు తప్పని బ్యాట్తోనే సమాధానం ఇవ్వు. విమర్శకుల నోటికి బ్యాట్తోనే తాళం వేయి. అంతవరకూ నిరీక్షించు.. కానీ విమర్శలకు దిగవద్దు. పంత్ ఒక టాలెంట్ ఉన్నక్రికెటర్. ఇప్పుడు అతని కెరీర్ను గాడిలో పెట్టుకోవడంపైనే దృష్టి పెట్టాలి. అంతేకానీ విమర్శలకు ప్రతి విమర్శ వద్దు. నీ సమయం వచ్చినప్పుడు బ్యాట్తో సమాధానం చెప్పు’ అని కపిల్ పేర్కొన్నాడు. శనివారం చెన్నైలోని ఓ ప్రొమోషనల్ ఈవెంట్కు హాజరైన కపిల్..రిషభ్ పంత్ ఒక నైపుణ్యం ఉన్న ఆటగాడన్నాడు. ‘నీలో టాలెంట్ ఉంటే ఇక ఎదుటివారిపై విమర్శలు ఎందుకు. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ వారి ప్రతిభతోనే విమర్శకుల నోళ్లకు తాళం వేస్తారు. అదే వారి పని. అంతే కానీ విమర్శలపై తిరిగి విమర్శలు చేయడం మంచిది కాదు’ అని కపిల్ పేర్కొన్నాడు. ఇక ఆసీస్తో వన్డే సిరీస్లో గాయం కారణంగా రిషభ్ దూరం కాగా, ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. (ఇక్కడ చదవండి: పంత్ మొహం మొత్తేశాడా?) అటు తర్వాత రిషభ్ గాయం నుంచి కోలుకున్నా రాహుల్నే కీపర్గా కొనసాగిస్తూ వస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. న్యూజిలాండ్తో సిరీస్లో కూడా రాహుల్నే కీపర్గా తుది జట్టులోకి తీసుకుంటున్నారు. దాంతో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్లు రిజర్వ్ బెంచ్కే పరిమితమవుతున్నారు. కాగా, దీనిపై కపిల్ను అడగ్గా.. అది టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయమన్నాడు. దాని గురించి తనకు తెలీయదన్నాడు. అది తాను డిసైడ్ చేసేది కాదని, ఎవర్నీ ఎలా పంపాలో మేనేజ్మెంట్ చూసుకుంటుందని కపిల్ తెలిపాడు. -
శ్రీకాంత్గా నటించడం ఓ వరం
చెన్నై: ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్గా నటించడం వరం అని యువ నటుడు జీవా పేర్కొన్నారు. పూర్వ భారత క్రికెట్ క్రీడా జట్టు కెప్టెన్ కపిల్దేవ్ బయోపిక్ను 83 పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 1983లో కపిల్దేవ్ కెప్టెన్సీలో ప్ర పంచకప్ను సాధించిన జట్టులో కృష్ణమాచారి శ్రీ కాంత్ భాగస్వామ్యం ఎంతో ఉందన్నది అందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆయన ఒక క్రికె ట్ క్రీడాకారుడిగా తమిళనాడుకు పేరు తీసుకొచ్చారు. కాగా ఈ 83 చిత్రంలో కృష్ణమాచారి శ్రీ కాంత్ పాత్రలో నటుడు జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆ పాత్రకు నటుడు జీవాను ఎంచుకోవ డం గురించి చిత్ర దర్శకుడు కబీర్ఖాన్ తెలుపుతూ చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్ గురించి ఆ లోచించగా ఆయన చలాకీతనం, వేగం, బ్యాటింగ్లో తనదైన స్టైల్ ప్ర ధానాంశాలు అనిపించాయన్నారు. అదేవిధంగా 1983లో ప్రపంచకప్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న 83 చిత్రంలో అప్పటి జట్టులో ఉన్న వారి పాత్రల్లో నటులను ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అప్పుడు కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో ఎవరిని నటింపజేయాలన్న విషయంలో ఆయన మా దిరి చలాకీగా ఉండే నటుడి కోసం అన్వేషించగా నటుడు జీవా బాగా నప్పుతారని భావించామన్నారు. జీవాలోనూ మంచి క్రికెట్ క్రీడాకారుడు ఉండటంతో 83 చిత్రానికి మరింత బలం చేకూరిందని చెప్పారు. కాగా కృష్టమాచారి శ్రీకాంత్ బ్యాటింగ్ స్టైల్ ను అనుచరించడం కోసం జీవా చాలా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్రలో జీవా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని దర్శకుడు అన్నారు. కాగా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించడం గురించి జీవా మాట్లాడు తూ క్రికెట్ క్రీడ అంటే తనకు చిన్న వయసు నుంచే ఇష్టం అన్నారు. అలాంటిది 83 చిత్రంలో కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో పట్టరాని ఆనందం కలిగిందన్నారు. తన జీవితంలో రెండు లక్ష్యాలు ఒకే సా రి నెరవేరుతున్నట్లు భావన కలిగిందని అన్నా రు. నటుడు అయిన తరువాత తనకు ఇష్టమైన రంగం క్రికెట్ అని పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ వి ధి విధానాలను తమిళనాడులో పరిచయం చే సింది కృష్ణమాచారి శ్రీకాంత్నేనని అన్నారు. అలాంటి పాత్రలో నటించడం తనకు వరం లాంటిదని జీవా పేర్కొన్నారు. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు కబీర్ ఖాన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన ని అన్నారు. ఇక ఇండియాలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రణ్వీర్సింగ్తో కలసి ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నా రు. కాగా 83 చిత్రం సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
ఏ క్రికెటర్కు సాధ్యం కాని ఘనత
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ భారత్ క్రికెట్ జట్టు రెండుసార్లు మాత్రమే వన్డే వరల్డ్కప్ను సాధించింది. అందులో హరియాణా హరికేన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తొలి వరల్డ్కప్ను అందుకుని యావత్ దేశ కలను సాకారం చేసింది. 1983లో అండర్ డాగ్గా బరిలోకి దిగిన కపిల్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు.. ఫేవరెట్గా బరిలోకి దిగిన వెస్టిండీస్ను మట్టికరిపించి మెగాట్రోఫీని ముద్దాడింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 184 పరుగుల టార్గెట్ను మాత్రమే నిర్దేశించినా, దాన్ని కాపాడుకుని కప్ గెలవడం విశేషం. వెస్టిండీస్ను 140 పరుగులకే ఆలౌట్ చేసి భారత జట్టు మొదటిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఆ టోర్నీ ఆద్యంతం భారత్ను విజయ పథాన నడిపించిన కపిల్దేవ్ 61వ బర్త్ డే సందర్భంగా అతని గురించి మరొకసారి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. హరియాణా తరఫున 17 ఏళ్లు క్రికెట్ను ఆడాడు. 1975 నుంచి 1992 వరకూ హరియాణా జట్టు సభ్యుడిగానే ఉన్నాడు 1975-76 అరంగేట్రపు ఫస్ట్క్లాస్ సీజన్లో 30 మ్యాచ్లు ఆడిన కపిల్ 121 వికెట్లు సాధించడం ద్వారా అతను భారత్ క్రికెట్ జట్టు సెలక్టర్లను ఆకర్షించాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్లు సాధించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 1983-84ల్లో ఇంగ్లిష్ కౌంటీ క్లబ్స్ వార్సెస్షైర్ తరఫున ఆడిన కపిల్.. 1981నుంచి 83వరకూ నార్తాంప్టాన్షైర్ తరఫున ఆడాడు. 1978 పాకిస్తాన్తో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్లో 184 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన కపిల్ దేవ్ ఏనాడూ రనౌట్ కాలేదు. ఇది ఏ ఒక్క క్రికెటర్కి ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. 1983 వరల్డ్కప్ ఫైనల్లో విండీస్ దిగ్గజ ఆటగాడు రిచర్డ్స్ మిడ్ వికెట్పై షాట్ కొట్టగా కపిల్ వెనక్కి పరుగెడుతూ వెళ్లి దాన్ని క్యాచ్గా అందుకున్నాడు. అది భారత్ వరల్డ్కప్ గెలవడానికి టర్నింగ్ పాయింట్. టెస్టుల్లో ఐదు వేల పరుగులు, 400కి పైగా వికెట్లు సాధించిన ఏకైక ఆటగాడు కపిల్దేవ్ 2002లో విజ్డెన్ కపిల్ను భారత శతాబ్దపు క్రికెటర్గా ఎంపిక చేసింది. 2002లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కపిల్కు చోటు దక్కింది. 1979-80 సీజన్లో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా వంద వికెట్ల మార్కును, వెయ్యి పరుగుల మార్కును చేరాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన పిన్నవయస్కుడిగా కపిల్దేవ్ గుర్తింపు సాధించాడు. కపిల్దేవ్ 434 వికెట్లు సాధించడం ద్వారా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డు సాధించాడు. అప్పటివరకూ న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(431) పేరిట ఉన్న రికార్డును కపిల్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో కపిల్ రికార్డును విండీస్ పేసర్ కర్ట్నీ వాల్ష్ బద్ధలు కొట్టాడు. 1983 వరల్డ్కప్లో 303 పరుగులు, 12 వికెట్లతో పాటు 7 క్యాచ్లను అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కపిల్ దేవ్ 175 పరుగులు సాధించి జట్టును గెలిపించి సెమీస్కు చేర్చాడు.