Kapil Dev
-
నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు. అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.దారుణ వైఫల్యాలుఅంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లియామ్ లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లోఇక ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా.అదే విధంగా కోచ్ గౌతం గంభీర్కు కూడా గుడ్లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవుఅయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!పొగిడినవాళ్లు.. తిడతారు కూడానేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా
అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పరామర్శించాడు. కాంబ్లీతో ఫోన్లో సంభాషించి అతడికి ధైర్యం చెప్పాడు. అదే విధంగా కాంబ్లీకి చికిత్స అందించిన వైద్యులకు కపిల్ దేవ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.కపిల్ దేవ్తో వీడియో కాల్మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా కాంబ్లీకి చికిత్స అందించిన ఆకృతి ఆస్పత్రి డైరెక్టర్.. కపిల్ దేవ్(Kapil Dev)కు వీడియో కాల్ చేసి కాంబ్లీతో మాట్లాడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన కాంబ్లీ.. ‘‘హాయ్.. కపిల్ పాజీ ఎలా ఉన్నారు’’ అంటూ పలకరించగా.. కపిల్ దేవ్ కూడా ఆప్యాయంగా బదులిచ్చాడు. లవ్ యూ.. తొందర్లోనే వస్తాను‘‘నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తాను. మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తే మాత్రం అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! గడ్డానికి కూడా రంగేసుకున్నావు. కానీ దేనికీ ఇప్పుడే తొందరపడవద్దు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మునుపటి జీవితం గడుపగలవు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పక పాటించు. తొందర్లోనే నేను వచ్చి కలుస్తాను. సరేనా.. లవ్ యూ’’ అని కపిల్ దేవ్ కాంబ్లీకి భరోసా ఇచ్చాడు. కాగా ఇంటికి చేరుకున్న అనంతరం కాంబ్లీ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. ‘‘మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది’’ అని పేర్కొన్నాడు. సచిన్ టెండుల్కర్ బాల్య మిత్రుడుమరోవైపు.. కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని... కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది పేర్కొన్నారు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండుల్కర్(Sachin tendulkar)కు బాల్య మిత్రుడు. ఇద్దరూ ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.అయితే, సచిన్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ లెజెండరీ బ్యాటర్గా ఎదగగా.. కాంబ్లీ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఇటీవల తమ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్ను కలిసిన కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. కపిల్ సేన ఆర్థిక సాయం!ఈ క్రమంలో అతడిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తగా. కపిల్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, కాంబ్లీ చెడు అలవాట్లు మానేసి.. పునరావాస కేంద్రానికి వెళ్తేనే సహాయం అందిస్తామని షరతు పెట్టగా.. అతడు అందుకు అంగీకరించాడు. తాను మందు, పొగ తాగటం మానేశానని చెప్పాడు. చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!? -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్టైమ్ రికార్డు బ్రేక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సైతం బుమ్రా నిప్పుల చేరిగాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లోనూ 4 వికెట్లతో సత్తాచాటాడు. ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ వంటి కీలక వికెట్లను పడగొట్టి భారత్ను తిరిగి గేమ్లోకి తీసుకువచ్చాడు.ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. బుమ్రా ఇప్పటివరకు ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) పేరిట ఉండేది. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.తాజా మ్యాచ్తో కపిల్ దేవ్ అల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో బుమ్రా తన 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.ఇక మ్యాచ్ విషయాని వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో నాథన్ లియోన్(41 నాటౌట్), స్కాట్ బోలాండ్(10 నాటౌట్) ఉన్నారు.చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్ -
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే? -
రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి: కపిల్ దేవ్
టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఆసీస్తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం బరిలోకి దిగాడు. ఈ డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.అదేవిధంగా కెప్టెన్సీ పరంగా రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫామ్, కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం రోహిత్కు మద్దతుగా నిలిచారు. రోహిత్ సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని కపిల్ అన్నారు.‘రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి. ఏళ్ల తరబడి భారత క్రికెట్లో చిరస్మరణీయ విజయాలకు అవసరమైన పరుగులెన్నో చేశాడు. అలాంటి క్రికెటర్ సామర్థ్యంపై ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు. నాకైతే అస్సలే డౌటు లేదు.త్వరలోనే తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడు. ఒకట్రెండు ప్రదర్శనలతోనే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేయడం తగదు. ఆ నాయకుడే ఆరు నెలల క్రితం భారత్ టి20 ప్రపంచకప్ అందించాడన్న సంగతి మరిచిపోవద్దు. రోహిత్ మరింత బలంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాను" అని కపిల్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.చదవండి: PKL 2024: తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి.. -
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.అయితే, అతడు రిహాబ్ సెంటర్కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా మొదటి టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలాఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21)ని అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. ఓవరాల్గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సారథిగా మొదటిది.ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్ మన్కడ్, బిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు1. వినోద్ మన్కడ్(1)2. బిషన్ బేడి(8)3. కపిల్ దేవ్(4)4. అనిల్ కుంబ్లే(2)5. జస్ప్రీత్ బుమ్రా(1)టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లు1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్లు) 2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్లు) 3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్లు) 4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్లు) 5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్లు) 6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్లు) 7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్లు) 8. సుభాశ్ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్లు) 9. జస్ప్రీత్ బుమ్రా - 11 (41 మ్యాచ్లు) 10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్లు) 11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్లు)ఇదిలా ఉంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Make that FIVE! There's the first five-wicket haul of the series #MilestoneMoment #AUSvIND @nrmainsurance pic.twitter.com/t4KIdyMTLI— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్లో 7 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్గా తన రెండో టెస్ట్లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆసీస్తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు తెరలేవనుంది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్దేవ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్కు తప్పని ఓటమి -
'రూమ్లో కూర్చుంటే కుదరదు'. భారత ప్లేయర్లపై కపిల్దేవ్ ఫైర్
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో టీమిండియా వైట్వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్లో వైట్వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.రూమ్లో కూర్చుంటే కుదరదు.."క్రికెట్ బేసిక్స్కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.కాగా కివీస్ టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్స్టోరీ! (ఫొటోలు)
-
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్కు చోటు లేదుఅయితే, వరల్డ్కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్కాస్ట్లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్రౌండర్గా ఎదిగిన యువీ.. క్యాన్సర్ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్లో కాదు. ప్రపంచకప్లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్కప్లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్కప్లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్కప్ ఫైనల్లో భారత్పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్కు ఐదో స్థానం.. 1997లో భారత్పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్కు ఆరో స్థానం.. 2023 వరల్డ్కప్లో భారత్పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్కు పదో స్థానం దక్కాయి. -
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్..
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచేందుకు మనం తీవ్రంగా శ్రమించాలి. ఇది మనకు చావో రేవో. ప్రత్యర్ధి ఎవరన్నది మనకు అనవసరం.మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే తప్ప తర్వాత అనవసర చర్చలు పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు భారత ఆటగాళ్లకు కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన మాటలు.25 జూన్ 1983.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్కప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్కప్ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాపడించింది. ఈ విజయంతో యావత్తు భారత్ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ వరల్డ్కప్తో పాటు భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది.నిప్పులు చేరిగిన విండీస్ బౌలర్లు..అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. లక్ష్యచేధనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు.కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ను ఔట్ చేసి విండీస్ బౌలర్లు భారత్ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్డౌన్లో వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ భారత స్కోర్ 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాంత్(38), అమర్నాథ్(26) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.ఆరంభం ఆదుర్స్..ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊదిపడేస్తుందని అంతా భావించారు. భారత ఓటమితో ఇంటిముఖం పట్టకతప్పదని అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ను ఔట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మదన్లాల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. అయితే ఈ సమయంలో దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.మదన్ లాల్ మ్యాజిక్..మ్యాచ్పై భారత పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్స్ ఎటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కన్పించింది. రెండు వికెట్ల పడగొట్టిన మదన్లాల్ను సైతం రిచర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్లాల్ వేసిన ఓ ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ను తమవైపు తిప్పే ప్రయత్నం రిచర్డ్స్ చేశాడు. ఈ క్రమంలో రోజర్ బిన్నీని కపిల్ దేవ్ ఎటాక్లోకి తీసుకువచ్చి రిచర్డ్స్ దూకుడును కట్టడి చేయాలని భావించాడు. బిన్నీ పరుగులు రాకుండా ఆపినప్పటికి.. అతడి వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే మళ్లీ మదన్లాల్.. కపిల్ దగ్గరకు వచ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.కానీ అంతకుముందు ఓవరే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్లాల్ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా సరే మదన్ మాత్రం తనకు ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. అందుకు సరే అని కపిల్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవర్లో మదన్ లాల్ మ్యాజిక్ చేశాడు.కపిల్ సూపర్ క్యాచ్..ఈసారి మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని మదన్లాల్ వమ్ముచేయలేదు. ఆ ఓవర్లో మదన్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మదన్ లాల్ కంటే కెప్టెన్ కపిల్ దేవ్కే ఇవ్వాలి. సంచలన క్యాచ్తో వీవియన్ను కపిల్ దేవ్ పెవిలియన్కు పంపాడు. ఆ ఓవర్లో మూడో బంతిని మదన్ లాల్ రిచర్డ్స్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. అతడు ఆ డెలివరీని హుక్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా షాట్ కనక్ట్కాకపోవడంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ సమయంలో మిడ్-ఆన్లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి సంచలన క్యాచ్ను అందుకున్నాడు.ఆ క్యాచ్తో విండీస్ ఖేల్ ఖతమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింంది. దీంతో 43 పరుగులతో భారత్ చారిత్రత్మక విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అమర్ నాథ్, మదన్ లాల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు. -
‘ఆ ఇద్దరూ లెజెండ్స్.. వారి స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు'
టీ20 వరల్డ్కప్-2024 విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ టీ20లకు విడ్కోలు పలికినప్పటకి.. పొట్టి ఫార్మాట్లో తమకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్నారు.టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ టాప్-2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 'రోకో' ద్వయంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో విరాట్, రోహిత్ స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు. టీ20ల్లో మాత్రం కాదే ఇతర ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ లాంటి ఆటగాళ్లు మరి రారు. భారత క్రికెట్కు చాలా ఏళ్ల నుంచి వారు తమ సేవలను అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘనమైన విడ్కోలు. కానీ టీ20ల్లో వారిద్దరి లేని కచ్చితంగా భారత జట్టులో కన్పిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిల మాదిరిగానే వీరిద్దరి పేర్లు కూడా భారత క్రికెట్ చిరస్మణీయంగా నిలిచిపోతాయని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇంకా సందిగ్థం నెలకొంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. -
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇందులో.. భారత్కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024 -
బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.అన్షుమన్ గైక్వాడ్కు బ్లడ్ క్యాన్సర్కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.బీసీసీఐ సాయం చేయాలిబీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.ట్రస్టు ఏర్పాటు చేయాలిమా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!టీమిండియా హెడ్ కోచ్గానూ కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
ఇదేం టెస్టు మ్యాచ్ కాదు: రోహిత్పై మండిపడ్డ కపిల్ దేవ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మండిపడ్డాడు. టీ20 మ్యాచ్లలో టెస్టు మ్యాచ్ మాదిరి వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. వరల్డ్క్లాస్ బౌలర్, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను ఎలా వాడుకోవాలో తెలియదా అంటూ కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడేసింది.రెండు మ్యాచ్లలో తొలుత అతడి చేతికే బంతిగ్రూప్-ఏలో భాగమైన రోహిత్ సేన తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత పాకిస్తాన్పై గెలుపొంది టాపర్గా కొనసాగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్లలో టీమిండియా బౌలింగ్ అటాక్ను యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభించాడు.రెండో ఓవర్లో మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఐర్లాండ్తో మ్యాచ్లో ఆరో ఓవర్లో బుమ్రాను బరిలోకి దింపిన హిట్మ్యాన్.. పాకిస్తాన్తో మ్యాచ్లో మూడో ఓవర్ సందర్భంగా బాల్ అతడికి ఇచ్చాడు.అద్భుత స్పెల్తో దుమ్ములేపిన బుమ్రాఈ రెండు లో స్కోరింగ్ మ్యాచ్లలోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్తో ఆకట్టుకుని భారత్కు విజయాలు అందించాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో మూడు ఓవర్ల కోటాలో కేవలం ఆరు పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు బుమ్రా.ఇక పాక్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫలితంగా రెండు మ్యాచ్లలోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, పేస్ దళ నాయకుడైన బుమ్రాను కాదని.. యంగ్స్టర్ అర్ష్దీప్ సింగ్తో బౌలింగ్ అటాక్ ఆరంభించడం ఏమిటని ఇప్పటికే మాజీ సారథి సునిల్ గావస్కర్ ప్రశ్నించగా.. తాజాగా మరో దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇవేమీ టెస్టు మ్యాచ్లు కాదు‘‘అతడు వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే మొదటి ఓవర్లోనే బంతిని అతడికి ఇవ్వాలి. ఇవేమీ టెస్టు మ్యాచ్లు కాదు కదా! టీ20 ఫార్మాట్ ఇది.ఎంత త్వరగా వికెట్లు తీస్తే.. అంత త్వరగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్ అటాక్ ఆరంభించి.. ఆదిలోనే రెండు వికెట్లు తీసినట్లయితే.. మిగతా బౌలర్లు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.తప్పని నిరూపించాడుఅదే విధంగా.. ‘‘అతడి శరీరం.. ముఖ్యంగా భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పెడతాడు కాబట్టి బుమ్రా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగలేడని మనమంతా భావించాం.అయితే, అందరి ఆలోచనలు తప్పని అతడు అనతికాలంలోనే నిరూపించాడు’’ అంటూ బుమ్రాను కొనియాడాడు కపిల్ దేవ్. ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా బుధవారం నాటి మ్యాచ్లో న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడనుంది.చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్దేవ్తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్స్టార్తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. నీ కోసం..
భారత్లో క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్ డెవిల్స్కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్కప్-1983లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్దేవ్ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి.. ఆ మ్యాజిక్ను రిపీట్ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే వరల్డ్కప్-2023లో అజేయ రికార్డుతో ఫైనల్తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్వి అయిపోయావు. నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్ షేర్ చేశాడు. ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్ దేవ్ బాసటగా నిలిచాడు. -
అప్పుడు కపిల్ దేవ్, ధోని.. ఇప్పుడు! అది గతం.. హిట్మ్యాన్ భావోద్వేగం
వన్డే వరల్డ్కప్-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్గా బరిలోకి.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిపించిన నాయకుడిగా సరికొత్త గుర్తింపు.. అజేయంగా నిలిచి ఫైనల్ వరకు ప్రయాణం.. ఆ ఒక్క అడ్డంకి దాటేస్తే.. ప్రపంచకప్ గెలిచిన మూడో కెప్టెన్గా చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం.. అవును.. రో‘హిట్’ శర్మ గురించే ఇదంతా!! ఒకప్పుడు ప్రపంచకప్ జట్టులో చోటే లేని ఆటగాడు ఇప్పుడు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ గెలిచేందుకు సంసిద్ధమయ్యాడు. 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోని చేసిన అద్భుతాలను పునరావృతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భావోద్వేగాలపరంగా యావత్ భారతానికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో.. నాయకుడిగా రోహిత్కు, జట్టుకు అంతే ముఖ్యం. హిట్మ్యాన్ కూడా ఇదే మాట అంటున్నాడు. మ్యాచ్ గెలిస్తే మంచిదే ‘‘భావోద్వేగాలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద క్షణం అనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో నాకు బాగా తెలుసు. కఠోర శ్రమ తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఈరోజు ఎంతో ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టి నాతో పాటు మిగతా సహచరులంతా ఆటపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం. మ్యాచ్ గెలిస్తే మంచిదే కానీ అనవసరంగా ఒత్తిడి పెంచుకోను. అది ఇప్పుడు అనవసరం ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడటం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ రోజున పిచ్ను చూసిన తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. 2011లో నాకు ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం. కానీ ఈ వయసులో ఫైనల్ మ్యాచ్కు సారథిగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. 1983లో కపిల్ డెవిల్స్ భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఏడాది.. అప్పటివరకు అడపా దడపా క్రికెట్ మ్యాచ్లు చూసిన సందర్భాలే తప్ప ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే కపిల్ డెవిల్స్ జగజ్జేతగా నిలిచిందో అప్పటి నుంచి టీమిండియా భవిష్యత్తు మారిపోయింది. భారత్ క్రికెట్లో నూతన శకం మొదలైంది. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇంగ్లండ్ వేదికగా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రయాణం భారత్కు నల్లేరు మీద నడకలా సాగలేదు. అనూహ్యరీతిలో విండీస్ను చిత్తు చేసి లీగ్ దశలో అనూహ్య రీతిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను 34 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తర్వాత జింబాబ్వేతో మ్యాచ్లో 135 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది కపిల్ బృందం. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి మరోసారి విండీస్కు షాకిచ్చి 66 పరుగుల తేడాతో గెలిచింది మళ్లీ విజయాల బాట పట్టింది. ఆ తర్వాత జింబాబ్వేను 31 రన్స్తో ఓడించిన టీమిండియా ఆస్ట్రేలియాపై కూడా ప్రతీకారం తీర్చుకుంది. 118 పరుగుల తేడాతో ఆసీస్ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి సెమీస్కు చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ను మట్టికరిపించి సత్తా చాటి ఫైనల్కు చేరింది. అయినప్పటికీ టీమిండియాను తక్కువ చేసి మాట్లాడిన వారే ఎక్కువ. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచి వెస్టిండీస్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరడంతో కపిల్ సేనను మట్టికరిపించడం ఖాయమని భావించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. కపిల్ దేవ్ దూకుడైన విధానం, చావో రేవో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించే తీరు భారత్కు తొలి టైటిల్ అందించింది. మిస్టర్ కూల్ ధోని సేన సొంతగడ్డపై ఇక 2011లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్పై (87 పరగుల తేడాతో) గెలుపుతో ఆరంభించిన ధోని సేన.. తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్ను టై చేసుకుంది. ఆ తర్వాత.. పసికూనలు ఐర్లాండ్, నెదర్లాండ్స్లను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. అనంతరం సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అటు పిమ్మట వెస్టిండీస్ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ చేరింది. ఇక మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో శ్రీలంకను చిత్తు చేసి మిస్టర్ కూల్ ధోని జట్టు ట్రోఫీని ముద్దాడిన దృశ్యాలను అభిమానులెవరు మర్చిపోగలరు!! View this post on Instagram A post shared by ICC (@icc) -
వారి అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగపాటు!
రెండు అడుగులు.. రెండే రెండు అడుగులు దాటితే చాలు.. వరల్డ్ కప్ టైటిల్ మరోసారి టీమిండియా సొంతమవుతుంది. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం భారత జట్టుకు లభిస్తుంది. సొంత గడ్డ మీద 2011లో ధోని సేన చేసిన అద్భుతం పునరావృతం అవుతుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ వరకు రోహిత్ సేన కొనసాగించిన జైత్రయాత్ర పరిపూర్ణం అవుతుంది. ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో టీమిండియా ఏడుసార్లు సెమీఫైనల్ చేరుకుంది. 1983, 1987, 2003, 2011, 2015, 2019 ఎడిషన్లలో ఆడింది. ఇందులో మూడుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓటమిపాలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా 1983 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన భారత జట్టు సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఆరు వికెట్ల తేడాతోచిత్తు చేసింది. ఆ తర్వాత ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కు ఊహించని షాక్ ఇచ్చి జగజ్జేతగా అవతరించింది. అలా తొలిసారి సెమీస్ గండాన్ని దాటేసి ట్రోఫీని ముద్దాడింది కపిల్ డెవిల్స్. అయితే.. 1987 ఎడిషన్ లో మాత్రం సొంత గడ్డపై సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. వాంకడే వేదికగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమిస్లోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ లోను మరోసారి ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. నాడు టీమిండియాని ముందుండి నడిపించింది మహమ్మద్ అజారుద్దీన్. ఇక 1996 సెమీఫైనల్ లో చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు శ్రీలంక చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం వల్ల మ్యాచ్ కు కలిగిన అంతరాయం టీమిండియా కొంపముంచింది. నాడు లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా.. 34 ఓవర్ల వద్ద 120/8 స్కోరుతో కొనసాగుతున్న సమయంలో.. స్టేడియంలోని ఫ్యాన్స్ హంగామా చేశారు. దీంతో ఆట ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అప్పటికి భారత్ పై పై చేయి సాధించిన శ్రీలంకను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అలా అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా పై నెగ్గిన శ్రీలంక ఫైనల్ లోను విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీ 2003 లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. స్టార్ ఆటగాళ్లంతా నిలకడైన ఫామ్ తో జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటర్లు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును సెమీస్కు చేర్చారు. నాడు ఊహించని రీతిలో సెమీస్కు వచ్చిన కెన్యాపై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెంది రన్నరప్తో పెట్టుకుంది. ఇక 2011 వరల్డ్ కప్ గురించి టీమిండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జట్టు భారత్ ను రెండోసారి జగజ్జేతగా నిలిపింది. సెమీఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించి ఫైనల్కు అర్హత సాధించిన ధోని సేన.. ఆఖరిమెట్టుపై శ్రీలంకను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఐసీసీ ట్రోఫీని బహుమతిగా అందించింది. వన్డే వరల్డ్ కప్ 2015 సెమీఫైనల్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో దారుణ వైఫల్యంతో ఇంటి బాట పట్టింది. అదేవిధంగా 2019 లోను భంగపాటుకు గురైంది. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. నాటి మ్యాచ్లో ఫినిషర్ ధోని రన్ అవుట్ రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడినా 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. -
CWC 2023: మాక్సీ డబుల్ సెంచరీని కపిల్ 175తో పోల్చగలమా..?
క్రికెట్లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం సర్వ సాధారణం. ఇక్కడ ఓ ప్రదర్శనను తక్కువ చేసి, మరో దాన్ని ఎక్కువ చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. కానీ, ఏ ప్రదర్శన జట్టు విజయానికి ఎక్కువగా దోహదపడిందని విశ్లేషించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి ఓ పోలికనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) గెలిపించాడు. 1983 ప్రపంచకప్లోనూ ఇలాంటి ఓ మెరుపు ఇన్నింగ్స్ను మనం చూశాం. నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు, నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 175 పరుగులు చేశాడు. కపిల్ ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్ కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. తాజాగా మాక్సీ మెరుపు ఇన్నింగ్స్ చూశాక చాలా మంది అభిమానులు నాటి కపిల్ ఇన్నింగ్స్ను గుర్తు చేసుకుంటున్నారు. కొందరేమో మాక్సీ డబుల్ను కపిల్ 175తో పోలుస్తున్నారు. ఈ విషయంపై సోషల్మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ రెండు ఇన్నింగ్స్ల మధ్య పోలిక పెట్టి, ఏది గొప్ప అని నిర్ణయించడానికి ఆస్కారమే లేదు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇక్కడ అభిమానులు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు. అది తక్కువ, ఇది ఎక్కువ అని తేల్చడానికి వీలు లేదు. రెండు సందర్భాల్లో ఆటగాళ్లు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి భారీ ఇన్నింగ్స్లు ఆడారు. నాడు కపిల్ బరిలోకి దిగిన సందర్భంలో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఆ సమయంలో కపిల్ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా మ్యాక్స్వెల్ సైతం తన జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు (292 పరుగుల లక్ష్యఛేదనలో 91/7 స్కోర్ వద్ద) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అయితే ఈ రెండు ఇన్నింగ్స్ల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కపిల్ ఇన్నింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ చేసినది కాగా, మాక్సీ ఛేదనలో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ, అక్కడ ఆటగాళ్లు తమతమ జట్ల గెలుపుకు వంద శాతం దోహదపడ్డారు. ఇద్దరూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఇక్కడ మ్యాక్సీ పోరాడితే పోయేది ఏమీ లేదని సక్సెస్ సాధించగా.. నాడు కపిల్ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి ఫలితం రాబట్టాడు. -
కపిల్ దేవ్, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకు ముందు భారత జట్టుకు సారథ్యం వహించిన ఆటగాళ్లెవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. కాగా భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2011 ఫైనల్లో ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకను చిత్తు చేసి నాటి జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరోసారి ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది భారత్. ఈ క్రమంలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేన.. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఏ వేదిక మీదైతే టైటిల్ గెలిచిందో అదే వేదిక మీద తాజా వరల్డ్కప్ ఎడిషన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కాగా వాంఖడే రోహిత్ శర్మకు సొంతమైదానం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ చరిత్రలో అతడు అరుదైన ఘనత సాధించిన కెప్టెన్గా నిలిచాడు. ఇంతకు ముందు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో వరల్డ్కప్ టోర్నీలో హోంగ్రౌండ్లో సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. 1983లో తొలిసారి టీమిండియాకు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన కపిల్ దేవ్ 1987లోనూ కెప్టెన్గానూ ఉన్నాడు. అయితే, అప్పుడు భారత్లోనే ఐసీసీ ఈవెంట్ జరిగినప్పటికీ కపిల్ దేవ్ స్వస్థలం చండీగఢ్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక వరల్డ్కప్-1996లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా కూడా అజారుద్దీన్ సొంత మైదానం హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. అదే విధంగా 2011 ప్రపంచకప్ టోర్నీలోనూ ధోని స్వస్థలం రాంచిలోనూ భారత జట్టు మ్యాచ్ ఆడలేదు. నిజానికి 2013 తర్వాత అక్కడ తొలి అంతర్జాతీయ స్టేడియం నిర్మించారు. చదవండి: వారసత్వాన్ని నిలబెడతాడని తండ్రికి నమ్మకం! వివాదాలు చుట్టుముట్టినా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి
కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్ వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్ స్క్రీన్ క్రికెట్ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో డాన్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ క్రికెట్ గ్రౌండ్లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్గా నటించగా, ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రల్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ముత్తయ్య 800 లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్గా ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్ లైఫ్ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్గారిలా నటించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్ సాధన చేశానని, మేకప్ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్ మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్ మిట్టల్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ది టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తమిళంలో ‘టెస్ట్’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్ చేస్తుండగా, నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ను బట్టి ఈ సినిమా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్లలో ఎవరు క్రికెటర్స్గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చక్దా ఎక్స్ప్రెస్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్ క్రికెట్ ఆడారు జులన్ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్ప్రెస్’. జులన్గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుందట. క్రికెటర్ మహి జాన్వీ కపూర్ క్రికెటర్గా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’. రాజ్కుమార్ రావు మరో లీడ్ రోల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రికెట్ బ్యాక్డ్రాప్లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యాడా..? సంచలన వీడియో షేర్ చేసిన గంభీర్
భారత వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ (1983), దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన ఈ వీడియోలో కపిల్ దేవ్ కిడ్నాప్కు గురైనట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్లా కనినిస్తున్న వ్యక్తిని చేతులు వెనుక్కు కట్టి, మాట్లాడకుండా నోటిని బట్టతో కట్టేసి బలవంతంగా లాక్కెళ్లుతున్నారు. ఆ సమయంలో కపిల్లా కనిపిస్తున్న వ్యక్తి వెనక్కు చూస్తూ ఏవో సైగలు చేస్తూ కనిపించాడు. Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp — Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023 ఈ వీడియోలో నిజానిజాలెంతో తేలాల్సి ఉంది. కొందరు ఈ వీడియోను మార్పింఫ్ చేశారంటుంటే, మరికొందరు ఇది అడ్వటైజ్మెంట్ కోసం చేసిన వీడియో అని అంటున్నారు. ఈ వీడియోను భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎక్స్లో షేర్ చేస్తూ.. ఈ క్లిప్ను నాలా ఇంకెవరైనా అందుకున్నారా అని ప్రశ్నించాడు. ఈ వీడియోలో ఉన్నది కపిల్ కాకుడదని అనుకుంటున్నానని.. కపిల్ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నానని గంభీర్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ఈ వీడియోలో నిజానిజాలటుంచితే.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట వైరలవుతుంది. -
ఇంత దారుణమా..కపిల్ దేవ్ కిడ్నాప్?
-
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్
Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. #WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi (Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR — ANI (@ANI) September 23, 2023 -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
IND VS BAN: అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్గా, వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. The moment when Jadeja completed 200 wickets in ODIs.- A historic moment....!!!!!!!pic.twitter.com/uv4ulOrYpk— Johns. (@CricCrazyJohns) September 15, 2023 ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్లో షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు. కాగా, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 45 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. నసుమ్ అహ్మద్ (35), మెహిది హసన్ (13) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్గా..
England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్కప్-2023 నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్ రీఎంట్రీలో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కివీస్తో తొలి వన్డేతో పునరాగమనం చేసిన స్టోక్స్ 52 పరుగులతో రాణించాడు. అయితే, తదుపరి మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసి అవుటయ్యాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగాడు. సంచలన ఇన్నింగ్స్తో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డులు బద్దలు.. ప్రపంచంలో రెండో క్రికెటర్గా ఈ క్రమంలో జేసన్ రాయ్ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్లను అధిగమించాడు. వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు వీరే! ►వివియన్ రిచర్డ్స్- 189 ►బెన్ స్టోక్స్- 182 ►వివియర్ రిచర్డ్స్- 181 ►రాస్ టేలర్- 181 ►ఏబీ డివిలియర్స్- 176 ►కపిల్ దేవ్- 175 ఒక్క రన్తో ధోని, కోహ్లి రికార్డు మిస్ కివీస్పై ఇన్నింగ్స్(182)తో.. వన్డేల్లో నాన్ ఓపెనర్గా బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. చార్ల్స్ కొవంట్రీ(194), వివియన్ రిచర్డ్స్(189), ఫాఫ్ డుప్లెసిస్(185), మహేంద్ర సింగ్ ధోని(183), విరాట్ కోహ్లి(183) ఈ జాబితాలో స్టోక్స్ కంటే ముందున్నారు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. One of the greatest of this generation. PERIOD. 🐐 📹 | @BenStokes38 sent New Zealand bowlers to the cleaners, scoring 182 in just 124 balls 🥵#SonySportsNetwork #ENGvsNZ #BenStokes pic.twitter.com/OytoOEqNOb — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2023 -
బజ్బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
Indian cricket legend Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న ‘బజ్బాల్’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్లలో యాషెస్ అద్భుతమని కొనియాడాడు. కాగా న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత.. బెన్స్టోక్స్ సారథంలో బజ్బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్తో కలిసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. అయితే, సిరీస్ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్బాల్ అద్భుతం. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి ఇటీవల నేను చూసిన సిరీస్లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలి. కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్ దేవ్ ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ను ఉద్దేశించి కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్కప్లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్కు కెప్టెన్గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్తో విభేదాల కారణంగా వరల్డ్కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్కప్కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్గా కొనసాగాడు. కెప్టెన్గా తన టర్మ్లో కపిల్ వరల్డ్కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్కప్కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. కెప్టెన్గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్లో అంపైర్ పొరపాటున సిక్సర్ను ఫోర్గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్కప్లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్కు వరల్డ్కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్గా కపిల్కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్కప్లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. -
మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్
Ravindra Jadeja Responds to Kapil Dev's Money Making Players Arrogant Remark: టీమిండియాను ఉద్దేశించి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కష్టపడితేనే జట్టులో చోటు దక్కుతుందని.. అంతేతప్ప తేరగా ఎవరూ తమకు అవకాశాలు వస్తున్నాయని భావించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. డబ్బు వల్ల అహంకారం పెరిగింది! కాగా ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు.. దేశం కోసం ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కపిల్ దేవ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆటగాళ్లలో అహంకారం పెరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదేనన్న కపిల్.. అయితే, అన్నీ తమకే తెలుసనన్న భావన పనికిరాదని చురకలు అంటించాడు. మాకేమీ ఊరికే అవకాశాలు రావు! ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు.. ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరంటూ ‘ది వీక్’తో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో మూడో వన్డే ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా ముందు విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. ‘‘ఆయన ఎప్పుడు ఈ మాటలు అన్నారో నాకు తెలియదు. జట్టు ఓడిపోయినప్పుడల్లా.. నేను సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేయను. అయినా, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయం అనేది ఉంటుంది. ఆయన విషయంలోనూ అంతే! ప్రతీ ఆటగాడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ.. జట్టులో స్థానం కాపాడుకోవడానికి శ్రమిస్తూనే ఉంటాడు. టీమ్లో చోటు ఆయాచితంగా వచ్చిందన్నట్లు ప్రవర్తించరు. ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి కచ్చితంగా 100 శాతం ఎఫర్ట్ పెట్టి టీమిండియాను గెలిపించడానికే కృషి చేస్తారు. అయితే, ఎప్పుడైతే జట్టు ఓడిపోతుందో అలాంటపుడు.. ఇలాంటి మాటలు వినిపించడం సహజం. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. ఎవరికీ ఎలాంటి అహంకారం, అహంభావం లేదు. దేశం కోసమే ఆడుతున్నాం.. అంతేగానీ.. ప్రతి ఒక్కరు భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లే. మేమంతా దేశం కోసమే ఆడుతున్నాం. మాకు వ్యక్తిగత ఎజెండాలంటూ ఏమీ ఉండవు’’ అంటూ జడ్డూ.. కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య మంగళవారం(ఆగష్టు 1) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా మీడియాతో ముచ్చటించాడు. ఆఖరి మ్యాచ్లో కచ్చితంగా గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం
What Happened To Jasprit Bumrah?: ‘‘దేవుడి దయ వల్ల.. నా విషయంలో అంతా బాగుంది. అప్పుడప్పుడు గాయాలపాలు కావడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. మన వాళ్లు ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి.. గాయాల బారిన పడకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ చాలా గొప్ప లీగే.. కాదనను. అయితే, అదే ఏదో ఒకరోజు మిమ్మల్ని నాశనం చేస్తుంది కూడా! చిన్నపాటి గాయాలు ఉన్నా మీరు ఐపీఎల్ ఆడతారు. కానీ దేశం కోసం మాత్రం ఆడరు. దీర్ఘకాలం పాటు బ్రేక్ తీసుకుంటారు.. అంతే కదా!. ఇక్కడ బీసీసీఐ గమనించాల్సిన విషయం ఒకటుంది. మన ఆటగాళ్లకు స్వల్ప గాయమైనపుడు.. ఐపీఎల్లో ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉంటే కచ్చితంగా బరిలోకి దిగుతారు. కాబట్టి మన వాళ్లు ఏడాదిలో ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు. ఎంతకాలం ఆడుతున్నారన్న విషయాలపై దృష్టి సారించాలి. ఈరోజు మీ దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి. కావాల్సినంత డబ్బుంది. కానీ.. ఏడాదికి 3-5 క్యాలెండర్లు మాత్రం ఉండవు కదా! అసలు మన క్రికెట్ బోర్డు తీరే తప్పుగా ఉంది’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. బీసీసీఐ, టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్కు ఉన్న విలువలేదు! భారత ఆటగాళ్లు ఐపీఎల్కు ఇస్తున్న విలువ.. దేశం కోసం ఆడటానికి ఇవ్వడం లేదని మండిపడ్డాడు. ‘ది వీక్’తో ముచ్చటించిన ఈ లెజెండరీ ఆల్రౌండర్.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమవడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలు బుమ్రాకు ఏమైంది? ‘‘అసలు బుమ్రాకు ఏమైంది? అతడు కోలుకున్నాడని చెబుతున్నారు.. ఒకవేళ తను వరల్డ్కప్ సెమీస్, ఫైనల్ నాటికైనా అందుబాటులో లేకపోతే అతడి కోసం సమయం వృథా చేసినట్లే కదా! ఇక రిషభ్ పంత్.. గొప్ప క్రికెటర్. ఒకవేళ అతడే గనుక జట్టుతో ఉంటే మన టెస్టు క్రికెట్ పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ ఏం జరిగింది?’’ అంటూ కపిల్ దేవ్.. యువ ఆటగాళ్ల తీరును విమర్శించాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా బుమ్రా దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన ఆసియా కప్, ప్రపంచకప్ ఈవెంట్లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక రిషభ్ పంత్ స్వయంగా కారు నడుపుతూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు కూడా దాదాపు ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ వీరిద్దరిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్కు మాత్రం.. -
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత ఆటగాడిగా!
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆట తీరు మార లేదు. టీమిండియాతో టెస్టు సిరీస్లో పేలవ ప్రదదర్శన కనబరిచిన విండీస్.. ఇప్పుడు వన్డే సిరీస్లోనూ అదే పునరావృతం చేస్తోంది. బార్బోడస్ వేదికగా భారత్ జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్(43) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు. అనంతరం 115 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై తీసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు విండీస్పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం కపిల్దేవ్(43 వికెట్లు) రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. అదే విధంగా భారత్-వెస్టిండీస్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా, దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును సమం చేశాడు. చదవండి: IND vs WI: తీరు మారని వెస్టిండీస్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం -
అరుదైన రికార్డు ముంగిట జడ్డూ! అదే జరిగితే కపిల్ను వెనక్కి నెట్టి.. ఏకంగా
Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే. కుంబ్లేతో సంయుక్తంగా ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఒకవేళ తాజా సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్లు బార్బడోస్లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా.. -
ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం
ODI World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. సొంతగడ్డపై టోర్నీ జరగడం సానుకూల అంశమని.. అయితే, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న అంశంపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కీలక ఆటగాళ్లకు పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించాడు. అప్పుడు కపిల్ డెవిల్స్.. తర్వాత ధోని సేన కాగా 1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ఏకంగా చాంపియన్గా నిలిచింది. నాటి పటిష్ట వెస్టిండీస్ను ఓడించి భారత్కు తొలిసారి ప్రపంచకప్ (వన్డే) అందించింది. ఆ తర్వాత మళ్లీ 2011లో ధోని సేన సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడింది. పుష్కరకాలం తర్వాత భారత్లో ఈ క్రమంలో పుష్కరకాలం తర్వాత స్వదేశంలో మరోసారి టోర్నీ ఆడే అవకాశం రోహిత్ సేనకు దక్కింది. అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిసారి మనమే ఫేవరెట్.. అయితే.. బెంగళూరులో గోల్ఫ్ ఫిట్టింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ‘‘ఇదంతా ఎలా జరుగుతుందో ముందుగా చెప్పలేం. అయితే, బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమిండియా ప్రతిసారి టోర్నమెంట్ ఫేవరెట్గానే రంగంలోకి దిగుతోంది. భారత జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో స్వదేశంలో వరల్డ్కప్ గెలిచిన రికార్డు ఉంది. ఈసారి ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ప్రతి ఒక్కరు గత చరిత్రను పునరావృతం చేసేలా శ్రమించి ఆశించిన ఫలితం పొందుతారనే అనుకుంటున్నా. గాయాల బారిన పడితే మాత్రం అందుకోసం వాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంటారని భావిస్తున్నా. మన ఆటగాళ్లలో చాలా మంది దాదాపు 10 నెలల పాటు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లపై కాస్త పనిభారం తగ్గించి.. గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలి’’ అని కపిల్ బోర్డుకు సూచించాడు. కాగా గాయాల నుంచి కోలుకుంటున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ప్రసిద్ కృష్ణ తదితరులు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. చదవండి: వరల్డ్కప్నకు ముందు ఆసీస్తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ -
WC: టీమిండియా లక్ వల్ల గెలిచింది! అంతేకానీ ఒక్కరూ: విండీస్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
World Cup, 1983 India vs West Indies, Final: ‘‘మేమప్పుడు మంచి ఫామ్లో ఉన్నాం. కానీ ఒక్క మ్యాచ్ వల్ల అంతా నాశనమైంది. నిజానికి 1983లో అదృష్టం ఇండియా వైపు ఉంది. ఆ సమయంలో మా జట్టు గొప్పగానే ఉన్నప్పటికీ ఎందుకో ఓటమి పాలయ్యాం. ఫైనల్ తర్వాత బహుశా ఐదారు నెలల వ్యవధిలో మేము టీమిండియాను 6-0 తేడాతో చిత్తు చేశాం. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఒక్క మ్యాచ్ టీమిండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందని చెప్పవచ్చు. ఆనాడు మేము 183 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. ఇదేదో అతి విశ్వాసమో, అతి జాగ్రత్త వల్లో జరిగింది కాదు’’ అంటూ వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కేవలం లక్ వల్లే గెలిచింది లక్ వల్లే టీమిండియా గెలిచిందన్నట్లు వ్యాఖ్యలు చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. ఆ మ్యాచ్లో ఒక్క బ్యాటర్, బౌలర్ కూడా తనను ఇంప్రెస్ చేయలేకపోయారన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్స్టార్తో రాబర్డ్స్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఫిఫ్టీ సాధించలేకపోయారు. ఇక బౌలర్లు.. ఒక్కరు కూడా కనీసం 4 లేదంటే 5 వికెట్లు తీయలేకపోయారు. ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు వికెట్లు కూలుస్తూనే ఉండాలి. కానీ టీమిండియా నుంచి ఏ ఒక్కరు అలా చేయలేకపోయారు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వివియన్ రిచర్డ్స్ అవుట్ కావడం(మదన్లాల్ బౌలింగ్లో) మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తాము ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. 1975, 1979 ఫైనల్స్.. 1983 ఫైనల్కి తేడా ఒక్కటే.. ఆ రెండు దఫాలు మేము తొలుత బ్యాటింగ్ చేశాం. 83లో ఛేజింగ్ చేశాం’’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. 1983 వరల్డ్కప్ ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్ మొహిందర్ అమర్నాథ్ 26, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్లెవరూ 20 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. రాబర్ట్స్కు అత్యధికంగా ఈ క్రమంలో 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి కపిల్దేవ్ సేన ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే చాపచుట్టేయడంతో 43 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. కాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజంగా పేరొందిన ఆండీ రాబర్ట్స్ 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు. ఇప్పుడు ఇదంతా దేనికి? ఇదిలా ఉంటే.. ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అవును మరి.. ఒక్క మ్యాచ్తోనే ఫలితాలు తారుమారవుతాయి.ఘే జట్టు విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ బృందం విజేతగా నిలిచి టీమిండియా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి చెత్త మాటలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. విండీస్ కనీసం వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
ధోనీ కాదు.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ అతడే: సునీల్ గవాస్కర్
భారత క్రికెట్లో 'కెప్టెన్ కూల్' అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. అతడు తన కూల్ కెప్టెన్సీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దృష్టిలో కెప్టెన్ కూల్' అంటే ధోని కాదంట. భారత్కు తొలి ప్రపంచకప్ను అందిచిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన 'కెప్టెన్ కూల్' గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 1983 ప్రపంచకప్ను సొంతం చేసుకుని నిన్నటికి(జూన్25) 40 ఏళ్లు పూరైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోగవాస్కర్ ఈ వాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచకప్లో కపిల్ దేవ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ను కపిల్ అద్భుతంగా అందుకున్నాడు. అదే మేము వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్ ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. కపిల్ ఒక డైనమిక్ లీడర్. ఒక కెప్టెన్కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉండేవి. ఒక ఆటగాడు క్యాచ్ వదిలినా, మిస్ ఫీల్డ్ చేసినా.. కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించకపోయేది. కపిల్ అసలైన కెప్టెన్ కూల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా 1983 ప్రపంచకప్లో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో పటిష్ట విండీస్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..! -
1983 World Cup: ఆ అపురూప విజయానికి 40 ఏళ్లు
-
చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ సెలబ్రేషన్స్
టీమిండియా తొలి ప్రపంచకప్ను సాధించి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1983 వన్డే ప్రపంచకప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఫైనల్లో పటిష్ట వెస్టిండీస్ను ఓడించి ఛాంపియన్స్గా నిలిచింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కపిల్ డేవిల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క విజయంతో ప్రపంచక్రికెట్లో తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు భారత జట్టు ఏర్పరుచుకుంది. స్పెషల్ సెలబ్రేషన్స్.. ఇక తొలి ప్రపంచకప్ సాధించి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని 1983 భారత హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలు జరపుకున్నారు. వరల్డ్కప్ జట్టులో భాగమైన లెజెండ్స్ ఓ మినీ ఎయిర్ క్రాప్ట్లో స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్కప్ విన్నింగ్ హీరోస్లో ఒకడైన కీర్తి ఆజాద్ సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇందులో కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, శ్రీకాంత్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్నాథ్, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సింగ్, రోజర్ బిన్నీలు ఉన్నారు. "35,000 వేల అడుగుల ఎత్తులో 1983 వరల్డ్కప్ ఛాంపియన్ టీమ్ 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోంది. భారతీయుడుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. లవ్ ఇండియా, భారత్ మాతాకీ జై "అంటూ కీర్తి ఆజాద్ ట్విటర్లో పేర్కొన్నాడు. మరోవైపు అదానీ గ్రూప్ తమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1983 ప్రపంచకప్ విజేత ఆటగాళ్లను సత్కరించింది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ‘జీతేంగే హమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచకప్ విన్నింగ్ హీరోస్ తమ సెలబ్రేషన్స్ను జరపుకున్నారు. చదవండి: #1983WorldCup: రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది The World Cup champion 1983 team travelling together to celebrate our 40th anniversary victory on 25th June, 35,000 feet up in the air. We are proud Indians and love India Bharat Mata Ki Jai @therealkapildev @RaviShastriOfc @BCCI @JayShah pic.twitter.com/xR1VxFSbys — Kirti Azad (@KirtiAzaad) June 25, 2023 -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించిన భారత్ ప్రపంచకప్ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్కప్లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్కు భారత్, పాక్లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్లో పాకిస్థాన్ కౌన్సిల్తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్కప్కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
WTC Final: రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు తలపడనుంది. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి.. తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. కాగా టీమిండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. దాదాపు 10 ఏళ్లగా అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ ట్రోఫీని.. కనీసం రోహిత్ శర్మ అయినా అందిస్తాడో లేదో వేచి చూడాలి. అయితే రోహిత్కు ఇది కెప్టెన్గా తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ కావడం కావడం గమనార్హం. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్-2021 ఫైనల్కు చేరిన భారత జట్టు.. విరాట్ కోహ్లి సారధ్యంలో న్యూజిలాండ్తో తలపడనుంది. అయితే తుదిపోరులో ఓటమి పాలైన టీమిండియా రన్నరప్గా నిలిచింంది. అరుదైన రికార్డుకు చేరువలో.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్-2023కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్గా బరిలోకి దిగితే.. ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు సారధ్యం వహించిన ఐదో కెప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ధోనితో పాటు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. కాగా ఐసీసీ టోర్నీలో ఫైనల్స్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన జాబితాలో ఆగ్రస్ధానంలో కపిల్ దేవ్ ఉన్నాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన జాబితాలో కపిల్ దేవ్ తర్వాత సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అనంతరం మూడో స్థానంలో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధోని టీమిండియాకు నాయకత్వం వహించాడు. కాగా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో భారత జట్టుకు సారధ్యం వహించిన భారత కెప్టెన్ కూడా ధోనినే కావడం గమనార్హం. ఇక నాలుగో కెప్టెన్గా విరాట్ కోహ్లి ఉన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్గా కోహ్లి ఉన్నాడు. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా -
రెజ్లర్లకు 1983 వరల్డ్కప్ విన్నింగ్ బ్యాచ్ మద్దతు..
రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నవారిలో 1983 వరల్డ్ కప్ నెగ్గిన భారత మాజీ క్రికెటర్లు చేరారు. కపిల్దేవ్ నేతృత్వంలో ఈ బృందం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. ‘మన చాంపియన్ రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ వేసింది. వారి ఫిర్యాదులు విని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే తమ పతకాలను పడేయడం వంటి తీవ్రమైన పనులు చేయవద్దని రెజ్లర్లను కోరుతున్నాం. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, త్యాగాల ఫలితం ఆ పతకాలు’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ‘సంయుక్త ప్రకటన’తో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఈ జట్టులో సభ్యుడైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు. మరో వైపు నిందితుడిని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన మన బిడ్డలు న్యాయం కోసం వీధికెక్కారు. 15 తీవ్ర ఆరోపణలతో రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన వ్యక్తి ప్రధాన రక్షణ కవచంలో ఉన్నాడు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చదవండి: IRE VS ENG One Off Test: టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? -
గిల్లో అద్బుతమైన టాలెంట్ ఉంది.. కచ్చితంగా లెజెండ్స్ సరసన చేరుతాడు: కపిల్ దేవ్
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఓపెనర్ , గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో 890 పరుగులు చేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్స్లతో మరోసారి ప్రపంచ క్రికెట్కు తన టాలెంట్ ఎంటో చూపించాడు. Shubman Gill's performance this season has been nothing short of unforgettable, marked by two centuries that left an indelible impact. One century ignited @mipaltan's hopes, while the other dealt them a crushing blow. Such is the unpredictable nature of cricket! What truly… pic.twitter.com/R3VLWQxhoT — Sachin Tendulkar (@sachin_rt) May 28, 2023 ఈ ఏడాది ఐపీఎల్లో గిల్ మూడు సెంచరీలతో పాటు నాలగు హాఫ్సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ తన ఆటతీరుతో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను గుర్తుచేస్తున్నాడని కపిల్ దేవ్ కొనియాడాడు. అయితే గిల్ మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని కపిల్దేవ్ అభిప్రయపడ్డాడు. "భారత్ క్రికెట్ ప్రపంచానికి ఎంతోమంది లెజెండ్స్ను పరిచయం చేసింది. వారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు శుబ్మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. Memorable one pic.twitter.com/2jnfJz6Kqr — Shubman Gill (@ShubmanGill) May 30, 2023 కానీ ఇప్పుడే అతడిని ఆకాశానికి ఎత్తేయకూడదు అనుకుంటున్నాను. గిల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ అతడికి ఇంకా మరింత మెచ్యూరిటీ కావాలి. అతడు వచ్చే ఏడాది సీజన్లో కూడా ఇలాగే ఆడితే.. కచ్చితంగా గొప్ప ఆటగాళ్ల జాబితాలోకి చేరుతాడు. అతడు మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని" ఏబీపీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. Shubman Gill bags four awards but misses on the most precious Trophy 😐 📷: Jio Cinema #ShubmanGill #GujaratTitans pic.twitter.com/XFtIzAXnrw — CricTracker (@Cricketracker) May 30, 2023 చదవండి: IRE vs ENG: ఐర్లాండ్తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు -
15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం..
IPL 2023- MS Dhoni: ‘‘ఇప్పటికే అతడు పదిహేనళ్లపాటు ఐపీఎల్ ఆడాడు. అయినా.. మనం ప్రతిసారి ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ధోని తన పని తాను చేశాడు. ఇంకా మనం తన నుంచి ఆశించడానికి ఏం మిగిలి ఉంది? జీవితాంతం అతడు ఐపీఎల్ ఆడుతూనే ఉండాలా?’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో సీఎస్కేను నాలుగు సార్లు చాంపియన్గా నిలిపాడు. తలా ఒక్క షాట్ ఆడినా చాలు ఇక ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆరంభ మ్యాచ్ నుంచే ఎక్కడ చూసినా తలా మేనియా కొనసాగుతోంది. ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలోనూ ప్రేక్షకులు ధోనికి మద్దతుగా నిలవడం చూశాం. ధోని ఒక్క షాట్ ఆడినా చాలు.. ప్రత్యక్షంగా చూడాలంటూ కేవలం తలా కోసమే మైదానానికి పోటెత్తిన ఫ్యాన్స్కు లెక్కేలేదు. తన అద్భుతమైన వ్యూహాలతో అంచనాలు లేని జట్టును ఐపీఎల్-2023 ఫైనల్కు తీసుకువచ్చిన 41 ఏళ్ల ధోని రిటైర్మెంట్ గురించి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్కు సైతం ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా అతడు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జీవితాంతం ఆడలేడు కదా! ‘‘ధోని ఇప్పటికే ఐపీఎల్లో చేయాల్సిందంతా చేశాడు. తను జీవితాంతం ఆడుతూ ఉండలేడు కదా! అది ఎప్పటికీ జరగని పని. తను ఆడుతూ ఉండాలని కోరుకోవడం కంటే కూడా.. ఈ 15 ఏళ్లలో అతడు క్రికెట్కు చేసిన సేవలకు కృతజ్ఞతా భావం చాటుకోవడం అత్యంత ముఖ్యం. కెప్టెన్ ఎలా ఉండాలో చూపించాడు వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేడా అన్న విషయం చెప్పలేం. నిజానికి ఈ ఏడాది ధోని భారీగా పరుగులు రాబట్టలేకపోయినా.. జట్టును ఫైనల్కు చేర్చి.. కెప్టెన్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. క్రికెట్లో నాయకుడి పాత్ర ఏమిటో చాటిచెప్పాడు’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో చెన్నై- గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా.. ఈ క్రమంలో ఆదివారం (మే 28) మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డంకిగా మారింది. వరుణుడు కరుణించకపోవడంతో ఫైనల్ మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం చెన్నై- గుజరాత్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఒకవేళ ఈరోజు కూడా వర్షం కొనసాగి.. మ్యాచ్ రద్దయితే.. టేబుల్ టాపర్గా ఉన్న హార్దిక్ పాండ్యా సేన (గుజరాత్) చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: ఐపీఎల్ ఫైనల్.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే? రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Smash and Walk!🔥#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/bRNoZwdrOI — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 -
ఒక్క సీజన్కేనా? సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు: టీమిండియా దిగ్గజం
IPL 2023- Shubman Gill: ‘‘సునిల్ గావస్కర్ వచ్చాడు... అదరగొట్టాడు.. తర్వాత సచిన్ టెండుల్కర్.. అనంతరం రాహుల్ ద్రవిడ్.. అటు పిమ్మట వీవీఎస్ లక్ష్మణ్.. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి... ఇలాగే అద్బుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. శుబ్మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్పై ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పుడే గిల్ ఆట తీరుపై పూర్తి అంచనాకు రాలేమని వచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడితే అతడికి తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఏకంగా మూడు సెంచరీలు కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ సెంచరీలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్లలో 851 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గిల్ బాదిన బౌండరీల సంఖ్య 78. సిక్సర్లేమో 33. అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న గిల్.. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అవతరించాడు. పరుగుల వరద పారించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక ఆదివారం నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై మరోసారి చెలరేగితే గిల్కు తిరుగుండదు. అద్భుత ఆటగాడే కానీ.. ఈ నేపథ్యంలో శుబ్మన్ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కపిల్ దేవ్.. గిల్ను కొనియాడుతూనే.. ఆటలో నిలకడ అవసరమని పేర్కొన్నాడు. ‘‘గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. బ్యాటింగ్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలకు కొదువలేదు. అయితే, తను ఆటలో ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. రానున్న సీజన్లో కూడా ఇదే నిలకడైన ఆట తీరు కొనసాగిస్తే అతడిని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చడం ఖాయం. ఇప్పుడే వద్దు కాబట్టి నేను ఇప్పుడే గిల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేను. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత తన గురించి మాట్లాడతా. ఇప్పుడే గొప్ప ప్లేయర్ అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా సీఎస్కే- గుజరాత్ ఐపీఎల్-2023 ట్రోఫీ కోసం ఆదివారం తలపడనున్నాయి. చదవండి: చరిత్రకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు! ఒకవేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్
సిల్వర్స్క్రీన్ సూపర్స్టార్ రజనీకాంత్, క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ ‘లాల్సలామ్’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల ముంబైలో మొదలైంది. ఈ చిత్రంలో కపిల్దేవ్ నటిస్తున్నారు. ‘‘ప్రముఖులు, మానవతావాది, భారతదేశానికి క్రికెట్లో తొలి వరల్డ్ కప్ను తీసుకువచ్చిన కపిల్దేవ్గారితో వర్క్ చేయడం గౌరవంగా ఉంది’’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఇద్దరు లెజండ్స్ (రజనీ, కపిల్దేవ్) ‘లాల్ సలామ్’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు’’ అన్నారు విష్ణు విశాల్.క్రికెట్ బ్యాక్డ్రాప్లో ‘లాల్ సలామ్’ రూపొందుతోంది. అందుకే కపిల్ దేవ్ని కీలక పాత్రకు సంప్రదించి ఉంటుంది చిత్ర యూనిట్. -
సంజూను సూర్యతో పోల్చకండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం
Suryakumar Yadav- Sanju Samson: ‘‘ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారో వాళ్లకు తప్పకుండా వరుస అవకాశాలు లభిస్తాయి. సూర్యతో సంజూ శాంసన్ను పోల్చకండి. ప్రస్తుతం ఇలాంటి పోలికలు సరికాదు. ఒకవేళ సంజూకి సూర్య లాంటి పరిస్థితే ఎదురైతే మనం వేరొకరి గురించి మాట్లాడే వాళ్లం కదా!’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. ఎవరికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలనేది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్గా వెనుదిరిగి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు. వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను కాదని సూర్యకు అవకాశం ఇస్తే.. మరీ ఘోరంగా విఫలమయ్యాడంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘‘టీమ్ మేనేజ్మెంట్ సూర్యకుమార్ యాదవ్కు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికే వరుస అవకాశాలు ఇస్తుంది. బయట జనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ, జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. కాబట్టి ఇలాంటి పోలికలు వద్దు’’ అని ఏబీపీ న్యూస్తో వ్యాఖ్యానించాడు. ఇదేమీ కొత్తకాదు అదే విధంగా సూర్య బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ..‘‘మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆఖరి వన్డేలో ఫినిషర్ పాత్ర పోషిస్తాడనే భావనతో సూర్యకుమార్ను ఏడో స్థానంలో పంపినట్లు అనిపిస్తోంది. వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం సర్వసాధారణమే. ఇంతకుముందు కూడా టీమిండియా ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసింది. అయితే, కొన్నిసార్లు టాపార్డర్ బ్యాటర్ను డౌన్ ఆర్డర్లో పంపితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జట్టుకు సంబంధించిన ప్రతి విషయంలో కోచ్, కెప్టెన్ ప్రధాన పోషిస్తారు కదా! ఎవరైనా ఆటగాడు తనకు బ్యాటింగ్ పొజిషన్లో ఇబ్బంది ఉందని చెబితే.. వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. కాగా తొలి రెండు వన్డేల్లో తన రెగ్యులర్ పొజిషన్ అయిన నాలుగో స్థానంలో వచ్చిన సూర్య మూడో వన్డేలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్ వేదికగా జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని టీమిండియా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ సొంతం చేసుకుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్కు దూరమైనా పంత్కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! Kane Williamson: 99వ పుట్టినరోజుకు ముందు.. వీరాభిమానికి కేన్మామ సర్ప్రైజ్ గిఫ్ట్! ఫొటో వైరల్ -
Ind Vs Aus: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత
India vs Australia, 3rd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ను అధిగమించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో అశూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో ఆరు వికెట్లతో సత్తా చాటి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ 1గా అవతరించాడు. 688వ వికెట్.. ఈ క్రమంలో ఇండోర్లో జరుగుతున్న మూడో టెస్టులోనూ అశ్విన్ ప్రభావం చూపుతున్నాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా మూడు వికెట్లు పడగొట్టాడు అశూ. తొలుత హ్యాండ్స్కోంబ్(19) తర్వాత అలెక్స్ క్యారీ(3)ని అవుట్ చేశాడు. కాగా క్యారీ వికెట్ అశ్విన్ కెరీర్లో 688వది. దీంతో అతడు ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఇక ఆఖర్లో అశూ నాథన్ లియోన్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ టెస్టులో టీమిండియా 109 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించగా.. ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజాకు నాలుగు, అశ్విన్కు మూడు, ఉమేశ్ యాదవ్కు మూడు వికెట్లు దక్కాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు(ఇప్పటివరకు) 1.అనిల్ కుంబ్లే- 953(499) 2.హర్భజన్ సింగ్- 707(442) 3.రవిచంద్రన్ అశ్విన్- 688*(347) 4.కపిల్ దేవ్- 687(448) 5.జహీర్ ఖాన్- 597(373) నంబర్ 1 అశ్విన్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన ప్రదర్శన... భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను మళ్లీ ప్రపంచ నంబర్వన్ బౌలర్గా చేసింది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ను రెండో స్థానానికి పంపించి అశ్విన్ నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల అశ్విన్ తొలిసారి 2015లో టాప్ ర్యాంక్లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్ ర్యాంక్లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్లు ఆడిన అశ్విన్ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్ 864 రేటింగ్ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా... అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్ మూడో స్థానానికి చేరుకోగా... భారత్కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్లో, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్) ఐదో ర్యాంక్లో ఉన్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? -
లావుగా ఉన్నందుకు సిగ్గు పడాలి.. రోహిత్ శర్మపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఫిట్నెస్పై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఓవర్ వెయిట్పై అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్ శర్మ సిగ్గు పడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లో చూస్తే హిట్మ్యాన్ అస్సలు ఫిట్గా కనిపించడని, 140 కోట్లకు పైగా భారతీయులను రెప్రజెంట్ చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఫిట్గా లేకపోవడం అవమానకరమంటూ సరికొత్త వివాదానికి తెరలేపాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్గా ఉండటం ఏ క్రీడకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో జట్టు సారధి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బరువు విషయంలో రోహిత్ ఇకనైనా జాగ్రత్త పడాలని, బరువు తగ్గించుకునేందుకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే కానీ ఇది సాధ్యపడదని అన్నాడు. రోహిత్ గొప్ప ఆటగాడు, గొప్ప కెప్టెన్ అన్న విషయంతో ఏకీభవిస్తానని, టీవీల్లోనైనా సన్నగా కనిపించేందుకు కావాల్సిన కసరత్తులు చేయాలని సూచించాడు. ఓ వ్యక్తి టీవీల్లో కనిపించేదానికి, నేరుగా చూసేదానికి చాలా వ్యత్యాసముంటుందని.. లావుగా ఉన్నవారు సైతం టీవీల్లో సన్నంగా కనపడతారని అన్నాడు. ఇంతటితో ఆగకుండా రోహిత్ను ఫిట్నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లితో పోలుస్తూ ఇరువురు స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ కొట్టుకునేందుకు కావాల్సి మసాలాను అందించాడు. కెప్టెన్ అనే వాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో కోహ్లి యావత్ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని పరుగుల యంత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని చూస్తే ఫిట్నెస్ అంటే ఇదీ అనేలా ఉంటాడని ఆకాశానికెత్తాడు. రోహిత్పై కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, హిట్మ్యాన్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేరు. రోహిత్-కోహ్లి అభిమానులు ఇప్పుడిప్పుడే కలిసిపోతుండగా.. కపిల్ ఈ తరహా కామెంట్స్ చేసి మళ్లీ ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేశాడు. కాగా, రోహిత్ ఫిట్నెస్, అతని బరువుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలామంది దిగ్గజాలు కూడా హిట్మ్యాన్ బరువు తగ్గాలని సూచించారు. రోహిత్ ఓవర్ వెయిట్ కొన్ని సందర్భాల్లో ఆటపై కూడా ప్రభావం చూపింది. మధ్యమధ్యలో కొద్దికాలంపాటు వెయిట్ను కంట్రోల్లో పెట్టుకునే రోహిత్.. కొంచం గ్యాప్ దొరికిందంటే మళ్లీ మొదటికొస్తాడు. రోహిత్ బొద్దుగా ఉండటాన్ని ఉద్దేశిస్తూ అతనంటే సరిపడని వారు 'వడా పావ్' అని ఎగతాళి చేస్తుంటారు. ఇలాంటి కామెంట్లు చేసే వారి కోసమైనా రోహిత్ సన్నబడాలని ఆశిద్దాం. కాగా, రోహిత్పై గతంలో ఈ తరహా కామెంట్స్ చేసిన వారిని ఫ్యాన్స్ ఆడుకున్నారు. బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని, ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే చెప్పాల్సిన పద్దతి ఇది కాదంటూ చురకలంటించారు. -
దిగ్గజ ఆల్రౌండర్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తన ప్రదర్శనతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. రీఎంట్రీ ఇస్తూనే బౌలింగ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న జడేజా.. బ్యాటింగ్లో అర్థసెంచరీతో రాణించాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై నింపాదిగా బ్యాటింగ్ చేసి అర్థసెంచరీ మార్క్ను అందుకున్నాడు. టెస్టు కెరీర్లో జడ్డూకు ఇది 18వ అర్థశతకం. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా తరపున ఒక టెస్టు మ్యాచ్లో ఐదు వికెట్లు సహా అర్థసెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకముందు కపిల్ దేవ్ నాలుగుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా జడ్డూ ఐదోసారి ఈ ఫీట్ సాధించి కపిల్ రికార్డును చెరిపేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో అజేయ అర్థశతకాలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్లో 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించనుంది. And the trademark celebration is here 😀😀@imjadeja 💪 Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Q1TPXZVLfE — BCCI (@BCCI) February 10, 2023 చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
BGT 2023: కేఎల్ రాహుల్ను తప్పించండి.. వైస్ కెప్టెన్ అయితేనేం..?
Kapil Dev Comments On KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ సంచలన కామెంట్స్ చేశాడు. తొలి టెస్ట్ కోసం భారత తుది జట్టు కూర్పు విషయంపై కపిల్ మాట్లాడుతూ.. టీమ్ కాంబినేషన్లో రాహుల్ సెట్ కాకపోతే, తుది జట్టులో ఆడించకండి అంటూ కెప్టెన్, కోచ్లకు సలహా ఇచ్చాడు. వైస్ కెప్టెన్ అయినంత మాత్రనా తుది జట్టులో ఆడించాలా అని ప్రశ్నించాడు. గతంలో చాలా సందర్భాల్లో వైస్ కెప్టెన్లను ఆడించలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. జట్టు కాంబినేషన్లో సెట్ కాకపోతే కెప్టెన్ను కూడా తప్పించవచ్చని అన్నాడు. కెప్టెన్ను కానీ వైస్ కెప్టెన్ను కానీ తప్పక ఆడించాలన్న రూల్ ఏమీ లేదని తెలిపాడు. కేఎల్ రాహుల్ను తప్పక తుది జట్టులో ఆడించాలనుకుంటే వికెట్కీపింగ్ చేయించమని అన్నాడు. గతంలో చాలా మ్యాచ్ల్లో రాహుల్ వికెట్ కీపింగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. రాహుల్తో వికెట్కీపింగ్ చేయిస్తే, ఎక్స్ట్రా ప్లేయర్ను తీసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించాడు. వ్యక్తిగతంగా తనకు రాహుల్పై ఎలాంటి ద్వేషం లేదని, తాను ఏది చెప్పినా జట్టు ప్రయోజనాల కోసమేనని తెలిపాడు. వాస్తవానికి రాహుల్ ఆటతీరు తనకు బాగా నచ్చుతుందని, జట్టు సమతూకం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా రేపటి (ఫిబ్రవరి 9) నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే కపిల్.. రాహుల్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంగా కపిల్.. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత అతని చెంప పగలగొట్టాలని ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పంత్ గాయపడటంతో టీమిండియా లయ తప్పిందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాని కపిల్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
రిషబ్ పంత్ చెంప పగలకొట్టాలి.. అతని వల్లే టీమిండియాకు ఈ దుస్థితి..!
Kapil Dev Comments On Rishabh Pant: గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు, యంగ్ వికెట్కీపర్ రిషబ్ పంత్పై క్రికెట్ దిగ్గజం, భారత వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చావును అతి సమీపంగా చూసి వచ్చిన పంత్ను చూసి అందరూ జాలి పడుతుంటే, కపిల్ మాత్రం ఘాటు వ్యాఖ్యలతో పంత్పై విరుచుకుపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో మూడు లిగ్మెంట్లు (కుడి మోకాలిలో) తెగిపోయి మంచానికే పరిమితమైన పంత్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తుంటే కపిల్ మాత్రం నిర్దయగా నోరు పారేసుకున్నాడు. ఇంతకీ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. యువకుడైన పంత్ నిర్లక్ష్యంగా కారు నడిపి తన ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవడంతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును ఏడాది కాలం పాటు అగమ్యగోచరంగా మార్చేశాడంటూ మండిపడ్డాడు. టెస్ట్ల్లో రెగ్యులర్ సభ్యుడైన పంత్.. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్స్ ఉన్నాయన్న ధ్యాసే లేకుండా కారు నడిపి తన ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడంటూ ధ్వజమెత్తాడు. పంత్ జట్టులో లేకపోవడం వల్ల జట్టు కాంబినేషన్ పూర్తిగా దెబ్బతినిందని, దీని వల్ల టీమిండియా లయ కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. పంత్ లేని లోటు నిజంగా తీర్చలేనిదని, ఈ ప్రభావం BGT 2023పై తప్పకచూపుతుందని అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టులో ఓ వ్యక్తిని (వికెట్కీపర్) అదనంగా తీసుకోవాల్సి వస్తుందని, దీంతో పాటు బ్యాటింగ్ లైనప్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని తెలిపాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఏడాది పాటు జట్టును శూన్యంలోని నెట్టిన పంత్ను పూర్తిగా కోలుకున్న తర్వాత చెంపదెబ్బ కొట్టాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అన్నాడు. జట్టులో సమస్యలకు పంత్ కారకుడయ్యాడంటూనే అతను త్వరగా కోలుకోవాలని అన్నాడు. తనకు పంత్పై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అతను అందుబాటులో లేకపోవడం వల్ల టీమిండియాకు సమస్య వచ్చిందన్నదే తన బాధ అని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న పంత్ ఏడాదికాలం పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంది. ఈ సమయంలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్స్ వంటి కీలక టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. -
రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే!
India vs Sri Lanka- Suryakumar Yadav: ‘‘అతడి ఇన్నింగ్స్ గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... ఈ జాబితాలో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన ఎప్పుడో కలిగించాడు. భారత్లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదు. అందులోనూ ఇలాంటి ప్లేయర్లు సూపర్. తన ఆట అత్యద్భుతం. ముఖ్యంగా ఫైన్ లెగ్ దిశగా తను కొట్టే ల్యాప్ షాట్ అమోఘం. తను అలా ఆడుతుంటే బౌలర్లు బెంబేలెత్తిపోతారు. తను ఎటూ కదలకుండానే మిడాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదగలడని వాళ్లకు తెలుసు. షాట్ సెలక్షన్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రిక్కీ పాంటింగ్.. లాంటి ఎంతో మంది బ్యాటింగ్ దిగ్గజాలను చూశాను. కానీ.. అతడిలా బంతిని ఇంత క్లీన్గా హిట్ చేయగల బ్యాటర్ను చూడలేదు. హ్యాట్సాఫ్’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. సూర్యకుమార్ యాదవ్ను ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా ‘స్కై’ కాగా శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన ఆఖరి మ్యాచ్లో సూర్య విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న ‘స్కై’.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 112 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి.. సిరీస్ గెలవడంలో సహాయపడ్డాడు. కపిల్ దేవ్- స్కై శతాబ్దానికి ఒక్కడు ఈ నేపథ్యంలో.. కపిల్ దేవ్.. సూర్య ది గ్రేట్ ఇన్నింగ్స్ గురించి ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘హ్యాట్సాఫ్ సూర్యకుమార్ యాదవ్.. తనలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు’’ అంటూ కొనియాడాడు. కాగా లంకతో మ్యాచ్లో సెంచరీ సూర్య కెరీర్లో మూడోది. మిగతా రెండూ కూడా ఇంగ్లండ్, న్యూజిలాండ్తో టీ20 మ్యాచ్లలో సాధించినవే!! ఈ శతకంతో సూర్య పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. రోజుల వ్యవధిలోనే దంపతుల హఠాన్మరణం Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్ -
డ్రైవర్ను పెట్టుకునే స్థోమత ఉన్నపుడు ఎందుకిలా: టీమిండియా దిగ్గజం
Rishabh Pant Car Accident: ‘‘మీకో మంచి కారు ఉంటుంది. అత్యంత వేగంగా రయ్మని దూసుకుపోగలదు కూడా! కానీ ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవర్ను పెట్టుకునే స్థోమత మీకు ఉంటుంది. కాబట్టి ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లకండి. అయితే, ఒక్కొక్కరికి ఒక్కో విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్యాషన్ ఉంటుంది. యవ్వనంలో ఉన్నపుడు ఇలాంటివి సహజం. కానీ మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏదేమైనా మీ పట్ల మీరే శ్రద్ధ వహించాలి. మీకేం కావాలో.. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోగలగాలి. అంతా సాఫీగా ఉండాలంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ యువ క్రికెటర్లకు సూచించాడు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తవహించాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడ్డ అతడికి చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థాంక్ గాడ్! పంత్ బయటపడ్డాడు పంత్ క్షేమంగా బయటపడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కపిల్ దేవ్.. ఏదేమైనా వాహనాలు నడిపే సమయంలో ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అదే విధంగా గతంలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు. ‘‘నేను క్రికెట్ ఆడుతున్న తొలినాళ్లలో మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత నుంచి నా సోదరుడు నన్ను మోటార్ బైక్ నడిపేందుకు అస్సలు అనుమతి ఇవ్వలేదు’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకోగలిగారని పేర్కొన్నాడు. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు BBL: సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా? -
అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్.. మరో 11 పరుగులు చేస్తే..!
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీ (58) సాధించిన అశ్విన్.. ఇదే ఇన్నింగ్స్లో మరో 11 పరుగులు చేసి ఉంటే, టెస్ట్ క్రికెట్లో 3000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆరో ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కేవాడు. ప్రస్తుతం అశ్విన్ 87 టెస్ట్ మ్యాచ్లు ఆడి 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యాష్ ఖాతాలో 442 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. అశ్విన్కు ముందు టెస్ట్ల్లో 3000 పరుగులు, 400 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), షాన్ పొలాక్ (3781, 421), స్టువర్ట్ బ్రాడ్ (3550, 566), షేన్ వార్న్ (3154, 708), రిచర్డ్ హ్యాడ్లీ (3124, 431) ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 8వ స్థానంలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాను (12) అధిగమించి, కపిల్ దేవ్ (27) తర్వాతి స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్ శర్మ (3137) తర్వాత అశ్విన్వే అత్యధిక టెస్ట్ పరుగులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 271 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్.. తమ తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ విజేత దబాంగ్ డేర్ డెవిల్స్
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్ను ఓడించింది. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్కు రూ. 5 లక్షల ఫ్రైజ్మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. -
ప్రొటీస్నే కాదు టీమిండియాను 'చోకర్స్' అని పిలవొచ్చు
క్రికెట్లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్లను చోకర్స్ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్ అనే ముద్ర క్రికెట్లో సౌతాఫ్రికాకు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐసీసీ టోర్నీల్లో ఆరంభంలో వరుస విజయాలు సాధించే ప్రొటీస్ కీలకమైన మ్యాచ్లు లేదంటే నాకౌట్ దశలో చేతులెత్తేయడం చూస్తుంటాం. వాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేకపోయారు. ఈసారి ప్రపంచకప్లో కూడా సౌతాఫ్రికాకు అదే పరిస్థితి ఎదురైంది. గ్రూప్-2లో ఉన్న సౌతాఫ్రికా నెదర్లాండ్స్పై గెలిస్తే సెమీస్ చేరుకునేది. కానీ దురదృష్టం వారి పక్కనే ఉంటుంది కదా.. అందుకే డచ్ చేతిలో ఓడి అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా టీమిండియా కూడా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చూసింది. కనీసం పోరాటం కూడా చేయకపోవడం అభిమానులను మరింత బాధపెట్టింది. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014 నుంచి ఐసీసీ ఈవెంట్లలో వరుసగా విఫలమవుతూ వస్తున్న టీమిండియాను ఇకపై చోకర్స్ అని పిలవొచ్చని పేర్కొన్నాడు. ''టీమిండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు. ఇటీవలే ఐసీసీ ఈవెంట్లలో చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రమే చోకర్స్ అని పిలవొచ్చు. కానీ వ్యక్తిగతంగా జట్టులో కొంత మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ పదం వాడడానికి వీల్లేదు. మరీ అంత కఠినంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇండియా చెత్తగా ఆడిందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఒక్క మ్యాచ్తో మరీ అంతగా విమర్శించాల్సిన పని లేదు" అని కపిల్ స్పష్టం చేశాడు. ఇక కపిల్ దేవ్ సారధ్యంలో టీమిండియా తొలిసారి 1983 వన్డే వరల్డ్కప్ గెలిచింది. ఆ తర్వాత ధోని సారధ్యంలో 2007 టి20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఆఖర్లో బోల్తా కొడుతూ వస్తుంది. 2014 టి20 వరల్డ్కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై ఇండియా బోల్తా పడుతూ వస్తోంది. 2015 వన్డే వరల్డ్కప్ సెమీస్, 2016 టీ20 వరల్డ్కప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్, తాజాగా 2022 టీ20 వరల్డ్కప్లోనూ ఇండియా సెమీస్లో ఓడిపోయింది. చదవండి: ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా -
'టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే'
టి20 ప్రపంచకప్లో టీమిండియా మరోసారి ఫేవరెట్గానే బరిలోకి దిగింది. గతేడాది ఘోర వైఫల్యంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. 2007 తొలి ఎడిషన్ మినహా మరోసారి కప్ కొట్టలేకపోయిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాపై దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''టి20 క్రికెట్లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్ తర్వాతి మ్యాచ్లో ఓడిపోవచ్చు. ఇండియా వరల్డ్కప్ గెలిచే అవకాశాల గురించి మాట్లాడడం చాలా కష్టం. అసలు టీమిండియా సెమీస్కు చేరుతుందా అంటే అనుమానమే. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం. నా వరకు ఇండియా టాప్ ఫోర్లోకి చేరడానికి కేవలం 30 శాతం అవకాశమే ఉంది." అని పేర్కొన్నాడు. అయితే దీని వెనుక కారణమేంటన్నది మాత్రం కపిల్ వివరించలేదు. ఆల్రౌండర్ల విషయం ప్రస్తావిస్తూ.. "వరల్డ్కప్ అనే కాదు ఏ మ్యాచ్లు లేదా ఈవెంట్లు గెలిపించే ఆల్రౌండర్లు టీమ్లో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? హార్దిక్ పాండ్యాలాంటి ప్లేయర్ ఇండియాకు ఎంతో ఉపయోగపడతాడు. ఏ టీమ్కైనా ఆల్రౌండర్లు కీలకం. వాళ్లే టీమ్కు బలం. తుది జట్టులో ఆరో బౌలర్ను తీసుకునే స్వేచ్ఛను హార్దిక్లాంటి ప్లేయర్స్ రోహిత్కు ఇస్తారు. అతడు మంచి బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ కూడా. రవీంద్ర జడేజా కూడా ఇండియాకు మంచి ఆల్రౌండరే" అని వెల్లడించాడు. ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్పై స్పందిస్తూ.. "నిజానికి సూర్యకుమార్ ఇంతగా ప్రభావం చూపుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతడు బ్యాటింగ్లో ఎంతో గొప్పగా రాణించి ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు అతడు లేని ఇండియన్ టీమ్ను ఊహించలేం. విరాట్, రోహిత్,రాహుల్లాంటి వాళ్లతో కలిసి సూర్య ఉండటం ఏ టీమ్నైనా బలంగా మారుస్తుంది" అని పేర్కొన్నాడు. చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?! -
జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు!
Robin Uthappa Comments In Virat Kohli Form: ‘‘విరాట్ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్కింగ్స్ వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ మేరకు తనదైన శైలిలో కోహ్లి విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమవుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కపిల్దేవ్ వంటి లెజెండ్స్ అతడిని పక్కనపెట్టాలని సూచిస్తుండగా.. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సహా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విదేశీ సారథులు కూడా కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: CSK) 70 సెంచరీలు చేశాడు కదా! ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన ఊతప్ప షేర్చాట్ ఆడియో చాట్రూమ్ సెషన్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కోహ్లి ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంతటి గొప్ప ప్రతిభ కలిగి ఉండి భారత క్రికెట్ పేరును నిలబెట్టిన అతడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు కూడా అతడు 30 లేదంటే 35 పరుగులు చేయగలుగుతున్నాడు. కొన్నిరోజులు కోహ్లిని ఒంటరిగా వదిలేయండి. తనదైన శైలిలో క్రికెట్ ఆడే వరకు వేచి చూడండి. తనకు ఏది మంచో మనకంటే తనకే బాగా తెలుసు. తన సమస్య ఏమిటో కూడా తనకే తెలుసు. అంతేకాదు దానిని అధిగమించగల సత్తా కూడా అతడికి ఉంది. అంతవరకు అతడి మానాన అతడిని వదిలేసి కాస్త ఓపికగా ఎదురు చూడటం కంటే మనం చేసేదేమీ లేదు’’ అని ఊతప్ప కోహ్లికి మద్దతుగా నిలిచాడు. అతడు మ్యాచ్ విన్నర్.. ఎవరికీ ఆ హక్కులేదు! అదే విధంగా టీమిండియా వరుస సిరీస్ల నేపథ్యంలో విశ్రాంతి పేరిట కోహ్లి జట్టుకు దూరం కావడంపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ తనకు బ్రేక్ కావాలని కోరుకుంటే కోహ్లి తప్పక విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతడికి ఫలానా సిరీస్ లేదంటే ఫలానా టోర్నీ ఆడాలని ఉందంటే తప్పకుండా ఆడతాడు. అందుకు యాజమాన్యం అంగీకరించాలి. అంతేగానీ.. జట్టులో అతడి స్థానం ఏమిటన్న విషయంపై బయట పెద్దగా చర్చ అవసరం లేదు. అతడు మ్యాచ్ విన్నర్. ప్రపంచంలోని బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఊతప్ప ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. కాగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన కోహ్లి.. ఆసియా కప్ టోర్నీ నేపథ్యంలో ఆగష్టులో తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: Axar Patel: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? Rohit Sharma Latest Photo: వెస్టిండీస్కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా!
గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బందులు పడుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఫామ్లేమి కారణంగా కెరీర్లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోహ్లితో కాసేపు ముచ్చటించే సమయం దొరికితే అతడి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. తన సలహాలు కోహ్లికి ప్రయోజనకరంగా ఉంటాయో లేదో తెలీదన్న ఆయన.. ప్రయత్నం చేయడంలో తప్పేమీ ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడేతో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడితో 20 నిమిషాలు మాట్లాడే సమయం దొరికితే చాలు.. తను చేయాల్సిన పనులేమిటో.. తక్షణ కర్తవ్యం ఏమిటో చెబుతాను. నా సూచనలు అతడికి ఉపయోగపడొచ్చు! ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లైన్ విషయంలో తనకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. ఓపెనింగ్ బ్యాటర్గా నేను కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను. ఆఫ్స్టంప్ అవతల పడే బంతులను ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఒక్క 20 నిమిషాలు చాలు. తనకు వీటి గురించి వివరించడానికి’’ అని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లి పట్ల దృష్టికోణం కాస్త వేరుగా ఉండాలన్న గావస్కర్.. అతడు 70 సెంచరీలు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.ఎంతటి ఆటగాడికైనా కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని కోహ్లి విషయంలో కాస్త ఓపిక పట్టాలని విమర్శకులకు సూచించారు. కాగా కోహ్లిని జట్టు నుంచి తప్పించాలంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించిన సందర్భంలోనూ గావస్కర్ ఈ మాజీ సారథికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! Trolls On Virat Kohli: వీడియో షేర్ చేసిన కోహ్లి! నువ్వు ఇందుకే పనికివస్తావంటూ ట్రోలింగ్.. -
ఏపీఎల్ తుది పోరు.. కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ ఢీ
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగే పోరులో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎవరు ఎగరేసుకు పోనున్నారో తేలిపోనుంది. టైటిల్ పోరులో రన్నరప్గా నిలిచిన జట్టు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకోనుంది. కాగా.. తొలి సీజన్కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్లను కుదించి నిర్వహించారు. నాలుగు మ్యాచ్లను రద్దు చేశారు. టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ ఏపీఎల్ క్వాలిఫైయర్ రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లలిత్కు లెగ్బిఫోర్గా ప్రశాంత్(29) దొరికిపోగా.. మరో ఓపెనర్ అభిషేక్(41) మనీష్ బౌలింగ్లో షార్ట్ ఫైన్లెగ్లో సాయితేజకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్(16) లలిత్ బౌలింగ్లోనే డీప్ స్క్వేర్లెగ్లో అఖిల్కు క్యాచ్ ఇ చ్చాడు. కెప్టెన్ గిరినాథ్ 53 పరుగులు, రషీద్ 40 పరుగులతో నిలిచారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెజవాడ టైగర్స్ ఓపెనర్ మహీప్ ఒక్క పరుగే చేసి సంతోష్ బౌలింగ్లో డీప్ పాయింట్లో కార్తికేయకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అతని స్థానంలో వచ్చిన అవినాష్ ఒక పరుగుతో, మరో ఓపెనర్ ప్రణీత్ 24 పరుగులతో ఆడుతుండగా వర్షం వచ్చింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్కు 29 పరుగుల వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ఫలి తం తేలేందుకు కనీసం మరో ఓవర్ జరగాల్సి ఉండగా స్టేడియంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. లీగ్ దశలో పాయింట్ల ఆధారంగా బెజవాడ టైగర్స్ను విజేతగా ప్రకటించారు. దీంతో ఏపీఎల్ తొలి సీజన్ టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి ఆరున్నరకు ప్రారంభం కానుండగా విజేతకు ట్రోఫీ అందించేందుకు క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ రానున్నారు. ఈ నాకవుట్ మ్యాచ్ను ఉచితంగానే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
టీ20లో కోహ్లిని మించిన మొనగాడు లేడు.. అయినా రెస్ట్ అని చెప్పి: కపిల్ దేవ్
‘‘విరాట్ కోహ్లి లాంటి కీలక ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలని నేను అనను. నిజానికి తను గొప్ప క్రికెటర్. అలాంటి బ్యాటర్కు సముచిత గౌరవం ఇచ్చే క్రమంలో సెలక్టర్లు విశ్రాంతినిచ్చామని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. దుమారం రేపిన కపిల్ వ్యాఖ్యలు కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించిన కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తరచుగా విఫలమవుతున్న విరాట్ కోహ్లిని టీ20 జట్టుకు ఎందుకు ఎంపిక చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోహ్లి ఫామ్పై కపిల్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. కొంతమంది కపిల్ దేవ్ను సమర్థిస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు సైతం కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కపిల్ దేవ్ తాజాగా స్పందించారు. కోహ్లిని మించిన మొనగాడు లేదు.. అయితే! ఏబీపీ న్యూస్తో మాట్లాడిన ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోహ్లి సాదాసీదా క్రికెటర్ కాదు. అతడో గొప్ప ఆటగాడు. అలాంటి ప్లేయర్ తిరిగి ఫామ్లోకి రావాలంటే ఏం చేయాలి? అతడికి ప్రాక్టీసు అవసరం. ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. టీ20 ఫార్మాట్లో కోహ్లిని మించిన మొనగాడు ఈ ప్రపంచంలోనే లేడు. అయితే, ఫామ్లో లేకుంటే సెలక్టర్లు తమ నిర్ణయం తాము తీసుకోకతప్పదు కదా! నా దృష్టిలో ఓ క్రికెటర్ మెరుగ్గా రాణించలేకపోతే రెస్ట్ ఇస్తారు.. లేదంటే జట్టు నుంచి తప్పిస్తారు. ఒకవేళ కోహ్లిని తప్పించి రెస్ట్ ఇచ్చామని చెప్పి అతడిని గౌరవాన్ని కాపాడారేమో’’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. రంజీల్లో ఆడాలి.. ‘విరాట్ లేకుండా ఇండియా గత ఐదారేళ్లలో అసలు మ్యాచ్లే ఆడలేదా? ఏదేమైనా అతడు ఫామ్లోకి రావాలన్నదే నా ఆశ. తనకు విశ్రాంతినిచ్చినా.. జట్టు నుంచి తప్పించినా.. అతడికి ఇంకా క్రికెట్ ఆడగల సత్తా ఉందన్న మాట వాస్తవం. అయితే, జట్టులోకి వచ్చే మార్గాలను అతడు అన్వేషించాలి. రంజీ ట్రోఫీ లేదంటే ఇతర టోర్నీలు ఆడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. గొప్ప క్రికెటర్ అయిన కోహ్లి.. మునుపటి ఫామ్ను అందుకోవడానికి మరీ ఇంత ఎక్కువ సమయం తీసుకోకూడదు. తనతో తాను పోరాటం చేయాలి. పునరాలోచన చేయాలి. తనను జట్టు నుంచి తప్పించినా.. విశ్రాంతినిచ్చినా నాకే సమస్య లేదు. అతడు ఫామ్లోకి రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఒక్క మ్యాచ్ చాలు ఆటగాడి తలరాతను మార్చడానికి! రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. అయినా పెద్దగా తేడా ఏమీ కనబడటం లేదు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఇంతకీ మీరేమంటున్నారు కపిల్? కాగా కపిల్ ఇంతకు కోహ్లిని సమర్థించాడా లేదంటే.. మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడా అన్న విషయం అర్థంకాక టీమిండియా ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆఖరికి మీరేమంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ను పొడిగించుకునేందుకు యువ బౌలర్ల అవకాశాలు దెబ్బతీసి.. రిటైర్మెంట్ ప్రకటించకుండా జిడ్డులా వేలాడిన విషయం మర్చిపోయారా అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ..
Sourav Ganguly Comments On Virat Kohli Form: ఫామ్లేమితో సతమతమవుతూ విమర్శల పాలవుతున్న టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. కోహ్లి గొప్ప క్రికెటర్ అని, త్వరలోనే అతడు తిరిగి పుంజుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆటలో ఇలాంటి ఆటుపోట్లు సహజమేనని.. తాను కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు దాదా తెలిపాడు. విమర్శల జల్లు! అదే విధంగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ సైతం ఒకానొక దశలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లే అని పేర్కొన్నాడు. కాగా రన్మెషీన్గా పేరొందిన విరాట్ కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. మరోవైపు టీమిండియాలో చోటు కోసం యువ క్రికెటర్లు దూసుకువస్తున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్లేమిపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఆ విషయం కోహ్లికి తెలుసు! అతడిని పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందని కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు సూచిస్తున్నారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా సునిల్ గావస్కర్ వంటి లెజెండ్స్ సైతం త్వరలోనే పాత కోహ్లిని చూస్తామంటూ అతడికి అండగా నిలిచారు. తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించిన విజయాలు గమనిస్తే ఎంతటి సమర్థత కలిగిన ఆటగాడో అర్థమవుతుంది. తను క్వాలిటీ బ్యాటర్. అయితే, ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ సంగతి అతడికి కూడా తెలుసు. నిజానికి తను గొప్ప క్రికెటర్. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని తనకూ తెలుసు. ఇదే కొనసాగితే తన కెరీర్ ఏమవుతుందో కూడా తెలుసు. అయితే, తను తిరిగి ఫామ్లోకి వస్తాడని భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లికి తిరిగి ఫామ్లోకి రావడం ఏమంత పెద్ద విషయం కాదు’’ అని ఎన్డీటీవీతో పేర్కొన్నాడు. అవన్నీ పట్టించుకోవద్దు! అదే విధంగా.. ‘‘కెరీర్లో ఇలాంటి ఎత్తుపళ్లాలు సహజం. ప్రతి ఒక్కరికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సచిన్, రాహుల్.. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు కోహ్లి వంతు! భవిష్యత్తులో మరికొంత మందికి ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు. అలాంటపుడు విమర్శలు పట్టించుకోవద్దు. పొరపాటు ఎక్కడ ఉంది.. దానిని ఎలా సరిదిద్దుకోవాలి? అన్న విషయాలపై దృష్టి సారించాలి. మైదానంలోకి దిగినపుడు ఇవన్నీ పక్కనపెట్టి నీ ఆటను నువ్వు ఆడాలి’’ అని గంగూలీ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్కు కోహ్లి దూరం! ఫ్యాన్స్కు గుడ్న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
Virat Kohli: రోహిత్ ఆడనపుడు వీళ్లెవ్వరూ మాట్లాడలేదు.. మరి కోహ్లి: గావస్కర్
‘‘రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. నిజానికి ఫామ్ అనేది తాత్కాలికం. క్లాస్ అనేదే శాశ్వతం’’ అని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత కొంతకాలంగా కోహ్లి తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించినా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ కింగ్ కోహ్లికి కొన్ని సిరీస్లలో విశ్రాంతినిచ్చినా.. కీలక సిరీస్లకు మాత్రం ఎంపిక చేస్తున్నారు. రోహిత్ ఫుల్ సపోర్టు! ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కోహ్లి మరోసారి విఫలం కావడంపై టీమిండియా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు కోహ్లికి అవకాశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అతడిని జట్టు నుంచి తప్పించాలని సూచించారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తమ వ్యూహాలకు అనుగుణంగానే బ్యాటర్లు ఆడతారని, ఇందులో వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. పొట్టి ఫార్మాట్ వేరు! తాజాగా ఈ విషయంపై స్పందించిన గావస్కర్ సైతం స్పోర్ట్స్తక్తో మాట్లాడారు. టీ20 ఫార్మాట్లో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఉంటాయన్న గావస్కర్.. ఆ క్రమంలో భారీ షాట్లకు యత్నించినపుడు ఒక్కోసారి సక్సెస్ అయితే.. మరోసారి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కోహ్లి విషయంలోనూ అదే జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో.. ‘‘కోహ్లికి సరైన సమయంలో వన్డే సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. ఎందుకంటే.. అతడు వన్డే ఫార్మాట్లో తన అత్యుత్తమ ప్రదర్శన, సహజమైన ఆటతీరును కనబరచగలడు. టెస్టుల్లో మాదిరి ఇక్కడ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. హడావుడిగా కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా బంతిని అంచనా వేస్తూ ఆడే వెసలుబాటు ఉంటుంది’’ అని గావస్కర్ పేర్కొన్నారు. నువ్వు చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లది తప్పా!? అలా కోహ్లి విమర్శలకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అరుదైన వికెట్ల ఫీట్ అందుకునేందుకు రిటైర్ కాకుండా తన కెరీర్ పొడిగించుకుంటూ యువకులకు అవకాశం రాకుండా చేసిన విషయం కపిల్ దేవ్కు గుర్తులేదా అంటూ ఇప్పటికే కోహ్లి ఫ్యాన్స్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య మంగళవారం(జూలై 12) నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. IND VS ENG 1st ODI: అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ఉన్న రోహిత్-ధవన్ జోడీ -
కోహ్లి చేసింది సరైందే.. అయినా కపిల్ దేవ్కు తెలియదు కదా!: రోహిత్ శర్మ
Ind Vs Eng- Rohit Sharma Defends Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా మాజీ కెప్టెన్, ‘స్టార్’ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. రీషెడ్యూల్డ్ టెస్టులో కోహ్లి చేసిన మొత్తం పరుగులు కేవలం 31. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20లో రాణించిన దీపక్ హుడాను పక్కనపెట్టి రెండు, మూడు మ్యాచ్లలో కోహ్లికి అవకాశం ఇచ్చారు. అయితే, ఒకప్పటి ఈ రన్మెషీన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుసగా 1, 11 పరుగులకే పెవిలియన్ చేరి మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు.. ముఖ్యంగా అతడికి ఛాన్స్ ఇవ్వడం కోసం ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం ఏమిటని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కోహ్లికి అండగా నిలబడ్డాడు. కోహ్లి రోహిత్ సపోర్టు మూడో టీ20 మ్యాచ్లో ఓటమి నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘టీ20 ఫార్మాట్లో.. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వంటి మేటి జట్టుపై పైచేయి సాధించాలంటే ఏం చేయాలో కోహ్లి అదే చేశాడు. నిజం చెప్పాలంటే మేము ముగ్గురం(రోహిత్ శర్మ(11), రిషభ్ పంత్(1), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(11) విఫలమయ్యాం. తప్పులను సమీక్షించుకుంటాం. ఏదేమైనా రోజు కోహ్లి ఆడిన తీరు సరైందే. అయితే, తన వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోయాడు. ఆఖరి వరకు నిలబడలేకపోయాడు. భారీ టార్గెట్ ముందున్న తరుణంలో కోహ్లి బ్యాటింగ్ చేసిన విధానం పట్ల అతడు సంతోషంగానే ఉంటాడు’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా మూడో టీ20లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కోహ్లి 6 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 11 పరుగులు చేశాడు. కపిల్ దేవ్కు తెలియదు! అదే విధంగా.. కోహ్లిని పక్కనపెట్టాలన్న టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ వ్యాఖ్యలను ఉద్దేశించి స్పందిస్తూ.. ‘‘ఆయన బయట నుంచి చూస్తున్నారు. జట్టులో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవచ్చు. మా వ్యూహాలు, ఆలోచనా విధానాలు మాకుంటాయి. పటిష్ట జట్టును తయారు చేసే క్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. మా ఆటగాళ్లకు మేము అవకాశాలు ఇస్తాం. అయినా బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్న అంశం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. జట్టులో ఏం జరుగుతుంది అన్న దానిపైనే మా దృష్టి ఉంటుంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20: టాస్: ఇంగ్లండ్- బ్యాటింగ్ ఇంగ్లండ్ స్కోరు: 215/7 (20) టీమిండియా స్కోరు: 198/9 (20) విజేత: ఇంగ్లండ్.. 17 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రీస్ టోప్లే(4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు) చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! Victory secured in style 👌 Scorecard/clips: https://t.co/AlPm6qHnwj 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/B8M5ys1moz — England Cricket (@englandcricket) July 10, 2022 -
స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)
లార్డ్స్ మైదానంలో ఆ రోజున భారత క్రికెట్ జట్టు ఓ అత్యద్భుత పరిణామం దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది జూన్ 25న భారత జట్టు సాధించిన విజయం భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ స్ఫూర్తితో దేశంలో క్రికెట్ క్రీడ అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ క్రీడలో రారాజులుగా వెలిగిపోతున్న వారిని దాదాపు నలభై ఏళ్ల క్రిందట ఓడించినప్పుడు కపిల్ బృందం ఈ పరిణామాన్ని ఊహించి ఉండదు. నాటి 60 ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచ్లో అప్పటికి రెండుసార్లుగా డిఫెండింగ్ చాంపియన్గా ఉన్న వెస్ట్ ఇండీస్పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: (Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం) -
Ind Vs Eng: 100 వికెట్లతో బుమ్రా అరుదైన రికార్డు.. విదేశీ గడ్డపై..
India Vs England 5th Test: టీమిండియా స్టార్ పేసర్, తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సేనా దేశాల్లో(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై 36, ఆస్ట్రేలియాలో 32, న్యూజిలాండ్లో ఆరు, సఫారీ గడ్డపై 26 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ సేనా దేశాల్లో 100 వికెట్లు తీసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు బుమ్రా కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. WHAT. A. JAFFA. 🔥#TeamIndia needed something special to break this ominous opening partnership, and Bumrah delivered 🤩 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/6TCIm8TY62 — Sony Sports Network (@SonySportsNetwk) July 4, 2022 ఇక ఈ మ్యాచ్లో మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగోరోజు అంతా తలకిందులైంది. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ చివరి రోజు మరో 119 పరుగులు చేస్తే చాలు! మ్యాచ్ టీమిండియా చేజారుతుంది. అలాగే సిరీస్ సమమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగో రోజు ఆట వరకు మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: IND VS ENG: తొలి టీ20కి కోచ్గా లక్ష్మణ్.. ద్రవిడ్కు ఏమైంది..? A rapid 5️⃣0️⃣ @aleesy14 🔥 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/PIsXWRZlTP — England Cricket (@englandcricket) July 4, 2022 -
కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. 40 ఏళ్ల తర్వాత..!
టెస్టుల్లో ఇంగ్లండ్పై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కరోనా కారణంగా గతేడాది ఇంగ్లండ్తో వాయిదా పడిన ఐదో టెస్టు ఎడ్డ్బాస్టన్ వేదికగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్తో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు 1981-82 ఇంగ్లండ్ సిరీస్లో భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇంగ్లండ్పై 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా సిరీస్లో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఇక 14 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ICC Player Of Month Nominations: ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే -
Ind Vs Eng: ఇంగ్లండ్తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా?
Ind Vs Eng Test- Aakash Chopra Comments on Jasprit Bumrah Likely To Lead Team India: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు సారథిగా జస్ప్రీత్ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ తర్వాత కెప్టెన్గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్గా బుమ్రా నిలవనున్నాడు. అయితే, కొంతమంది మాత్రం బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ఏ స్థాయిలోనూ.. ఏ ఫార్మాట్లోనూ ఇంత వరకు కెప్టెన్గా పనిచేయని కారణంగా అతడు ఏ మేరకు రాణిస్తాడో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లకు మెదడు తక్కువా? కానేకాదు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఎడ్జ్బాస్టన్ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయితే.. నిజంగా అది పెద్ద విషయమే. అంతేకాదు అతడికి దక్కే గొప్ప గౌరవం కూడా! ఒక బౌలర్ కెప్టెన్ ఎందుకు కాకూడదని చాలా మంది అడుగుతూ ఉంటారు? అంతేకాదు బౌలర్లకు ఏమైనా బ్రెయిన్ తక్కువగా ఉంటుందా? వారు జట్టును ముందుకు నడిపించే వ్యూహాలు రచించలేరా? అంటే కాదనే చెప్తాను. నిజానికి బ్యాటర్ల కంటే బౌలర్ల మెదళ్లు మరింత చురుగ్గా పని చేస్తాయి. ఎందుకంటే.. వాళ్లు తమ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్ల ఆట తీరును గమనిస్తూ ఉంటారు. పని భారాన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటారు. ఎవరికి ఎలా బౌలింగ్ చేయాలో ప్రణాళికలు రచించుకుంటారు. ఇది ఎంతో అత్యుత్తమైన జాబ్! కాబట్టి బౌలర్లు మంచి కెప్టెన్లు కారన్న అపోహ నుంచి బయటపడాలి’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో బౌలర్ అనిల్ కుంబ్లే తదితరులు టీమిండియాకు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సమకాలీన క్రికెట్లో మేటి జట్టు అయిన ఆస్ట్రేలియాకు పేసర్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఉన్నాడు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
'సంజూ శాంసన్లో అదే పెద్ద మైనస్.. అందుకే'
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఒకటి రెండు మ్యాచ్ల్లో బాగా ఆడుతాడని.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన కొనసాగించడంలో విఫలమవుతాడని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ''రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదు. అన్ని విభాగాల్లోకెల్లా మనకు నలుగురు వికెట్ కీపర్లు అందుబాటులో ఉంటారు. ఆ నలుగురే సంజూ శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఇషాన్ కిషన్లు. విడివిడిగా చూస్తే ఈ నలుగురు ఎవరికి వారే. బ్యాటింగ్, స్టంపింగ్ చేయడంలో మంచి నైపుణ్యం కలిగినవారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉంది. అయితే నా దృష్టిలో ఒక వికెట్ కీపర్ మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడు. ఆ క్రికెటర్ సంజూ శాంసన్. కెప్టెన్గా అతను సమర్థుడే కావొచ్చు.. టాలెంట్కు కొదువ లేదు. కానీ వరుసగా అవకాశాలు ఇస్తే సంజూ ఒకటి రెండు మ్యాచ్ల్లో మంచి ఇన్నింగ్స్లు ఆడినప్పటికి.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న మైనస్ పాయింట్.'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అద్బుత ప్రదర్శనతో రన్నరప్గా నిలిచింది. సంజూ కెప్టెన్సీలో లీగ్ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్తాన్ రెండో సారి ఫైనల్ చేరినప్పటికి.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 17 మ్యాచ్ల్లో 863 పరుగులు చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. బట్లర్ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: దినేశ్ కార్తీక్ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు