KGF 2
-
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్గా నిర్వహించింది జయమాల. -
తీసిన సీన్స్ మళ్ళీ చేస్తున్న యశ్
-
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్లో పని చేశారు. క్లాప్ బాయ్గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు. అయితే, ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ - గుజరాతి) ఇద్దరికి సంయుక్తంగా దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మొహర్ నిలిచింది.జాతీయ అవార్డ్ విజేతలు వీరేఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్) ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్ఫామ్ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
కరీనా కపూర్ ఖాన్ KGF స్టార్ యష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది
-
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
సలార్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్..!
కేజీయఫ్, కాంతార, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞... 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞...💥 Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr — Hombale Films (@hombalefilms) December 17, 2023 -
తారక్, యష్ చిత్రాలపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఫ్రాంచైజీతో వచ్చిన రెండు సినిమాలు చరిత్రను సృష్టించాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన చేతిలో పాన్ ఇండియా హీరో జూ ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కథపై ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రశాంత్. తాజాగా ఓ ఇంటరర్వ్యూలో తారక్ సినిమా గురించి మాట్లాడి అంచనాలను పెంచేశాడు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు విభిన్నంగా తారక్ మూవీ ఉంటుందని ఆయన తెలిపాడు. కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో సాగుతుందో అనేది ఆయన రివీల్ చేయలేదు. అభిమానులు మాత్రం భారీ యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని ఆయన చెప్పాడు. తారక్తో తీస్తున్న జానర్ ఏదైనా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 2024 ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మరోవైపు యష్ జోడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్-3 ఉంటుందని ఆయన తెలిపాడు. KGF విడుదలైన 3 సంవత్సరాల తర్వాత, KGF 2 విడుదలైంది. దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. కరోనాతో షాక్కు గురైన సినిమాలకు ఇది కొత్త ఆశను తెచ్చిపెట్టింది. త్వరలో కేజీఎఫ్- 3 రాబోతుంది. యష్ లేని కేజీఎఫ్ లేదు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలుపుతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయింది. సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే 'కేజీయఫ్ 2' ఎండింగ్లో హింట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ భారీగా రికార్డ్లను క్రియేట్ చేసింది. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
యష్ కొత్త చిత్రం ప్రకటన.. సాయి పల్లవికే ఛాన్స్.. డైరెక్టర్ ఎవరంటే
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు యష్.. KGF చాప్టర్ 2 విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆయన నుంచి ఏ సినిమా గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు, కాబట్టి అభిమానులు యష్ 19 గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ నటుడి సినిమా కోసం దేశం మొత్తం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో, నటుడు యష్19 గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 09:55 గంటలకు యష్ 19 టైటిల్ను ప్రకటించనున్నట్లు రాకింగ్ స్టార్ తెలియజేశాడు. దీని తరువాత, ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, సాంకేతిక నిపుణుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో యష్ హీరోయిన్గా నటి సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయి పల్లవిలో మంత్రముగ్ధులను చేసే డ్యాన్స్తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల తర్వాత ఇప్పుడు యష్తో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సాయి పల్లవి ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం యష్ 19కి సంతకం చేసిందని టాక్. ఆమె ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య రాబోయే చిత్రం తండేల్లో నటిస్తోంది. అలాగే, నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి, యష్ నటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తను సాయి పల్లవి నిర్ధారించింది కానీ యష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యష్ 19వ చిత్రం టైటిల్ను ఈ డిసెంబర్ 8, శుక్రవారం ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఉంది. గీతు మోహన్ దాస్ హిందీలో అబద్ధాల పాచికలు అనే చిత్రాన్ని 2014లో తెరకెక్కించారు. ఆ చిత్రానికి గాను రెండు జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు. It’s time… 8th December, 9:55 AM. Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY — Yash (@TheNameIsYash) December 4, 2023 -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ
ఇప్పుడు ఏ భాషలో సినిమా తీసుకున్నా ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేక్షకులకు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే స్క్రీన్పై అది చూడటానికి బాగానే ఉన్నా.. దాని వెనక కష్టాలు పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే గతంలో తనకు ముద్దు వల్ల జరిగిన చేదు అనుభవాన్ని 'కేజీఎఫ్' ఫేమ్ రవీనా టాండన్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) ఏం జరిగింది? 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రవీనా టాండన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. టాలీవుడ్ వరకు వస్తే బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్ర చేసి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే 'నో కిస్సింగ్ రూల్' పాటించే ఈమెకు కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా సహనటుడి పెదాల్ని తన పెదాలతో. దీంతో ఈమెకు వాంతి అయిందట. రవీనా కామెంట్స్ 'ఎప్పుడూ ముద్దు సీన్స్లో నటించలేదు. ఎందుకో వాటిలో యాక్ట్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ చేస్తున్నప్పుడు సహనటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది అతడు కావాలని చేయలేదు. కానీ చిరాగ్గా అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లిపోయా. ఎంతో వికారంగా అనిపించింది. వాంతి చేసుకున్నా. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది' అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. అయితే అది ఏ సినిమా, నటుడెవరు తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
కేజీయఫ్-2 క్లైమాక్స్తో ‘సలార్’కు లింకు.. టీజర్ టైమ్తో క్లారిటీ?
మరో రెండు రోజుల్లో (జూలై 6) ‘సలార్’ టీజర్ రాబోతుంది. ‘ఆదిపురుష్ రిజల్ట్తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది పెద్ద ఉమశమనం. అందుకే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జులై 6 తర్వాత తమ హీరో పేరు మరోసారి పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోవడం ఖాయమనే ధీమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్ టీజర్ని అంత పొద్దున( ఉదయం 5.12 గంటలకు) రీలీజ్ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. (చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్ను ఢీ కొడుతున్న ప్రభాస్..) ప్రభాస్కి ఉదయమే టీజర్ని విడుదల చేసే సెంటిమెంట్ ఉందని, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల మాదిరి సలార్ అప్డేట్ కూడా ఉదయమే ఇవ్వాలని ప్రభాస్ సూచించడంతోనే సలార్ టీజర్ని అంత పొద్దున రిలీజ్ చేస్తున్నారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక తాజాగా మరో క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సలార్ మూవీకి కేజీయఫ్ చిత్రంతో లింక్ ఉందంట.. అందుకే టీజర్ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. సరిగ్గా 5.12 గంటలకే ఎందుకు? ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ సిరీస్లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కేజీయఫ్ 2’ చిత్రం పార్ట్ 1ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. రాఖీ భాయ్ చనిపోవడంతో ఆ చిత్రం ముగుస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్కి సలార్ టీజర్ విడుదలకి సంబంధం ఉందట. రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో నాలుగు గడియారాలు ఉంటాయి. ఒక్కోక్కటి ఒక్కో సమయాన్ని సూచిస్తుంది. అందులో ఒకటి సరిగ్గా 5.12 నిమిషాలను చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కేజీయఫ్ సిరీస్తో సలార్కు లింక్ ఉందని.. అందుకే టీజర్ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. కొంతమంది ఇది నిజమే అంటుంటే.. మరికొంత మంది ‘ఇదేం కనెక్షన్స్రా బాబోయ్...’ అని కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. #Salaar #KGF #Prabhas 5:12 AM is the time Rocky Bhai gets attacked in KGF-2 climax and it’s the teaser time of Salaar 🔥🔥 . Mother of all collisions Salaar is coming up 🔥🔥🔥. Salaar 🚢 Kgf #Prabhas #Yash @hombalefilms#salaarbhaicoming pic.twitter.com/KduNGXoGAB — NANI CAMERON ™ (@Nani____3) July 3, 2023 -
లేడీ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ఆ బిజినెస్లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?
మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) -
'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్.. 'ఆదిపురుష్' మేనియా నుంచి మెల్లగా బయటకొచ్చేస్తున్నారు. ఈ సినిమా నచ్చడం, నచ్చకపోవడం గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'సలార్' రచ్చ మొదలైపోయింది. ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది. తాజాగా కొత్త పోస్టర్ ని విడుదల చేసి హైప్ ని పెంచేశారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) పోస్టర్ అదిరింది! 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా 100 రోజులే ఉందని చెబుతూ తాజాగా అప్డేట్ ఇచ్చారు. 'ప్రపంచానికి సీపీఆర్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది' అని వేరే లెవల్లో క్యాప్షన్ పెట్టి ఎలివేషన్ ఇచ్చారు. అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మాట చెప్పారు. పోస్టర్ లో కేజీఎఫ్ కనెక్షన్? 'సలార్' సినిమాకు కేజీఎఫ్ స్టోరీతో సంబంధం ఉందని చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాల్ని లింక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన 'సలార్' పోస్టర్ చాలా డార్క్ గా ఉంది. దీన్ని బ్రైటెనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపించాయి. అయితే అవి 'కేజీఎఫ్ 2'లో రాకీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమేంటనేది.. 'సలార్' రిలీజ్ అయితేనే తెలియదు. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..
-
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు
ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్లో 1977లో ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్) అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్ దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) బాహుబలి-2 ద కంక్లూజన్ రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్కి సీక్వెల్గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) బజరంగీ భాయీజాన్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు. పీకే రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ తదితరులు నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు. ---- పోడూరి నాగ ఆంజనేయులు -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్నీల్ పవర్ఫుల్ డైరెక్షన్తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్వుడ్లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. -
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్కు కలెక్షన్ల సునామీ
-
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడానికి అదే కారణం..: రామ్చరణ్
లాస్ ఏంజిల్స్లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ, సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ, నటుడు శ్రీ సింహా తదితరులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఆస్కార్ అవార్డు సాధించడం గురించి రాజమౌళిని స్పందించమని విలేకర్లు అడగ్గా.. ఆయన ‘జైహింద్’ అన్నారు. ఇక ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు రామ్చరణ్. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి స్పందిస్తూ– ‘‘భారతీయ అభిమానులందరూ ‘ఆర్ఆర్ఆర్’ను ఆదరించారు. ‘నాటు నాటు’ పాటను సూపర్ హిట్ చేశారు. ‘నాటు నాటు’ పాట మాది కాదు.. ప్రజల పాట. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్కి దారి వేసింది, అవార్డు వరించేలా చేసింది. వారితో పాటు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళిగార్లకి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు రామ్చరణ్. తప్పుగా అర్థం చేసుకున్నారు: కాలభైరవ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పాడినందుకు ఆనందంగా ఉందంటూ ఓ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాలభైరవ. ‘‘ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ విలువైన క్షణాలు దక్కడానికి రాజమౌళి బాబా, నాన్న (కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ... ఇలా మరికొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారు. యూఎస్ టీమ్ కూడా హెల్ప్ చేసింది. వీరి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఆస్కార్ వేదికపై నా ప్రదర్శన వీలయ్యేది కాదు’’ అని ఆ నోట్లో చెప్పు కొచ్చారు కాలభైరవ. కాగా ఎన్టీఆర్, రామ్చరణ్ల పేర్లను కాలభైరవ ప్రస్తావించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా కాలభైరవ స్పందించారు. ‘‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ఇందులోని ‘నాటు నాటు’ పాట సక్సెస్కు తారక్ అన్న, చరణ్ అన్న ముఖ్యులు. అందులో సందేహం లేదు. అయితే నేను ఆస్కార్ వేదికపై నా ప్రదర్శనకు సంబంధించిన విషయం గురించి మాత్రమే ఆ నోట్లో ప్రస్తావించాను. అది తప్పుగా అర్థమైనట్లుంది. అయినప్పటికీ నా మాటలను క్షమించమని అడుగుతున్నాను’’ అని కాలభైరవ పేర్కొన్నారు. ఆస్కార్ వేదికపై షాక్ అయ్యా: గునీత్ మోంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మామూలుగా ఆస్కార్ అవార్డు అందుకున్నవారు తమ యాక్సెప్టెన్సీ స్పీచ్ను 45 సెకన్లలో పూర్తి చేయాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తీకి అన్ని సెకన్లలోనే పూర్తి చేశారు. కానీ నిర్మాత గునీత్ మోంగా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని మాట్లాడుతుండగా స్పీచ్ ఆపాలన్నట్లుగా వెనకనుంచి మ్యూజిక్ ప్లే చేశారు ఆస్కార్ నిర్వాహకులు. అలాగని నిర్వాహకులు ఈ 45 సెకన్ల నియమంలో కఠినంగా ఏమీ లేరు. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న చార్లీ మాక్సే, మ్యాథ్యూ ఫ్రౌండ్లు 45 సెకన్ల కన్నా ఎక్కువగా మాట్లాడినా, నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై గునీత్ మోంగా స్పందించారు. ‘‘ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును సాధించామనే గొప్ప విషయం గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ నా స్పీచ్ను కట్ చేశారు. షాక్ అయ్యాను. ఇండియా తరఫున నేను మాట్లాడే అవకాశాన్ని నా నుంచి ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది. నేను మళ్లీ ఆస్కార్కు వెళతాను. అప్పుడు తప్పకుండా నా గొంతు మళ్లీ వినిపిస్తాను’’ అని పేర్కొన్నారు గునీత్. అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానం.. భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ను సాధించిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూడోస్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2’ ఉండేది. తొలుత అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ను సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో వరుసగా ‘దంగల్’ (దాదాపు రూ. 1900 కోట్లు), ‘బాహుబలి: ది కన్క్లూజన్’(రూ. 1800 కోట్లు), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (రూ. 1230 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (దాదాపు రూ. 1150 కోట్లు), ‘పఠాన్’ (రూ. 1050 కోట్లు.. ఇంకా ప్రదర్శిత మవుతోంది) ఉన్నాయి. అయితే గత ఏడాది అక్టోబరులో జపాన్లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ‘ఆస్కార్’ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఈ నెల 3న, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 10న ‘ఆర్ఆర్ఆర్’ను రీ రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లు మొత్తాన్ని కలిపితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ గ్రాస్ కలెక్షన్స్ను ‘ఆర్ఆర్ఆర్’ దాటిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. -
అలా మాట్లాడటం సరైంది కాదు.. మహా కామెంట్స్పై నాని
ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న నాని మహా కామెంట్స్పై స్పందించారు. నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు. కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్లో పాల్గొన్నారు. కేజీఎఫ్ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. -
భారీ సినిమాల లైనప్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న KGF హీరో యష్
-
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
కేజీఎఫ్ హీరోతో పాండ్యా బ్రదర్స్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..!
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు యశ్. బాలీవుడ్తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
‘పాన్ ఇండియా’ జాతర.. అంచనాలతో 1000 కోట్లు.. అనుకోకుండా 400 కోట్లు
బాహుబలి లాంటి ఒక్క చిత్రం పాన్ ఇండియా విజయం సాధిస్తే.. అదే ఫీట్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందా అంటే..తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు సమాధానం చెప్పాయి. వందల కోట్ల వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించాయి. సౌత్ ,నార్త్ ను ఒక్కటి చేసేలా పాన్ ఇండియా హిట్ కొట్టాయి. 2022లో కూడా ఆ సీన్ రిపీట్ అయింది. ఈ ఏడాదంతా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా జాతర కొనసాగింది. అంచానాలతో వచ్చి వెయ్యి కోట్ల కొల్లగొట్టిన చిత్రాలు..ఏ మాత్రం ఊహించకుండా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఇయర్ సౌత్ నార్త్ అనే ఎళ్లలు చేరిపేసిన ఆ చిత్రాలపై ఓ లుక్కేయండి. ‘బహుబలి’ సిరీస్ సినిమాలతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. ఆయన ఈ ఏడాది మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన మరో చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే కేజీయఫ్ 2. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. అంచనాలకు మించి రూ.1200 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. బహుబలి సాధించిన విజయం స్పూర్తితో..మణి రత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ..ఇటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.నాలుగు వందల యాభై కోట్లు కొల్లగొట్టింది. అలాగే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ ఏడాది ‘విక్రమ్’తో బాక్సాఫీస్పై తన విశ్వరూపాన్ని చూపించాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 3 విడుదలై పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.450కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్ హాసన్ సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఈ ఇయర్ లో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి..నార్త్ లో కనికట్టుచేసిన మూవీ..కాంతార. ఇది ఎవరు ఉహించని విజయం..సర్పైజింగ్ సక్సెస్. నాలుగు వందల కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరోవైపు బాలీవుడ్ చిత్రం..బ్రహ్మస్త్ర కూడా..పాన్ ఇండియా హిట్ కొట్టింది. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకొని..దక్షణాది ప్రేక్షకుల ప్రేమను కూడా గెలుచుకుంది. తెలుగు లాంగ్వెజ్ లో ఇరువై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది .అన్ని భాషల్లో కలుపుకొని..నాలుగు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది.ఇలా ఈ చిత్రాలన్ని..ఎళ్లలు దాటి విజయం సాధించాయి..వందల కోట్ల చిత్రాల జాబితాలోకి చేరాయి. -
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
కె.జి.యఫ్ హోటల్.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్ సినిమాలకు నార్త్లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్లుక్ టీజర్ ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్పైనే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్లో వర్కౌట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అనురాగ్ పేర్కొన్నాడు. -
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్వుడ్లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
గూగుల్ సెర్చ్లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
కాంతార ప్రభంజనం.. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి. ‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC… ⭐️ #Karnataka: ₹ 168.50 cr ⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr ⭐️ #TamilNadu: ₹ 12.70 cr ⭐️ #Kerala: ₹ 19.20 cr ⭐️ #Overseas: ₹ 44.50 cr ⭐️ #NorthIndia: ₹ 96 cr ⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf — taran adarsh (@taran_adarsh) November 22, 2022 -
జపాన్లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 21న జపాన్లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అమిర్ ఖాన్ బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రికార్డును అధిగమించింది. జపాన్లో విడుదలైన 17 రోజుల్లోనే 185 మిలియన్ల జపాన్ యెన్ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. గతంలో రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బాహుబలి- 2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 185 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలోనే కేజీఎఫ్-2 అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవనుందా? అనే నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1150 కోట్లు వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్. యష్ నటించిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం జపాన్లో అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే జపాన్ కరెన్సీలో 185 మిలియన్ల(రూ.10 కోట్లు) వసూళ్ల రాబట్టిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ఇకముందు ఇదే జోరు కొనసాగిస్తే 2022లో కేజీఎఫ్ కలెక్షన్లను దాటి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించే అవకాశముంది. #RRRMovie is having a remarkable run at Japan Box Office, collecting 185M ¥ by 3rd weekend (17 days) with 122K+ footfalls Fastest Indian Film to achieve this & becoming the 3rd highest grossing film after Muthu & Baahubali2@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @onlynikil pic.twitter.com/X8noPqROfb — Ramesh Bala (@rameshlaus) November 7, 2022 -
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
రక్తంతో లేఖలు, అశ్లీల చిత్రాలు పంపేవాడు: రవీనా టాండన్
కేజీఎఫ్ మూవీలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకుంది భామ. అయితే ఆమెకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవలే బయట పెట్టారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన భయానక పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఓ అభిమాని రవీనాకు రక్తంతో రాసిన లేఖలు, బ్లడ్ వయల్స్, అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపేవాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన భర్త అనిల్ తడానీ, పిల్లలతో కలిసి వెళ్తుండగా అభిమాని కారుపై పెద్ద రాయి విసిరిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటనతో భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశామని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. ఇంటి వద్ద రెక్కీ: అంతే కాకుండా రవీనాపై ప్రేమను నిరూపించుకోవడానికి ఒక అభిమాని ఏకంగా ఒకసారి ఆమె నివాసం గేటు బయట కూడా క్యాంప్ నిర్వహించాడని భయానకమైన పరిస్థితిని నటి వివరించింది. కేజీఎఫ్లో నటించిన రవీనా.. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వస్తున్న చిత్రం 'పట్నా శుక్లా'లో కనిపించనుంది. ఈ సినిమాలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువ : మక్కువతో ఫొటోగ్రఫీని తన ప్రవృత్తిగా ఎంచుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే తాను తీసిన ఫొటోలు సోషల్ మీడియాతో పాటు ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. వన్యప్రాణుల్ని, అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయడానికి ఎక్కువ ఇష్టమని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని బంధావ్ఘర్ నేషనల్ పార్క్లో తన భర్త, కూతురితో కలిసి పర్యటించిన రవీనా.. అక్కడి వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్గా మారాయి. ఆమె తీసిన కొన్ని ఫొటోలు ముంబయిలోని ‘జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ’లోనూ ప్రదర్శించారు. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
రాహుల్ పాదయాత్రలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు!
దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రలో టీకాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ఇక, కర్నాటకలో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోకు కేజీఎఫ్-2 పాటను కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు. దీంతో, తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. అయితే, కర్నాటకలో రాహుల్ జోడోయాత్ర సందర్భంగా పాదయాత్ర ఫొటోలకు బ్యాక్ గ్రౌండ్గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్ఆర్టీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, జైరామ్ రమేశ్పై కేసు పెట్టింది. आओ, तुम्हें 'सपनों के भारत' की ओर लेकर चलें...#BharatJodoYatra pic.twitter.com/4sZinLl8sS — Congress (@INCIndia) October 11, 2022 -
Kantara Movie: KGF, కాంతార మధ్య పోలిక...
-
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్లకు ఈ రేటింగ్స్ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్స్టార్)- 7.3 8. మాయి (నెట్ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
మహేష్బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్సీ పాప్కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్పోజర్ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్ఫామ్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు
కరోనా అనంతరం ఈ ఏడాది వరల్డ్ బాక్సాపీస్ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ తర్వాత కేజీయఫ్ 2 ఉంటుంది. అయితే తాజాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. ఐఎండీబీ(imdb) ఇటీవల రిలీజ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కన్నడ బ్లాక్బస్టర్ చిత్రమైన ‘కేజీయఫ్ 2’, తాజాగా విడుదలైన మరో కన్నడ మూవీ ‘777 చార్లీ ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ అధిగమించాయి. కేజీయఫ్ 2, 101వ స్థానంలో నిలువగా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా అధిగమించాయి. చదవండి: మాధవన్ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కే కిరణ్ రాజ్ దర్శకత్వంలో ‘777 చార్లీ’ చిత్రం రూపొందింది. ధర్మ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క (పెట్) ప్రవేశించి.. అతని జీవితాన్నిఎలా మార్చేసిందనేది ఈ కథ. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్తో ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి. -
Srinidhi Shetty: కేజీయఫ్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి?
హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది. (చదవండి: టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్) ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్ సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి. కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్వుడ్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. -
OTT: అమెజాన్లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం
కన్నడ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన తొలి చిత్రంగా కేజీయఫ్ నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండ 2018లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్గా కేజీయఫ్ 2 తెరకెక్కి ఎప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. నార్త్లో ‘బాహుబలి’ తర్వాత రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సినిమాగా కేజీయఫ్ 2 రికార్డు సృష్టించింది. చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు ఇటీవలే ఈ చిత్రం రూ. 1200కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘కేజీయఫ్ 2’ ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైం వీడియోస్ సొంతం చేసుకుంది. మార్చి 16 నుంచి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సబ్స్క్రైబర్లు అదనంగా రూ.199 పెట్టి సినిమా చూసే విధానంతో అందుబాటులోకి తెచ్చారు కేజీయఫ్ 2ను. అయితే త్వరలోనే కేజీయఫ్ చిత్రానికి ‘పే పర్ వ్యూ’ పద్దతిని తొలిగించనున్నారు. చదవండి: నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలు?, అందుకే పదేపదే వాయిదా! జూన్ 3 నుంచి సబ్స్క్రైబర్లు ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమెజాన్ సంస్థ కల్పించనుంది. తాజాగా దీనిపై అమెజాన్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, నటి రవీణ టాండన్ రావూరమేష్, ప్రకాశ్రాజ్లు కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. View this post on Instagram A post shared by amazon prime video IN (@primevideoin) -
కేజీయఫ్ 3లో హృతిక్ రోషన్!
ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్ దత్ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2. కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. -
కేజీఎఫ్–2 చూసి.. రాఖీభాయ్లా సిగరెట్లు కాల్చి..
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్2 కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రంతో యశ్ గ్రాఫ్ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి యశ్ హీరోయిజమే మెయిన్ అట్రాక్షన్.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు. యష్ నటించిన కేజీఎఫ్–2 సినిమాలోని ‘రాఖీభాయ్’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్ స్టైల్ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్ ప్యాకెట్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్లో అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు. -
పాన్ ఇండియా స్టార్డమ్ కోసం సేఫ్సైడ్ గేమ్!
పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ అందుకోవడం ఒక ఎత్తు. ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ లో వరుస ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు తప్పులు సరిదిద్దే పనుల్లో పడ్డాడు. అందుకే మిగితా పాన్ ఇండియా హీరోలు అలెర్ట్ అయ్యారు. ఎన్టీఆర్, రామ్చరణ్, యశ్ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోలుగా వెలిగిపోయేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. కేజీయఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యశ్.రాఖీభాయ్ క్యారెక్టర్ లో యశ్ కనిపించిన తీరు, అతని నటన, పాన్ ఇండియా ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. కేజీయఫ్ 2 తో కలిసొచ్చిన ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడుకునేందుకు మరోసారి రాఖీభాయ్ క్యారెక్టర్ ను రిపీట్ చేస్తున్నాడు. త్వరలోనే కేజీయఫ్ 3తో తిరిగొస్తానంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నప్పుడే ఆ సినిమా రేంజ్ ను ఎక్స్ పెక్ట్ చేసి,అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మూవీస్ ను లైనప్ లో పెట్టాడు రామ్ చరణ్.ఇప్పటికే మాస్టర్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో మూవీ లైనప్ లో ఉంది.ఇప్పుడు వీటితో పాటు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్. ఖైదీ,మాస్టర్, విక్రమ్ లాంటి యాక్షన్ మూవీస్ తో నయా ట్రెండ్ సెట్ చేసాడు లోకేష్.గన్స్ అండ్ బిర్యానీ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.ఇప్పుడు ఇదే ట్రెండ్ ను రామ్ చరణ్ కంటిన్యూ చేస్తూ లోకేష్ మేకింగ్ లో తాను కూడా యాక్షన్ హీరోగా కనిపించాలనకుంటున్నాడు ఆర్ ఆర్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ చేయాల్సిన సినిమా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. కొరటాలశివతో తారక్ పాన్ ఇండియా మూవీ లాక్ అయింది.ఈ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. -
యశ్ తర్వాతి చిత్రం ఏంటీ? రాకీభాయ్ ఏం చేయబోతున్నాడు?
కేజీయఫ్-1 తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని కేజీయఫ్ 2తో తిరిగొచ్చాడు యశ్. ఫస్ట్ పార్ట్ రూ.250 కోట్లు వసూలు చేస్తే.. సెకండ్ పార్ట్ ఉవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.1200 కోట్లు దాటింది. దీంతో రాకీభాయ్ మళ్లీ కేజీయఫ్3తోనే తిరిగొస్తాడని శాండల్వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఏమో సలార్, ఎన్టీఆర్ చిత్రాలకు డేట్స్ లాక్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు రాకీభాయ్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్గా మారింది. (చదవండి: : ప్రశాంత్ నీల్-తారక్ మూవీ అప్డేట్ వచ్చేసింది) యశ్ తర్వాతి చిత్రం ఏంటనేదానిపై ఇప్పటి వరకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేజీయఫ్ 2 ప్రమోషన్లో అడిగితే కూడా సైలెంట్గానే ఉన్నాడు. అయితే కన్నడ సినిమా మాత్రమే చేస్తానని ఓ చోట లీక్ ఇచ్చాడు. ఆ కన్నడ సినిమా కేజీయఫ్-3నే అని టాక్ కూడా ఉంది. అదే నిజమైతే రాకీభాయ్ని మళ్లీ తెరపై చూడాలంటే మరో మూడేళ్లు వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రభాస్ సలార్ విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏడాదికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ప్రశాంత్ నీల్ కేజీయఫ్-3ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే 2025లో రాకీభాయ్ రీఎంట్రీ ఉంటుందన్నమాట. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్
Siddharth Shocking Comments On KGF 2, Pan India: కేజీయఫ్ 2 మూవీని పాన్ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఎస్కేప్ లైవ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా కేజీయఫ్2 సక్సెస్, ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆ సీన్స్తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! ఈ మేరకు సిద్ధార్థ్ మాట్టాడుతూ.. ‘పాన్ ఇండియా.. ఈ పదం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్గా, టాలీవుడ్లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్కు కూడా. అయితే, నా వరకు వాటిని ఇండియన్ సినిమాలు అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఈ వ్యాఖ్యలు ఎవరిని ఇబ్బంది పెట్టడాలని అనడం లేదన్నాడు. ‘పరిశ్రమలో అధిక ప్రాధాన్యత ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఓ హిందీ సినిమా అత్యధిక ప్రేక్షాకదరణ పొందితే దానిని హిందీ సినిమా అనే అంటారు. కానీ, ప్రాంతీయ సినిమాలకు విషయానికి వస్తే అలా ఎందుకు ఉండదు. ప్రాంతీయ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభించి, భారీ విజయం సాధిస్తే వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అనొచ్చు కదా. లేదా కేజీయఫ్ జర్నిని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు లేదా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సినిమా అని పిలవచ్చు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ ఫిలిం అని చెప్పండి. పాన్ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది’ అంటూ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో కూడా సిద్ధార్థ్ పాన్ ఇండియా పదంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారని, అలా అయితే 15 ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారని వ్యాఖ్యానించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'తుఫాన్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా !
KGF 2: Yash Starrer Toofan Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్, శాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క అత్యధిక వసూళ్లు రాబట్టగా మరోపక్క విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. బాలీవుడ్లో రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాలోని డైలాగ్లు, యాక్షన్ సీన్లు, యశ్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి. 'కేజీఎఫ్ 2'లోని ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల అమ్మ పాట, మెహబూబా సాంగ్లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా తుఫాన్ పాటను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తుఫాన్ సాంగ్ యూట్యూబ్లో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, శ్రీనిధి శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చదవండి: 'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ? -
అమెజాన్లో ఈ సమ్మర్ను కూల్ చేసే వరల్డ్ బ్లాక్బస్టర్ చిత్రాలను చూసేయండిలా!
ఈ ఏడాది బ్లాక్బస్టర్ చిత్రాలై పాన్ ఇండియా చిత్రాలను చూసేందుకు మూవీ లవర్స్ కోసం అమెజాన్ ప్రైం వీడియోస్ ఎర్లీ యాక్సెస్ ద్వారా ‘మూవీ రెంటల్స్’ పేరుతో కొత్త యాక్సెస్ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ రెంటల్ యాక్సస్ ద్వారా డిజిటల్ సబ్స్క్రిప్షన్ కంటే ముందే బ్లాక్బస్టర్ చిత్రాలను ఇంట్లోనే చూడోచ్చు. ఈ యాక్సెస్ను మే 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అమెజాన్ ప్రైం వీడియోస్ వారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్కు ఈ సమ్మర్లో ఇంట్లోనే మరింత వినోదం అందించేందుకే అమెజాన్ ఈ కొత్త పోర్టల్ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ యాక్సెస్ ద్వారా పాన్ ఇండియా చిత్రాలతో పాటు వరల్డ్ వైడ్గా బ్లాక్బస్టర్ హిట్ సాధించిన సినిమాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రిచ్ క్యాట్లాగ్ సినిమాలను హాయిగా ఇంట్లోనే చూసేయొచ్చు. ఇప్పటికే సబ్స్రైబ్ చేసుకున్న వారితో పాటు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అమెజాన్ ప్రైం యాప్లోనే ఈ ‘మూవీ రెంటల్స్ ’ యాక్సెస్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మూవీ రెంటల్స్లో ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్ సాధించిన పాన్ ఇండియా చిత్రం కేజీయఫ్ 2 సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కేజీయఫ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఎర్లీ యాక్సెస్ ‘మూవీ రెంటల్స్’లో సినిమాలు చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారితో పాటు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు కూడా రూ. 199 చెల్లించాల్సిందే. ప్రైమ్వీడియోస్.కామ్ స్టోర్ ట్యాబ్ ద్వారా మీ ఆన్డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఎస్టీబీఎస్, ఫైర్ టీవీ స్టిక్ ద్వారా యాక్సెస్ను పొందండి. అయితే ఒకసారి ఈ విండోలో సినిమా చూస్తే తిరిగి 48 గంటల తర్వాతే ఈ మూవీ మళ్లీ ప్లేబ్యాక్ అవుతుంది. అంటే ఈ సినిమాను 48 గంట్లో ఒకసారి మాత్రమే చూడోచ్చు. అలా ఈ రెంటల్ యాక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల పాటు దీని వాలిడిటి ఉంటుంది. ఈ గడువులోపే కస్టమర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బ్లాక్బస్టర్ చిత్రాలను వీక్షించే అవకాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఎర్లీ రెంటల్ యాక్సెస్ పొంది ఇంట్లోనే బ్లాక్బస్టర్ సినిమాలు చూస్తూ ఈ సమ్మర్ను కూల్గా ఎంజాయ్ చేయండి. (అడ్వర్టోరియల్) -
'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ?
Hombale Films Producer Karthik Gowda About KGF 3: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్ టాక్తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్గా 'కేజీఎఫ్ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 3 మూవీని మార్వెల్ తరహాలో తెరకెక్కించనున్నట్లు, అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు హోంబలే సంస్థ నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలో సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. 'సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ 'కేజీఎఫ్ 3'ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.' అని కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. చదవండి: 'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా The news doing the rounds are all speculation. With a lot of exciting projects ahead of us , we @hombalefilms will not be starting #KGF3 anytime soon. We will let you know with a bang when we start the work towards it. — Karthik Gowda (@Karthik1423) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా
KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్. ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు. చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం! సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2: 'మెహబూబా' లవ్ సాంగ్ పూర్తి వీడియో చూశారా !
KGF 2 Movie Mehabooba Mehabooba Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫాన్తో రాఖీ భాయ్ ఊచకోత కోస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్లో కూడాల చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సాంగ్స్ పూర్తి వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సాంగ్ను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్లో సాగిన 'మెహబూబా' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియో సాంగ్ లింక్ను షేర్ చేసింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ?
KGF 2: Voice Of Every Mother Full Song Released: రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోన యాక్షన్ సీన్స్, పాటలు ఆడియెన్ను ఒక రేంజ్లో ఉర్రూతలూగించాయి. యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో కొడుకు గురించి తల్లి పాడే ఎదగరా ఎదగరా అనే పాట ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటను 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్ (అమ్మ పాట)' అని ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం (మే 8) మదర్స్ డే సందర్భంగా పూర్తి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్' అని ట్వీట్ చేస్తూ షేర్ చేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి ప్రశాంత్ నీల్ మీకు అన్హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు Voice of every MOTHER!#GaganaNee/#FalakTuGarajTu/#YadagaraYadagara/#AgilamNee/#GaganamNee : https://t.co/lsnsFyAupu#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @LahariMusic @Mrtmusicoff pic.twitter.com/b2RbaKR8U0 — RamajogaiahSastry (@ramjowrites) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి
శాండల్వుడ్ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా తన కెరీర్లో సుదీర్ఘ కెరీర్లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. చెల్లాట సినిమా ఆయన కెరీర్కు మాంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచిన కేజీయఫ్, కేజీయఫ్-2 చిత్రాల్లో కూడా ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల శాండల్వుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్టైం కలెక్షన్స్ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రశాంత్ నీల్ మీకు అన్హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
రామ్ గోపాల్ వర్మ.. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ.. తన రూటే సపరేట్ అంటాడు. నిత్యం సెలబ్రెటీలను సటైరికల్ కామెంట్స్తో కవ్విస్తుంటాడు. ఏ అంశాన్ని అయినా భిన్నమైన కోణంలో చూసి.. దానిని నిస్సందేహం వ్యక్తం చేస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తాడు. అలాంటి ఆర్జీవీ డైరెక్టర్స్ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు. దీంతో ప్రశాంత్ నీల్పై వర్మ వరుస ట్వీట్స్ చేస్తు ప్రశంసలు కురిపించాడు. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి I wish a very UNHAPPY Directors day to @prashanth_neel for so royally FUCKKKKING every directors mind everywhere whether it’s in BOLLYWOOD, TOLLYWOOD,KOLLYWOOD and even in SANDALWOOD ..Sir Prashant Neel, U are the VEERAPPAN of indian cinema🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 ‘ప్రశాంత్ నీల్.. మీకు అన్ హ్యాపీ డైరెక్టర్స్ డే. కేజీయఫ్ మూవీతో మీరు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్తో పాటు శాండల్వుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారు. ఇండియన్ సినిమాకు మీరు వీరప్పన్ లాంటి వారు’ అంటూ వర్మ కొనియాడాడు. సంప్రదాయ పరమైన సినీ పరిశ్రమలకు చెందిన 95 శాతం ప్రజలకు మీ కేజీయఫ్ సినిమా నచ్చి ఉండదు. ఈ మూవీతో మీరు సినీ పరిశ్రమలోని పాత పద్దతిని దూరం చేసి కొత్త పద్దతిని పరిచయం చేశారు’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాగాక ఎంతో మంది రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారు కానీ, వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారంటూ ప్రశాంత్ నీల్ను పొగడ్తలతో ముంచెత్తాడు వర్మ. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! Sir @prashanth_neel u made a quintal of money but that at the cost of indian film industry losing 100’s of tonnes of money becos they will all spend on reshoots, redrafts,rethinks in reinventing themselves,but not knowing why the fucking fuck KGF 2 worked 😳#UnhappyDirectorsDay — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 95% of the tradition oriented conventional film industry people have hated KGF 2 and that itself is the proof that @prashanth_neel has kicked out the old industry and brought in a new industry ,which is the #Kgf2 industry — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి, మేలో బిగ్ ఫెస్టివల్!
List Of Upcoming OTT Movies In May 2022: మొన్నటి వరకు థియేటర్స్లో సందడి చేసిన పాన్ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి కేజీయఫ్ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్లో నయా జోష్ మొదలైంది. ముందుగా మే 11న బీస్ట్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 13న థియేటర్స్లో విడుదలైంది. ఓ షాపింగ్ మాల్లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు అనేదే బీస్ట్ కథ. ఈ చిత్రానికి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన రావడం, తరువాతి రోజు(ఏప్రిల్ 14) కేజీయఫ్2 విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద బీస్ట్ బోల్తాపడింది. దీంతో అనుకున్నదానికి కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. మే 11న సన్ నెక్స్ట్తో పాటు నెట్ఫ్లిక్స్లో బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక మే 13న 2022 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ది కశ్మీర్ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న థియేటర్స్లో విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక మే20న మరో పాన్ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. జూన్ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్ ప్రకారం మే 20 నుంచే జీ అండ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. తొలుత ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఈ రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నుంచి మాత్రం సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉందనుంది. ఆర్ఆర్ఆర్తో పాటు మరో పాన్ ఇండియా చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 27న అమెజాన్ ప్రైమ్ లో కేజీయఫ్ 2 విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ నిజంగానే మే 27న ఓటీటీలోకి కేజీయఫ్ 2 వస్తే.. రాకీభాయ్ ఫ్యాన్స్కు పండగే. (చదవండి: గుడ్న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్!) మరో వైపు ఆచార్య ఓటీటీ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్యకు ఆశించినంత ఆదరణలేకపోవడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎర్లీ ప్రీమియర్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య ప్రొడ్యూసర్స్ తో 18 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు ఎంత క్యూట్గా పాడిందో చూశారా?
Yash Daughter Ayra Says Salam Rocky Bhai: కన్నడ రాక్స్టార్ యశ్ ప్రస్తుతం కేజీయఫ్ 2 సక్సెస్ను ఆస్వాదిస్తున్నాడు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్ 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1000కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క బాలీవుడ్లోనే ఈ మూవీ రూ. 350 కోట్లు వసూళ్లు చేసిన తొలి దక్షిణాది సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక మూవీ యశ్ కెరీర్లో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. చదవండి: సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా? ఆమె ట్వీట్ అర్థం ఏంటి? ఇక కేజీయఫ్ 2 షూటింగ్తో ఇంతకాలం ఫుల్ బిజీగా ఉన్న యశ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. యశ్ ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్లకు, వెకేషన్స్కు వెళతాడు. ఈ క్రమంలో కూతురు ఐరాతో యశ్ తన డేను స్టార్ట్ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశాడు యశ్. ఈ సందర్భంగా సలాం రాఖీ భాయ్ అంటూ ఐరా పాట పాడింది. చదవండి: హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్ కామెంట్స్ ‘సలాం రాకీ భాయ్.. రారా రాఖీ..’ అంటూ ఐరా క్యూట్గా పాడిన ఈ వీడియోను యశ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోకు యశ్ ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సో క్యూట్ అంటూ ఐరాపై ముద్దులొలికిస్తున్నారు నెటిజన్లు. కాగా యశ్ 2016లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. కూతురు ఐరా 2018 డిసెంబర్లో జన్మించగా.. 2019 అక్టోబర్లో ఈ జంటకు యథర్వ్ జన్మించాడు. View this post on Instagram A post shared by Yash (@thenameisyash) -
రాకీ భాయ్ ఊచకోత.. నాలుగో చిత్రంగా కేజీయఫ్ 2
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. వెయ్యికోట్ల క్లబ్లో చేరిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్ 2’ నిలిచింది. ఇక టాలీవుడ్లోనూ కేజీయఫ్ 2 ఇంకా తగ్గలేదు. 15 రోజుల్లో ఈ చిత్రం 77.31 కోట్ల షేర్ని రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office.. Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie — Ramesh Bala (@rameshlaus) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు
Actor Nawazuddin Siddiqui About South India Movies: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. ఈ వార్ మధ్యలోకి ఆర్జీవీ దూరి బాలీవుడ్కు చురకలు అట్టించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురింది. ఈ నేపథ్యంలో దీనిపై వరుసగా బాలీవుడ్, సౌత్ స్టార్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, మనోజ్ బాజ్పాయి వంటి అగ్ర నటులు ఈ వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించారు. చదవండి: షాకింగ్: కెమెరామెన్పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో దక్షిణాది సినిమాలు ‘పుష్మ: ది రైజ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’లు బాలీవుడ్లో భారీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఏ దక్షిణాది సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలనే కాదు, కమర్షియల్ సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. అంతేగాక ప్రస్తుతం నాకు అంత సమయం కూడా లేదు. కాబట్టి నేను వీటి సక్సెస్పై ఎలాంటి కామెంట్ చేయలేను’ అని బదులిచ్చారు. అనంతరం తాజాగా పరిశ్రమలో నెలకొన్న హిందీ భాష వివాదం, బాలీవుడ్పై వస్తున్న విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. లాక్డౌన్ నుంచి సినిమాలపై ప్రేక్షకుడి అభిరుచి మారిందని ఆయన అన్నారు. ‘ఒక సినిమా హిట్ అయితే అంతా కలిసి దాన్ని ఆకాశానికెత్తడం. అంతగా కలెక్షన్స్ రాకుంటే వెంటనే విమర్శలు గుప్పించడం సాధారణమైంది. ఇప్పుడిదో ఫ్యాషన్ అయిపోంది. ఈ ట్రెండ్ కూడా పరిస్థితులను బట్టి మారుతోంది. బాలీవుడ్కు ఒక్క బ్లాక్బస్టర్ పడితే అంతా సర్దుకుంటుంది’ అన్నారు. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది అలాగే లాక్డౌన్లో అంతర్జాతీయ సినిమాలు చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని తాను ముందుగానే ఊహించానన్నారు. కానీ ఈ మార్పు అంత మంచిది కాదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదిరిస్తున్నారన్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇక తాము కూడా హీరో పంటి-2 వంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, అవి కలెక్షన్ల పరంగా తమ సినిమాలు భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటున్న కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్ చాప్టర్ 1కు సీక్వెల్గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. మోడల్గా కేరీర్ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్ చాప్టర్ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న వచ్చిన కేజీయఫ్ 2 అంచనాలను మించి సూపర్ బ్లాక్బస్టర్గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్లోకి చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యశ్.. ఫోటోలు వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కెరీర్నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. అయితే మొన్నటివరకు షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపిన యశ్ తన భార్యతో కలిసి వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ భార్య రాధిక పండిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్ ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది. చదవండి: సూర్యపేటలో అనుపమ సందడి, షాకిచ్చిన ఫ్యాన్స్ -
హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..
Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల 'దస్వీ' చిత్రంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 'పాన్ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. మరేదైనా ఇండస్ట్రీకి ఈ పదాన్ని వాడుతున్నామా ? లేదు కదా. కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్ అవుతుంది. బాలీవుడ్లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్ సాధించాయి. రీమేక్ అనేది ఎప్పుడూ జరిగేదే. అది ఒక చాయిస్ మాత్రమే. మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.' అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. కాగా అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం 'బ్రీత్' వెబ్ సిరీస్ మూడో సీజన్లో నటిస్తున్నాడని సమాచారం. చదవండి: అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
KGF ప్రశాంత్ నీల్.. మన బంగారమే
కేజీఎఫ్.. కేజీఎఫ్.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్ రేంజ్ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్నీల్ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం. మడకశిర(అనంతపురం): ప్రశాంత్ నీల్ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. వెండితెర ప్రయాణమిలా.. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉగ్రమ్తో విశ్వరూపం 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. ‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది. నీల్ అంటే నీలకంఠాపురం.. రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ కుమారుడు ప్రశాంత్నీల్ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్ తన ఇంటిపేరును నీల్ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. నీలకంఠాపురంలోని ప్రశాంత్నీల్ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంది మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా. – భారతి, ప్రశాంత్నీల్ తల్లి నీలకంఠాపురానికి గుర్తింపు సినిమా డైరెక్టర్గా ప్రశాంత్నీల్ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. – చిన్న రంగేగౌడ్, ప్రశాంత్నీల్ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? -
'పుష్ప-2'పై 'కేజీయఫ్-2' ఎఫెక్ట్ పడనుందా..?
గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాలు భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. అక్కడి జనాలు మన చిత్రాల మేకింగ్, టేకింగ్, యాక్టింగ్లకు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలదే హవా. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ 'కేజీయఫ్-2'తో హిందీలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. దాంతో ఈ చిత్ర ప్రభావం రాబోయే సినిమాలపై పడనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. 'కేజీయఫ్: చాప్టర్1'కు కొనసాగింపుగా 'కేజీయఫ్-2' వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రం తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కథతో పాటు హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం సీక్వెల్స్ చేస్తున్న దర్శకులకు 'కేజీయఫ్-2' భారీ హీట్ కావడంతో ఇతర చిత్రాల మేకర్స్కు అది ఒకింత తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఏమాత్రం తగ్గినా దాన్ని ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోవచ్చు. మొదటి పార్ట్, రెండో పార్ట్ను పోల్చి చూడటంతో దానిపై రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంది. అది చిత్ర ఫలితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే సీక్వెల్స్ విషయంలో 'కేజీయఫ్' చిత్రంలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' రెండో భాగం కూడా పాన్ ఇండియా లెవల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రాఖీభాయ్ పాత్రలా పవర్ఫుల్ ఎలివేషన్స్తో 'పుష్ప' పాత్ర ఉంటుందా? అసలు పుష్ప ఎర్రచందనం సిండికేట్ను ఎలా నడిపించాడు? భన్వర్ సింగ్ షెకావత్తో పాటు మంగళం శ్రీనులను ఎలా ఎదుర్కొని నిలిచాడు? లాంటి పలు ప్రశ్నలు ప్రస్తుతం ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. దీంతో చిత్ర బృందం సైతం అభిమానుల అంచనాలను అందుకునేలా పలు సన్నివేశాలను రాసుకుంటోందని సమాచారం. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం తగ్గేదేలే అనేలా పుష్పరాజ్ పాత్రను మరింత ఎలివేట్ చేసేలా పుష్ప-2 కథ, కథనాలను మలుస్తున్నాడని తెలుస్తోంది. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });