Mohammad Rizwan
-
అందుకే ఓడిపోయాం.. ఆ ఇద్దరు మాత్రం అద్బుతం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఆరంభ మ్యాచ్లోనే పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పాక్.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) జట్టు పరాజయంపై స్పందించాడు. కివీస్ జట్టు భారీ స్కోరు సాధిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.తాము అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశామని.. అయితే, న్యూజిలాండ్ తమ కంటే గొప్పగా ఆడిందని రిజ్వాన్ ఓటమిని అంగీకరించాడు. ఏదేమైనా తొలి మ్యాచ్లోనే ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన విల్ యంగ్, లాథమ్ఈ క్రమంలో కరాచీ వేదికగా ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో పాక్ న్యూజిలాండ్తో తలపడింది. నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో టాస్ గెలిచిన రిజ్వాన్ బృందం తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే(10)తో పాటు వన్డౌన్ స్టార్ కేన్ విలియమ్సన్(1), డారిల్ మిచెల్(10) త్వరగా పెవిలియన్కు పంపి శుభారంభం అందుకుంది.కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ విల్ యంగ్(Will Young- 107), వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) పాక్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ ఇద్దరు అద్భుత శతకాలతో రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్(39 బంతుల్లో 61) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు స్కోరు చేసింది.A quality knock! 💯#TomLatham brings up a stunning century, putting New Zealand firmly in command against the defending champions! 💪🏻FACT: Fifth time two batters have scored centuries in an innings in Champions Trophy!📺📱 Start watching FREE on JioHotstar:… pic.twitter.com/vAKzM0pW1Y— Star Sports (@StarSportsIndia) February 19, 2025 పాక్ బ్యాటర్ల వైఫల్యంఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 47.2 ఓవర్లకు కుప్పకూలింది. బాబర్ ఆజం(64), కుష్దిల్ షా(69) అర్ధ శతకాలు సాధించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 260 పరుగులకే ఆలౌట్ అయి.. అరవై పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు ఈ మేరు భారీ స్కోరు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు. 260 పరుగుల వరకే కివీస్ను కట్టడి చేయగలమని భావించాం. మా పరిధి మేర అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాం. అయితే, వాళ్లు మాకంటే గొప్పగా ఆడి భారీ టార్గెట్ ఇచ్చారు.ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో!నిజానికి ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు పెద్దగా సహకరించలేదు. కానీ విల్ యంగ్, లాథమ్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి.. సులువుగా పరుగులు రాబట్టేశారు. అయితే, ఆఖరి ఓవర్లలో మేము మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేశాం. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం.ఇక బ్యాట్తోనూ మేము శుభారంభం అందుకోలేకపోయాము. ఫఖర్ జమాన్ గాయంపై కూడా పూర్తి సమాచారం ఇంకా లభించలేదు. ఈ మ్యాచ్లో పవర్ప్లే, డెత్ ఓవర్లలో మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితం ఏదైనా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మిగతా మ్యాచ్లలో మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో రిజ్వాన్ 14 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి విలియం రూర్కీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్ న్యూజిలాండ్తో నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లూ కివీస్ జట్టే విజయం సాధించడం విశేషం. ఇక బుధవారం నాటి మ్యాచ్లో సెంచరీ వీరుడు టామ్ లాథమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
PAK Vs NZ: వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ను ఫిలిప్స్ పెవిలియన్కు పంపాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు.పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కివీ స్పీడ్ స్టార్ విలియం ఓ'రూర్క్ ఆఖరి బంతిని రిజ్వాన్కు కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. వెడ్త్ దొరకడంతో పాయింట్ దిశగా రిజ్వాన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే కట్ షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి, పాయింట్లో ఉన్న ఫిలిప్స్ మాత్రం అద్బుతం చేశాడు.ఫిలిప్స్ తన ఎడమవైపునకు డైవ్ చేసి సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో మహ్మద్ రిజ్వాన్(3) ఒక్కసారిగా బిత్తరపోయాడు. గ్లెన్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్ బ్యాట్తో సైతం సత్తాచాటాడు. 39 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తడబడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
అతడు ఓపెనర్గానే వస్తాడు.. ట్రోఫీ గెలవడమే లక్ష్యం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) అన్నాడు. తమ పాత్రలు ఏవైనా అందరి ప్రధాన లక్ష్యం మాత్రం టైటిల్ గెలవడమేనని తెలిపాడు. అదే విధంగా తమ ఓపెనింగ్ జోడీలోనూ ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని రిజ్వాన్ పేర్కొన్నాడు.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహించగా నాడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో పాక్ జట్టు తొలుత న్యూజిలాండ్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం(Babar Azam) ఓపెనర్గానే బరిలో దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా వన్డౌన్లో వచ్చే బాబర్.. ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో త్రైపాక్షిక సిరీస్లో భాగంగా ఓపెనర్గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు.ఓపెనర్గా ఆడిన మూడు మ్యాచ్లలో వరుసగా 10, 23, 29 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా గడ్డపై సయీమ్ ఆయుబ్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్గా ప్రమోట్ అయిన బాబర్ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను ఓపెనర్గా ఆడించడంపై పునరాలోచన చేయాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు.అతడు ఓపెనర్గానే వస్తాడు..ఈ నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే, కాంబినేషన్లకు అనుగుణంగానే తుదిజట్టు కూర్పు ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్గా కొనసాగుతాడు. తన బ్యాటింగ్ స్థానం పట్ల అతడు సంతృప్తిగానే ఉన్నాడు.స్పెషలిస్టు ఓపెనర్లతోనే బరిలోకి దిగాలని మాకూ ఉంది. అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఒక్కోసారి సడలింపులు తప్పవు. అందుకే బాబర్ ఆజంను ఓపెనర్గా పంపాలనే నిర్ణయానికి వచ్చాం. ఫఖర్ జమాన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టెక్నికల్గా అతడు గొప్ప బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.అందరూ కెప్టెన్లేఇక ఈ టోర్నీలో నేను లేదంటే బాబర్ ఆజం మాత్రమే ముఖ్యంకాదు. ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు కఠినంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్గా జట్టు సమిష్టి ప్రదర్శనతో వచ్చే గెలుపును ఆస్వాదిస్తా. అయితే, కొన్నిమ్యాచ్లలో వ్యక్తిగత ప్రదర్శనలే అధిక ప్రభావం చూపిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతం మా దృష్టి జట్టులోని పదిహేను మంది సభ్యులపై ఉంది. అందరూ కెప్టెన్లే. అయితే, వారికి ప్రతినిధిగా నేను టాస్ సమయంలో.. మీడియా సమావేశంలో ముందుకు వచ్చి మాట్లాడుతానంతే’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
'బాబర్, అఫ్రిది కాదు.. వారిద్దరితోనే టీమిండియాకు డేంజర్'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న మొదలు కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ టోర్నీలో అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది.ఫిబ్రవరి 23న దుబాయ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు పాకిస్తాన్పై భారత్ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. కానీ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం టీమిండియాను పాక్ కంగుతిన్పించింది. 180 పరుగుల తేడాతో భారత్ను ఓడించి పాక్ ఛాంపియన్గా నిలిచింది.దీంతో ఈసారి పాక్ను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ మ్యాచ్లో పాక్కు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ నసీమ్ షా ఎక్స్ఫ్యాక్టర్గా మారనున్నారని అమీర్ జోస్యం చెప్పాడు.భారత్-పాక్ మ్యాచ్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు మహ్మద్ రిజ్వాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. అతడు మరోసారి పాక్కు కీలకంగా మారనున్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లలో భారత్పై అతడికి మంచి రికార్డు ఉంది. అదేవిధంగా నసీమ్ షా కూడా పాక్కు ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడని నేను భావిస్తున్నాను. నసీమ్ ఇటీవల కాలంలో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నాడు. అతడిని ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడవచ్చు. గతేడాది వరకు షాహీన్ అఫ్రిది నుంచి భారత జట్టుకు గట్టి సవాలు ఎదరయ్యేది. పాక్ జట్టులో బెస్ట్ బౌలర్ అంటే నేను కూడా అఫ్రిది పేరునే చెప్పేవాడిని. అతడు 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసే వాడు. బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. కానీ మోకాలి గాయం తర్వాత అతడు తన పేస్ను కోల్పోయాడు. 135 కి.మీ మించి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. బంతి కూడా స్వింగ్ కావడం లేదు అని టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు.కాగా పాక్ స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది పేర్లను అమీర్ చెప్పకపోవడం గమనార్హం. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా పాక్ నిలివడంలో అమీర్ది కీలక పాత్ర. ఫైనల్లో అమీర్ 3 కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. -
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు పాకిస్తాన్తో పాటు వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది.సెమీ ఫైనల్స్లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
Ind vs Pak: టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! కానీ..
భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇరుదేశాల సంబంధాల దృష్ట్యా ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ వంటి అగ్రశ్రేణి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.అందుకే దాయాదుల మధ్య పోరును వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 23న తెరపడనుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఓవర్హైప్...‘‘ఇండియా- పాకిస్తాన్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్కు ఓవర్హైప్ ఇస్తున్నారు. దీనికి ఇంతగా ప్రచారం అవసరం లేదు. ఓసారి పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్ల గణాంకాలు పరిశీలించండి. బాబర్ ఆజం వాళ్ల స్టార్ బ్యాటర్. మరి టీమిండియాపై అతడి బ్యాటింగ్ సగటు కేవలం 31.టాప్ బ్యాటర్ అన్నప్పుడు కనీసం అతడి యావరేజ్ 50కి దగ్గరలో ఉంటే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ సమయంలో ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. ఆటగాడిగా అతడంటే నాకు ఇష్టమే. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తాడు. కానీ భారత జట్టుపై అతడి బ్యాటింగ్ సగటు 25 మాత్రమే.టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! అయితే, ఫఖర్ జమాన్ సంగతి వేరు. అతడు పాక్ జట్టు పూర్తిస్థాయి ఓపెనర్. టీమిండియా మీద బ్యాటింగ్ యావరేజ్ 46. కాబట్టి టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగల సమర్థత అతడొక్కడికి మాత్రమే ఉంది. ఇక ఫాహీం ఆష్రఫ్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.కనీస పోటీ కూడా ఇవ్వదుఅతడి సగటు.. 12.5. కాబట్టి అతడి గురించి టీమిండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సౌద్ షకీల్ టీమిండియాపై సగటున 8 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఆ జట్టు భారత్కు కనీస పోటీ కూడా ఇస్తుందని అనిపించడం లేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ ఆజం పాకిస్తాన్ తరఫున టాప్ వన్డే ప్లేయర్గా కొనసాగుతున్నాడు.అయితే, టీమిండియాపై మాత్రం బాబర్ ఆజం రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి వరకు భారత్తో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కలిపి సగటున 31.14తో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను రోహిత్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాలతో జరిగిన త్రైపాక్షిక సిరీస్ను కివీస్కు సమర్పించుకుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
'పాక్ కెప్టెన్కు కొంచెం కూడా తెలివి లేదు.. అదొక చెత్త నిర్ణయం'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు పాకిస్తాన్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన కరాచీ వేదికగా జరిగిన పైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. అయితే ఓ దశలో కివీస్కు గట్టిపోటీ ఇచ్చిన పాక్ జట్టు.. ఆ తర్వాత సొంత తప్పిదాల వల్ల మ్యాచ్పై పట్టుకోల్పోయింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన పాక్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో కూడా బ్లాక్ క్యాప్స్ చేతిలోనే పాక్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ అండ్ కోపై పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆట తీరు ఎలా ఉందో తేటతెల్లమైందని షెహజాద్ మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ జట్టు ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచింది."టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఘోర తప్పిదంగా పరిగణించాలి. నిజంగా అదొక చెత్త నిర్ణయం. ఎందుకంటే ఈ వేదికలో జరిగిన గత మ్యాచ్లో పిచ్ రాత్రిపూట బ్యాటింగ్కు అనుకూలించడం మనం చూశాము. తేమ ఎక్కువగా వల్ల స్పిన్నర్లు కూడా పట్టు సాధించలేకపోయారు. అందువల్ల బంతి చక్కగా బ్యాట్పైకి వచ్చింది.అయినప్పటికి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అస్సలు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎందుకు నాకు ఆర్దం కావడం లేదు. ఇదొక్కటే కాదు ఈ మ్యాచ్లో చాలా తప్పులు చేశారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మరీ చైల్డీష్గా ఉన్నాయి. ప్రత్యర్థి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే మనం విజయం సాధించే అవకాశముంటుంది.అంతేకాకుండా జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సైతం రాణించాల్సిన అవసరముంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సమస్యలు ఎదుర్కొకతప్పదు అని షెహజాద్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.బాబర్ మళ్లీ ఫెయిల్.. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్తో 45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.కానీ బాబర్ ఆజం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి ఆజం పెవిలియన్కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మైకేల్ బ్రేస్వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 243 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు డెవాన్ కాన్వే (74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కూడా రాణించాడు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
Pak vs NZ: పాకిస్తాన్ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కివీస్దే
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ప్రారంభానికి ముందు సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్(Tir Nation Series) ఫైనల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్... న్యూజిలాండ్(Pakistan Vs New Zealand)తో తుదిపోరులో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. రాణించిన రిజ్వాన్కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (65 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.మిచెల్, లాథమ్ హాఫ్ సెంచరీలుగత మ్యాచ్లో సెంచరీలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ... తాజా పోరులో మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తయ్యబ్ తాహిర్ (38), బాబర్ ఆజమ్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో రూర్కే 4 వికెట్లు పడగొట్టగా... సాంట్నర్, బ్రాస్వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 బంతుల్లో 57; 6 ఫోర్లు), టామ్ లాథమ్ (64 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... కాన్వే (48), కేన్ విలియమ్సన్ (34) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీశాడు. రూర్కేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సల్మాన్ ఆఘాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్- త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 242 (49.3)👉న్యూజిలాండ్ స్కోరు- 243/5 (45.2)👉ఫలితం: పాకిస్తాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విలియం రూర్కే(4/43)చాంపియన్స్ ట్రోఫీకి సియర్స్ దూరంక్రైస్ట్చర్చ్: చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్ల జాబితాలో మరో పేస్ బౌలర్ చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడిన అతనికి పరీక్షలు చేయించగా చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సియర్స్ స్థానంలో జేకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. చదవండి: చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’! -
సౌతాఫ్రికాతో వన్డే.. 353 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన పాక్.. ఆల్టైమ్ రికార్డు
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది. వన్డే క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్... కీలక పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా (96 బంతుల్లో 82; 13 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (56 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్లు), మాథ్యూ బ్రిజ్కీ (83; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (128 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు), సల్మాన్ ఆఘా (103 బంతుల్లో 134; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో విజృంభించారు. ఒక దశలో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును సల్మాన్తో కలిసి రిజ్వాన్ ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 229 బంతుల్లోనే 260 పరుగులు జోడించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్ 2 వికెట్లు తీశాడు. సల్మాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఫైనల్కు చేరిన న్యూజిలాండ్తో శుక్రవారం పాకిస్తాన్ తలపడుతుంది.1 వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ జట్టుకు ఇదే (353) అత్యధిక పరుగుల ఛేదన. 2022లో ఆ్రస్టేలియాపై చేసిన 349 పరుగుల ఛేదన రెండో స్థానంలో ఉంది. -
CT 2025: అతడిని ఎలా ఎంపిక చేశారు?: వసీం అక్రం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం(Wasim Akram) పెదవి విరిచాడు. ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్కు మాత్రమే చోటివ్వడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బౌలింగ్ ఆల్రౌండర్ షాహీం ఆష్రఫ్(Faheem Ashraf)ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుండగా.. ఇటీవలే పీసీబీ తమ జట్టును ప్రకటించింది.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘జట్టును ప్రకటించేశారు. కొద్ది మంది పేర్లను గమనించాను. ఫాహీం అష్రఫ్ ఈ జట్టులో ఉన్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్. ప్రతిభావంతుడైన క్రికెటరే.కానీ గత 20 మ్యాచ్లలో అతడి బౌలింగ్ సగటు 100.. బ్యాటింగ్ సగటు 9. అయినా.. సరే అష్రఫ్ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. ఇక ఖుష్దిల్ షా ఎంపిక కూడా అనూహ్యం. అయినా.. ఈసారి మనం ఒకే ఒక్క స్పిన్నర్తో బరిలోకి దిగుతున్నాం.అదే టీమిండియా.. ముగ్గురు, నలుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. అందుకు కారణాలు ఏమైనా గానీ.. మనం మాత్రం ఒకే స్పిన్నర్ను ఎంపిక చేయడమేంటి?.. ఇక ఆతిథ్య జట్టుగా మనపై ఎలాగూ ఒత్తిడి ఉంటుంది. అన్ని ప్రతికూలతలు అధిగమించి సెమీ ఫైనల్ వరకైనా చేరాలని ఆశిస్తున్నా’’ అని వసీం అక్రం స్పోర్ట్స్ యారీతో పేర్కొన్నాడు.ఇదైతే బాగుందిఅయితే, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫఖర్ జమాన్ను పిలిపించి మంచి పనిచేశారంటూ పాక్ సెలక్టర్ల నిర్ణయాన్ని వసీం అక్రం సమర్థించాడు. ‘‘మనకు ఓపెనింగ్ జోడీతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ ఓపెనర్ ఫఖర్ జమాన్ను జట్టులోకి తీసుకోవడం సానుకూలాంశం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు.ఏదేమైనా బాబర్ ఆజంను ఓపెనర్గా పంపాలి. అతడి బ్యాటింగ్ టెక్నిక్ గొప్పగా ఉంటుంది. యాభై ఓవర్లపాటు అతడు క్రీజులోనే ఉంటే.. కచ్చితంగా 125 పరుగులైనా చేస్తాడు. ఇక రిజ్వాన్ను మిడిలార్డర్లో పంపాలి. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. నసీం షా వచ్చేశాడు. ఇప్పటికే షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ ఉన్నారు. వీళ్లకు తోడుగా హస్నైన్ కూడా ఉన్నాడు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.ఆ ఆల్రౌండర్కు జట్టులో చోటివ్వాల్సిందిఅయితే, ఆల్రౌండర్ల జాబితాలో ఆమిర్ జమాల్కు చోటు దక్కకపోవడం తనను నిరాశపరిచిందని వసీం అక్రం ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీర్ఘకాలం పాటు జట్టుకు ఉపయోగపడగల ఆమిర్ను సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నాడు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ మరోసారి విజేతగా నిలిస్తే చూడాలని ఉందని.. అయితే, మిగతా జట్లు కూడా వరల్డ్క్లాస్ ఆటతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అందరితోపాటు తాను కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించగా.. వరల్డ్కప్లో సెమీస్ కూడా చేరని పాక్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి దూసుకువచ్చింది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్కు వెళ్లలేని టీమిండియా.. దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
పాకిస్తాన్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్మన్ గాయం కారణంగా పాక్తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్లో పాకిస్తాన్ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయింది.ఇక జొహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్లో మూడు వికెట్లు తీసిన బార్ట్మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్రౌండర్కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్మన్ స్థానంలో ఆల్రౌండర్ కార్బిన్ బాష్ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్కు దూరమయ్యాడు.పాకిస్తాన్దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'నోరు మూసుకొని వెళ్లి ఆడు'.. రిజ్వాన్ ఓవరాక్షన్! వీడియో వైరల్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.అసలేం ఏమి జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్కు బౌన్సర్గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు. దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు. క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.క్లాసెన్కు ఫైన్..కాగా ఈ మ్యాచ్లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగులు చేసిన క్లాసెన్ ఆఖరి వికెట్గా వెనుదిరగాడు. దీంతో ఔటైన కోపంలో క్లాసెన్ తన కాలితో స్టంప్స్ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. Fight on the field between Mohammad Rizwan and Heinrich Klaasen.💀😭 pic.twitter.com/XRb4yjYCl4— MEER YASIR🇵🇸 (@MY_EDITS_56) December 19, 2024 -
SA vs Pak: పాక్ ఆల్రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్టౌన్ మ్యాచ్లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్బర్గ్లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
‘మా కెప్టెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం’
పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. అతడిని శాశ్వతంగా జట్టు నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్లో రిజ్వాన్ బ్యాటింగ్ చేసిన తీరే ఇందుకు కారణం.పాక్ వన్డే, టీ20 కెప్టెన్గా బాబర్ ఆజం స్థానంలో రిజ్వాన్ ఇటీవలే పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో తొలుత ఆస్ట్రేలియాలో పర్యటించిన పాక్ జట్టు.. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు సఫారీ గడ్డపై అడుగుపెట్టింది.ఈ క్రమంలో డర్బన్ వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం రాత్రి తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా.. డేవిడ్ మిల్లర్ అద్బుత ఆట తీరుతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.పాక్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే 82 పరుగులతో మిల్లర్ దుమ్ములేపాడు. మిగతా వాళ్లలో జార్జ్ లిండే 24 బంతుల్లో 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బాబర్ ఆజం.. 18 ఏళ్ల క్వెనా మఫాకా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ రిజ్వాన్ ఆచితూచి ఆడాడు. వన్డౌన్లో వచ్చిన సయీమ్ ఆయుబ్ (15 బంతుల్లో 31) అతడికి సహకారం అందించాడు.అయితే, మిగతా వాళ్లలో తయ్యబ్ తాహిర్(18) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ల(9, 9, 1,0,2*,5*)కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్.. 172 పరుగులే చేసింది. విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఇక ఈ మ్యాచ్లో రిజ్వాన్ ఏకంగా 62 బంతులు తానే ఆడాడు. సగం కంటే ఎక్కువ బంతులను తీసుకున్నా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 74 పరుగులే చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్రేటు 119.35. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్పై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రిజ్వాన్ టీ20లా కాకుండా వన్డేలా ఆడినందుకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని.. ఇలాంటి ఆటగాడు తమ కెప్టెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం ఘోర ఓటమి నుంచి రిజ్వానే రక్షించాడని.. అతడి వల్లే కాస్తైనా పరువు దక్కిందని అండగా నిలుస్తున్నారు. -
సౌతాఫ్రికా టూర్కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఆసీస్తో మూడో టీ20.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడించండి: రవిశాస్త్రి -
ఒకే ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు.. మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు
అడిలైడ్ ఓవల్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న పాకిస్తాన్ వికెట్కీపర్గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్లతో సర్ఫరాజ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.నిప్పులు చెరిగిన రవూఫ్కాగా ఈ మ్యాచ్లో పాక్ స్పీడ్స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్
చాంపియన్స్ ట్రోఫీ రూపంలో వచ్చే ఏడాది మరో ఐసీసీ టోర్నీ అభిమానులకు వినోదం పంచనుంది. పాకిస్తాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ సేనను పాకిస్తాన్కు పంపేందుకు సుముఖంగా లేదు.వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదుఈ నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లు నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు తమ దేశంలో పర్యటించాయి కాబట్టి.. భారత జట్టు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. లాహోర్ వేదికగా టీమిండియా మ్యాచ్లు నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ కూడా ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ కూడా చాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చబోమని స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మెగా టోర్నీలో ఆడకుండా బహిష్కరిస్తే మాత్రం భారీ నష్టం తప్పదు. భారత జట్టు టోర్నమెంట్లో లేకుంటే.. ప్రసార హక్కులు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రారని ఇంగ్లండ్ బోర్డు పెద్దలు సైతం అభిప్రాయపడ్డారు.టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక..ఈ క్రమంలో పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దేశానికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘పాకిస్తాన్లోని క్రికెట్ అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు అంటే ఎంతో ఇష్టం. తమ దేశంలో భారత క్రికెటర్లు ఆడుతుంటే చూడాలని వారు ఆశపడుతున్నారు.మేము భారత్కు వెళ్లినపుడు అక్కడ మాకు సాదర స్వాగతం లభించింది. అయితే, వాళ్లు చాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి ఇక్కడికి వస్తారో లేదో తెలియదు.. ఒకవేళ వస్తే మాత్రం టీమిండియాకు ఇక్కడ ఘన స్వాగతం లభిస్తుంది’’ అని రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్ ఆడేందుకు గతేడాది పాక్ జట్టు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బాబర్ ఆజం ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. పాక్ బోర్డు ఆ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్కు అప్పగించింది. చదవండి: Expensive Players In IPL: ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..! -
ఆసీస్ను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం: పాక్ కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలి సిరీస్లోనే పాక్ను విజేతగా నిలుపుతామాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్లోనే పాక్ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ను వన్డే, టీ20 కెప్టెన్గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాంఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్లో ప్రతి మ్యాచ్లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ను ఓడించి 2-1తో గెలిచింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్కు ఎంపికైన పేసర్ -
పాకిస్తాన్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్..!?
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ తమ తదుపరి సవాల్కు సిద్దమైంది. ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. అయితే ఈ ఆసీస్ పర్యటనకు ముందు పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ను తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్గా నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. జియో న్యూస్ ప్రకారం.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై పీసీబీ నుంచి ఆధికారిక ప్రకటన వెలవడనుంది. ఇప్పటికే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో రిజ్వాన్ సమావేశమైనట్లు సదరు మీడియా సంస్థ తమ కథనాల్లో పేర్కొంది.ఈ మీటింగ్లోనే పాక్ వన్డే, టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టేందుకు రిజ్వాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టెన్ సూచన మేరకు రిజ్వాన్ను కెప్టెన్గా నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆల్రౌండర్ సల్మాన్ అలీ పాక్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.కాగా కెప్టెన్సీ పరంగా రిజ్వాన్కు అనుభవం ఉంది. జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనప్పటకీ, పాకిస్తాన్ సూపర్ లీగ్, దేశీవాళీ టోర్నీల్లో నాయకత్వ పాత్ర పోషించాడు. పీఎస్ఎల్-2021లో అతడి సారథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్ ముల్తాన్ ఛాంపియన్గా నిలిచింది. కాగా టీ20 వరల్డ్కప్-2024లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓటమి.. గౌతం గంభీర్ కీలక నిర్ణయం!? -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సర్ఫరాజ్ ఆల్టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఓపెనర్ల సెంచరీలుకాగా బంగ్లాదేశ్తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్వాష్కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్తో సిరీస్ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకాలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. నసీం షా సైతం 33 పరుగులతోఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.రిజ్వాన్ మాత్రం డకౌట్ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్లో క్రిస్ వోక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్ ఆఫ్రిది వంటి పాక్ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.సరైన నిర్ణయం తీసుకోకపోతేబాబర్ ఆజం స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు పాక్ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్ క్రికెట్ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అనూహ్యంగా షాహిన్పై వేటు వేసిన పాక్ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్కు అప్పగించింది. అయితే, గత టీ20 వరల్డ్కప్ ఎడిషన్లో జట్టును ఫైనల్కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. మహ్మద్ రిజ్వాన్లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. చాంపియన్స్ వన్డే కప్-2024లో అతడు మార్ఖోర్స్ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్ బదులు రిజ్వాన్ను పాకిస్తాన్ కెప్టెన్ చేయాలని సూచించాడు.బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు‘‘తన కంటే పాకిస్తాన్కు మెరుగైన కెప్టెన్ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్ చాంపియన్స్ కప్లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్ మసూద్ కూడా రిజ్వాన్లా జట్టుకు న్యాయం చేయలేడు.ఈసారి గనుక రిజ్వాన్ను కెప్టెన్గా ప్రకటించకపోతే పాకిస్తాన్ క్రికెట్కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్ వన్డే కప్లో మహ్మద్ రిజ్వాన్ మార్ఖోర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్లో స్టాలియన్స్ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్ ఆజం స్టాలియన్స్ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. చదవండి: 4,4,4,4,4: బాబర్ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు! -
Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. తొమ్మిదికి పడిపోయిన బాబర్
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.టాప్-10లోనే మనోళ్లుఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.తొమ్మిదికి పడిపోయిన బాబర్కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లుఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా షకీబ్.. పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ముఖంపైకి ఉద్దేశపూర్వకంగా బంతిని విసిరాడు. దీని కారణంగా ఐసీసీ షకీబ్ మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద ఓ డీ మెరిట్ పాయింట్ పొందాడు. 😲😲pic.twitter.com/5fybTO3j1h— CricTracker (@Cricketracker) August 25, 2024ఈ ఘటన ఆట చివరి రోజు (ఆదివారం) పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సందర్భంగా జరిగింది. షకీబ్ బంతి వేయడానికి సిద్దం కాగా.. రిజ్వాన్ చివరి నిమిషంలో స్ట్రయిక్ నుంచి వెనక్కు తగ్గాడు. దీంతో చిర్రెత్తిపోయిన షకీబ్ కోపంగా బంతిని రిజ్వాన్వైపు విసిరాడు. ఇది గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో షకీబ్ను వెంటనే మందలించాడు. అంతటితో విషయం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి లేదా ఇతరత్రా వస్తువులను ఆటగాళ్లపై కానీ, వారి సమీపంలో కానీ విసిరడం లెవెల్ 1 ఉల్లంఘన కింద పరిగణిస్తారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9 కింద షకీబ్కు పెనాల్టీ విధించారు.కాగా, ఇదే మ్యాచ్లో నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు పాక్, బంగ్లాదేశ్ జట్లకు ఐసీసీ షాకిచ్చింది. పాక్కు ఆరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు, బంగ్లాదేశ్కు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడింది. ఈ పాయింట్ల కోత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలపై ప్రభావం చూపించింది. మూడు పాయింట్లు కోల్పోయినందుకు బంగ్లాదేశ్ ఏడో స్థానానికి పడిపోగా.. పాక్ పాయింట్లు మరింత తగ్గిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
మొహమ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడినా ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో పాక్ తరఫున అత్యధిక పరుగులు (ఓ మ్యాచ్లో) చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో రిజ్వాన్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులు (నాటౌట్), రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో రిజ్వాన్ 222 పరుగులు చేశాడు. పాక్ తరఫున ఓ మ్యాచ్లో ఇన్ని పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్ ఎవరూ లేరు. 1980లో తస్లిమ్ ఆరిఫ్ ఓ మ్యాచ్లో 210 (తొలి ఇన్నింగ్స్లో 210 నాటౌట్) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రిజ్వాన్ మరో రికార్డు కూడా సాధించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో సర్ఫరాజ్ ఖాన్ రెండుసార్లు ఓ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్పై బంగ్లాదేశ్కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
'బంతి బంతికి అరుస్తునే ఉంటాడు'.. రిజ్వాన్పై భారత అంపైర్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ వరల్డ్ క్రికెట్ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తన అద్భుత ఇన్నింగ్స్లతో పాకిస్తాన్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత రిజ్వాన్ది. అయితే రిజ్వాన్ తన ఆటతీరుతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. మైదానంలో తన చేష్టలతో అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనక ఉండి పదే పదే అప్పీల్ చేయడం, క్రాంప్స్(తిమ్మరి) వచ్చినట్లు మైదానంలో పడిపోవడం వంటివి చేస్తూ అంపైర్లను ఎక్కవగా అతడు విసుగిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రిజ్వాన్పై భారత్కు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానిల్ అంపైర్ అనిల్ చౌదరి విమర్శల వర్షం కురిపించాడు. రిజ్వాన్ ప్రతీ బంతికి అప్పీల్ చేస్తాడని, అది సరైన పద్దతి కాదని చౌదరి మండిపడ్డాడు."ఆసియాకప్లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్కు నేను ఆన్ ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించాను. మహ్మద్ రిజ్వాన్ వికెట్లు వెనక ఉండి కంటిన్యూగా అప్పీల్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే చాలా మ్యాచ్ల్లో అతడి తీరును నేను గమనించాను. అయితే నాతో పాటు ఉన్న మరో అంపైర్కు రిజ్వాన్ కోసం పెద్దగా తెలియదు.కాబట్టి అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని నా తోటి అంపైర్కు చెప్పాను. ఓ సందర్భంలో రిజ్వాన్ గట్టిగా అప్పీల్ చేయడంతో నాతోటి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తడానికి సిద్దమయ్యాడు. కానీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని నాటౌట్ అంటూ తలఊపాడు. పాక్ రివ్యూకు వెళ్లినప్పటకి నాటౌట్ తేలింది.రిజ్వాన్ అంతే బంతి బంతికి అరుస్తూనే ఉంటాడు. తెల్లటి లిప్ బామ్ పూసుకుని పావురంలా జంప్ చేస్తూ ఉంటాడు. మంచి కీపర్ ఎవరనేది మంచి అంపైర్కు తెలుస్తుంది. అంతేతప్ప పదేపదే అప్పీల్ చేస్తే ఔట్గా ప్రకటించడు. అంతేకాకుండా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ది చెంది. అటువంటి అప్పుడు మీరు ఎందుకు హైలెట్ కావాలి. ప్రజలు అంతా గమనిస్తారు. ఆఖరి ట్రోల్స్కు గురవ్వడం తప్ప ఇంకొకటి ఉండదు"అని చౌదరి ఓ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా రిజ్వాన్ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 249 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 171 పరుగులు చేశాడు. -
రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టిన రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ పలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో భారీ సెంచరీతో (171 నాటౌట్) విరుచుకుపడిన రిజ్వాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు భారత వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2022లో పంత్ ఇంగ్లండ్పై 146 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్లో సెంచరీ అనంతరం రిజ్వాన్.. పంత్ పేరిట ఉండిన మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. పంత్ డబ్ల్యూటీసీలో 1575 పరుగులు చేయగా.. రిజ్వాన్ 1658 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. రిజ్వాన్ పాటు సౌద్ షకీల్ (141) సెంచరీ చేయడంతో పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 12, జకీర్ హసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 421 పరుగులు వెనుకపడి ఉంది. -
BAN vs PAK: పాకిస్తాన్ 448/5.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.158/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు. ఇక బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు. -
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పాకిస్తాన్ వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో రిజ్వాన్ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. ప్రస్తుతం రిజ్వాన్ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 277/గా ఉంది. రిజ్వాన్కు జతగా క్రీజ్లో ఉన్న సౌద్ షకీల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. కాగా, పాక్ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్లో సౌద్ షకీల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. 1959లో సయీద్ అహ్మద్ కూడా ఇన్నే ఇన్నింగ్స్ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు. -
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్లలో ఎవరు బెటర్ అన్న పోల్ను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 -
'పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు.. కొంచెం కూడా గేమ్ ప్లాన్ లేదు': అక్రమ్
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ చతకిలపడింది.దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ పాక్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విమర్శల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రాను మహ్మద్ రిజ్వాన్ మరింత జాగ్రత్తగా ఆడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అక్రమ్ మండిపడ్డాడు."వారు 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆటగాళ్లకు క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పించలేను. తొలుత మహ్మద్ రిజ్వాన్కు అస్సలు గేమ్పై అవగాహన లేదు. వికెట్లు తీయడానికే బుమ్రాను రోహిత్ ఎటాక్లోకి తెచ్చాడని రిజ్వాన్కు తెలుసు. అటువంటి అప్పుడు అతడి బౌలింగ్ను జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. కానీ రిజ్వాన్ మాత్రం రిజ్వాన్ భారీ షాట్కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్కి లెగ్ సైడ్ ఆడటం తప్ప ఇంకేమి రాదు. గతకొన్నేళ్లగా జట్టులో భాగమైనా బ్యాటింగ్ ఎలా చేయాలి అతడికి తెలియదు. పాక్ ఆటగాళ్లకు ఒక్కటే తెలుసు. మేము ఆడకపోతే మాకెంటి నష్టం, కోచ్లను కదా తొలగిస్తారని థీమాగా ఉన్నారు. కానీ నావరకు అయితే కోచ్లను కొనసాగించి మొత్తం జట్టును మార్చాల్సిన సమయమిదని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు. -
టీమిండియా విజయం.. క్రెడిట్ మొత్తం మా వాళ్లకే: అక్తర్
‘‘టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం పాకిస్తాన్కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.పాకిస్తాన్ మిడిలార్డర్ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్గా.. సర్ప్రైజ్గా ఉంది’’ అని పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.తొలుత అద్భుత బౌలింగ్తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!అయితే, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో మ్యాచ్లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం: బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్పై టీమిండియా మరోసారి పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెగా ఈవెంట్లో బాబర్ ఆజం బృందాన్ని ఓడించింది. తద్వారా వరల్డ్కప్-2024లో వరుసగా రెండో విజయం నమోదు చేసి గ్రూప్-ఏలో అగ్రస్థానం నిలబెట్టుకుంది.ఇక ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓటమిపై స్పందించాడు.మా ఓటమికి ప్రధాన కారణం అదేటీమిండియా చేతిలో పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం.. ఎక్కువగా డాట్ బాల్స్ కావడంతో వెనుకబడ్డాం.స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నం విఫలమైంది. తొలి ఆరు ఓవర్లలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించాం.కానీ.. తొలి వికెట్ పడిన తర్వాత నుంచి మళ్లీ కోలుకోలేకపోయాం. నిజానికి పిచ్ బాగానే ఉంది. బంతి బ్యాట్ మీదకు వస్తోంది. వికెట్ కాస్త స్లోగా.. అదనపు బౌన్స్కు అనుకూలించింది.వారి నుంచి ఎక్కువగా ఆశించకూడదుఅయినా.. పరుగుల కోసం టెయిలెండర్ల మీద ఆధారపడటం.. వారి నుంచి ఎక్కువగా ఆశించడం కూడా సరైంది కాదు’’ అని బాబర్ ఆజం తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియాను 119 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో 113 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఓడింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.మిగిలిన వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు సాధించారు.ఇంకో రెండు గెలిస్తేనేకాగా గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్లో యూఎస్ఏ చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైన బాబర్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ చేతిలోనూ ఓడిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే పాక్ ఈ టోర్నీలో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మా ఆట తీరులో లోపాలేమిటో కూర్చుని చర్చిస్తాం. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.వాటిలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం’’ అని తెలిపాడు. కాగా పాకిస్తాన్ తదుపరి జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్తో తలపడనుంది.చదవండి: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడగా.. వికెట్కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇక పాక్తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్ను జోష్ హాజిల్వుడ్ డకౌట్ చేసి పెవిలియన్కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ హఫీజ్ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ కూడా హఫీజ్ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024 -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్ను పాక్ టీ20 కెప్టెన్గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
Aus Vs Pak: రిజ్వాన్ అవుటా? నాటౌటా?.. వీడియో వైరల్
Australia vs Pakistan, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విరుద్ధ కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టులో పాకిస్తాన్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా మంగళవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న షాన్ మసూద్ బృందం.. ఆతిథ్య ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, కంగారూ బౌలర్ల ధాటికి తాళలేక 264 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్ను ముగించింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. మరో 262 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దీంతో పాక్ విజయ లక్ష్యం 317గా మారింది. అయితే, టార్గెట్ ఛేదనకై బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చార్లు ఆసీస్ పేసర్లు. ఓపెనర్లు.. అబ్దుల్లా షఫీక్ను 4 పరుగుల వద్ద స్టార్క్ పెవిలియన్కు పంపగా.. 12 పరుగులతో ఆడుతున్న ఇమామ్ ఉల్ హక్ను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ 60 పరుగులు చేసి అవుట్ కాగా.. బాబర్ ఆజం 41, సౌద్ షకీల్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. రిజ్వాన్పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఈ క్రమంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ను ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మరోసారి దెబ్బకొట్టాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 61వ ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకి కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించింది. రివ్యూకు వెళ్లిన కమిన్స్ దీంతో కమిన్స్ గట్టిగా అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కమిన్స్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని చాలెంజ్ తీస్తూ డీఆర్ఎస్కు వెళ్లాడు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్.. నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. రిజ్వాన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. రిజ్వాన్ తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్ వద్దకు దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజ్వాన్ అవుటా? నాటౌటా? అంటూ చర్చలు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంపైర్ను ఒత్తిడిలోకి నెట్టి తమకు అనుకూలంగా ఫలితం వచ్చేలా చేశారని.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రిజ్వాన్ను నాటౌట్గా ప్రకటించాల్సిందని పాక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. బంతి బ్యాటర్ గ్లోవ్స్ను తాకి కీపర్ చేతుల్లో పడితే నిబంధనల ప్రకారం అవుట్ ఇవ్వడం సరైందేనని.. ఇక్కడ రిస్ట్బ్యాండ్ కూడా గ్లోవ్ను అంటి ఉందనే విషయాన్ని గమనించాలని హితవు పలుకుతున్నారు. కాగా రిజ్వాన్(35 పరుగులు) రూపంలో కమిన్స్ 250వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 79 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ను మరోసారి ఆతిథ్య ఆసీస్కు సమర్పించుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు బుధవారం నుంచి మొదలుకానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! Wicket 250 for Pat Cummins! 🎉 The third umpire decided the ball flicked Mohammad Rizwan's sweatband on the way through. #MilestoneMoment | @nrmainsurance | #AUSvPAK pic.twitter.com/vTuDL5DmNB — cricket.com.au (@cricketcomau) December 29, 2023 -
Aus vs Pak 2nd Test: సర్ఫరాజ్ అహ్మద్పై వేటు.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్ మేనేజ్మెంట్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ పాకిస్తాన్ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పాక్ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో రెండో టెస్టుకు సర్ఫరాజ్ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి. రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్ అలీ, ఖుర్రం షెహజాద్ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాక్తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్. పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
పాక్ జట్టేమీ నేపాల్కు వెళ్లడం లేదు.. వాళ్లకు రెస్ట్ ఎందుకు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్కు వింత ప్రశ్న ఎదురైంది. స్థానిక టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్లకు న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ.. ‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్మెంట్గానీ న్యూజిలాండ్ సిరీస్లో బాబర్, రిజ్వాన్లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్కు.. నేపాల్కు కాదు. అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్కు పయనం కానుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్. చదవండి: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం? -
ఇదొక పిచ్చి నిర్ణయం.. పాకిస్తాన్ క్రికెట్పై విమర్శలు
పెర్త్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి టెస్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్కు చోటు దక్కపోవడం అందరని ఆశ్యర్యపరిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందే ఒక్కరోజు ముందే తుది జట్టును ప్రకటించిన క్రికెట్ పాకిస్తాన్.. రిజ్వాన్కు ఛాన్స్ ఇవ్వలేదు. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్కు జట్టు మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో పాక్ జట్టు మేనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరికాదని మాజీలు సైతం మేనెజ్మెంట్ను దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో పాక్ తరపున రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా వన్డే వరల్డ్కప్లో కూడా రిజ్వాన్ తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఈ మ్యాచ్తో పాకిస్తాన్ యువ ఆటగాళ్లు ఖుర్రం షాజాద్, అమీర్ జమాల్ టెస్టు అరంగేట్రం చేశారు. ఆసీస్తో తొలి టెస్ట్కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ -
రిజ్వాన్ను బ్యాట్తో కొట్టబోయిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో తీవ్ర నిరాశపరిచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఆసీస్ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తమ టెస్టు కొత్త కెప్టెన్గా షాన్ మసూద్ను పీసీబీ ఎంపిక చేసింది. ఆసీస్ సిరీస్తో పాకిస్తాన్ కెప్టెన్గా షాన్ మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ కీలక సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇప్పటినుంచే తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేసింది. లాహోర్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో పాక్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. రిజ్వాన్ను బ్యాట్తో కొట్టబోయిన బాబర్.. పాకిస్తాన్ ప్రాక్టీస్ క్యాంప్లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను మాజీ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా బ్యాట్తో కొట్టబోయాడు. ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఓవర్ పూర్తి అయిందని బాబర్ క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న రిజ్వాన్ స్టంప్స్ను పడగొట్టి రనౌట్కు అప్పీల్ చేశాడు. ఇది చూసిన బాబర్ సరదగా తన బ్యాట్తో రిజ్వాన్ను కొట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో రిజ్వాన్ నవ్వుతూ ముందుకు పరిగెత్తాడు. బాబర్ కూడా తన వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మిగితా ఆటగాళ్లూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Babar 😭😭 pic.twitter.com/OnLIv1t4A7 — Hassan (@HassanAbbasian) November 25, 2023 -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
కోహ్లి ఆరోజే సెంచరీ చేయాలి.. 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి: రిజ్వాన్
ICC WC 2023- Virat Kohli- Mohammad Rizwan: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ కూడా సాధ్యంకాని రీతిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైం రికార్డుకు చేరవవుతున్నాడు. వన్డేల్లో గనుక ఈ రన్మెషీన్ మరో రెండు శతకాలు బాదితే సచిన్ను వెనక్కి నెడతాడు కూడా! ఇక వరల్డ్కప్-2023లోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాలని అభిమానులు ఆశపడుతున్నారు. పుట్టినరోజున సచిన్ రికార్డు సమం చేసి.. ఆ తర్వాత దానిని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్కతాలో బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు ఇండియా టుడేతో మాట్లాడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆరోజే తను 49వ సెంచరీ చేయాలి ‘‘నవంబరు 5న తన బర్త్డేనా? మంచిది.. నిజానికి నాకు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు.. అయినా.. తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విరాట్ తన బర్త్డే నాడే 49వ వన్డే సెంచరీ సాధించాలి. అంతేకాదు ఈ వరల్డ్కప్లోనే 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి’’ అని ఆకాంక్షించాడు. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉందని రిజ్వాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా నవంబరు 5న కోహ్లి బర్త్డే అన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆరోజే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన కెరీర్లో అరుదైన ఘనత సాధించాలని రిజ్వాన్ కోరుకోవడం విశేషం. ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యేక ఏర్పాట్లు.. విరాట్ కోహ్లి పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా 70 వేల మాస్కులు ‘‘విరాట్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఐసీసీ నుంచి మాకు అనుమతి వస్తుందనే అనుకుంటున్నాం. స్టేడియానికి వచ్చే ప్రతి అభిమాని కోహ్లి మాస్కులు ధరించేందుకు వీలుగా 70 వేల మాస్కులు పంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో కంటే ముందు టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. అంతకంటే ముందే సెంచరీ కావాలి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్లోనే కోహ్లి సెంచరీ కొడితే.. బర్త్డేన మరో శతకం బాది సచిన్ రికార్డు(49 సెంచరీలు) బద్దలు కొడితే ఇంకా బాగుంటుందని కింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్ -
రిజ్వాన్, దక్షిణాఫ్రికా బౌలర్ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్ కీలక మ్యాచ్లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పవర్ప్లే లోపే ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్-హాక్ వికెట్లను పాక్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ మార్కో జానెసన్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఇమామ్ ఉల్-హాక్ ఔటైన తర్వాత మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. అయితే జానెసన్ బౌలింగ్లో తన ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్ తప్పించుకున్నాడు. రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో జానెసన్ విఫలమయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్ రిజ్వాన్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో 27 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. Heated conversation between Marco Jansen and Mohammed Rizwan...!!#SAvsPAK #PAKvSA #kykyurdu #พรหมลิขิตep4 #ธี่หยด #crymua #bbcqt #ENGvsSL #Maine pic.twitter.com/JzJguEp0eq — Oxygen X (@imOxYo18) October 27, 2023 -
మహ్మద్ రిజ్వాన్ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్..
వన్డే ప్రపంచకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చెలాయించింది. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాక్ను భారత్ చిత్తు చేసింది. దీంతో వరుసగా 8వసారి వన్డే వరల్డ్ కప్ ఈవెంట్లో పాకిస్తాన్ను భారత్ మట్టికరిపించింది. అయితే దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ చూడ్డానికి సుమారు లక్షా 30 వేల మంది ప్రేక్షకుల తరలిరాగా.. వారిలో అత్యధికులు భారతీయులే. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలతో నిండిపోయింది. మొదట పాక్ వికెట్లు పడినప్పుడు, తర్వాత భారత బ్యాటింగ్లో రోహిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నప్పడు అభిమానుల హర్ష ధ్వనులతో స్టేడియం దద్దరిల్లపోయింది కాగా ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను అభిమానులు ఓ ఆటాడేసుకున్నారు. 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న రిజ్వాన్ను.. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో రిజ్వాన్ డ్రెసింగ్ రూమ్కు వెళ్తుండగా కొంతమంది అభిమానులు టీమిండియాకు సపోర్ట్గా నినాదాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రిజ్వాన్ మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్లు 2017లో పాకిస్తాన్ అభిమానులు కూడా ఈ విధంగానే చేశారని గుర్తు చేస్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం భారత జట్టు డ్రెసింగ్ రూమ్కు వెళ్తుండగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆ సమయంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి పాక్ అభిమానులకు చిన్నపాటి వాగ్వదం కూడా జరిగినట్లు తెలుపుతున్నారు. అదే విధంగా 1999లో ఓ ద్వైపాక్షిక సిరీస్లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కూడా కొంతమంది ఫ్యాన్స్ పాక్ జట్టుకు మద్దతుగా స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కానీ ఈసారి మాత్రం భారత ఫ్యాన్స్ పాక్ క్రికెటర్లను టార్గెట్ చేశారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: CWC 2023: పాక్ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ సేనను అభినందించిన నరేంద్ర మోదీ I have a clear point of view in this matter. If @iMRizwanPak can pray namaaz in front of a huge crowd so why doesn't a crowd chant "Jai shree Ram " if he is religious so why not be a crowd can ? #indvspak2023 #Rizwan #RohitSharma𓃵 #Ahmedabad "DIL DIL PAKISTAN pic.twitter.com/TtyzNH1cPN — jay shah (parody) (@jay_shahbcci) October 14, 2023 -
Ind Vs Pak: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు..
ICC WC 2023- Ind vs Pak- #Virat Kohli: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త ఓవర్ చేశాడు. వచ్చీ రాగానే భారత ఫీల్డర్లకు విసుగు తెప్పించాడు. మరి.. ఇలాంటివి చేస్తే రన్మెషీన్ విరాట్ కోహ్లి ఊరుకుంటాడా? ఎవరైనా ఏదైనా ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కింగ్కు అలవాటు కదా! ఈసారి కూడా అదే పని చేశాడు. సిరాజ్ మొదలుపెట్టాడు అసలు విషయమేమిటంటే.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసేలోపే తొలి వికెట్ కోల్పోయింది. ఎనిమిదో ఓవర్లో మహ్మద్ సిరాజ్.. అబ్దుల్లా షఫీక్(20)ను అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో.. 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పనిపట్టాడు. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అతడి స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. వెయిట్ చేయించిన రిజ్వాన్ అయితే, క్రీజులోకి వచ్చిన రిజ్వాన్.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి టైమ్ తీసుకున్నాడు. బౌలర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఫీల్డర్లను కూడా వెయిట్ చేయించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ... ‘‘ఇంకెంత సేపు’’ అన్నట్లు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అంపైర్కు ఈ విషయం గురించి చెప్పాడు. ఇంకెంత సేపు.. ‘టైమ్’ చూసుకున్న కోహ్లి ఇక కోహ్లి సైతం రిజ్వాన్ తీరుతో ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడు. చేతి గడియారంలో టైమ్ చూసుకున్నట్లుగా ఫోజు పెట్టి .. ‘‘ఏంటో ఈ ఓవరాక్షన్.. ఇంకెంత సేపు వెయిట్ చేయాలి’’ అన్నట్లుగా యాక్ట్ చేశాడు. రిజ్వాన్ చేష్టలకు అదే రీతిలో బదులిచ్చాడు. ఫన్నీ మీమ్స్తో నెటిజన్ల సందడి ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజ్వాన్ను ఉద్దేశించి టీమిండియా అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. ‘‘రెడీ అవుతున్న భార్య ఎప్పుడొస్తుందా అని భర్త ఎదురు చూస్తున్నట్లుగా ఉంది కదా.. రిజ్వాన్ యాక్షన్కు కోహ్లి రియాక్షన్ అదిరింది.. 12.4వ ఓవర్లో బంతిని తన్నిన విధానం ఉంది చూడండి సూపర్’’ అంటూ రిజ్వాన్పై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. బాబర్ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో కాగా మోతేరా స్టేడియంలో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్ను 191 పరుగులకే కట్టడి చేశారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించిన బాబర్ ఆజం(50)- రిజ్వాన్(49) జోడీని సిరాజ్ విడదీయడం(బాబర్ను బౌల్డ్ చేసి)తో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్లో కోహ్లి 16 పరుగులకే అవుట్ కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. చదవండి: వరల్డ్కప్లో శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్కు గాయం Husband waiting for his wife to get ready. pic.twitter.com/ApvHMgg87j — DJay (@djaywalebabu) October 14, 2023 ye to kapne laga 🤣🤣🤣🤣 pic.twitter.com/lic0shOW26 — Piyush (@piyushmaybe) October 14, 2023 pic.twitter.com/64IjUmfN9a — Out Of Context Cricket (@GemsOfCricket) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: రిజ్వాన్ వివాదస్పద ట్వీట్! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!
WC 2023 Pak Vs SL: పాకిస్తాన్ వికెట్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వివాదాస్పద ట్వీట్తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో రిజ్వాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో లంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(113)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్కు రికార్డు విజయం అందించాడు. 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చెలరేగి.. 131 పరుగులతో రాణించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అజేయ ఇన్నింగ్స్తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎక్స్ వేదికగా రిజ్వాన్ చేసిన పోస్టు విమర్శలకు కారణమైంది. గాజాలో ఉన్న నా సోదర, సోదరీమణుల కోసం ‘‘జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం. అబ్దుల్లా షఫీక్, హసన్ అలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వాళ్ల వల్లే గెలుపు సులువైంది. హైదరాబాద్ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మీ ఆతిథ్యానికి.. మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు’’ అని రిజ్వాన్ రాసుకొచ్చాడు. అయితే, పోస్ట్ ఆరంభంలో.. ‘‘ఇది గాజాలో ఉన్న మా సోదర, సోదరీమణుల కోసం’’ అంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నువ్వు ఎవరికి సపోర్టు? ‘‘నువ్వు గాజా ప్రజలకు సపోర్టు చేస్తున్నావా? లేదంటే.. హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నావా? చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం తెలియదా?’’ అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో.. ‘‘నీ సెంచరీ గాజా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది. కనీసం ఈ మ్యాచ్ను చూసే స్థితిలో కూడా లేరు అక్కడి వాళ్లు. అయినా వరల్డ్కప్ లాంటి ఐసీసీ ఈవెంట్ ఆడుతున్నపుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీ మ్యాచ్ ఫీజులు, రెమ్యునరేషన్లు గాజా ప్రజల కోసం విరాళంగా ఇవ్వు’’ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతిసారి ఆటలోకి ఇలాంటివి లాగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. కాగా గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడికి దిగడంతో యుద్ధానికి తెరలేచింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇటు గాజా.. అటు ఇజ్రాయెల్లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. చదవండి: నవీన్ ఉల్ హక్ రనౌట్ మిస్.. రాహుల్పై కోహ్లి సీరియస్! వీడియో వైరల్ -
CWC 2023: కోహ్లి-రాహుల్, రిజ్వాన్-షఫీక్.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?
ప్రస్తుత ప్రపంచకప్లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్ ఏదంటే.. పాకిస్తాన్, శ్రీలంక మధ్య హైదరాబాద్లో నిన్న జరిగిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఓ కామన్ థింగ్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్.. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్లు నెలకొల్పిన మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్-రాహుల్ పార్ట్నర్షిప్కు ఓటేస్తుంటే, పాక్ ఫ్యాన్స్ మాత్రం రిజ్వాన్-షఫీక్ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్తో మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్ (85)-రాహుల్ (97 నాటౌట్) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్ను రిజ్వాన్ (131 నాటౌట్)-షఫీక్ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్నర్షిప్స్లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు. రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది. గత మ్యాచ్ల విషయాలను పక్కన పెడితే.. భారత్-పాక్లు అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్పై మరింత హైప్ పెరిగింది. దీనికి ముందు భారత్ ఇవాళ (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..!
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు. అదే విధంగా.. వన్డే వరల్డ్కప్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్తో ఆడుతోంది. అర్ధ శతకాలతో ఆదుకున్నారు అయితే, పసికూనే కదా అని డచ్ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. హైదరాబాద్లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ అద్భుత ఆట తీరుతో పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంతకు ముందు.. 1983లో నాటింగ్హాంలో న్యూజిలాండ్తో మ్యాచ్లో ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్ మ్యాచ్లో షాహిద్ మహబూబ్తో కలిసి ఇమ్రాన్ ఖాన్ 144.. 2019లో బర్మింగ్హాంలో బాబర్ ఆజం- హ్యారిస్ సొహైల్ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక వరల్డ్కప్ డెబ్యుటెంట్స్ ఒకే మ్యాచ్లో ఫిఫ్టీ ప్లస్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో మజీద్ ఖాన్(65), ఆసిఫ్ ఇక్బాల్(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్హక్(65), ఉమర్ అక్మల్(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(65), సౌద్ షకీల్(68)-(2023లో హైదరాబాద్లో) నిలిచారు. చదవండి: పాకిస్తాన్కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్ -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. పాక్ భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్కప్ వార్మప్ గేమ్లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్
పాక్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్కప్ 2023 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. రిజ్వాన్తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా రాణించాడు. బాబర్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 257/4గా ఉంది. సౌద్ షకీల్ (36), అఘా సల్మాన్ (10) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
WC: దిగొచ్చిన పీసీబీ.. ఆటగాళ్లే ఆస్తులు! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్
Pakistan announces landmark central contracts: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో చారిత్రాత్మక నిర్ణయంతో కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. మెన్స్ టీమ్లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆటగాళ్లకు మిలియన్ యూఎస్ డాలర్ల మేర రెవెన్యూ సమకూరనుంది. అయితే.. ఓ కండిషన్ ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే ఒప్పందం అమల్లోకి వస్తుందని.. అయితే, 12 నెలలకొకసారి క్రికెటర్ ప్రదర్శనపై సమీక్ష ఆధారంగానే చెల్లింపులు ఉంటాయని పీసీబీ స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందంలో భాగమయ్యేందుకు అత్యధికంగా 25 మంది క్రికెటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బుధవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాంట్రాక్టును మెర్జ్ చేసినట్లు పీసీబీ తెలిపింది. సెలక్షన్ విషయంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా నెలవారీ ఆదాయంతో పాటు టెస్టు మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల ఫీజును 50 శాతానికి, వన్డేలు ఆడేవాళ్ల ఫీజును 25 శాతం, టీ20లు ఆడేవాళ్లకు 12.5 ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది. మరో రెండు టీ20లీగ్లలో అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పాక్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు మరో రెండు ఇతర టీ20 లీగ్లు ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది. పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లతో చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇలాంటి డీల్ కుదరడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ నిజమైన ఆస్తులు ఆటగాళ్లేనని.. వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. పీసీబీ తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం.. కేటగిరీ-ఏ: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ షా ఆఫ్రిదిలకు 202 శాతం హైక్($15,500). కేటగిరీ-బి: ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, షాదాబ్ ఖాన్లకు 144 శాతం హైక్($10,000). కేటగిరీ- సి: ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫిక్లకు 135 శాతం హైక్$6,000) కేటగిరీ- డి: ఫాహిం ఆష్రఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇహసానుల్లా, మహ్మద్ హ్యారిస్, మహ్మద్ వసీం జూనియర్, సయీమ్ ఆయుబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షానవాజ్ దహాని, షాన్ మసూద్, ఉసామా మిర్, జమాన్ ఖాన్లకు 127 శాతం హైక్($1,700) హైదరాబాద్లో పాక్ జట్టు కాగా పీసీబీతో తాజా ఒప్పందంతో బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ వంటి టాప్ ప్లేయర్లకు నెలకు 15,600 అమెరికా డాలర్ల మేర(భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఏడువేలు) సాలరీ లభించనుంది. ఇదిలా ఉంటే.. పీసీబీ ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రే పాక్ క్రికెట్ జట్టు భారత్కు చేరుకోవడం విశేషం. హైదరాబాద్లో మ్యాచ్ల నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్గా మార్కరమ్ A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK — Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023 Ready to roar: @RealHa55an begins the World Cup preparations 🏃☄️#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/4RWGWr4GLR — Pakistan Cricket (@TheRealPCB) September 28, 2023 -
బాబర్, రిజ్వాన్ అర్ధశతకాలు.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన పాక్
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (86 బంతుల్లో 60; 4 ఫోర్లు, సిక్స్), మహ్మద్ రిజ్వాన్ (79 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్న దశలో పాక్ భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే 22 పరుగుల వ్యవధిలోకి వీరిద్దరూ ఔట్ కావడంతో పాక్ ఢీలా పడిపోయి, తక్కున స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో అఘా సల్మాన్ (33 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మహ్మద్ నవాజ్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడటంతో పాక్ 250 పరుగుల మార్కు దాటింది. పాక్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ 27, ఇమామ్ ఉల్ హాక్ 13, సౌద్ షకీల్ 9, షాదాబ్ ఖాన్ 3, ఫహీమ్ అష్రాఫ్ 2, షాహీన్ అఫ్రిది 2 నాటౌట్ పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్భదిన్ నైబ్, ఫరీద్ మాలిక్ తలో 2 వికెట్లు.. ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి రెండు వన్డేలు గెలిచి, ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. పాక్ ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. -
SL VS PAK 2nd Test Day 3: టెస్ట్ క్రికెట్లో పాక్ తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ తొలిసారి కంకషన్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ను వినియోగించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో లంక పేసర్ అసిత ఫెర్నాండో వేసిన బంతి పాక్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తలకు బలంగా తాకగా, అతను మైదానాన్ని వీడాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. రిజ్వాన్ పాక్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆతర్వాత లంక సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్కీపింగ్ కూడా చేస్తాడు. ప్రస్తుతం పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి కోలుకుంటే తిరిగి అతను బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంటుంది. Sarfaraz Ahmed Retired Hurt. #SarfarazAhmed #PAKvSL pic.twitter.com/T7yVo2tNlH — Syed Haris Aamir (@_smharis_) July 26, 2023 సర్ఫరాజ్ మైదానాన్ని వీడే సమయానికి 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ స్థానంలో బరిలోకి దిగిన రిజ్వాన్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్ల్లో తొలిసారి కంకషన్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ను వినియోగించున్న పాక్.. వన్డేల్లో తొలిసారి న్యూజిలాండ్పై ఈ ఆప్షన్ను వినియోగించుకుంది. ఐసీసీ 2019లో తొలిసారి కంకషన్ సబ్స్టిట్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వినియోగించుకుంది మాత్రం 2021లో. ఆ ఏడాది ఆగస్ట్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్ లబూషేన్ కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. కాగా, పాక్ టీమ్ విన్నపం మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కంకషన్ సబ్స్టిట్యూట్ అవకాశాన్ని వినియోగించుకునే వెసలుబాటు కల్పించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో పాక్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ హాఫ్సెంచరీ పూర్తి చేయగానే 576 పరుగుల స్కోర్ వద్ద పాక్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రిజ్వాన్తో పాటు అఘా సల్మాన్ (132 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. అనంతరం 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28) మిగిలి ఉంది. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్.. నాడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్..!
కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్ను, పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరాయి. ఫైనల్ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, ఇదే ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, 2013లో సింగపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్-23 జట్టును.. పాక్ అండర్-23 టీమ్ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్.. పాక్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఛాంపియన్గా నిలిచింది. India will face Pakistan in the Emerging Asia Cup final tomorrow! The last time they met was in 2013 when India won the Trophy under Suryakumar Yadav. KL Rahul won the Player of the match award in the final for scoring 93* runs. pic.twitter.com/Kj8FhqpuNZ — Johns. (@CricCrazyJohns) July 22, 2023 నాడు పాక్ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్ రాహుల్తో పాటు నాటి యంగ్ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్ పటేల్, ప్రస్తుత యూఎస్ఏ ఆటగాడు స్మిత్ పటేల్ ఉన్నారు. అలాగే నాటి పాక్ జట్టులో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (7) విఫలం కాగా.. మహ్మద్ రిజ్వాన్ (21), ఉమర్ వహీద్ (41), 10, 11వ నంబర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాదిర్ (33), ఎహసాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్ 3, సందీప్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు, సందీప్ వారియర్, అంకిత్ బావ్నే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), మన్ప్రీత్ జునేజా (51 నాటౌట్) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. -
విఫలమవుతున్నా నెంబర్వన్ స్థానంలోనే..
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. బుధవారం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ 906 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. తర్వాతి స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(811 పాయింట్లు) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ 748 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 745 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి 15వ స్థానంలో ఉండగా.. మిగతా టీమిండియా బ్యాటర్లు ఎవరు టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే ఇటీవలే ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్లోనూ సూర్యకుమార్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్ల్లో వరుసగా 12,1,0 పరుగులు చేశాడు. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉంది. అయితే సూర్య నెంబర్వన్ స్థానంలో కొనసాగాడానికి మ్యాచ్లు అంతర్జాతీయంగా మ్యాచ్లు జరగకపోవడమే. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ప్రారంభమవనున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్తో ర్యాంకింగ్స్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సూర్య వెనకాలే ఉన్న మహ్మద రిజ్వాన్, బాబర్ ఆజంలు సిరీస్లో రాణిస్తే సూర్యను దాటే చాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉండగా.. ఫజల్లా ఫరుకీ రెండు, జోష్ హాజిల్వుడ్ మూడు, వనిందు హసరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. చదవండి: మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్రూమ్లోనూ మనోడే హీరో! -
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్కు ఘోర అవమానం.. అస్సలు ఊహించి ఉండరు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్కు ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ ది హండ్రెడ్ డ్రాఫ్ట్లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో వీరిద్దరూ ది హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్లో అమ్ముడుపోని ఆటగాళ్లగా మిగిలిపోయారు. టీ20ల్లో వరల్డ్ నెం2, నెం3 ఆటగాళ్లైనా బాబర్, రిజ్వాన్ను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నిజంగా వారికి ఇది ఘోర పరాభావం అనే చెప్పుకోవాలి. వీరితో పాటు ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, ట్రెంట్ బౌల్ట్ను కూడా ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. కాగా ఈ డ్రాఫ్ట్లో ఎనిమిది జట్లకు 30 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. అయితే ఈ డ్రాఫ్ట్లో బాబర్, రిజ్వాన్కు ఘోర అవమానం జరిగినప్పటికీ.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్లు మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని ఏకంగా లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. హరీస్ రౌఫ్ను కూడా వెల్ష్ ఫైర్ ప్రాంచైజీనే కొనుగోలు చేసింది. ఇక సునీల్ నరైన్, వానిందు హసరంగ, గ్లెన్ మ్యాక్స్వెల్, రషీద్ ఖాన్, నాథన్ ఎల్లీస్, షాదబ్ ఖాన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, కేన్ రిచర్డ్సన్, డానియల్ సామ్స్, జోష్ లిటిల్, వేన్ పార్నెల్ వంటి ఆటగాళ్లకు ది హండ్రెడ్ లీగ్-2023 డ్రాఫ్ట్లో చోటు దక్కింది. ఇక ది హండ్రెడ్ లీగ్-2023 ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్కు దూరమైనా పంత్కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! -
PSL 2023: టీ20 మ్యాచ్లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
Pak Vs NZ: న్యూజిలాండ్పై పాక్ ఘన విజయం.. సిరీస్లో ముందంజ
Pakistan vs New Zealand, 1st ODI- Naseem Shah: న్యూజిలాండ్ జట్టుతో కరాచీలో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 256 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (66; 5 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (56; 7 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దెబ్బకొట్టిన నసీం షా అంతకుముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. నసీమ్ షా (5/57) కివీస్ను దెబ్బ తీశాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్లోబ్రాస్వెల్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. టామ్ లాథమ్ 42 పరుగులు చేశాడు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నసీం షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముందంజలో పాక్ కాగా టెస్టు, వన్డే సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ పాక్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్లు డ్రాగా ముగియగా.. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే స్కోర్లు టాస్: పాకిస్తాన్- బౌలింగ్ న్యూజిలాండ్: 255/9 (50) పాకిస్తాన్: 258/4 (48.1) ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత! A maximum to finish things off! 💥 9️⃣th ODI win in a row 🇵🇰👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/z15eS9qvxD — Pakistan Cricket (@TheRealPCB) January 9, 2023 -
క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదలైన తొలి టెస్టు మూడోరోజు ఆటలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. జ్వరం కారణంగా బాబర్ ఆజం మూడోరోజు మైదానంలోకి రాలేదు. దీంతో బాబర్ ఆజం స్థానంలో స్టాండిన్ కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించాడు. ఇక బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా అడుగుపెట్టాడు. మ్యాచ్లో పలుసార్లు ఆటగాళ్లను ఫీల్డింగ్ మారుస్తూ కెప్టెన్గా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది.. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ టెస్టుల్లో వైస్కెప్టెన్గా ఉన్నప్పటికి కివీస్తో తొలి టెస్టుకు రిజ్వాన్ స్థానంలో సీనియర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. అతనే వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు స్టాండిన్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా అడుగుపెట్టి కాసేపు స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరించి రిజ్వాన్ చర్య నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి క్రికెట్లో చట్టాలు తెచ్చే ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్) రూల్స్ ఏం చెబతున్నాయంటే.. మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చిన ఏ ఆటగాడైనా సరే కెప్టెన్సీ లేదా బౌలింగ్ చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే అంపైర్ అనుమతితో వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది(అదీ అంపైర్ అనుమతి ఇస్తేనే). ఇక క్రికెట్ పుస్తకాల్లో ఎంసీసీ పేర్కొన్న రూల్ 24.1.2 కూడా ఇదే చెబుతుంది. అయితే ఈ నిబంధనను రిజ్వాన్తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాలికొదిలేసినట్లు కనిపించింది. ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పీసీబీ కావాలనే నిబంధనను గాలికొదిలేసిందా లేక మరిచిపోయిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కాసేపటికే డెవన్ కాన్వే రివ్యూ విషయంలో కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ డీఆర్ఎస్కు వెళ్లాడు. అయితే రివ్యూకు వెళ్లడానికి ముందు రిజ్వాన్తో చర్చించి డీఆర్ఎస్కు అప్పీల్ చేయడం కన్ఫూజన్కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ రివ్యూ పాక్కు ఫలితం తెచ్చిపెట్టడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్ పాక్ జట్టుకు ధీటుగా బదులిస్తుంది. బాబర్ ఆజం, అగా సల్మాన్లు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 408 పరుగులతో ఆడుతుంది. కేన్ విలియమ్సన్ 85 పరుగులతో , టామ్ బ్లండెల్ 41 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డెవన్ కాన్వే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. Rewarded for the tight lines maintained this morning ☝️ Excellent review 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/jejexv1v7n — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
Pak Vs NZ: వైస్ కెప్టెన్పై వేటు! సొంతగడ్డపై తొలిసారి.. చీఫ్ సెలక్టర్పై మండిపాటు
Pakistan vs New Zealand, 1st Test- Shahid Afridi- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభించింది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం మొదలైన తొలి టెస్టు ద్వారా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ పునరాగమనం చేశాడు. మహ్మద్ రిజ్వాన్ను తప్పించిన మేనేజ్మెంట్.. అతడి స్థానంలో తుది జట్టుకు సర్ఫరాజ్ను ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్తో సిరీస్లో మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ చేసిన పరుగులు 141(సగటు 23.50). టాప్ స్కోర్ 46. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి టెస్టులో అతడికి స్థానం దక్కలేదు. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలిసారి ఇక 2019లో జనవరిలో జొహన్నస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా పాక్ తరఫున ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీలో 8 మ్యాచ్లలో ఈ వెటరన్ బ్యాటర్ 394 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సింధ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 2022-23 ఎడిషన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో మూడు అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు కాగా 2010లో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్కు పాక్ గడ్డపై ఇదే తొలి టెస్టు కావడం మరో విశేషం. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 49 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ 2657 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2018లో అరంగేట్రం చేసిన ఫాస్ట్బౌలర్ మిర్ హంజా కూడా కివీస్తో సిరీస్లో పునరాగమనం చేశాడు. తొలుత అతడిని జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఆఖరి నిమిషంలో ఈ పేసర్కు జట్టులో చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ చేతిలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టిన పాక్ బోర్డు.. చైర్మన్ రమీజ్రాజాను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో నజమ్ సేతీ వచ్చాడు. ఇక అదే విధంగా చీఫ్ సెలక్టర్గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్ను తప్పించడం ఫ్యాన్స్కు రుచించడం లేదు. చీఫ్ సెలక్టర్, కెప్టెన్పై విమర్శలు ‘‘కేవలం ఒకటీ రెండు మ్యాచ్లలో స్కోర్ ఆధారంగా రిజ్వాన్ను తప్పిస్తారా? సర్ఫరాజ్ను తీసుకురావడం మంచిదే! కానీ అందుకోసం రిజ్వాన్ను బలిచేస్తారా? రిజ్వాన్ను తప్పించాలనే నిర్ణయం ఆఫ్రిదిదా లేదంటే బాబర్ ఆజందా’’ అంటూ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా ఇంగ్లండ్ చేతిలో పరాభవం నేపథ్యంలో పాక్ డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ -
Pak Vs Eng: అంటే మేం టెస్టులు ఆడటం ఆపేయాలంటారా?: బాబర్ ఆజం
Pakistan vs England, 2nd Test- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఓటమి పాలైన పాకిస్తాన్ సిరీస్ను 0-2తో కోల్పోయింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా జరిగిన మ్యాచ్లో పర్యాటక జట్టు చేతిలో ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే పరిమితం కావడం ప్రభావం చూపిందన్నాడు. రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్నప్పటికీ.. గెలిచేందుకు తాము చేసిన పోరాటం ఫలించలేదని వాపోయాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన అబ్రార్ అహ్మద్కు మాత్రం ఈ మ్యాచ్ చిరకాలం గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. కరాచీ వేదికగా జరుగనున్న మూడో టెస్టులో అత్యుత్తమంగా ఆడి గెలుస్తామంటూ బాబర్ ఆజం ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు.. సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ 22 ఏళ్ల తర్వాత అక్కడ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్టోక్స్ బృందం సంబరాల్లో మునిగిపోయింది. టీ20లపై దృష్టి పెట్టండి! కాగా ముల్తాన్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 75 పరుగులు చేసిన బాబర్.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వరుసగా 10, 30 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వీరిద్దరి ప్రదర్శన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో భాగంగా.. బాబర్ ఆజంకు ఓ జర్నలిస్టు సంధించిన ప్రశ్న చిరాకు తెప్పించింది. ‘‘అభిమానుల తరఫున నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. బాబర్, రిజ్వాన్ టీ20 ఫార్మాట్పై మరింత దృష్టి పెట్టాలని వాళ్లు కోరుకుంటున్నారు’’ అని ఆ జర్నలిస్టు బాబర్తో అన్నారు. అంటే టెస్టులు ఆడొద్దా?! ఇందుకు స్పందించిన పాక్ సారథి.. ‘‘అంటే.. మేము టెస్టులు ఆడటం మానేయాలని మీరు చెబుతున్నారా?’’ అని విసుగు ప్రదర్శించాడు. టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతుంటే టీ20ల గురించి ప్రశ్న ఎందుకన్నట్లుగా చిరాకుపడ్డాడు. అయితే, సదరు జర్నలిస్టు మాత్రం నేను అలా అనడం లేదు.. టీ20లపై ఫోకస్ చేయాలని మాత్రమే చెబుతున్నా అని చెప్పుకొచ్చారు. కాగా టీ20 ఫార్మాట్లో పాక్ బెస్ట్ ఓపెనింగ్ జోడీగా పేరొందిన రిజ్వాన్- బాబర్ ప్రపంచకప్-2022 టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఆ టోర్నీలో మొత్తంగా రిజ్వాన్ 175, బాబర్ 124 పరుగులు చేశారు. పాక్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు.. మ్యాచ్ సాగిందిలా! పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఇంకో మ్యాచ్ ఉండగానే 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సీమర్ మార్క్ వుడ్ (4/65) నాలుగోరోజు ఆటను శాసించాడు. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్స్ను వైవిధ్యమైన బంతులతో పెవిలియన్ చేర్చాడు. నాలుగో రోజు ఆటలోనే అతను 3 వికెట్లను పడగొట్టాడు. 355 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 198/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 328 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్స్లో ఫహీమ్ అష్రఫ్ (10; 1 ఫోర్) ఆట మొదలైన కాసేపటికే రూట్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కానీ మరో బ్యాటర్ సౌద్ షకీల్ (94; 8 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. నవాజ్ (45; 7 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 80 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. షకీల్ సెంచరీకి చేరువైన దశలో వుడ్ తన వరుస ఓవర్లలో పరుగు తేడాతో మొదట నవాజ్ను తర్వాత షకీల్ను పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్కు విజయం ఖాయమైంది. 290/5తో పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్ 291/7 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. లంచ్ విరామనంతరం వుడ్, అండర్సన్, రాబిన్సన్ టెయిలెండర్ల పనిపట్టారు. జాహిద్ మహమూద్ (0) వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అబ్రార్ అహ్మద్ (17)ను అండర్సన్, మొహమ్మద్ అలీ (0)ని రాబిన్సన్ అవుట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ కూలింది. సిరీస్లోని చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి కరాచీలో జరుగుతుంది. స్కోర్లు: ఇంగ్లండ్- 281 & 275 పాకిస్తాన్- 202 & 328 చదవండి: Ind Vs Ban: పాక్ అవుట్.. మరి టీమిండియా? ఫైనల్ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి! ప్రకృతితో ఆటలాడితే అధోగతే! మంచు దుప్పటిలో ప్రసిద్ధ స్టేడియం! గుర్తుపట్టారా? -
బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట!
పాకిస్తాన్ జట్టు నుంచి గొప్ప క్రికెటర్లు వచ్చారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, అమీర్ సోహైల్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, మొహ్మద్ యూసఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. ఈతరం పాక్ క్రికెటర్లలో బాబర్ ఆజం కూడా గొప్ప క్రికెటర్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ మధ్యన ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజం మంచి టెక్నిక్ గల బ్యాటర్గా కొనసాగుతున్నాడు. తాజగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ పురస్కరించుకొని ప్రస్తుతం పాక్ జట్టు ప్రాక్టీస్లో తలమునకలైంది. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్టు డిసెంబర్ ఒకటి నుంచి మొదలుకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. కాగా ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు అక్కడికొచ్చిన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ పిల్లలకు తమ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బ్యాట్, బాల్, షర్ట్, చేతులు ఇలా ఎక్కడపడితే అక్కడ ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు పిల్లలు బాబర్ సంతకం చేసిన బ్యాట్ను. మోచేతులు చూపిస్తూ వీటిని వేలం వేస్తున్నామని తెలిపారు. ఒక బుడ్డోడు బ్యాట్ ధర రూ. 5 లక్షలని అంటే.. మరొకడు బాబర్ ఆజం ఆటోగ్రాఫ్ ఇచ్చిన నా మోచేతి ధర రూ. 40 లక్షలు అని తెలిపాడు.. ఇంకొకడు వచ్చి నా చెంపపై మహ్మద్ రిజ్వాన్ ముద్దు పెట్టుకున్నాడని.. కానీ దానిని వేలం వేయలేనని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Sab ke dilo mein rheta hai Babar ❣️#BabarAzam #PAKvsEng pic.twitter.com/YRDayo6311 — Urooj Jawed (@uroojjawed12) November 26, 2022 చదవండి: IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్ FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' -
సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. పాకిస్తాన్ కెప్టెన్ రికార్డు బద్దలు
న్యూజిలాండ్తో రెండో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో సూర్య విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన నుంచే కివీస్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా టీ20ల్లో సూర్యకు ఇది రెండో అంతర్జాతీయ సెంచరీ. అంతకుముందు ఇంగ్లండ్పై తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. బాబర్ రికార్డు బ్రేక్ చేసిన సూర్య ఇక సెంచరీతో చెలరేగిన సూర్య ఓ అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బాబర్ రికార్డును సూర్యకుమార్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తొలి స్థానంలో ఉన్నాడు. 2021 ఏడాదిలో రిజ్వాన్ 13 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: IND VS NZ 2nd T20: సూర్యకుమార్ సుడిగాలి శతకం.. సౌథీకి హ్యాట్రిక్ -
WC 2022 Final Pak Vs Eng: పాకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఐదో వికెట్ డౌన్ 18.2: మొయిన్ అలీ బౌల్డ్ విజయానికి చేరువలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 110/4 ►విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి. కట్టడి చేస్తున్న పాక్ బౌలర్లు ►11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ 12.3: షాదాబ్ ఖాన్ బౌలింగ్లో ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (20) అవుట్ 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు- 82/3 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 77/3 ►విజయం కోసం 60 బంతుల్లో 61 పరుగులు కావాలి. ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, బ్రూక్ ►స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లండ్ బ్యాటర్లు స్టోక్స్(11), బ్రూక్(12) ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 69-3 పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 49-3 హ్యారీ బ్రూక్ 4, బెన్ స్టోక్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఇప్పటి వరకు షాహీన్ ఆఫ్రిదికి ఒక వికెట్, హ్యారీస్ రవూఫ్నకు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్కు భారీ షాక్ 5.3: హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో బట్లర్ అవుట్. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్గా నిష్క్రమించిన ఇంగ్లండ్ కెప్టెన్. క్రీజులో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 43/2 జోస్ బట్లర్ 26, స్టోక్స్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఫిలిప్ సాల్ట్ అవుట్ ఆదిలోనే ఇంగ్లండ్కు షాక్ అలెక్స్ హేల్స్ను అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిది ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఏడో వికెట్ డౌన్ 18.3: సామ్ కర్రన్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నవాజ్(5). షాహీన్ ఆఫ్రిది, వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. షాదాబ్ అవుట్ 17.2: జోర్డాన్ బౌలింగ్లో షాదాబ్ ఖాన్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. నవాజ్, మహ్మద్ వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ ►16.3: సామ్ కర్రన్ బౌలింగ్లో అవుటైన షాన్ మసూద్. ►క్రీజులో మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు:106/4 షాదాబ్ ఖాన్ 10, షాన్ మసూద్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్కు దెబ్బ మీద దెబ్బ ►12.2: స్టోక్స్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగిన ఇఫ్తీకర్ అహ్మద్. ►క్రీజులో షాదాబ్ ఖాన్, షాన్ మసూద్ ►12 ఓవర్లలో పాక్ స్కోరు: 84-3 బాబర్ ఆజం అవుట్ ►11.1: ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(32). దీంతో మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. ►క్రీజులో షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ స్కోరు: 68 9 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 59-2 ►బాబర్ ఆజం 27, షాన్ మసూద్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాక్ ►7.1: ఆదిల్ రషీద్ బౌలింగ్లో స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ హారీస్(8) అవుట్. పాక్ స్కోరు. 45/2 పవర్ ప్లేలో పాక్ స్కోరు ►6 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన పాక్. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్కు ఒక వికెట్. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ►4.2: సామ్ కర్రన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు). బాబర్ ఆజం, మహ్మద్ హారీస్ క్రీజులో ఉన్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ►4 ఓవర్లలో పాక్ స్కోరు: 28-0 ►బాబర్, రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లో పాక్ స్కోరు: 8-0 ►0.4- రనౌట్ నుంచి తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్ ►పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ► ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ ఆరంభించిన బెన్ స్టోక్స్ ►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు ►ఇంగ్లండ్ జోస్ బట్లర్(వికెట్ కీపర్/ కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ ►పాకిస్తాన్ బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది నువ్వా- నేనా టీ20 ప్రపంచకప్-2022 తుది పోరుకు ఇంగ్లండ్- పాకిస్తాన్ సన్నద్ధమయ్యాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్-1 నుంచి ఫైనల్కు చేరిన బట్లర్ బృందం.. గ్రూప్- 2 నుంచి తమతో పోటీకి వచ్చిన బాబర్ టీమ్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అగ్రపీఠంపై సూర్య భాయ్.. కోహ్లి తర్వాత తొలి భారతీయుడిగా రికార్డు
ఐసీసీ తాజాగా (నవంబర్ 2) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా డిషింగ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్కప్-2022లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్య భాయ్.. తొలిసారి టీ20 ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. టీమిండియా తరఫున గతంలో విరాట్ కోహ్లి మాత్రమే టాప్లో కొనసాగాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్ (51), సౌతాఫ్రికాలపై (68) వరుస హాఫ్ సెంచరీలు బాదిన సూర్యకుమార్.. మొత్తం 863 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్కు చేరాడు. ఇంతకుముందు టాప్లో ఉన్న పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్.. వరల్డ్కప్లో ఆశించిన మేరకు ప్రభావం చూపలేక అగ్రస్థానాన్ని కోల్పోయాడు. Suryakumar Yadav has replaced Mohammad Rizwan at the top of the T20I Batting Rankings #Cricket #T20WorldCup pic.twitter.com/jDT4dIuzIj — Saj Sadiq (@SajSadiqCricket) November 2, 2022 వరల్డ్కప్లో 3 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ ఒక్క మ్యాచ్లో మాత్రం 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రెండో స్థానానికి దిగజారిన రిజ్వాన్ ఖాతాలో 842 పాయింట్లు ఉన్నాయి. సూర్య, రిజ్వాన్ తర్వాత మూడో ప్లేస్లో న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే ఉన్నాడు. కాన్వే ఖాతాలో 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లి 638 రేటింగ్ పాయింట్స్తో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్కప్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాత్రమే నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ కింగ్ కోహ్లి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
నెదర్లాండ్స్తో మ్యాచ్.. ముక్కి మూలిగి గెలిచిన పాకిస్తాన్
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత పాక్ బౌలర్లు షాదాబ్ ఖాన్ (3/22), మహ్మద్ వసీం జూనియర్ (2/15), షాహీన్ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్ రౌఫ్ (1/10) సత్తా చాటడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (49), ఫఖర్ జమాన్ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో పాక్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో షాన్ మసూద్ (12) ఔట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ (6), షాదాబ్ ఖాన్ (4) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాక్ ప్రస్తుత ప్రపంచకప్లో బోణీ కొట్టడంతో పాటు ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. -
సమయం ఆసన్నమైంది.. వారిద్దరిని విడదీయాల్సిందే!
క్రికెట్లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. బ్యాటింగ్లో ఈ జోడి పోషించే పాత్రపైనే ఇన్నింగ్స్ మొత్తం ఆధారపడి ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సచిన్-సెహ్వాగ్, సచిన్-గంగూలీ, మాథ్యూ హెడెన్-గిల్క్రిస్ట్, హెడెన్-జస్టిన్ లాంగర్, గ్రేమీ స్మిత్-హర్షలే గిబ్స్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా ముద్రపడ్డారు. వీళ్లే కాదు ఇంకా చాలా ఓపెనింగ్ జోడీలున్నాయి.. చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టు వస్తుంది. మనం చెప్పుకున్న లిస్టులో పాకిస్తాన్ జోడి బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్లకు కూడా కచ్చితంగా స్థానం ఉంటుంది. గత రెండేళ్లుగా ఈ జోడి పరుగుల మీద పరుగులు చేస్తూ రికార్డులు సృష్టించారు. 2021 ఏడాదిలో ఈ జోడి 50.47 సగటుతో 2019 పరుగులు జోడించారు. దీన్నబట్టే అర్థం చేసుకోవచ్చు.. బాబర్-రిజ్వాన్ జోడి ఎంత సక్సెస్ అయిందనేది. అయితే ఈ సక్సెస్ ఇప్పుడు వారిద్దరిని చిక్కుల్లో పడేసింది. కొంతకాలంగా బాబర్-రిజ్వాన్ జోడి స్థిరంగా పరుగులు చేయలేకపోతుంది. ముఖ్యంగా బాబర్ ఆజం ఆట నాసిరకంగా తయారైంది. టి20 ప్రపంచకప్కు ముందు జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకముందు ఆసియా కప్లోనూ ఇదే పరిస్థితి. తాజాగా అదే ఫేలవ ఫామ్ను టి20 ప్రపంచకప్లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. అటు కెప్టెన్గానూ విఫలమవుతున్నాడు. టీమిండియాతో మ్యాచ్లో ఓటమి పాలైన పాకిస్తాన్కు జింబాబ్వే కూడా షాకిచ్చింది. ఈ దెబ్బకు బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అసలే బ్యాటింగ్లో విఫలమవుతున్న బాబర్కు ఇది పెద్ద దెబ్బ. కొందరైతే ఏకంగా బాబర్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి ఉద్వాసన పలకాలని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మహ్మద్ రిజ్వాన్ పరిస్థితి మరోలా ఉంది. టి20 ప్రపంచకప్ ముందు వరకు రిజ్వాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. చెప్పాలంటే 2021 నుంచి రిజ్వాన్ భీకరమైన ఫామ్ కనబరుస్తున్నాడు. టి20 ర్యాంకింగ్స్లో నెంబర్వన్ స్థానాన్ని ఆక్రమించిన మహ్మద్ రిజ్వాన్ ఆ స్థానానికి తాను కరెక్టే అన్నట్లుగా ప్రతీ మ్యాచ్లోనూ స్థిరంగా ఆడుతూ వచ్చాడు. అయితే టి20 ప్రపంచకప్లో మాత్రం రిజ్వాన్ ఆ ఫామ్ను చూపెట్టలేకపోతున్నాడు. అయితే ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్లు మాత్రమే కాబట్టి.. అతన్ని తక్కువ అంచనా వేయలేము. అతని ఫామ్లో ఉన్నానని చెప్పడానికి ఒక నిఖార్సైన ఇన్నింగ్స్ చాలు. కానీ అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. పాకిస్తాన్కు ఇప్పుడు మరో ఓపెనింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడి మూడు ఫార్మట్లలోనూ ఓపెనింగ్ స్లాట్లోనే వస్తున్నారు. అయితే వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆడించకపోవడం పీసీబీ చేసిన తప్పు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ప్రతీసారి బాబర్-రిజ్వాన్ ఆడుతారని చెప్పలేం. ఇప్పుడు నడుస్తోంది కూడా అదే. వాస్తవానికి పాక్ జట్టులో ఫఖర్ జమాన్ రెగ్యులర్గా మూడో స్థానంలో వస్తుంటాడు. తాజాగా టి20 ప్రపంచకప్కు దూరంగా ఉన్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్ను ఎంపిక చేయడం.. అతను అంచనాలకు మించి రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే ఫఖర్ జమాన్ను ఓపెనింగ్ స్లాట్లో ఆడించాల్సింది అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు టీమిండియాలో రోహిత్-రాహుల్ జోడి విఫలమయినా.. వారికి ప్రత్యామ్నాయంగా చాలా మంది అందుబాటులో ఉన్నారు. కానీ పాకిస్తాన్కు ఆ చాన్స్ లేకుండా పోయింది. అందుకే బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడిని విడదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఓపెనింగ్ జోడిలో ఒకరి స్థానంలో వేరొకరిని ఆడించడం మంచిదని పేర్కొన్నారు. -
సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్లో 34 పరుగులు సాధించిన రిజ్వాన్.. పాక్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో రిజ్వాన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ 821 పరుగులు సాధించాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. 2022 ఏడాదిలో సూర్య ఇప్పటి వరకు 23 మ్యాచ్లు ఆడి 801 పరుగులు సాధించాడు. అయితే తాజా మ్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో తొలి, రెండు స్థానాల్లో రిజ్వాన్, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. చదవండి: T20 World Cup 2022: భారత్తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు గుడ్ న్యూస్! -
పాక్ను హడలెత్తించిన బంగ్లా.. కానీ!
-
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్కు చెమటలు పట్టించిన బంగ్లా!
New Zealand T20I Tri-Series 2022 - Pakistan vs Bangladesh, 6th Match: న్యూజిలాండ్తో టీ20 ట్రై సిరీస్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. క్రైస్ట్చర్చ్ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన పోరులో చివరికి పాకిస్తాన్ పైచేయి సాధించింది. మరో బంతి మిగిలి ఉండగానే మహ్మద్ నవాజ్ ఫోర్ బాది పాక్ను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ ఓటమితో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ట్రై సిరీస్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. టీ20 వరల్డ్కప్-2022 సన్నాహకాల్లో భాగంగా జరిగిన సిరీస్లో చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం (అక్టోబరు 14) నాటి ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరోసారి విజృంభించిన కెప్టెన్.. కానీ.. పాక్తో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఓపెనర్లు షాంటో(12), సౌమ్య సర్కార్(4) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన లిటన్ దాస్, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. లిటన్ దాస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 69 పరుగులు చేయగా.. షకీబ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. మిగతా ఆటగాళ్లకు నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 173 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ అర్ధ శతకాలు లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనింగ్ జోడీ మహ్మద్ రిజ్వాన్(56 బంతుల్లో 69 పరుగులు), బాబర్ ఆజం(40 బంతుల్లో 55 పరుగులు) అర్ధ శతకాలతో కదం తొక్కింది. హైదర్ అలీ విఫలం(0) కాగా.. మహ్మద్ నవాజ్ 45 పరుగులతో అజేయంగా నిలిచి పాక్ను విజేతగా నిలిపాడు. 19.5 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్లుగా భారత్, పాక్ ప్లేయర్లు
ICC Player Of The Month For September: సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను భారత్, పాక్ ప్లేయర్లు గెలుచుకున్నారు. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విన్నర్గా నిలిచారు. పురుషుల విభాగంలో రిజ్వాన్కు టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ నుంచి పోటీ ఎదురు కాగా.. మహిళల విభాగంలో హర్మన్.. సహచరి మంధాన, బంగ్లా ప్లేయర్ నిగర్ సుల్తానా నుంచి పోటీ ఎదుర్కొంది. రిజ్వాన్, హర్మన్లు ఆయా విభాగాల్లో ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా అవార్డులు వీరినే వరించాయి. సెప్టెంబర్లో వీరి ప్రదర్శన విషయానికొస్తే.. ఈ నెలలో పాక్ ఆటగాడు రిజ్వాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో రిజ్వాన్ పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయాడు. ఓ పక్క తన సహచరులంతా విఫలమవుతున్నా రిజ్వాన్ ఒక్కడే దాదాపు ప్రతి మ్యాచ్లో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత నెలలో అతనాడిన 10 టీ20ల్లో ఏకంగా 7 అర్ధశతకాలు బాది ఔరా అనిపించాడు. ఇక హర్మన్ విషయానికొస్తే.. ఈ టీమిండియా క్రికెటర్ గత మాసంలో బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గానూ భారీ సక్సెస్ సాధించింది. అలాగే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గానూ రికార్డుల్లోకెక్కింది. హర్మన్ నేతృత్వంలో టీమిండియా.. ఇంగ్లండ్ను తొలిసారి వారి స్వదేశంలో 3-0 తేడాతో (వన్డే సిరీస్) చిత్తు చేసింది. ఈ సిరీస్లో ఆమె 103.27 సగటున 221 స్ట్రయిక్ రేట్తో 221 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ (143 నాటౌట్), అర్ధసెంచరీ (74 నాటౌట్) ఉన్నాయి. -
సూర్యకుమార్ మంచి ఆటగాడే కానీ.. మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్పై పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్లో నిన్న (అక్టోబర్ 7) బంగ్లాదేశ్ను పాక్ మట్టికరిపించిన అనంతరం రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ సూర్యకుమార్ బ్యాటింగ్ శైలిని ప్రశంసలతో ముంచెత్తాడు. టీ20 ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ టాప్ ర్యాంక్ దిశగా వేగంగా అడుగులేయడంపై స్పందిస్తూ.. సూర్యకుమార్ మంచి ఆటగాడని, అతని ఆటంటే తనకెంతో ఇష్టమని, అతను షాట్లు ఆడే విధానం తనను బాగా ఆకట్టుకుంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభించడానికి, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి మాత్రం చాలా వ్యత్యాసముంటుందని అభిప్రాయపడ్డాడు. చివరిగా తాను ర్యాంకింగ్స్ల గురించి అస్సలు పట్టించుకోనని, జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని గొప్పలు పోయాడు. కాగా, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ 854 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ 838 రేటింగ్ పాయింట్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, సూర్యకుమార్ల మధ్య 16 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉండటంతో సూర్యకుమార్ త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్లో రిజ్వాన్ను వెనక్కునెట్టి టాప్ ర్యాంక్కు చేరడం ఖాయమని భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పాక్ సారధి బాబర్ ఆజమ్ (801) సూర్యకుమార్ వెనుక మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (606), విరాట్ కోహ్లి (605), రోహిత్ శర్మ (604) వరుసగా 14, 15, 16 స్థానాల్లో ఉన్నారు. టాప్-10లో సూర్యకుమార్ మినహా మరే ఇతర భారత ఆటగాడు లేకపోవడం విశేషం.