New feature
-
ఫోన్పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారీ కార్డు వివరాలు అక్కర్లేదు
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్పే (PhonePe) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్పే యాప్లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, ప్రయాణ బుకింగ్లు, బీమా కొనుగోళ్లతోపాటు పిన్కోడ్, ఫోన్పే పేమెంట్ గేట్వేను ఉపయోగించి చేసే చెల్లింపులు వంటి వివిధ సేవలలో ఉపయోగించవచ్చు.ఈ కొత్త ఫీచర్తో వినియోగదారులు మెరుగైన భద్రత, సౌలభ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఇకపై మర్చంట్ ప్లాట్ఫామ్లలో కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్పే తెలిపింది. టోకెనైజ్డ్ కార్డులు కార్డ్ వివరాలను ఫోన్లకు సురక్షితంగా లింక్ చేయడం ద్వారా మోసాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ నుండి వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. టోకెనైజ్డ్ కార్డులు వేగవంతమైన లావాదేవీలను, అధిక మార్పిడి రేట్లను అనుమతిస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఈ పద్ధతిని అవలంబించడంతో, వ్యాపారాలు మెరుగైన కస్టమర్ నిలుపుదల, సున్నితమైన చెక్అవుట్ అనుభవాన్ని పొందుతాయి. ఫోన్పే పేమెంట్ గేట్వే ఉపయోగించే వ్యాపారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపు భద్రత, సౌలభ్యాన్ని పెంచుతుందని ఫోన్పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు. ఈ సర్వీస్ను మరిన్ని కార్డ్ నెట్వర్క్లతో అనుసంధానించాలని, ఫోన్పే పేమెంట్ గేట్వే వ్యాపారులందరికీ విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
వాట్సాప్లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వాట్సాప్లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్ఫోన్లో స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.స్మార్ట్ఫోన్ ఉపయోగించే చాలామంది.. ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం. -
జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్.. ‘జియో సౌండ్ పే’
దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 5 కోట్ల మంది చిరు వ్యాపారుల కోసం రిలయన్స్ జియో (Reliance jio) కీలక నిర్ణయం తీసుకుంది. జియో భారత్ ఫోన్లలో (Jio Bharat Phone) ‘జియో సౌండ్ పే’ (Jio Sound Pay) అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫీచర్తో జియో భారత్ వినియోగదారులు ప్రతి యూపీఐ పేమెంట్కి తాము ఎంపిక చేసుకున్న భాషలో కన్ఫర్మేషన్ మెసేజ్ ఉచితంగా వినొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ఇన్ఫోకామ్ లిమిటెట్ ప్రెసిడెంట్ సునీల్ దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం కిరాణా షాప్లు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు తదితర చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్న వారంతా పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని కోసం ప్రతి నెలా రూ.125 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన ‘జియో సౌండ్ పే’ ఫీచర్తో ఎలాంటి సౌండ్ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్లోనే కన్ఫర్మేషన్ మెసేజ్ వినొచ్చు. దీనివల్ల వ్యాపారులకు ఏడాదికి రూ.1500 వరకు ఆదా అవుతుందని జియో ప్రకటనలో వెల్లడించింది.భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. ఈ ఆత్మీయ నివాళి సమకాలీన సంగీత అంశాలతో క్లాసిక్ మెలోడీలను మిళితం చేస్తుంది. వినియోగదారులు తమ దినచర్యకు దేశభక్తిని జోడించి మైజియో యాప్ లేదా జియో సావన్ ద్వారా ఈ రెండిషన్లను వారి జియోట్యూన్లుగా సెట్ చేసుకోవచ్చు. -
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్కు, రెస్టారెంట్ పార్టనర్కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్క్రీమ్లు, షేక్లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్ఫాం ఇన్స్టామార్ట్లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్లో టేబుల్స్ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్లో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్ను సబ్మిట్ చేయండి. -
గూగుల్పేలో గోల్డ్ లోన్..
గూగుల్కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్పే (google Pay) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్ల కోసం మరో ఎన్బీఎఫ్సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్తో కూడా గూగుల్పే జట్టు కట్టింది. గూగుల్పే అందిస్తున్న ఈ ఫీచర్తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. -
నచ్చినట్లు చాట్పేజ్.. వాట్సాప్లో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్కు నచ్చిన థీమ్లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్పేపర్ల రంగులు ఎంచుకున్న థీమ్ను బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.యూపీఐ ఆటో టాప్-అప్లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించవు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్కి మెసేజ్లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్లకు నేరుగా మెసేజ్లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్ల మెసేజ్లు ఒకే ఇన్బాక్స్లో కనిపించే లేదా విడివిడి ఇన్బాక్స్లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
జొమాటో కొత్త ఫీచర్.. దీపిందర్ వీకెండ్ అప్డేట్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఒకే ఫోన్ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.ఈ కొత్త ఫీచర్ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్లను షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.దీపిందర్ గోయల్ వీకెండ్ అప్డేట్ పేరుతో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్కు లక్షకు పైగా వ్యూస్, వేలాదిగా లైక్లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.Exciting new weekend update: Group Ordering is now on Zomato!⁰You can now share a link with your friends, and everyone can add to the cart seamlessly, making ordering together faster and easier. No more passing the phone around awkwardly to collect everyone's order 😉We’re… pic.twitter.com/W3SrlwVJR0— Deepinder Goyal (@deepigoyal) August 17, 2024 -
స్కూల్ టైమ్ ఫీచర్.. తల్లిదండ్రులకు వరం!
మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు స్మార్ట్ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. పెద్దవారి విషయం పక్కన పెడితే.. పిల్లలు కూడా వీటికి అలవాటైపోతున్నారు, గంటలకొద్దీ వాటికే అతుక్కుపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి, వారికి ఫోన్ ఎంతవరకు అవసరమో.. అంతవరకు మాత్రమే ఉపయోగించేలా గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.గూగుల్ త్వరలోనే పిల్లలు ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి 'స్కూల్ టైమ్' ఫీచర్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్ ఓఎస్ వాచ్లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.ఏమిటి ఈ స్కూల్ టైమ్ ఫీచర్స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, పిల్లలు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. స్మార్ట్ఫోన్ నుంచి పిల్లలను ఎలా దూరం చేయాలని ఆలోచించే తల్లితండ్రులకు ఇప్పుడు ఈ ఫీచర్ ఓ చక్కని పరిష్కారం అనే చెప్పాలి.ఎలా ఉపయోగించాలి స్మార్ట్ఫోన్ లేదా స్మార్ట్ఫోన్ వాచ్లలో స్కూల్ టైమ్ ఫీచర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్యామిలీ లింక్ ద్వారా తేదీ, టైమ్ వంటి వాటిని షెడ్యూల్ చేయాలి. దీని ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ నుంచి కాల్స్, మెసేజస్ అనుమతించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, అన్లాక్ కూడా చేయవచ్చు.గూగుల్ ఈ ఫీచర్ను వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత పిల్లలు స్మార్ట్ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు యూట్యూబ్ యాక్టివిటీ ఫీచర్ కూడా లాంచ్ చేయడానికి సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.స్కూల్ టైమ్ ఫీచర్ ఉపయోగాలుపిల్లలు తమ స్కూల్స్లో కూడా తరగతుల మీద దృష్టి సారించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. -
కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటోలో కొత్త ఫీచర్
కస్టమర్ సమస్యలను పరిష్కరించే దిశగా జొమాటో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఆర్డర్ హిస్టరీ కనిపించకుండా చేయడానికి ఇప్పుడు 'డిలీట్ ఆర్డర్' అందుబాటులో తెచ్చింది. కంపెనీ ఈ ఫీచర్ తీసుకురావడానికి గల కారణాన్ని ఈ ఇక్కడ తెలుసుకుందాం..డిలీట్ ఆర్డర్ అనే ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో వివరిస్తూ.. కరణ్ సింగ్ అనే వ్యక్తి అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారని, హిస్టరీ మొత్తం అందులో నిక్షిప్తమై ఉండటం వల్ల తన భార్యకు దొరికిపోతున్నట్లు చెప్పాడు. ఇది చాలామంది సమస్య. ఇప్పుడు మీరు ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా వినియోగించని అని పేర్కొన్నారు. కరణ్ సింగ్ అభ్యర్థన మన్నించి డిలీట్ ఆర్డర్ ఫీచర్ యాడ్ చేయడంతో.. సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.For Karan and many others - you can now delete orders from your order history on zomato. Use it responsibly 🙏Sorry, this took us a bit of time to prioritise and build. This touched multiple systems and microservices. We are rolling it out to all customers as we speak. https://t.co/Vwfr6Fs087 pic.twitter.com/0UMUnDuj0j— Deepinder Goyal (@deepigoyal) July 12, 2024 -
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్బాట్కు కాల్ చేసే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్లో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్లు, పిచ్లు, యాసలు ఎంచుకోవచ్చు. -
'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.రివార్డ్లుప్రస్తుతం క్రెడిట్ కార్డ్ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్లు గురించి చూపిస్తుంది.ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండిఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.సెక్యూరిటీ ఫీచర్ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్గా ఇన్పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. -
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో యాపిల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఆధునిక ఫీచర్స్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్ల శ్రేణిని ఆపిల్ ఎట్టకేలకు వెల్లడించింది.యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్న లేటెస్ట్ ఫీచర్లలో ఐ ట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్కట్స్, వెహికల్ మోషన్ క్యూస్ వంటివి ఉన్నాయి. visionOS కోసం మరిన్ని యాక్సెసిబిలిటీ అప్గ్రేడ్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.'ఐ ట్రాకింగ్ ఫీచర్'ఐ ట్రాకింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారు తమ కళ్ళతోనే ఐప్యాడ్లు, ఐఫోన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా శారీరక వైకల్యాలు ఉన్న వినియోగదారుల కోసం రూపొందించినట్లు సమాచారం.ఎలా పని చేస్తుందంటే?ఐ ట్రాకింగ్ను సెటప్ చేయడానికి ముందువైపు కెమెరా ఉపయోగించబడుతుంది.ఐ ట్రాకింగ్ కోసం ఉపయోగించిన మొత్తం డేటా మీ డివైస్లో ఉంటుంది. ఇది Appleతో కూడా భాగస్వామ్యం చేయదు. కాబట్టి సమాచారం భద్రంగా ఉంటుంది.ఐప్యాడోస్, iOSలోని అన్ని యాప్లతో ఐ ట్రాకింగ్ పని చేస్తుంది. కాబట్టి అడిషినల్ హార్డ్వేర్ లేదా యాక్సెసరీలు అవసరం లేదు.ఎలా ఉపయోగపడుతుందంటే?ఐ ట్రాకింగ్ సాయంతో యాప్లోని వివిధ భాగాలను చూడటం ద్వారా వాటి ద్వారా నావిగేట్ చేయవచ్చు.ఈ ఎలిమెంట్లను యాక్టివేట్ చేయడానికి డ్వెల్ కంట్రోల్ని ఉపయోగించాల్సి ఉంటుంది.ఐ ట్రాకింగ్ వినియోగదారులు భౌతిక స్పర్శ అవసరం లేకుండా (టచ్ చేయకుండా) కేవలం వారి కళ్లను ఉపయోగించి బటన్లను నొక్కడం, స్వైపింగ్ చేయడం వంటివి చేయవచ్చు. -
WhatsApp Chat Filters: వాట్సాప్లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇదే ఫీచర్ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్లో యాక్టివ్గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇన్స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
థ్రెడ్స్లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్షాట్లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్క్యామ్లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్క్యామ్లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్క్యామ్లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్కెమెరా ఫీచర్ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్టాప్, మ్యాక్బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్ని పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్క్యామ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను
WhatsApp Channels: మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మోస్ట్ఎవైటెడ్ ఫీచర్ను ఇండియాలో లాంచ్ చేసింది. 'ఛానెల్స్' అనే కొత్త టూల్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్-వే బ్రాడ్కాస్ట్ టూల్ ఛానెల్ల ఫీచర్తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవ్వొచ్చు. యూజర్లు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్ నుంచి కీలకమైన అప్డేట్లను పొందవచ్చు. 9 దేశాలలో ఛానెల్లను సృష్టించే ,అనుసరించే సామర్థ్యాన్ని విడుదల చేసిన తర్వాత, iOS, Android , డెస్క్టాప్ కోసం WhatsApp తాజా వెర్షన్ను ఇన్స్టాల్ చేసిన వినియోగదారులు ఈ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ బుధవారం ప్రకటించారు. వేలాది కొత్త ఛానెల్లను జోడిస్తున్నాం మీరు కొత్త 'అప్డేట్లు' ట్యాబ్లో ఛానెల్లను కనుగొనవచ్చు అంటూ ఫేస్బుక్లో పోస్ట్లో వెల్లడించారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు) మీ సొంత వాట్సాప్ ఛానల్ స్టార్ట్ అయిన తరువాత ఇప్పటికే వాట్సాప్లో ప్రముఖ ప్రముఖులు, క్రీడా కారులు కళాకారులు, ఇన్ఫ్యూయర్స్, సంస్థలను ఫాలో అవ్వవచ్చు. ఉదాహరణకు, భారత క్రికెట్ జట్టు, ప్రభాస్, క్రేజీ స్టార్లు, కత్రినా కైఫ్, దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్, నేహా కక్కర్ ఇలా మనకిష్టమైన వారిని ఫాలో అవ్వొచ్చు. అంతెందుకు వాట్సాప్ యజమాని మార్క్ జుకర్బర్గ్ను కూడా అనుసరించ వచ్చు. దేశం ఆధారంగా స్వయంచాలకంగా ఫిల్టర్ అయిన ఛానెల్లను ఎంచుకోవచ్చు. సెర్చ్ చేయవచ్చు.మీ ఫాలోవర్స్ను బట్టి ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్, జనాదరణ పొందిన ఛానెల్లను కూడా వీక్షించవచ్చు. ఇప్పటివరకు చిలీ కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్ , ఉక్రెయిన్లలో ఈ ఛానెల్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. WhatsApp ఛానెల్లను ఎలా ఉపయోగించాలి ♦ మీ WhatsApp యాప్ని Google Play Store లేదా App Store నుండి తాజా వెర్షన్కి అప్డేట్ చేయండి. ♦ WhatsAppఓపెన్ చేసి, స్క్రీన్ దిగువన ఉన్న అప్డేట్స్ ట్యాబ్పై నొక్కండి. ఇక్కడ ఛానెల్స్ లిస్ట్కనిపిస్తుంది. ♦ ఫాలో అవ్వాలనుకున్న సంబంధిత ఛానెల్ని పక్కన ఉన్న ‘+’ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్, ప్రొఫైల్ , ఛానెల్ పేరు కూడా చూడవచ్చు. ♦ ఛానెల్ అప్డేట్ రియాక్షన్ కోసం మెసేజ్ మీద ప్రెస్ చేసి, నొక్కి పట్టుకుంటే చాలు. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) WhatsApp ఛానెల్ కొత్త అప్డేట్ ♦ మెరుగైన డైరెక్టరీ: వినియోగదారులు ఇప్పుడు అధునాతన ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా కొత్త ఛానెల్లను అన్వేషించవచ్చు. ♦ రియాక్షన్స్ ఛానెల్లలో షేర్ అయిన కంటెంట్కు సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ♦ మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్: ఫార్వార్డ్ చేసిన మెసేజ్లు ఛానెల్కి లింక్ బ్యాంక్ అవుతాయి. యూజర్లకు జాయిన్ కావడం ఈజీ అవుతుంది. ♦ డిలీట్ అప్డేట్ ఫర్ ఎవ్రీ వన్: ఛానెల్ క్రియేటర్లకు 30 రోజులలోపు మెసేజ్ను తొలగించే సామర్థ్యాన్ని అందరికీ ఉంటుంది. Mark Zuckerberg announced a global launch for WhatsApp Channels!https://t.co/UcLJJubMo8 pic.twitter.com/LjhzAAvqZ3 — WABetaInfo (@WABetaInfo) September 13, 2023 -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్లో లేఆఫ్లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్కి మారే పని లేకుండా ఈ నోట్స్లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్ను జూమ్ మీటింగ్లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ను, టూల్స్ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్ఫారమ్లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్లను, లింక్లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
Google Flights: అతి తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలా? గూగుల్ కొత్త ఫీచర్ చూడండి!
Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు. ఎలా పనిచేస్తుంది చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్తో పైలట్ ప్రాజెక్ట్ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. క్రిస్మస్ ట్రిప్కోసం ప్లాన్ చేస్తే..? గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ. అమెరికా నుండి యూరోప్ట్రిప్కు బెస్ట్ టైం సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది.. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్ఫారమ్లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్ఫారమ్లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్ను వివరించే స్క్రీన్షాట్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్కు కూడా అందుతుంది. -
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
ఫోన్పే యూజర్లకు గుడ్న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో
కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్ను ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్తో వీడియో కాల్స్ను చేసుకునే ఫీచర్ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ విండోస్లోని కొంతమంది బీటా టెస్టర్లకు వీడియో కాల్ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ టీవీల్లో కొత్త మోడ్.. ఆ రంగులు చూడలేని వారి కోసం..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్లో సీ కలర్స్ (SeeColors) అనే కొత్త మోడ్ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సీ కలర్స్ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్ సర్దుబాటు చేస్తుంది. అందుబాటులో సాఫ్ట్వేర్ అప్డేట్ వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్ ఒక అప్లికేషన్గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్పై ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్ కంపెనీ. ఇప్పటికే 2023 మోడల్ శాంసంగ్ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్ ఫీచర్ను జోడించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్ మోడ్కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్ను కూడా శాంసంగ్ పొందింది. ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్లను ఆటోమేటిక్గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
మస్క్ సంచలనం.. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు!
ట్విటర్ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్లో కాల్స్, మెసేజ్లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు, లాంగ్ ఫార్మ్ ట్విట్లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెటా తరహాలో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్విటర్లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను బాస్గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్లను గుర్తించి ఆటోమేటిక్గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం మొబైల్ లేకుండా మనకు రోజే గడవదు, అందులోనూ వాట్సాప్, ఫేస్బుక్ వంటివి లేకుండా కాలం ముందుకు సాగదు. అయితే మనకు నచ్చిన వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో స్టేటస్లగా పెట్టుకోవడం సర్వసాధారణమయిపోయింది. అయితే ఇప్పటివరకు వాట్సాప్లో వేరుగా ఫేస్బుక్లో వేరుగా స్టేటస్లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి పద్దతికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది. వాట్సాప్ స్టేటస్ను ఫేస్బుక్లో స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్లో షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలి. అలా కాకుండా వాట్సాప్ తీసుకు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఒకే సమయంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మన వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్లో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్ప్ట్, ఓన్లీ షేర్ విత్ మీ అనే మూడు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే త్వరలో వాటి కింద ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ కూడా రానుంది. వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) వాట్సాప్లో రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మనం ప్రత్యేకంగా ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రెండింటిలోనూ స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్ఫోన్కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్గా పనిచేసి ఫోన్ హీట్ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్.. ఇక కాల్స్ చేయడం మరింత ఈజీ!
వాట్సాప్ కాల్స్ చేసే వారి కోసం అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది దాని యాజమాన్య సంస్థ మెటా. తరచూ వాట్సాప్ ద్వారా కాల్స్ చేసే వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా కాలింగ్ షార్ట్కట్ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంపై కసరత్తు చేస్తోంది. దీని వల్ల మనం ప్రతిసారి కాంటాక్ట్స్ లిస్ట్లోకి వెళ్లాల్సిన పని లేకుండా తరచూ చేసే కాల్స్కు హోం స్క్రీన్పై షార్ట్కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో నేరుగా కాల్స్ చేసేవారితో పాటు వాట్సాప్ ద్వారా కాల్స్ చేసేవారు ఎక్కువయ్యారు. వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు చాలామంది వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం మెటా సంస్థ ఈ ఫీచర్ను తీసుకొస్తోంది. మనం ఎవరితో అయితే తరచుగా కాల్స్ చేస్తుంటామో దానికి సంబంధించిన కాంటాక్ట్కు షార్ట్కట్ క్రియేట్ చేయగానే అది ఆటోమేటిక్గా హోం స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ షార్ట్కట్ను అలా ట్యాప్ చేయగానే వెంటనే కాల్ వెళ్తుంది. ఈ ఫీచర్.. రానున్న అప్డేట్తో అందుబాటులోకి రానుంది. నియోగదారులు వాట్సాప్ ద్వారా ఫొటోలను ఒరిజినల్ క్వాలిటీతో పంపే సౌలభ్యాన్ని సైతం తీసుకొస్తున్నట్లు యాజమాన్యం గత నెలలో ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము పంపే ఫొటోల క్వాలిటీని వారికి నచ్చినట్లుగా కంట్రోల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్లో మెసేజ్ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్ను ఎవరూ చూడకుండా సీక్రెట్గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ను పరీక్షిస్తుండటం గమనార్హం. -
ట్రూ కాలర్ లో కొత్త ఫీచర్
-
వాట్సాప్ మరో అద్భుత ఫీచర్: కంపానియన్ మోడ్, అంటే ఏంటంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం తాజాగా మరో సూపర్ ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. ఒకే నంబర్తో ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లతోపాటు, మరో రెండు డివైస్లలో వాట్సాప్ను యాక్సెస్కి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా ‘కంపానియన్ మోడ్’ అనే ఫీచర్ని పరీక్షిస్తోంది. (ElonMusk క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్ను కొన్ని బీటా టెస్టర్లకు విడుదల చేసింది. కొంతమంది బీటా టెస్టర్ల కోసం ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాద మొబైల్, డెస్క్టాప్లో ఏకకాలంలో వాట్సాప్ను ఉపయోగించవచ్చని తెలిపింది. 'లింక్ డివైస్' ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్ఫోన్ను లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. మరొక స్మార్ట్ఫోన్ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్ చూసుకోవడం, సమాధానాలివ్వడంతోపాటు కాల్స్ను చేసుకోవచ్చు. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్ఫోన్లు, ఒక టాబ్లెట్ ,ఒక డెస్క్టాప్కి లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్టాప్లో వాట్సాప్ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే. (ప్రతీ వాట్సాప్ గ్రూపునకు కూడా 10 డాలర్లు పెడితే!?) కాగా వాట్సాప్కు భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.ఇటీవల గ్రూప్లో పాల్గొనే వారి సంఖ్యను 1024కి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక గ్రూపు పలు గ్రూపులను రూపొందించడానికి యూజర్లకు అనుమతిస్తుంది. ఇందులో ఒక గ్రూపు గరిష్టంగా 12 గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చు. (వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!) -
క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ టేకోవర్ తరువాత అనూహ్య సంస్కరణలు చేపడుతున్న ట్విటర్ కొత్త బాస్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సరికొత్త అంశాన్ని ప్రకటించారు. ఇకపై తమ ప్లాట్ఫాంలో ఆయా సంస్థలను సర్టిఫై చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు మస్క్ కొత్త ఫీచర్ను ప్రకటించారు. ట్విటర్ ద్వారా కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ప్రకటించిన మస్క్ ఏయే ట్విటర్ అకౌంట్స్, ఏ యే సంస్థలకు అనుసంధానంగా ఉన్నాయో గుర్తించేందుకు ఆయా సంస్థలను అనుమతి నిస్తుందని ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ఫీచర్ త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు. దీనిపై ఒక యూజర్ స్పందిస్తూ.. అంటే ఏ ఖాతాదారుడు ఏ ఆర్గనైజేషన్కు చెందినవాడో ట్విటర్ డిసైడ్ చేస్తుందన్నమాట అని ప్రశ్నించారు. కచ్చితంగా.. ట్విటరే తుది మధ్యవర్తిగా ఉంటుంది... అంతకుమించి వేరే మార్గం లేదు అంటూనే సూచనలు సలహాలను ఆహ్వానిస్తున్నాని పేర్కొన్నారు. అలాగే ఇటీవల ట్విటర్ను సొంతం చేసుకోవడం, అటు ఆటోమేకర్ టెస్లా చీఫ్గా ఇలా రెండు సంస్థలకు సీఈవోగా ఉంటున్న క్రమంలో దీని ప్రభావం టెస్లాపై పడనుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఉదయం నుండి రాత్రి వరకు, వారంలో ఏడు రోజులూ క్షణం తీరికలేకుండా, ఎడ తెగకుండా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. Rolling out soon, Twitter will enable organizations to identify which other Twitter accounts are actually associated with them — Elon Musk (@elonmusk) November 13, 2022 అయితే 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తి చేసిన టెస్లా సీఈవో ఎలాన్మస్క్ వెను వెంటనే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కీలక ఎగ్జిక్యూటివ్లపై వేటు, బోర్డు రద్దు, కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన, బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు లాంటి చర్యలను ప్రకటించారు. బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజుపై వెనక్కి తగ్గిన మస్క్ బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే వారం నుంచి బహుశా తీసుకురావచ్చునని ట్వీట్ చేసిన పూర్తిఫీజు ఎంత నిర్ణయించిందీ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అధికారిక హ్యాండిల్స్ను ఎలా గుర్తించేది వెల్లడించలేదు. మరోవైపు కొన్ని దేశాల్లో ట్విటర్ స్లోగా ఉండటంపై మస్క్ క్షమాపణలు చెప్పారు. -
స్నాప్చాట్ గుడ్ న్యూస్: వారికి నెలకు రూ. 2 లక్షలు
న్యూఢిల్లీ: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పాపులర్ ఫొటో మెసేజింగ్ ట్యాప్ స్నాప్చాట్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ను ప్రకటించింది. భారతదేశంలో స్నాప్చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ను ప్రారంభించినట్లు స్నాప్చాట్ మాతృ సంస్థ స్నాప్మంగళవారం ప్రకటించింది. ఇందుకు డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ డిస్ట్రోకిడ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా నెలకు 20 మంది బడ్డింగ్ ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 2,500 (దాదాపు రూ. 2,04,800) ప్రోత్సాహాన్ని అందించనుంది. కొత్తగా ప్రకటించిన స్నాప్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ ద్వారా దేశంలోని అభివృద్ధి చెందుతున్న కళాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. నెలకు మొత్తంగా 50వేల డాలర్ల (దాదాపు రూ.41 లక్షలు) వరకు గ్రాంట్లను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తు కళాకారులే లక్ష్యంగా ప్లాట్ఫారమ్లోని స్నాప్లు, ఇతర క్రియేషన్లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించేలా సౌండ్స్ ఫీచర్ను తీసుకొచ్చింది. నవంబర్ మధ్య నాటికి ఈ గ్రాంట్ ప్రోగ్రాం షురూ అవుతుందని అంచనా. స్నాప్చాట్ సౌండ్స్ ఫీచర్ మ్యూజిక్ వీడియోలు 2.7 బిలియన్లకు పైగా క్రియేట్ అయ్యాయని, వీటిని 183 బిలియన్లకు పైగా వీక్షించారని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో స్నాప్చాట్+సబ్స్క్రిప్షన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్లు ప్రత్యేకమైన ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ ఫీచర్లకు ముందస్తుగానే యాక్సెస్ పొందొచ్చు. అంతేకాదు దేశంలో స్నాప్చాట్ ప్లస్ నెలవారీ సబ్స్క్రిప్షన్ను రూ.49గా నిర్ణయించగా, యూఎస్లో ప్లస్ సర్వీస్కు నెలకు 3.99 డాలర్లు ( సుమారు రూ.330) వసూలు చేస్తోంది. -
ఇన్ స్టాగ్రామ్లో అదిరిపోయే ఫీచర్
ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. మార్కెట్లో పోటీని తట్టుకునేలా మాతృ సంస్థ మెటా ఇన్ స్ట్రాగ్రామ్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంది. తాజాగా ‘నోట్స్’ పేరుతో ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో ఇన్ స్టా అకౌంట్ డైరెక్ట్ మెసేజ్ (డీఎం) ఏరియాలో ఏదైనా ఒక అంశంపై 60 క్యారక్టర్స్తో టెక్ట్స్ అప్డేట్ చేయొచ్చు. ఆ టెక్ట్స్ను యూజర్లు వీక్షించే సౌలభ్యం కలగనుండగా..24 గంటల తర్వాత డీఎంలో ఉన్న టెక్ట్స్ డిజ్ అప్పియర్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో నోట్ను ఎలా యాక్సెస్ చేయాలంటే స్టెప్ 1 : మీ ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఇన్ స్టాగ్రామ్ను ఓపెన్ చేయండి స్టెప్ 2 : చాట్ పేజీని యాక్సెస్ చేయడానికి, ఎడమవైపుకు స్వైప్ చేయండి. లేదంటే రైట్ సైడ్ కార్నర్లో చాట్ బటన్పై ట్యాప్ చేయండి. స్టెప్3 : చాట్ బటన్పై ట్యాప్ చేస్తే మీకు సెర్చ్ ట్యాబ్లో రకరకాల ఆప్షన్లకు మీకు కనిపిస్తాయి. అందులో ‘యువర్ నోట్’ ఆప్షన్ను క్లిక్ చేసి అందులో మీరు ఏ అంశం గురించి రాయాలనుకుంటున్నారో టైప్ చేసి సేవ్ చేయండి -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం
ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లతో అనతి కాలంలోనే కోట్లాది యూజర్లను సంపాదించుకున్న సంగతి తెలసిందే. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో తమ వినియోగదారులకు సేవలందించడంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఈ యాప్లో మరో కొత్త ఫీచర్ని జతచేస్తోంది. యూజర్లకు బెస్ట్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్ని వాట్సాప్ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ కోసం కాల్ లింక్ల ఫీచర్ను విడుదల చేసింది. యూజర్లు కేవలం ఒక ట్యాప్లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, యూజర్లు కాల్స్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న ‘కాల్ లింక్లు’ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో లేదా ఆడియో కాల్ లింక్ను క్రియేట్ చేసుకుని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్లను ఉపయోగించేందకు యూజర్లు వారి వాట్సాప్ యాప్ను లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్లో ఈ కాల్ లింక్ల ఫీచర్ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్బర్గ్ మాట్లాడుతూ.. 32 మంది వ్యక్తుల కోసం సేఫ్ ఎన్క్రిప్టెడ్ వీడియో కాలింగ్ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్ఫాంలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. "ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
మరో బంపర్ ఫీచర్ను లాంచ్ చేయనున్న యూట్యూబ్
ముంబై: ప్రముఖ వీడియోషేరింగ్ ప్లాట్ఫామ్, ఎంటర్టైన్మెంట్ కింగ్ యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్ను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కీలక అప్డేట్స్తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబ్ త్వరలోనే YouTube స్ట్రీమింగ్ వీడియో సర్వీస్ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించి పలు ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కంపెనీ చర్చలను మళ్లీ ప్రారంభించిందని సమాచారం. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం ఆల్ఫాబెట్కుచెందిన యూట్యూబ్ ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించాలని యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. గత 18 నెలలుగా పనిలో ఉన్న సంస్థ పలు సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని పేర్కొంది. "ఛానల్ స్టోర్" తో పేరుతో పిలుస్తున్న ఈ చర్చలు పూర్తైన తరువాత ఈ సర్వీసు అందుబాటులోకి రావచ్చని తెలిపింది. కాగా ఈ వారం ప్రారంభంలో, వాల్మార్ట్ తన సభ్యత్వ సేవలో స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.కే బుల్, శాటిలైట్ టీవీ యూజర్లు సబ్స్క్రిప్షన్-ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు మారుతున్న తరుణంలో యూట్యూబ్లో స్ట్రీమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. తద్వారా రోకు, ఆపిల్ లాంటి కంపెనీల సరసన చేరనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యూట్యూబ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చదవండి: వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం! -
డిజిట్ ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్ ఆన్ ఫీచర్ ..
ముంబై: ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ గో డిజిట్ తాజాగా వాహన బీమా పాలసీలకు సంబంధించి ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్–ఆన్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. తక్కువగా డ్రైవింగ్ చేసే కస్టమర్లు ఈ యాడ్–ఆన్తో తక్కువ ప్రీమియం చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పట్నుంచి సగటున సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవరికైనా ఈ డిస్కౌంటు వర్తిస్తుందని పేర్కొంది. ఓడోమీటర్ రీడింగ్, టెలీమాటిక్స్ డేటా అలాగే వార్షిక కిలోమీటర్లు మొదలైన వివరాల ఆధారంగా డిస్కౌంటును డిజిట్ లెక్కిస్తుంది. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో గరిష్టంగా 25 శాతం వరకూ డిస్కౌంటు పొందవచ్చు. టెక్నాలజీ ఆధారిత వీడియో ప్రీ ఇన్స్పెక్షన్ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే పాలసీ జారీ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. కారును తక్కువగానే వినియోగిస్తున్నప్పటికీ .. ఎక్కువగా వినియోగించేవారితో సమానంగా అధిక ప్రీమియంలు చెల్లించే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఆ ఫీచర్
సాక్షి,ముంబై: మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్ను దాచిపెట్టేలా చేసే ఫీచర్ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తాము ఆన్లైన్లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఎప్పటికపుడు తన ప్లాట్ ఫామ్ను అప్డేట్ చేస్తూ, కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉండేందుకు పలు ఫీచర్లను అందిస్తోందివాట్సాప్. తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ను ఎంచుకోవడం ఎలా? Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్ సీన్ అనే దాంట్లోనే ఈ ఫీచర్ కూడా ఉండనుంది. లాస్ట్ స్టీన్ ఆప్షన్ ఎనేబుల్, డిసేబుల్ చేసుకునే విధంగానే ఈ 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఆప్షన్ను పొందుపర్చనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు. అలాగే Apple iOS వినియోగదారుకు సంబంధించి ఈ ఫీచర్పై గత నెలలో పరీక్ష దశలో ఉంది. కాగా ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ యూజర్లు వారి మొత్తం చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్, ఐవోఎస్కినుంచి ఆండ్రాయిడ్కి ఈజీగా బదిలీ చేసేలా కొత్త ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
ఇన్స్టా యూజర్లకి గుడ్ న్యూస్.. కిరాక్ ఫీచర్ రాబోతోంది!
ఎప్పటికప్పుడు లేటస్ట్ అప్డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఇన్స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ను తీసుకురానుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్, వీడియో రీల్స్, చాటింగ్ వంటివాటితో యూజర్లను తనవైపు తిప్పుకున్న ఇన్స్టా తాజాగా మ్యాప్స్ ఫీచర్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చు. ఇన్స్టా ఐజీ(IG)లో కొత్తగా మ్యాప్ ఫీచర్ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్ చేసిన పోస్ట్లను మాత్రమే చూడగలిగేవారు. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదు. అయితే ఇన్స్టాలో రాబోయే లేటెస్ట్ అప్డేట్ మ్యాప్ ఫీచర్ ద్వారా లోకేషన్ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు. ఇన్స్టాగ్రామ్ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్ ఫీచర్ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్లు, బార్లు, పార్కులు లేదా ఇతర స్థలాలను చూడవచ్చు. చదవండి: OnePlus 10T 5G: అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే! -
వాహనదారులకు గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే ఛార్జీలు ఎంతో తెలిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో గూగుల్ టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. భారత్, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలకు చెందిన 2వేల రూట్లలో ఈ ఫీచర్లు ప్రారంభించింది. టోల్ ధరలు ఎలా తెలుసుకోవాలంటే వాహనదారులు టోల్ ధరలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన రూట్లు,షార్ట్ కట్లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరల డిస్ప్లే అవుతాయి. అంతే కాదు ఆ రూట్లో ఉన్న అన్నీ టోల్ బూత్ ధరల్ని చూపుతుంది. కాగా, గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కర్ణాటకలో చాలా రోడ్లపై డిఫాల్ట్గా ఆన్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ట్విటర్ కొత్త ఫీచర్: ‘సర్కిల్’ ఎలా వాడాలి?
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్ కొత్త ఫీచర్ను పరిచయం చేయనుంది. తన యూజర్ల సౌకర్యం నిమిత్తం ఈ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. దీని పేరును ‘సర్కిల్’ గా పిలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉన్న మాదిరిగా ట్విటర్ యూజర్ తన ట్వీట్ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో నిర్ణయించుకునే అవకాశాశాన్ని కల్పించనుంది. క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్ ను పోలిన దానినే ట్విటర్లో ‘సర్కిల్ పేరుతొ తీసుకొస్తోంది. పరిమితంగా ఆండ్రాయిడ్, ఐవోస్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ట్విటర్ తన బ్లాగ్ పోస్ట్లో వివరించింది. నిర్దిష్ట ట్వీట్లలో కొన్నింటిని స్నేహితులు మాత్రమే చూసే విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్కిల్లో ఉన్నవారికి మాత్రమే సంబంధిత ట్వీట్లకు రిప్లై ఇవ్వడం, లైక్, రీట్విట్ లాంటి వాటికి అవకాశం ఉంటుందని ట్విటర్ పేర్కొంది. సర్కిల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఈ సర్కిల్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఎలా యూజ్ చేయాలంటే ట్విటర్ యాప్లో మెయిన్ మెనూలో ట్వీట్ కంపోజర్ క్లిక్ చేయాలి. ఇక్కడ ట్విటర్ సర్కిల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత సెలెక్ట్ ఎవ్రీవన్ లేదా మన కిష్టమైన వ్యక్తులను సెలక్ట్ చేసుకొని, డన్ క్లిక్ చేయాలి. ఒకవేళ లిస్ట్ లోని వారిని ఎవరినైనా వద్దు అనుకుంటే రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. -
వాట్సాప్లో ఇకపై ఇలా కూడా నడుస్తుంది..! యూజర్లకు భారీ ఊరట..!
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్తో ముందుకురానుంది.తాజాగా మరో అద్భుతమైన ఫీచర్తో వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్తో యూజర్లకు భారీ ఊరట కల్గనుంది. ఇకపై అలా వినొచ్చు..! వాట్సాప్లో టెక్ట్స్ మెసేజ్స్తో పాటుగా వాయిస్ మెసేజ్స్ను కూడా పంపవచ్చుననే విషయం మనందరికీ తెలిసిందే. సదరు యూజరు పంపిన వాయిస్ మెసేజ్ను డౌన్లోడ్ చేసిన తరువాత ప్లే బటన్ క్లిక్ చేయగానే ఆయా వాయిస్ మెసేజ్ను వినగలుగుతాం. ఆయా యూజరు చాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ వాయిస్ మెసేజ్ను వినే అవకాశం ఉంది. యూజరు చాట్ నుంచి బ్యాక్ వస్తే...వెంటనే ఆయా వాయిస్ మెసేజ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితిని మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. దీనిని దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ త్వరలోనే గ్లోబల్ ఆడియో ప్లేయర్ ఫీచర్ను అందుబాటులోకి తీసురానుంది. ఈ ఫీచర్ సహాయంతో అప్లికేషన్లో ఎక్కడైనా వాయిస్ మెసేజ్లను వినవచ్చును. తొలుత వారికే..! ప్రాథమికంగా ఈ కొత్త ఫీచర్ iOS ప్లాట్ఫారమ్లోని నిర్దిష్ట బీటా టెస్టర్లకు అందించబడుతోంది. తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ తాజా ఫీచర్ను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్, WABetaInfo గుర్తించింది. దీంతో పాటుగా వాయిస్ సందేశాలను పాజ్, ప్రివ్యూ వంటి మరిన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ జోడించనున్నట్లు సమాచారం. The global audio player can be used to listen to voice notes wherever you are in the application. It has been recently released to certain iOS beta testers, and it's coming to WhatsApp beta for Android soon. pic.twitter.com/Cvf45CyQ8I — WABetaInfo (@WABetaInfo) January 29, 2022 చదవండి: వాట్సాప్ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్లో సమస్య..వెంటనే ఇలా చేయండి..! -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్లైన్లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్గా హోం లొకేషన్గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. అదిరిపోయిందిగా !
Whatsapp Message Reaction Feature: ఒక చిత్రం వందపదాల భావాన్ని చెబుతుంది అంటారు. సెల్ఫోన్ విషయానికి వస్తే...మాట్లాడటానికి టైమ్ లేకపోతే మెసేజ్ పెడతాం. మెసేజ్ కూడా పెట్టేంత టైమ్ లేకపోతే ఒక ఇమోజీ చిత్రాన్ని పంపిస్తే సరిపోతుంది. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ యూజర్స్ కోసం ‘న్యూ మెసేజ్ రియాక్షన్ ఫీచర్’ను తీసుకురానుంది. లైక్, లవ్ (హార్ట్), లాఫ్, సర్ప్రైజ్, శాడ్, థ్యాంక్యూ...ఈ ఆరు ఇమోజీలను కొత్త ఫీచర్లో ఉపయోగించుకోవచ్చు. నిజానికి ఈ ఫీచర్ సోషల్ మీడియా యాప్స్కు కొత్తేమీ కాదు. అయితే వాట్సాప్కు మాత్రం ఇది మేజర్ అప్డెట్గా చెబుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీవ్రపోటీ నెలకొంది. సరికొత్త ఫీచర్లతో రోజుకో కొత్త యాప్ వస్తోంది. ఎన్ని కొత్త యాప్లు వచ్చినా యూజర్ బేస్ విషయంలో వాట్సాప్కి పోటీ ఇవ్వడం కష్టం. అయితే ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ కాకుండా యూజర్లను కోల్పోవడానికి ఎంతో సేపు పట్టదు. దీంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త ఫీచర్లు యాడ్ చేస్తోంది. -
వాట్సాప్ కొత్త ఫీచర్..! ‘మెసేజ్ వస్తే...మీ ఫోటో కన్పిస్తుంది..!’
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్తో ముందుకురానుంది.తాజాగా మరో అద్భుతమైన ఫీచర్తో వాట్సాప్ రానుంది. మెసేజ్ వస్తే..కన్పిస్తారు..! సాధారణంగా యూజర్లు ఇతరులకు మెసేజ్ చేయగానే ఆయా రెసిపెంట్స్కు నోటిఫికేషన్ బార్లో ‘ యూ హవ్ ఏ న్యూ మెసేజ్’ అంటూ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ తెస్తోన్న కొత్త ఫీచర్తో ఇకపై ఇతరులు మెసేజ్ చేయగానే ఆయా వ్యక్తుల ప్రొఫైల్ ఫోటో నోటిఫికేషన్ బార్లో కన్పించనుంది. ఈ ఫీచర్ తొలుత ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నోటిఫికేషన్ ఫోటో ఫీచర్ను టెస్ట్ చేస్తోన్నట్లు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo పేర్కొంది. అన్నీ పరీక్షలు పూర్తైన తరువాత ఐవోఎస్ యూజర్లతో పాటుగా, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. చదవండి: వాట్సాప్ యూజర్లకు అలర్ట్..! ‘సారీ..మీరు ఎవరు..!’ అంటూ అమాయకంగా మెసేజ్..! తరువాత.. -
వాట్సాప్లో మూడో బ్లూటిక్ ఆప్షన్.. క్లారిటీ
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈలోపు మరో కొత్త ఫీచర్ అంశం తెర మీదకు వచ్చింది. మూడో బ్లూటిక్ ఆప్షన్ను తీసుకొచ్చే యోచనలో ఉందంటూ కొన్ని టెక్ బ్లాగులు రాసుకొచ్చాయి. దీనిపై వాట్సాప్ బ్లాగ్ స్పందించింది. మూడో టిక్ దేనికంటే.. సాధారణంగా వాట్సాప్లో ఎవరికైనా సందేశాలు పంపినప్పుడు.. సెండ్ అయ్యాక సింగిల్ గ్రేటిక్, అవతలి వాళ్లకు రిసీవ్ అయినా, లేదంటే ప్రైవసీలో ఉండి ఆ సందేశాన్ని చూసినా డబుల్ గ్రేటిక్ పడుతుంది. ఒకవేళ ప్రైవసీలో లేకుండా చూస్తే డబుల్ బ్లూటిక్ పడుతుంది. అయితే యూజర్ పంపిన మెసేజ్ను అవతలి వాళ్లు స్క్రీన్ షాట్ తీస్తే మూడో టిక్ పడుతుందని, తద్వారా అవతలివాళ్లకు తెలిసిపోతుందనేది ఆ బ్లాగ్ కథనాల సారాంశం. అయితే వాట్సాప్ అప్డేట్ ఫీచర్లపై పక్కాగా అందించే అధికారిక బ్లాగ్ బేటాఇన్ఫో ఈ కథనాల్ని ఫేక్గా తేల్చేసింది. మూడో టిక్ ఆప్షన్ తేవట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెకానిజం కోసం వాట్సాప్ ఓనర్కంపెనీ మెటా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని స్పష్టత ఇచ్చింది. చదవండి: గ్రూప్లో పెట్టిన మెసేజ్కి అడ్మిన్ బాధ్యుడు కాదు! -
గూగుల్ మ్యాప్స్లోనే కాదు..వాట్సాప్లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..?
WhatsApp To Let You Search Hotels, Grocery, Clothing Stores In The App: స్మార్ట్ఫోన్ రాకతో పలు విషయాలు మరింత సులువుగా మారాయి. వివిధ యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనకు తెలియని అడ్రస్ను, దగ్గరలోని షాపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ తీసుకొచ్చిన యాప్ గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడింది. యూజర్లకే కాకుండా ఆయా వాణిజ్య , వర్తక వ్యాపారులకు కూడా గూగుల్ మ్యాప్స్ సహాయపడింది. కాగా గూగుల్ మ్యాప్స్ తరహా ఫీచర్ను వాట్సాప్ కూడా త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నాలను చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ తరహాలో వెతికేయెచ్చు..! మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెస్ యాప్ను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాట్సాప్ బిజినెస్ యాప్లో ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు రిజిస్టర్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సమీపంలో ఆయా వ్యాపారుల గురించి తెలియజేసే సెర్చ్ ఆప్షన్ను వాట్సాప్లో రానుంది. బిజినెస్ నియర్ బై..! బ్రెజిల్లోని సావో పాలో నగరంలో ఇప్పటికే కొంతమంది వ్యక్తుల కోసం ‘బిజినెస్ నియర్బై’ ఫీచర్ను వాట్సాప్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది భవిష్యత్తులో యూజర్ల అందరికీ వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ ట్రాకర్, డబ్ల్యూబెటాఇన్ఫో పేర్కొంది. ఈ కొత్త కూల్ ఫీచర్ ఐవోస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ సహయంతో యూజర్లు దగ్గరలోని హోటళ్లు,కిరాణా, బట్టల దుకాణాలు మొదలైన వాటిని వెతకవచ్చును. చదవండి: ఇన్స్టాగ్రామ్లో మరో సరికొత్త ఫీచర్.. హైలెట్స్ ఆఫ్ ది ఇయర్..! -
ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త..! ఇప్పుడు మరింత సులువుగా..
సోషల్మీడియా యాప్స్లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్గా ఫేస్బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్బుక్ సొంతం. యూజర్లకు మరింత దగ్గరవ్వడం కోసం ఎల్లప్పుడూ సరికొత్త అప్డేట్స్తో ఫేస్బుక్ వస్తోంది. తాజాగా ఫేస్బుక్ మరో సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. ఇప్పుడు మరింత సులభం..! ఫేస్బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ ఐనా ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్ను ఫేస్బుక్ యాడ్ చేసింది. దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను పొందేందుకు తోడ్పడనుంది. లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉంది. ఫేస్బుక్ సపోర్ట్పై క్లిక్ చేస్తే ఫేస్బుక్కు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్తో యూజర్లు చాట్ చేయవచ్చును. మరిన్ని సాధనాలు..! ఫేస్బుక్ తన బ్లాగ్లో అశ్లీలత కీవర్డ్ను నిరోధించే సాధనాలు, సస్పెండ్/బ్యానింగ్ నియంత్రణలతో సహా అనేక కామెంట్ మోడరేషన్ సాధనాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేస్బుక్ యూజర్ల కోసం ప్రత్యేక భద్రతా సాధనాలను ప్రారంభించడంతో పాటుగా, వారి ఖాతాల నుంచి లాగ్ అవుట్ ఐనా వ్యక్తుల కోసం లైవ్ చాట్ సపోర్ట్ సిస్టమ్ను కూడా ప్రకటించింది. చదవండి: గూగుల్ కీలక ప్రకటన.. బిల్లింగ్ విధానానికి మారేందుకు గడువు పెంపు -
పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..
ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి, ఒక గ్రూపులో పెట్టాల్సిన పోస్ట్ మరో గ్రూపులో.. వేయడం చాలామందికి జరిగేదే!. పరధ్యానంలో, కంగారులో చేసే ఈ పొరపాటు.. ఒక్కోసారి విపరీతాలకు సైతం దారితీస్తుంటాయి. ఇదే విధంగా చాలా మంది వాట్సాప్లో ఏమరుపాటులో స్టేటస్లు కూడా అప్డేట్ చేస్తుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో పనికొచ్చే ఫీచర్ను వాట్సాప్ తీసుకురాబోతోంది. వాట్సాప్ ఈమధ్య మల్టీ డివైస్ సపోర్ట్, గ్రూప్స్ కాల్స్ నడుస్తుండగా.. జాయిన్ కాగలిగే ఫీచర్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సాప్. స్టేటస్ విషయంలో ‘అండూ బటన్’ను తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా యాక్సిడెంటల్గా ఏదైనా స్టేటస్లు అప్డేట్ చేస్తే.. వెంటనే దానిని తొలగించొచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ స్టేటస్ పొరపాటున పెడితే.. డిలీట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. స్టేటస్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చే మూడు చుక్కల మెనూ మీద క్లిక్ చేశాకే డిలీట్ ఆప్షన్ను క్లిక్ చేసి చేయొచ్చు. కానీ, అండూ బటన్ ఫీచర్ వల్ల ఆ టైం మరింత తగ్గిపోనుంది. పొరపాటున మాత్రమే కాదు.. ఎక్కువ గ్యాలరీ కంటెంట్(వాట్సాప్ స్టోరీస్)తో వాట్సాప్ స్టేటస్లు పెట్టే వాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ఈ ఫీచర్ను టెస్టింగ్ చేస్తోందని, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్షణంలో ఆ స్టేటస్ను తొలగించే వీలు ఉంటుందని ‘వాబేటాఇన్ఫో’ కథనం ప్రచురించింది. తద్వారా యాక్సిడెంటల్గా పోస్ట్ చేసినా.. అవతలివాళ్లు స్క్రీన్ షాట్ తీసేలోపే ఆ స్టేటస్ను తొలగించొచ్చు. ముందు ఐవోఎస్ వెర్షన్లో ఆతర్వాతే ఆండడ్రాయిడ్ వెర్షన్కు ఈ ఫీచర్ను తీసుకురాబోతున్నారు. చదవండి: నెలలో 20 లక్షల మంది వాట్సాప్ అకౌంట్ల బ్యాన్! కారణం ఏంటంటే.. -
ఇన్స్టాగ్రామ్లో కొత్త అకౌంట్ ఇకపై అంతా వీజీ కాదు..!
మెటా(ఫేస్బుక్)కు చెందిన ఇన్స్టాగ్రామ్ త్వరలోనే సరికొత్త పాలసీను ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది. కొత్తగా అకౌంట్ క్రియోట్ చేసే వారు కచ్చితమైనా ఫ్రూఫ్స్ ఉంటేనే సైన్ ఆప్ అయ్యే అవకాశాన్ని కల్పించేలా ఇన్స్టాగ్రామ్ ప్లాన్ చేస్తోంది. కొత్త యూజర్ తీసుకున్న సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేస్తేనే కొత్త ఖాతాను ఆలో చేయాలని ఇన్స్టాగ్రామ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫీచర్ గత ఏడాది నుంచే ఇన్స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా ఇన్స్టాగ్రామ్ త్వరలోనే తెచ్చే ఫీచర్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. చదవండి: ఐరన్ మ్యాన్ కలను నిజం చేసిన ఆనంద్ మహీంద్రా వారిని అదుపుచేయడం కోసమే..! ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో మల్టీపుల్ ఖాతాలను ఏర్పాటు చేయడంతో ఆయా వ్యక్తులు అసంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నుట్లు ఇన్స్టాగ్రామ్ గుర్తించింది. దీంతో ఆయా యూజర్లకు చెక్పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్ను తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్టీపుల్ ఖాతాలను క్రియోట్ చేసే వారి ఆట కట్టించేందుకు ఇన్స్టాగ్రామ్ ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్లో..! -
నెట్ఫ్లిక్స్లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా?
న్యూఢిల్లీ: ఓవర్ ద టాప్ మీడియా సేవల్లో ఉన్న నెట్ఫ్లిక్స్ మొబైల్ గేమ్స్ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఆన్డ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ పీసీ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ముందుగా అయిదు గేమ్స్ను కంపెనీ పరిచయం చేసింది. యూజర్లు నెట్ఫ్లిక్స్ చందాదారులైతే చాలు. ఎటువంటి ప్రకటనలు, అదనపు రుసుం, ఖర్చులు లేవని కంపెనీ తెలిపింది. చాలా భాషల్లో ఈ గేమ్స్ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. పిల్లల ప్రొఫైల్స్కు ఇవి అందుబాటులో ఉండవని వివరించింది. గేమ్స్ ఇవే ది స్ట్రేంజర్ థింగ్స్:1984 (బోనస్ ఎక్స్పీ) స్ట్రేంజర్థింగ్స్ 3: ది గేమ్ (బోనస్ ఎక్స్పీ) షూటింగ్ హూప్స్ (ఫ్రోస్టీ పాప్) కార్డ్ బ్లాస్ట్ ( అమ్యూజో అండ్ రోగ్ గేమ్) టీటర్ అప్ (ఫ్రోస్టీ పాప్) గేమ్స్ ఆడాలంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై పని చేసే డివైజ్లో అకౌంట్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ నెట్ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ని ఎంచుకోవాలి. వెంటనే గేమ్స్ హోం పేజీలోకి వెళ్తుంది. అక్కడ నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్లో నెట్ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ కనిపించని పక్షంలో.. కొంత కాలం ఎదురు చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్ క్రమంగా ఈ సేవలను విస్తరింపచేస్తోంది. ఈ గేమ్స్ పిల్లలకు కాదు గేమ్స్ అందుబాటులో ఉన్న చందాదారులు ఒకేసారి మల్టీపుల్ డివైజ్లో గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్స్ కిడ్స్ విభాగంలో అందుబాటులో ఉండవు. వీటిని నెట్ఫ్లిక్స్ అడల్ట్ కేటగిరీలోనే ఉంచింది. మరింతంగా భవిష్యత్తులో గేమ్స్ విభాగాన్ని మరింతగా విస్తరించాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్, వెబ్సిరీస్, డాక్యుడ్రామాల తరహాలోనే గేమ్స్ని కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉన్న గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చదవండి:నెట్ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
క్రికెట్ లవర్స్కు ట్విటర్ గుడ్న్యూస్..!
క్రికెట్ లవర్స్కు ట్విటర్ గుడ్న్యూస్ను అందించింది. క్రికెట్ అభిమానుల కోసం ట్విటర్లో సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్-2021 రావడంతో భారత్లో తొలిసారిగా కమ్యూనిటీస్ ఫీచర్ను ట్విటర్ అందుబాటులోకి తెచ్చింది. “Cricket Twitter - India’’ పేరుతో కమ్యూనిటీస్ ఫీచర్ను ట్విటర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా క్రికెట్ అభిమానులు లైవ్ స్కోర్ను కూడా తెలుసుకోవచ్చును. గత నెలలో ట్విటర్ ‘కమ్యూనీటీస్’ ఫీచర్ను అమెరికన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్మార్ట్ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...! అసలు ఏంటీ కమ్యూనిటీస్ ఫీచర్..! ఫేస్బుక్లోని పలు గ్రూప్స్ మాదిరిగానే ట్విటర్ కమ్యూనిటీలతో ఇతర యూజర్లు తమ అభిప్రాయాలను ఈ గ్రూప్స్లో పంచుకోవచ్చును. ఈ గ్రూప్స్లోకి ఇతర యూజర్లను ఆహ్వానించవచ్చును. ఈ గ్రూప్ నుంచి ఆహ్వానం ఉంటేనే కమ్యూనిటీ ఫీచర్లో యాడ్ కావచ్చును. క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో ట్విటర్లో యూజర్లకు క్రికెట్ ఎక్స్ప్లోర్ ట్యాబ్, లైవ్ మ్యాచ్ స్కోరును కూడా ట్విటర్ అందిస్తోంది. పబ్లిక్ ట్వీట్ల మాదిరిగానే ప్రతి ట్విటర్ యూజర్ కమ్యూనిటీ ట్వీట్లను చదవవచ్చును ఆయా ట్విట్స్పై రిపోర్ట్ కూడా చేయవచ్చును. కాగా ట్విటర్ కమ్యూనిటీస్లో భాగం కానీ యూజర్లు మాత్రం ఆయా ట్విట్లకు రిప్లే ఇవ్వలేరు. ప్రస్తుతం ట్విటర్ ప్లాట్ఫారమ్లో కమ్యూనిటీలను సృష్టించడానికి యూజర్ల అందరికీ ఇంకా అనుమతించలేదు. చదవండి: జుమ్జుమ్మని... బోయింగ్ సర్వీసులకు వీలుగా.. -
ఫేస్బుక్ యూజర్లకు గుడ్న్యూస్....!
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ యూజర్లకు ఫేస్బుక్ శుభవార్తను అందించింది. క్లబ్హౌజ్, ట్విటర్ స్పేస్ తరహాలో ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్ ఆండ్రాయిడ్, డెస్క్టాప్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్ ఆడియో రూమ్స్ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్లకు అందుబాటులో ఉంది. చదవండి: బ్లూ ఆరిజిన్ రెండో టూర్ సక్సెస్: అద్భుతమన్న నటుడు.. అంతరిక్షయానంలో అత్యంత వయస్కుడిగా రికార్డు ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియోట్ చేసే ఫీచర్ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్బుక్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫేస్బుక్ క్లబ్ హౌజ్, ట్విటర్స్పేస్ తరహా లాంటి ఆడియో రూమ్స్ను క్రియోట్ చేసేందుకు సమయాత్తమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్ ఆడియో రూమ్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. లైవ్ ఆడియో రూమ్స్లో స్పీకర్గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్కి ఉంది. కాగా స్పీకర్ చేసే సంభాషణను ఎవరైనా వినవచ్చు. 50 మందితో...! ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ ప్రస్తుతం 50 మంది స్పీకర్స్ను మాత్రమే ఆలో చేస్తుంది. వీరి సంభాషణను వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ను క్రియోట్ చేసే ఫీచర్ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. లైవ్ ఆడియో రూమ్స్ను గ్రూప్ అడ్మిన్స్ కంట్రోల్ చేయవచ్చును. లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్ యాప్లో ఫేస్బుక్ వాచ్ ట్యాబ్ దగ్గర కన్పిస్తోంది. ఈ ఫీచర్ పరిచయంతో యూజర్లకు కొంత తిప్పలు తప్పనుంది. ఆడియో కన్వర్సేషన్ చేసుకునే వారు సపరేట్గా ట్విటర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనం కల్గనుంది. క్లబ్హౌజ్లో జరిగిన గోల ఇప్పుడు ఫేస్బుక్లో కన్పించనుంది. చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! -
WhatsApp: మీరు ఎక్కడంటే అక్కడ ఆపొచ్చు..!
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. తన యూజర్ల కోసం వాట్సాస్ ఎప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంటుంది. తాజాగా వాట్సాప్ యాప్లో వాయిస్ మెసేజ్ సర్వీస్లకు మరో అద్బుతమైన ఫీచర్ను వాట్సాప్ యాడ్ చేయనుంది. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ మనం వాట్సాప్లో వాయిస్ మెసేజ్లను పంపిస్తూ ఉంటాం. వాయిస్ మెసేజెస్ను స్పీకర్ ఐకాన్పై ప్రెస్ చేసి మెసేజ్లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం. స్పీకర్ ఐకాన్పై ఆన్ప్రెస్ చేయగానే వాయిస్ మెసేజ్ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది. వాయిస్ మెసేజ్ రికార్డు చేసే సమయంలో మెసేజ్లను ‘పాజ్’ చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్ మెసేజ్ రికార్డు విషయంలో కొత్తగా పాజ్, ప్లే బటన్లను వాట్సాప్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిలీట్, సెండ్ బటన్ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్తో మనకు నచ్చిన అప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్ మెసేజ్ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. WABetainfo ప్రకారం... ఈ కొత్త ఫీచర్ త్వరలోనే వాట్సాప్ బెటా ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. చదవండి: టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్న్యూస్...! -
Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్ కూల్
సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్ డిబేట్లను తగ్గించే ప్రయత్నాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్ ఇప్పుడు రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ త్వరలో ఓ కూల్ ఫీచర్ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్.. సదరు ట్వీపుల్స్(ట్విటర్ పీపుల్స్)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్తో ఓ ఫీచర్ను డిస్ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్ ఉంటుంది. అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండింటిలోనూ ఈ కూల్ ఫీచర్ను అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్ టైం లైన్లో వాటికవే రిఫ్రెష్ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్ ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ ఫీచర్ను తెస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు -
యూజర్లకు భారీ ఊరట..! జీ-మెయిల్లో ఆ సమస్యకు చెక్పెట్టనున్న గూగుల్..!
Gmail Rolling New Feature: నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తరాలు, ఇన్ల్యాడ్ లెటర్స్ పూర్తిగా మరుగనపడిపోయాయి. వాటిస్ధానంలో జీ-మెయిల్ పూర్తిగా భర్తీ చేసింది. పలు కార్పోరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సేవలను అందించే యాప్స్ కూడా పూర్తిగా మెయిల్స్తోనే ప్రత్యుత్తరాలను జరుపుతున్నాయి. మనలో చాలా మంది జీ-మెయిల్ సేవలను వాడుతున్న వాళ్లమే...! చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. జీ-మెయిల్ను మెరుగుపర్చడం కోసం పలు ఫీచర్స్తో గూగుల్ ఎప్పటికప్పుడు ముందుకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం జీ-మెయిల్ యాప్లో గూగుల్మీట్ వాయిస్ కాలింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్తో జీ-మెయిల్తో నేరుగా గూగుల్ మీట్ యాప్ లేకుండానే పాల్గొనే సదుపాయాన్ని గూగుల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా జీ-మెయిల్లో మరో సూపర్ ఫీచర్ను గూగుల్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. సెర్చ్చేయడం మరింత సులువు..! మనకు కావాల్సిన ఫలానా ఈ-మెయిల్ను వెతకడం కోసం ఏం చేస్తాం..! సింపుల్గా జీ-మెయిల్లో మనకు కావాల్సిన దాని గురించి సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే.. మనకు ఆయా అంశానికి సంబంధించిన సజెషన్స్ను జీ-మెయిల్ చూపిస్తోంది. ఇక్కడ సరైన టర్మ్తో వెతికినా, ఒక వేళ నిర్థిష్టమైన మెయిల్తో వెతికితే మనకు వెంటనే సెర్చ్ రిజల్ట్స్ను కన్పిస్తాయి. ఒకవేళ సజెషన్స్ ఒక పది, ఇరవై ఉంటే ఒకే..!కానీ.. మనం సెర్చ్ చేసే అంశం కొన్ని వందలుంటే మాత్రం మనకు చికాకు పక్కగా వస్తోంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోన్న వారిమే. ఈ సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ సరికొత్తగా సెర్చ్ చేసే సమయంలో పలు ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫిల్టర్ల సహయంతో మనకు కావాల్సిన అంశం తొందరగా దొరికే ఛాన్స్ ఉంది. సెర్చ్ ఇన్ మెయిల్స్లో భాగంగా గూగుల్ త్వరలోనే ‘ఫ్రమ్’, ‘సెంట్ టూ’, ‘డేట్’ , ‘అటాచ్మెంట్’ అనే ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సూపర్ఫీచర్ వచ్చే నెలలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందరికి అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! -
యూట్యూబ్ సూపర్ ఫీచర్..ఇప్పుడు మొబైల్తో పాటుగా...!
యూట్యూబ్ డెస్క్టాప్ యూజర్లకు త్వరలోనే గుడ్న్యూస్ను అందించనుంది. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో యూట్యూబ్లో వీడియోలను చూడడం కోసం మనం ముందుగానే వైఫై, లేదా మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే వీడియోలను డౌన్లోడ్ చేసి...తరువాత ఆఫ్లైన్లో వీడియోలను చూస్తూంటాం. యూట్యూబ్లో ఆఫ్లైన్ వీడియో ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ ఫీచర్ను త్వరలోనే డెస్క్టాప్ యూజర్లకోసం అందించే ప్రయత్నాలను యూట్యూబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. చదవండి: జేమ్స్బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! మీరు యూట్యూబ్ ప్రీమియం యూజర్ అయితే ఈ కొత్త ఫీచర్ను ‘https://www.youtube.com/new’ సైట్కు వెళ్లి ప్రయత్నించవచ్చును. క్రోమ్, ఎడ్జ్ లేదా ఒపెరా బ్రౌజర్ల తాజా వెర్షన్ డెస్క్టాప్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. డెస్క్టాప్లో డౌన్లోడ్చేసిన వీడియోలను తర్వాత ఆఫ్లైన్‘ youtube.com/feed/download’లో చూడవచ్చు, ఇది సైడ్ నావిగేషన్ ప్యానెల్లో కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు గరిష్టంగా 1080పీ నాణ్యతతో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చును. కాగా యూజర్లు తమ ల్యాప్టాప్లు లేదా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసిన వీడియోలను తమ హార్డ్ డ్రైవ్లో శాశ్వతంగా ఉంచడానికి యూట్యూబ్ అనుమతించదు. దాంతో పాటుగా యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మినీ ప్లేయర్లో వీడియోలను చేసే ఫీచర్ను కూడా పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
వాట్సాప్లో మీ ఫొటోలు సరికొత్త రూపంలో..!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. కొన్నిరోజుల క్రితం యూజర్ల కోసం సరికొత్త ఫోటో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ ఫోటోలను స్టిక్కర్స్గా మార్చే ఫీచర్ను యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లు ఎలాంటి థర్డ్పార్టీ యాప్స్ను వాడకుండా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! ప్రస్తుతం ఈ ఫీచర్పై వాట్సాప్ పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ను బీటావాట్సాప్ వర్షన్లో వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం..వాట్సాప్ చాట్ డైలాంగ్ బాక్స్లో ఈ ఫీచర్ కన్పించనుంది. యూజర్లు ఎంచుకున్న ఫోటోలను స్టిక్కర్ ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా ఆయా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును. తాజాగా వాట్సాప్ మల్టీ-డివైజ్ ఫీచర్ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఆన్లైన్లో లేకున్నా ఏకకాలంలో నాలుగు డివైజ్లకు సపోర్ట్ చేస్తూ యాప్ను ఉపయోగించవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
వాట్సాప్లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్సీన్ సెట్టింగ్లో అప్డేట్ను తీసుకురానుంది. లాస్ట్సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్ కాంటాక్టులకు తెలియజేస్తుంది. చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ లాస్ట్సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్లో ‘నోబడీ’, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్సీన్ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్సీన్ సెట్టింగ్లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్సీన్ సెట్టింగ్లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్లకు యూజర్ లాస్ట్సీన్ కన్పించదు. ప్రస్తుతం ఈ సెట్టింగ్ను వాట్సాప్ కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్తో కొంతమంది లాస్ట్సీన్ ఆప్షన్ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. చదవండి: Microprocessor Chips: సొంత చిప్ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్ వరకే? -
గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
టెక్నాలజీలో గూగుల్ మ్యాప్స్ నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్ యూజర్లు మ్యాప్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అందించింది. గూగుల్ మ్యాప్.. ఓ ఆసక్తికరమైన ఫీచర్ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్ ఛార్జ్ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్ను ఎంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను వీలైనంత త్వరలోనే గూగుల్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్లో ప్రయాణించినప్పుడు రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్ మ్యాప్ ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్ మ్యాప్ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్ యాప్(ఇది కూడా గూగుల్ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్ మ్యాప్ టోల్ ట్యాక్స్ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్ ఆపరేటర్లు ఫిక్స్ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్సైట్ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది! గూగుల్ మ్యాప్లో బెస్ట్ ఫీచర్గా ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్కు పేరుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్.. గూగుల్ క్రౌడ్ఫండింగ్ ఫీచర్ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్ లొకేషన్-నేవిగేషన్ను యూజర్కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్ను మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్(అప్డేట్ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్ యాప్నే ‘పే అండ్ యూజ్’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్ మ్యాప్ మౌనం వహిస్తోంది. చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్ ఆపరేటింగ్! -
అమెజాన్ ప్రైమ్లో ఈ కొత్త ఫీచర్ గమనించారా?
అమెజాన్ ప్రైమ్ గురించి తెలియని వారు ఎవరుండరు అనుకుంటా బహుశా..! అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్తో వీడియో, మ్యూజిక్, ఫాస్టెస్ట్ డెలివరీ సేవలను అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. తాజాగా అమెజాన్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీకు నచ్చిన వెబ్ సిరీస్, సినిమాల్లోని ఇష్టమైన క్యారెక్టర్ను మీ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ పిక్చర్ను ఎంచుకోవచ్చును. ఈ ఫీచర్ భారత్లో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల అందరికీ అందుబాటులో ఉండనుంది. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...!) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ పిక్చర్లో భాగంగా ప్రస్తుతం మార్వెలస్ మిసెస్ మైసెల్ నుంచి మిడ్జ్ ది బాయ్స్ నుంచి మదర్స్ మిల్క్ (లాజ్ అలోన్సో) వంటి పాత్రలను ప్రోఫైల్ పిక్చర్గా మార్చుకొవచ్చును. అంతేకాకుండా ఫ్లీబాగ్, ఇన్విన్సిబుల్, సిల్వీస్ లవ్, టామ్ క్లాన్సి నటించిన జాక్ రైన్, టూమరో వార్ వంటి సిరీస్, చిత్రాల్లో నటించిన వారి క్యారెక్టర్లను ప్రొఫైల్ ఫోటోలుగా ఉంచుకోవచ్చును. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం హలీవుడ్కు చెందిన ప్రముఖ క్యారెక్టర్లను ప్రొఫైల్ పిక్స్గా ఉంచుకోవడానికి అనుమతిని ఇస్తుంది. త్వరలోనే ఇండియన్ సినిమాకు చెందిన క్యారెక్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో అమెజాన్ ఉన్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్సైట్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ చిత్రాన్ని ఇలా ఛేంజ్ చేయండి....! మీ ఫోన్లో ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియోను ఒపెన్ చేయండి. ప్రైమ్ వీడియో యాప్లో హోమ్పేజీ దిగువన ఉన్న మై స్టఫ్ ఆప్షన్ను ఎంపిక చేసుకోండి. తరువాత ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి, ఆపై మేనేజ్ ప్రొఫైల్ను ఎంచుకోండి . మీరు మార్చాలనుకుంటున్న ప్రొఫైల్ని ఎంచుకోండి (ఒకవేళ మీకు ఒక అకౌంట్పై ఎక్కువ ప్రొఫైల్లు ఉంటే). తరువాత ఎడిట్ ప్రొఫైల్ను ఎంపిక చేయండి. మీకు మీ పేరుతో కూడిన ప్రోఫైల్ పిక్చర్ను గమనిస్తారు. అక్కడ ప్రోఫైల్ పిక్పై క్లిక్ చేసి మీకు నచ్చిన సిరీస్, చిత్రానికి సంబంధించిన క్యారెక్టర్ను ప్రొఫైల్ ఫోటోను ఎంపిక చేయండి. తరువాత సేవ్ చేయండి. (చదవండి: ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!) -
మీరు అనుకుంటే వాట్సాప్లో కనిపించకుండా చేయవచ్చు.!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం ఫోటో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ చాట్లో మీరు అనుకుంటే మెసేజ్లు కన్పించకుండా చేయవచ్చును. ఔను మీరు విన్నది నిజమే..! వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్లో పంపే మెసేజ్లను నిర్ధిష్ట చాట్లో కన్పించకుండా ఆయా సందేశాల కాలాన్ని మీరు నిర్ణయించవచ్చును. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) వాట్సాప్ తన డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ కోసం కొత్త ఆప్షన్ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లో భాగంగా 90 రోజుల తర్వాత ఒక నిర్దిష్ట చాట్లో ఆటోమేటిక్గా మెసేజ్లను డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. అంతేకాకుండా 24 గంటల్లో మెసేజ్లు ఆటోమేటిక్గా కనుమరుగయ్యే ఆప్షన్ను కూడా వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వాస్తవానికి గత ఏడాది నవంబర్లో డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ను ప్రవేశపెట్టగా ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు పంపిన మెసేజ్లు ఏడు రోజుల వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మెసేజ్లను అదృశ్యమయ్యేలా చేయడానికి వాట్సాప్ యాప్ వీలు కల్సిస్తుంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం బీటా వెర్షన్ 2.21.17.16 ద్వారా 90 రోజుల తర్వాత చాట్లో మెసేజ్లు కన్పించకుండా ఉండే ఫీచర్ను WABetaInfo స్క్రీన్షాట్ను షేర్ చేసింది. 90 డేస్తో పాటు 24గంటల్లో వాట్సాప్లో మెసేజ్లు కన్పించకుండా చేసే ఫీచర్ను కూడా అందుబాటులోకి తెస్తోన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్ను గత కొన్ని నెలలుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్లో ఒక చిన్న మెలిక ఉంది. వాట్సాప్ యూజర్ ఇతర రెసిపెంట్లకు పంపిన మెసేజ్లకు డిస్ఆప్పియర్ ఫీచర్తో మెసేజ్లు పంపినా...,రెసిపెంట్ ఆయా మెసేజ్ను వేరే ఇతర వాట్సాప్ యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే మాత్రం యూజర్ పంపిన మెసేజ్ ఎప్పటికి రెసిపెంట్తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్తగా వ్యూ వన్స్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
ఫేస్బుక్లోని ఈ కొత్త ఫీచర్ సూపర్గా ఉందే....!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు కొత్తగా అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ యాప్లో ఉండే వాయిస్, వీడియో కాల్స్కు ఉండే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రస్తుతం ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. కాగా గతంలోనే వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ సేవల పోర్ట్ఫోలియోలో క్రమంగా ఆడియో ,వీడియో ఫీచర్లను జోడించింది. "ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ లో భాగంగా సందేశాలు, కాల్ల కంటెంట్ మీ ఫోన్ నుంచి రిసీవర్కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్-షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఫేస్బుక్ మెసేంజర్లోని గ్రూప్ చాట్లకు కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావాలని ఫేస్బుక్ చూస్తుంది. దాంతో పాటుగా మెసేంజర్లో సందేశాలను నిర్ణీత సమయం వరకు కనిపించేలా, తరువాత ఆ మెసేజ్లు కన్పించకుండా నియత్రించవచ్చును. మెసేంజర్లో పంపే సందేశాలకు 5 సెకండ్ల నుంచి 24 గంటలపాటు టైమర్ను ఉపయోగించి మెసేజ్లను పంపవచ్చును. -
యూట్యూబ్లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..!
యూట్యూబ్ గురించి తెలియని వారు ఏవరుండరు. మనకు నచ్చిన టీవీ ప్రోగ్రాంలను మిస్సైనా, ఇతరత్రా వీడియోలను చూడాలంటే వెంటనే యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేస్తాం..! మనలో చాలా మంది యూట్యూబ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే మనకు కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్లో డబల్ ట్యాప్ చేసి వీడియోలను ఫార్వర్డ్ చేస్తు ఉంటాం. వీడియోలను ఫార్వర్డ్ చేసే క్రమంలో డబుల్ ట్యాప్ సరిగ్గా చేయకపోతే తదుపరి వీడియోకు వెళ్తుంది. ఇలా మనలో చాలా మంది ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కోన్న వాళ్లమే..! కాగా ఈ సమస్యకు చెక్పెడుతూ కొత్త పరిష్కారాన్ని చూపింది యూట్యూబ్. యూట్యూబ్ త్వరలోనే యూజర్లకు కొత్త ఫీచరును అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లకు స్లైడ్ టూ సీక్ అనే కొత్త ఫీచరును యూట్యూబ్ త్వరలోనే యాడ్ చేయనుంది. వీడియోను చూసే సమయంలో వీడియోపై ఒక గీతపై డాట్ ఉండే సింబల్ త్వరలోనే యూజర్లకు కనిపించనుంది. సింబల్కు పక్కనే ‘స్టైడ్ టూ లెఫ్ట్ ఆర్ రైట్ టూ సీక్’డిస్క్రిప్షన్ మేసేజ్ కన్పిస్తోంది. అంతేకాకుండా ఆపిల్, షావోమీ స్మార్ట్ఫోన్లలో కన్పించే రౌండ్బాల్ హోల్డ్ గెస్చర్ను కూడా యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక వీడియోలో ముందుకు ఫార్వర్డ్ వెళ్లాలంటే బాల్ను డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మనకు నచ్చినట్లుగా వీడియోలను ఫార్వర్డ్, రివైండ్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచరును యూట్యూట్ టెస్ట్ చేస్తోంది. కాగా ఈ ఫీచర్ యూట్యూబ్ యాప్ వెర్షన్ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. -
వాట్సాప్లో కొత్త ఫీచర్..! వాటిని ‘ఒక్కసారి’ మాత్రమే..!
వాట్సాప్ తన యూజర్లకోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ తన యూజర్ల కోసం ‘వ్యూ వన్స్’ ఫీచర్ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్తో యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్లను రెసిపెంట్(గ్రహీత) యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా వాట్సాప్లో యూజర్ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్ యూజర్ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్ ఒక్కసారి రెసిపెంట్ యూజర్ డౌన్లోడ్ చేశాక ఎల్లప్పుడు మొబైల్లోనే స్టోర్ అవుతాయి. రెసిపెంట్ తిరిగి యూజర్ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు. ప్రస్తుతం వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్తో రెసిపెంట్ కేవలం ఒక్కసారి మాత్రమే మేసెజ్లను చూడగలడు. ప్రస్తుతం ఈ ఫీచర్ అప్డేట్డ్ వాట్సాప్ యాప్ కల్గి ఉన్న ఐఫోన్ యూజర్లకు మంగళవారం రోజున భారత్లో లాంచ్ చేసింది. ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొద్దిసేపటికే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ఫర్ ఐఫోన్ యాప్ 2.21.150 వెర్షన్లో అందుబాటులో ఉండనుంది. వ్యూ వన్స్ ఫీచర్లో భాగంగా వాట్సాప్ యాప్లో ఫోటో లేదా వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా '1' చిహ్నాంపై ట్యాప్ చేయాలి. దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను, లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలడు. రెసిపెంట్ మేసేజ్ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్తో మీడియా కంటెంట్ను రెసిపెంట్ (గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో సేవ్ కావు. వ్యూ వన్స్ ఫీచర్తో సెండ్ చేసిన మేసేజ్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయలేరు. వ్యూ వన్స్ ఫీచర్ని ఉపయోగించి పంపిన ఫోటో లేదా వీడియో 14 రోజుల్లోపు తెరవకపోతే చాట్లో రెసిపెంట్కు కనిపించదు. అయితే రెసిపెంట్కు పంపిన ఫోటోను స్క్రీన్షాట్ తీస్తే మాత్రం యూజర్కు తెలియదు. రెసిపెంట్ స్క్రీన్ షాట్ తీస్తే యూజర్కు తెలిసే సదుపాయం కేవలం స్నాప్చాట్లో మాత్రమే కలదు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్...!
న్యూ ఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ యోనో, యోనో లైట్లో 'సిమ్ బైండింగ్' అనే కొత్త మెరుగైన భద్రతా ఫీచర్ను ప్రారంభించింది. సిమ్ బైండింగ్ ఫీచర్తో కొత్త యోనో, యోనో లైట్ యాప్లను ఉపయోగించే ఖాతాదారులను వివిధ డిజిటల్ మోసాల నుంచి రక్షించనుంది. సిమ్ బైండింగ్ ఫీచర్తో కేవలం బ్యాంక్లో నమోదైన మొబైల్ నంబర్ల సిమ్ ఉన్న ఫోన్లలో మాత్రమే యోనో, యోనో లైట్ యాప్లు పనిచేస్తాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకుతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్ ఉపయోగించి ఒకే మొబైల్ పరికరంలో యోనో, యోనో లైట్ యాప్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంక్లో నమోదు చేయని మొబైల్ నంబర్ను ఉపయోగిస్తుంటే, యోనో, యోనో లైట్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయలేరు. ఈ సందర్భంగా ఎస్బీఐ డీఎమ్డీ (స్ట్రాటజీ) & చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..యోనో, యోనో లైట్ యాప్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్ఫాంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎస్బీఐ తెచ్చిన కొత్త ఫీచర్తో ఖాతాదారులందరికీ మెరుగైన భద్రతను అందిస్తోంది. అంతేకాకుండా కస్లమర్లను ఎల్లప్పుడూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. సిమ్ బైండింగ్ ఫీచర్ను ఇలా యాక్సెస్ చేయండి...! మెరుగైన భద్రతా ఫీచర్లతో వచ్చిన యోనో, యోనో లైట్ యాప్ల కొత్త వెర్షన్ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారులు తమ మొబైల్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా యోనో, యోనో లైట్ యాప్లలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్ను బ్యాంకు ధృవీకరిస్తుంది. కస్టమర్లు రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్ సిమ్ ఉన్న మొబైల్లో తమను తము నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. -
పిల్లల ఇ(న్)ష్టాలపై.. పేరెంట్స్కి గైడెన్స్...
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టాగ్రామ్ యువతకు అత్యంత వేగంగా చేరువవుతోంది. సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు తదితర విశేషాల కోసం మాత్రమే కాకుండా స్వయంగా తాము కూడా విభిన్న రకాల కంటెంట్ను అప్లోడ్ చేస్తూ ఇన్స్టా కు ఫ్యాన్స్గా మారిపోతున్నారు యూత్. ఈ నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతను దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో ఉన్న యువ వినియోగదారుల కంటెంట్ భద్రత దృష్ట్యా... ఇన్స్టాగ్రామ్ పేరెంట్స్ గైడ్ను రూపొందించింది. దీనిని హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ ఆన్లైన్ సదస్సులో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ అందిస్తున్న అన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్ గురించి తమ యువ వినియోగదారుల తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ఈ పేరెంట్స్ గైడ్ రూపకల్పన ఉద్ధేశ్యమని రూపకర్తలు వివరించారు. మారుతున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి అవగాహన కూడా ఇది అందిస్తుందన్నారు. టీనేజర్ల భధ్రత, హక్కులకు సంబంధించి పనిచేస్తున్న సెంటర్ ఫర్ సోషల్ రిసెర్చ్, సైబర్ పీస్ ఫౌండేషన్, ఆరంభ్ ఇండియా ఇనీషియేటివ్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివిటీ సిటిజన్ షిప్., ఇట్స్ ఓకె టూ టాక్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్.. వంటి సంస్థలు అందించిన విశేషాలు, వివరాలు ఈ గైడ్ లో పొందుపరచామన్నారు. అంతేకాకుండా ఈ గైడ్లో ఇన్స్టాగ్రామ్ అందిస్తున్న డిఎమ్ రీచబులిటీ కంట్రోల్స్, బల్క్ కామెంట్ మేనేజ్మెంట్ వంటివాటి గురించి సమగ్రంగా వివరించామన్నారు. అవగాహన అవసరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీనేజర్లు, యువత ఆన్లైన్లో అత్యధిక సమయం వెచ్చిస్తున్న పరిస్థితుల్లో... వారు వినియోగిస్తున్న ఉత్పత్తులు, ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు తెలిసి ఉండడం అత్యంత అవసరం. దీని వల్ల తమ పిల్లల సృజనాత్మక శైలి గురించి కూడా తెలుసుకోగలుగుతారు. అలాగే వారికి అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా అవగాహన పెంచుకుంటారు. –తారాబేడీ, ఇన్స్టాగ్రామ్ -
ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ స్టాగ్రామ్ మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో సెన్సిటీవ్ కంటెంట్ ను కంట్రోల్ చేయవచ్చని ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతిరోజు ప్రపంచ వ్యప్తంగా 500మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్లో గడుపుతున్నారు. అయితే వారిలో కొంతమంది యూజర్లు అశ్లీల ఫోటోలు, మెసేజ్లను షేర్ చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ ఫీచర్ను అప్ డేట్ చేసింది. ఈ ఫీచర్ ను వినియోగించడం ద్వారా అశ్లీల కంటెంట్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్స్టా గైడ్లైన్స్కు వ్యతిరేకంగా అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తొలగిస్తామని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ►ఈ ఆప్షన్ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ►ముందుగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను క్లిక్ చేయాలి ►క్లిక్ చేసి ప్రొఫైల్ సెంట్టింగ్ లో మెన్యు ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ►మెన్యు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు లిమిట్, అలో, లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ డిస్ప్లే అవుతోంది ► లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అశ్లీల్ కంటెంట్ మీ ప్రొఫైల్ లో షేర్ అవ్వడం ఆగిపోతుంది. చదవండి : ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట -
వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్!
కొద్దిరోజుల క్రితం కొత్తగా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్ కాల్ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సాధారణంగా మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మనం ఇతర పని చేస్తున్నపుడు వాట్సాప్ గ్రూప్ కాల్ కట్ చేస్తాం. అయితే, అలాంటి సంధర్భంలో వారు ఇంకా మాట్లాడుతుంటే మధ్యలో గ్రూప్ కాల్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. అందుకే, వాట్సాప్ కొత్తగా జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొనివచ్చింది. మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు గ్రూప్ కాల్ చేసిన సందర్భంలో మన పాల్గొనకుండా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు. మీరు జాయిన్ కావాలంటే గ్రూప్ కాల్ మీద టాప్ చేస్తే మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు బటన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కనుక మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మధ్యలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దశల వారీగా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.