Nicholas Pooran
-
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా
భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం చెపాక్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ పరాజయం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఇంగ్లండ్.. రెండో టీ20లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ విరోచత పోరాటం వల్ల ఇంగ్లండ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి మరోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.పూరన్ రికార్డు బద్దలు..భారత్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టీ20ల్లో భారత్పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.పూరన్ టీ20ల్లో టీమిండియాపై 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో పూరన్ ఆల్టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర టీ20ల్లో భారత్పై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.టీ20ల్లో భారత్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..జోస్ బట్లర్- 611నికోలస్ పూరన్- 592గ్లెన్ మాక్స్వెల్- 574డేవిడ్ మిల్లర్- 524ఆరోన్ ఫించ్- 500చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సూర్య -
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి. -
గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్కు ముందు లక్నో రాహుల్ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఇప్పుడు అదే జట్టుతో టీ20 సిరీస్కు సిద్దమైంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో విండీస్ తలపడనుంది. బార్బోడస్ వేదికగా నవంబర్ 9 (శనివారం) నుంచి జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లో మొదటి రెండు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్లు తిరిగి జట్టులో చేరారు. వీరు ముగ్గురు గత నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.మరోవైపు ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, షమర్ స్ప్రింగర్లు ఈ జట్టులో చోటు దక్కించలేకపోయారు. అదేవిధంగా స్టార్ పేసర్ జోషఫ్పై నిషేధం పడడటంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఇంగ్లండ్తో తొలి రెండు టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్ఫోర్డ్,వెస్టిండీస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
IPL 2025: నికోలస్ పూరన్కు 18 కోట్లు..!
ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటైన్ లిస్ట్ను సమర్పించడానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. అక్టోబర్ 31 రిటైన్ లిస్ట్ను సమర్పించడానికి డెడ్ లైన్ అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిటైన్ లిస్ట్ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీల బాటలోనే లక్నో సూపర్ జెయింట్స్ కూడా నడుస్తుంది. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటైన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు సమాచారం.అయితే ఎల్ఎస్జీ ఈసారి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే రిటైన్ లిస్ట్ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ చాయిస్ కింద నికోలస్ పూరన్ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పూరన్కే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదే కరెక్ట్ అయితే పూరన్కు పారితోషికం కింద రూ. 18 కోట్లు దక్కనున్నాయి.ఎల్ఎస్జీ.. పూరన్తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్ను సెకెండ్ ఛాయిస్గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మయాంక్ యాదవ్కు రూ. 14 కోట్లు దక్కనున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్లే ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు. -
SL vs WI: విండీస్ హార్డ్ హిట్టర్స్ దూరం.. పదిహేడేళ్ల కుర్రాడికి చోటు
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రోవ్మన్ పావెల్ సారథ్యంలో టీ20 జట్టు.. షాయీ హోప్ కెప్టెన్సీలో వన్డే జట్టు లంక పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది. స్టార్ ఆటగాళ్లు ఈ టూర్కు దూరం కానుండగా.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ జట్లలో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరు 13- 26 మధ్య మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు శనివారం జట్లను ప్రకటించిగా.. టీ20 జట్టులో కొత్తగా టెర్రెన్స్ హిండ్స్, షామార్ స్ప్రింగర్ చోటు దక్కించుకున్నారు.కరేబియన్ ప్రీమియర్ లీగ్లో సత్తా చాటికరేబియన్ ప్రీమియర్ లీగ్-2024(సీపీఎల్)లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రైటార్మ్ పేసర్ హిండ్స్.. ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక స్ప్రింగర్ కూడా కుడిచేతి వాటం పేసరే. 18 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీశాడు.వీరిద్దరితో పాటు.. పదిహేడేళ్ల వికెట్ కీపర్ జువెల్ ఆండ్రూకు కూడా విండీస్ సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. అయితే, అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. జువెల్ ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్లలో కలిపి 165 పరుగులు సాధించాడు.స్టార్లు దూరం.. యువ ఆటగాళ్ల పాలిట వరంశ్రీలంకతో సిరీస్లకు విధ్వంసకర వీరులు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షిమ్రన్ హెట్మెయిర్, స్పిన్నర్ అకీల్ హొసేన్ దూరమయ్యారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో వీరంతా విశ్రాంతి కావాలని కోరగా.. అందుకు తాము సమ్మతించినట్లు వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ చెప్పాడు.శ్రీలంకతో టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథనేజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెర్రెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, షామార్ స్ప్రింగర్శ్రీలంకతో వన్డే సిరీస్కు వెస్టిండీస్ జట్టుషాయీ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జువెల్ ఆండ్రూ, అలిక్ అథనేజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్ -
పూరన్ సుడిగాలి శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్పై ట్రిన్బాగో నైట్రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారియర్స్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ట్రిన్బ్రాగో నైట్రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్బాగో నైట్రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం -
నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. తాజా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్లో భాగంగా బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగులు చేసిన పూరన్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్లలో 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో రిజ్వాన్ ఆల్టైమ్ రికార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్పూర్ రైడర్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు. -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భీకర ఫామ్లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్తో మ్యాచ్లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్రైడర్స్తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
నికోలస్ పూరన్ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్బాగో నైట్రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. రిలీ రొస్సో 20, మికైల్ లూయిస్ 10, ఎవిన్ లూయిస్ 2 పరుగులు చేశారు. నైట్రైడర్స్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 2, జేడన్ సీల్స్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.THE NICHOLAS POORAN SHOW IN CPL.- 93* (43) with 6 fours and 7 sixes, the unreal dominance of Pooran. 🤯pic.twitter.com/k1f0CYfCaj— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2024అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. కీసీ కార్టీ 13, టిమ్ డేవిడ్ 9, కీరన్ పోలార్డ్ 10 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్రైడర్స్తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు చేరాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్లో అతను 205.17 స్ట్రయిక్రేట్తో 12 సిక్సర్లు బాదాడు. -
లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్బై!.. రేసులో ఆ ఇద్దరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంఛైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధివిధానాలపై బీసీసీఐ స్పష్టతనిచ్చిన తర్వాత ఇందుకు సంబంధించి లక్నో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కెప్టెన్గా విఫలంకాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన లక్నో జట్టుకు ఆది నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో టీమ్ను ప్లే ఆఫ్స్నకు చేర్చిన ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆటగాడిగా 520 పరుగులతో పర్వాలేదనపించినా కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు. లక్నోతోనే రాహుల్.. కానీఈ క్రమంలో లక్నో ఈసారి పద్నాలుగింట కేవలం ఏడు మాత్రమే గెలిచి ఏడోస్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంక బహిరంగంగానే రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు రాగా.. సోమవారం సంజీవ్ గోయెంకాతో భేటీ అయిన రాహుల్ తాను జట్టుతోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు. రేసులో ఆ ఇద్దరుఈ క్రమంలో లక్నో జట్టు సంబంధిత వర్గాలు వార్తా సంస్థ IANSతో ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘సీఈఓ సంజీవ్ గోయెంకాతో రాహుల్ అధికారికంగానే భేటీ అయ్యాడు. రిటెన్షన్ గురించి చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది కెప్టెన్గా ఉండటానికి రాహుల్ విముఖత చూపాడు. బ్యాటర్గా తాను మరింతగా రాణించేందుకు సారథ్య బాధ్యతలు వదులుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి రాహుల్ కెప్టెన్సీ పట్ల గోయెంకాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, తను మాత్రం అందుకు సిద్ధంగా లేడు.లక్నో రాహుల్ను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే, కెప్టెన్గా ఉండడు. బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇప్పటికి కెప్టెన్సీ రేసులో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఉన్నారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీతో కేఎల్ రాహుల్ బిజీ కానున్నాడు.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన -
సిక్సర్ల వర్షం.. సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన పూరన్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.సూర్యను అధిగమించిన పూరన్.. ఇక మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్లు బాదిన జాబితాలో పూరన్ మూడో స్ధానానికి ఎగబాకాడు. 96 టీ20ల్లో 139 సిక్స్లు బాదిన ఈ కరేబియన్ వీరుడు.. మోస్ట్ సిక్స్ల జాబితాలో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(137), టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(136)ను పూరన్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(205) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. -
నికోలస్ పూరన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కరేబియన్లు ఊదిపడేశారు. 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విండీస్ ఛేదించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఓపెనర్లు అలిక్ అథ్నాజ్(40), షాయ్ హోప్(51) పరుగులతో అద్బుత ఆరంభాన్ని అందిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్లో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో బార్టమన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.రాణించిన స్టబ్స్..అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో పట్రిక్ కుర్గర్(44) పర్వాలేదన్పించాడు. విండీస్ బౌలర్లలో ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్ రెండు, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 25న ట్రినిడాడ్ వేదికగానే జరగనుంది. -
113 మీటర్ల భారీ సిక్సర్! (వీడియో)
ది హాండ్రడ్ లీగ్-2024లో వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.ఆదివారం మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 153 పరుగుల లక్ష్య చేధనలో మాంచెస్టర్ బౌలర్లను ఈ కరేబియన్ బ్యాటర్ ఊచకోత కోశాడు. 33 బంతులలో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. నార్త్రన్ ఇన్నింగ్స్ 74వ బంతిని స్కాట్ క్యూరీ.. పూరన్కు సరిగ్గా స్లాట్లో సంధించాడు. ఈ క్రమంలో పూరన్ కాస్త క్రీజు నుంచి డీప్గా వెళ్లి మిడ్ వికెట్పై నుంచి 113 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.అతడి పవర్ బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్పై నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ విజయం సాధించింది. 🤯 113-METRE 6️⃣ OUT THE GROUND! 🤯Oh, Nicholas Pooran! 🤩#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/LDayQyjKAT— The Hundred (@thehundred) August 11, 2024 -
విధ్వంసం సృష్టించిన పూరన్
హండ్రెడ్ లీగ్లో భాగంగా సథరన్ బ్రేవ్తో నిన్న (జులై 30) జరిగిన మ్యాచ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (28), జేమ్స్ కోల్స్ (26), కీరన్ పోలార్డ్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో పార్కిన్సన్ 2, జోర్డన్ క్లార్క్, పాట్స్, సాంట్నర్, ఆదిల్ రషీద్, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో 85 బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్ మధ్య నిన్న జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు నిర్ణీత 100 బంతుల్లో 100 పరుగులు చేశారు. హండ్రెడ్ లీగ్లో సూపర్ ఓవర్ రూల్ లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
పూరన్ ఊచకోత.. తొలి మ్యాచ్లో ముంబై టీమ్ ఘన విజయం
మేజర్ లీగ్ క్రికెట్(MLC) 2024 సీజన్ను ఎంఐ న్యూయర్క్ ఘనంగా ఆరంభించింది. స్ట్రీట్ పార్క్ స్టేడియం వేదికగా సీటెల్ ఓర్కాస్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయర్క్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ ఎంఐ బౌలర్ల దాటికి కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. న్యూయర్క్ బౌలర్లలో రషీద్ ఖాన్, బౌల్డ్ చెరో మూడు వికెట్ల పడగొట్టి.. సీటెల్ ఓర్కాస్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు పొలార్డ్ రెండు వికెట్లు, ఇషాన్ అదిల్, నోకియా తలా వికెట్ సాధించారు. సీటెల్ ఇన్నింగ్స్లో శుబమ్ రంజనే(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విధ్వంసం సృష్టించిన పూరన్..ఇక 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ న్యూయర్క్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఎంఐ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 62 పరుగులు చేసిం ఆజేయంగా నిలిచాడు. సీటెల్ బౌలర్లలో గనూన్ రెండు వికెట్లు, బర్గర్, జహీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
టీ20 వరల్డ్కప్లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షాయీ హోప్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
98 పరుగుల వద్ద.. రనౌట్ కావాలని కోరుకోరు కదా!
కఠిన శ్రమ, త్యాగాల ఫలితమే టీ20 ఫార్మాట్లో తన విజయానికి కారణమని వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో పూరన్ దంచికొట్టిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా 53 బంతుల్లో 98 పరుగులు చేసిన పూరన్.. దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు.అలా సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే, క్రిస్ గేల్ను అధిగమించి విండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు.ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ స్పందిస్తూ.. ‘‘98 పరుగుల వద్ద అవుటవ్వాలని ఎవరూ కోరుకోరు. గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయాలనే తొందరలో అలా జరిగిపోయింది.ఏదేమైనా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రిస్ గేల్ మాదిరి ప్రేక్షకులకు వినోదం పంచడం నాకెంతో ఇష్టం. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాను’’ అని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పూరన్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్పై 17, ఉగాండాపై 22, పపువా న్యూగినియాపై 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఆఖరి మ్యాచ్లో.. అసలైన మజాటీ20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో క్రికెట్ ప్రేక్షకులకు అసలైన మజా లభించింది. నామమాత్రమైన మ్యాచ్లో కరీబియన్ హిట్టర్ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అఫ్గానిస్తాన్పై ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అతని వీరవిహారంతో ఈ టి20 ప్రపంచకప్లోనే ఆతిథ్య వెస్టిండీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.ఇప్పటికే ఇరుజట్లు తదుపరి ‘సూపర్–8’ దశకు అర్హత సంపాదించాయి. దీంతో గ్రూప్ ‘సి’లో ఎవరికీ ఫలితంతో పని లేని ఈ మ్యాచ్లో విండీస్ 104 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో 36 పరుగులు... విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) రెండో ఓవర్లో నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43; 8 ఫోర్లు)తో జతకట్టిన పూరన్... అఫ్గాన్పై విధ్వంసరచన చేశాడు. దీంతో జట్టు స్కోరు కేవలం 3.1 ఓవర్లలోనే 50 దాటింది.అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఈ నాలుగో ఓవర్లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ను పూర్తిగా పూరనే ఎదుర్కొని 6, నోబ్+4, వైడ్+4, 0, లెగ్బై 4, 4, 6, 6లతో చుక్కలు చూపించాడు. ఈ మెరుపుల తుఫాన్తో కరీబియన్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు)లో 92/1 స్కోరు చేసింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 80 పరుగుల ధనాధన్ భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి షై హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్స్లు) రావడంతో పూరన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే హోప్ అవుట్ కావడంతో కెపె్టన్ రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా ధాటిగానే ఆడాడు. ఆఖర్లో కెపె్టన్ రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్ను అసాంతం ఆడిన పూరన్ 0, 6, 4, 6, 2, 6లతో 24 పరుగులు సాధించాడు.ఈ వేగంలో విండీస్ 19వ ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. కానీ ఆఖరి ఓవర్లో సెంచరీకి 2 పరుగుల దూరంలో పూరన్ రనౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్కు 2 వికెట్లు దక్కగా, అజ్మతులా ఒమర్జాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు. అఫ్గాన్ టపటపా... అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (28 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, నాలుగో వరుస బ్యాటర్ అజ్మతుల్లా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారంతే!ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. విండీస్ బౌలర్లలో పేసర్ ఒబెద్ మెకాయ్ 3 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు గుడకేశ్ మోతీ, అకిల్ హోసీన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగా ‘సూపర్–8’ పోరుకు సమాయత్తమైంది. చదవండి: పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్ శర్మ -
T20 World Cup 2024: ఆ మూడు టీమ్లు ఒకవైపు.. పూరన్ ఒక్కడు ఒకవైపు..!
టీ20 వరల్డ్కప్ 2024లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గ్రూప్-సిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై అదే గ్రూప్కు చెందిన ఉగాండ, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా చేసిన స్కోర్ల కంటే.. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఒక్కడు (ఆఫ్ఘనిస్తాన్పై) చేసిన స్కోరే అధికంగా ఉంది.ఆఫ్ఘనిస్తాన్పై ఉగాండ 58 పరుగులకు, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. అదే ఆఫ్ఘనిస్తాన్పై పూరన్ ఒక్కడు 98 పరుగులు చేశాడు. జట్టు మొత్తం చేయలేని పరుగులు పూరన్ ఒక్కడు చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్కప్లో ఆఫ్ఘన్ బౌలర్లపై (ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో) ఏ ఒక్క జట్టు కనీసం 100 పరుగుల మార్కును కూడా తాక లేకపోగా.. విండీస్ మాత్రం ఏకంగా 218 పరుగులు చేసింది.విండీస్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (98), జాన్సన్ ఛార్లెస్ (43), హోప్ (25), పావెల్ (26) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. విండీస్ బౌలర్ల ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విండీస్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి నుంచి విండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేకుండా పోయింది.గ్రూప్-ఏ నుంచి భారత్ (A1), యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించగా,, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
అఫ్గాన్ను చిత్తు చేసిన విండీస్.. 104 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించింది. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. కరేబియన్ బౌలర్ల దాటికి 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అకిల్ హుస్సేన్, మోటీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రస్సెల్, జోషఫ్ కూడా చెరో వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయ్యారు.పూరన్ ఊచకోత..అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్కప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. కాగా గ్రూపు సి నుంచి అఫ్గానిస్తాన్, విండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
పూరన్ విధ్వంసం.. టీ20 వరల్డ్కప్-2024లో భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్లో జూలు విదిల్చింది. సెయింట్ లూసియా వేదికగా గ్రూపు-సిలో భాగంగా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు అదరగొట్టారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని పూరన్ కోల్పోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్కప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో గేల్ అల్టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
వామ్మో.. ఇదేమి సిక్స్రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి
టీ20 వరల్డ్కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్ విజయం సాధించింది. అయితే పీఎన్జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్ తీవ్రంగా శ్రమించింది. 137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.పూరన్ భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో పూరన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్రైజర్స్ కెప్టెన్.. The man-in-form! 💥After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
LSG Vs DC: కుల్దీప్ మ్యాజిక్ డెలివరీ.. పూరన్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్ అద్బుతమైన బంతితో లక్నో విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి పూరన్కు కుల్దీప్ ఆఫ్ స్టంప్ దిశగా అద్బుతమైన గూగ్లీని సంధించాడు. అయితే బంతి టర్న్ అవుతుందని భావించిన పూరన్ ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. గానీ బంతి ఎటువంటి టర్న్ కాకుండా బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చేసిన పూరన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. కుల్దీప్ దెబ్బకు పూరన్ ఖాతాతెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో కుల్దీప్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍 Kuldeep Yadav straight away unveiling his magic!👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
పూరన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ కేవలం 21 బంతుల్లో 5 సిక్స్లు, ఒక ఫోర్తో 40 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పూరన్ కొట్టిన ఓ సిక్సర్ అందరిని షాక్ గురిచేసింది. లక్నో ఇన్నింగ్స్ 19 ఓవర్లో రీస్ టాప్లీ వేసిన ఫుల్ టాస్ బాల్ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పూరన్ 146 పరుగులు చేశాడు. 106m monstrous six! 🤯 Nicholas Pooran smashes one out of the park 💥 💯 sixes in #TATAIPL for the @LucknowIPL batter 💪 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE #RCBvLSG pic.twitter.com/7X0Yg4VbTn — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
పాండ్యాకు బిగ్ షాక్..!?
ఐపీఎల్-2024 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వైస్ కెప్టెన్గా విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లక్నో వెల్లడించింది. పూరన్కు నెం 29తో కూడిన వైస్ కెప్టెన్ జెర్సీని లక్నో సారథి కేఎల్ రాహుల్ అందించాడు. కాగా గత రెండు సీజన్లలో రాహుల్ డిప్యూటీగా వ్యవహరించిన స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా స్ధానాన్ని పూరన్ భర్తీ చేయనున్నాడు. ఇక నికోలస్ పూరన్ ప్రస్తుతం టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన యూఏఈ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ను ఛాంపియన్గా నిలిపాడు. కాగా ఐపీఎల్-2023 వేలంలో పూరన్ను రూ.16 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: స్ట్రైక్రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి? 🚨BREAKING🚨: Lucknow Super Giants have appointed Nicholas Pooran as the vice-captain for IPL 2024. 📸: LSG#IPL2024 #LSG pic.twitter.com/ZYtiqVm0Eb — CricTracker (@Cricketracker) February 29, 2024 -
పూనకాలు తెప్పించిన పూరన్.. మరో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ టైటిల్ను ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్ టీమ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. MI won the T20 league in India.MI won the T20 league in America.MI won the T20 league in Dubai. - MI franchise is ruling everywhere 🏆🫡 pic.twitter.com/ORTEE65GD0— Johns. (@CricCrazyJohns) February 17, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-20-2), విజయ్కాంత్ వియాస్కాంత్ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్ తలో వికెట్ పడగొట్టారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టార్ ఆటగాళ్లు సికందర్ రజా (10), రోవ్మన్ పావెల్ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన ముంబై కెప్టెన్ పూరన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్. MI won CLT20 in 2011MI won IPL in 2013MI won CLT20 in 2013MI won IPL in 2015MI won IPL in 2017MI won IPL in 2019MI won IPL in 2020MI won WPL in 2023MINY won MLC in 2023MIE won ILT20 in 2024The Dominance of MI franchise. 🤯🔥 pic.twitter.com/GcGDcOqQ4I— Johns. (@CricCrazyJohns) February 17, 2024 -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్లో ఒకలా మరో, మరో లీగ్లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్లో ఎంఐ కేప్టౌన్ కథ ముగిసింది. -
ఇదేమి సిక్స్రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. కాగా ఈ మ్యాచ్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵 Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V — Zee Cricket (@ilt20onzee) January 26, 2024 -
చెలరేగిన పూరన్, స్మట్స్.. 48 బంతుల్లోనే శతక్కొట్టిన డస్సెన్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ ఆటగాళ్లు వాన్ డర్ డస్సెన్, రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడగా.. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో జరిగిన మ్యాచ్లో డర్బన్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్మట్స్ రెచ్చిపోయారు. డస్సెన్ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్ జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్ లిండే, ఓలీ స్టోన్ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్, రబాడ, లివింగ్స్టోన్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో డు ప్లూయ్ (48), రొమారియో షెపర్డ్ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చెలరేగిన పూరన్, స్మట్స్.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో (సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో) నికోలస్ పూరన్ (31 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో టామ్ ఏబెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (55), మార్క్రమ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్మట్స్, ప్రిటోరియస్, గ్లీసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్టౌన్కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జోర్డన్ కాక్స్, పలువురు విండీస్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్లో నార్త్ర్న్ వారియర్స్ ఆటగాడు కెన్నార్ లెవిస్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా టైగర్స్ ఆటగాడు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 90 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్లో గ్లాడియేటర్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (16 బంతుల్లో 40 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. కెన్నార్ లెవిస్తో పాటు హజ్రతుల్లా జజాయ్ (27 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్ అబుదాబీపై నార్త్ర్న్ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్లో చెన్నై బ్రేవ్స్పై మోర్స్విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. అసలంక (31), కోబ్ హెర్ఫ్ట్ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్ గౌస్ (43), ఫాఫ్ డుప్లెసిస్ (31) రాణించడంతో మోర్స్విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డెక్కన్ గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా టైగర్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ జోర్డన్ కాక్స్ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్.. పూరన్ , ఫేబియన్ అలెన్ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
ICC: అద్భుత ఇన్నింగ్స్.. ఐసీసీ అవార్డు అతడికే! వరల్డ్కప్లో..
ICC Men's Player of the Month: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్ ఖాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజంకు క్రికెట్ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో విఫలమైన బాబర్.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు. నేపాల్పై శతక్కొట్టిన బాబర్ తద్వారా.. పాకిస్తాన్ అఫ్గన్ జట్టును 3-0తో వైట్వాష్ చేయడంలో బాబర్ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్తో మ్యాచ్లో బాబర్ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు. అరుదైన రికార్డు తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్లో బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్కప్లోనూ సత్తా చాటి ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్ ఆజం.. ఆసియా కప్- వన్డే వరల్డ్కప్-2023లో గెలుపొంది పాకిస్తాన్ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో బాబర్ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు. చదవండి: Asia Cup: షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్కు కమిలిపోయింది..!
5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్) కావడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్ ప్లేయర్లు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్మన్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచిన నికోలస్ పూరన్ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్లో పూరన్ 141.94 స్ట్రయిక్ రేట్తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. The after effects 😂 thank you brandon king and arsdeep. pic.twitter.com/7jOHS46NSr — NickyP (@nicholas_47) August 14, 2023 అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించిన పూరన్కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్ సహచరుడు బ్రాండన్ కింగ్, ప్రత్యర్ధి అర్షదీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉండగా కింగ్ కొట్టిన ఓ షాట్ నేరుగా వచ్చి పూరన్ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది. పూరన్ ఇదే మ్యాచ్లో అర్షదీప్ బౌలింగ్లోనూ గాయపడ్డాడు. కింగ్ దెబ్బ మరువక ముందే అర్షదీప్ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్ కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్ మ్యాచ్ అనంతరం సోషల్మీడియాలో పోస్ట్ చేసి కింగ్, అర్షదీప్లను థ్యాంక్స్ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్, అర్షదీప్లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్ తన బ్యాటింగ్ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్తో అతను రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్లో పూరన్ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్.. షాయ్ హోప్ (22) సహకారంతో విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్..
West Indies vs India, 5th T20I - Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీమిండియాతో టీ20 సిరీస్లో అదరగొట్టాడు. మేజర్ క్రికెట్ లీగ్-2023 ఫామ్ను కొనసాగిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో నిక్కీ వరుసగా 41, 67(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 20, 1, 47 పరుగులు సాధించాడు. పాండ్యా బౌలింగ్లో.. ముఖ్యంగా నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్)తో కలిసి విండీస్ను గెలుపుబాట పట్టించడంలో కీలకంగా వ్యవహరించాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో రెండు సిక్స్లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బాదినవే! చాలెంజ్కు ప్రతీకారంగా అయితే, ఆట తీరుతో ఆకట్టుకున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యాకు మించిన ఆటిట్యూడ్తో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో టీ20 ముగిసిన తర్వాత హార్దిక్.. ‘‘నిక్కీ నా బౌలింగ్ను టార్గెట్ చేస్తాడేమో! మరేం పర్లేదు.. నాకిలాంటివి ఇష్టమే. అతడు నా మాటలు విని నన్ను లక్ష్యంగా చేసుకున్నా.. ఆఖర్లో నాకు వికెట్ సమర్పించుకోవాల్సిందే!’’ అని చాలెంజ్ విసిరాడు. నోరు మూసుకోండి అయితే, ఐదో టీ20లో ఇది బ్యాక్ఫైర్ అయింది. పాండ్యా బౌలింగ్లోనే పూరన్ మంచి షాట్లు ఆడాడు. కానీ.. తిలక్ వర్మ బౌలింగ్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. విజయానంతరం వెంటనే విండీస్కు బయల్దేరిన నికోలస్ పూరన్ షేర్ చేసిన రీల్ టీమిండియా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అకీల్ హొసేన్తో కలిసి.. ‘‘నోరు మూసుకోవాలి’’ అన్నట్లు అభినయించాడు. అక్కడ చూపించు నీ సత్తా ‘‘ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే.. తెలుసనే అనుకోండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో నిక్కీ హార్దిక్నే టార్గెట్ చేశాడని.. భారత జట్టును కూడా అవమానించే విధంగా వ్యవహరించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మేజర్ ఈవెంట్లో నీ సత్తా చూపించు.. అప్పుడు నమ్ముతాం గొప్ప బ్యాటర్వి అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 View this post on Instagram A post shared by Nicholas Pooran (@nicholaspooran) -
Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో
West Indies vs India, 5th T20I: వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఓడిపోయి ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. అరంగేట్రంలో అదరగొట్టి కేవలం ఐపీఎల్కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటగలమని నిరూపించారు. అరంగేట్ర మ్యాచ్లోనే విలువైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్ తొలి టీ20లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్ కూడా.. ఇక వెస్టిండీస్తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో వీరిద్దరితో బౌలింగ్ కూడా చేయిస్తామంటూ టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొన్న విషయం తెలిసిందే. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి వికెట్గా బిగ్ హిట్టర్ అందుకు తగ్గట్లుగానే తిలక్ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నికోలస్ పూరన్ వంటి బిగ్ హిట్టర్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాండన్ కింగ్తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్ ఆట కట్టించాడు. 35 బంతుల్లో 47 పరుగులతో జోరు మీదున్న అతడిని బోల్తా కొట్టించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్లో తిలక్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్.. స్విచ్ హిట్కు యత్నించి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అయితే, విండీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో పూరన్ పెవిలియన్ చేరాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నికోలస్ పూరన్ రూపంలో తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. బ్యాట్ ఝులిపించి.. బౌలింగ్లోనూ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య కరేబియన్ జట్టు 3-2తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక విండీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తిలక్ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు సాధించాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో ఈ హైదరాబాదీ 27 పరుగులు చేయగలిగాడు. చదవండి: ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్
టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్పై విండీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ విజయంలో పేసర్ షెఫార్డ్, బ్యాటర్లు కింగ్, పూరన్ కీలక పాత్ర పోషించారు. హార్దిక్కు చుక్కలు చూపించిన పూరన్.. ఇక టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్ పాండ్యా.. పూరన్కు ఓ సవాలు విసిరాడు. "పూరన్ కొడితే నా బౌలింగ్లోనే కొట్టాలి. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో హార్దిక్ బౌలింగ్ను ఎదుర్కొనే ఛాన్స్ పూరన్కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్ బౌలింగ్ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్కు పూరన్ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అందులో రెండు సిక్సర్లు హార్దిక్ ఓవర్లో కొట్టినివే. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హార్దిక్ బౌలింగ్లో ఆఖరి రెండు బంతులను పూరన్ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్లో అయితే ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ In 3rd T20I - Hardik pandya Gave an Overconfident Statement about Nicholas pooran. In 5th T20I - Nicholas Pooran Smashed him all over the park for 6 and 4. This is what I don't like About Hardik Pandya! pic.twitter.com/7XL2X97rn8 — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 13, 2023 Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 -
Ind vs WI 5th T20I: టి20 సిరీస్ను 3–2తో సొంతం చేసుకున్న వెస్టిండీస్ (ఫొటోలు)
-
ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
లాడెర్హిల్ (ఫ్లొరిడా): బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్తో భారత్ కరీబియన్ పర్యటనను నిరాశతో ముగించింది. టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత జట్టు టి20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–2తో చేజిక్కించుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు మెరిపిస్తే... సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నడిపించాడు. విండీస్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఆదుకున్న సూర్య టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ తీరా బ్యాటింగ్కు దిగగానే కష్టాలు ఎదురయ్యాయి. హోసీన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి (5), గిల్ (9) వికెట్లను పడేశాడు. ఈ దశలో సూర్యకుమార్కు జతయిన తిలక్ వర్మ ధనాధన్ ఆటాడాడు. కానీ కాసేపట్లోనే చేజ్ అతని మెరుపులకు రిటర్న్ క్యాచ్తో ముగింపు పలికాడు. సంజూ సామ్సన్ (13) నిరాశపరచగా, తనశైలి షాట్లతో సూర్యకుమార్ జట్టును ఆదుకున్నాడు. భారీ సిక్సర్తో సూర్య ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయ్యింది. అయితే వానొచ్చి కాసేపు ఆటను ఆపేసింది. తర్వాత ఆట మొదలవగానే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 14; 1 సిక్స్) షెఫర్డ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాన్లో హోల్డర్ చేతికి చిక్కాడు. తర్వాత సూర్యకుమార్ను హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. యార్కర్ లెంత్ బాల్ నేరుగా వికెట్ల ముందున్న అతని ప్యాడ్లకు తగిలినా... ఫీల్డ్ అంపైర్ అప్పీల్ను తోసిపుచ్చాడు. బంతి గమనం ఇన్లైన్లో ఉండటంతో విండీస్ డీఆర్ఎస్కు వెళ్లి ఫలితాన్ని రాబట్టింది. సరిగ్గా ఇలాగే మరో రివ్యూ (డీఆర్ఎస్)తో కుల్దీప్ (0) వికెట్ను షెఫర్డ్ దక్కించుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంకో రెండు బంతులు ఉండగా మళ్లీ వర్షమొచ్చి ఆగినా... వెంటనే మొదలైంది. కానీ అక్షర్ పటేల్ (10 బంతుల్లో 13; 1 సిక్స్) అవుట్కాగా ఆఖరి బంతిని ముకేశ్ కీపర్ తలపైనుంచి బౌండరీకి తరలించాడు. కింగ్, పూరన్ల జోరుతో లక్ష్యఛేదనకు దిగగానే అర్ష్దీప్ సింగ్ ఓపెనర్ మేయర్స్ వికెట్ను పడగొట్టడంతో భారత్ సంబరమైతే చేసుకుంది. కానీ ఈ ఆనందం అంతటితోనే ఆవిరైంది. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ స్కోరు బోర్డును భారీ సిక్సర్లు, బౌండరీలతో పరుగు పెట్టించారు. పేస్, స్పిన్ ఇలా ఎవరు వేసినా రన్రేట్ మాత్రం ఓవర్కు 9 పరుగుల చొప్పున దూసుకెళ్లింది. హిట్టర్లు ఇద్దరూ పాతుకుపోవడంతో వికెట్ పడగొట్టడం భారత బౌలర్ల వల్ల కాలేకపోయింది. వర్షం మళ్లీ చికాకు పెట్టినా విరామం తర్వాత మొదలైంది. పూరన్ను తిలక్ వర్మ బోల్తా కొట్టించాడు. కానీ మిగతా లాంఛనాన్ని 38 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేసుకున్న కింగ్, షై హోప్ (13 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తి చేశారు. పాండ్యా ఏకంగా 8 మందిని బౌలింగ్కు దించినా 2 వికెట్లనే పడగొట్టగలిగాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) హోసీన్ 5; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోసీన్ 9; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 61; తిలక్వర్మ (సి అండ్ బి) చేజ్ 27; సామ్సన్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 13; పాండ్యా (సి) హోల్డర్ (బి) షెఫర్డ్ 14; అక్షర్ (సి) షెఫర్డ్ (బి) హోల్డర్ 13; అర్ష్దీప్ (బి) షెఫర్డ్ 8; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షెఫర్డ్ 0; చహల్ (నాటౌట్) 0; ముకేశ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 165. వికెట్ల పతనం: 1–6, 2–17, 3–66, 4–87, 5–130, 6–140, 7–149, 8–149, 9–161. బౌలింగ్: అకిల్ హోసీన్ 4–0–24–2, మేయర్స్ 1–0–4–0, హోల్డర్ 4–0–36–2, జోసెఫ్ 3–0–41–0, చేజ్ 4–0–25–1, షెఫర్డ్ 4–0–31–4. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (నాటౌట్) 85; మేయర్స్ (సి) యశస్వి (బి) అర్ష్దీప్ 10; పూరన్ (సి) పాండ్యా (బి) తిలక్ వర్మ 47; షై హోప్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 7. మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–12, 2–119. బౌలింగ్: పాండ్యా 3–0–32–0, అర్ష్దీప్ 2–0–20–1, కుల్దీప్ 4–0–18–0, చహల్ 4–0–51–0, ముకేశ్ 1–0–10–0, తిలక్ వర్మ 2–0–17–1, అక్షర్ 1–0–8–0, యశస్వి 1–0–11–0 -
నికోలస్ పూరన్కు బిగ్షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?
గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు ఐసీసీ బిగ్షాకిచ్చింది. అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. లెవెల్-1 ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పూరన్కు ఫైన్ విధించారు ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో నాలుగో బంతిని కైల్మైర్స్ లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటని వేలు పైకెత్తాడు. వెంటనే మైర్స్ నాన్స్ట్రైక్లో ఉన్న పూరన్తో చర్చించి రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఫలితం అంపైర్కాల్ తేలింది. దీంతో మైర్స్ పెవిలియన్కు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో పూరన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మీరు ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా నాటౌట్" అంటూ బహిరంగంగా విమర్శించాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ పూరన్పై చర్యలు తీసుకున్నాడు. కాగా పూరన్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 గయనా వేదికగా ఆగస్టు 8న జరగనుంది. చదవండి:ODI WC 2023: 12 ఏళ్ల తర్వాత మళ్లీ.. ప్రపంచకప్లో విజయం మాదే: రోహిత్ శర్మ -
నికోలస్ పూరన్ ఊచకోత.. టీమిండియాపై సరికొత్త చరిత్ర!
టీమిండియాతో టీ20 సిరీస్లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గయానా వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన విండీస్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. ముఖ్యంగా 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ఏకంగా 18 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 సిక్స్లు, 6 ఫోర్లు సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ సాధించిన రికార్డులు ఇవే.. ►టీమిండియాపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఇప్పటివరకు భారత్పై 524 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(500) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఫింఛ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా భారత్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన మొదటి క్రికెటర్గా పూరన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టీమిండియాపై 5 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జోస్బట్లర్, మున్రో, డికాక్ పేరిట ఉండేది. వీరిముగ్గురు 4 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. చదవండి: World Cup 2023: ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ That's a Nicholas-ty Blow!#StreamingLiveOnFanCode #WIvIND pic.twitter.com/e9mZvCF4JU — FanCode (@FanCode) August 3, 2023 -
Ind Vs WI: విండీస్ విధ్వంసకర వీరుడు.. కోటీశ్వరుడు! ఖరీదైన కార్లు.. ఆస్తి?
Nicholas Pooran's Lavish Lifestyle: టెస్టు, వన్డే సిరీస్లలో టీమిండియా చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ట్రినిడాడ్లోని తరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో గురువారం యువ భారత జట్టుతో తొలి మ్యాచ్లో తలపడనుంది. ఐదు టీ20ల సిరీస్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్కు విధ్వంసర ఆటగాడు నికోలస్ పూరన్తో పాటు జేసన్ హోల్డర్ రాక బలంగా మారింది. కాగా వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్.. మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఆడిన సునామీ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఎంఐ న్యూయార్క్కు ప్రాతినిథ్య వహించిన పూరన్ ఏకంగా 10 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. కోటీశ్వరుడే! పూరన్ ఆట సంగతి ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కరేబియన్ దీవికి చెందిన ధనవంతులైన క్రికెటర్లలో పూరన్కూ చోటుంది. ఈ ఏడాది హయ్యస్ట్ పెయిడ్ విండీస్ క్రికెటర్ల జాబితాలో అతడు స్థానం సంపాదించాడు. ఐపీఎల్ ద్వారా అధికాదాయం ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ 2023 వేలంలో భాగంగా అత్యధికంగా ఈ హిట్టర్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఎల్, మేజర్ లీగ్ క్రికెట్ తదితర లీగ్లలో పూరన్ ఆడుతున్నాడు. అదే విధంగా.. పూమా, నైకీ తదితర ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ నెట్వర్త్ రూ. 25 కోట్లకు పైగానే ఉన్నట్లు వన్క్రికెట్ అంచనా వేసింది. చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడి బాల్య స్నేహితురాలు కాథెరినా మిగ్యూల్ను ప్రేమించిన నికోలస్ పూరన్ 2021 జూన్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అలియారా అనే కూతురు ఉంది. కుటుంబాన్ని ప్రేమించే పూరన్ భార్యాబిడ్డలతో ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఖరీదైన కార్లు నికోలస్ పూరన్ వద్ద సుమారు రూ. 2.26 కోట్ల విలువైన BMW i8, 28 లక్షల ధర గల Hyundai Tucson కార్లు ఉన్నట్లు సమాచారం. ఫేవరెట్లు వీరే 27 ఏళ్ల నికోలస్ పూరన్కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లియర్స్ రోల్మోడల్స్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్లను పూరన్ ఆదర్శంగా భావిస్తాడు. కాగా ఎంఎల్సీలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడిన పూరన్ టీమిండియాపై ఎలా ఆడతాడో చూడాలి! ఈ లెఫ్టాండర్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడతాడా లేదంటే భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! విండీస్తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే! ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ 1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa — Major League Cricket (@MLCricket) July 31, 2023 -
టీమిండియాతో తొలి టీ20.. విండీస్ సిక్సర్ల కింగ్ వచ్చేశాడు! బౌలర్లూ జాగ్రత్త
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్లు కోల్పోయిన వెస్టిండీస్ మరో కీలకపోరుకు సిద్దమైంది. టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 గురువారం ట్రినిడాడ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనుంది. కనీసం టీ20 సిరీస్లోనైనా నెగ్గి పరువునిలబెట్టుకోవాలనే పట్టుదలతో విండీస్ బరిలోకి దిగుతోంది. ఇక ఈ టీ20 సిరీస్కు విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్, స్టార్ ఆల్రౌండర్ తిరిగి జట్టులోకి రావడం విండీస్కు కాస్త ఊరటను కలిగించే ఆంశం. మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కారణంగా భారత్తో వన్డే సిరీస్కు పూరన్ దూరమైన సంగతి తెలిసిందే. అదే విధంగా హోల్డర్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి రావడం విండీస్ కొత్త జోష్లో కన్పిస్తోంది. వీరిద్దరికి తొలి టీ20లో చోటుదక్కడం ఖాయమన్పిస్తోంది. భారత బౌలర్లూ జాగ్రత్త.. ఇక పూరన్ ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. ఓవరాల్గా ఓవరాల్గా ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, 13 సిక్స్లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా టోర్నీ టాప్ స్కోరర్గా పూరన్(388) నిలిచాడు. సంచలన ఫామ్లో ఉన్న పూరన్ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. కాబట్టి అతడిని వీలైనంత వేగం పెవిలియన్కు పంపితే భారత జట్టుకు అంతమంచిది. హెట్మైర్ కూడా.. అదే విధంగా ఏడాది తర్వాత షెమ్రాన్ హెట్మైర్ కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు విండీస్ జట్టుకు ఫినిషర్గా మారే అవకాశం ఉంది. ఐపీఎల్లో కూడా రాజస్తాన్ రాయల్స్కు అతడు ఫినిషర్గా ఎన్నో అద్భుతమైన విజయాలు అందిచాడు. ఈ క్రమంలో హెట్మైర్ కూడా తన బ్యాట్కు పనిచెప్పితే కొండంత లక్ష్యం చిన్నబోతోంది. అయితే భారత్తో జరిగిన వన్డే సిరీస్లో మాత్రం హెట్మైర్ తీవ్ర నిరాశ పరిచాడు. టీమిండియాదే పై చేయి.. ఇక టీ20ల్లో విండీస్పై భారత్దే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 25 మ్యాచ్ల్లో తలపడగా.. భారత్ 17 సార్లు విజయం సాధించగా, విండీస్ కేవలం 7 సార్లు మాత్రమే గెలుపొందింది. తొలి టీ20కు విండీస్ తుది జట్టు(అంచనా) కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, ఒషానే థామస్ చదవండి: #Rinku Singh: ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పని ఇంకా మానలేదు! ఆయన అంతే.. -
టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ టీ20లకు అందుబాటులోకి వచ్చింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పూరన్కు చోటు దక్కింది. అమెరికా వేదికగా జరిగిన మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీబీజీగా ఉన్న పూరన్.. భారత్తో వన్డేల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ టోర్నీ సోమవారం(జూలై31)తో ముగియడంతో పూరన్ తన సొంత జట్టుతో కలవనున్నాడు. ఫైనల్ మ్యాచ్లో పూరన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఆ ముగ్గురు ఎంట్రీ.. అదే విధంగా దాదాపు ఏడాది నుంచి విండీస్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హెట్మైర్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్కు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్పై టీ20ల్లో ఆడారు. ఆగస్టు1న ట్రినిడాడ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం భారత్-విండీస్ మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది. మంగళవారం ట్రినిడాడ్ వేదికగా జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్ ఓడియన్ స్మిత్, ఒషానే థామస్. భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: LPL 2023: మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్ -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్కు మాత్రం..
Major League Cricket 2023- Seattle Orcas vs MI New York, Final: మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టించాడు. సీటెల్ ఓర్కాస్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. డల్లాస్లో జరిగిన లీగ్ తుదిపోరులో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ అజేయ సెంచరీ(137)తో మెరిశాడు. పరుగుల సునామీ ఏకంగా.. 249.09 స్ట్రైక్రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ వెస్టిండీస్ బ్యాటర్ అద్భుత ఆట తీరు కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎంఐ న్యూయార్క్.. ఎంఎల్సీ(MLC) అరంగేట్ర ఎడిషన్ విజేతగా అవతరించింది. సీటెల్ ఓర్కాస్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి చాంపియన్గా నిలిచింది. అయితే, నికోలస్ పూరన్ ఇన్నింగ్స్.. అతడి రికార్డులకు జమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ టీ20 లీగ్ను యూఎస్ఏ నిర్వహిస్తోంది. ఇక యూఎస్ఏ అసోసియేట్ మెంబర్ మాత్రమే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. మేజర్ క్రికెట్ లీగ్కు అధికారిక (టీ20) హోదా ఉండదు. అయ్యో పాపం.. నామమాత్రం ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ అజేయ అద్భుత శతకాన్ని ఓ మరుపురాని ఇన్నింగ్స్గా గుర్తుపెట్టుకోవడమే తప్ప.. అతడి రికార్డుల్లో దీనికి ఎటువంటి స్థానం ఉండదు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు భాగమైన ఎంఎల్సీలో మొత్తంగా ఆరు జట్లు ఉన్నాయి. ఆరు జట్ల మధ్య పోటీ జూలై 13న మొదలైన ఈ టీ20 లీగ్లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సీటెల్ ఓర్కాస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం పేరిట ఆరు టీమ్లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో జూలై 30 నాటి ఫైనల్లో ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ న్యూయార్క్ ఫైనల్లో సీటెల్ను ఓడించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఎంఐ జట్టుకు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ పూరన్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ 1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa — Major League Cricket (@MLCricket) July 31, 2023 -
నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ! 13 సిక్స్లతో
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్ ఛాంపియన్స్గా ముంబై న్యూయర్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా జరిగిన ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ను 7 వికెట్ల తేడాతో న్యూయర్క్ చిత్తు చేసింది. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై న్యూయర్క్ 3 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. నికోలస్ పూరన్ ఊచకోత.. ఇక ఫైనల్ పోరులో ముంబై న్యూయర్క్ ఆటగాడు నికోలస్ పూరన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన ఈ కరేబియన్ వీరుడు.. కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, 13 సిక్స్లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 184 టార్గెట్లో 70 శాతం పైగా పరుగులు పూరన్ సాధించినవే కావడం గమానర్హం. కాగా ఈ టోర్నీ ఆసాంతం పూరన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. 8 మ్యాచ్లు ఆడిన పూరన్ 388 పరుగులు సాధించాడు. డికాక్ ఇన్నింగ్స్ వృధా.. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో డికాక్(87) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితోపాటు శుబమ్ రాజనే(29) పరుగుతో రాణించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించగా.. టేలర్, డేవిడ్ వీసీ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: IND vs WI: బంతిని చూడకుండా భారీ సిక్సర్.. షాక్ తిన్న టీమిండియా బౌలర్! వీడియో వైరల్ -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్కు ముంబై
మేజర్ లీగ్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు, సీయాటిల్ ఆర్కాస్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఆర్కాస్ జట్టు.. ఎంఐ న్యూయార్క్పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. A KLAAssic century and celebration 💯 🙌 💥 #MajorLeagueCricket's first-ever CENTURY. HISTORY. MADE. 💚 🐳 pic.twitter.com/Bq5MotMfYU — Major League Cricket (@MLCricket) July 26, 2023 తొలుత పూరన్, ఆఖర్లో బౌల్ట్.. ఆర్కాస్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తొలుత నికోలస్ పూరన్ (34 బంతుల్లో 68; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మధ్యలో పోలార్డ్ (18 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెచ్చిపోగా.. టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), డేవిడ్ వీస్ (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) తలో చేయి వేశారు. ఆర్కాస్ బౌలర్లలో ఇమాద్ వసీం, హర్మీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. గానన్, ఆండ్రూ టై తలో వికెట్ దక్కించుకున్నారు. NICKY P HAS COME TO PLAY!🏏 Nicholas Pooran has RACED🏇 to 23 RUNS off just 8 balls! 4⃣6⃣/2⃣ (5.0) pic.twitter.com/GBrY5XAYed — Major League Cricket (@MLCricket) July 25, 2023 RASHID KHAN TRAPS QDK IN FRONT!😱 Huge wicket for @MINYCricket! 2⃣5⃣/1⃣ (3.2) pic.twitter.com/u3NqqAusnr — Major League Cricket (@MLCricket) July 25, 2023 An innings that will go down in history 👏 Heinrich Klaasen wins the Player of the Match award for his outstanding 💯 #MLC2023 pic.twitter.com/LGYxguTdJf — Major League Cricket (@MLCricket) July 26, 2023 రాణించిన నౌమాన్.. శతక్కొట్టిన క్లాసెన్ 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లలో డికాక్ (9) విఫలం కాగా.. నౌమాన్ అన్వర్ (30 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆతర్వాత బరిలోకి దిగిన జయసూర్య డకౌట్ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన క్లాసెస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. HEINRICH KLAASEN IS TAKING ON EVERYBODY! Heinrich Klaasen BLASTS 3 SIXES against Rashid Khan! 1⃣6⃣6⃣/4⃣ (15.5) pic.twitter.com/nYJQrnXh06 — Major League Cricket (@MLCricket) July 26, 2023 WELCOME TO THE KLAAS-ROOM!👨🏫 Heinrich Klaasen demonstrating a MASTERCLASS⚔️ in playing spin! 9⃣8⃣/2⃣ (10.2) pic.twitter.com/z6sTIYjdpx — Major League Cricket (@MLCricket) July 25, 2023 INNOVATION! 🧑🔬 Nauman Anwar brings out the SCOOP! 6⃣0⃣/2⃣ (8.0) pic.twitter.com/IemmlFecTY — Major League Cricket (@MLCricket) July 25, 2023 బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి అజేయ శతకంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క బంతితో బౌల్డ్ (4-0-31-4), రషీద్ ఖాన్ (4-1-41-2) చెలరేగుతున్నా ఏమాత్రం తగ్గని క్లాసెన్.. ఆండ్రూ టై (4 నాటౌట్) సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడినా.. ఆర్కాస్, సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లతో పాటు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ లీగ్ నుంచి నిష్క్రమించాయి. WHAT A LAST OVER BY TRENT BOULT! 3 WICKETS, BUT FOUR ON THE NIGHT! pic.twitter.com/zt05U5A8el — Major League Cricket (@MLCricket) July 26, 2023 Where we stand at the end of the group stage 🤗 Onto playoffs at Grand Prairie Stadium!!! 🇺🇸 🏏 🏟️ #MajorLeagueCricket | Abound by the Times of India pic.twitter.com/ndYMAHsh5E — Major League Cricket (@MLCricket) July 26, 2023 -
పూరన్ ఊచకోత.. 6 సిక్స్లు, 4 ఫోర్లతో! ముంబై ఘన విజయం
అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయర్క్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. అదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ విజయభేరి మోగించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయర్క్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. న్యూయర్క్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ప్రత్యర్ది బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్లతో 62 పరుగులు సాధిచి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా వాషింగ్టన్ బౌలర్ ఓబుస్ పియెనార్కు పూరన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన పియెనార్ బౌలింగ్లో పూరన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. అందులో 3 సిక్స్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను మేజర్ లీగ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతడితో పాటు ముంబై ఓపెనర్ మునాక్ పటేల్(44) పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వాషింగ్టన్ బ్యాటర్లలో ఫిలిప్స్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IND vs WI: ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్.. ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు! THE BOUNDARIES ARE FLOWING!🌊🌊🌊 Nicholas Pooran JOINS THE PARTY🎉 with 3 SIXES in FOUR BALLS! 9⃣1⃣/1⃣ (8.5) pic.twitter.com/zDvMCbTcUr — Major League Cricket (@MLCricket) July 23, 2023 -
సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా, విండీస్ వైట్బాల్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ సత్తా చాటారు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్ 13 స్థానాలు జంప్ చేసి టాప్ 20లోకి (19వ స్పాట్) ప్రవేశిస్తే.. సికందర్ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్కు ఎగబాకాడు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో బంతితోనూ సత్తా చాటిన సికందర్.. ఆల్రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్కు చేరాడు. బౌలింగ్లో 4 మ్యాచ్ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్కు చేరగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు. వీరితో పాటు క్వాలిఫయర్స్లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్కు, జింబాబ్వే సీన్ విలియమ్స్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్కు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టాప్-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్లో బాబర్ ఆజమ్, బౌలింగ్లో హాజిల్వుడ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్ 10లో ఉండగా.. బౌలింగ్లో సిరాజ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. -
ప్రపంచకప్లో సంచలనం, ఆంధ్ర ఆటగాడి విధ్వంసకర శతకం.. విండీస్కు ఘోర పరాభవం
వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్.. నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. విండీస్ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4) ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శతక్కొట్టిన పూరన్.. రాణించిన బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ ఛార్లెస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. తేజ నిడమనూరు వీరోచిత శతకం.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్ సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ ఊచకోత కోశాడు. జేసన్ హోల్డర్ వేసిన ఆ ఓవర్లో వాన్ బీక్ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ చేతులెత్తేసింది. బ్యాట్తో మెరిసిన వాన్ బీక్ బంతితోనూ మాయ చేశాడు. తొలి బంతిని ఛార్లెస్ సిక్సర్ బాదగా.. రెండో బంతికి హోప్ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. ఛార్లెస్, హోల్డర్లను ఔట్ చేయడంతో విండీస్ కథ ముగిసింది. నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. -
సెంచరీలతో కదం తొక్కిన హోప్, పూరన్.. విండీస్ ఖాతాలో భారీ విజయం
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఎస్ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలైన యూఎస్ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఒమన్ (2 మ్యాచ్ల్లో 2 విజయాలు) టాప్లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
విండీస్ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్ ఊచకోత
CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తూ కెరీర్లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్కు ముందు యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2019 వరల్డ్కప్ తర్వాత హోప్ను మించినోడే లేడు.. విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
రాణించిన పూరన్, హోల్డర్.. పసికూనపై విండీస్ విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా ఇవాళ (జూన్ 18) జరిగిన రెండో మ్యాచ్లో యూఎస్ఏపై వెస్టిండీస్ ఓ మోస్తరు విజయం సాధించింది. హరారేలోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించినప్పటికీ, వారికి విజయం అంత ఈజీగా దక్కలేదు. విండీస్తో పోల్చుకుంటే యూఎస్ఏ టీమ్ చాలా చిన్నదే అయినా అద్భుత పోరాటపటిమ కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ను వారు మరో 3 బంతులు మిగిలుండగానే అలౌట్ చేశారు. విండీస్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. యూఎస్ఏ బౌలర్లు వారిని కట్టడి చేశారు. టీ20 స్పెషలిస్ట్లు అయిన బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) ఆటలు యూఎస్ఏ బౌలర్ల ముందు సాగలేదు. స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో గ్రూప్-ఏ మ్యాచ్లో నేపాల్పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బిలో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడనున్నాయి. -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్గా నిలిచాడు. 13 మ్యాచ్లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్బౌలర్గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
కావాలనే యశ్ చేతికి బంతినిచ్చా! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే!
IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాట పటిమ కనబరుస్తాం. నిజానికి ఒక దశలో వాళ్ల స్కోరు 61/1. అయినప్పటికీ.. ఇంకో 2-3 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మేము పోటీలో ఉంటామని భావించాను. అదే సమయంలో స్పిన్నర్లకు కాస్త పట్టు దొరికింది. అది మాకు అనుకూలించింది’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్లో లక్నో కోల్కతా నైట్ రైడర్స్తో శనివారం నాటి ఉత్కంఠ పోరులో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది. వరుసగా రెండో ఏడాది టాప్-4లో నిలిచి సత్తా చాటింది. పూరన్ అర్ధ శతకంతో.. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లక్నో నికోలస్ పూరన్ అద్భుత అర్థ శతకం కారణంగా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్కు ఓపెనర్ జేసన్ రాయ్(45) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (24) సైతం మెరుగ్గా రాణించాడు. రింకూ మరోసారి ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నితీశ్ రాణా (8), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్ (10) వెంట వెంటనే అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం పెవిలియన్కు క్యూ కట్టగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ విజృంభణ చూస్తే కేకేఆర్ విజయం సాధ్యమే అనిపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన తరుణంలో లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయాడు. నరాలు తెగే ఉత్కంఠ అతడి బౌలింగ్లో తొలి బంతికి 1 పరుగు రాగా, రెండో బంతి వైడ్ వెళ్లగా ఆ తర్వాతి రెండు బంతుల్లో పరుగులు రాలేదు. కానీ యశ్ మరోసారి వైడ్ వేశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టాడు. కానీ కేకేఆర్ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో కేకేఆర్ నిలిచిపోగా.. లక్నో ప్లే ఆఫ్స్నకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో సారథి కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. రింకూను ప్రశంసించాడు. ‘‘ఈ ఏడాది రింకూకు స్పెషల్. ప్రతీ మ్యాచ్లోనూ అతడు అద్భుతంగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి అలర్ట్ కావాల్సిందే. కావాలనే అతడికి బంతినిచ్చా ఈరోజు కూడా రింకూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆఖరి ఓవరల్లో యశ్ ఠాకూర్కు బంతినివ్వడాన్ని సమర్థించుకున్న కృనాల్.. ‘‘డెత్ ఓవర్లలో మప ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని ముందే బౌలర్లకు చెప్పాను. ప్రతీ బంతికి వాళ్లతో చర్చించాను. ఇక ఆఖర్లో యశ్ ఠాకూర్కు బంతినివ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. గత మ్యాచ్లో రివర్స్ సింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మొహిసిన్ను రంగంలోకి దింపాను. కోల్కతా వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే ఏదైతే అది అయిందని రిస్క్ చేసి మరీ యశ్కు బంతినిచ్చాను’’ అని తెలిపాడు. చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు జడేజాపై సీరియస్ అయిన ధోని! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌 Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ — IndianPremierLeague (@IPL) May 20, 2023 -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సంచలన ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 17 ఓవర్ వేసిన అభిషేక్ శర్మ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను లక్నోవైపు తిప్పాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్ 4 సిక్సర్లు, 3 ఫోర్లుతో 44 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఐపీఎల్లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్-2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో డ్యానియల్ క్రిస్టయన్ బౌలింగ్లో వరుసగా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లగా మలిచాడు. చదవండి: IPL 2023: అంపైర్తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్కు బిగ్ షాక్! భారీ జరిమానా Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7 — CricTracker (@Cricketracker) May 13, 2023 -
మాపై నట్లు, బోల్ట్లు విసిరారు.. మిమ్మల్ని ప్లే ఆఫ్స్ చేరకుండా చేశాము..!
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ (మే 13) జరిగిన మ్యాచ్లో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సన్రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఓ నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థర్డ్ అంపైర్ని దూషిస్తూ, లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్ట్లు విసిరారు. దీంతో స్టేడియంలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. లక్నో శిబిరంలోని వారు మైదానంలోకి వచ్చారు. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఎస్ఆర్హెచ్ అభిమానుల ప్రవర్తించిన తీరు పట్ల లక్నో బృందంతో పాటు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే లక్నో శిబిరంలోని వారికి అంపైర్లు సర్ధిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం మ్యాచ్ సజావుగా సాగింది. నిర్ణీత ఓవర్లలో సన్రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో పూరన్ విధ్వంసం సృష్టించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్లో లక్నో విజయానంతరం ఆ జట్టు అభిమానులు ఎస్ఆర్హెచ్ను టార్గెట్ చేస్తూ సోషల్మీడియా వేదికగా అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారు. కొందరు ఆకతాయిలు చేసిన పనికి (బోల్ట్లు, నట్లు విసిరినందుకు గాను) వారు మొత్తం ఎస్ఆర్హెచ్ టీమ్నే బ్లేమ్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఎస్ఆర్హెచ్ ఓడిన వైనాన్ని అవమానిస్తున్నారు. ఆకతాయిలు చేసిన చెత్త పనిని ప్రస్తావిస్తూ.. మీరు మాపై నట్లు, బోల్ట్లు విసిరారు.. మేము మిమ్మల్ని ప్లే ఆఫ్స్ చేరకుండా చేశామంటూ బలుపుతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సన్రైజర్స్ అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. అలూ లేదు సూలు లేదు, కొడుకు పేరు సొమలింగం అన్నట్లుంది లక్నో పరిస్థితి అంటూ వ్యంగ్యమైన కౌంటర్లిస్తున్నారు. తాము ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాము సరే.. అదేదో వారు టైటిల్ సాధించినంత బిల్డప్ ఇస్తున్నారంటూ గట్టిగా బదులిస్తున్నారు. -
IPL 2023: పూరన్ ఊచకోత.. లక్నో గ్రాండ్ విక్టరీ.. సన్రైజర్స్ ఔట్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్లో ఓడటం ద్వారా సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్ను సన్రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. సన్రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సీజన్లో సన్రైజర్స్ ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ (16), సీఎస్కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉన్నాయి. -
SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..!
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్రైజర్స్కు ఫేవర్గా ఉన్న మ్యాచ్ను పూరన్.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు. Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7— CricTracker (@Cricketracker) May 13, 2023 వివరాల్లోకి వెళితే.. సన్రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్కు ముందు స్టోయినిస్ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్టోయినిస్ అదే ఓవర్లో అభిషేక్ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు. 16 ఓవర్ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్లో పూరన్ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. -
#KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్తో జరిగిన గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినప్పటికి నెమ్మదిగా ఆడి లక్నో ఓటమికి కారణమయిన రాహుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 12 పరుగులే చేసి ఔటైనప్పటికి రాహుల్ను విమర్శించడంతో పాటు కొంత మంది అభిమానులు మెచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. వాస్తవానికి తొలి బంతికే కేఎల్ రాహుల్ వెనుదిరగాల్సింది. అయితే తైదే క్యాచ్ అందుకోవడంలో విఫలం కావడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే రబాడ బౌలింగ్లో షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo: IPL Twitter విమర్శించడం ఓకే.. మెచ్చుకోవడం ఏంటి? కేఎల్ రాహుల్ను మెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. అతను త్వరగా వెనుదిరిగాడు కాబట్టే లక్నో.. పంజాబ్తో మ్యాచ్లో భారీ స్కోరు చేసింది. కైల్ మేయర్స్ ఇచ్చిన అద్బుత ఆరంభాన్ని స్టోయినిస్, బదోని, నికోలస్ పూరన్లు కంటిన్యూ చేశారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ తొలిసారి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఔట్ కాకపోయినా.. మరో ఆరేడు, ఓవర్లు బ్యాటింగ్ చేసేవాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్టోయినిస్, పూరన్ల అద్భుత ప్రదర్శన మిస్సయ్యేవాళ్లం. అందుకే రాహుల్ త్వరగా ఔటయ్యి ఒక రకంగా జట్టుకు మేలు చేశాడని అభిమానులు సోషల్మీడియాలో ట్రోల్ చేయడం విశేషం. KL Rahul dismissed for 12 runs in 9 balls. Advantage LSG now 🔥#PBKSvsLSG pic.twitter.com/yurToeXJ2t — Utsav 💔 (@utsav045) April 28, 2023 చదవండి: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్కు కష్టమే! -
బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుత ఫీల్డింగ్తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడుఔట్లు నమోదు కాగా.. అన్నింటిలో శాంసన్ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు ఉంటే ఒకటి క్యాచ్ ఔట్. ఇక 29 పరుగులతో వేగంగా ఆడుతున్న నికోలస్ పూరన్ను సంజూ శాంసన్ ఔట్ చేసిన తీరు మ్యాచ్కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ ఓవర్ ఐదో బంతిని కృనాల్ స్వింగ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. అయితే క్విక్ సింగిల్ కోసం పూరన్ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్ వద్దన్నా వినలేదు. ఇక కీపర్ శాంసన్ తన చేతిలోకి బంతి రావడమే ఆలస్యం.. డైరెక్ట్ త్రో వేశాడు. బులెట్ కన్నా వేగంతో వచ్చిన బంతి పూరన్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్గా తెలుస్తోంది. పెవిలియన్ బాట పట్టిన పూరన్ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Brilliant keeping by captain cool #SanjuSamson to get Pooran out. #RRvLSG #RajasthanRoyals pic.twitter.com/M8ofJci3YX — Roshmi 💗 (@CricketwithRosh) April 19, 2023 What a run-out by Captain Sanju Samson - A brilliant direct hit and even Sanju didn't take off his gloves.Captain Sanju leading by example! pic.twitter.com/xOLmTLRO5B— CricketMAN2 (@ImTanujSingh) April 19, 2023 చదవండి: 'డికాక్ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
దుమ్ము రేపుతున్నాడు.. సన్రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే?
ఐపీఎల్-2023లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిద్యం వహిస్తున్న పూరన్.. తన విధ్వంసకర ఇన్నింగ్స్లతో అందరని అకట్టుకుంటున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్స్లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు తన హాఫ్ సెంచరీ మార్క్ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డులకెక్కాడు. లోయార్డర్లో బ్యాటింగ్కు వస్తున్న నికోలస్.. తన మెరుపు ఇన్నింగ్స్లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో 36 పరుగులతో రాణించిన పూరన్.. అనంతరం చెన్నైపై 18 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్ను చాలా దగ్గరగా తీసుకువెళ్లాడు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్లో లక్నో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఎస్ఆర్హెచ్పై కూడా కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన పూరన్ 141 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టి తప్పు చేసిందా? ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో పూరన్ను రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇంత భారీ దక్కించుకున్న పూరన్.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. గతఏడాది సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన పూరన్ 48.83 సగటుతో 263 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక దారుణంగా విఫలమైన పూరన్ను ఐపీఎల్-2023 సీజన్కు ముందు సన్రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో మినీవేలం లోకి వచ్చిన పూరన్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లు వెచ్చించి మరి సొంతం చేసుకుంది. తన తీసుకున్న మొత్తానికి పూరన్ న్యాయం చేస్తున్నాడు. ఇక లక్నో తరపున అదరగొడుతున్న పూరన్ను ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ విడిచిపెట్టి పెద్ద తప్పు చేసింది అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. పూరన్ అద్భుతమైన ఆటగాడు అని, ఒక్క సీజన్కే విడిచిపెట్టడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టు్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: కేకేఆర్తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్రైజర్స్ తుది జట్టు ఇదే 𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV — JioCinema (@JioCinema) April 10, 2023 -
Nicholas Pooran: ఫాస్టెస్ట్ ఫిఫ్టితో పాటు మరో రికార్డు
IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ తాజా సంచలనం నికోలస్ పూరన్ ఐపీఎల్ సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి (15 బంతుల్లో) సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొత్తం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు బాదాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో జాయింట్ సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి (సునీల్ నరైన్, యూసఫ్ పఠాన్తో కలిసి)తో పాటు మరో మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్తో కలిపి మొత్తం 51 మ్యాచ్లు ఆడిన పూరన్.. 157. 87 స్ట్రయిక్ రేట్తో 1000 పరుగుల మార్కును దాటాడు (1053). ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్లో లక్నో చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగడంతో లక్నో విజయం సాధించింది. లక్నో గెలుపు పరుగు బై రూపంలో రావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన పూరన్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్
ఐపీఎల్లో-2023లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్లు), మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. అయితే స్టోయినిష్ ఔటయ్యక ఇక లక్నో గెలుపు కష్టమని భావించారు. పూరన్ విధ్వంసం ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2023లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్గా ఐపీఎల్లో చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్ పఠాన్, సునీల్ నరైన్తో కలిసి నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కేల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో కేవలం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్ 4 ఫోర్లు, 7 సిక్స్లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక విజయానికి దగ్గరలో పూరన్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది. అయితే మరో ఎండ్లో ఉన్న ఆయుష్ బదోని సమయస్పూర్తిగా ఆడుతూ.. మ్యాచ్ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తూ బదోని 19 ఓవర్లో హిట్ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో లక్నో శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. బంతిని డుప్లెసిస్.. హర్షల్ పటేల్ చేతికి ఇచ్చాడు. క్రీజులో ఉనద్కట్, వుడ్ ఉన్నారు. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆర్సీబీ, లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. చదవండి: RCB VS LSG: 2023 ఐపీఎల్లో అత్యంత భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి బయట పడింది.. 𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV — JioCinema (@JioCinema) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
సిక్సర్ల మోత మోగించిన పూరన్, ఫ్లెచర్.. దద్దరిల్లిన షార్జా స్టేడియం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ ఫైనల్ బెర్త్ (డెసర్ట్ వైపర్స్) ఖరారయ్యాయి. గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ విన్నర్ ఫిబ్రవరి 12న జరిగే లీగ్ తుది పోరులో డెసర్ట్ వైపర్స్తో తలపడుతుంది. ఇక, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఎంఐ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్ క్యాపిటల్స్ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఎంఐ టీమ్.. దుబాయ్ క్యాపిటల్స్ను 151/5 స్కోర్కే పరిమితం చేసింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో ఓ వికెట్ దక్కించుకున్నాడు. దుబాయ్ ఇన్నింగ్స్లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్మన్ పావెల్ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పేలిన పూరన్, ఫ్లెచర్.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్ (45 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్ బౌలర్లలో జేక్ బాల్, దసున్ శనకలకు తలో వికెట్ దక్కింది. ముహమ్మద్ వసీమ్ (2), లోర్కాన్ టక్కర్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్, పూరన్ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్-2కు చేర్చారు. పూరన్, ఫ్లెచర్ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. -
IPL 2023: జాక్పాట్ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్ కీపర్గా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్కు అదృష్టం తలుపు తట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పూరన్కు జాక్పాట్ తగిలింది. రూ. 16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని సొంతం చేసుకుంది. తద్వారా వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన వికెట్ కీపర్గా నికోలస్ పూరన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పూరన్ను రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది 14 మ్యాచ్ల్లో 306 పరుగులు చేసిన పూరన్ పెద్దగా రాణించకపోవడంతో మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసింది. అలా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చి రూ. 16 కోట్లకు అమ్ముడుపోవడం పూరన్కే సాధ్యమైంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్లోనూ విండీస్ దారుణంగా విఫలమైంది. అతని కెప్టెన్సీలోని వెస్టిండీస్ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత అతను వెస్టిండీస్ కెప్టెన్గా పక్కకు తప్పుకున్నాడు. ఇంత నెగెటివ్ ఉన్నప్పటికి పూరన్కు భారీ ధర పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రైవేట్ లీగ్ టోర్నీల్లో పూరన్కు మంచి రికార్డు ఉంది. అబుదాబి టి10 లీగ్లోనూ పూరన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పూరన్ కోసం మొదట సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. రూ. 3 కోట్లు దాటగానే ఢిల్లీ క్యాపిటల్స్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 6 కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్స్ పోటీ పడ్డాయి. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ పోటీలోకి వచ్చింది. రూ. 7.25 కోట్ల నుంచి ఒకేసారి రూ. 15 కోట్ల వరకు వెళ్లింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్ను దక్కించుకుంది. చదవండి: Cameron Green: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు? ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి -
వరల్డ్ కప్లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు!
అబుదాబి టీ10 లీగ్లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్కు పూరన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నార్తర్న్ వారియర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో కేవలం 32 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, మూడు సిక్స్లతో 80 పరుగులు సాధించాడు. పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 10 ఓవర్లలో గ్లాడియేటర్స్ మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అతడితో పాటు కోహ్లర్-కాడ్మోర్(32) పరుగులతో రాణించాడు. అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. వారియర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడమ్ లైత్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో నిరాశపరిచిన పూరన్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో పూరన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్కు సారథ్యం వహించిన పూరన్.. కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లు ఆడిన పూరన్ కేవలం 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి క్వాలిఫియర్ రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ విండీస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. The Gladiators captain is named Player of the Match for his outstanding innings 💪 8️⃣0️⃣ runs 3️⃣2️⃣ balls 2️⃣5️⃣0️⃣ strike rate @nicholas_47 🤝 #AbuDhabiT10 #InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/lYIgKUTqwa — T10 League (@T10League) November 25, 2022 చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్తో రెండో వన్డే కష్టమే! -
కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్లతో!
అబుదాబి టీ10 లీగ్లో దక్కన్ గ్లాడియేటర్స్ బోణీ కొట్టింది. టీమ్ అబుదాబితో జరిగిన తమ తొలి మ్యాచ్లో 35 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. అబుదాబి బ్యాటర్లలో జెమ్స్ విన్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక గ్లాడియేటర్స్ బౌలింగ్లో జహూర్ ఖాన్, హెల్మ్ తలా రెండు వికెట్లు సాధించగా.. షమ్సీ, లిటిల్ చెరో వికెట్ పడగొట్టారు. పూరన్ విధ్వంసం ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓడియన్ స్మిత్ 23 పరుగులతో రాణించాడు. టీమ్ అబుదాబి బౌలర్లలో పీటర్ హట్జోగ్లూ, అలెన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందు రోజే వెస్టిండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ రాజీనామా చెప్పాడు. టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. The Grind is on. The Gladiators⚔️ are ready. It's gonna be EPIC💥!#CricketsFastestFormat @T10League 🏆#DeccanPhirJeetaga🏆 #AbuDhabiT10 #Season6 #InAbuDhabi #DeccanGladiators #HumHaiDakshin #deccanagain #heretowin pic.twitter.com/JNd1P9stIQ — Deccan Gladiators (@TeamDGladiators) November 23, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం -
నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్ కెప్టెన్సీకి గుడ్బై
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్గా ఎంపికైన పూరన్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్గా పూరన్ విజయవంతమయ్యాడు. కాగా విండీస్ వైస్ కెప్టెన్గా ఉన్న పావెల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. "I remain fully committed to West Indies cricket." - @nicholas_47 pic.twitter.com/n0OvM1v7yw — Windies Cricket (@windiescricket) November 21, 2022 చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్కు అవకాశం? -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్పై వేటు..?
టీ20 వరల్డ్కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్కప్లోనే కాక కెప్టెన్గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్గా వైస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్ఫోర్డ్కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్ను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్పై వేటు పడింది.