offers
-
ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!
మార్కెట్లో ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్కౌంట్స్ (Discounts) లేదా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తారు. అలాంటి వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 15 కొనుగోలుపై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) రూ.79,900 వద్ద మార్కెట్లో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లేకుండానే.. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో రూ.59,999లకు అందుబాటులో ఉంది. అంటే ఒక్కసారిగా ఐఫోన్ 15 ధర 19,091 రూపాయలు తగ్గింది.ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ కింద రూ. 45,200 తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ అనేది.. మీరు ఎక్స్ఛేంజ్ చేసుకునే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ఐఫోన్ 15 వివరాలుఐఫోన్ 15 ప్రీమియం మెటీరియల్తో తయారైంది. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్ను కలిగి ఉంది. అంతే కాకుండా.. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం IP68 రేటింగ్ కూడా పొందింది. 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. యాపిల్ ఏ16 బయోనిక్ చిప్ పొందుతుంది. డ్యూయెల్ స్పీకర్లు కలిగిన ఈ ఫోన్ USB టైప్ సీ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. -
ఆఫర్లే.. ఆఫర్లు!..ఐదు రోజులు మాత్రమే
రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న సందర్బంగా.. ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్ అందించడం మొదలుపెట్టేశాయి. ఈ తరుణంలో స్మార్ట్ బజార్ (SMART Bazaar) 'ఫుల్ పైసా వసూల్ సేల్' ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ 2025 జనవరి 22 నుంచి 26 వరకు మాత్రమే ఉంటుంది.స్మార్ట్ బజార్ ప్రారంభించనున్న ఈ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 900 కంటే ఎక్కువ స్టోర్లలో కస్టమర్లు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. కేవలం 799 రూపాయలకే 5 కేజీల బియ్యం 3 లీటర్ల నూనె, కూల్ డ్రింక్స్ మూడు కొంటే.. ఒకటి ఫ్రీ, బిస్కెట్లు రెండు కొంటే.. ఒకటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు వాణి వాటితో పాటు చాక్లెట్లు, గృహాలంకరణ, దుస్తులపై కూడా మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి.నిల్వ చేసుకోగలిగిన నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా కస్టమర్లు కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది.Delhi, Goa, Kashmir, Kerala. Secure karo apne travel plans best luggage ke saath. Visit SMART Bazaar Full Paisa Vasool Sale. Live from 22nd to 26th January. #SMARTBazaar #FullPaisaVasoolSale #MehengaiKaMeter#Sale pic.twitter.com/a2ygGiuqhE— SMART Bazaar (@SMARTBazaarIn) January 20, 2025 -
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
రూ. 26999లకే ఐఫోన్ 15!
అధిక ధరల కారణంగా యాపిల్ (Apple) ఐఫోన్ కొనుగోలు చేయలేకపోయిన వారికి 'ఫ్లిప్కార్ట్' (Flipkart) శుభవార్త చెప్పింది. ఇప్పుడు 'ఐఫోన్15'ను కేవలం రూ. 26,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్నిజానికి యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 69,990. ఇది ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో 58,499 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ఠగా రూ. 31,500 తగ్గింపు పొందవచ్చు. అంటే 58,499 రూపాయలలో.. 31,500 రూపాయలు తీసేస్తే.. రూ. 26,999 మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఐఫోన్ 15ను తక్కువ ధరలోనే కొనేయొచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఖచ్చితంగా రూ. 31,500 తగ్గింపు లభిస్తుందని అనుకోకూడదు.ఇదీ చదవండి: అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్ఐఫోన్ 15 డీటెయిల్స్ఐఫోన్ 15 మొబైల్ 48 మెగాపిక్సెల్ కెమెరా పొందుతుంది. USB-C కనెక్టర్ను కలిగి మొట్ట మొదటి ఐఫోన్ మోడల్ ఇదే. ఇది హెక్సా-కోర్ యాపిల్ ఏ17 ప్రో చిప్ను కలిగి.. 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.1 ఇంచెస్ డిస్ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. -
ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో భారీ స్కామ్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని వెంచర్స్లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 600 మంది నుంచి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆర్ హోమ్స్ నిర్వాహకులపై బాధితులు శుక్రవారం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ను ఆశ్రయించి, ఆ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్ హోమ్స్ సంస్థ, దాని వెంచర్లు సైతం సైబరాబాద్ పరిధిలో ఉండటంతో పోలీసులు వారిని అక్కడికి పంపించారు. కూకట్పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థకు భాస్కర్ గుప్తా ఎండీగా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్గా ఉన్నారు. వీళ్లు జై వాసవి బ్లిస్ హైట్స్ సహా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో చదరపు అడుగు రూ.2,199కి ఇస్తున్నట్లు 2020 నవంబర్లో ప్రకటించారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి కపిల్ దేవ్ (క్రికెటర్), ప్రసాద్ (క్రికెటర్), కోటి (మ్యూజిక్ డైరెక్టర్) తదితర ప్రముఖులతో ప్రచారం చేయించారు. దీంతో అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వీరి వద్ద ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. దాదాపు 600 మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున చెల్లించారు. రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పొందుతామని, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాస్కర్ గుప్తా, సుధారాణిలు నమ్మించారు. నిర్మాణంలో జాప్యంపై బాధితులు ప్రశ్నించచడంతో ధరణి, ఎన్నికలు సహా అనేక కారణాలు చెబుతూ వారు తప్పించుకున్నారు. ఈ సంస్థ ప్లాట్లు కూడా విక్రయిస్తామని, తమకు శివార్లలో అనేక చోట్ల భూములు ఉన్నాయని అవసరమైతే బాధితులకు వాటిని కేటాయిస్తామని నమ్మించింది. నారాయణ్ఖేడ్ , ఘట్కేసర్, పఠాన్ చెరు, కర్తనుర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్, ఫార్మ్ ల్యాండ్ పేరిటా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్లోని ‘గో ఓట్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్స్క్రిప్షన్ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్యూఐడీ హాల్మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
రిలయన్స్ డిజిటల్ దీపావళి ఆఫర్: ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపు
దీపావళిని భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి.. రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ పేరుతో ఎలక్ట్రానిక్స్పై బ్లాక్బస్టర్ డీల్స్ అందించడం ప్రారంభించింది. 2024 నవంబర్ 3 లోపు ప్రముఖ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే రూ. 15000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్/మై జియో స్టోర్స్లో మాత్రమే కాకుండా.. 'రిలయన్స్ డిజిటల్.ఇన్'లో కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్లలో కొనుగోలు చేసేవారు రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్..➤శామ్సంగ్ నియోక్యూఎల్ఇడి టీవీకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీని కొనుగోలుపైన 3 సంవత్సరాల వారంటీతో రూ.41,990 విలువైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐ రూ.1,990 నుంచి ప్రారంభమవుతుంది.➤రూ.46,900 విలువైన యాపిల్ వాచ్ సీరీస్ 10 ఇప్పుడు రూ. 44,900లకే లభిస్తోంది. రూ.24,999 విలువైన జేబీఎల్ లైవ్ బీమ్ 3ని కేవలం రూ.12,599లకే పొందవచ్చు.➤రూ.45900కే ఐఫోన్ 14 కొనుగోలుపైన తక్షణ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తున్న మోటొరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్ సీరీస్ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.➤హోమ్, కిచెన్ యాక్ససరీస్ మీద ''ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి' ఆఫర్ను కూడా రిలయన్స్ అందిస్తోంది. వినియోగదారులు ఒకటి కొంటే 5 శాతం, రెండు కొంటే 10 శాతం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కొంటే అన్లిమిటెడ్ డిస్కౌంట్తో 15 శాతం తగ్గింపు పొందవచ్చు.➤ల్యాప్టాప్లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రూ.50,999లకే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్కార్డులతో గేమింగ్ ల్యాప్టాప్లపై అబ్బురపరిచే డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.➤రూ.47000లకు ప్రారంభమవుతున్న వాషర్ డ్రైయర్ కొనుగోలు చేస్తే.. రూ.7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.➤రూ.28990ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న 1.5 టన్స్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ అందుబాటులో ఉంది.➤రూ. 47,990కి ప్రారంభమవుతున్న ఎంపిక చేసిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపైన.. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ని రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. -
‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ‘బీ న్యూ మొబైల్స్’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ, వివో, ఒప్పో, రియల్మి, మొబైల్స్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్పై 50% వరకు, యాక్సెసరీస్పై 80% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్టాప్పై రూ.10 వేలు, టీవీ కొనుగోలుపై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టీవీఎస్ కార్డు ద్వారా కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా, ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 5% క్యాష్బ్యాక్ ఇస్తుంది. బజాజ్ఫిన్సర్వ్ ద్వారా వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా మొబైల్స్, టీవీలు, ల్యాప్టాప్ల కొనుగోలు సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఈడీ సాయి నితీష్లు తెలిపారు. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
దసరా ఆఫర్.. మేకపోతు @ రూ.116
-
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
విమానం ఎక్కేయండి.. రూ. 883 లకే!!
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది. దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది. -
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
-
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్లతో కూడిన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..
ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్ ఫిన్సర్వ్కు అనుబంధ సంస్థ అయిన బజాబ్ మార్కెట్స్ డైనింగ్పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్ మార్కెట్స్ వెబ్సైట్కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్లాన్ చేస్తున్నవారికి ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాలైంటైన్స్ పార్టీలకు చేసే రెస్టారెంట్ బిల్లులపై 1.5 సేవింగ్ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డుకు రూ.250 జాయినింగ్ ఫీజు ఉంటుంది. -
ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు! ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
రిపబ్లిక్ డే కి రిలయన్స్ జియో అద్దిరిపోయే ఆఫర్
-
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్ను అమెజాన్లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
త్వరపడండి చలాన్లపై భారీ డిస్కౌంట్
-
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్లైన్స్ క్రిస్మస్ సేల్లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023 -
కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్లో టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
రూ. 83 లకే విమాన టికెట్: అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే..!
పండుగల సందర్భంగా చాలా విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక డాలరు కంటే (రూ. 83) తక్కువకే దిగి రావడం వైరల్గా మారింది. అదీ కొన్ని ఖరీదైన రూట్లలో కూడా కేవలం రూ. 114లకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో జనం ఎగబడ్డారు. తొలుత ఫేక్ వెబ్సైట్ అని కొంత తటపటాయించారు. కానీ అది ప్రముఖ వెబ్సైట్ అని ధృవీకరించుకున్న తరువాత టికెట్లను భారీగా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు డాలరు కంటే తక్కువ ధరకే విమాన టికెట్లు అంటూ బుకింగ్ స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో విషయం తెలిసిన సంస్థ రంగంలోకి దిగింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సదరన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లో విమాన ఛార్జీలు ఉన్నదానికంటే తక్కువకే దర్శనమిచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్ ఎయిర్లైన్స్కు చెందిన వెబ్సైట్లో దాదాపు 2 గంటలపాటు టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఈ లోపం కారణంగా చెంగ్డూ నుండి షాంఘై వంటి కొన్ని రూట్లు 1.37 డాలర్లకంటే (రూ. 114) తక్కువ ధరల్ని ప్రదర్శించాయి. ఎయిర్లైన్ యాప్, వివిధ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫారమ్లలోకూడాఇలానే కనిపించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఆన్లైన్ షాపింగ్ కాలం కావడంతో కొనుగోలు దారులు క్యూ కట్టారు. అయినా చెల్లుతాయి అసాధారణ రద్దీతోపాటు ఈ వార్త సోషల్మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన సంస్థ టెక్నికల్ సమస్యను ఆలస్యంగా గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే ధరలతో సంబంధం లేకుండా, సాంకేతిక లోపం సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్లూ చెల్లుతాయని ప్రయాణికులకు హామీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ మేరకు చైనా సదరన్ ఎయిర్లైన్స్ అధికారిక వీబో సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. అయితే గతంలో జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ తప్పుగా ప్రాసెస్ అయిన టికెట్లు చెల్లవని, సంబంధిత టికెట్ల సొమ్మును వాపసు ఇస్తామని ప్రకటించింది. -
కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!
దీపావళి పండుగ సందర్భంగా కంపెనీలు మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయని చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. అనుకున్న విధంగానే కొన్ని కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద లక్షల డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్యూవీ400 దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ పండుగ సీజన్లో తన 'ఎక్స్యూవీ400' ఎలక్ట్రిక్ కారు మీద ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారు కొనుగోలుపైన 5 సంవత్సరాల పాటు ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ ఛార్జింగ్ కాండీ సదుపాయాలను అందిస్తుంది. ఎక్స్యూవీ400 ధరలు రూ. 15.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ హ్యుందాయ్ కంపెనీ తన 'కోనా' ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద దీపావళి సందర్భంగా రూ. 2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 23.84 లక్షలు. అయితే ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే రూ. 2 లక్షల తగ్గింపు లభిస్తుంది. సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్ ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దీపావళి సందర్భంగా తన 'సీ5 ఎయిర్క్రాస్' SUV మీద రూ. 2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 36.91 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్కోడా కుషాక్ దీపావళి పండుగ సందర్భంగా స్కోడా కంపెనీ తన కుషాక్ కారు మీద రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. దేశీయ విఫణిలో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఆఫర్ ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్గా మారిన ఇండియన్ - వీడియో వైరల్ ఎంజీ ఆస్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఆస్టర్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 1.75 లక్షల తగ్గింపు అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. -
కొనుగోలు దారులకు శుభవార్త!
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ‘అన్లిమిటెడ్సెలబ్రేషన్స్’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలు, మొబైల్స్, వాషింగ్ మెషిన్లు, ల్యాప్ట్యాప్లు, వైర్లెస్ ఇయర్బర్డ్లు, స్మార్ట్వాచ్లు, గృహోపకరణాలపై భారీ రాయితీ పొందవచ్చు. క్రిడెట్, డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ.15వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, సులభ ఫైనాన్స్ సదుపాయాలు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లు, రిలయన్స్డిజిటల్.ఇన్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లు పొందవచ్చు. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ పండుగ సీజన్లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్.. 👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000 👉టాటా టియాగో - రూ. 40,000 👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000 👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000 👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000 👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000 👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000 👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000 👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్పాడ్స్ కేవలం రూ. 16749కే..
భారత్లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకెండ్ జెన్పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఎయిర్పాడ్స్ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్కార్ట్లో రూ. 16,999 & అమెజాన్లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు. ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!! 2022లో విడుదలైన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్లో వండర్లస్ట్ ఈవెంట్లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్తోపాటు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్పై డబుల్ డేటా ఆఫర్ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!
పండగలు రాబోతున్నాయి. ఇంటిల్లిపాదికి బట్టలు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్న ప్లాన్లో ఉంది రోజా. ఆన్లైన్ షాపింగ్ అయితే సులువైన పని అనుకుంటూనే వాటిలోని ఆఫర్లను చెక్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వస్తువుల అమ్మకాలలో ఇచ్చే డీల్స్ చూస్తోంది. అనుకున్న బ్రాండ్లో ఓ ఫోన్ డీల్ కనపడింది. అత్యంత తక్కువ ధరకే వస్తోంది, నిమిషాల్లోనే ఆ డీల్ ముగుస్తుంది. అందుకే వెంటనే క్లిక్ చేసింది. అక్కడ నుంచి పోర్టల్లోకి వెళ్లడం, ఫోన్ బుక్ చేయడం చకచకా జరిగిపోయాయి. అమౌంట్ డెబిట్ అయ్యింది. కానీ, వస్తువు బుక్ అయినట్టుగా చూపించడం లేదు. ఆ తర్వాత చెల్లించిన డబ్బు గురించి ప్రయత్నించింది. కానీ, ఆ డబ్బు తిరిగి తన అకౌంట్లోకి రాలేదు. ఆన్లైన్లో నకిలీ పండగ ఆఫర్ మోసాలు అధికంగా జరుగుతుంటాయి. వాటిలో... ప్రీ డెలివరీ నోటిఫికేషన్ స్కామ్, ఫేక్ షాపింగ్ సైట్లు, ఫేక్ గిఫ్ట్ కార్డులు, వోచర్లు, కూపన్లు, ఫేక్ స్వచ్ఛంద సంస్థలు, ఫేక్ ప్రయాణ ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ. డీల్ ఆఫ్ ది డే, ఆఫర్స్ అంటూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. తక్కువ ధరకు వస్తువులు, సేవలు లభిస్తాయన్న మన ఆశ స్కామర్ల చేతికి చిక్కేలా చేస్తుంది. నకిలీ షాపింగ్ సైట్లను గుర్తించడానికి సులభమైన మార్గాలు యుఆర్ఎల్ ప్రక్కన ప్యాడ్లాక్ ఉన్న //http చెక్ చేయడం ద్వారా సైట్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవచ్చు. సైట్ యుఆర్ఎల్ సందేహంగా నిజమైన రిటైలర్ అధికారిక చిరునామాకు దగ్గరగా ఉండి, కొన్ని అక్షరాలలో తేడా ఉండటం మరొక సంకేతం. బ్రౌజ్ చేస్తున్నప్పుడు రిటైలర్ యుఆర్ఎల్ని మాన్యువల్గా టైప్ చేయడం ద్వారా నకిలీ డొమైన్లను అడ్డుకోవచ్చు. ఇ–మెయిల్, టెక్ట్స్ లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి. మీ ఆర్డర్ గురించి మీకు సందేహాలు ఉంటే ఆన్లైన్లో అమ్మకందారు ఏరియా చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్ను నిర్ధారించుకోవాలి. సైట్లో కస్టమర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు లేనట్లయితే సందేహించాలి. మీరు షాపింగ్ స్కామ్కు గురైతే... వెంటనే మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫిర్యాదు చేయాలి. స్కామర్ మీ అకౌంట్స్కి యాక్సెస్ తీసుకున్నట్లు వారికి తెలియజేయాలి. మీ బ్యాంక్ అకౌంట్పై కంట్రోల్కి ఆన్లైన్ పాస్వర్డ్లను మార్చండి. రెండు కారకాల ప్రమాణీకరణను (2ఊఅ)ని పాటించాలి. ∙అనుమానిత సైట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసినట్లయితే, స్కామర్లు ఇన్స్టాల్ చేసిన మాల్వేర్, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ కోసం మీ పరికరాలను స్కాన్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. మీరు ఇంతకు ముందెన్నడూ ఆర్డర్ చేయని సైట్ని సందర్శిస్తున్నట్లయితే, వెబ్సైట్లోని ‘అబౌట్’ సెక్షన్ని చెక్ చేయాలి. వెబ్సైట్ ఎంత పాతదో దానితోపాటు కొన్ని కస్టమర్ రివ్యూలను చూడాలి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు స్కామ్కు గురైనట్లయితే వెంటనే పోలీసు రిపోర్ట్ ఫైల్ చేయాలి. https://cybercrime.gov.in/ కూ రిపోర్ట్ చేయచ్చు. --అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!) -
లేటెస్ట్ ఐఫోన్స్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
iPhone 15 series , Watch Series 9 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్స్ 15 సిరీస్లు లాంచ్ అయ్యాయి. అయితే లాంచ్ అయిన వెంటనే లేటెస్ట్ ఐఫోన్ 15, యాపిల్ వాచ్ 9 సిరీస్ ఉత్పత్తులు భారత మార్కెట్లో అవకాశం ఈ ఏడాది ఐఫోన్ లవర్స్కు పండగే అని చెప్పాలి. లేటెస్ట్ ఐఫోన్లు, యాపిల్ వాచ్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్లో విక్రయించనున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ రెడింగ్టన్ లిమిటెడ్ తెలిపింది. 7,000 పై చిలుకు రిటైల్ స్టోర్స్లో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, 2,800 స్టోర్స్లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 3 కూడా లభిస్తాయని వివరించింది. స్మార్ట్ఫోన్స్, వాచ్ల లభ్యత, ధరల గురించి ఇండియా ఐస్టోర్డాట్కామ్ను సందర్శించవచ్చని కస్టమర్లకు సూచించింది. రూ. 5,000, రూ. 4,000 తక్షణ క్యాష్బ్యాక్ను పొందవచ్చు. అలాగే జీరో డౌన్ పేమెంట్, ఎంపిక చేసిన మోడల్స్పై రూ. 3,329 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా వివిధ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లపై రెడింగ్టన్ రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా అందిస్తోంది. ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం. అలాగే ఇంగ్రామ్ మైక్రో ఇండియా కూడా 7,000 కంటే ఎక్కువ రిటైల్ ప్రదేశాలలో తాజా ఆపిల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ. 5,000 క్యాష్బ్యాక్ , ఆరు నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో సహా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు లభ్యం. అదనంగా, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. -
పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది. హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ కార్ లోన్ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే.. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు. -
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్ను సంప్రదించవచ్చు. -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్మెడ్స్లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు
Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసేల్ను ప్రకటించింది. ఇండిపెండెన్స్డే సేల్కంటే ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే ఈసేల్లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ తదితర టాప్ దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్ఫోన్లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) అదేవిధంగా పిక్సెల్ 6ఏ, శాసంగ్ జెడ్ ఫ్లిప్ 3, గూగుల్, నథింగ్, పోకో, ఒప్పో, వివో, రియల్మీ వంటి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఐదు శాతం క్యాష్బ్యాక్ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?) అలాగే ఫ్యాషన్తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్ తదితరాలపై 60 శాతం వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్లు & స్కూటర్లు (ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
బంపర్ ఆఫర్.. ఈ కెడ్రిట్ కార్డ్ ఉండే 10% క్యాష్బ్యాక్, ఇంకా బోలెడు బెనిఫిట్స్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ, ప్రైవేట్రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. బెనిఫిట్స్ ఇవే హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్బ్యాక్తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్బ్యాక్కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్బ్యాక్కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్మైషో ఇంకా మరెన్నో ప్లాట్ఫారమ్లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్లు 5% క్యాష్బ్యాక్ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్షిప్ను పొందగలరు. ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్షిప్లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే? -
స్కూట్ ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ)లో భాగమైన స్కూట్ నెట్వర్క్ తాజాగా చౌక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ నగరాల నుంచి విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. రూ. 6,200 నుంచి చార్జీలు మొదలవుతాయని వివరించింది. హైదరాబాద్ నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు రూ. 12,900 నుంచి, వైజాగ్ నుంచి సెబూ (ఫిలిప్పీన్స్)కు రూ. 11,900 నుంచి వన్–వే చార్జీలు (పన్నులు సహా) ప్రారంభమవుతాయని స్కూట్ తెలిపింది. ఈ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. -
అమెజాన్ లో భారీ ఆఫర్స్...55% తగ్గింపు
-
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ల్యాప్టాప్లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్టాప్లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్టాప్లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్లో రూ.11,999తో టాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్వాచ్ను పొందవచ్చు. -
ఫోక్స్వ్యాగన్ ఆఫర్ల జాతర.. టైగన్, వర్టస్ కొనుగోలుకు ఇదే మంచి సమయం!
ఫోక్స్వ్యాగన్ (Volkswagen) కంపెనీ ఎట్టకేలకు తన టైగన్ అండ్ వర్టస్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం 2022 - 2023 మోడల్ కార్లకు, BS6 ఫేజ్-2 కంప్లైంట్ ఇంజన్లతో నడిచే కార్లకు మాత్రమే లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోక్స్వ్యాగన్ టైగన్ 2022 మోడల్ ఫోక్స్వ్యాగన్ టైగన్ మీద రూ. 1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కూడా వేరియంట్ను బట్టి రూ. 65,000 నుంచి తగ్గింపులు ప్రారంభమవుతాయి. టాప్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యధిక తగ్గింపు, కంఫర్ట్లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యల్ప తగ్గింపు లభిస్తుంది. అయితే 2023 మోడల్ మీద రూ. 85,000 వరకు లభిస్తుంది. ఫోక్స్వ్యాగన్ వర్టస్ ఇక ఫోక్స్వ్యాగన్ వర్టస్ విషయానికి వస్తే.. కంపెనీ 2022 మోడల్ ఇయర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల తగ్గింపుని ప్రకటించింది. ఇది కూడా కంఫర్ట్లైన్ మాన్యువల్, టాప్లైన్ మాన్యువల్ వేరియంట్లకు అత్యధికంగా లభిస్తుంది. మరో వైపు జీటీ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్పై రూ. 20000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ ఇయర్ వర్టస్ కంఫర్ట్లైన్ మాన్యువల్, టాప్లైన్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లపై రూ. 85,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఆఫర్స్ అనేవి నగరం నుంచి మరో నగరానికి లేదా డీలర్ నుంచి మరో డీలర్కి మారే అవకాశం ఉంటుంది. కావున టైగన్, వర్టస్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్ను సంప్రదించడం మంచిది. -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్ఫారమ్ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్ను అందించింది. బైక్కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్కి ఇదే మంచి సమయం
Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 (iPhone 14) దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్ ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు. -ఎన్.కుమార్ -
టాటా కార్ల కొనుగోలుపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే?
Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా టియాగో (Tata Tiago) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది. ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. టాటా టిగోర్ (Tata Tigor) టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari) టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు. "డిస్కౌంట్లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.'' -
ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!
Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించవచ్చు. -
సెంచురీ మ్యాట్రెస్ గుడ్న్యూస్: 50 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్ తన వెబ్సైట్నుమరింత వినియోగ అనుకూలంగా మార్పు చేసినట్టు ప్రకటించింది. కస్టమర్లు తమకు అనుకూలమైన మ్యాట్రెస్ను సులభంగా తెలుసుకునే విధంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. అదే సమయంలో ‘స్లీప్ స్పెషలిస్ట్ సేల్’ పేరుతో అమ్మకాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ ఫోమ్-ఆధారిత ప్రొడక్ట్స్కు సెర్టిపుర్-యూఎస్, బీఐఎస్,ఓయికో టెక్స్ క్లాస్-1 సర్టిఫికేషన్లతో పరుపులను అందిస్తున్నట్టు తెలిపింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ , ISO 9001-2015 సర్టిఫికేషన్ ఉన్న తొలి ఇండియన్ మ్యాట్రెస్ కంపెనీ అని పేర్కొది. ఇదీ చదవండి : IPL victory: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం! కాపర్ జెల్ మెమరీ ఫోమ్, యాంటీ-మైక్రోబయల్ ట్రీట్మెంట్, బ్రీతబుల్ CNC-ఆకారపు ఫోమ్లు తదితర వినూత్న ఉత్పత్తులను అందించే పరిశ్రమలో టాప్లో ఉంది సెంచరీ. కంపెనీ 18 రాష్ట్రాల్లో 4,500+ మల్టీ-బ్రాండ్ డీలర్లు, 450+ ప్రత్యేక బ్రాండ్స్ ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫారమ్లలో కూడా పాపులర్అయింది. మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
అజియో ‘బిగ్బోల్డ్’ సేల్.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!
ముంబై: అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మంచి డీల్స్ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన డీల్స్లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్బోల్డ్ సేల్లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్ 14ప్రో, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్సంగ్ ఎస్23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది. -
నయనతారకు చెక్ పెడుతున్న త్రీష
-
జోస్ ఆలుక్కాస్.. హెచ్యూఐడీ ‘ఫెస్ట్’
హైదరాబాద్: దక్షిణ భారత్లో ప్రముఖ జ్యువెల్లరీ గ్రూప్ల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్, హెచ్యూఐడీ హాల్మార్కింగ్ అమలును వేగవంతం చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు హెచ్యూఐడీ ఎక్స్ఛేంజ్ ఫెస్ట్ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్ బీఐఎస్-916 హాల్మార్క్ కలిగిన ఆభరణాలను ప్రవేశపెట్టి, విక్రయించిన మొదటి జ్యువెల్లరీ గ్రూప్గా నిలిచిన సంస్థ, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ (హెచ్యూఐడీ)తో తన బంగారు నిల్వల్లో మొత్తం 100 శాతాన్ని హాల్మార్క్ చేసినట్లు పేర్కొంది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) మరిన్ని వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ..
యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం. ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు! ఫ్లిప్కార్ట్లో అత్యధిక డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై ఐదు శాతం క్యాష్బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్ఫోన్కు కండీషన్ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్లు ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ. 4,000 వరకు ఆఫర్లను కూడా అందిస్తోంది. అదనంగా ట్రేడ్-ఇన్ ఆఫర్ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు. విజయ్ సేల్స్లో యాపిల్ డేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ కార్డ్లపై రూ.4,000 క్యాష్బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఐసీఐసీఐ బ్యాంక్ రూపీ వోస్ట్రో ఖాతాలు
ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్వాయిస్, చెల్లింపులకు ఐఎన్ఆర్ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 29 దేశాల్లోని కరస్పాడెంట్ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్వాయిసింగ్ ఐఎన్ఆర్లో ఉండాలన్న ఆర్బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. -
యాపిల్ డేస్ సేల్: ఐఫోన్లు, ల్యాప్టాప్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈసేల్లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్బుక్ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కారర్డ్స్కొనుగోళ్లపై క్యాష్బ్యాక్లు , ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్లలోఈ సేల్ యాక్టివ్గా ఉంటుంది. కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ ) ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్పై రూ. 4వేల వరకు క్యాష్బ్యాక్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!) యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్టాప్లపై కస్టమర్లు రూ. 5 వేల వరకు క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్పాడ్స్, వాచెస్పై తగ్గింపుధరలను ప్రకటించింది. -
ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్..
అమెజాన్ భారత్లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించిన టీజర్ను అమెజాన్ విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్లో పేర్కొంది. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు! అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్మీ (Redmi 12C) ఫోన్ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999. సరికొత్త స్మార్ట్ఫోన్లు, వాటి యాక్సెసరీస్పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్లో ప్రైమ్ మెంబర్ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలపై.. టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో కస్టమర్లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్ప్లస్ వై సిరీస్ హెచ్డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్ల తొలగింపు.. -
రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ రూ. 32,999 ధర వున్నా మొబైల్ ఫోన్ కేవలం రూ. 2,999కే లభిస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మార్కెట్లో రూ. 32,999. కానీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల మీకు రూ. 25,000 వరకు ఆదా చేయవచ్చు. అది కూడా మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. అంతే కాకుండా మీ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధార పడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున మీరు రూ. 32,000 ఫోన్ రూ. 27,999కి లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనాలకునేవారు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 2999కే లభిస్తుంది. కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను గుర్తుంచుకోవాలి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచెస్ సూపర్ అమోటెడ్ డిస్ప్లే కలిగి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ పొందుతుంది. ఇందులోని 500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎం53 మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
బీఆర్ఎస్ అసంతృప్తులకు ఆఫర్లు!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో అధికారిక పదవుల్లో ఉన్న వారితో పాటు పలు వురు ముఖ్య నేతలకు తమ పార్టీలోకి రావాలంటూ విపక్ష నేతల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. నిర్ణీత గడువు లోపు తమ పార్టీలో చేరితే ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. తమకు విపక్షాల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్న అసమ్మతి నేతలు బీఆర్ఎస్ను వీడ టంపై తమ వైఖరిని వెల్లడించేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ దుమా రాన్ని లేపడంతో కొంతకాలం ఇతర పార్టీల్లోకి వలసల అంశం సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ నేతలు.. ఇతర పార్టీల నుంచి అందుతున్న ఆహ్వానాలపై తర్జనభర్జన పడుతున్నారు. అధికార పార్టీలోనే కొనసాగితే, చివరి నిమిషంలో టికెట్ దక్కకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయింపుపై హామీ ఇస్తేనే చేరతామంటూ కొందరు మెలిక పెడుతున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించాలని కూడా ఓ ప్రధాన జాతీయ పార్టీకి బీఆర్ఎస్ అసంతృప్త నేతలు షరతు విధిస్తున్నట్లు సమాచారం. మరికొందరు టికెట్ కోసం సొంత పార్టీపైనే ఒత్తిడి పెంచి హామీ పొందేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా వెళ్లడం ద్వారా తమను పక్కన పెట్టలేని పరిస్థితిని సృష్టించాలనే యోచనలో కొందరు ఆశావహులు ఉన్నారు. సగానికి పైగా స్థానాల్లో టికెట్ల పోటీ... ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటం సమస్యగా మారింది. మరోవైపు పలువురు సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అలాగే ఉద్యమ సమయం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేతలతో పాటు ఇతరులు కూడా అసెంబ్లీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 50 స్థానాల్లో బీఆర్ఎస్ టికెట్ల కోసం బహుముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న వారు, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరును ఎదుర్కొంటున్నవారు, తమను అధిష్టానం గుర్తించడం లేదనే అసంతృప్తితో ఉన్నవారు.. తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రధాన విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలపై కేసీఆర్ నజర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూధనాచారి నేతృత్వంలోని కమిటీ వీటిపై ఇస్తున్న నివేదికలను విశ్లేషిస్తూ నియోజకవర్గాల వారీగా నేతలపై ఓ అంచనాకు వస్తున్నారు. సమ్మేళనాలను దూరంగా ఉంటున్న నేతలు, వారు దూరంగా ఉండడానికి కారణాలు, వారు భవిష్యత్తులో అనుసరించే వ్యూహాలు తదితరాలపై దృష్టి సారించారు. ♦ ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనతో పాటు బయటకు వెళ్లే నేతలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా మంతనాలు జరుపుతున్నారు. ♦ మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత నడుమ ఆధిపత్య పోరు కొలిక్కిరావడం లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ ములుగుకు బదులుగా డోర్నకల్ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, కడియం శ్రీహరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ♦ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడు రోహిత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి నడుమ టికెట్ పోరు సాగుతుండగా రోహిత్ ఎంట్రీ కొత్త చిక్కులు సృష్టిస్తోంది. ♦ ఆలంపూర్, బెల్లంపల్లి, నర్సాపూర్, మహేశ్వరం, చేవెళ్ల, తాండూరు, జహీరాబాద్, కుత్బుల్లాపూర్, పాలేరు, ఆసిఫాబాద్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో బహుముఖ పోటీ నెలకొంది. నాగర్కర్నూల్లో తన కుమారుడి టికెట్ కోసం ఓ కీలక ప్రజా ప్రతినిధి ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బోథ్, పినపాక, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, మేడ్చల్, రామగుండం తదితర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా ఇతరులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. -
మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ కొనుగోలుదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఆఫ్ రోడర్ కొనుగోలు చేసేవారు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకుండా గొప్ప అమ్మకాలతో ముందుకు సాగుతున్న థార్ ఎంతోమంది ఆఫ్ రోడర్లకు ఇష్టమైన వాహనం. ఇప్పటికి కూడా ఈ SUV కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో కంపెనీ థార్ కొనుగోలు మీద రూ. 65,000 తగ్గింపుని అందించనుంది. నివేదికల ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన డీలర్షిప్లలో మాత్రమే మహీంద్రా థార్పై రూ. 65,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 40వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎంచుకున్న వేరియంట్పై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా థార్ ధరలు రూ. 1.05 లక్షల వరకు పెరిగాయి. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD వేరియంట్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 55,000 ఎక్కువ. దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ 4WD వెర్షన్ ధర రూ. 13.49 లక్షల నుంచి రూ. 16.77 లక్షల మధ్య ఉంది. -
అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ని కూడా పొందవచ్చు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ (బిహు, వైశాఖి) పురస్కరించుకుని ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తాజాగా ఏప్రిల్ 17 నుంచి 19 మధ్య ట్రావెల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. బస్ టికెట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ. 3,000 వరకు క్యాష్బ్యాక్, 1 బస్ టికెట్ కొంటే 1 టికెట్ ఉతం వంటి ఆఫర్లను కూడా పొందేందుకు అవకాశం ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వివరింంది. 2,500 పైలుకు బస్ ఆపరేటర్ల నుంచి తక్కువ చార్జీలకే టికెట్లు పొందవచ్చని తెలిపింది. -
మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం
అసలే ఎండలు మండిపోతున్నాయి, భానుడి ఉష్ణోగ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది ఎయిర్ కూలర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే AC ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది కొనటానికి సంకోచిస్తారు. అలాంటి వారికోసం ఫ్లిప్కార్ట్ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చింది. దేశీయ ఆన్లైన్ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ కొత్త ఏసీ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కథనంలో భారతీయ విఫణిలో రూ. 40,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీలను గురించి తెలుసుకుందాం.. ఎల్జీ ఏఐ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: ఎల్జీ కంపెనీకి చెందిన 1.5 టన్ ఎల్జీ ఏసీ ధర ఫ్లిప్కార్ట్లో రూ. 37,990. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 10 శాతం లేదా రూ.1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఇందులో 6 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. అంతే కాకుండా ఏఐ డ్యూయెల్ ఇన్వర్టర్ 2 వే స్వింగ్, హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. శాంసంగ్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: శాంసంగ్ కంపెనీకి చెందిన 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ధర దేశీయ మార్కెట్లో రూ. 35,499. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో 10% లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఏసీలో 5 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. బ్లూ స్టార్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: మార్కెట్లో 1.5 టన్ బ్లూ స్టార్ ఏసీ ధర రూ. 36,190. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొనుగోలుచేసే కస్టమర్లు ఇప్పుడు 10% ఆఫర్ పొందవచ్చు. ఈ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది. సెల్ఫ్ డయగ్నాసిస్, డస్ట్ ఫిల్టర్, స్టెబులైజర్ ఫ్రీ ఆపరేషన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: వోల్టాస్ కంపెనీకి చెందిన 1.5 టన్ ఏసీ ధర రూ. 33,490 మాత్రమే. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 10 శాతం లేదా రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఆటో అడ్జెస్టెబుల్ టెంపరేచర్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే! మహీంద్రా కార్లపై భారీ తగ్గింపు..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ ఉత్పత్తుల కొనుగోలు మీద ఈ నెలలో (ఏప్రిల్ 2023) భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్స్, బెనిఫీట్స్ అన్నీ మహీంద్రా మొరాజో, బొలెరో, బొలెరో నియో, థార్ 4RD, XUV300 కొనుగోలుపై పొందవచ్చు. మహీంద్రా మొరాజో: మహీంద్రా కంపెనీ ఇప్పుడు మొరాజో కొనుగోలుపైన ఏకంగా రూ. 72,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ తగ్గింపు టాప్ స్పెక్ M6 వేరియంట్పై లభిస్తుంది. అయితే బేస్ వేరియంట్ M2, మిడ్-స్పెక్ వేరియంట్ M4+ మీద వరుసగా రూ. 58,000, రూ. 34,000 తగ్గింపుని పొందవచ్చు. మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో కొనుగోలుపైన ఇప్పుడు రూ. 66,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ మీద రూ. 51,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. ఇక మిడ్-స్పెక్ B6 వేరియంట్ మీద రూ. 24000, ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ మీద రూ. 37000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV300: XUV300 కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 52,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా W8 డీజిల్ వేరియంట్ కొనుగోలుపై రూ. 42,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. అదే సమయంలో W8(O), W6 డీజిల్ వేరియంట్ల మీద వరుసగా రూ. 22000, రూ. 10000 తగ్గింపు & పెట్రోల్ వేరియంట్స్ అయిన డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్లపై వరుసగా రూ. 25000, రూ. 20000, రూ. 20000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా బొలెరో నియో: బొలెరో నియో టాప్ స్పెక్ వేరియంట్స్ N10, N10 (O) మీద రూ. 48,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 36,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. మిడ్ స్పెక్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ మోడల్ మీద రూ. 30000, రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా థార్ 4X4: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కొనుగోలుపై కూడా ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇది కేవలం థార్ 4WD వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఇందులో కూడా AX(O), LX అనే రెండు ట్రిమ్ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ అందించే డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఏప్రిల్ నెలలో మాత్రమే డిస్కౌంట్స్ వర్తిస్తాయి. -
మస్క్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్లో 44 బిలియన్ డాలర్లతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ట్విటర్ కొనుగోలు తరువాత ఖర్చుల తగ్గింపు, పనితీరు అంటూవేలాదిమంది ఉద్యోగులను తీసివేయడంతోపాటు, పలు అనూహ్య నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన మస్క్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం సుమారు 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్ను ఉద్యోగులను ఇవ్వనున్నట్టు మస్క్ ప్రకటించారు. ట్విటర్ డీల్కు వెచ్చించిన దాంట్లో ఇది సగం కంటే కొంచెం తక్కువ. శుక్రవారం ఉద్యోగులకు పంపిన ప్రత్యేక ఇమెయిల్ ప్రకారం, కంపెనీ ఉద్యోగులకు అదనపు ఈక్విటీ గ్రాంట్లను అందజేస్తున్నట్లు తన సిబ్బందికి తెలిపింది. ఇప్పుడు ప్రదానం చేసిన షేర్ల విలువ భవిష్యత్తులో పది రెట్లకు పైగా పెరుగుతాయని మస్క్ వెల్లడించారు. అలాగే ఆరు నెలల తర్వాత వీటి ప్రయోజనాలుపొందవచ్చని, దాదాపు ఒక సంవత్సరంలో లిక్విడిటీ ఈవెంట్ను అందించాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈక్విటీలో కొంత భాగాన్ని క్యాష్ అవుట్ చేయగలరని పేర్కొంది. అయితే, ఈక్విటీ అవార్డులు పొందే ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత లేదు. (మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్లైన్ ముగియకముందే మేల్కొండి!) కాగా ఇటీవల బారీగా ఉద్యోగాల తీసివేత, పలువురు నిపుణుల నిష్క్రమణలు, నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు రెగ్యులేటరీ ఫైలింగ్ల ప్రకారం, ట్విటర్ 2021లో స్టాక్ ఆధారిత పరిహారం కోసం సుమారు 630 మిలియన డాలర్లన వెచ్చింది. -
Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇప్పుడు 'హలో సమ్మర్ డేస్ సేల్' (Hello Summer Days) పేరుతో సేల్స్ ప్రారంభించింది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మార్చి 22 నుంచి మొదలై 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రారంభించిన 'హలో సమ్మర్ డేస్ సేల్'లో ఎయిర్ కండీషనర్ కొనుగోలుపై 55 శాతం, రిఫ్రిజిరేటర్ల మీద 60 శాతం డిస్కౌంట్స్ పొందవచ్చు. అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్కార్ట్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా ఇతర బ్యాంకు కార్డులపై 'నో కాస్ట్ ఈఎమ్ఐ' సదుపాయం పొందవచ్చు. కావున సామ్సంగ్, వోల్టాస్, ఎల్జీ, వాల్పూల్, హయెర్, గోద్రెజ్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్లను సాధారణ ధరల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీ బ్రాండ్ కొనుగోలుపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు వినియోగించుకుని మరింత తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్) కంపెనీ అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ కింద సామ్సంగ్ 1.5 టన్ కన్వర్టబుల్ 5-ఇన్-1 3-స్టార్ ఏసీ కేవలం రూ. 37,999కే కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ప్యానసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ వైఫై కనెక్ట్ ఏసీ, ఎల్జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 3 స్టార్ ఏసీ, లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. -
హెచ్డీఎఫ్సీ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ క్రెడిట్ కార్డ్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను విడుదల చేశాయి. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డ్ను తీసుకొచ్చాయి. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేస్తుంది. 200కు పైగా దేశాల్లో ఈ కార్డ్ పనిచేస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ సభ్యులు (కిరాణా వర్తకులు).. ఈ క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్తో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ప్లాట్ఫామ్పై చేసే వ్యయంలో 5 శాతం క్యాష్ బ్యాంక్గా పొందొచ్చు. యాక్టివేషన్ క్యాష్ బ్యాక్ కింద రూ.1,500ను ఆఫర్ చేస్తున్నాయి. జాయినింగ్ ఫీజు లేదు. యుటిలిటీ బిల్లులు, ఇతర వ్యయాలపై అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవీ చదవండి: ఫ్లిప్కార్ట్ సేల్లో బంపర్ ఆఫర్: నథింగ్(1) ఫోన్పై రూ. 30వేలు తగ్గింపు ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి, కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్తను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం 2023 మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 54,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ లభిస్తాయి. మారుతి సుజుకి బాలెనో: అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి బాలెనొ మీద కంపెనీ ఈ నెలలో రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం మాన్యువల్ వేరియంట్కి మాత్రమే వర్తిస్తాయి. ఆటోమేటిక్, CNG మోడల్స్ కొనుగోలుపైన ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి ఇప్పుడు సియాజ్ కొనుగోలుపై రూ. 28,000 తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్స్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్లకి వర్తిస్తుంది. ఇందులో రూ. 25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. (డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ఖచ్చితమైన ఆఫర్స్ కోసం స్థానిక డీలర్ను సందర్శించి తెలుసుకోవచ్చు). మారుతి సుజుకి ప్రస్తుతం డిస్కౌంట్స్ అందించడం మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, మారుతి జిమ్నీ 5-డోర్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కార్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. -
ఆఫర్ల జాతర.. టాటా కార్లు కొనేవారికి ప్రత్యేకం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఉగాదికి ముందే కొనుగోలుదారుల కోసం అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్ వంటి మోడల్స్ కొనుగోలుపై ఇప్పుడు రూ. 65,000 వరకు డిస్కౌంట్స్, బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా సఫారీ: అత్యంత ప్రజాదరణ పొందిన సఫారీ అన్ని 2023 మోడల్స్ మీద కంపెనీ రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇక 2022 మోడల్స్ మీద ఏకంగా రూ. 65,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. టాటా హారియర్: టాటా మోటార్స్ తన 2023 హారియర్ మీద రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉన్నాయి. 2022 హారియర్ మోడల్ కొనుగోలు మీద ఇప్పుడు మీద రూ. 65,000 డిస్కౌంట్ లభిస్తుంది. టాటా టిగోర్: 2023 టాటా టిగోర్ సిఎన్జి మోడల్ కొనుగోలు మీద రూ. 30,000, పెట్రోల్ మోడల్ మీద రూ. 25,000 తగ్గింపు పొందవచ్చు. పెట్రోల్, సిఎన్జి మోడల్స్ కొనుగోలుపై కస్టమర్లు ఇప్పుడు బెనిఫీట్స్ పొందవచ్చు. అదే సమయంలో 2022 మోడల్ మీద రూ. 45,000 మాత్రమే తగ్గింపు పొందవచ్చు. టాటా టియాగో: ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్లో ఒకటైన టాటా టియాగో కొనుగోలుపై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది. టియాగో సిఎన్జి మీద రూ. 30,000, పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. ఇక 2022 మోడల్ కొనుగోలు చేస్తే రూ. 40,000 వరకు బెనిఫీట్స్ లభిస్తాయి. టాటా ఆల్ట్రోజ్: 2023 టాటా ఆల్ట్రోజ్ కొనుగోలుపై రూ. 25,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్ల మీద సమానంగా డిస్కౌంట్స్ పొందవచ్చు. 2022 మోడల్ కొనుగోలుపై రూ. 35,000 పొదుపు చేయవచ్చు. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ చెప్పుకోదగ్గ మోడల్. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్స్, బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ డిస్కౌంట్స్ కూడా పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
ఫ్లిప్కార్ట్లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్పై కచ్చితమైన డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
Women's Day 2023: మహిళల కోసం హ్యుందాయ్ స్పెషల్ ఆఫర్స్, ఇవే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ మహిళా కస్టమర్లకోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. మార్చి 06 నుంచి 09 వరకు హ్యుందాయ్ డీలర్షిప్ లేదా సర్వీస్ సెంటర్లో ఈ ఆఫర్స్ పొందవచ్చు. హ్యుందాయ్ కంపెనీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫ్రీ వాషింగ్ కూపన్, పిక్-అండ్-డ్రాప్ వంటి సర్వీసులు ఉన్నాయని, అంతే కాకుండా కారుని మెరుగైన పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై కూడా ప్రత్యేక సెషన్లు కూడా నిర్వహించనున్నట్లు, మహిళల కోసం బ్రాండ్లపై myHyundai యాప్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ కేవలం మార్చి 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు.. దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్) ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల 2023 హ్యుందాయ్ వెర్నా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు డీలర్షిప్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ నెల 21న మార్కెట్లో విడుదలవుతుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నాకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే ధరల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హాట్ సమ్మర్లో హోండా కార్లపై కూల్ ఆఫర్స్: ఈ నెల చివరి వరకే!
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లో తమ వాహనాల కొనుగోలుమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో హోండా అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరిలోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. హోండా అమేజ్: హోండా కంపెనీ తన అమేజ్ మోడల్ మీద రూ. 26,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్షోరూమ్). ఈ సెడాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా జాజ్: ఇక హోండా జాజ్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్షోరూమ్). ఈ మోడల్ మీద కంపెనీ రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డబ్ల్యూఆర్-వీ: హోండా కంపెనీ తన డబ్ల్యూఆర్-వీ మోడల్ మీద రూ. 17,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు (ఎక్స్షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా సిటీ: కంపెనీ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో రూ. 17,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ 125 హెచ్పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 119.35 హెచ్పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెలలో పైన తెలిపిన కార్లు కొనుగోలు చేయాలనునే కస్టమర్లు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలో ఉన్న కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.