Oscar awards
-
ఆస్కార్ సంబరం ఆరంభం
97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 2న లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరగనుంది. కాగా ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లను గురువారం రాత్రి (భారతీయ కాలమానం ప్రకారం) ప్రకటించారు. అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ నామినేషన్ల ప్రకటన ఈ నెల 17న జరగాల్సింది. కానీ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 19కి వాయిదా వేశారు. ఫైనల్గా 23న ప్రకటించారు.రికార్డ్ సాధించిన స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లర్ఈసారి స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఎమిలియా పెరెజ్’ నాన్–ఇంగ్లిష్ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని రికార్డ్ సాధించింది. గతంలో చైనా మూవీ ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’, మెక్సికన్–అమెరికన్ డ్రామా ‘రోమా’... ఈ రెండు చిత్రాలు నాన్–ఇంగ్లిష్ విభాగంలో పది నామినేషన్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు 13 నామినేషన్లతో ‘ఎమిలియా పెరెజ్’ వాటిని అధిగమించింది. అలాగే ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్లో నటించిన స్పానిష్ నటి కార్లా సోఫియా గాస్కాన్ (బెస్ట్ యాక్ట్రస్ లీడ్ రోల్ నామినేషన్) చరిత్ర సృష్టించారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ట్రాన్స్జెండర్ నటిగా నిలిచారామె. ఇంకా ‘ది బ్రూటలిస్ట్, విక్డ్’ చిత్రాలకు పది నామినేషన్ల చొప్పున దక్కాయి. అంతగా అంచనాలు లేని ‘కాన్క్లేవ్’ మూవీకి 8 నామినేషన్లు దక్కడం ఓ విశేషం.⇒ ఒక్క నామినేషన్ తేడాతో... నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని, రికార్డు సాధించిన ‘ఎమిలియా పెరెజా’కి ఇంకో నామినేషన్ దక్కి ఉంటే... ఇంగ్లిష్ ఫిల్మ్ల రికార్డుని కూడా అధిగమించి ఉండేది. ‘టైటానిక్, ఆన్ అబౌట్ ఈవ్, లా లా ల్యాండ్’ వంటి ఇంగ్లిష్ చిత్రాలు 14 నామినేషన్లు దక్కించుకున్నాయి.⇒ తల్లి హిస్టరీ రిపీట్: ‘ఐయామ్ స్టిల్ హియర్’ చిత్రానికి గాను ఫెర్నాండా టోర్రెస్ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే... ఆమె తల్లి ఫెర్నాండా మోంటెనెగ్రో 1991లో ‘సెంట్రల్ స్టేషన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటిగా రికార్డుని సాధించారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మలి బ్రెజిలియన్ నటిగా టోర్రెస్ నామినేషన్ దక్కించుకుని తల్లి హిస్టరీని రిపీట్ చేశారు. ⇒ బరిలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్: ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ‘అనూజ’ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆల్రెడీ రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన భారతీయ నిర్మాత గునీత్ మోంగా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడం విశేషం. అలాగే నటి ప్రియాంకా చోప్రా ఓ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే తొమ్మిదేళ్ల అనూజ స్కూల్కు వెళ్లాలనుకుంటుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని, అనూజ సోదరి పాలక్ భవిష్యత్ను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ చిత్రం సాగుతుంది.అనూజగా సజ్దా పఠాన్, పాలక్గా అనన్య షాన్భాగ్ నటించారు. ఇదిలా ఉంటే... గునీత్ మోంగా ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి గాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 2023లో ఆస్కార్ దక్కింది. అంతకుముందు 2021లో గునీత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కిగాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కింది. ఇప్పుడు ఆమె ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘అనూజ’కు కూడా ఆస్కార్ దక్కుతుందా? అనేది చూడాలి. భారతీయ సినిమాకి నిరాశఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్ట్లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్లైఫ్), సంతోష్, స్వతంత్రవీర్ సవార్కర్, ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పుతల్’ ఆస్కార్ నామినేషన్ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ షార్ట్ లిస్ట్లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది.ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్స్టాన్స్, విక్డ్ ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్ నోన్ ), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్స్టాన్స్) ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్ నోన్ ), కోల్మెన్ డొమినింగో (సింగ్సింగ్), రే ఫియన్నెస్ (కాన్ క్లేవ్), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ), ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్ నోన్ ), గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్) ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్). -
Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’
క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.‘లాపతా లేడీస్’ నో ఎంట్రీఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్కు షార్ట్ లిస్ట్కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్లో అధికారికంగా చోటు సాధించింది.ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలుఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది. BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025 -
అలాంటి సినిమాలను ఆస్కార్కు పంపండి: నిర్మాత గునీత్ మోంగా
‘‘ఆస్కార్ అనేది అమెరికన్ అవార్డు. కాబట్టి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న భారతీయ సినిమాలను నామినేషన్స్ కోసం పంపితే అవార్డులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది’’ అని బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నిర్మాతగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగంలో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు గునీత్ మోంగా. కాగా ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎఫ్ఐ)కి సంబంధించిన జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలు ఆస్కార్ అవార్డు నామినేషన్కు వెళుతుంటాయి. కానీ అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా ఉన్న ఇండియన్ సినిమాలను ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి పంపితే ఆస్కార్ నామినేషన్ వచ్చే మార్గం సులువు అవుతుందని గునీత్ అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా గునీత్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘‘ఆస్కార్ నామినేషన్ కోసం మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ అది చాలా కష్టం. మన సినిమా ప్రచారానికి సమయం కేటాయించాలి. డబ్బు ఖర్చు పెట్టాలి. అక్కడి పబ్లిసిటీ మార్కెటర్స్ను నియమించుకోవాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సమయంలో నేను అక్కడ నెల రోజులకు పైగా ఉన్నాను. అక్కడి వ్యవస్థ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. షార్ట్లిస్ట్ అయిన తర్వాతి నుంచి నామినేషన్ దక్కించుకునే ప్రాసెస్ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మనతో పాటుగా ప్రపంచం అంతా ఆస్కార్ అవార్డు కోసం ఖర్చు పెడుతుంది... పోటీ పడుతుంది. మనం కూడా గట్టి పోటీ ఇవ్వాలంటే అక్కడి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉండాలి. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నెట్ఫ్లిక్స్ సపోర్ట్ ఉంది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు హెచ్బీవో వంటి పెద్ద సంస్థ సపోర్ట్గా నిలిచింది. 2001లో ‘లగాన్’ సినిమాకు నామినేషన్ వచ్చిందంటే ఆ సినిమాకు సోనీ వంటి సంస్థ సపోర్ట్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందుకే యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న సినిమాలను ఎఫ్ఎఫ్ఐ ఆస్కార్కు పంపితే అవార్డు వచ్చే చాన్సెస్ ఉంటాయి’’ అని పేర్కొన్నారు గునీత్ మోంగా. ఇక 2025లో లాస్ ఏంజిల్స్లో మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగాపు నామినేషన్ కోసం ఇండియా నుంచి ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎఫ్ఎఫ్ఐ పంపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... గునీత్ మోంగా నిర్మించిన తాజా ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెల్చుకుంది. కానీ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని ఎఫ్ఎఫ్ఐ పరిశీలించినప్పటికీ ఫైనల్గా ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎంపిక చేసింది. -
ఆస్కార్ అడ్రస్కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్రావు -
సెప్టెంబరులో స్టార్ట్
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్ హైమర్’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్ మర్ఫీ. దీంతో సీలియన్ తర్వాతి చిత్రాలపై హాలీవుడ్లో ఫోకస్ పెరిగింది. కాగా సీలియన్ నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్ కానున్నట్లు హాలీవుడ్ సమా చారం. హాలీవుడ్ హిట్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్ రూపకర్త స్టీవెన్ నైట్. ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్లో థామస్ షేల్బేగా నటించిన సీలియన్ మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్ ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫిఫ్టీ ప్లస్లో ఫస్ట్ చాన్స్!
ఐదు పదుల వయసు దాటిన తర్వాత హీరో అవుతున్నారు ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ యాక్టర్ కే హుయ్ క్వాన్. ‘ది అవెంజర్స్’, ‘జాన్ విక్’, ‘డెడ్పూల్ 2’ వంటి సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్లకు స్టంట్ కో ఆర్డినేటర్గా చేసిన జోనాథన్ యుసేబియా ‘విత్ లవ్’ అనే ఓ యాక్షన్ ఫిల్మ్తో దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలోనే కే హుయ్ క్వాన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ ఉన్న కే హుయ్ క్వాన్కు హీరోగా ఇదే తొలి చిత్రమని హాలీవుడ్ సమాచారం. అలాగే ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో ఉన్న జోనాథన్ యుసేబియా దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుతం ‘విత్ లవ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు క్వాన్. ఈ సినిమాకు గాను ఆయన ఉత్తమ సహాయ నటుడు విభాగంలో 2023లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్లో అవార్డు అందుకున్నారు. -
Oscars 2024: ‘ఉత్తమ చిత్రం’ వివాదంపై స్పందించిన నటుడు
ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో నంబర్ వన్ అవార్డుగా ‘ఉత్తమ చిత్రం ’ విభాగాన్ని భావిస్తారు. అందుకే ఈ విభాగాపు అవార్డును వేడుకలో చివరిగా ప్రకటిస్తారు. అలాగే వేడుకలో చివరి మూమెంట్స్ కాబట్టి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ అలాంటి డ్రామా గడిచిన ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) లాస్ ఏంజిల్స్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో కనిపించలేదు. ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ప్రకటించిన ప్రముఖ నటుడు అల్ పచినో చాలా సాదాసీదాగా వెల్లడించేశారు. పోటీలో ఉన్న పది చిత్రాల పేర్లు చెప్పకుండా.. అవార్డు సాధించిన చిత్రాన్ని ప్రకటించేశారు. కవర్ని మెల్లిగా తెరుస్తూ.. ‘నా కళ్లకు ‘ఆపెన్హైమర్’ కనిపిస్తోందని సింపుల్గా ప్రకటించారు. ఇలా చేయడం పట్ల హాలీవుడ్లోని కొందరు నటీనటులు, ఇతర ప్రముఖులు విముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం అల్ పచినో స్పందించారు. ‘‘ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్గా పాల్గొనడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇక వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి పోటీ పడ్డ పది చిత్రాల పేర్లను నేను చదవకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయని తెలిసింది. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. అది ఆస్కార్ ప్రొడ్యూసర్ల నిర్ణయం. వేడుక ఆద్యంతం ఈ పది సినిమాల యూనిట్ వాళ్లు హైలైట్ అవుతూనే ఉన్నందువల్ల వారు ఇలా నిర్ణయించి ఉండొచ్చు. ఆస్కార్కు నామినేట్ కావడం అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మంచి మైల్స్టోన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా నాకు ఈ విషయం తెలుసు. వారి పేర్లు ప్రస్తావించకపోవడం అనేది బాధకు గురి చేసే విషయమే. ఈ ఘటన పట్ల బాధపడిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చెబుతూ ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు అల్ పచినో. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆపెన్హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’, ‘బార్బీ’, ‘ది హోల్డోవర్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘మేస్ట్రో’, ‘΄ాస్ట్ లీవ్స్’, ‘పూర్ థింగ్స్’, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాలు ΄ోటీ పడగా, ‘ఆపెన్హైమర్’ అవార్డు దక్కించుకుంది. -
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్లో నా కళ్లకు ‘ఆపెన్హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్డ్రాప్తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
అస్కార్ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే
-
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్గఢ్లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
‘బార్బెన్హైమర్’ పోరు ఖరారు!
గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ‘ఒప్పెన్హైమర్’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్హైమర్’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్ క్వైడ్, నటి జాజీ బీట్జ్ ప్రకటించారు. ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్ లాంతిమోస్ దర్శకత్వం వహించిన ‘పూర్ థింగ్స్’, పది నామినేషన్లతో మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్హైమర్’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్హైమర్ పో రు’ అని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్కి నామినేషన్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం. అలాగే ‘బార్బీ’లో టైటిల్ రోల్ చేసిన మార్గెట్ రాబీకి ఉత్తమ నటి నామినేషన్ దక్కకపో వడం ఘోరం అనే టాక్ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ చిత్రదర్శకురాలు జస్టిన్ ట్రైట్కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కి నామినేషన్ దక్కింది. ఉత్తమ చిత్రం: అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ∙ఒప్పెన్హైమర్ పాస్ట్ లైవ్స్ ∙పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ దర్శకుడు: అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ఉత్తమ నటుడు: బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ఉత్తమ నటి: అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్ ఏ 91 ఏళ్ల కంపో జర్ జాన్ విల్లియమ్స్ 54వ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న జాన్కి ఈ చిత్రం కూడా ఆస్కార్ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి. 29 ఏళ్ల తర్వాత ‘నయాడ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్’, ‘ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్ అవార్డ్స్లో దర్శకుడు మార్టిన్ ఏ స్కోర్సెస్కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ దక్కింది. దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్ స్పీల్బర్గ్ తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్ దక్కించుకున్న మార్టిన్కు ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్. ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు స్టీవెన్ సీల్బర్గ్. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్ వైలర్ 12 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
ప్రారంభమైన ఆస్కార్ ఓటింగ్.. 23న నామినేషన్స్ ప్రకటన
ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. కాగా ఓటింగ్ ప్రక్రియను శుక్రవారం మొదలుపెట్టినట్లు ఆస్కార్ అకాడమీ వెల్లడించింది. జనవరి 12న మొదలైన ఈ ఓటింగ్ జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. (చదవండి: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) వీరందరూ వారికి కేటాయించిన విభాగాల్లోని వారికి ఓటు వేస్తారు. అకాడమీలో సభ్యులుగా ఉన్న యాక్టర్స్ యాక్టింగ్ విభాగానికి మాత్రమే ఓటు వేస్తారు. అలాగే మిగతా విభాగాల వారు కూడా. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. అయితే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’, ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగాలకు చెందిన ఓటింగ్కు మాత్రం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయట. ఈ నెల 23న ఆస్కార్ నామినేషన్స్ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్ లిస్ట్ జాబితాను ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. -
ఆస్కార్ రేసు నుంచి 2018 చిత్రం అవుట్
భారతీయ సినీ ప్రేమికులకు నిరాశ ఎదురైంది. 96వ ఆస్కార్ అవార్డ్స్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన మలయాళ సినిమా ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ ఆస్కార్ షార్ట్లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో భాగంగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా మొత్తం పది విభాగాల్లో ఆస్కార్కు నామినేషన్ బరిలో ఉన్న షార్ట్ లిస్ట్ను ప్రకటించారు మేకర్స్. హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ, ఓపెన్ హైమర్’ల హవా ఈ షార్ట్లిస్ట్ జాబితాలో కనిపించింది. ఇక ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం 88 దేశాల చిత్రాలు పోటీ పడగా, 15 చిత్రాలు షార్ట్లిస్ట్ అయ్యాయి. ఈ లిస్ట్లో మలయాళ ‘2018’ సినిమాకు చోటు దక్కలేదు. కాగా ఇండో–కెనెడియన్ ఫిల్మ్మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్లిస్ట్ అయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘టు కిల్ ఏ టైగర్’ అవార్డ్స్లతో సత్తా చాటింది. జార్ఖండ్లో గ్యాంగ్ రేప్కు గురైన తన కుమార్తెకు న్యాయం జరగాలని ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ కథనం ఉంటుంది. అస్కార్ నామినేషన్ కోసం పదిహేను డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్స్తో ‘టు కిల్ ఏ టైగర్’ పోటీ పడాల్సి ఉంది. ఇక అన్ని విభాగాల్లోని ఆస్కార్ నామినేషన్స్ జనవరి 23న వెల్లడి కానున్నాయి. ఇందుకోసం జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆస్కార్లోని పది విభాగాల షార్ట్ లిస్ట్ జాబితాలో ఒక్క ఇండియన్ చిత్రానికి కూడా చోటు లభించలేదు. ఇక ‘2018’ విషయానికొస్తే కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. టొవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, వినీత్, తన్వి రామ్, అజు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను ఈ చిత్రం వసూలు చేసింది. ఆస్కార్ బరిలో నిలిచి నామినేషన్ దక్కించుకోలేకపోయిన నాలుగో మలయాళ చిత్రంగా ‘2018: ఏవ్రీ వన్ ఏ హీరో’ చిత్రం నిలిచింది. గతంలో 70వ ఆస్కార్ అవార్డ్స్కు ‘గురు (1997)’, 83వ ఆస్కార్ అవార్డ్స్కు ‘అదామింటే మకాన్ అబు (2011)’, 93వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ‘జల్లికట్టు (2019)’, 96వ ఆస్కార్ అవార్డ్స్లో ‘2018: ఏవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ చిత్రాలను ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీకి పంపింది. -
బీన్స్ గింజపై ఆస్కార్ ‘నాటు నాటు’
తెనాలి(గుంటూరు జిల్లా): లాస్ ఏంజిలిస్లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్పై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కువైట్లోని పాహీల్ అల్ వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్ బీన్స్ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్ను, మధ్యలో ఆస్కార్ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల -
అర్హత లేని సినిమాలు ఆస్కార్కు పంపుతున్నారు: రెహమాన్
ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్కు పంపించారు. కానీ అది ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్ను సాధించే సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఆస్కార్ విజేతలకు పార్లమెంట్ జేజేలు
న్యూఢిల్లీ: విశ్వ వేదికపై తెలుగు బావుటా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు సాధించినందుకు పార్లమెంట్ జేజేలు పలికింది. భారతీయ సినిమా ఖ్యాతికి ఈ విజయాలు మరింతగా వన్నెతెచ్చాయంటూ మంగళవారం రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ప్రస్తుతించారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఇద్దరు మహిళల ఉత్కృష్ట పనితనాన్ని ఎలుగెత్తి చాటింది. భారతీయ మహిళలకు అంతర్జాతీయంగా దక్కిన అపురూప గౌరవమిది’’ అని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడేనని గుర్తుచేశారు. సభలో నవ్వులు పూయించిన ఖర్గే రెండు దక్షిణాది సినిమాలు ఆస్కార్ దక్కడం గర్వించాల్సిన గొప్ప విషయమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీనుద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘అధికార పార్టీని నేను కోరేదొక్కటే. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది, పాట రాసింది మేమేనంటూ మోదీజీ గానీ, బీజేపీ సర్కార్ గానీ ఆస్కార్ ఘనతను తమ ఖాతాలో వేసుకోవద్దు. ఇది దేశం సాధించిన ఘనత’ అన్నారు. దాంతో సభ్యులు బిగ్గరగా నవ్వేశారు. ఆస్కార్ గెలిచిన దేశ ప్రతినిధుల గురించి పార్లమెంట్లో చర్చించడం ఆనందంగా ఉందని మాజీ నటి, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు. -
ఆస్కార్ వేడుక.. నంబర్వన్గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్ను లైవ్ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గతేడాదితో ఆస్కార్తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. ఎన్టీఆర్ నంబర్ వన్ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారని సోషల్మీడియాను విశ్లేషించే నెట్బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్చరణ్ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్లో ఆర్ఆర్ఆర్ అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
ధూల్పేట్లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..
తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆర్ఆర్ఆర్ నాటు.. నాటు పాట నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి ఎంపికైహైదరాబాద్ మహా నగరం పేరును విశ్వ వ్యాప్తం చేసింది. సిటీకి చెందిన గాయకులు పాడిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో నవయువ విజయాల భాగ్య ‘నగ’రి మణిహారంలో మరో ఆణిముత్యం జత చేరింది. టాలీవుడ్ రాజధానిగా.. సినిమాల తయారీకి చిరునామాగా ఉన్న నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ఆస్కార్ పురస్కారం వరించడం సిటిజనులకు గర్వకారణంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా రూపకర్తలు, కథా నాయకులు, నృత్య దర్శకుడు... అందరూ మన సిటిజనులే కాగా నాటు నాటు పాడిన ఇద్దరు యువ గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇక్కడే పుట్టి పెరిగిన వారు కావడంతో సంతోషం ద్విగుణీకృతమైంది. ధూల్పేట్లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు.. నగరంలోని ధూల్పేట్కు చెందిన ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఇంట్లోని గిన్నెలు, స్టీలు ప్లేట్ల మీద దరువేసిన నాటి అల్లరి కుర్రోడు ఆస్కార్ ను ఇంటికి తెచ్చేసుకున్నాడు. నిన్నా మొన్నటి దాకా మన మధ్యనే ఆడి పాడిన రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖుల మధ్య పాడి ఆడించాడు. చిన్నవయసులో గజల్ మాస్టర్ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన రాహుల్.. మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్లో పని చేశాడు. ఏడేళ్ల శిక్షణలో గజల్స్పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే సినిమాల్లో కోరస్గా అలా అలా నాగ చైతన్య తొలి చిత్రం జోష్లో ‘కాలేజీ బుల్లోడా’ పాటతో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను పాడిన పాటల సీడీని తీసుకు వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించి, ఆయన సంగీత దర్శకత్వంలో ‘వాస్తు బాగుందే’ అనే పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘ఈగ’లో టైటిల్ సాంగ్, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు.. వంటి వరుస హిట్ సాంగ్స్తో స్టార్ సింగర్గా ఎదిగిపోయాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా స్వయంగా రూపొందిస్తూ.. మంగమ్మ, పూర్ బాయ్, మాకీ కిరికిరి’, ’గల్లీకా గణేష్’, ’దావత్’.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలకు తనదైన గానాన్ని జతచేసి సక్సెస్ సాధించాడు. గత 2019లో బిగ్బాస్ సీజ న్–3లో గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాలభైరవ.. గాన వైభవ.. ప్రముఖ సంగీత దర్శకుడు, నాటు నాటు పాటకు స్వరాలద్దిన కీరవాణి తనయుడు కాలభైరవ.. గత కొంత కాలంగా గాయకుడిగా రాణిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పాడుతున్నాడు. గాయకుడిగానే కాకుండా మత్తు వదలరా, కలర్ ఫొటో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సత్తా చాటాడు. బాహుబలి 2లో దండాలయ్యా...పాటతో సూపర్ హిట్ కొట్టాడు. నాటు నాటు పాటలో సహ గాయకుడు రాహుల్తో కలిసి స్వరం కలిపి ఏకంగా ఆస్కార్నే అందుకున్నాడు. కాలభైరవ,రాహుల్ సిప్లిగంజ్ సిటీ కుర్రాళ్లే విశ్వ సినీ చరిత్రలో మన నగరానికి ఖండాంతర ఖ్యాతి ఇరువురు గాయకులపై అభినందనల వెల్లువ -
ఆస్కార్ అవార్డ్ చిత్రాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా అయితే ఈ ఏడాది ఆస్కార్లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్ఫ్లిక్స్ బ్లాక్పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్స్టార్ అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్స్టార్ టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది) ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్ఫ్లిక్స్ పినాషియో - నెట్ఫ్లిక్స్ కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్లో స్ట్రీమింగ్కు అందుబాటులో లేవు. -
RRRలో మీరు చూసింది అదే: జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతదేశ సంస్కృతిపై మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న దేశమని కొనియాడారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు ఇండియన్స్కు పూర్తి నమ్మకం కలిగింది.' అని అన్నారు. -
Oscar Awards 2023: లాస్ ఏంజలెస్ లో సంబరాలు చేసుకున్న ప్రవాసాంధ్రులు
-
Oscars 2023 Photos: అపురూప క్షణాలు.. అవార్డు ఫంక్షన్లో మెరిసిన తారక్-రామ్చరణ్ ( ఫొటోలు)
-
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు. బిగ్బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్లో జరిగిన గొడవలో రాహుల్పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
ఆస్కార్స్ 2023: కనుల విందుగా 95వ అకాడెమీ అవార్డుల పండగ ( ఫొటోలు)
-
Oscar 2023: ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' సందడి..
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్- నాటు నాటు పాట సందడి చేసింది. అవార్డుల ప్రకటనకు ముందే స్టేజీపై ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు హాలీవుడ్ డాన్సర్లు. ఈ బీట్కు హాలీవుడ్ నటీ నటులు ఊర్రూతలూగారు. ఆస్కార్ అవార్డుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మన పాటకు లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందింది. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియానే గాక, పాన్ వరల్డ్ స్థాయిలో సినీ అభిమానులను అలరించింది. ముఖ్యంగా నాటు నాటు పాటుకు ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఈ పాటను ఆలకించారు. ఆస్కార్ స్టేజీపైనా వీరు లైవ్లో ఈ పాట పాడి అభిమానులను అలరించారు. -
Oscars 2023: అట్టహాసంగా ఆస్కార్ సెలబ్రేషన్స్
ఇంగ్లీష్ గడ్డపై ఇండియన్ సినిమా సత్తా చాటింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. ► ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. ►ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్(ది వేల్)ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్తో ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ను ఆస్కార్ వరించింది. ► 95వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్ అందుకున్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు. ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్డొనాగ్ – ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్, స్టీవెన్ స్పీల్బర్గ్ – ది ఫాబెల్మాన్స్ నామినేట్ అయ్యారు. ►బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి. ► ఇంగ్లీష్ గడ్డపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. 'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ అడాప్టెడ్ స్ట్రీన్ప్లే విభాగంలో హాలీవుడ్ చిత్రం‘ ఉమెన్ టాకింగ్’కు అస్కార్ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. ►ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాన్ని ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్ క్వాన్, డేనియల్ షేనెర్ట్లు ఈ అవార్డులు అందుకున్నారు. ► జెమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్ వరించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి. 'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్ బెర్టెన్ మాన్ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్ ఎం గొల్డెబెక్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్ హిప్పర్ సెట్ డిజైనర్గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అవార్డ్ కోసం అవతార్ 2, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి. ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. The Oscar for Best Documentary Short Film goes to 'The Elephant Whisperers' #Oscars #Oscars95 pic.twitter.com/jLG0aqAg3j — The Academy (@TheAcademy) March 13, 2023 నయా చరిత్ర ►బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఈ షార్ట్ ఫిల్మ్ను తెరకెక్కించారు. ► ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి. ► బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ ► బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్బై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నావల్నీ ► బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - జేమీ లీ కర్టిస్(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- కి హుయ్ క్వాన్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్- గిల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. -
వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..
యావత్ ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఆస్కార్ వేడుకపైనే ఉంది. ఈ రోజు (మార్చి 12) రాత్రి 8 గంటలకు లాస్ ఏంజిల్స్లో 95వ ఆస్కార్ ప్రధానోత్సవం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది మన దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రియులంతా ఆస్కార్ వేడక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! ఇదిలా ఉంటే.. ఈ సారి ఆస్కార్ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈసారి అతిథులకు స్వాగతం పలికేది రెడ్ కార్పెట్ కాదు. షాంపైన్. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్.. కానీ రంగు మాత్రం అది కాదు. ‘షాంపైన్’ కలర్ గా మార్చేశారు. తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని సమాచారం. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? ఈసారి ఈ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆస్కార్ ఈవెంట్లో ఏదైనా యాడ్ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుందట. మొత్తాని ఆస్కార్ చదవండి: Natu Natu Song: ఆస్కార్ బరి.. ఆ పాటతోనే గట్టి పోటీ మరీ..! ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి!
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం భూమిని బహుమతిగా అందించబోతోంది. ఎక్కడా అనుకుంటున్నారా..? ఆస్కార్ నామినీలు ఈ ఏడాది తమ గిఫ్ట్ బ్యాగ్లలో ఆస్ట్రేలియాలో ఒక చదరపు మీటర్ భూమిని అందుకోబోతున్నారు. అయితే ఆ భూమిని నామినీలు ఆధీనంలోకి తీసుకోలేరు. కానీ ఆ భూమి ఆస్కార్ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా అన్నమాట. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్బర్గ్పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! సాధారణంగా ఆస్కార్ నామినీలకు బహుమతులు ఇచ్చేందుకు అకాడమీతో సంబంధం లేకుండా అనేక వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి. నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్లో చోటు దక్కించుకోవడానికి 4 వేల డాలర్లు (రూ.3,27,862) చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ‘ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్’ను చేర్చింది. దీని ద్వారా క్వీన్స్ల్యాండ్లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో ఒక చదరపు మీటర్ స్థలం ఆస్కార్ నామినీల పేరుపై ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్ను గ్రహీతలకు అందిస్తారు. ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో కొంత భాగాన్ని పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్ నామినీలకు బహుమతిగా ప్రకటించింది. కాగా ఈ భూమి మొత్తం 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది. దీన్ని విక్రయిస్తే వచ్చే లాభం 2.5 మిలియన్ డాలర్లు వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే బొగ్గు సీమ్ గ్యాస్ ఫీల్డ్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై పర్యావరణ సంస్థల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. -
నిజంగా నిజం.. డమ్మీ ఆస్కార్ ఇస్తారు!
హాలీవుడ్లో ఆస్కార్ ఫీవర్ మొదలైంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ ది మోస్ట్ గ్లామరస్ డే కోసం సుందరంగా ముస్తాబైంది. పుత్తడిబొమ్మ ఎవరెవరి సొంతమవుతుందోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డుల వేడుక గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునేవాళ్లతో అకాడమీ నిర్వాహకులు ముందే రిహార్సల్స్ చేయిస్తారు. అండ ద విన్నర్ ఈజ్.. అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల వేడుక రోజు విజేతలుగా నిలిచే వాళ్లలో కొంచెం కంగారు తగ్గుతుందని నిర్వాహుల ఫీలింగ్. ఈసారి కూడా ఈ రిహార్సల్స్ జరిగాయి. శనివారం ఉదయం డాల్బీ థియేటర్లో నామినేషన్ దక్కించుకున్నవాళ్లు డమ్మీ ఆస్కార్ అందుకుని రిహార్సల్ పూర్తి చేశారు. రేపు ఉదయం అసలైన విజేతలకు నిజమైన ఆస్కార్ ప్రతిమను బహుకరిస్తారు. చదవండి: ఆస్కార్ వచ్చే ఆస్కారం ఎవరికి ఎక్కువ? Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. -
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా? అమ్మితే ఎంతొస్తుంది?
యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని నటీనటులు కలలు కంటారు. మరికొద్ది గంటల్లో ఆస్కార్ 2023 వేడుకలు గ్రాండ్గా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అందులో భారత్ నుంచి మన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి బంగారంలా మెరిసిపోయే ఆస్కార్ ప్రతిమ నిజానికి బంగారంతో చేసింది కాదు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ అవార్డు తయారు చేసేందుకు సుమారు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ దీన్ని అమ్మితే మాత్రం కేవలం ఒకే ఒక్క డాలర్ వస్తుందట. అదేంటీ? ఇంత ప్రాధాన్యత ఉన్న ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా అనే కదా మీ సందేహం. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్కార్ అవార్డును అమ్ముకోలని చూశాడట. ఇందుకు తగ్గట్లే వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన పెట్టింది. ఆస్కార్ విన్నర్స్ తమ అవార్డులను ఇతరులకు అమ్మడానికి వీల్లేదట. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. దీంతో ఒక డాలర్కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు. -
ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. -
ఆస్కార్లో ఓటు హక్కు ఉపయోగించుకున్న సూర్య
ఆస్కార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్య. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్లో 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. విజేతల ఎంపిక కోసం పదివేల మందికి పైగా ఉన్న ఆస్కార్ ఓటర్స్ ఈ నెల 2 నుంచి 7వరకు ఆన్లైన్లో ఓటు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సూర్య కూడా ఓటు వేశారు. ఆకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2022’లో భాగంగా సూర్య ఆస్కార్ సభ్యునిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే సూర్యతో ΄ాటు నటి కాజోల్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ రీమా ఖగ్తీలు కూడా ఆస్కార్ మెంబర్స్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆస్కార్ కోసం అమెరికా పయనమైన తారక్, వీడియో వైరల్
పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, హెచ్సీఏ, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్, క్రిటిక్స్ చాయిస్.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం మెగాపవర్స్టార్ రామ్చరణ్, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నారు. తాజాగా యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉదయం తారక్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మా హీరో కూడా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్కు వెళ్లాల్సి ఉండగా తారకరత్న మృతి చెందడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన యంగ్ టైగర్ వచ్చీరాగానే NTR30 మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ను తీసుకోనున్నట్లు సమాచారం. -
అందుకే... ఆస్కార్ క్రైసిస్ టీమ్
గత ఏడాది జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, నటుడు విల్ స్మిత్ల మధ్య జరిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వేదికపై తన భార్య, నటి జడా పింకెట్ స్మిత్పై క్రిస్ రాక్ జోక్స్ వేయడాన్ని సంహించలేకపో యిన విల్ స్మిత్ అందరూ చూస్తుండగానే క్రిస్రాక్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఆస్కార్ చరిత్రలో ఓ బ్లాక్మార్క్గా నిలిచిపో యిందని కమిటీ పేర్కొంది. 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్గా నిలిచారు. అయితే ఈ విషయం కన్నా ఎక్కువగా క్రిస్ రాక్పై చేయి చేసుకున్న విషయంలోనే వార్తల్లో నిలిచారు విల్ స్మిత్. ఈ నేపథ్యంలో పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలకు విల్ స్మిత్ హాజరు కాకుండా నిషేధం విధించింది కమిటీ. ఇక ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేలా, ఒకవేళ జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఈసారి ఆస్కార్ నిర్వాహకులు ‘క్రైసిస్ టీమ్’ను ఏర్పాటు చేయనున్నారు. 94ఏళ్ల ఆస్కార్ అవార్డు చరిత్రలో ఇలా ఒక టీమ్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘గత ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకలో జరిగిన ఓ ఘటన (విల్ స్మిత్ – క్రిస్ రాక్లను ఉద్దేశిస్తూ..) మమ్మల్ని కొత్తగా ఆలోచించేలా, సరికొత్త నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ఇందులో భాగంగానే క్రైసిస్ కమ్యూనికేషన్స్ టీమ్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ బృంద సభ్యులు అందుకు తగ్గట్లుగా త్వరితగతిన స్పందిస్తారు. ఈ క్రైసిస్ మెంబర్స్ సేవలు వినియోగంలోకి రాకూడదనే (ఆస్కార్ వేడుక సవ్యంగా జరగాలని ఆశిస్తూ...) కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ఆస్కార్ కొత్త సీఈఓ బిల్ క్రామెర్. ఇక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న జరగనుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. -
ఆస్కార్ సంబరాలు ఆరంభం.. ‘లంచ్ మీట్’లో కీరవాణి, చంద్రబోస్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపు నెల రోజులు ఉంది. ఈలోపు ఎప్పటిలానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నవారికి ‘లంచ్ మీట్’ ఏర్పాటు చేసింది అవార్డ్ కమిటీ. ఈ విందుకి సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ నుంచి విందు కార్యక్రమానికి ఆహ్వానం అందగా ఈ ఇద్దరూ వెళ్లారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ని నిర్మించారు. ఇక ‘లంచ్ మీట్’ విషయానికొస్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ది బెవర్లీ హిల్టన్ బాల్ రూమ్లో విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో దాదాపు 200మంది పాల్గొన్నారని సమాచారం. అక్కడ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు కీరవాణి, చంద్రబోస్. ఆ ఫోటోలను చంద్రబోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హుందాగా ఉందాం: జానెట్ యాంగ్ గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకకు ఓ హోస్ట్గా వ్యవహరించిన క్రిస్ రాక్ ఆ వేదికపై నటుడు విల్ స్మిత్ భార్య జాన్ పిన్కెట్ హెయిర్ స్టయిల్ గురించి కామెడీగా మాట్లాడారు. అది నచ్చక విల్స్మిత్ అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తున్న వేడుకలో విల్ స్మిత్ ఇలా చేయడం సరికాదని అవార్డు కమిటీ భావించింది. ఇదే విషయం గురించి తాజాగా ‘లంచ్ మీట్’లో అకాడమీ చైర్మన్ జానెట్ యాంగ్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గత ఏడాది ఆస్కార్ వేడుకలో జరిగిన ఘటన (క్రిస్ని విల్ చెంప చెళ్లుమనిపించడం) సరైనది కాదు. అందరం బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను ఆస్కార్ కమిటీ ఉపేక్షించదు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్వాదించా! ఈ నెల 17న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘యాంట్–మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాంటుమేనియా’లో సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్ర చేసిన జోనాథన్ మేజర్స్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ– ‘‘నేను భారతీయ చిత్రానికి అభిమానిని. ‘ఆర్ఆర్ఆర్’ని చాలాసార్లు చూశాను. మూడు గంటల ఈ సినిమాని ఆస్వాదించాను. ఇద్దరు నటులను (ఎన్టీఆర్, రామ్చరణ్) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. మరిన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. -
అందుకే కాంతార ఆస్కార్కు నామినేట్ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్కు షాట్లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్కు నామినేట్ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ కొత్త రకం కంటెంట్నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! ఇక కాంతార ఆస్కార్కు నామినేట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) WE CREATED HISTORY!! 🇮🇳 Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe — RRR Movie (@RRRMovie) January 24, 2023 -
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్కు ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్ను బోనస్లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత
ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ను గెలుచుకోవడం ఖాయమని హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాసన్ బ్లక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 301 చిత్రాలతో ప్రకటించిన ఆస్కార్ రిమైండర్ లిస్టులో భారత్కు చెందిన 10 సినిమాలు ఉండడం విశేషం. అందులో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జాసన్ బ్లమ్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా ‘ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకోవడం ఖాయం. మీరు ఫస్ట్ వినేది కూడా ఇదే. రాసిపెట్టుకొండి. నేను చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం నాకు నేనే సొంతగా అస్కార్ అవార్డును ప్రకటించుకుంటాను’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన ట్వీట్కు పలువురు హాలీవుడ్ పెద్దలు సైతం ఏకిభవిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. చదవండి: హైవోల్టేజ్ యాక్షన్స్తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది! ‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాం సార్. అది మాకు చాలు. ధన్యవాదాలు’ ఆయన ట్వీట్కు రీట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటూ నాటూ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ నామినేషన్కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అదే విధంగా లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న స్క్రీనింగ్కి కూడా భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో బెస్ట్ పిక్చర్ నామినేషన్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంట్రీ ఇవ్వచ్చు అని హాలీవుడ్ మీడియాలు తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. I’m going with RRR winning best pic. You heard it here first. Mark it down, please. If I’m right, I am awarding myself my own Oscar. — Jason Blum (@jason_blum) January 8, 2023 We won you, Blum!! ❤️ Thank you so much for your kind words. #RRR https://t.co/qWd07VUrq3 — RRR Movie (@RRRMovie) January 9, 2023 -
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీపై నెటిజన్ ట్వీట్.. ఘాటుగా స్పందించిన మంచు విష్ణు
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్కు నామినేట్ కాకపోవడంతో అభిమానులు, సినీనటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ది కశ్మీర్ పైల్స్, ఆర్ఆర్ఆర్ను వెనక్కి నెట్టి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఎంపికైంది . అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్కు మద్దతు కోసం చిత్రబృందం క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఆస్కార్లో బెస్ట్ క్రింజ్ మూవీ అనే కేటగిరీ ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు బదులిస్తూ.. 'భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా? ఇది కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం కాదు.. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్కు నామినేట్ చేసింది. Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ — Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022 -
'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్
ఎన్టీఆర్, రామ్చరణ్లు మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా ఆస్కార్కు నామినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలిందే. ఆర్ఆర్ఆర్ని ఆస్కార్కి నామినేట్ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేశారు. దీనిపై హీరో నిఖిల్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవసరమా? నాకు ఆస్కార్పై వేరే అభిప్రాయం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించారు. అదే సినిమాకు అతిపెద్ద విజయం అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్ఫేర్, జాతీయ అవార్డులు ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే ఆస్కార్కి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఇటీవలె స్పెయిన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. అక్కడ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాను ఇంతలా ఆదరిస్తుంటే, ఇంక ఆస్కార్ అవసరం లేదని నా ఫీలింగ్ అని నిఖిల్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
మెగా అభిమానులకు పండగే.. ఆస్కార్ రేసులో రామ్చరణ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో ఆలియాభట్,ఒలీవియా మోరిస్లు హీరోయిన్స్గా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలె అమెరికాకు చెందిన ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ వెరైటీ.. ఆస్కార్-2023కి గానూ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో జూ ఎన్టీఆర్కి అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని లిస్ట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రామ్చరణ్ పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్సైట్ అంచనా వేసింది. అంతేకాకుండా బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరిలో రాజమౌళికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్నట్లు జాబితా విడుదల చేసింది. -
Oscars: ఆస్కార్ బరిలో అలియా భట్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో ఒటికగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్) లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందట. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ‘గంగుబాయి’ని కచ్చితంగా ఆస్కార్ బరిలోకి దింపుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది. మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలకు బ్యాడ్న్యూస్.. కొత్త రూల్స్ తెచ్చిన ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 12న జరగనుంది. ఈసారి అవార్డులకు సంబంధించిన కొత్త నియమ, నిబంధనలను కమిటీ ప్రకటించింది. ఆ వివరాలు... థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకే ఆస్కారం ఒక సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్కు అర్హత సాధించాలంటే కచ్చితంగా థియేటర్స్లోనే రిలీజ్ కావాలి. ఆ సినిమా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు థియేటర్స్లోనే రిలీజ్ కావాలి. యూఎస్ మెట్రోపాలిటిన్ ఏరియా, లాస్ ఏంజిల్స్, ది సిటీ ఆఫ్ న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటాల్లోని థియేటర్స్లో సినిమా కచ్చితంగా ప్రదర్శితమై ఉండాలి. అయితే కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన సినిమాలూ ఆస్కార్ అవార్డుకు అర్హత సాధించాయి. కరోనా టైమ్లో అకాడమీ స్క్రీనింగ్ రూమ్లో సినిమాను ప్రదర్శిస్తే చాలు.. ఆ సినిమా అర్హతను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయిన కారణంగా ఈ వెసులుబాటుని తొలగించారు. ఓటీటీ కోసం సినిమాలు తీసి, ఆస్కార్ అవార్డుకు పంపాలనుకునే దర్శక–నిర్మాతలకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆస్కార్కు అర్హత సాధించాలంటే సినిమా కచ్చితంగా థియేటర్స్లోనే రిలీజ్ కావాలనే నిబంధన కరోనాకు ముందు నుంచీ ఉన్న సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో వచ్చే అవార్డుల పేర్లు మారాయి. ‘డాక్యుమెంటరీ ఫీచర్’ పేరు ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’గా, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగం ‘డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’గా మారింది. ► మ్యూజిక్ విభాగంలోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు విషయంలోనూ అకాడమీ మార్పులు చేసింది. ఈ విభాగంలో ఒక సినిమా నుంచి కేవలం మూడు పాటలనే పోటీకి పంపాలనే నిబంధనను విధించింది కమిటీ. ► ‘బెస్ట్ సౌండింగ్’ అవార్డు విభాగానికి అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆ సినిమాను సౌండ్ బ్రాంచ్ మెంబర్స్ పర్యవేక్షణలో ప్రదర్శించాలి. కొన్ని విభాగాలకు సంబంధించి పోటీలో నిలిచేందుకు చివరి తేదీ ► డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అక్టోబరు 3, 2022 ► యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్: నవంబరు 1, 2022 ► యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, జనరల్ ఎంట్రీ కేటగిరీ: నవంబరు 15, 2022 చదవండి 👉🏾 అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు అఖండ నటుడు కన్నుమూత -
నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: సమీరారెడ్డి
ఆస్కార్ అవార్డు 2022 ఈవెంట్ చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్య అనారోగ్యం గురించి కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అతడి చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘనపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీనిపై స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో తాను కూడా అలాగే చేసేదాన్ని అంటూ స్మిత్కు మద్దతుగా నిలిచింది. ఇక తాజాగా నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ తను కూడా గతంలో అలోపేసియా వ్యాధితో బాధపడినట్టు సీక్రెట్ రీవిల్ చేసింది. అంతేకాదు ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ‘ప్రతి ఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపుడుతుంటారు. ఇటీవల ఆస్కార్ వివాదం నన్ను దీనిపై మాట్లాడేలా చేసింది. ఇంతకి అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని వల్ల మీ జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్లుగా ఊడిపోతుంది. 2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను. ఒక రోజు నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర నా జుట్టు ఉడిపోయి ఉండటం నా భర్త అక్షయ్ గమనించాడు. ఒక నెలలోనే రెండు మూడు చోట్ల నా జుట్టు ఊడిపోయి కనిపించింది. చదవండి: ఆగిపోయిన ప్రభాస్ సలార్ షూటింగ్!.. కారణం అదేనా? ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ చూట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది. ఈ అలోపేసియా ఏరియాటా ఎందుకు వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ.. ఇది మాత్రం పెద్ద వ్యాధి కాదు’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అలాగే తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని, ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్లు లేవని ఆమె తెలిపింది. కాగా సమీరా రెడ్డి జై చిరంజీవా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోకా వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి.. అంతే తక్కువ సయమంలో ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ్ అనే వ్యాపావేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది సమీరారెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
జై భీమ్కు నిరాశ.. ఈ ఏడాది బరిలో ఉన్న చిత్రాలివే!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ఫిబ్రవరి 8 (మంగళవారం) వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు హోస్ట్స్గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్లో ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్’ చిత్రం 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్ఫాస్ట్’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ఈ నాలుగు చిత్రాలూ ఉత్తమ చిత్రం విభాగంలో ఉండటం విశేషం. అలా ఉత్తమ చిత్రం అవార్డు కోసం మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే నామినేషన్స్ దక్కించుకున్న వారిలో ఫైనల్గా ఎవరు ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకుంటారో చూడాలంటే ఈ ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ను కూడా సొంతం చేసుకుంటే బాగుంటుందన్నది భారత సినీ ప్రేమికుల అభిలాష. దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్కు నామినేటయ్యారు. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళ కాంపియనే కావడం విశేషం. ∙డేమ్ జూడీ డెంచ్ (87) ‘బెల్ ఫాస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏడు భిన్నమైన విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించారు కెన్నెత్ బ్రానాగ్. ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్ప్లే, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నారు కెన్నెత్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘బెల్ఫాస్ట్’కి బెస్ట్ పిక్చర్, ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో చోటు దక్కింది. దీంతో కెన్నెత్ బ్రానాగ్ ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా... ఉత్తమ చిత్రం: బెల్ ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్మేర్ అల్లీ. ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రానాగ్ (బెల్ఫాస్ట్) ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్) ఉత్తమ నటి: నికోల్ కిడ్మెన్ (బీయింగ్ ది రికార్డోస్), ఓలీవియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), జెస్సికా కాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), పెనెలోప్ క్రజ్ (సమాంతర తల్లులు) మళ్లీ నిరాశ బెస్ట్ ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్ ఎంట్రీ పోటీలో ఆస్కార్ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు. కానీ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించడానికి ముందు సోషల్ మీడియా, నెట్టింట్లో కాస్త డ్రామా నడిచింది. ‘ఆస్కార్ నామినేషన్స్ ఎవరికి దక్కుతాయి’ అనే చర్చలో భాగంగా అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ ఎడిటర్ జాక్వెలిన్ కోలే చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘జై భీమ్’ చిత్రానికి నామినేషన్ దక్కుతుంది. నన్ను నమ్మండి’ అంటూ జాక్వెలిన్ ట్వీట్ చేశారు. దీంతో ‘జై భీమ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? అనే చర్చ జోరుగా నెట్టింట్లో సాగింది. -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే.. -
ఆస్కార్ బరిలో నయనతార ‘కూళాంగల్’.. కథేంటంటే..?
‘కూళాంగల్’ (గులకరాయి) మోత ఆస్కార్ వరకూ వినిపించనుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది వచ్చే ఏడాది మార్చిలో తెలిసిపోతుంది. అయితే కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన సినిమా ఆస్కార్ పోటీ దాకా వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రేక్షకుల హృదయాలను తాకింది ‘కూళాంగల్’ సినిమా. అందుకే మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఆస్కార్కి ఎంపికైంది. 2022 మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ అవార్డ్ వేడుకకు మన దేశం తరఫున ‘విదేశీ విభాగానికి’ పలు చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ ఉన్నాయనే వార్త శుక్రవారం వచ్చింది. అయితే తమిళ చిత్రం ‘కూళాంగల్’ కూడా ఉందని, ఆ చిత్రమే ఎంపికైందని శనివారం అధికారిక ప్రకటన వెల్లడయింది. అన్ని చిత్రాలనూ పరిశీలించాక జ్యూరీ సభ్యులు ‘కూళాంగల్’ని ఎంపిక చేశారు. పీఎస్ వినోద్ రాజ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్–హీరోయిన్ నయనతార ‘రౌడీ పిక్చర్స్’ బేనర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ అధికారిక ఎంట్రీకి తమ సినిమా ఎంపికైన సందర్భంగా ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టు అని వినే చాన్స్ కూడా ఉంది! కల నెరవేరడానికి రెండు అడుగుల దూరమే ఉంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు విఘ్నేష్. ‘‘ఇంతకన్నా ఆనందకరమైన వార్త మరోటి ఉండదు’’ అన్నారు పీఎస్ వినోద్ రాజ్. కూళాంగల్ కథేంటంటే... భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్ వినోద్ రాజ్ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు వినోద్. నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్’ (ఐఎఫ్ఎఫ్ఆర్)లో ‘కూళాంగల్’ ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్ఎఫ్ఆర్ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్’ కావడం విశేషం. -
ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్ ఆవకాశం
సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్ఫిల్మ్లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్ యాప్ ‘జేఎఫ్ఎల్ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ సెలబ్రేషన్స్లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్లో భాగం కానుంది. (చదవండి: భర్త మరో మహిళతో జిమ్లో ఉండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న భార్య) చిన్న సినిమా.. పెద్ద వేదిక... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిల్మ్ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్ మరేదైనా కథాంశంతో షార్ట్ ఫిల్మ్ రూపొందించి, నవంబర్ 1వ తేదీలోపు జోష్ యాప్లో సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్ ఫిల్మ్ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్ 12న గోవాలో జరిగే గ్రాండ్ ఫినాలేలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్గా.., సునీల్ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. ‘జేఎఫ్ఎల్ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ ఆస్కార్ సెలబ్రేషన్స్కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్లో భాగమవుతుందని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహాకులు తెలిపారు. (చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్!) -
వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డ్స్
94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 27న లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్కు షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను ఈ ఏడాది డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే ఏడాది మార్చి 27న జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఉత్తమ చిత్రం విభాగానికి ప్రతిసారీ ఐదు నుంచి పది మధ్యలో సినిమాలను నామినేట్ చేసేవారు. కానీ ఇకపై ఉత్తమ చిత్రం విభాగానికి పది సినిమాలను నామినేట్ చేయనున్నారు. సాధారణంగా ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్లో జరిగింది. ఇంకా వచ్చే ఏడాది బీజింగ్లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4– 20), లాస్ ఏంజెల్స్లో ప్లాన్ చేసిన ఓ ప్రముఖ ఫుట్బాల్ లీగ్ల కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
Oscars 2021: ఆమెకు ఆస్కార్
ఆస్కార్ పెద్దల మనసు మారిందా? మనసు ‘తెల్లని’ కాగితం అయిందా? అందుకే ‘నల్ల’ ప్రతిభను గుర్తించిందా?... 93వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో నల్ల జాతీయులకు అవార్డులు దక్కడంతో చాలామంది మదిలో మెదిలిన ప్రశ్నలివి. 93 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో రెండోసారి ఓ మహిళకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఈసారి ఎక్కువమంది మహిళలకు అవార్డు దక్కడం కూడా ఓ విశేషం. రంగుకి, లింగ భేదానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతిభకు అవార్డు ఇచ్చినట్లు అనిపించిందన్నది పలువురి అభిప్రాయం. ‘ఆమె’ ఆస్కార్తో మెరిసిన వేళ... నల్ల జాతీయులు మురిసిన వేళ.... అవార్డు వేడుక విశేషాలు తెలుసుకుందాం. ‘ఆస్కార్ అంటే తెల్ల జాతీయులదే... నల్ల జాతీయులకు చోటు ఉండదు’ అనే విమర్శ దాదాపు ఐదేళ్లుగా ‘అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ మోస్తూ వస్తోంది. అయితే ఈ ‘రంగు మరక’ను తుడిచేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈసారి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. ఇందుకు ఓ ఉదాహరణ నల్ల జాతీయులంతా కలిసి నిర్మించిన ‘నొమాడ్ ల్యాండ్’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం. ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఉత్తమ దర్శకుడు, నటుడు, నటీమణి.. ఇలా మూడు ప్రధాన విభాగాల్లో అవార్డు దక్కించుకోవడం విశేషం. పది నామినేషన్లు దక్కించుకున్న ‘మాంక్’ కేవలం రెండు అవార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆరు నామినేషన్లు దక్కించుకున్న ‘నొమాడ్ ల్యాండ్’ మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికిగాను ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు క్లో జావ్ (39). దర్శకుల విభాగంలో అవార్డు అందుకున్న రెండో మహిళ, తొలి ఆసియన్ మహిళ కూడా క్లో జావే కావడం విశేషం. ఇదే చిత్రానికిగాను 63ఏళ్ల మెక్ డోర్మాండ్ను ఉత్తమ నటి అవార్డు వరించింది. మూడు ఆస్కార్లు గెల్చుకున్న ఏడో నటి డోర్మాండ్ కావడం విశేషం. మరోవైపు ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రానికి గాను హెయిర్ స్టయిలింగ్, మేకప్ విభాగంలో తొలిసారి నామినేషన్ పొందిన ఇద్దరు నల్లజాతి మహిళలు మియా నీల్, జామికా విల్సన్లు అవార్డుని కూడా ఇంటికి తీసుకెళ్లగలిగారు. అలాగే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అవార్డుని కొట్టేసింది ‘సోల్’. ‘బ్లాక్’ క్యారెక్టర్ లీడ్గా సాగిన చిత్రం ఇది. అది మాత్రమే కాదు.. ఉత్తమ సహాయ నటిగా అవార్డు దక్కించుకున్నారు కొరియన్ నటి జంగ్ యూన్. ‘మినారీ’ చిత్రంలోని నటనకుగాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి కొరియన్ నటి ఆమే. ఈసారి అవార్డుల ఎంపిక పరంగా పెద్దగా విమర్శలు రాలేదు కానీ, ఉత్తమ నటుడి ఎంపిక విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. ‘మా రేనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రంలోని నటనకు గాను దివంగత నటుడు చాడ్విక్ బోస్మాన్కు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని చాలామంది ఊహించారు కానీ నిరాశే ఎదురైంది. ‘ది ఫాదర్’కి ఆంథోనీ హాప్కిన్స్ ఉత్తమ నటుడి అవార్డు పొందారు. 93 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో 80ఏళ్ల వయసు పైబడిన ఇద్దరు తారలకు అవార్డులు దక్కిన ఆనందం ఈసారే జరిగింది. ఉత్తమ నటుడిగా ఆంథోనీ హాప్కిన్స్ (83), కాస్ట్యూమ్స్ డిజైనింగ్ విభాగంలో అన్ రోత్ అనే 89 ఏళ్ల మహిళకు ఆస్కార్ దక్కింది. ఈసారి మరో విశేషం కూడా జరిగింది. మామూలుగా మహిళలకు అంటూ ఉండే విభాగాలు రెండో.. మూడో. ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి... ఇలా. మిగతా విభాగాల్లో పురుషాధిక్యం ఉంటుంది. ఆ విభాగాల్లోనూ మహిళలు అవార్డు దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయం. ఈసారి డైరెక్షన్, మేకప్, హెయిర్ స్టయిలింగ్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్, ఒరిజినల్ స్క్రీన్ప్లే తదితర విభాగాల్లోనూ మహిళలు రాణించడం విశేషం. మొత్తం 15కి పైగా అవార్డులు అతివల సొంతమయ్యాయి. ఇక కోవిడ్ కారణంగా వీక్షకులను వేడుకకు అనుమ తించలేదు. ఎప్పుడూ ఒకే వేదిక మీద జరిగే ఆస్కార్ అవార్డు వేడుక కోవిడ్ కారణంగా ఈసారి రెండు వేదికలు లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్, యూనియన్లో అవార్డు వేడుక జరిగింది. రైటర్ కమ్ డైరెక్టర్ ఎమెరాల్డ్ ఫెన్నల్ ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రానికిగాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించారు. 13 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో అవార్డు సాధించిన మహిళ ఎమెరాల్డే కావడం విశేషం. 2008లో ‘జునో’ చిత్రానికి డాయాబ్లో కోడైకి అవార్డు దక్కింది. ‘గెట్ అవుట్’కి 2018లో ఆస్కార్కు నామినేట్ అయినా అవార్డును గెలుచుకోలేదు డేనియల్ కలుయా. ఈసారి ‘జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య’లోని నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగాæఆయన‡ఆస్కార్ అందుకున్నారు. నాన్నతో కలిసి నేను చైనాలో పెరుగుతున్నప్పుడు సరదాగా ఓ ఆట ఆడేవాళ్ళం. చైనీస్లోని మంచి పద్యాలు, సామెతలను ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. అయితే ఈ పద్యాల్లో ఒకరు ఒక వాక్యం చెబితే ఆ తర్వాతి వాక్యాన్ని మరొకరు చెప్పాలి. ఇదే గేమ్. నా చిన్నతనంలో ఇలా చాలాసార్లు ఆడుకున్నాం. వీటిలో ఒక వాక్యం ఉంది. ‘పుట్టినప్పుడు సహజంగానే అందరూ మంచివాళ్లే’. ఈ మాటలు నా చిన్నతనంలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఇప్పటికీ నేను దీన్ని నమ్ముతాను. అందుకే ప్రపంచంలో నేను ఏ మూల ఎవర్ని కలిసినా వారిలోని మంచిని గురించే ఆలోచిస్తాను. కేవలం ఇతరుల మంచినే కాదు.. మనలో దాగి ఉన్న మంచిని కూడా మనం ధైర్యంగా తెలుసుకుందాం. – క్లో జావ్, ఉత్తమ దర్శకురాలు నేను నా స్వస్థలమైన వేల్స్లో ఉన్నాను. నాకిప్పుడు 83 ఏళ్ళు. ఈ వయసులో నాకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఊహించలేదు. సంతోషంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. అకాడెమీ సభ్యులకు నా ధన్యవాదాలు. చాడ్విక్ బోస్మాన్కు నా నివాళులు అర్పిస్తున్నాను. చాడ్విక్ చాలా తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోయాడు. – సర్ ఆంథోనీ హాప్కిన్స్, ఉత్తమ నటుడు నా నోట మాటలు రావడం లేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు నటన వచ్చని నమ్మి, అవకాశాలు ఇస్తున్నవారికి ధన్యవాదాలు. – ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్, ఉత్తమ నటి అస్కార్ అవార్డుకి ఇప్పటికే ఎనిమిదిసార్లు నామినేట్ అయ్యారు గెన్ క్లోజ్. కానీ ఆమెకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయిన గెన్ క్లోజ్కు అవార్డు దక్కలేదు. కేవలం ఒకేఒకసారి నామినేట్ అయిన జంగ్ యూన్కు అవార్డు రావడం ఆస్కార్ వేడుకలో మరో హైలైట్. వయోలా డేవిస్, క్యారీ ముల్లిగన్, రెజీనా కింగ్, ఏంజెలా బాస్సెట్, హల్లే బెర్రీ వంటి తారలు రెడ్ కార్పెట్పై మెరిశారు. పొడవాటి గౌనుల్లో గ్లామర్గా కనిపించారు. ఖరీదు గల నగలతో నగుమోముతో వీక్షకులకు కనువిందు చేశారు. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో డెన్మార్క్కు చెందిన ‘అనదర్ రౌండ్’ చిత్రం ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. చిత్రదర్శకుడు థామస్ వింటర్బెర్గ్ భావోద్వేగానికి లోనయ్యారు. వీక్షకుల కళ్లూ చెమర్చాయి. ‘‘జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేం ఈ సినిమాను తీశాం. జీవితంలో కంట్రోల్ ఉండాలి. నా జీవితంలో నేను నా కూతురు ఇదాను కోల్పోయాను. ఈ సినిమా షూటింగ్ను ఆరంభించడానికి రెండు నెలల ముందు నా కూతురు ఇదా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. తనకు ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చింది. అందుకని తనతో ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేయించాలనుకున్నాను. ఈ అవార్డు ఆమెదే’’ అని భావోద్వేగానికి లోనయ్యారు థామస్. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత ఈ విభాగంలో డెన్మార్క్కు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఈసారి విశేషాలు ఇవీ... ∙‘మినారి’ చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ సాధించారు కొరియన్ మహిళ జంగ్ యూన్. ఆ ఘనత సాధించిన తొలి కొరియన్ మహిళ ఆమె. నామినేట్ అయిన తొలిసారే జంగ్ యూన్ను అవార్డు వరించడం మరో విశేషం. ∙‘నొమాడ్ ల్యాండ్’ సినిమా తర్వాత క్లో జావ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎటర్నల్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆస్కార్ అవార్డు వేడుకలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ టీజర్ను విడుదల చేశారు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చిత్రానికి నామినేట్ అయిన రిజ్ అహ్మద్కు అవార్డు వచ్చినట్లయితే ...ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి ముస్లింగా రిజ్ అహ్మద్ చరిత్ర సృష్టించేవారు. అయితే నామినేషన్ దక్కించుకోవడం అంటే కూడా చిన్న విషయం కాదు. అవార్డు రాకపోయినా ఈ ఆస్కార్ వేడుకలో తన భార్య హెయిర్ను సరిచేస్తూ ఆకట్టుకున్నారు రిజ్. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ను క్లోజ్ చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్లోని సినిమాలకు కూడా ఈసారి ఆస్కార్ అవార్డ్స్లో చోటు దక్కింది. మా రేనీస్ బ్లాక్ బాటమ్ (2), మాంక్ (2), అక్టోపస్ టీచర్ (1), ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ (1), టు డిస్టంట్ స్ట్రేంజర్స్ (1) .. ఇలా నెట్ఫ్లిక్స్లోని చిత్రాలకు ఏడు అవార్డులు, అమెజాన్ ప్రైమ్లోని ‘సౌండ్ ఆఫ్ మెటల్’ చిత్రానికి (2), డిస్నీ ఫ్లస్లోని ‘సోల్’కు (2).. ఇక మరో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ హులులోని ‘నొమాడ్ ల్యాండ్’కు (3).. ఇలా మొత్తం 23 ఆస్కార్ విభాగాల్లో 14 అవార్డులు ఓటీటీలో స్ట్రీమ్ అయిన చిత్రాలు దక్కించుకోవడం విశేషం. మన దేశం తరపున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ ఎంట్రీగా వెళ్లింది. కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఇక ప్రియాంకా చోప్రా నటించిన ‘వైట్ టైగర్’ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నప్పటికీ అవార్డును అందుకోలేకపోయింది. -
చెత్త సినిమాలకు కూడా అవార్డులా..!
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సినీ రంగంలో వివిధ కేటగిరీలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను ఇస్తూంటారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఆస్కార్ అవార్డు. ఈ అవార్డును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది నటీనటులు, టెక్నిషియన్స్ , దర్శకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఈ అవార్డు కేవలం ప్రజాదరణ పొందిన సినిమాలకు మాత్రమే వరిస్తాయి. మంచి సినిమాలకు అవార్డులు లభిస్తే మనం పొందే ఆనందం అంతఇంతా కాదు. మరి అత్యంత చెత్త సినిమాల పరిస్థితి ఏంటి? అని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. ప్రజాదరణ పొందని, లేదా అత్యంత పరమ చెత్త సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. మంచి సినిమాలకే కాదు చెత్త సినిమాలకు కూడా అవార్టులు ఇస్తారండోయ్..!. వరస్ట్ సినిమాలకు కూడా హాలీవుడ్లో ఒక అవార్డు అందిస్తారు. ఆ అవార్డే గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు. దీనినే రజ్జీస్ అవార్డుగా కూడా పిలుస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారిగా 1981 మార్చి 31న నిర్వహించారు. అకాడమీ అవార్డులను అందించే ముందు రోజు ఈ అవార్డు వేడుకలను అందిస్తారు. వరస్ట్గా నటించినవారికి, దర్శకులకు ఈ అవార్డును అందిస్తారు. ఇక్కడ విషయమేమిటంటే ఇప్పటి వరకు 14 మంది మాత్రమే ఈ అవార్డులను స్వీకరించారు. కాగా రజ్జీస్ విజేతలను పలు దేశాల నుంచి 1,097 మంది సభ్యులను ముందుగా ఎంపిక చేస్తారు. వీరు ఆన్లైన్లో సభ్యత్వ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది గాను వివిధ కేటగిరీలో రజ్జీస్ అవార్డులను ప్రకటించారు.. రజ్జిస్ అవార్డు విజేతలు వీరే.. వరస్ట్ యాక్టర్:మైక్ లిండెల్- ది పిల్లో గయ్ వరస్ట్ యాక్టరస్: కేట్ హడ్సన్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టరస్: మాడ్డీ జిగ్లెర్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టర్: రూడీ గియులియాని వరస్ట్ డైరెక్టర్: సియా చదవండి: హాలీవుడ్ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ -
హాలీవుడ్ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ
ఆమె వయసు పాతికేళ్లు. ధరించిన పాత్ర పద్నాలుగేళ్ల అమ్మాయిది. అదే తన మొదటి సినిమా, పైగా హాలీవుడ్ సినిమా.. ధైర్యంగా కెమెరా ముందుకెళ్లింది. తన నటనా ప్రావీణ్యంతో అవార్డునూ సాధించింది. ఆమె మన ఇండియన్ అమ్మాయి – అర్చీ పంజాబీ. ►తల్లిదండ్రులు గోవింద్ పంజాబీ, పద్మా పంజాబీ. ఇద్దరూ బ్రిటన్లో స్థిరపడిన స్కూల్ టీచర్స్. చిన్నతనంలో కొంతకాలం ముంబైలో పెరిగింది. అందుకే తనను తాను ‘పార్ట్ బాంబేౖయెట్, పార్ట్ బ్రిటిష్’గా పరిగణించుకుంటుంది. ►ఇంగ్లండ్లోని బ్రూనెల్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఆడిషన్కూ వెళ్లేది. అలా మొదటగా ‘సైరన్ స్పిరిట్స్’ టీవీ సీరియల్లో కనిపించింది. ►సినిమాల్లోకి ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’తో ఎంట్రీ ఇచ్చింది. అందులో ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిలా నటించింది. కానీ, ఆమె వయసు అప్పటికే 25 సంవత్సరాలు. ఆ తర్వాత చేసిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్తో ఆమె బుల్లితెర స్టార్గా మారింది. ►అర్చీ నటించిన ‘ది కాన్స్టంట్ గార్డెన ర్’ సినిమా ఆస్కార్కు నామినేట్ అయింది. అంతేకాదు, వివిధ అవార్డు ఫంక్షన్స్లో ‘ఉత్తమ నటి’ అవార్డు, ‘ది చాపర్డ్ ట్రోఫీ’, ‘ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డు’, ‘ఇమేజ్ అవార్డు’ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అవార్డులే ఆమెను వరించాయి. ►టెలివిజన్ టాప్ టెన్ యాక్టర్స్లో ఒకరిగా నిలవడమే కాదు.. ‘యాస్మిన్’, ‘ఎ మైటీ హార్ట్’, ‘కోడ్ 46’, ‘ఎ గుడ్ ఇయర్’ వంటి పెద్ద సినిమాలూ చేసింది. ప్రస్తుతం వివిధ వెబ్సీరిస్ చేస్తూ బిజీగా ఉంది. ►మా అమ్మ వాళ్ల నాన్నతో గొడవపడి టీచర్ ఉద్యోగం సాధించింది. అందుకే, నేను సినిమాల్లో నటిస్తానంటే మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. పైగా మా అమ్మ ‘ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు’ అని చెప్పి నాలో స్పూర్తిని నింపింది. – అర్చీ పంజాబీ -
ఆస్కార్ అవార్డు వస్తే అదొక స్ట్రెస్
ఏప్రిల్ 26న ఆస్కార్ అవార్డులు. ’మీనారీ’ ఉత్తమ సహాయనటిగా నామినేట్ అయిన 73 ఏళ్ల నటి యువాన్ యు–జంగ్కి ఆస్కార్ వస్తే కనుక దక్షిణ కొరియాకే ఆమె తొలి ఆస్కార్ నటి అవుతారు. సాధారణంగా ‘బాఫ్తా’, ’సాగా’ అవార్డులు వచ్చిన కేటగిరీలకు స్కార్ కూడా వస్తుంది. యువాన్ ఆ రెండూ గెలుచుకున్నారు. ఇక మిగిలింది ఆస్కార్. ఒకవేళ తనకు ఆస్కార్ వస్తే అది తనకెంతో ‘స్ట్రెస్ఫుల్’ అవుతుందని ఆమె అంటున్నారు!! తొంభై ఏళ్లకు పైబడిన ఆస్కార్ చరిత్రలో దక్షిణ కొరియా నుంచి ఒక నటి నామినేట్ అవడం ఈ ఏడాదే తొలిసారి! 73 ఏళ్ల ఆ నటి యువాన్ యు–జంగ్. అమెరికన్ డ్రామా మూవీ ‘మీనారీ’ నుంచి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఆమె ఆస్కార్ పోటీలో ఉన్నారు. విజేతగా నిలిస్తే దక్షిణ కొరియాలో ఆస్కార్ సాధించిన తొలి నటి కూడా యువాన్నే అవుతారు. అయితే.. ‘‘విజేతగా నిలవడం సంతోషమే కానీ, విజేతగా నిలబడడం ఒత్తిడితో కూడుకున్న విషయం’’ అని ఆమె అంటున్నారు! అయినా.. తేలని ఫలితం గురించి యువాన్ ముందుగానే ఒత్తిడి కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే.. ఇప్పటికే ఆమె ‘బాఫ్తా’ (బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్), ‘సాగా’ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్) లో అదే చిత్రానికి, అదే కేటగిరీలో ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ఇక మిగిలింది ఆస్కారే. ఆ రెండిట్లో అవార్డు వస్తే ఇక్కడా వచ్చినట్లేనని ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం యువాన్ ఆస్కార్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ కొరియాలో సీనియర్ సినీ అగ్ర తారగా గుర్తింపు ఉన్న యువాన్.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్కు నామినేట్ అయిన ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మగా నటించారు. అమెరికా కల నెరవేర్చుకునేందుకు ఆర్కాన్సాస్ వలస వచ్చిన ఒక దక్షిణ కొరియా కుటుంబం చుట్టూ తిరిగే కథ మీనారీ. ఆ చిత్రంలో నెరవేరవలసిన ఒక కల ఉంటుంది. యువాన్ మాత్రం కనీసం ఆస్కార్ ‘నామినేషన్ కల’ కూడా కనలేదు. ఇప్పుడిక ఆమె ఏనాడూ కనని ఆస్కార్ ‘అవార్డు కల’ నెరవేరడం కోసం ఆమె తప్ప ఆమె అభిమానులంతా ఎదురు చూస్తున్నారు! యువాన్ ఐదు దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తున్నారు. 1960లలో ఆమె రైజింగ్ స్టార్. 1971లో వచ్చిన ‘ఉమన్ ఆఫ్ ఫైర్’ చిత్రంలో ఆమె పాత్రకు అనేక అవార్డులు వచ్చాయి. వందకు పైగా సినిమాలు, లెక్కలేనన్ని టెలీ సీరియళ్లలో నటించారు. ఆమె కెరీర్ మొత్తం మీద వచ్చిన అవార్డులను మించి ఈ ఒకటీ రెండేళ్లలోనే సాధించారు! ఆస్కార్ కూడా వచ్చేస్తే నటిగా జీవిత సాఫల్యం. అయితే యువాన్ అలా అనుకోవడం లేదు. ఆస్కార్ బరిలో ఆమెకు పోటీగా మరో ఐదుగురు నటీమణులు ఉన్నారు. ‘‘గెలుస్తానని, గెలవాలనీ ప్రత్యేకంగా నాకైతే ఏమీ లేదు. అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశ ఫలించి నాకు ఆస్కార్ వస్తే అది నాకు అవార్డు కన్నా కూడా ఒత్తిడే అవుతుంది’’ అని నవ్వుతూ అంటున్నారు యువాన్. మరింత బాధ్యత పెరిగినట్లు అనిపించడం కావచ్చు ఆ మాటకు అర్థం. వృత్తి పట్ల అంకితభావం ఉన్నవారికే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయేమో!! సూన్–జా అమ్మమ్మ ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో నటించారు యువాన్. ఆ అమ్మమ్మ పేరు సూన్–జా. కూతురు, అల్లుడు కోళ్లఫారంలో పని చేస్తుంటారు. కొద్దిగా పొలం కూడా ఉంటుంది. ఆ పంటను అమ్ముకుని జీవిస్తుంటారు. పొలానికి నీళ్లకోసం అల్లుడే సొంతంగా బావి తవ్వుకుంటాడు. ఇద్దరు పిల్లలు. కూతురు, కొడుకు. పెద్దవాళ్లు పనులకు వెళ్లినప్పుడు పిల్లల్ని చూసుకోడానికని యువాన్ని పిలిపించుకుంటారు. మనవడి గదిలో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. మొదట వాడికి అమ్మమ్మ నచ్చదు. అమెరికా అమ్మమ్మలా ఉండదు. అందుకని! మెల్లిగా మాలిమి అవుతాడు. వాడికి గుండె జబ్బు ఉంటుంది. అదొక బెంగగా ఉండేది తల్లిదండ్రులకు. యువాన్ వాడిని ఆడించి, పరుగులు తీయించి, వైద్యసహాయం అవసరం లేనంతగా శక్తిమంతుడిని చేస్తుంది. ‘మీనారీ’ (నీటి మొక్క) ల పెంపకం గురించి, వాటి ప్రయోజనాల గురించి మనవడికి చెబుతుంటుంది. మరోవైపు.. అల్లుడు తవ్విన పంట బావి ఎండిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. భార్యాభర్తలు విడిపోయే వరకు వస్తుంది. ఆ క్రమంలో యువాన్కు స్ట్రోక్ వస్తుంది. ఆరోగ్యం మెరుగయ్యాక కూడా కదల్లేని స్థితిలో ఉంటుంది. ఓ రోజు అకస్మాత్తుగా వీళ్ల పంట ఉన్న గిడ్డంగికి నిప్పు అంటుకుని యువాన్ ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుంది. అప్పటికే విడిపోయే ఏర్పాట్లలో ఉన్న అల్లుడు, కూతురు కలిసికట్టుగా వచ్చి ఆమెను కాపాడతారు. ‘జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. అయినా ముందుకు వెళ్లాలి.. మీనారీ మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లోనూ గుబురుగా పెరిగిన విధంగా..’ అనే సందేశాన్ని యూవాన్ పాత్రతో దర్శకుడు ఇప్పించారని చిత్ర సమీక్షకులు భావిస్తున్నారు. ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో యువాన్ -
అదిగదిగో ఆస్కార్... మన తరఫున ‘వైట్ టైగర్’...
అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతుండడంతో ఈ సారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్డాగ్ మిలియనీర్, పారాసైట్ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం. ద పాధర్: ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుంది. జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే ! మంక్: డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు. మినారీ: లీ ఇసాక్ రచనదర్శకత్వం వహించిన కొరియన్ అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది. నోమడ్ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన 60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది. అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. సౌండ్ ఆఫ్ మెటల్:తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్ అహ్మద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ద ట్రయల్ ఆఫ్ ద చికాగో: కోర్ట్ రూమ్లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది. చదవండి: ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి: చిరంజీవి -
ఆస్కార్లో భారతీయం..
అకాడమీ అవార్డ్స్... గెలువడం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులకు ఓ కల. అకాడమీ అవార్డు సాధించారంటే చాలు తమ జీవితాశయం నెరవేరినట్లే సంబరపడిపోతారు. భారతీయ సినీ ప్రముఖులూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆ క్రమంలోనే అద్భుతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆస్కార్ దాకా వెళ్తున్నాయి కూడా. నాటి మదర్ ఇండియా మొదలు నేడు వైట్ టైగర్ దాకా ఆస్కార్లో భారతీయ చిత్రాలు పోటీపడుతూనే ఉన్నాయి. మన దేశం తరపున ఏ చిత్రం నామినేట్ అయినా భారత్తో ఆస్కార్ అనుబంధం మీద చర్చ సహజమే. 93వ అకాడమీ అవార్డ్స్ లైవ్ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్లో ఏప్రిల్ 26న ఉదయం 5.30 గంటలకు ప్రసారం కానుండగా, ఈ కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ఈ నేపధ్యంలో మన సినిమాలతో ఆస్కార్ కున్న అనుబంధం ఒకసారి పరిశీలిస్తే... ఆస్కార్లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రినాకు అవార్డును కోల్పోయింది ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రక రకాలుగా చెప్తారు కానీ, 1983లో ఓ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్కు ఆస్కార్ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ భాను అథైయా గోల్డెన్ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్ సైతం నామినేట్ చేయబడ్డారు. మన దేశానికి ఆస్కార్లో లభించిన అరుదైన గౌరవం మాత్రం సత్యజిత్రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే. ఇప్పటిదాకా ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్రే మాత్రమే. భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్ పేరిట రెండు అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్ ఇండియా, లగాన్, సలామ్ బాంబే మాత్రమే నిలిచాయి. ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రానికి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ప్రియాంక చోప్రా, రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లు దీనిలో నటించారు. మరి ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్లో ఏం సాధించనుందో...చూడాల్సి ఉంది. -
'ప్రియాంక దంపతులకు ఆ అర్హత లేదేమో!'
సెలబ్రిటీలకు అప్పుడప్పుడూ మనసు నొప్పించే విమర్శలు ఎదురవుతుంటాయి. అయితే వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొంటారన్నది ముఖ్యం. కొందరు సుతి మెత్తగా ఇచ్చే సమాధానాలు చెంప చెళ్లుమనేట్లు ఉంటాయి. ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్కి ప్రియాంకా చోప్రా దాదాపు అలాంటి సమాధానమే ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. సోమవారం 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ జాబితాను తన భర్త నిక్ జోనస్తో కలిసి ప్రియాంకా చోప్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ ‘‘ఈ ఇద్దరంటే (ప్రియాంక, నిక్) నాకు గౌరవభావం లేదనను. కానీ సినిమా రంగానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆస్కార్ నామినేషన్లను ప్రకటించేంత అర్హత ఇస్తుందని నేననుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఒకరి అర్హతను నిర్ణయించేవి ఏంటి? అనే మీ ఆలోచనను స్వాగతిస్తున్నాను. అయితే 60కి పైగా నేను చేసిన చిత్రాల జాబితాను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను’’ అని ఆ జర్నలిస్ట్ ట్వీట్కి గట్టిగానే సమాధానం ఇచ్చారు ప్రియాంక. ఆమె ట్వీట్ చూసి, ‘చాలా కూల్గా భలే చెప్పావ్ ప్రియాంక’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లి, తనను నిరూపించుకున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. చదవండి: సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. -
ఇద్దరు వనితల ఆస్కార్ చరిత్ర
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే. ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్ల్యాండ్’ కు ఆరు నామినేషన్లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం. ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్లోని ఒక స్టీల్ ప్లాంట్లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు. క్లాస్ రూమ్లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు. ∙∙ ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్లు పొందారు. బెస్ట్ డైరెక్టర్తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే. నోమాడ్ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్లో పుట్టారు. ఆక్స్ఫర్డ్లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నామినేషన్కే 48 ఏళ్లు పట్టింది! తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్గా ఒక మహిళ ఆస్కార్కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది. ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో. -
ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..
లండన్: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్ను లండన్లో ప్రియాంక- నిక్ జోనాస్ దంపతులు 2021 ఆస్కార్ నామినేషన్ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్ ఫాంథర్ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి ఆస్కార్కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. 2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా ఉత్తమ చిత్రం కేటగిరీ ది ఫాదర్ జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య మాంక్ మినారి నోమాడ్ ల్యాండ్ ప్రామిసింగ్ యంగ్ వుమన్ సౌండ్ ఆఫ్ మెటల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఉత్తమ దర్శకుడు కేటగిరీ థామస్ వింటర్బర్గ్, (అనదర్ రౌండ్) డేవిడ్ ఫించర్, (మాంక్) లీ ఐజాక్ చుంగ్, (మినారి) క్లోస్ జావో, (నోమాడ్లాండ్) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ నటుడు కేటగిరీ రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్) చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్) గ్యారీ ఓల్డ్మన్, (మాంక్) స్టీవెన్ యూన్, (మినారి) ఉత్తమ నటి కేటగిరీ వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే) వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్) ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, (నోమాడ్ల్యాండ్) కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) డేనియల్ కలుయా, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్ మయామి) పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్) లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) ఉత్తమ సహాయ నటి కేటగిరీ మరియా బకలోవా, (బోరాట్ సబ్సీక్వెంట్ మూవీఫిల్మ్) గ్లెన్ క్లోజ్, (హిల్బిల్లీ ఎలిజీ) ఒలివియా కోల్మన్, (ది ఫాదర్) అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్) యుహ్-జంగ్ యూన్, (మినారి) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లీ ఐజాక్ చుంగ్, (మినారి) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్) ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ లవ్ అండ్ మాన్స్టర్స్ మిడ్నైట్ స్కై ములన్ ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్ టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్వర్డ్ ఓవర్ ద మూన్ ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్ సౌల్ వోల్ఫ్ వాకర్స్ (చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. నిరాశలో ఫ్యాన్స్) -
ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్..
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే నీ హద్దురా). సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆ తర్వాతి రౌండ్స్కు నామినేట్ అవ్వలేకపోయింది. దీంతో మార్చి 15న ఆస్కార్ నుంచి అధికారికంగా తప్పకుంది. ఇదిలా ఉండగా 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 2021 ఏప్రిల్ 25న జరగనుంది. కాగా ఉత్తమ చిత్రం విభాగంలో భారత్ నుంచి ఎంపికైన చిత్రాల్లో సూరారై పోట్రు ఒక్కటే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్తోపాటు ఇతర పలు విభాగాల్లో ఎంపికైంది. తమిళ సినిమాకు ఇంతటి అరుదైన ఘనత లభించడంతో ఆనందంలో మునిగిపోయిన అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. చదవండి: హీరో సూర్య కొత్త ప్రయాణం బర్త్డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా -
ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అద్భుత ఘనత లభించింది. మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి ఎంటర్ అయ్యింది. 93వ ఆస్కార్ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ట్విటర్లో పేర్కొంది. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ అవకాడమీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మార్చి 5 నుంచి 10 వరకు ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. తుది జాబితాలోని విజేత చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు. అయితే ఆ మధ్యనే సూరారై పొట్రు ఆస్కార్ అవార్డు బరిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్తో కేటగిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురాగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. We are elated and thrilled!!! #SooraraiPottru joins OSCARS!!!https://t.co/JEDGgDWdZ9#SooraraiPottru🔥@Suriya_offl #SudhaKongara @rajsekarpandian @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @deepakbhojraj @thanga18 @guneetm — 2D Entertainment (@2D_ENTPVTLTD) February 26, 2021 ఇదిలా ఉంటే ఆస్కార్ నామినేషన్కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సూర్య 40గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల సూర్య కోవిడ్ నుంచి కోలుకోగా త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానున్నాడు. చదవండి: చెక్’ మూవీ రివ్యూ అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్! -
మూవీ మాఫియా ఇళ్లల్లో దాక్కుంది
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఆస్కార్ అవార్డ్ను దున్నుతుందా?
పోటీ మొదలయింది. ఆస్కార్ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు మంచి పేరు లభించింది. 2019, అక్టోబర్ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్ తీసుకురావాలని అందరం చీర్ చేద్దాం. హిప్ హిప్ బర్రె! ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేందుకు పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్ మెహతా ‘చాలెంజ్’, ‘ది డిసైపుల్’, ‘మూతాన్’, ‘కామ్యాబ్’, ‘షికారా’, ‘బిట్టర్ స్వీట్’ వంటి సినిమాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్ ద్వారా దున్న బొమ్మలను తయారు చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్ డైరెక్టర్ గోకుల్ దాస్. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట. -
ఆస్కార్ బరిలోకి ‘జల్లికట్టు’
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జల్లికట్టు కథేంటి లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి ఉరందరికి బీఫ్ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ. -
ఆస్కార్... కొత్త రూల్స్
96వ ఆస్కార్ అవార్డు నుంచి ఉత్తమ చిత్రానికి సంబంధించిన ఎంపిక విధానం, అందులోని పలు రూల్స్ను మారుస్తున్నట్టు ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్. 2024లో 96వ ఆస్కార్ వేడుక జరగనుంది. అప్పటినుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. అకాడమీ ఏర్పాటు చేసిన కొత్త నియమ, నిబంధనలు పాటించిన చిత్రాలను మాత్రమే ఉత్తమ చిత్రానికి ఎంపిక చేయాలనుకుంటోంది కమిటీ. ఇక నిబంధనల విషయానికి వస్తే...ఆస్కార్కు ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వాలంటే... ఓ సినిమాలోని ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర తప్పకుండా భిన్న వర్గాలకు సంబంధించినది అయి ఉండాలి. కథలోని ఐడియా తక్కువ ప్రాతినిధ్యం వహించిన వర్గానికి సంబంధించింది అయి ఉండాలి. అంతే కాదు చిత్రబృందంలోనూ వివిధ వర్గాలకు సంబంధించినవాళ్లను భాగం చేయాలి. ఇలా పలు నియమాలు పెట్టింది ఆస్కార్. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే ఉత్తమ చిత్రం విభాగానికి సినిమా ఎంపికవుతుంది. అన్ని వర్గ, వర్ణ, లింగ బేధాలను సమానంగా ఉంచేందుకు, సినిమాల్లో భిన్నతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందట కమిటీ. ఈ నియామాలను కేవలం సినిమాలో మాత్రమే కాదు, సినిమా చేసే టీమ్, స్టూడియో అన్నింట్లోనూ పాటించాలని పేర్కొంది. -
ఆలియా..హృతిక్లకు అరుదైన గౌరవం
‘‘బంధువులు ఉన్నవారికి బాలీవుడ్లో రెడ్ కార్పెట్ దొరుకుతుంది’’ అని ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, నిరూపించుకున్న హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ, దర్శకుడు అభినవ్ కశ్యప్ వంటి వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తుందని దర్శఖ–నిర్మాత–రచయిత హన్సల్ మెహతా చేసిన ఓ ట్వీట్ చెబుతోంది. ‘నెపోటిస్టిక్ అకాడమీ’ అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే.. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ భారతీయ సినిమాకి సంబంధించిన కొందరు ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ప్రతి ఏడాదీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొందరు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తుంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్. ఈ ఏడాది మొత్తం 819 మందిని ఆహ్వానించింది. భారతీయ సినిమా నుంచి హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ ఆలియా భట్, డిజైనర్ నీతూ లుల్లా, దర్శకురాలు నందినీ శ్రీకెంట్, దర్శకురాలు నిషితా జైన్ తదితరులను ఆహ్వానించారు. బాలీవుడ్లో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే హృతిక్, ఆలియా వంటివాళ్లను ఆహ్వానించారని అర్థం వచ్చేట్లుగా హన్సల్ మెహతా ‘నెపోటిస్టిక్ అకాడమీ’ అని ట్వీట్ చేశారనే వార్తలు మొదలయ్యాయి. ‘‘నేను చేసిన ట్వీట్కి అర్థం తెలియకుండా నా ట్వీట్ గురించి మాట్లాడొద్దు’’ అని మరో ట్వీట్ చేశారు హన్సల్. తాను చేసిన ‘నెపోటిస్టిక్ అకాడమీ’ ట్వీట్కి మాత్రం ఆయన అర్థం చెప్పలేదు. -
ఆ అవార్డులు కూడా వాయిదా!
లాస్ఏంజల్స్: కరోనా మహహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన అన్ని అవార్డు కార్యక్రమాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులను మొదటిసారి వాయిదా వేయడంతో పాటు అకాడమీ అవార్డులను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ హాలీవుడ్ అవార్డుల కార్యక్రమం ‘గోల్డెన్ గ్లోబ్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆస్కార్ అవార్డులను వాయిదా వేసిన వారం తరువాత ఈ విషయాన్ని ప్రకటించారు. (కరోనా: తొలిసారి ఆస్కార్ వాయిదా) ‘టీనా ఫే, యామీ పోలర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 28, 2021 ఆదివారం నాడు నిర్వహించనున్నాం. అవార్డు రివైజ్డ్ నామినేషన్, ఓటింగ్ పిరియడ్, అర్హతలకు సంబంధించిన తేదీలను తరువాత ప్రకటిస్తాం’ అని అవార్డు సంస్థకు చెందిన ప్రతినిధులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం 93వ అకాడమీ అవార్డులు జరగాల్సిన రోజున 78 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం డిసెంబర్లో జరగనుండగా రెండు నెలలు వాయిదా పడి ఫిబ్రవరిలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఆస్కార్ అవార్డులకు సూచికలుగా చూస్తారు. (కరోనా: ఆస్కార్ కొత్త నియమాలు) -
కరోనా: తొలిసారి ఆస్కార్ వాయిదా
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం అనేది ప్రతి నటుడి కల. కనీసం అవార్డు రాకపోయినా ఆ కార్యక్రమానికి వెళ్లి వస్తే చాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి ఆస్కార్ పండగకు కరోనా సెగ తగిలింది. ఆస్కార్ చరిత్రలోనే తొలిసారిగా రెండు నెలలపాటు వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని అవార్డు కమిటీ ఇదివరకే నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచన విరమించుకోక తప్పలేదు. (మార్పులకు ఆస్కారం) కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అవార్డుల కమిటీ "ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్" పురస్కార వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడే చిత్రాల అర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అనంతరం మార్చి 15న నామినేషన్లు వెల్లడిస్తామని తెలిపింది. (వాయిదాకి ఆస్కారం) -
వాయిదాకి ఆస్కారం
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా పండగ ఆస్కార్ వచ్చే ఏడాది జరిగేలా లేదని టాక్ వినిపిస్తోంది. కరోనా ప్రభావం వల్లే ఈ వాయిదా అట. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదా మార్చి మొదటివారంలో ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని ఆల్రెడీ అవార్డు కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆస్కార్ అనుకున్న తేదీకి జరగకపోవచ్చని తెలుస్తోంది. ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్కి సినిమా నామినేట్ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయ్యుండాలి. కనీసం వారం రోజుల థియేట్రికల్ రన్ ఉంటేనే ఆ సినిమాను ఆస్కార్ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. అయితే థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్కి ఆస్కారం ఉందని ఆ మధ్య కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదట. కచ్చితంగా థియేటర్లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. దాంతో ఆస్కార్ అవార్డ్ వేడుక కొత్త తేదీకి మారడం ఖాయం అని హాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. -
ఆస్కార్ అవార్డులు వాయిదా!
సాక్షి, న్యూఢిల్లీ : 2021, ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు వాయిదా వేయాలనుకుంటున్నారు. ప్రాణాంతక కరోన వైరస్ మహమ్మారి కారణంగా చాలా సినిమాలు నిర్మాణ దశలోనే నిలిచిపోవడం, కొత్త సినిమాలు ఎక్కువగా విడుదలకు నోచుకోక పోవడంతో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకుంటున్నారు. (చదవండి : శుభశ్రీతో మాట్లాడిన మెగాస్టార్) భారతీయ కాలమానం ప్రకారం సాధారణంగా సమ్మర్లో బ్లాక్బస్టర్ కమర్శియల్ సినిమాలు విడుదలవుతాయి. ఆ తర్వాత అకాడమి అవార్డులను దృష్టిలో పెట్టుకొని నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేక సినిమాలు విడుదలవుతాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమాలు విడుదల కావాలంటే ఇప్పటికే సినిమా షూటింగ్లు ప్రారంభం కావాలి. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదుపేస్తున్న నేపథ్యంలో అలా జరగలేదు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన బ్లాక్బస్టర్ జేమ్స్ బాండ్ చిత్రమే నవంబర్ నెలకు వాయిదా పడింది. ఎక్కువ సినిమాల నామినేషన్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదనపై నిర్వాహకులు గత వారం, పది రోజులుగా చర్చలు జరపుతున్నారు. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_741246272.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మార్పులకు ఆస్కారం
కోవిడ్–19 (కరోనా వైరస్) ప్రభావం వల్ల రానున్న 93వ ఆస్కార్ నియమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆ మార్పులు 93వ ఆస్కార్ వేడుక వరకే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాల రిలీజులు ఆగిన విషయం తెలిసిందే. ఇందువల్ల కొన్ని సినిమాలు డైరెక్ట్గా అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో విడుదలయ్యాయి. ఇలా విడుదలైన వాటిలో ప్రేక్షకులు అమితంగా మెచ్చిన సినిమాలు ఉండొచ్చని, ఆయా చిత్రబృందాల కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్’ ఆస్కార్ అవార్డుల నియమాల్లో మార్పులు చేసింది. దీంతో డైరెక్ట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ అండ్ వీఓడీ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదలైన సినిమాలు కూడా ఈసారి ఆస్కార్ అవార్డ్స్ పోటీ బరిలో ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ సినిమాలు కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ను ప్లాన్ చేసుకుని ఉండాలనే షరతు పెట్టారు. అలాగే సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డు విభాగం కింద పరిగణించనున్నట్లు ఆస్కార్ అవార్డ్ కమిటీ వెల్లడించింది. ‘‘సినిమాను థియేటర్లో చూడడాన్ని మించిన అనుభూతి లేదు. కానీ కోవిడ్ 19 వైరస్ వల్ల ఆస్కార్ అవార్డు అర్హత నియమాల్లో తాత్కాలిక మార్పులు చేయక తప్పలేదు. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే పాత రూల్సే వర్తిసాయి’’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 93వ ఆస్కార్ వేడుక 2021 ఫిబ్రవరి 28న జరగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డుగా పరిగణించాలనే నిర్ణయం పట్ల భారతీయ సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, సౌండ్ మిక్సర్ రసూల్ పూకుట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అకాడమీ పునఃసమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు రసూల్. 2008లో వచ్చిన ‘స్లమ్డాగ్ మిలియనీర్’ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్, రిచర్డ్లతో కలిసి రసూల్ ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. -
‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..!
పారసైట్.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రస్తుతం ఈ కొరియన్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం.. తొలిసారి ఓ కొరియన్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవడం. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో కూడా పురస్కారం అందుకున్న చరిత్ర లేకపోగా.. ఈ చిత్రం ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్విభాగాల్లో కూడా అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు. అయితే ఆస్కార్లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘మిన్సార కన్నా’కు, 'పారసైట్ ' కు చాలా సారూప్యతలు ఉన్నాయని .. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది .. ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్నా’తెరకెక్కింది. పారసైట్ కథను మిన్సార కన్నా నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ‘పారసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. ‘పారసైట్’ స్టోరీ ఏంటంటే.. ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. @khushsundar Today parasite movie got 4 oscar awards but after watching the movie I came to know the plot of the story which was taken from Minsara kanna. In minsara kanna all the family was employed for love help& the same here parasite all the family were employed for survival. — rajeshkannan (@rajesh7) February 10, 2020 So many thoughts running the head.. just finished watching #Parasite..Got me thinking about another movie I saw few months back - #Shoplifters... Both very good movies, similar yet different.. #aarootales — Aarti 🐾 (@talesfromaaroo) February 9, 2020 Watched korean movie #parasite lately & realized that the movie is inspired by @actorvijay 's tamil movie #minsarakanna directed by k.s.ravikumar.Parasite is a worldwide hit,but we made such films long back.#legendksravikumar#parasiteisminsarakanna#ThalapathyVijay#Thalapathy — Andrew Rajkumar (@iamrajdrew) February 5, 2020 -
ఆస్కార్ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు