Panchayat
-
ఆన్లైన్ గేమింగ్కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు
కలహండి: ఆన్లైన్ గేమింగ్ మోసాలు(Online gaming scams) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కోట్లాది రూపాయలు మోసగాళ్ల పాలవుతోంది. తాజాగా ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ కోసం రూ.మూడు కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన నేపధ్యంలో ఒక పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (పీఈఓ)ని ఇటీవలే కార్యాలయం నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు అతనిని రాష్ట్ర విజిలెన్స్ విభాగం(State Vigilance Department) అరెస్టు చేసింది. ఈ సంఘటన గురించి ఒక అధికారి మీడియాకు వివరాలు తెలిపారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారి దేబానంద సాగర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇందుకోసం ఆయన వివిధ పంచాయతీల సర్పంచ్ల సంతకాలను ఫోర్జరీ చేశాడని కూడా తేలిందని తెలిపారు.కలహండి జిల్లాలోని తుమల్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని తలనేగి గ్రామ పంచాయతీ, పొడపాదర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రూ.3.26 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు దేబానంద సాగర్పై ఆరోపణలు ఉన్నాయన్నారు. సాగర్ ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు పంపాడని ఆయన తెలిపారు. దేబానంద సాగర్ తల్నేగి గ్రామ పంచాయతీ నుండి రూ.1.71 కోట్లు, పొడపదర్ గ్రామ పంచాయతీ నుండి రూ.1.55 కోట్లు దుర్వినియోగం చేశాడు. సర్పంచ్ల సంతకాలను ఫోర్జరీ(Forgery) చేయడం ద్వారా అతను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్)ను దుర్వినియోగం చేశాడు.ఇంతేకాకుండా దేబానంద సాగర్ 15వ కేంద్ర ఆర్థిక సంఘం (సీఎఫ్సీ), 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం ఖాతాల నుండి ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. నిందితుడు దేబానంద్ సాగర్ 2016, జూలై 4, తలనేగి గ్రామ పంచాయతీలో పీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. 2018, మే 5 నుండి 2022, మార్చి 17 వరకు అతను పొడపదర్ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఈ సమయంలోనే అతను ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు.ఇది కూడా చదవండి: మామ అభ్యంతరకరంగా తాకాడని.. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది? తనదీ అదే పరిస్థితి అంటున్నాడు పంచాయత్ నటుడు దుర్గేశ్ కుమార్ (Durgesh Kumar). పంచాయ్ సిరీస్, లాపతా లేడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి అవకాశాలు రావడం లేదట! తాజాగా దుర్గేశ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను. ఆడిషన్స్కు కూడా పిలవట్లేదుకష్టాలు నాకు చుట్టాలు కాదు, ఇంటిమనుషులైపోయాయి. అందరూ పంచాయత్ సిరీస్ (Panchayat Web Series)తో నేను సక్సెస్ అయ్యాననే చూస్తున్నారు. కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు. ఆడిషన్కు రమ్మని ఎవరూ పిలవలేదు. నా టాలెంట్ గుర్తించిన చిన్న నిర్మాతలతోనే నేను ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడిషన్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాను.పాపులారిటీ ఫుల్.. అవకాశాలు నిల్హైవే, పంచాయత్ ప్రాజెక్టులతో నన్ను నేను నిరూపించుకున్నాక కూడా ఎవరూ పెద్దపాత్రలు ఇవ్వడం లేదు. అందరికీ నేను తెలుసు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. నా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. ఇంకో విషయమేంటంటే.. నేను నటించిన సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయి. పలువురు సినీవిశ్లేషకులు ఆయా సినిమాలను మెచ్చుకుంటున్నారు కానీ అందులో ఎక్కడా నా పేరు ప్రస్తావించడం లేదు. పంచాయత్తో ట్రెండింగ్లో..నాకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడూ రాదు. కనీసం ప్రేక్షకులైనా నా పనిని గుర్తించినందుకు గర్విస్తున్నాను అన్నాడు. సరైన పని దొరక్కపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్గేశ్.. హైవే, సుల్తాన్, సంజు, ధడక్, భక్షక్ వంటి చిత్రాల్లో నటించాడు. పంచాయత్ సిరీస్ నటుడిగా అతడికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.చదవండి: రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్! -
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
సాక్షి, చిత్తూరు: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ(ACB) అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లంచావతారమెత్తిన అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్ల కోసం భారీగా డిమాండ్ తలెత్తింది. అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లించినట్టు అప్పట్లో దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏపనికి వెళ్లినా మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! ‘చంద్రగిరి(Chandragiri) పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వర య్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ దినేష్ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు చంద్రగిరి మేజర్ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
వెండర్ విధానంపై మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన AP పంచాయితీ రాజ్
-
లేడీ లవ్తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం
తాపీ: గుజరాత్లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! -
పంజాబ్: కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికలు
చండీగఢ్: పంజాబ్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్సర్కు తరలించారు.గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు -
పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి ఆదేశాలైనా ఇస్తారనడానికి ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రాష్ట్రంలోని ముంగేలీ జిల్లాలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి, బీజేపీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి పున్నులాల్ మోహ్లేతో పా టు కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్లకు పావురాలు అందజేశారు. ఎమ్మె ల్యే, కలెక్టర్ వదిలిన పావురాలు రివ్వుమంటూ ఎగిరిపోయాయి. ఎస్పీ విడిచిపెట్టింది మాత్రం నేలపై పడిపోయిందట! సదరు వీడియోను సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘‘ఛత్తీస్గడ్లో పంచాయత్–3 (వెబ్ సిరీస్) రిపీటైంది. పంద్రాగస్టు సందర్భంగా ఎస్పీ ఎగరేసిన పావు రం కింద పడిపోయింది. వీడియో చూడండి’’ అని రాసుకొచ్చారు. దాంతో తన పరువు పో యిందని భావించిన పోలీస్ బాసు, సంబంధి త అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు ఏకంగా లేఖ రాశారు! ‘‘పావురం అనారోగ్యంతో ఉండటమే దీనికి కారణం. అది ఎగరకుండా కింద పడిపోయిన వైనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలై జిల్లా యంత్రాంగం పరువు తీసింది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చారట. 'Panchayat' Pigeon scene comes alive in ChhattisgarhThe video of the pigeon, which was released by Superintendent of Police (SP) Girija Shankar Jaiswal, went viral after it showed the bird falling to the ground instead of flying away. The event, meant to symbolize freedom and… pic.twitter.com/sc1lRJvtRO— The NewsWale (@TheNewswale) August 21, 2024 -
ముంబైలో కొత్తిల్లు కొన్న 'పంచాయత్' నటుడు
బాలీవుడ్ నటుడు దుర్గేశ్ కుమార్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలో ఇదే ఆయన కొనుగోలు చేసిన తొలి నివాసం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ముంబైలో మా కొత్తిల్లు.. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. తన ఇంటి తాళాల ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్న ఈయన ఎట్టకేలకు ముంబైలో తనకంటూ ఇల్లు కొనుగోలు చేయడంతో అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇల్లు తీసుకున్నావ్.. మమ్మల్ని పిలవనేలేదు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా దుర్గేశ్ కుమార్.. 2014లో వచ్చిన హైవే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. సుల్తాన్, ద డ్రీమ్ జాబ్, సంజు, ధడక్, బొంబైరియా, భక్షక్, లాపతా లేడీస్ వంటి చిత్రాలతో అలరించాడు. పంచాయత్ వెబ్ సిరీస్లో భూషణ్ పాత్ర ద్వారా ఓటీటీ ప్రియులను మెప్పించాడు. View this post on Instagram A post shared by Durgesh Kumar (@durgesh.kumar.81) చదవండి: భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ చిక్కులు -
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్ -
మైకేల్ జాక్సన్ తీన్మార్
హిందీ ఫోక్ సాంగ్కు మైకేల్ జాక్సన్ ఆయన స్టైల్లోనే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కాదు... అసలు ఎలా వీలవుతుంది?! అంటారా. సాంకేతిక మాయాబజార్లో ఏదైనా సాధ్యమే. కామెడి డ్రామా స్ట్రీమింగ్ టీవీ సిరీస్ ‘పంచాయత్’కు సంబంధించి మీమ్స్, వైరల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వీడియో. ఈ ఫ్యాన్–మేడ్ వీడియో 8 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో ‘ఏ రాజాజీ రాజాజీ’ అనే పాటకు మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజంగా ఉండడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం అయింది. -
Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
కామన్ ఫీచర్స్.. ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్తో ఆన్స్క్రీన్ గ్రామర్ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.అక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్గా ఎంపికైంది.మోడలింగ్తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్ని ‘శాన్వికా’గా మార్చుకుంది.‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్తో స్పెషల్ ఫ్యాన్ బేస్నే ఏర్పరచుకుంది.‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్లో తన మార్క్ చూపిస్తుంటుంది."పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికాఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!? -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు తట్టుకోవాలి. ఈ క్రమంలోనే మనసుకు నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. 'పంచాయత్' వెబ్ సిరీస్తో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్న దుర్గేశ్ కుమార్ది కూడా ఇలాంటి కథే. నటుడిగా నిలదొక్కుకునే క్రమంలోనే అడల్ట్ ఫిల్మ్స్లోనూ నటించానని ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు.(ఇదీ చదవండి: తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్)బిహార్కి చెందిన దుర్గేశ్ కుమార్.. 2001లో ఇంజినీరింగ్ చేయడం కోసం దిల్లీ వెళ్లాడు. కానీ ఎగ్జామ్ కష్టంగా ఉండేసరికి.. నటనవైపు షిఫ్ట్ అయ్యాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. 'నేషనల్ డ్రామా స్కూల్'లో యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత 'హైవే' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'సుల్తాన్', 'ఫ్రీకీ అలీ' లాంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇబ్బందులు తప్పలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ మూవీస్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా చెప్పుకొచ్చాడు.'యాక్టింగ్ చేయకపోతే నేను బతకలేదు. దీంతో నాకొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోయాను. అలానే కొన్ని అడల్ట్ మూవీస్లోనూ చేయాల్సి వచ్చింది. 2016లో నేను ముంబయికి వచ్చాను. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. ఇదంతా కూడా 'హైవే', 'ఫ్రీకీ అలీ', 'సుల్తాన్' లాంటి సినిమాల్లో నేను నటించిన తర్వాతే జరిగింది. కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్కి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. అలా పంచాయత్ మొదటి సీజన్లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీని షూట్ చేశారు' అని దుర్గేశ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్
మరో వారం వచ్చేసింది. చాలారోజులుగా డల్గా ఉన్న థియేటర్లలోకి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై మంచి బజ్ ఉంది. 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' మూవీస్ కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఏవి హిట్ అవుతాయనే సంగతి పక్కనబెడితే ఓటీటీలో కూడా 19 వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేం లేవు. 'పంచాయత్' అనే హిందీ సిరీస్, 'వీర్ సావర్కర్' అనే హిందీ మూవీ మాత్రమే ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరికొన్ని హిందీ చిత్రాలు-సిరీసులు ఉన్నాయి గానీ రిలీజైతే గానీ వాటి టాక్ చెప్పలేం. అలానే ఈ వీకెండ్లో తెలుగు మూవీస్ ఏమైనా సడన్గా స్ట్రీమింగ్కి వస్తాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసా?ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మూవీస్ జాబితా (మే 27 - జూన్ 02 వరకు)అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28హాట్స్టార్కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31నెట్ఫ్లిక్స్ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31లంబర్జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01జియో సినిమాఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లేపొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్న్యూస్ వినిపించారు. ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందా..? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.అభిషేక్ త్రిపాఠి అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటాడు. అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం రాదు. కానీ, కొన్ని కారణాల వల్ల స్నేహితుల సలహా మేరకు పంచాయతీ సెక్రటరీలో ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ రత్యా ఉత్తర ప్రదేశ్లోని ఫులేరా అనే గ్రామంలో అభిషేక్ అడుగుపెడుతాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన గ్రామస్తుల మధ్య ఆయనకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ క్రమంలో దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp— prime video IN (@PrimeVideoIN) May 2, 2024 -
నేను బతికే ఉన్నాను.. రూమర్స్పై యువనటి క్లారిటీ
ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ఘటనలో దాదాపు 10 మంది దుర్మరణం చెందారు. ఇందులో ప్రముఖ నటి అంచల్ తివారీ కూడా ఉంది. మంగవారం అంతా కూడా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో చాలామంది నటి అంచల్కి నివాళులు అర్పించారు. పాపం చిన్న వయసులోనే చనిపోయిందని బాధపడ్డారు. కానీ ఈమె చనిపోలేదని, చిన్న పొరపాటు వల్ల మరణ వార్తలు వైరల్ అయ్యాయని అంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) మధ్యప్రదేశ్కి చెందిన అంచల్ తివారీ.. నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్లో వచ్చిన 'పంచాయత్' అనే వెబ్ సిరీస్లో ఓ పాత్రలో నటించి కాస్తంత పేరు తెచ్చుకుంది. సరే ఈ విషయం పక్కనబెడితే తాజాగా బిహార్లోని కైమూర్ జిల్లాలో ఆదివారం ఓ రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇందులో పదిమంది వరకు చనిపోయారు. అయితే ఇందులో ఓ భోజ్పురి నటి ఉందనే తెగ మాట్లాడుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో అంచల్ తివారీ అనే అమ్మాయి ఉన్న మాట వాస్తవమే కానీ ఆమె, నటి అంచల్ తివారీ వేర్వేరు అనే విషయం తేలింది. నటి అంచల్ స్వయంగా తన ఇన్ స్టాలో 'నేను బతికే ఉన్నాను' అని అర్థమొచ్చేలా ఉన్న ఓ పోస్ట్ పెట్టడంతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఇంతలా పొరపాటు జరిగిందనమాట. (ఇదీ చదవండి:కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్) -
అరవయ్యా.. ఇరవయ్యా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. క్షేత్రస్థాయిలో జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగదీత వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు. అలాగే, పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటుండగా టీడీపీ అతితక్కువగా అంటే 20కి అటూఇటుగా సరిపుచ్చాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్కు స్పష్టంగా తెలుసునని.. అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పవన్ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్ధమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అసలు జనసేనకు కేటాయించే సీట్లు అరవయ్యా.. ఇరవయ్యా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు పోటీగా పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని.. అదేదో చంద్రబాబుకు కౌంటర్గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చుకున్నారని.. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ తీరుతో నిస్తేజంలో నేతలు అలాగే, పొత్తుల డ్రామాలో తాము పూర్తిగా టీడీపీ ట్రాప్లో పడిపోయామని జనసేన శ్రేణులు అంటున్నారు. కీలక ఎన్నికల సమయంలో పార్టీలో ఎలాంటి హడావుడి లేకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తోందో అందరికీ తెలిసిందేనని.. పవన్ తీరుతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులందరూ పూర్తి నిస్తేజంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడానికి అవకాశం వస్తుందో తెలీక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉండే కొద్దిమంది అభిమానులు పూర్తి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. పవన్ ఉద్దేశపూర్వకంగానే సీట్ల కేటాయింపును తేల్చకుండా పార్టీలో నిస్తేజపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని.. తద్వారా రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగాలేదని సాకులు చెప్పి కేవలం అరకొర సీట్లను తీసుకోవాలన్నది పవన్ ఎత్తుగడ కావొచ్చని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. నిజానికి.. ప్రస్తుత పరిస్థితుల కంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు జనసేన చాలా క్రియాశీలకంగా పనిచేసిందని, ఇప్పటికంటే అప్పుడే పవన్ ఎక్కువగా ప్రజల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. జనసేన నేతల మండిపాటు ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ పవన్ను తమ ఎన్నికల కార్యక్రమాలకు పూర్తిగా ఉపయోగించుకుంటోందని.. ఇందుకు తమ అధినేత కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా చంద్రబాబు చెప్పింది చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇందుకు వారు పలు సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. మొన్న డిసెంబరులో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పవన్ స్వయంగా పాల్గొన్నారని.. అలాగే, చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామం మందడంలో సంకాంత్రి వేడుకల్లో పాల్గొన్నారని.. అంతేకాక, జనవరి 9న ఇద్దరూ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి భేటీ అయ్యారని వారు గుర్తుచేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ నిర్వహిస్తున్న ‘రా.. కదిలిరా’ సభల్లో పవన్ ఫొటోలను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నా పవన్ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ ప్రజల్లోకి వచ్చి 4 నెలలు ఇక జనసేన పోటీచేసే సీట్లు ఇప్పటికీ తేలకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సైతం సహకరించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో పవన్కళ్యాణ్ జిల్లా పర్యటనలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. గత ఏడాది అక్టోబరు రెండో వారంలో ఆఖరిసారిగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్నారు. అలాగే, డిసెంబరు చివర్లో పవన్ కాకినాడ ప్రాంతంలో పర్యటించినా, ఆ పర్యటన కేవలం పార్టీ నేతల సమావేశాలకే పరిమితమయ్యారు. మరోవైపు.. జనవరి నెలాఖరు నుంచి పవన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని కూడా ఆ పార్టీ 20 రోజుల క్రితం ప్రకటించింది. అయితే, ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా పవన్ పర్యటనలపై పార్టీలోనే స్పష్టతలేదు. ఇదంతా దేనికి సంకేతమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం
నిడమనూరు: నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం దుండగులు ధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022సంవత్సరంలో విడుదల చేసిన రూ.20లక్షల నిధులతో గ్రామంలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం బుధవారంతో ముగియనుండడంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని సర్పంచ్ వంకా బ్రహ్మన్న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పూర్తి కాని పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భవనం ప్రారంభోత్సవం చేసేందుకు సర్పంచ్ వచ్చే సరికి శిలాఫలకం ధ్వంసమై ఉంది. దీంతో సర్పంచ్ వంకా బ్రహ్మన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు నిధులు విడుదల చేశామని, కాంగ్రెస్ వారు ఓర్చుకోలేకనే ఇలా శిలాఫలకాన్ని ధ్వంసం చేసారని ఆరోపించారు. శిలాఫలకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వేములపల్లి వెంకట్రావు, మద్దిపూడి రాంబాబు, కుంబం విజయ్, కంచి శ్రీను ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సర్పంచ్ బ్రహ్మన్న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని డిగితే దూషించారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు వేములపల్లి వెంకట్రావు సర్పంచ్తో పాటు వంకా బ్రహ్మన్న, సత్యనారాయణ, నక్క సైదులు, కృష్ణమూర్తిపై మరో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. – వంకా బ్రహ్మన్న, సర్పంచ్, పార్వతీపురం సమాచారం లేదు పార్వతీపురం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురించి అధికారికంగా సమాచారం లేదు. భవనం పూర్తి అయిన తర్వాత ప్రాంరంభిస్తాం. భవనం పూర్తయినట్లు కూడా సమాచారం అందలేదు. – ప్రమోద్కుమార్, ఎంపీడీఓ, నిడమనూరు -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్
సంక్రాంతి హడావుడి అయిపోయింది. మళ్లీ స్కూల్స్, ఆఫీస్లు షరా మాములే! పండక్కి రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' ఇప్పటికీ దుమ్ముదులుపుతుండగా.. మిగతా వాడి సందడి మాత్రం తగ్గిపోయింది. ఈ వారం 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' లాంటి డబ్బింగ్ మూవీస్తో పాటు 'ఫైటర్' అనే హిందీ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం ఏకంగా 27 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'నెరు' అనే డబ్బింగ్ మూవీ ఆసక్తి కలిగిస్తోంది. మలయాళంలో హిట్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా కోసం మూవీ లవర్స్ వెయిటింగ్. దీనితో పాటు 'ఫైట్ క్లబ్', 'సామ్ బహుదూర్' సినిమాలు.. అలానే 'పంచాయత్ సీజన్ 3' కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 22-జనవరి 28 వరకు) నెట్ఫ్లిక్స్ నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22 జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23 లవ్ డెడ్లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23 గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25 మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26 క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28 అమెజాన్ ప్రైమ్ కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి 23 కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25 హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24 ఎక్స్పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26 హాట్స్టార్ నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23 ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26 కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26 ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27 జీ5 సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26 సోనీ లివ్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 22 బుక్ మై షో వోంకా (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22 ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 23 ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 23 జియో సినిమా మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22 ఆపిల్ ప్లస్ టీవీ మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
-
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్రెడ్డి, ఇ. శ్రీనివాస్లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
ఆడపిల్ల పుట్టిందని..
జమ్మికుంట: ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టడమే శాపమైంది. బిడ్డతో కాపురానికి వచ్చిన ఆమెకు మెట్టినింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లోకి రానీయకుండా అత్తమామలు అడ్డుకున్నారు. కాపురానికి రావద్దని భర్త తెగేసి చెప్పాడు. ఆ ఇల్లాలు 100కు కాల్ చేయగా.. పోలీసులు వచ్చి.. గొడవలు వద్దని, పంచాయితీ చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తికి బండ ప్రభాకర్, పుష్పలత దంపతుల కూతురు బండ స్పందనను ఐదేళ్ల క్రితం మాచనపల్లికి చెందిన గాండ్ల శంకర్, అరుణ దంపతుల కుమారుడు కిరణ్కిచ్చి వివాహం చేశారు. రూ.4 లక్షల కట్నం, ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం వరంగల్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 11 నెలల క్రితం స్పందన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని కిరణ్ కనీసం చూసేందుకూ రాలేదు. పైగా కాపురానికి నిరాకరిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం స్పందన తండ్రి చనిపోవడంతో ఆమెకు పెద్ద దిక్కులేకుండా పోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా కిరణ్ మనసు మారలేదు. బంధువుల సహకారంతో స్పందన ఆదివారం మాచనపల్లికి చేరుకుంది. దీంతో అత్తమామ, భర్త, ఆడబిడ్డ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని గెంటేశారు. దీంతో బాధితురాలి బంధువులు 100 కాల్ చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు రెండురోజుల్లో పంచాయితీ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. స్పందన పుట్టెడు దుఃఖంతో మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. -
ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం
సత్తెనపల్లి: ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ ఇదీ.. జాతిపిత మహాత్మాగాంధీ మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. గ్రామం పంచాయతీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ పాలనలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 9 అంశాల్లో అక్టోబరు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. 9 అంశాలివే.. పేదరిక నిర్మూలనకు మెరుగైన జీవనోపాధి ఆరోగ్యవంతమైన గ్రామం పిల్లల స్నేహపూర్వక పంచాయతీ తాగునీటి లభ్యత హరిత, స్వచ్ఛ గ్రామం స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు సామాజిక భద్రత, సుపరిపాలన మహిళా స్నేహపూర్వక పంచాయతీ ప్రత్యేక పోర్టల్ ఈ అంశాల్లో చేపట్టిన అభివృద్ధి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం పంచాయతీవార్డ్.జీవోవీ.ఇన్ పోర్టల్ అందుబాటులో ఉంచారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా పనులను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు, కేస్ స్టడీస్తో దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేస్తారు. అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూపించే ఆదర్శ పంచాయతీలకు ఇది సదవకాశం. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో జిల్లాలోని చాలా గ్రామాలు ప్రగతిని చూపుతున్నాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంచి అవకాశం జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునేందుకు ఇది మంచి అవకాశం. చేపట్టిన అభివృద్ధి తదితర వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎంపికైతే పురస్కారం ద్వారా లభించే నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. – జీవీ సత్యనారాయణ, ఎంపీడీవో, సత్తెనపల్లి -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
నా ఫ్రెండ్ను చదివించండి
కౌడిపల్లి(నర్సాపూర్): తాను చదువుకుం టోంది... తన స్నేహితురాలు మాత్రం చదువు మాని ఇంటివద్దే ఉంటోంది. అది ఆమెను బాధించింది. అందుకే ‘నా ఫ్రెండ్ను చదివించండి’ అంటూ పాఠశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంది. మెదక్ జిల్లా మహ్మద్ నగర్గేట్ తండాకు చెందిన సంధ్య, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన ఆమె ఫ్రెండ్ నందిని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఇటీవలే ఆమె స్కూల్ మానేసి ఇంటివద్దే ఉంటోంది. స్నేహితురాలు పాఠశాలకు రాకపోవ డం సంధ్యను బాధపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెండ్లీ పంచాయత్, లింగ వివక్ష’ అవగాహన సదస్సులో విద్యార్థులు పలు సమస్యలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య ‘నా ఫ్రెండ్ నాకంటే బాగా చదువుతుంది. కానీ తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. నా ఫ్రెండ్ను చదివించండి’ అంటూ కోరింది. బాలిక అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, అధికారులు.. నందినిని తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు. -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్తో, ఉప సర్పంచ్తో, అసిస్టెంట్తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్ను, ఉపసర్పంచ్ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్లో చివరి ఎపిసోడ్ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి
మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం) ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లైంది.. మాటిచ్చి మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వం
ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. గత సర్పంచ్ ఎన్నికల్లో రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. కట్ చేస్తే ప్రభుత్వ మాటలు, హామీలు ఒట్టి మాటలేనని ఆయా గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. మూడేళ్లయినా రూ.10లక్షల నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వం ‘ఒట్టి మాటలు కట్టిపెట్టి పంచాయతీలకు తోడు పడాలి’అని పాలకవర్గాలు కోరుతున్నారు. సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్): జిల్లాలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మూడేళ్లవుతోంది. నజరానా నిధులు కోసం పాలకవర్గాలు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిధుల కొరతతో ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది. (చదవండి: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) 61 పంచాయతీల్లో 9 ఏకగ్రీవం.. ► జిల్లాలో 61 పంచాయతీలు ఉన్నాయి. అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మంత్రులు తలో మాట అంటుండటంతో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు వస్తాయో రావోనని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు.. ► ఘట్కేసర్ మండలంలో మాదారం, శామీర్పేట్ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి మండలంలో మూడుచింతలపల్లి, కీసర మండలంలో నర్సంపల్లి, మేడ్చల్ మండలంలో డబీల్పూర్, లింగాపూర్, రాజబొల్లారం తండా, రాయిలాపూర్ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అభివృద్ధి చేయొచ్చని ఏకగ్రీవం.. ► అనుబంధ గ్రామాలుగా ఉన్న సమయంలో అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని.. ఒక మాటగా నిలచి ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే నిధులుతో గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చని భావించారు. పాలకవర్గాల ఆశలు ఆవిరి.. ► ఏకగ్రీవమైన చాలా పంచాయతీలు అనుబంధ గ్రామాలుగా ఉండి నూతనంగా ఏర్పడినవే. చిన్న పంచాయతీలు కావడం.. ఓటర్లు తక్కువగా ఉండడంతో గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనపెట్టి సమష్టి నిర్ణయంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏకగ్రీవ నిధులు ఇస్తామన్న సర్కారు మాట తప్పడంతో పాలకవర్గాల ఆశలు ఆవిరయ్యాయనే చెప్పాలి. ఆదాయ మార్గాలు లేక అభివృద్ధికి దూరం.. ► జనాభా ఆధారంగా ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కేటాయింపుతో ప్రయోజనం కలగడం లేదు. ప్రస్తుతం వస్తున్న నిధుల నుంచి ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్, డీజిల్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర బిల్లులను ఏకగ్రీవ పంచాయతీలు చెల్లించకలేపోతున్నాయి. ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. అభివృద్ధికి సహకరించాలి... ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నజరానా ఇవ్వాలి. చిన్న గ్రామం కావడంతో అభివృద్ది పనులు చేపట్టలేకపోతున్నాం. హామీని నిలబెట్టుకొని అభివృద్ధికి సహకరించాలి. – యాదగిరి, మాదారం సర్పంచ్, ఘట్కేసర్ మండలం ప్రభుత్వ పెద్దలవి తలో మాట.. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10లక్షలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హామీలిచ్చి అమలు చేయకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉంది. హామీపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలో మాట మాట్లాడటంసిగ్గుచేటు. – ప్రవీణ్రావు, ఘట్కేసర్ మండల బీజేపీ అధ్యక్షుడు -
18 నెలలుగా వేతనం లేదు.. ఇప్పించండి సార్
భవనేశ్వర్: జిల్లాలోని కలిమెల పంచాయతీ ఈఓగా పని చేస్తున్న తనకు గత 18 నెలలుగా వేతనం అందడం లేదని మధు హంతాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సమితి కార్యాలయం ముందు బైఠాయించారు. గిరిజనుడినైన తన ఎల్పీసీని అధికారులు కలిమెల సమితికి పంపక పోవడంతో జీతం నిలిచి పోయిందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్ని వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, గత ఏడాదిన్నరగా అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువులు సైతం భారంగా మారిందన్నారు. తన తండ్రిని మావోయిస్టులు నాలుగేళ్ల క్రితం హత్య చేశారని, అధికారులు స్పందించకపోతే కుటంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు. -
ఐదు చెప్పు దెబ్బలు.. అత్యాచార నేరం మాఫీ!!
మైనర్ అత్యాచార ఘటనలో పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిందితుడు బాధితురాలి చేతిలో ఐదు చెప్పు దెబ్బలు తినాలని తిక్క తీర్పు ఇచ్చారు ఉత్తర ప్రదేశ్లోని ఓ గ్రామ పెద్దలు. వివరాల్లోకి వెళ్తే... లక్నో: ఉత్తర ప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ స్టేషన్లోని ఓ కుగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మైనర్ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ పంచాయితీని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అయితే పెద్దలు మాత్రం దాష్టీకమైన తీర్పు ఇచ్చారు. బాధితురాలి చెప్పుతో నిందితుడిని ఐదుసార్లు కొట్టాలని, యాభై వేల పరిహారం తీసుకుని ఘటన మరిచిపోమ్మని బాలిక తల్లిదండ్రులకు సర్దిచెప్పబోయారు. అయితే ఆ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. న్యాయం కోసం పట్టుబట్టారు. దీంతో పెద్దలు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక కోతిభార్ స్టేషన్లో ఘటనపై.. పంచాయితీ పెద్దల తీరుపై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. మరోవైపు సోషల్ మీడియాలో పంచాయితీ తీర్పు వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అనంతరం.. కేసు దిశగా అడుగు వేస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్ గుప్తా వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. చదవండి: దీదీకి ఝలక్.. ఐదు వేల ఫైన్! -
కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్ హాసన్
చెన్నై: కులం పేరుతో అవమానించిన వ్యవహారం విల్లుపురంలో సంచలనం కలిగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందల్ గ్రామంలో రెండు కులాలకు చెందిన నివాసప్రాంతాలున్నాయి. శుక్రవారం ఒక కులం ప్రజలు ఉంటున్న ప్రాంత ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. కరోనా లాక్డౌన్ను మీరి ఉత్సవాలకు ఏర్పాటు చేయడంతో మరో వర్గానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరువెన్నైనల్లూరు పోలీసులు ఆలయం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమకు సమాచారం తెలిపిన యువకుడి గురించి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ఊరి పంచాయతీలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ముగ్గురిని మరో వర్గం కాళ్లకు మొక్కింపజేసి అవమానపరిచింది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి విల్లుపురం జిల్లా కలెక్టర్ అన్నాదురై, ఎస్పీ రాధాకృష్ణన్ ఒట్టందల్ గ్రామానికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఇరువర్గాలపై తిరువెన్నైనల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించిన 50 మందిపైనా కేసు నమోదైంది. ఈ సంఘటనను సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. చదవండి: ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్ -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్నగర్ మూసాపేట(మహబూబ్నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్డీఆర్జీజీఎస్పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్డీఆర్జీజీఎస్పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్నగర్ గ్రామం: హరిదాస్నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్కు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది. పంచాయితీ ఉద్యోగులకు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. కాగా, ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి -
గ్రామం ఒక్కటే, పంచాయతీలు రెండు!
సాక్షి, లక్కవరపుకోట(విజయనగరం): ఆ గ్రామం పేరు కోనమసివానిపాలెం. అది రెండు పంచాయితీల పరిధిలో ఉంది. అంతేనా... మండలాలు కూడా వేర్వేరే. ఇద్దరు అన్నదమ్ములుంటే ఇద్దరూ వేర్వేరు మండలానికి చెందుతున్నారు. నలభై ఏళ్లుగా ఈ సమస్య అక్కడివారిని వేధిస్తోంది. గ్రామంలో సుమారు 2500 జనాభా, 5వందల ఇళ్లు ఉన్నాయి. 1976–77 సంవత్సరంలో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయితీని ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగం లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెంగానూ, మరికొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో మసివానిపాలెంగానూ కలిపారు. అదే అక్కడ సమస్యలకు కారణమవుతోంది. గ్రామం ఒక్కటే అయినా ప్రజలను రెండు పంచాయతీలుగా, రెండు మండలాలుగా విడగొట్టడంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో తెలియక సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ఏ పంచాయతీ తరఫు న ఓటు వేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాధమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు. రెండు పంచాయతీ భవనాలు ఉన్నాయి. -
ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, చెన్నై: వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అగ్రవర్ణాల తీరుకు అవమానాల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇటీవల తిరువళ్లూరులో ఓ మహిళా ప్రజాప్రతినిధిని జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటే, తాజాగా, కడలూరులో ఓ మహిళా అధ్యక్షురాల్ని ఏకంగా నేలపై కూర్చోబెట్టి అవమానించడం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార వర్గాలు అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాదు, పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయించారు. కడలూరు జిల్లా మేల్ భువనగిరి యూనియన్ పరిధిలో తెర్కుదిట్టై పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ అధ్యక్షురాలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి గెలిచారు. బాధ్యతలు స్వీకరించిన నాటిని నుంచి ఎన్నో అవమానాల్ని ఆమె చవిచూశారు. ఆమెకు ఇటీవల ఎదురైన అవమానాన్ని ఫొటో చిత్రీకరించిన ఎవరో వ్యక్తులు, దానిని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించడం వివాదానికి దారి తీసింది. (చదవండి: పాదరసం.. అంతా మోసం) పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కుర్చీలో ఉపాధ్యక్షుడు మోహన్రాజ్, పంచాయతీ కార్యదర్శి సింధుజా కుర్చీలో కూర్చోగా, అధ్యక్షురాలు నేలపై కూర్చున్న ఫోటో వైరల్ అయింది. కడలూరు ఎస్పీ అభినవ్ దృష్టికి ఈ ఫొటో చేరడంతో భువనగిరి ఇన్స్పెక్టర్ రాబిన్సన్ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించారు. శనివారం ఆ గ్రామానికి చేరుకుని రాజేశ్వరి, ఆమె భర్త శరవణన్ల వద్ద విచారించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపులు వెలుగులోకి వచ్చా యి. ఆమె నుంచి తీసుకున్న ఫిర్యాదుతో ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, కార్యదర్శి సింధుజాలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సింధుజాను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సింధుజా పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్టు చేశారు. మోహన్ రాజ్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాల గురించి రాజేశ్వరి పేర్కొంటూ, తాను గెలిచానే గానీ, ఏ రోజూ ఆ పదవికి తగిన న్యాయం చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకటే ఊరు.. రెండు పంచాయతీలు
భువనేశ్వర్ : ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు. రెండు పంచాయతీలకు చాలా వరకు ఒకటే. ఒకే ఊరికింద వారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ గ్రామాలే మండలంలో కాశిదొరవలస, నారాయణప్పవలస పంచాయతీలు. 26 ఏళ్లక్రితం వరకు ఈ పంచాయతీలు రెండూ నారాయణప్పవలస గ్రామంపేరిట ఉండేవి. అప్పట్లో నాటి ప్రభుత్వం ఈ గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించింది. నారాయణప్పవలస గ్రామంలో ప్రధానవీధిలో ఓ స్తంభం వద్ద ఈ రెండు పంచాయతీలకు సరిహద్దు నిర్ణయించారు. అంతవరకు ఒకే గ్రామంగా ఉన్నవారంతా రెండు గ్రామాల వారిగా విడిపోయారు. బొబ్బిలి రూరల్ : ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు కావడంతో నారాయణప్పవలసలో రామాలయం ఉంటే, కాశిందొరవలసలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రేషన్షాపు, పాఠశాల నారాయణప్పవలసలో ఉన్నాయి. ఒకే రైల్వేస్టేషన్ కాశిందొరవలసలో ఉంది. దీనిని నారాయణప్పవలస రైల్వేస్టేషన్ అంటారు. కంచరగెడ్డ రిజర్వాయర్ కాశిందొరవలసలో ఉంది. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు ఉండడంతో అంతా కలిసి వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. నారాయణప్పవలస గ్రామం ఒక పంచాయతీ కాగా దీని పరిధిలో ఏ గ్రామాలూ లేవు. కాశిందొరవలస గ్రామానికి కాశిందొరవలస, దీని పరిధిలో డొంగురువలస, ఎరకందొరవలస, చిలకమ్మవలస, మోసూరువలసలు ఉన్నాయి. గ్రామంలోఅంతా కలిసి హాయిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. -
ఈ కాలపు మాల్గుడి డేస్ పంచాయత్
ఊరిలో ఏముంటాయి? పలకరించే చేలు ఉంటాయి. వసారాల పై కాసిన సొరకాయలుంటాయి. చిన్న సమస్యలకు పెద్ద బెంగలుంటాయి. పెద్ద చిక్కులకు పెక్కు నవ్వులుంటాయి. ఊరిలో ఏముంటాయి. జీవించమని చెప్పే హృదయాలుంటాయి. కసురుతూ అక్కునజేర్చుకునే గుండెలుంటాయి. అమేజాన్ ప్రైమ్లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ అలాంటివన్నీ వెలికి తీసింది. చూసిన ప్రేక్షకులను కట్టి పడేసింది. ఢిల్లీలో బి.టెక్ చేసి బయటికొచ్చిన అభిషేక్ త్రిపాఠికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద తెలివి తేటలు లేవు. చదువులో గొప్పగా సాధించింది లేదు. కాని కంప్యూటర్ ఉద్యోగం చేయాలంటే ప్రస్తుతానికి కుదిరేలా లేదు. ఈలోపు ఏదో ఒకటి చేయాలి కనుక పంచాయితీ ఆఫీసు ఉద్యోగి పోస్టుకు అప్లై చేస్తే వచ్చింది. ఎక్కడ? ఉత్తర ప్రదేశ్లోని బలియా జిల్లాలో ఫులేరా అనే చిన్న పల్లెలో. వెళ్లాలా వద్దా... వెళ్లాలా వద్దా... ఇదే మీమాంస. వెళ్లక తప్పని పరిస్థితి. మెయిన్రోడ్డు మీద బస్సు వదిలేసిపోతే మట్టి దారిలో బైక్ మీద సరంజామాతో చాలాసేపు ప్రయాణిస్తే తప్ప రాని ఆ పల్లెకు వెళ్లిన అభిషేక్ ఎలాంటి మనుషులను చూశాడు... ఏయే అనుభవాలను మూటగట్టుకున్నాడు అనేదే ‘పంచాయత్’ వెబ్ సిరీస్. తాళం లేదు తొలి ఉద్యోగానికి వచ్చిన కుర్రాడు అభిషేక్ ఒక ఖాళీ మైదానంలో గోపీరంగు గోడలతో ఉన్న చిన్న పంచాయతీ ఆఫీసును చూసి నీరసపడతాడు. దానికి తాళం వేసి ఉంటుంది. అతనికి స్వాగతం చెప్పడానికి వచ్చిన ఉప సర్పంచ్, ఆఫీస్ బాయ్ స్వాగతానికి తెచ్చిన నాలుగు మిఠాయిల్లో రెండు తినేసి కూచుని ఉంటారు. తాళం తేవాల్సిన సర్పంచ్ చెంబు పట్టుకొని పొలాల్లోకి వెళ్లాడని, రాగానే తాళం తీస్తామని వాళ్లు చెబుతారు. ‘అదేంటి...ఈ ఊరికి సర్పంచ్ మహిళ కదా’ అంటే ‘అది రిజర్వేషన్ కోసం మాత్రమే. గెలిచాక ఆమె భర్తే మాకు సర్పంచ్’ అని చెబుతారు. చెంబు పని ముగించుకొని వచ్చిన సర్పంచ్ జేబులో చేయి పెడితే తాళం ఉండదు. ఎక్కడైతే కూచున్నాడో అక్కడే పడేసుకొని ఉండొచ్చని అందరినీ తీసుకొని తాళం వెతకడానికి బయలుదేరిపోతాడు. ఊళ్లో దిగ్గానే ఈ తాళం గొడవ ఏమిటా అని అభిషేక్ వాళ్లతోపాటు పొలాలకు అడ్డం పడతాడు. కాని తాళం దొరకదు. తాళం పగులగొడదామంటాడు అభిషేక్. ‘అలా కుదరదు. అది మా ఆవిడ తన పుట్టింటి నుంచి తెచ్చిన తాళం. దానిని పగలగొడితే నా వీపు పగులుతుంది’ అంటాడు సర్పంచ్. ఆ తర్వాత ఏమైందనేది సరదా కలిగించే ఫస్ట్ ఎపిసోడ్. చిన్న సమస్యలు– పెద్ద బెంగలు అభిషేక్కు పంచాయితీ ఆఫీసులోనే ఒక గది నివాసానికి ఇస్తారు. అక్కడే ఉద్యోగం. అక్కడే వండుకు తిని పడుకోవడం. చుట్టూ చీమ చిటుక్కమనని ఖాళీ ప్రాంతం. పలకరించే మనిషి ఉండడు. ఢిల్లీలోలాగా ఉదయం తొమ్మిదికి లేస్తే ఆఫీస్ బాయ్ చాలా కంగారుపడిపోయి ‘అదేంటి మధ్యాహ్నం నిద్రలేస్తున్నారు మీరు’ అంటాడు. ఆ టైమ్లో లేవడం వారికి వింత. సర్పంచ్ ఊళ్లో పులేగానీ ఇంట్లో పిల్లి. దానికి తోడు రాత్రయితే చాలు కరెంటు పోతుంటుంది. ఈ ఊళ్లో ఒక్క నిమిషం ఉండేది లేదు... క్యాట్ ఎగ్జామ్ రాసి ఇక్కడి నుంచి బయటపడదామనుకుంటాడు అభిషేక్. అందుకోసం ఊరికి శాంక్షన్ అయిన సోలార్ లైట్లలో ఒకటి పంచాయతీ ఆఫీసులో ఏర్పాటు చేసుకుందామనుకుంటాడు. అది ఊరి చివర మర్రిచెట్టు దగ్గర పెట్టడానికి కేటాయించిన లైటు. అది దెయ్యాల మర్రి. అక్కడ పెట్టడం ముఖ్యం అంటాడు సర్పంచ్. లైటు కావాలంటే అక్కణ్ణుంచి దెయ్యాన్ని బయటకు పంపాలంటాడు. అభిషేక్ ఆ దెయ్యం సమస్యను ఎట్లా పరిష్కరించాడనేది రెండో ఎపిసోడ్. మాట పెళుసు– మనసు మెత్తన ఊళ్లో చాలామంది మాట పెళుసుగా ఉంటుంది. కాని అవసరం వచ్చినప్పుడు అందరిదీ మెత్తటి మనసే. ఒక రోజు పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ మానిటర్ని దొంగలు పట్టుకెళతారు. అది కథానాయకుడి మీద పడుతుంది. కాని సర్పంచ్, ఊరి మనుషులు అతణ్ణి కాపాడుతారు. వార్డు మెంబర్ ఇంట్లో ఒకాయన కుమార్తె పెళ్లి నిశ్చయమవుతుంది. పంచాయతీ వార్డు మెంబర్ ఇంట్లో పెళ్లి అంటే పంచాయతీ ఆఫీసులోని ఉద్యోగులందరూ పని చేయాల్సిన వాళ్లే. అభిషేక్ ఒళ్లు హూనమవుతుంది. ఊళ్లో ఫ్యామిలీ ప్లానింగ్ కోసం గోడల మీద నినాదాలు రాయిస్తాడు అభిషేక్. ‘ఇద్దరు పిల్లలు ముద్దు... మూడోవాడు ఎద్దు’ అనే అర్థంలో ఆ స్లోగన్స్ ఉంటాయి. ఊళ్లో చాలామందికి ముగ్గురు, నలుగురు సంతానం ఉంటారు. వాళ్లంతా తగాదాకు వస్తారు. సర్పంచే మళ్లీ కాపాడతాడు. చాలాసార్లు ఊరి ప్రజల తెలియనితనం అమాయకత్వం సమస్యలు తెస్తాయి. కాని తెలివి మీరి వచ్చే సమస్యల కంటే తెలివి తక్కువగా వచ్చే సమస్యలు సులువుగా ఉంటాయని కథానాయకుడికి అర్థమవుతుంది. ఊరిలో ప్రేక్షకుడి నివాసం ‘పంచాయత్’ అని పేరు పెడితే పంచాయతీ ఆఫీసు గొడవలు, రాజకీయాలు అనుకుంటాం. కాని ఇదో ఊరి మనుషుల మనోహర కథ. ఎపిసోడ్లు జరుగుతున్నంతసేపు ప్రేక్షకుడు ఆ ఊళ్లోనే ఉన్నట్టుగా భావిస్తాడు. ఎపిసోడ్లు ముగిశాక ఆ ఊళ్లోనే విహరిస్తాడు. నిర్మాత, దర్శక, రచయితలు అలా కథను మలిచారు. గతంలో మాల్గుడి డేస్ ఎపిసోడ్లు ఎలా ఉంటాయో ఈ సిరీస్లోని ఎపిసోడ్లు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ను చూసిన వారంతా మెచ్చుకుంటూ ఉన్నారు. దానికి కారణం అత్యంత సహజమైన, నిజమైన మానవీయ ప్రవర్తనలను చూపడమే. అక్కడ అవినీతి అంటే ఎదుటివారికి సొరకాయను లంచం ఇవ్వడమే. సంపాదన అంటే పాలడబ్బులు నిక్కచ్చిగా వసూలు చేయడమే. ఊరి సౌందర్యం ఇప్పుడు ఇలా లేకపోవచ్చు. కాని ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిర్మాణం సుప్రసిద్ధ నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ భర్తగా, నటి నీనాగుప్తా సర్పంచ్గా నటించారు. వెబ్ సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న జితేంద్ర కుమార్ హీరోగా నటించాడు. మిగిలినవారంతా కొత్తనటులే. ఈ సిరీస్ను భోపాల్ దగ్గర ఉన్న ఒక ఊరిలో షూట్ చేశారు. సంగీతం, ఫొటోగ్రఫీ ఎంత చక్కగా ఉంటాయో చెప్పలేము. మొదటి సీజన్ ముగిసింది. రెండో సీజన్ కోసం జనం ఎదురు చూస్తున్నారంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించొచ్చు. అమేజాన్ ప్రైమ్లో తప్పక చూడదగ్గ సిరీస్ ఇది. -
కొత్త పంచాయతీలకు లైన్క్లియర్
సాక్షి , శ్రీకాకుళం: జిల్లాలో పంచాయతీల స్వరూపం మారనుంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 24 ఏళ్లుగా కొత్త పంచాయతీల ఊసే లేదు. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్లడమే తప్ప నిషేధం ఉన్న కారణంగా ఇంతవరకు వాటికి మోక్షం లభించలేదు. 1995 నుంచి అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 60కి పైగా కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.. మండల ప్రాదేశిక, వార్డుల వర్గీకరణలు జరిగాయి.. పంచాయతీల విలీనాలు చోటు చేసుకున్నాయి. కానీ పాతికేళ్లుగా కొత్త పంచాయతీల ఏర్పాటు జరగలేదు. 3 వేల జనాభా, 3 కిలోమీటర్ల దూరం, తలసరి ఆదాయం రూ.3 వేలు ఉన్న గ్రామాలు పంచాయతీగా అర్హత పొందుతాయి. కానీ నిషేధం కారణంగా కొత్త పంచాయతీల ఏర్పాటు కలగా మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జీవో నెంబర్ 167 జీవో జారీ చేశారు. ఫలితంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. ఇప్పటికే 13 ప్రతిపాదనలు.. కొత్తగా మరో 47..! 3 వేల జనాభా, 3 వేల తలసరి ఆదాయం, 3 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న గ్రామాలు జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. కాకపోతే స్థానికంగా విజ్ఞప్తులు వెళ్లాలి. అందులో భాగంగా ఇప్పటికే ఆర్అండ్ఆర్ కాలనీలుగా ఉన్న కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్ 1, మెట్టూరు బిట్ 2, మెట్టూరు బిట్ 3, కర్లెమ్మ, గూనభద్ర ఆపోజిట్ కాలనీ, ఎల్ఎన్ పేట మండలంలోని మోదుగుల వలస, శ్యాపలాపురం, టయాంబపురం, ఆమదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస, వంగర మండలంలోని శ్రీహరిపురం, కింజంగి, హిరమండలం మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, సుబైల్ కాలనీలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. తాజాగా నిషేధం ఎత్తివేత జీవోతో వీటికి మోక్షం కలగనుంది. అలాగే నిబంధనల మేరకు మరో 47 వరకు కొత్త పంచాయతీల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1141 పంచాయతీలున్నాయి. -
అమిత్ షాతో కశ్మీర్ పంచాయతీ ప్రతినిధుల భేటీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పంచాయతీ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో గత నెలరోజులుగా కశ్మీర్ లోయ నిషేధాజ్ఞల నీడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు గ్రామపంచాయతీల పెద్దలతో కూడిన ప్రతినిధుల బృందం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో షాతో సమావేశమైంది. ఈ సమావేశంలో హోంశాఖ అధికారులతోపాటు, కశ్మీర్ డివిజినల్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పూల్వామా, కశ్మీర్, జమ్మూ, లధాక్ ప్రాంతాల ప్రజలు కూడా ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు. అభివృద్ధి నిధులు జమ్మూకశ్మీర్లోని గ్రామ పంచాయతీలకు నేరుగా అందించడం, ఆ నిధులతో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, గ్రామాభివృద్ధిలో పంచాతీయ పెద్దలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. -
పంచాయితీల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్ పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్ పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్పవర్పై తర్జన భర్జనలు పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్ పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచ్కి , కార్యదర్శికి చెక్పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22వ తేదీన తేలిన చెక్ పవర్ గత నెల 22వ తేదీన ప్రభుత్వం చెక్ పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్ పవర్పై ప్రొసీడింగ్స్ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్ పవర్ ప్రొసీడింగ్స్ను పంపించారు. చెక్ పవర్ వచ్చినా .. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్ పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీ–సేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ సెల్లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్ పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్పవర్ ఇచ్చినా, ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. చెక్ పవర్పై పునరాలోచన చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్ పునరాలోచన చేయాలి. – పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్ చెక్ పవర్లేక అప్పుల పాలయ్యాను మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్ పవర్ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు -
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
పంచాయతీలు 920 కార్యదర్శులు 502 మంది..
విజయనగరం రూరల్: పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకం.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండాల్సింది పంచాయతీ కార్యదర్శులే.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కీలకమైన పనులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే ప్రధానపాత్ర. అయితే పంచాయతీల్లో కార్యదర్శల కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారు. సగం మంది కూడా లేరు.. జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలుంటే 502 గ్రామ పంచాయతీలకే గ్రామ కార్యదర్శులు ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించడంతో కార్యదర్శులపై పనిభారం పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రతీ పనినీ ఆన్లైన్ చేయడం, మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాలతో వీరిపై మరింత పనిభారం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండేసి గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఒక్కోసారి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశమే ఉండడం లేదు. పనిభారంతో కనీసం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. ఒకపక్క పనిభారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువస్తుండడంతో పంచాయతీకార్యదర్శలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారు కావడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పడకేస్తున్న పారిశుద్ధ్యం పంచాయతీల్లో ఈ పాలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా కేటాయించారు. అయితే నెట్ సౌకర్యం లేకపోవడంతో కార్యదర్శులు ప్రతి పనికీ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండకపోవడంతో పారిశుద్ధ్య అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొరత వాస్తవమే.. జిల్లాలో 920 పంచాయతీలకు 502 మంది కార్యదర్శులే ఉన్నారు. వాస్తవంగా జిల్లాలో 489 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ ప్రకారంగా పంచాయతీ కార్యదర్శుల కొరత లేనట్టే. దీంతోపాటు పంచాయతీలకు 357 మంది ప్రత్యేకాధికారులున్నారు. పంచాయతీ కార్యదర్శులకు పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణతో పాటు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పలు ధ్రువపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో భాగంగా బీఎల్ఓల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయినా రెండు రోజులకోసారైనా పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శిస్తున్నారు. పారిశుద్ద్య నిర్వహణపై ఫిర్యాదులు ఉంటే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. – బలివాడ సత్యనారాయణ, డీపీఓ, విజయనగరం -
పవర్ లేని ప్రథమ పౌరులు
సాక్షి, ముత్తారం(మంథని): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. వాటిని పాలించే వారే ప్రథమ పౌరులు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. గ్రామాలను ప్రగతి బాటలో నడపాలని.. గత సర్పంచుల దీటుగా అభివృద్ధి చేయాలని ఎంతో ఉత్సాహంగా కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు కూడా పుష్కలంగా ఉండడంతో పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్నారు. నెల రోజులైనా ప్రభుత్వం చెక్పవర్ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తొచని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. మరోవైపు కొత్త పాలకవర్గం కొలువు తీరితే సమస్యలు పరిష్కారమవుతాయనుకున్న ప్రజలు నెలరోజులైనా ఏ పని ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు గత జనవరిలో మూడు విడతల్లో జరిగాయి. 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికలు చాలా గ్రామాల్లో రసవత్తరంగా జరిగాయి. గెలుస్తాం అనుకున్న వారు ఓటమి పాలయ్యారు. ఓడిపోతారు అనుకున్నవారు గెలిచారు. కొత్త సర్పంచులు ఫిబ్రవరి 2న సర్పంచులు ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచినాఇప్పటికీ అధికారాల బదలాయింపు జరుగలేదు. కొత్త సర్పంచులకు అన్ని గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 263 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పంచాయతీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలు లేకుండా చేయాలని, మొదటగా మహిళల వద్ద మెప్పులు పొందాలనుకున్న సర్పంచులకు నిరాశే మిగిలింది. ప్రజలు వివిధ సమస్యలపై కొత్త స ర్పంచులను ఆశ్రయిస్తున్నారు. చెక్పవర్ లేకపోవడంతో సర్పంచులు దిగాలు చెందుతున్నారు. పాత పంచాయతీలు - 228 కొత్త పంచాయతీలు - 65 ఎనిమిది నెలలుగా కుంటుపడిన అభివృద్ధి గత సర్పంచుల పదవీకాలం 2018, జూన్లో ము గిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తమ విధుల్లోనే బిజీగా ఉన్న అధికారులు పల్లెలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెళ్లినవా రు కూడా ఎలాంటి పనులు చేయించలేదు. కనీ సం డ్రెయినేజీలు కూడా శుభ్రం చేయించలేదు. ప్రత్యేక అధికారులు శాఖా పరమైన విధులకే పరి మితమయ్యారు తప్ప గ్రామాలపై దృష్టి సారించలేదు. పారిశుధ్య లోపం, దీర్ఘకాలిక సమస్యలు, ఎనిమిది నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు మొదలుకాక సతమతమైన ప్రజలు కొత్త పాలకులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త సర్పంచ్లు పాత సమస్యలు వెక్కిరిస్తున్నాయి. తాజాగా ఎండలు కూడా ముదురుతుండతో చెరువులు, కుంటలలో నీరు అడిగంటుతోంది. బోర్లు వట్టిపోతున్నా యి. చేతిపంపులు పనిచేయడంలేదు. పల్లెల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. సర్పంచులకు అధికారాల బదలాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మొదలు కాని స్వయం పాలన జిల్లాలో ప్రస్తుతం 263 పంచాయతీలు ఉన్నాయి. గతంలో 228 పంచాయతీలు మాత్రమే ఉండగా, జిల్లాల పునర్విభజన, నూతన పంచాయతీరాజ్ చ ట్టం ప్రకారం ప్రభుత్వం గత ఆగస్టులో 500పైగా జనాభా ఉన్న అనుబంధ గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో 65 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. పాత పంచాయతీలతోపాటు కొత్త పంచా యతీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. ఇన్ని రోజులు అనుబంధ గ్రామాలుగా, తండాలు గా ఉన్న పల్లెలో స్వయం పాలన మొదలవుతుం దని ప్రజలు సంతోషపడ్డారు. కానీ సర్పంచులకు చెక్పవర్ ఇవ్వకపోవడంతో పాత పంచాయతీలతోపాటు కొత్త పంచాయతీల్లో ఇప్పటికీ పాలన మొదలు కాలేదనే చెప్పవచ్చు. పవర్పై స్పష్టత లేకనే.. కొత్త సర్పంచులకు చెక్ పవర్పై స్పష్టత రాలేదు. పంచాయతీల్లో ఏ పని చేసినా వాటికి సంబంధిం చి నిధులు విడుదల చేయడానికి గతంలో సర్పం చి, కార్యదర్శి పేరిట బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరు మీద ఉన్న ఖాతాలు మార్పిడి చేసి సబ్ ట్రేజరీ కార్యాలయం (ఎస్టీవో) కార్యాలయంలో నివేదించారు. ఇప్ప టి వరకు చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే స్పష్టత లేక పోవడంతో చెక్ పవర్ కేటాయింపులో జాప్యం జ రుగుతోందని సమాచారం. నూతన చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ ఖాతా ఉంటుందని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. తాగునీటి సమస్య మొదలైంది గ్రామాలలో ఇప్పటికే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. గతంలో వేసిన బోర్లు, చేతి పంపుల్లో నీరు అడుగంటి పోయింది. కొన్ని చేతి పంపులు మరమ్మతుకు నోచుకోవడంలేదు. విద్యుత్ మోటార్లు కూడా కాలిపోతున్నాయి. చెక్ పవర్ లేక ఏ పని చేయించలేకపోతున్నాం. –సముద్రాల రమేశ్, సర్పంచ్, ఖమ్మంపల్లి సమాధానం చెప్పలేకపోతున్నం గ్రామాలలో సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రామాలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకు పోయాయి. పారిశుధ్యం లోంపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నాం. –తూటి రజిత, సర్పంచ్, ముత్తారం -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్తో పాటు పాలకవర్గానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది. గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. సర్పంచులకు లక్ష్యాలు ఇలా.. తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. ∙ కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు ∙ గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ∙ ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్భగీరథ నల్లా కనెక్షన్లు ∙ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. ∙ పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు ∙ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ∙ ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి ∙ డంపింగ్ యార్డులను నిర్మించాలి ∙ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి బాధ్యతలు పెరిగాయి కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు. – అమరేందర్రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట -
పల్లెల్లో పాట్లు
పాల్వంచరూరల్: నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల కొత్త సర్పంచ్లు, వార్డు సభ్యులు కొలువుదీరినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్గానే మారింది. దీనికి తోడు గ్రామ కార్యదర్శుల కొరత కూడా వేధిస్తోంది. జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఉండగా.. కార్యదర్శులు 88 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ గ్రామంలోనూ వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. అభివృద్ధి కోసమే పునర్విభజన... చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేసింది. 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో 203 (భద్రాచలం, సారపాక మినహా) గ్రామ పంచాయతీలు ఉండగా.. పునర్విభజన తర్వాత 479కి పెరిగింది. అన్ని గ్రామాలకు ఈనెల 2వ తేదీన కొత్త పాలకులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయి. కొత్త పంచాయతీలకు భవనాలు కరువు.. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన 276 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు కరువయ్యాయి. పాత వాటిలోనూ 43 గ్రామాల్లో సరైన కార్యాలయాలు లేవు. కొత్తగా ఏర్పడిన వాటిలో 20 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం..పక్కా భవనాల నిర్మాణంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పలువురు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరు చేసిన నిదులను కొత్త పంచాయతీలకు కూడా జమ చేయాలని, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత... గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అధికారిగా వ్యవహరించే కార్యదర్శులు ప్రతి పంచాయతీకి ఒకరు ఉండాలి. కానీ జిల్లాలో 387 గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. జిల్లా వ్యాప్తంగా 88 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కార్యదర్శులు పర్యవేక్షించాలి. వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరపరా, ఇంటి పన్నుల వసూళ్లు, జనణ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
‘విలీనం’పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండాతోపాటు మరో ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వర నాయక్లు గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. పంచాయతీరాజ్, మునిసిపాలిటీ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రజాభిప్రాయాలను తెలుసుకోలేదు పంచాయతీల విలీనంపై చట్టం నిర్దేశించిన విధి విధానాలకు అధికారులు తిలోదకాలు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. విలీనంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తేలుసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయకుండా ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అధికారుల తీరు వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద లభిస్తున్న ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అన్ని విషయాలపై అధ్యయనం చేసిన తరువాతనే విలీన నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసిపోయి ఉన్నాయని, ఆ గ్రామాలకు కరెంటు, తాగనీరు ఆ మునిసిపాలిటీల ద్వారానే అందుతోందని తెలిపారు. పంచాయతీల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
వైరా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
అక్రమ లే అవుట్లకు అనుమతిస్తే కొరడా
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత నిబంధనల ప్రకారం లేని లే అవుట్లకు అనుమతి ఇస్తే గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని రద్దు చేసే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చింది. నగరాలు, పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2018 మార్చి 31 వరకు ఉండే లే అవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించి.. అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చే ముందు వ్యవసాయ భూమి చట్టం కింద రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లే అవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. గ్రామపంచాయతీలు దీన్ని 7 రోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీ చేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. లే అవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లే అవుట్ నిర్వాహకులకు చెబుతుంది. అనంతరం లే అవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించి డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లే అవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. గ్రామ కంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లే అవుట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లే అవుట్కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం రద్దవుతుంది. చట్టంలో క్రమబద్ధీకరణ అంశం.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. లే అవుట్లో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వసతులు లేనప్పుడు అది అక్రమం అవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాత లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువతో పోల్చితే పది శాతం గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంత మొత్తం చెల్లించినా దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు. -
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పైరవీల్లో స్పెషల్
పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకం పక్కదారిపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీలను కేటాయించినట్లు తెలుస్తోంది. అనుకూలురైన అధికారులకు నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం, లేని వారికి ఒకటి రెండు పంచాయతీలతో సరిపెట్టడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకాల్లో పైరవీలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు ఎక్కువ పంచాయతీలు కట్ట బెట్టాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అనుకూలంగా లేని అధికారులకు మొక్కుబడిగా ఒకటి రెండు పంచాయతీలను అప్పజెప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కేటాయింపులు పరి శీలిస్తే పైరవీలు ఏ స్థాయిలో జరిగాయో ఇట్టే అర్థమవుతోంది. నిబంధనలు ఇలా.. జిల్లాలో సర్పంచ్ల స్థానంలో స్పెషలాఫీసర్ల నియామకాలకు కలెక్టర్ అధ్యక్షతన ముందుగా కమిటీలు వేయాలి. ఎవరినైతే స్పెషలాఫీసర్లుగా నియమిస్తున్నారో ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ సూచించే వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉండాలి. ఆ కమిటీలో సభ్యులు నిబంధనల ప్రకారం స్పెషలాఫీసర్లను కేటాయించాల్సి ఉంటుంది. జరిగింది ఇలా.. కమిటీలో ఎవరున్నారో స్పెషలాఫీసర్లకు తెలియదు. అలాంటప్పుడు ఎలా నియమించారో చెప్పాల్సి ఉంది. ఏ ప్రాతిపాదికన కేటాయించారో ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితి. జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా ఈ నెల 3న స్పెషలాఫీసర్లను ఇష్టానుసారం నియమించారు. ఆ నివేదికలను కలెక్టర్కు ఈ ఆఫీసులో పంపి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఆపై అదే రోజు రాత్రి ఆగమేఘాలపై ఎంపీడీఓల మెయిల్కు స్పెషలాఫీసర్ల ఎంపిక వివరాలను పంపారు. మాజీలకు పంగనామాలు.. సర్పంచ్ల పదవీ కాలం ఈనెల రెండో తేదీన ముగిసింది. ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రత్యేకాధికారుల నియామకానికి పచ్చజెండా ఊపింది. పర్సన్ ఇన్చార్జ్లుగా తమనే నియమిస్తారనుకున్న మాజీలకు భంగపాటు తప్పలేదు. ప్రత్యేకాధికారులకు స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని పలువురు రుసరుసలాడుతున్నారు. నమ్ముకున్న పార్టీయే నట్టేట ముంచేస్తోందని ఆవేదన చెందుతున్నారు. పైరవీల జోరు.. ఈనెల రెండో తేదీన పంచాయతీ సర్పంచ్ పాలన ముగిసింది. అదేరోజు పంచాయతీరాజ్శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. మండల కేడర్ ఉన్న అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించుకోవాలని ఆదేశించింది. ఈ నెల 2న కలెక్టర్కు బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మూడో తేదీ నుంచి బిజీ అయిపోయారు. ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఈ నెల మూడున శ్రీలంక ప్రధాని, నాలుగో తేదీ సీఎం చంద్రబాబు జిల్లాకు విచ్చేయడంతో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు కొందరు మండల స్థాయి నుంచే పైరవీలకు తెరలేపారు. తాము చెప్పిన అధికారికి తమ పంచాయతీలను అప్పజెప్పాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకే నియామకాలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర్వుల జాడేలేదు.. పంచాయతీల ప్రత్యేకాధికారుల నియామకాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. పంచాయతీల కేటాయింపులు మాత్రమే స్థానికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే తామనుకున్న పంచాయతీలకు, తాము సూచించిన అధికారులు వస్తారని కొందరు టీడీపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నట్టు సమాచారం. ఎంపీడీఓలకే ఎక్కువ పంచాయతీలు.. జిల్లాలో 65 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరికే అధిక పంచాయతీలు కేటాయించినట్లు తెలుస్తోంది. సీఎం ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో 18 గ్రామపంచాయతీలకు గాను ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓకు గుడుపల్లె, అగరం, బెగ్గిలిపల్లె, శెట్టిపల్లె, కంచిబందార్లపల్లె పంచాయతీలను కేటాయించారు. అదే మండల ఎంఈఓకు సోడిగానిపల్లె, చీకటిపల్లి రెండు పం చాయతీలను అప్పజెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువులో ఎంపీడీఓకు ఐదు పంచాయతీలు, అక్కడ పనిచేస్తున్న ఎంఈఓకు ఒక (సోంపల్లె) పంచాయతీకి బాధ్యతలిచ్చా రు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు పైరవీలు చేసి స్పెషలాఫీసర్ల నియామకాలను వారి చేతుల్లోకి తీసుకున్నారని మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపాలన కష్టమే.. జిల్లాలోని 1,353 పంచాయతీలకు 346 మంది స్పెషలాఫీసర్లను నియమించారు. పశువైద్యులకు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లకు గ్రామాల అభివృద్ధి ఏమి తెలుస్తుందని మాజీ సర్పంచ్లు మండిపడుతున్నారు. ఫ్యాన్ల కింద కూర్చునే అధికారులకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. గ్రామాభివృద్ధి శూన్యమే నిత్యం పని ఒత్తిడిలో ఉండే అధికారులను స్పెషలాఫీసర్లగా నియమించారు. వారు ఏ విధంగా గ్రామ సమస్యలపై దృష్టి పెడతారో అర్థం కావడం లేదు. మా పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. స్థానిక సమస్యలు మాకు తప్ప అధికారులకేం తెలుసు? ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీలను అప్పజెప్పారు. సమస్యలు వారెలా పరిష్కరిస్తారో...? – బాబు, చిన్నతయ్యూరు మాజీ సర్పంచ్ -
నాగులవంచ గ్రామంలో కులపంచాయతీ
-
పంచాయతీలకు ‘విద్యుత్’ షాక్..!
ఓపైపు నిధుల లేమి, మరోవైపు ఖర్చుల భారంతో విలవిలలాడుతున్న పంచాయతీలపై విద్యుత్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్ల కరెంట్ బిల్లులను చెల్లించాలంటూ ట్రాన్స్–కో అధికారులు పంచాయతీలకు నోటీసులు పంపిస్తున్నారు. 2006 నుంచి విద్యుత్ బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మదనపల్లె రూరల్: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 66 మండలాలు, 1363 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ: 7.50 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్కో అధికారులు పంచాయతీ సర్పంచ్లు, ఎంపీడీఓలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. పంచాయతీలు బిల్లులు చెల్లించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ట్రాన్స్కో నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో కనీసం అందులోంచి తమ బకాయిలను రాబట్టేందుకు ఆశాఖ అధికారులు నడుం బిగించారు. గ్రామ తాగునీటి అవసరాలు తీర్చే విద్యుత్ మోటార్ల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీధిలైట్లు, నీటి పథకాల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్కో అధికారులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీ శాఖ అధికారులకు, సర్పంచ్లకు నోటీసులు జారీ చేశారు. బకాయి వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ డివిజన్లో విద్యుత్ బకా యిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్లతో ప్రత్యేకంగా సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్కో నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల శాఖా« దికారులు, సర్పంచ్లు సమన్వయంతో వ్వవహరించి పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.–భాస్కర్నాయుడు, ట్రాన్స్కో డీఈ, మదనపల్లె -
డమ్మీ స్టార్
అభివృద్ధిలో పంచాయతీలు పోటీ పడాలని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ని ప్రకటిస్తోంది. అందుకు సరిపడా నిధులను మాత్రం అందించలేకపోతోంది. ఒకవేళ నిధులిచ్చినా జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఒకవైపు సర్పంచ్ల చెక్ పవర్ రద్దయ్యింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దశలో గ్రామాలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా ‘డమ్మీ స్టార్స్’తో లేని అభివృద్ధి ఉన్నట్టు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో/ఎస్వీఎన్కాలనీ: గ్రామ పంచాయతీల అభివృద్ధిని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్తో సూచిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులకు, వచ్చిన రేటింగ్స్కు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. వివిధ శాఖల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి, మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ అంటూ మభ్యపెడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. జన్మభూమి కమిటీలకు అధికారాలను కట్టబెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రేడింగ్లు ఇలా... గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో స్టార్ల రూపంలో ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల నుంచి నిధులు విడుదల అవుతున్నా, క్షేత స్థాయిలో ఆశించిన మేర అభివృద్ధి కనిపించడం లేదని ప్రభుత్వం పంచాయతీలకు గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ అంశాలపై ఈ రేటింగ్ విధానం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రేటింగ్ ఇలా.. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచేందుకు 11 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్లు సాధించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ గ్రామంగా ఉండాలి ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామాల్లో వీధి దీపాలు ఎల్ఈడీలుగా మార్పు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి సురక్షిత తాగునీరు అందాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ పారిశుద్ధ్యాన్ని మొరుగుపరిచేందుకు ఘన, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు ప్రయాణాలకు అనువైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం కో నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి పైబర్ నెట్ ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో ఉండేలా చూడటం. వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులు చూపించాలి. బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు హాజరు కావడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు చిన్నారులకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, వంద శాతం పోషకాహారం అందాలి. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితకు కృషి. లింగ సమానత్వం, గృహ హింస రహిత గ్రామాలు ఇదీ జిల్లా సంగతి.. జిల్లాలో మొత్తం 1011 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఒక్కో పంచాయతీకి 10 వరకు స్టార్ రేటింగ్ ఇస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలు 10,110 స్టార్లు సాధించాలి. కానీ ఇంత వరకు 5,624 స్టార్ రేటింగ్స్ను మాత్రమే సాధించాయి. ప్రభుత్వం పేర్కొన్న అంశాల ప్రకారం స్టార్లు 55.89 శాతం మాత్రమే వచ్చాయి. అంటే జిల్లాలో ఎక్కువ శాతం పంచాయతీలు చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాయని చెబుతునప్పటికీ , క్షేత్ర స్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకనిధులు అందటం లేదు. విద్యుత్తు, రక్షిత మంచినీటి ప«థకాల నిర్వహణకు కూడా చిన్న పంచాయతీల్లో నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ఆధారంగానే రేటింగ్ గ్రామ పంచాయతీల్లో ఓడీఎఫ్, విద్యుత్తు, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, పౌరసేవలు వంటి అంశాల ఆధారంగా రేటింగ్లు ఇచ్చారు. గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు అభివృద్ధిలో స్టార్ రేటింగ్ మెరుగుపరచుకునేలా చర్యలు తీసుకుంటాం.–అరుణ, జిల్లా పంచాయతీ అధికారి -
అన్యాయం.. బాధితురాలినే శిక్షించారు
జైపూర్ : బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వారికే శిక్ష విధించిన సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. రాజస్థాన్ చిత్తోర్ఘడ్కు చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందు ఇచ్చి ఆమెను అసభ్యకర రీతిలో వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి బాధుతురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిని పంచాయతీ పెద్దలు వత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో బాధితురాలి కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లడవద్దని, వారికి ఎటువంటి సహాయం చేయవద్దని కనీసం తిండి గింజలు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాక పంచాయతీ తీర్పును పాటించనందుకు గాను బాధితురాలి కుటుంబానికి 11 వేల రూపాయల జరిమాన విధించారు. పంచాయతీ జారీ చేసిన ‘దిక్తిత్’ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం తమకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించుకుంది. ఈ విషయంలో బాధితులకు రక్షణ కల్పించి, గ్రామస్తుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ తెలిపారు. -
రేప్ కేసు.. గుంజీలు తియ్యమంటే తగలబెట్టేశాడు
రాంచీ: జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ యువతి(18)కి నిప్పటించిన ఘటన కలకలం రేపింది. పంచాయితీ పెద్దల తీర్పును జీర్ణించుకోలేని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఛాత్రా జిల్లా రాజకెందువా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు బంధువుల వివాహానికి వెళ్లగా యువతి(18) ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. అది గమనించిన నలుగురు యువకులు గురువారం రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. మరుసటి ఉదయం విషయం తెలిసిన యువతి తండ్రి పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడికి 30 వేల రూపాయల జరిమానా.. వంద గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు హేయమైన తీర్పు ఇచ్చారు. దీంతో యువకుడు ఆగ్రహంతో యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులను చితక్కొట్టి ఆపై యువతికి నిప్పటించాడు. ఘటన తర్వాత యువకుడు పారిపోగా.. కాలిన గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతి బంధువుల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి ప్రధాన నిందితుడికి పాత పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
రాష్ట్రంలో 1,13,380 వార్డులు
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పునర్విభజన ప్రకారం జిల్లాల వారీగా గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను పేర్కొంటూ తాజా సమాచారాన్ని శనివారం వెల్లడించింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో అతి తక్కువగా 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండేవి. పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు సైతం గ్రామ పంచాయతీలుగా మారాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 26 గ్రామ పంచాయతీలలో 300 కంటే తక్కువ జనాభా ఉంది. ఈ గ్రామాల్లో 210 నుంచి 230 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలలో ఐదుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉంటారు. వీరిలోనే ఒకరు ఉపసర్పంచ్గా ఎన్నికవుతారు. -
‘తండాలను పంచాయతీలు చేసినం’
కౌడిపల్లి(నర్సాపూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మదన్ర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మడలంలోని రాజిపేట పంచాయతీ జాజితండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచ్ మహ్మపాష ఆధ్వర్యంలో తండాలో టీఆర్ఎస్పార్టీ జెండా అవిష్కరణ, పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరుకాగా వెంకట్రావ్పేట్ గేట్ నుంచి తండా వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్ల అమలు ఉండేలా చట్టం తెచ్చిందన్నారు. దీంతో ఎన్నికైన సర్పంచ్లు అభివృద్ధికి పాటు పడుతారని తెలిపారు. తండాలలో సర్పంచ్ల కోసం ఎన్నికల్లో పోటిపడటానికి మంచి వ్యక్తులను చూసి ఏకగ్రీవం చేసుకోవాలని కోరారు. సమైఖ్యంగా ఉండి అభివృద్ధి చేసుకునే వీలుంటుందని చెప్పారు. తండాలో టీఆర్ఎస్పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్లో చేరిక ః జాజి, జగ్య, జయరాం, రామాలయం తండాలకు చెందిన మాజీ సర్పంచ్ పత్తినాయక్, వార్డుసభ్యులు అంబిబాయ్, అంబుర్యనాయక్, మాజీ వార్డు సభ్యులు వాల్య, రాములు నాయక్తోపాటు లక్ష్మన్, కిషన్, హీర్య, రెడ్య, విఠల్, హర్య, కాశ్య, గోపాల్, జీవుల, రాజు, వాల్య, గోప్య, గేమ్య తదితర వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్ ఎండీ పాష, నాయకులు లింగంగౌడ్, గణేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ చట్టంలో వస్తున్న మార్పులతో సరికొత్త ‘పంచాయితీ’మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్పవర్ అంశం గ్రామ రాజకీయాల్లో కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో రాజకీయ పోరు ఉధృతం అవుతుందని, రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనే భావన వస్తోంది. చెక్పవర్ ఉన్న కారణంగా గ్రామ పాలనా వ్యవహారాల్లో ఉప సర్పంచ్ల జోక్యం పెరిగే అవకాశముంది. మరోవైపు గ్రామ కార్యదర్శులు నామమాత్రంగా మిగిలిపోనున్నారు. కార్యదర్శులకు కత్తెర వేసి.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, వేతనాలు, ఇతర పనుల కోసం నిధుల ఖర్చు అంశం సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు ఉంది. వారిద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రామ సభ నిర్ణయం మేరకు నిధులు ఖర్చు చేస్తారు. అయితే అత్యవసర పనులు, కార్యక్రమాలకు గ్రామ కార్యదర్శి, సర్పంచ్ల ఆమోదంతో నిధులు విడుదల చేస్తారు. కానీ ఇక ముందు కార్యదర్శులు గ్రామ ప్రణాళికల రూపకల్పన, పన్నుల వసూలు, ధ్రువపత్రాల జారీ, గ్రామసభల నిర్వహణ విధులకు పరిమితం కానున్నారు. గ్రామ రాజకీయాల్లో కొత్త మార్పు సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్పవర్ ఇవ్వడం గ్రామ రాజకీయాల్లో మార్పులు తెచ్చే పరిస్థితి ఉందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో ఇన్నాళ్లు సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే పోటీ ఉండేదని, ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి కోసం పోరు ఉంటుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయనందున.. ప్రస్తుతమున్నట్టుగానే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలు వస్తాయి. అదే రోజు వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ఉప సర్పంచ్ పదవికి పెద్దగా పోటీ ఉండేదికాదు. కానీ చెక్పవర్ రానుండడంతో సర్పంచ్ పదవితో సమానంగా పోటీ పెరగనుంది. ఆధిపత్య పోరుకు అవకాశం..! జాయింట్ చెక్పవర్ కారణంగా సర్పంచ్గా ఎన్నికైనవారికి, ఉప సర్పంచ్గా ఎన్నికైన వారికి మధ్య ఆధిపత్య పోరు నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య సయోధ్య నెలకొనని పరిస్థితి ఉంటే గ్రామ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు తదితర వర్గాలకు సర్పంచ్ పదవులు రిజర్వు అయిన చోట ఉప సర్పంచులు ఆధిపత్యం చెలాయించడం ఇప్పటికే జరుగుతోంది. తాజాగా చెక్పవర్తో ఇది మరింత ఉధృతమవుతుందని అంటున్నారు. ఇక సర్పంచ్ లేని సందర్భాల్లో గ్రామ పరిపాలన అంతా ఉప సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది. దీనికితోడు తాజా నిబంధనల్లో.. విధి నిర్వహణలో విఫలమైన, నిధుల దుర్వినియోగం విషయంలో సర్పంచ్లను తొలగించేలా నిబంధనలు చేర్చారు. ఉప సర్పంచులు దీనిని ఆసరాగా చేసుకుని సర్పంచ్లను తొలగించేలా ప్రయత్నాలు చేయవచ్చనే అభిప్రాయమూ వస్తోంది. తాగునీటితో స్నానం చేస్తే రూ.500 జరిమానా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి, మెరుగైన పరిపాలన దిశగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చాలా అంశాలను చేర్చారు. నీటి వృధాను అరికట్టడం, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అల్లర్ల నిరోధం, పారిశుధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తాగునీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.500 జరిమానా వేయాలని చట్టంలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థతో సరఫరా చేసే నీటిని వృథా చేయడం, స్నానానికి వినియోగించడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, వాహనాలను శుభ్రపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో అల్లరి (నూసెన్స్) చేసిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. లైసెన్సు లేకుండా రోడ్డు దగ్గరలో ఇసుక తీసినా, రోడ్డు తవ్వినా రూ.ఐదు వేల జరిమానా వసూలు చేస్తారు. అనుమతి లేకుండా చెట్లను నరికినా, బహిరంగంగా గొర్రెలు, మేకలు, పశువులను వధించడం చేసినా.. నాలాపై అక్రమంగా భవనాన్ని నిర్మించినా రూ. రెండు వేల అపరాధ రుసుము విధిస్తారు. నిషేధిత ప్రాంతంలో చెత్తను కాల్చడం, పారవేయడం, రోడ్డును ఆక్రమించి గోడను నిర్మించడం, ఇనుప కంచె ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘలనకు రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. ఇళ్ల లేఔట్లకు ఆన్లైన్ అనుమతులు గ్రామాల్లో ఇళ్ల లేఔట్ల అనుమతుల జారీ కోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తోంది. ఇళ్ల స్థలాల లేఔట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసిన వారంలోగా సాంకేతిక మంజూరు విభాగానికి పంపాలి. అలా పంపకపోయినా పంపినట్టే పరిగణిస్తారు. సాంకేతిక విభాగం అన్ని అంశాలను పరిశీలించి 30 రోజుల్లోగా పంచాయతీకి వివరణ ఇవ్వాలి. అనంతరం ఏడు రోజుల్లోగా లేఔట్ యజమానికి గ్రామ పంచాయతీ సమాచారం ఇవ్వాలి. 300 చదరపు గజాల్లో 10 మీటర్ల ఎత్తుకు మించని జీ ప్లస్ టు భవనాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇస్తాయి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే అనుమతి లభించినట్లుగా భావించాల్సి ఉంటుంది. -
పంచాయతీల్లో ఆకలి కేకలు..!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని పంచాయతీల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. 3 నుంచి 11 నెలల వరకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కందులాపురం పంచాయతీలో 9 నెలలు, కంభం పంచాయతీలో 3 నెలలు, వై.పాలెంలో 7 నెలలు, త్రిపురాంతకంలో 6 నెలలు, దోర్నాలలో 5 నెలలు, దర్శి, కురిచేడు పంచాయతీలలో ఐదు నుంచి ఆరు నెలల వరకు కార్మికులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కరేడు పంచాయతీలో 6 నెలలు, ఉలవపాడులో 3 నెలలు, సింగరాయకొండలో 5 నెలలు, మూలగుంటపాడులో 5 నెలలు, ఎన్జీపాడులో 4 నెలలు, బి.నిడమానూరు పంచాయతీలో 11 నెలల వరకు వేతన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాకుండా ఇంకా జిల్లాలోని చాలా పంచాయతీల్లో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు అందటం లేదు. నెలల తరబడి జీతాలు అందకపోవడం, దుకాణాలలో బకాయిలు పెరిగిపోవడంతో అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. నిద్రలేచి పంచాయతీలను శుభ్రం చేస్తున్నా కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారంటూ సీఐటీయూ నాయకుల పివి శేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఎన్ఎస్ఎస్వీ ప్రసాద్కు వినతిపత్రం ఇచ్చారు. వేతనాలపై ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ కార్మికులకు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రోజు వారి వేతనం రూ.386 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంటే నెలకు రూ.11, 580 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప పారిశుద్ధ్య పనిలో ఉన్న కార్మికుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక లేకపోవడం దారుణమని అన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 1028 పంచాయతీలలో కార్మికుల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మికులను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
కొత్త పంచాయతీల ఏర్పాటుపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్/ఇందూరు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లో సమీక్షించారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఎం.రామ్మోహన్రావు, సత్యనారాయణ, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కొత్త పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి పంపిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని మంత్రి ఎమ్మెల్యేలు, కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించారు. -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
పాలన లేని పల్లెలేల..!
సాక్షి, హైదరాబాద్: పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు గ్రామ పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తామంటోంది. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తామని పేర్కొంటోంది. కానీ పంచాయతీల పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల నియామకంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికీ 30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక రూపకల్పన చేసే, పథకాలు అమలు చేసే నాథుడు లేక పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు తాజాగా 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపబోతోంది. పన్నెండు వేలకు పెరగనున్న పంచాయతీలు రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలుండగా.. 5,065 గ్రామ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాలన సౌలభ్యం కోసం పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 5,500 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3,519 మంది కార్యదర్శులే పని చేస్తుండటంతో.. క్లస్టర్లతోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలనూ అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలొచ్చాయి. ప్రతిపాదనలు ఆమోదిస్తే పంచాయతీల సంఖ్య 12,806కు పెరుగుతుంది. దీంతో సగటున 3, 4 గ్రామాలకు ఒకరు చొప్పున కార్యదర్శిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామాల పాలన ఇబ్బందిగా మారుతుంది. ప్రణాళిక రూపకల్పన, పన్నుల వసూలు, నిధుల ఖర్చు తదితరాలపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖలో డిమాండ్ వినిపిస్తోంది. -
3 కేంద్రాల్లో సర్పంచ్ల సమ్మేళనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో సర్పంచ్ల సమ్మేళనాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్) సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి 100 మంది సర్పంచ్లను ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నారు. వీటిలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ల అనుభవాలు పంచుకుంటారు. ఈ నెల 23న మహబూబ్నగర్లో, 27న వరంగల్లో, మార్చి 5న నిజామాబాద్లో సమ్మేళనాలను నిర్వహించనున్నారు. సమ్మేళనాల్లో పాల్గొనే జిల్లాలివీ.. జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, మే డ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచ్ల సమ్మేళనాన్ని మహబూబ్నగర్లో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదా ద్రి భువనగిరి జిల్లాల సమ్మేళనం వరంగల్లో జరగనుంది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల సమ్మేళనం నిజామాబాద్లో నిర్వహించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యే ఈ సమ్మేళ నాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీశాట్ చానల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల ప్రసారాలను ఈ నెల 24న మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు. -
పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్లు ఏ కారణంతోనైనా అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో వరుసగా నాలుగోరోజు గురువారం సమావేశమైంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచాలనుకుంటున్న పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు సర్పంచ్లు ఏదైనా కారణంతో అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రే వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిపై రాజకీయ ఒత్తిళ్లు, ఇతర సమస్యలు వస్తున్నాయనే కారణంతో పంచాయతీలకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా వ్యవహరించవచ్చని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే జరిమానా విధించే హక్కును కూడా సర్పంచ్ నేతృత్వంలోని పాలకవర్గానికి కల్పించే అంశంపై చర్చించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారం..: రోడ్లపై చెత్తవేయడం, ఇంట్లోని మురుగునీటిని వీధుల్లోకి వదలడం, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంవంటి 22 అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాలను గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పంచాయతీ పాలకవర్గమే జరిమానా విధించే అంశంపై చర్చ జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్రమ నిర్మాణాల్లాంటివి చేపడితే వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా కారకుల నుండే వసూలు చేసే అంశాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, దానిని సరిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వ్యయం, పన్నుల వసూళ్లు.. లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలనే నిబంధనను చట్టంలో పొందుపరిచే అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించుకోవాలనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. సరిగ్గా పనిచేయని కార్యదర్శులను సరెండర్ చేసే అధికారాన్ని పాలకవర్గానికి కట్టబెట్టే దిశగానూ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పిల్లలున్నా పోటీ అర్హత ఉండాలి: గాంధీ నాయక్ వినతి ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతగా ఉన్న నిబంధనను సవరించాలని గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ కోరారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి వీలులేదనే నిబంధనను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. -
పక్కా లోకల్ !
-
గూడెం, తండా.. పంచాయతీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా, గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్ణీత గడువులోగానే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు కొత్త చట్టానికి లోబడి పనిచేసేందుకు వీలుగా రూట్మ్యాప్ను సిద్ధం చేసింది. పరిపాలనలో విశేష అనుభవమున్న అధికారులు, న్యాయ కోవి దులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలను, చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని... ప్రధాన గ్రామానికి దూ రంగా ఉండి పంచాయతీగా లేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు అత్యుత్తమ సేవలందించేలా మున్సిపాలిటీలను తీర్చిదిద్దడానికి కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తేవాలని తీర్మానించింది. సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరిగింది. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 11 వరకు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో.. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు. ఇటీవల జారీ చేసిన పలు ఆర్డినెన్సులను ఆమోదించారు. విప్లవాత్మకంగా కొత్త చట్టం కొత్తగా తెచ్చే పంచాయతీరాజ్ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులతో పాటు వారు నిర్వహించే విధుల విషయంలోనూ స్పష్టత ఇచ్చేలా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయతీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు పొందుపరచాలని సీఎం ప్రతిపాదించగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని... కొత్త చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పడు వ్యవహరించినట్టుగానే.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి ఆమోదం వివిధ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అందిన దాదాపు పన్నెండు ఉద్యోగ సంబంధిత అంశాలను పరిశీలించింది. గతం లో ప్రభుత్వం అనుమతించిన ఉద్యోగాలకు ఆమోదంతోపాటు కొత్తగా మరికొన్ని పోస్టులకు అనుమతి తెలిపింది. బీబీనగర్ నిమ్స్కు 800 పోస్టులతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులు, వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయపాలెం, జాఫర్ఘడ్, వీపనగండ్ల, మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తూ వాటిలో మరో 300 కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, నీటిపారుదల ప్రాజెక్టు లు, వాటికి అవసరమైన భూసేకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతితో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జారీ చేసిన 8 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టా దారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమిం గ్ చట్టం, వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్స్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. కాళేశ్వరం మార్పులకు గ్రీన్సిగ్నల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్పుల కారణంగా సవరించిన అంచనాలకు ఓకే చేసింది. దీంతోపాటు కాళేశ్వరం లింక్–2 పనుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ.11 వేల కోట్ల రుణం తీసుకుంటూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల పరిధిలో ముంపు, అటవీ ప్రాం తాల కారణంగా చిన్నపాటి మార్పులు జరిగా యి. దీంతో గతంలో నిర్ణయించిన అంచనాల ను స్వల్పంగా పెంచారు. పాత ప్రాణహిత–చేవెళ్ల డిజైన్లో మెదక్, రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన 4 ప్యాకేజీలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మిషన్ భగీరథకు అనుసంధానించి 31 పట్టణ, స్థానిక సంస్థల పరిధిలోని 9,078 గ్రామీణ ఆవాసాలకు 39.43 టీఎంసీల నీటిని అందించే ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు కేబినెట్ సబ్ కమిటీలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. వ్యవసాయాధికారులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం రైతు సమన్వయ సమితులను వినియోగించుకునే పద్ధతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం నేతృత్వంలో మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి కేబినెట్ భేటీలో తొలుత శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లు లు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి చివరి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త పంచాయతీరాజ్ చట్టం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, శివా రు పల్లెలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించడం, గ్రామాలకు నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం, వాటికి విధులు నిర్దేశించడం తదితర అంశాలపై మంత్రులు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 8 ఆర్డినెన్స్ బిల్లులకు ఓకే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్ చట్టం, వ్యాట్, దుకాణాలు – సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితర ఆర్డినెన్స్లు ఇందులో ఉన్నాయి. ఇక వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. -
నిధుల రికవరీకి చర్యలు
- 28 పంచాయతీల్లో సర్చార్జీ సర్టిఫికెట్ల జారీ - స్పెషల్ డ్రైవ్కు స్పందించని 4 మార్కెట్ కమిటీలు - స్టేట్ ఆడిట్ జిల్లా అధికారిణి శ్యామలా జ్యోతి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 28 పంచాయతీల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీ కోసం సర్చార్జీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు స్టేట్ ఆడిట్ జిల్లా అధికారిణి శ్యామలజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 28 పంచాయతీలకు సంబంధించి రూ.13.09 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలిందన్నారు. ఈ నిధులను తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరడంతో పాటు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లా పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థ. సైనిక్ వెల్పేర్, ఉపాధి కల్పన సంస్థ, మార్కెట్ కమిటీలు, అఫీషియల్ రిసీవర్, ఈ-సేవలు, రైతుబజార్లలో ఆడిట్ పూర్తయిందన్నారు. నెల రోజులుగా పంచాయతీలు, మండల çపరిషత్ల్లో ఆడిట్ చురుగ్గా సాగుతోందన్నారు. మార్కెట్ కమిటీల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఇటీవలే స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, అయితే ఆత్మకూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలు మార్కెట్ కమిటీలు స్పందించలేదని తెలిపారు. నంద్యాల, ఆదోని, ఆలూరు, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీలు మాత్రం స్పందించాయని, పలు అభ్యంతరాలకు జవాబులిచ్చి పరిష్కరించుకున్నారని శ్యామలాజ్యోతి తెలిపారు. -
కుటుంబం కళ్లెదుట రేప్ చేయాలని తీర్పు
పంజాబ్ ప్రావిన్సు, పాకిస్తాన్: అన్నయ్య చేసిన తప్పుకు చెల్లెలి జీవితం బలైంది. ఉమర్ వడ్డా అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ముజఫరాబాద్ ప్రావిన్సులోని తన స్వగ్రామం రాజ్పూర్ చెందిన ఓ అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయితీని ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న పంచాయితీ పెద్దలు ఉమర్ చెల్లెల్ని ఆమె కుటుంబం చూస్తుండగా రేప్ చేయాలని బాధితురాలి సోదరుడు అష్ఫాక్ను ఆదేశించింది. పెద్దల తీర్పును ఉమర్ తల్లిదండ్రులు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దీంతో అష్ఫాక్ ఆమె కుటుంబం ముందే బాలిక(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కళ్లెదుట కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతుంటే ఏమి చేయలేకపోయామని, తప్పు చేసిన వారిని, తీర్పు చెప్పిన వారిని శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లైంగికదాడులకు పాల్పడిన ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. తీర్పు చెప్పిన 30మంది గ్రామపెద్దలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఆదాయం పెరిగినా.. సమస్యలే సమస్తం
- పంచాయతీల దుస్థితి - పన్నుభారం మోపినా అదే పరిస్థితి - పాలకవర్గాలు లేనిచోట మరింత అధ్వానం - పట్టించుకునే నాథుడే కరువు అమలాపురం : పంచాయతీల్లో ఇంటి పన్నుతోపాటు పనిలో పనిగా ఆస్తి విలువ కూడా పెంచిన చంద్రబాబు సర్కారు సామాన్యులపై మోయలేనంత భారం మోపింది. ఇలా పన్నులు పెంచడం ద్వారా పంచాయతీల సాధారణ నిధులు పెరుగుతాయని, చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే పెంచిన పన్ను మొత్తాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్న పంచాయతీ పాలకులు, అధికారులు.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కోటి రూపాయల ఆదాయం పెరిగిన పంచాయతీల్లో సహితం వేల రూపాయల్లో ఖర్చయ్యే పనులు కూడా చేపట్టడం లేదు. ప్రజారోగ్యానికి కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి డ్రైన్ల ఆధునికీకరణ వంటి వాటిని పట్టించుకోవడంలేదు. రోడ్ల గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గోతులు పడి, కొద్దిపాటి వర్షానికే అవి బురదమయమవుతున్నాయి. చాలా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీరందడంలేదు. విద్యుద్దీపాలు కూడా వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పట్టణాలకన్నా నగరాలను ఆనుకొని ఉన్న పంచాయతీల్లో అపార్ట్మెంట్లు, భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైవేలు, ప్రధాన రహదారులకు చేరువలో కమర్షియల్ కాంప్లెక్సులు సహితం ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. విచిత్రంగా ఇక్కడే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఆయా పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అక్కడ ఎన్నికలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అధికారుల పాలనే సాగుతోంది. ప్రజల తరఫున ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. అనపర్తి మేజర్ పంచాయతీ పరిస్థితి కూడా అంతే. వందలు, వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంచాయతీ చూసినా సమస్యలే.. - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను ఆనుకొని ఉన్న పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం నగర విస్తరణ అంతా పంచాయతీల్లోనే సాగుతోంది. ముఖ్యంగా హకుంపేట, ధవళేశ్వరం, బొమ్మూరు, కోలమూరుల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది. ఇంటి పన్నులు పెంచడంతో ›ప్రతి పంచాయతీ ఆదాయం రూ.కోటికి పైగా పెరిగింది. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రధాన డ్రైన్ల నిర్మాణం జరగడం లేదు. దీంతో జనావాసాలను మురుగునీరు ముంచెత్తుతోంది. ఈ పంచాయతీలకు పాలకవర్గం లేదు. నగరంలో విలీన ప్రతిపాదనతో ఈ పంచాయతీలకు ఎన్నికలు లేవు. అధికారుల పాలనలో వీటిల్లో అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది. - కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆదాయం రూ.3 కోట్లకు చేరింది. ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, తూరంగి పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయంతోపాటు ఈ గ్రామాల్లో సమస్యలు కూడా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. రమణయ్యపేటలో డ్రైనేజీ సమస్యల తీవ్రంగా ఉంది. నూతన నిర్మాణాలకు అనుగుణంగా ఇక్కడ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు రహదారులు ముంపునకు గురవుతున్నాయి. - అనపర్తి పంచాయతీకి ప్రస్తుతం పాలకవర్గం లేదు. దీనిని ప్రభుత్వం నగర పంచాయతీగా ప్రకటించగా, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు లేకుండాపోయాయి. ఒకవిధంగా ఇది మున్సిపాలిటీతో సమానం. అధికారుల పాలన పుణ్యమా అని స్థానికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. - సామర్లకోట మండలం వేట్లపాలెంలో పంచాయతీ ఆదాయం గతంలో రూ.52 లక్షలు కాగా, ఇప్పుడు ఆదాయం రూ.1.20 కోట్లు. ఆదాయం రెట్టింపైనా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. - అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీ ఆదాయం రూ.8 లక్షలు కాగా, ఇప్పుడు ఏకంగా ఐదురెట్లు పెరిగి రూ.40 లక్షలు అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కామనగరువు పంచాయతీ ఆదాయం రెండు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. - జిల్లాలోని కీలకమై గ్రామ పంచాయతీల్లో రావులపాలెం ఒకటి. కోనసీమకు ఒకవిధంగా వాణిజ్య రాజధాని. ఈ పంచాయతీ ఆదాయం రూ.1.24 కోట్లకు పెరిగింది. ఇక్కడ ప్రధాన డ్రైన్, దాని నిర్వహణ తీరు చూస్తే ప్రజలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పట్టణంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. -
బెడిసిన పెద్దల పంచాయితీ
- రెండు రోజుల క్రితం వివాహిత ఆత్మహత్య - రెండు కుటుంబాల మధ్య రాజీతో గుట్టుగా ఖననం - కుమారుడి పేర పొలాన్ని రాసివ్వని భర్త కుటుంబీకులు - పోలీసులను ఆశ్రయించి మృతురాలి బంధువులు - నేడు మృతదేహానికి పోస్టుమార్టం గూడూరు: వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలో పెద్దల పంచాయితీ బెడిసికొట్టింది. భర్త తరపు కుటుంబీకులు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించక పోవడంతో మృతురాలి బంధువులు పోలీసులు ఆశ్రయించారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ పంచాయతీ మజరా గ్రామమైన వై.ఖానాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వై.పవన్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన ఉప్పరి మల్లికార్జున, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె కల్యాణి (20)కి వై.ఖానాపురం గ్రామానికి చెందిన ఊరిమిండి గిడ్డయ్య మనవడు వీరేష్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. కల్యాణి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే భార్యాభర్తలు మధ్య మనస్పర్థలతో తరచూ ఘర్షణ పడేవారు. అలాగే భర్త, అత్త, మామ, ఆడపడుచులు వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్యాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పంచాయితీలో ఒప్పుకున్నారు.. తర్వాత కాదన్నారు.. కల్యాణి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు వై.ఖానాపురానికి వెళ్లి గొడవకు దిగారు. అయితే కొంత మంది పెద్దలు పంచాయితీ చేసి మృతురాలి కుమారుడి పేరు మీద 8 ఎకరాల పొలం రాసి ఇవ్వాలని, నష్టపరిహారంగా ఇచ్చిన కట్నకానుకలకు అదనంగా మరికొంత ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం దహన సంస్కారాలు చేశారు. అయితే ఒప్పందం మేరకు సోమవారం కుమారుడి పేరున పొలాన్ని రాసివ్వడానికి బాలుడి తండ్రి నిరాకరించడంతో మృతురాలి బంధువులు గొడవకు దిగారు. జరిగిన సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనపై ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా తహసీల్దార్ సమక్షంలో మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి..
పట్నా : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. 100మంది వరకు గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గోపినాథ్ పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్ల మహిళ తమ పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంటున్నానని చెప్పినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్పుర్ నుంచి సితామర్హికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. -
డీపీఓ కావలెను
- రెండేళ్లుగా ఇన్చార్జిలతోనే సరి - గుట్టలుగా పేరుకుపోతున్న ఫైళ్లు - ఏ అనుమతి కావాలన్నా కలెక్టరేట్కే.. - 3 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్న కార్మికులు బోట్క్లబ్ (కాకినాడ) : పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) లేకపోవడంతో జిల్లాలో గ్రామ పరిపాలన గాడి తప్పుతోంది. ఇక్కడ డీపీఓ పని చేసిన ఆనంద్ 2015 జూలైలో బదిలీ అయ్యారు. అప్పటి నుంచీ ఈ స్థానాన్ని ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. వారు కూడా కార్యాలయానికి సక్రమంగా రాకపోవడంతో ఫైల్స్ పెండింగ్లో ఉంటున్నాయి ఇన్చార్జిలను సహితం మారుస్తున్నప్పటికీ పాలన గాడిలో పడడం లేదు. ఆనంద్ బదిలీ తరువాత నుంచి ఇప్పటివరకూ నలుగురు ఇన్చార్జ్ డీపీఓలుగా పని చేశారు. ఆనంద్ బదిలీ అయిన వెంటనే జిల్లా సహకార అధికారి ప్రవీణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సుమారు ఆరు నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా డీపీఓ కార్యాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో ఫైల్స్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీనిపై అప్పట్లో ‘ఇన్చార్జి పాలనతో అవస్థలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి, అమలాపురం డీఎల్పీఓ శర్మను ఇన్చార్జ్గా నియమించారు. ఆయన సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ఆరు నెలల తరువాత జెడ్పీ సీఈఓ పద్మకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్లో పని భారం ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా డీపీఓ కార్యాలయంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో ఆమెను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించి రంపచోడవరం గిరిజన సంక్షేమ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న టీవీఎస్జీ కుమార్ను ఇన్చార్జిగా నియమించారు. ఆరు నెలలుగా ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పెండింగ్ ఫైళ్లకు మోక్షమెప్పుడో! జిల్లాలోని మేజర్ పంచాయతీలు మినహా మైనర్ పంచాయతీల్లో రెగ్యులర్ సిబ్బంది ఉండరు. దీంతో అక్కడ కాంట్రాక్టు సిబ్బందితో పారిశుద్ధ్యం, ట్యాంకు వాచర్లు, బిల్లు కలెక్టర్ల వంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. వారికి జీతభత్యాలు చెల్లించేందుకు అనుమతి కోరుతూ డీపీఓకు పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా ఫైల్ పెడతారు. డీపీఓ అనుమతి లేనిదే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్చార్జ్ డీపీఓ కావడంతో ప్ర ఫైలునూ కలెక్టర్ అనుమతి కోసం పంపుతున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆ ఫైళ్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న 500 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ జీతం చెల్లించాలి. తమకు జీతాలు చెల్లించాలని పంచాయతీ అధికారులపై కాంట్రాక్టు సిబ్బంది ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు డీపీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడంలేదు. వేరే శాఖ అధికారి వల్ల ఇబ్బందులు జిల్లాలో ఐదుగురు డివిజనల్ పంచాయతీ అధికారులుండగా వారికి కాకుండా వేరే శాఖకు చెందిన వారికి ఇన్చార్జి డీపీఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి గ్రామ పరిపాలనపై సరైన అవగాహన లేనందువల్లనే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయన్నది సిబ్బంది వాదన. రెగ్యులర్ డీపీఓను నియమిస్తే తప్ప తమ ఇబ్బందులు తొలగవని వారంటున్నారు. ప్రస్తుతం కడప డీపీఓగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొందరు ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. -
పంచాయతీ మైనర్ ... అవినీతిలో మేజర్
- ఓ గ్రామ కార్యదర్శి లీలలు - తొట్టి రిక్షా బయట రూ.10 వేలు ... కొనుగోలు రూ 25 వేలు - రెండు గంటల గ్రామ సభకు రూ 14 వేలు వ్యయమట...! - మూడేళ్లలో రూ.3 కోట్లు దుర్వినియోగమంటూ ఆరోపణలు - నాగులాపల్లి పంచాయితీలో నిధుల దుర్వినియోగం - డీపీఓ విచారణలో లెక్కతేలని రూ.లక్షల నిధులు పిఠాపురం: రూ. 10 వేలు కూడా విలువ చేయని తొట్టి రిక్షా రూ. 25 వేలు ... రెండు గంటల గ్రామ సభకు ఖర్చు రూ.14 వేలు ... వాటర్ ట్యాంక్ క్లీనింగ్కు రూ. 2,400...ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ లెక్క చూసినా చుక్కలు కనిపించేలా అందినంతా దోచుకున్నారు కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీ అధికారులు. ఒక్కరు తప్ప అందరూ మహిళలే ఉన్న పాలకవర్గంగా ఉన్న ఈ పంచాయతీకి గ్రామ కార్యదర్శిగా ఉన్న వరలక్ష్మి అవినీతికి అంతూపొంతూ లేకుండా పోయిందన్న దానికి బయటపడుతున్న వ్యవహారాలే. క్రయ, వ్యయాలకు సంబంధించిన ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని కార్యదర్శిని ప్రశ్నించినా అదే సమాధానం చెబుతుండడంతో విస్తుపోవడం దర్యాప్తు అధికారుల వంతవుతోంది. రూ 3 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని, తమ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ పాలక వర్గం జిల్లా కలెక్టరుకు జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోగుట్టు బట్టబయలైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ టీవీఎస్జీ కుమార్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. . ఏ పుస్తకం లేని వైనం... పంచాయతీ సర్పంచి సత్యరత్నం, ఉప సర్పంచి సుభాషిణి మరో 12 మంది వార్డు సభ్యులుగా ఉన్న గ్రామ కార్యదర్శి చేసిన అక్రమాలపై డీపీఓ కుమార్ అడిగిన వివరాలేవీ కార్యదర్శి అందజేయలేదు. పంచాయితీకి చెందిన మినిట్స్ బుక్తోపాటు ఇతర నిధుల వినియోగంపై రికార్డులను అడగ్గా లేవని ఓసారి, పోలీసులకు ఇచ్చానని మరోసారి, తన దగ్గరే ఉన్నాయని ... కొన్ని పుస్తకాలు కనిపించడం లేదని మరోసారి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. . పొంతనలేని లెక్కలు... తొట్టిరిక్షా కొనుగోలుకు రూ.25 వేలు, పాత రిక్షా మరమ్మతులకు రూ.25 వేలకుపైగా, వాటర్ ట్యాంకు క్లీనింగ్కు రూ. 2,400, దండోరా వేయించడానికి రూ. వేల ఖర్చు, ఒక టెంటు వేసి రెండు గంటలపాటు నిర్వహించే గ్రామ సభకు రూ.14 వేలు ఖర్చయినట్లు రికార్డులు చూపించడం ... ఆ పుస్తకాల్లో కూడా క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ పేజీల్లో ఇరికిండచం ... మధ్య,మధ్యలో వదిలేయడంతో పలు అనుమానాలకు తావుతీస్తోంది. గ్రామ సభలే పెట్టకుండా ఖర్చులు ఎలా చూపించారని దర్యాప్తు అధికారుల ప్రశ్నకు సమాధానం లేదు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో పలు అవకతవకలు బయటపడగా విచారణ నివేదికలు జిల్లా కలెక్టరుకు అందజేస్తామని డీపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎం.నాగలక్ష్మి, ఎంపీడీఓ పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జీతం మూరెడు.. చాకిరీ బారెడు
నెలలు తరబడి వేతన బకాయిలు సమస్యల నడుమ పంచాయతీ సిబ్బంది జీవితాలు నేడు డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు రంగం సిద్ధం కపిలేశ్వరపురం(మండపేట): చీకటితో లేస్తారు..చీపురుతో ఊరంతా ఊడుస్తారు.. గ్రామస్తులు నిద్ర లేచే సరికి ఊరును అద్దంలా ఉంచుతారు.. వారికి అందుబాటులో తాగునీరును సిద్ధం చేస్తారు.. అధికారులు పర్యటనకు వస్తే ఉరుకులు పరుగులు తీస్తూ మర్యాదలు చేస్తారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు.. ఇంతటి సేవ చేస్తున్న పంచాయతీ వర్కర్లను ప్రభుత్వం విస్మరిస్తోంది. కనీసం ఇచ్చే అరకొర జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా నెలలు తరబడి బకాయిలు పెడుతోంది. పారిశుద్ధ్య కార్మికులు, ట్యాంక్ వాచ్మెన్, బిల్ కలెక్టర్ తదితర సిబ్బంది పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల సాధన కోసం నేడు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 1,100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్ వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరి పనిచేస్తున్న ప్రాంతాల్లో వీరి సంఖ్య పరిమితంగా ఉండటంతో ఎక్కువ పనిగంటలు, అధిక పనిభారం మోస్తున్నారు. అరకొర వేతనాలు కార్మికులకు 2014లో జారీ చేసిన జీవో 11 ప్రకారం పంచాయతీ ఆర్థిక వనరులను బట్టి జీతాలిస్తున్నారు. రూ.వెయ్యి నుంచి ఏడు వేలు లోపే చాకిరీకి జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో 151 ప్రకారం స్వీపర్లుకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17వేలు వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కాస్తా నెలలు తరబడి బకాయి పెడుతున్నారు. ఇంతలో కుటుంబ పోషణ కోసం బయట అప్పులు చేస్తున్నారు. వచ్చే జీతంలో అధిక మొత్తం వడ్డీలకే సరిపోతుందని సిబ్బంది వాపోతున్నారు. రిజిస్టర్లో పేరు లేకుండా వేతనాల చెల్లింపు ఇచ్చే జీతాలు చాలా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుని పేరున తీర్మానం చేసి ఇవ్వడం లేదు. కార్మికుల జీతాలు కోసం అంటూ మూకుమ్మడి తీర్మానాలు చేస్తున్నారు. దీంతో కార్మికులకు పంచాయతీలో పని చేస్తున్నట్టు, జీతం తీసుకుంటున్నట్టు ఆధారం లేని పరిస్థితి నెలకొంటుంది. ఈ వేతనాలను కూడా 010 పద్దు పద్ధతిలో చెల్లించాలని కోరుతున్నారు. అమలుకాని డీఎల్పీఓ అత్యవసర ఉత్తర్వులు సమస్యలపై సీఐటీయూ అనుబంధ ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. పలు అంశాలపై రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి 956/015ఎ నంబరుతో 2015 డిసెంబర్ 16న అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వమని, వేతనాలు తీర్మానం రాసేటప్పుడు కార్మికుని పేరు ఒక్కాణించి రాయాలని, ఈఎస్ఐ, పీఎఫ్లను అమలు చేయాలని, పోస్ట్ శాంక్షన్ ఆర్డర్లు రెన్యువల్ను క్రమం తప్పకుండా పై అధికారులకు పంపించాలని, జనశ్రీ బీమా పథకం అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను చాలా పంచాయతీల్లో అమలు చేయడం లేదు. పదోన్నతులు కల్పించాలి క్షేత్రస్థాయిలో వాచ్మెన్, స్వీపరు, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లానే పంచాయతీరాజ్ శాఖలో కూడా పదోన్నతులివ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో 2008లోని జీవో 30, 2011లోని జీఓ 1866లు ప్రకారం ఐదేళ్ల సర్వీసు ఉండి పది, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గ్రామ సేవకులకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. అదే పద్ధతిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను కూడా పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమరానికి సన్నద్ధం సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్మికులు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మండలస్థాయిలో నిరసన కార్యక్రమాలు అనంతరం కాకినాడ డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. డిమాండ్లు ఇవీ... 2012 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలి. జీఓఎంఎస్ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని, జీతాలు పెంపుదలకు ఆటంకంగా ఉన్న 30 శాతం నిబంధనను తొలగించాలని, బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని, ఎన్ఎంఆర్, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు పంచాయతీ పాలకవర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, హైకోర్టు ఉత్తర్వులు మేరకు టెండర్ విధానాన్ని ఆపాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రమాదబీమా సదుపాయాలు కల్పించాలని, డిగ్రీ పూర్తి చేసిన కార్మికులను పంచాయతీ కార్యదర్శిగా నియామకాలు చేపట్టాలని, పర్మినెంట్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హామీని తుంగలో తొక్కారు పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్దతుల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేస్తామంటూ ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు పాలన పూర్తవుతున్నా హామీ అమలు ఊసెత్తడంలేదు. - నిమ్మకాయల భీమేశ్వరరావు, ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్, అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి -
ఇటా.. అటా..
విలీన ‘పంచాయితీ’ - ఎటపాక మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలపై గందరగోళం - తమకే దక్కుతాయంటున్న తెలంగాణ ప్రభుత్వం - ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు - సానుకూలంగానే ఉన్న కేంద్రం? నెల్లిపాక : రాష్ట్ర విభజన చిక్కులు ఎటపాక మండలాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 21 పంచాయతీలకు ఎటపాకను మండల కేంద్రంగా ప్రకటించడంతోపాటు విలీన మండలాలకు డివిజన్ కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రెండేళ్లు కావస్తోంది. విభజన జరిగినప్పటి నుంచి నేటివరకూ ఈ ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతనే ఉంది. కొన్నాళ్ల నుంచి మండల వాసులను మరో సమస్య వెంటాడుతోంది. భద్రాచలం పట్టణానికి సమీపాన ఉన్న ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్టణం, గుండాల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఐదింటినీ తిరిగి తెలంగాణలో కలపనున్నారనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ç ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు అనేకసార్లు చెప్పారు కూడా. ఈ ఐదు పంచాయతీలూ తెలంగాణలో తిరిగి విలీనం కానున్నాయని, ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణ సమస్య ఇదీ.. - ఎటపాక మండలంలోని ఈ ఐదు పంచాయతీలను తెలంగాణ పరిధిలోకి తీసుకురావడం ద్వారానే భద్రాచలం అభివృద్ధి సాధ్యపడుతుందన్నది ఆ రాష్ట్ర పాలకుల అభిప్రాయం. - ఈ ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాలున్నాయి. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామాల జనాభా 15,041. - భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతమైన దుమ్ముగూడెం వెళ్లాలంటే పట్టణానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఎటపాక మీదుగా కన్నాయిగూడెం దాటి 8 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గంలో భద్రాచలం నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ పరిధిలోని రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేస్తే తెలంగాణ వాసులకు రహదారి సమస్య తలెత్తనుంది. - అంతేకాకుండా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 900 ఎకరాల భూమి ఈ పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్టణంలోనే ఉంది. రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో ఉండటం ఆ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనేది వాదన. - భద్రాచలం పట్టణానికి ఓపక్క గోదావరి నది ఉంది. పట్టణం అభివృద్ధి చెందాలంటే రెండోపక్కనే జరగాలి. కానీ, ఇటువైపు ఉన్న ప్రాంతం ఏపీలో ఉంది. ఇది పట్టణాభివృద్ధికి అవరోధంగా మారింది. - వీటన్నింటి నేపథ్యంలో ఈ ఐదు పంచాయతీలను తిరిగి కలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆంధ్రా సమస్య ఏమిటంటే.. - పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దున ఉన్న అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట (కొంత భాగం), నారాయణపురం, గుమ్మడవల్లి, ఆసుపాక, ఊట్లపల్లి గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. దీనివలన ఏపీకి రహదారి సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. - ఈ కారణంగా ఈ ఐదు పంచాయతీలను ఏపీలో కలుపుకొని, ఎటపాక మండలంలోని ఐదు పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. - మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు మండలం నుంచి ఐరన్ ఓర్ను తరలించాలంటే తెలంగాణలోని ఐదు పంచాయతీల మీదుగానే వెళ్లాలి. అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తే ఏపీ నుంచి వెళ్లే వాహనాలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. - ఈ కారణాలతో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. - ఈ సమస్యపై ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు. - ఇదే నిజమైతే ఎటపాక మండలం కేంద్రం మళ్లీ నెల్లిపాకగా మారనుంది. - ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సమస్య ముందుకు రావడంతో పాలన తిరిగి కుంటుపడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ?
50 శాతమే వసూలు చేయాలన్న కోర్టు! తుది తీర్పును అనుసరించి తదుపరి చర్యలు రాజానగరం : ఇంటి పన్నులను భారీగా పెంచుతూ పంచాయతీ అధికారులు తీసుకున్న నిర్ణయం నుంచి రాజానగరం మండలం, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు కాస్త ఊరట లభించినట్టే. పెంచిన పన్నుల విధానాన్ని సవాల్ చేస్తూ కొంతమంది గ్రామస్తులు మాజీ సర్పంచ్ మెట్ల ఏసుపాదం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వారి పిటిష¯ŒSను స్వీకరించిన హైకోర్టు పెంచిన పన్నుల్లో ప్రస్తుతం 50 శాతమే కట్టించుకోవాలని ప్రాథమికంగా సూచించినట్టు కోర్టును ఆశ్రయించిన వారు చెబుతున్నారు. దీంతో కోర్టు నిర్ణయంపై లాలాచెరువు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి విలువ బట్టి పెంపు ఇంటి పన్నుల పెంపు విధానం జిల్లా అంతటా ఒక విధంగా ఉంటే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రం ప్రత్యేకంగా అమలు చేశారు. పంచాయతీల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా పెరిగిన ఇంటి పన్నుల విధానంలో సబ్రిజిస్ట్రార్లు ఇచ్చిన భూమి విలువను బట్టి ఇంటి పన్నులను పెంచారు. భూమి విలువపై రూ.వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను లెక్కించి డిమాండ్ నోటీసులు అందజేశారు. లాలాచెరువుకు ప్రత్యేక వడ్డింపు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రం 20 పైసలు చొప్పున లెక్కించి ఇంటి పన్నును నిర్ణయించడంతో సాధారణ ఇంటికి కూడా వేల రూపాయల్లో ఇంటి పన్ను వచ్చింది. మొన్నటి వరకు రాజమహేంద్రవరం మున్నిపల్ కార్పొరేష¯ŒSలో విలీన గ్రామాలుగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని 21 పంచాయతీలపై ప్రత్యేకాధికారిగా ఉన్న నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు లాలాచెరువులో భూమి గజం విలువపై రూ.వెయ్యికి 20 పైసలుగా లెక్కించినట్టు సంబంధిత అధికారి తెలిపారు. ఈ పెంపు విషయంమై స్థానిక ప్రజానీకం ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. లాలాచెరువుపైనే ఎందుకో.. జిల్లాలో ఏ పంచా యతీ విషయంలో లేనివిధంగా లాలాచెరువు పంచాయతీపై అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారో జనానికి అర్థం కావట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఇవతల వైపు ఉన్న లాలాచెరువులో గజం రూ.5000, అవతల ఉన్న దివా¯ŒSచెరువు పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రీస్ ఏరియాగా ఉన్న రూపానగర్, స్వరూపానగర్లలో రూ.3000లుగా సబ్రిజిస్ట్రార్ భూమి విలువను నిర్ణయించారు. జిల్లా అంతటా గజం విలువపై వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను వేస్తే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో 20 పైసలు వేశారు. స్థిరమైన మార్గదర్శకాలు లేకుండా ఏవిధంగా ఈ వివక్షను చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. అలాగే మా కాలనీలో అన్ని ఇళ్లకు ట్యాప్లు ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి వాటర్ టాక్స్ ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. అయినా ఇంటి పన్నులో మరోసారి వాటర్ టాక్స్ వేశారు. – మెట్ల ఏసుపాదం, మాజీ సర్పంచ్, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ -
అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ
కమర్షియల్ కాంప్లెక్స్లకు సాధారణ పన్నులు పేదప్రజలపై భారీగా పన్నుల మోత ఇంటి నిర్మాణ అనుమతుల్లోనూ భారీ అవకతవకలు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ధవళేశ్వరం : ధవళేశ్వరం పంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బుధవారం ఆమె ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడి అవకతవకలపై కార్యదర్శి టి.శ్రీనివాసరావును నిలదీశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి డెత్ సర్టిఫికేట్ నుంచి ఇంటి పన్నుల వరకు ప్రతి దానిలోనూ అవినీతి పొంగిపొర్లుతోందని ఆరోపించారు. 48మంది పంచాయతీ కార్మికులను చూపిస్తున్నారని వీటిలోనూ భారీ అవకతవకలు జరిగాయన్నారు. లేనివారి పేరిట జీతాలు స్వాహా చేస్తున్నారని ఆమె విమర్శించారు. గ్రామంలో కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆశ్రమాలు, అపార్ట్మెంట్లు, థియేటర్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలకు సాధారణ పన్నులు వేసి ప్రజలపై భారాన్ని వేశారని జక్కంపూడి ఆరోపించారు. కమర్షియల్ పన్నులు పడాల్సిన చోట సాధారణ పన్నులు వేసేందుకు ఎవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఏడాదికి 500రూపాయలు కట్టే సామాన్య ప్రజలపై సుమారు 10రెట్లు భారం వేసి రూ.5వేలు వరకు పన్నులు పెంచేశారన్నారు. పంచాయతీ క్యాష్ బుక్లో ఫిబ్రవరి వరకే వివరాలు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్కు ఇచ్చిన నకళ్లకు కార్యాలయంలో ఉన్న వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ట్రాన్స్ఫర్లు లేనప్పటికీ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. డెత్ సర్టిఫికేట్లకు సుమారు రూ.వెయ్యి వరకు గుంజుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సొమ్మును ఇచ్చిన వారిని తీసుకువచ్చి చెప్పించారు. రూ.6వేలు కుళాయి పన్ను వసూలు చేస్తూ రూ.5వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని ఆరోపించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారి వద్ద నుంచి కూడా భారీగా సొమ్మును గుంజుతున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనని చెప్పుకునే గోరంట్ల నియోజకవర్గంలోనే భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. ఎన్నికలకు ముందు మూడు నెలల్లో రూరల్ గ్రామాలకు ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తోక్కారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జక్కంపూడి విమర్శించారు. జన్మభూమి కమిటీల అవినీతితో వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బిల్డింగ్ ప్లాన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుగుణానగర్లో 14శాతం కట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ కట్టించుకోకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ధవళేశ్వరం పంచాయతీలో చోటు చేసుకున్న భారీ అవినీతి అక్రమాలపై గురువారం కమిషనర్, సబ్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, గోలి దేవకుమార్, షట్టర్ బాషా, దాసరి శివ, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, చంటి, ఏజీఆర్ నాయుడు, గునిపె అశోక్, పందిళ్ల భానుప్రసాద్, కేతా సాయి, పుట్టా పరేష్నాథ్, సత్యం వెంకటరమణ, బర్రి కామేశ్వరరావు, ప్రశాంత్కుమార్, మిరప రమేష్, ఏలీషా జగన్, కపూర్, యర్రంశెట్టి శ్రీరామ్, ఆకుల సూర్యప్రకాష్, తోలేటి రాజా, బలరామ్, మోహన్బాబు, పిల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు
– జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతి కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో ఈఓఆర్డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతి హెచ్చరించారు. గురువారం ఉదయం ఆమె తన చాంబర్లో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు జిల్లాలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు తాము పరిచేస్తున్న ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి విధుల్లో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో యుద్ధ ప్రాతిపదికన చలువ పందిళ్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధమైన నీటిని అందించాలన్నారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్లు మినహా, ఎట్టి పరిస్థితుల్లోను అద్దె ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలు లేదన్నారు. ఈ మూడు నెలలు గ్రామ స్థాయిలోని సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా పని చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మంచినీటి సరఫరాకు ఖర్చు చేయాలన్నారు. ఏప్రెల్ 2వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు పాల్గొనాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 10 ఎంపీటీసీ, 20 సర్పంచు, 68 వార్డు మెంబర్ల స్థానాల్లో ఎలక్ట్రోల్స్ను ఏప్రెల్ 7వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని డివిజనల్ పంచాయతీ అధికారులు విజయ్కుమార్, ఏలీషా, కార్యాలయ ఏఓ వీరభద్రప్ప పాల్గొన్నారు. -
వేలం పాటల్లో పోటాపోటీ
- 109 మంది పోటీ - పంచాయతీకి పెరిగిన ఆదాయం - గత ఏడాదితో పోల్చితే 30 రెట్లు అధికం దేవనకొండ : పాటదారుల ఆధిపత్య పోరు కారణంగా ఈ ఏడాది పంచాయతీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పంచాయతీ వేలం పాటలకు 109 మంది పోటాపోటీగా తలపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదోని డీఎల్పీఓ ఎలీషా, ఎంపీడీఓ భాస్కర్నాయుడు, ఈఓపీఆర్డీ అగస్టీన్, మేజర్ పంచాయతీ సర్పంచు లక్ష్మిదేవమ్మ ఆధ్వర్యంలో పంచాయతీకి చెందిన 17 షాపుల(సముదాయ భవనాలు)కు వేలంపాటలు నిర్వహించారు. మొత్తం 109 మంది పాటదారులు పాల్గొన్నారు. రెండుగ్రూపులకు చెందిన పాటదారులు వేలంపాటలను పెంచుతూ పోయారు. దీంతో పంచాయతీకి ఆదాయం బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 30 రెట్లు అధికంగా పంచాయతీకి అదాయం సమకూరింది. గతేడాది 17 షాపులకు నెలసరి అద్దె వేలం పాటలు రూ.40 వేలు మాత్రమే పలకగా ఈ ఏడాది అదే షాపులకు రూ.2.23 లక్షలకు పాట పాడారు. దీంతో మొత్తం సంవత్సరానికి రూ.26.77 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది. 5వ దుకాణానికి సంబంధించి గతంలో నెలకు రూ.2 వేలు మాత్రమే ధర నిర్ణయించగా, ఈ ఏడాది అదే దుకాణాన్ని నెలకు రూ.60 వేల ప్రకారం పాట పాడారు. ఈ షాపుపై రెండువర్గాలు వేలంపాటల్లో ఆధిపత్యం సాగింది. ఈ ఆధిపత్యం నడుమ దేవనకొండకు చెందిన వెంకటేశ్వర్లు ఆ షాపును దక్కించుకున్నారు. 2వ షాపు నెలకు రూ.20 వేలు చొప్పున పలికింది. ఈ షాపును జయచంద్ర అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలాలు దక్కించుకున్న పాటదారులు వచ్చేనెల 26వ తేదీలోగా ఆరు నెలల అడ్వాన్స్ చెల్లించాలని ఈఓపీఆర్డీ అగస్టీన్ సూచించారు. -
అందని పింఛన్ డబ్బులు..!
దేవనకొండ: మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు శుక్రవారం పింఛన్ డబ్బులు రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని చెల్లిచెలిమల, వెలమకూరు, నల్లచెలిమల, కప్పట్రాళ్ల, దేవనకొండతో పాటు మరో 7 పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. దీంతో 3 వేల మంది పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
తీర్మానం ఒక్కటే... అనుమతులు 65
- లెక్కా పత్రం లేదు – కాతేరు అడ్డగోలుగా దోచేశారు – ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణ అనుమతులు – 65 దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని వైనం – నిధుల జమా ఖర్చులు ఇప్పటికీ అప్పగించని సెక్రటరీ సత్యప్రసాద్ – చోద్యం చూస్తున్న పంచాయతీ ఉన్నతాధికారులు తీర్మానం ఒక్కటే...అనుమతులు మాత్రం 65. రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో లీలలివీ. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.30 కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఇటీవల చేసిన దర్యాప్తులో బట్టబయలయింది. నిధుల్లోనే కాదు ఆదాయం వచ్చే వివిధ మార్గాల్లో దారి కాచి మరీ నిధులు మింగేసిన ఘటనలు బయటపడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు వచ్చిన దరఖాస్తులకు అనుమతులిచ్చామని ... ఇవన్నీ ఒకే తీర్మానంతో చేశామని సంబంధితాధికారులు చెబుతుండడంతో విన్నవారు విస్తుపోతున్నారు. ఇక వసూళ్లు చేసిన పన్నులు కూడా స్వాహా చేసి చేతులు దులుపుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు పంచాయతీని అధికారులు, స్థానిక నేతలతో కలిసి అడ్డగోలుగా దోచేసిన వ్యవహారంలో ఇప్పటి వరకూ నిధుల జమా ఖర్చులు చెప్పలేదు. ప్రతి పనినీ నిబంధనలకు విరుద్ధంగా చేసి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఎన్ని ఇచ్చారో లెక్కా పత్రం లేదు. ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటే పాలన ఏ విధంగా సాగుతుందో స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొరుకొండ మండలాల్లో 21 గ్రామాలను రాజమహేద్రవరం నగరపాలక సంస్థలో కలిపే ప్రతిపాదనలు గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. నగరానికి కూత వేటు దూరంలోనే కాతేరు పంచాయతీ కూడా ఉంది. ఇక్కడ తాజాగా చేసిన ప్రజా సాధికారత సర్వే ప్రకారం 8,900 గృహాలున్నాయి. జనాభా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. విలీన ప్రతిపాదన నేపథ్యం, కోర్టు కేసులు పెండింగ్లో ఉండడంతో పంచాయతీ పాలక వర్గ ఎన్నికలు నిర్వహించ లేదు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి. ఇంత పెద్ద పంచాయతీలో ఐదేళ్ల నుంచి పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసి లెక్కలు కూడా రాయలేదు. ఇంటి, కుళాయి పన్నులు ఇష్టానుసారం వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. కొత్త కుళాయి కనెక్షన్ కోసం రూ.4500 నుంచి రూ.6000 వసూలు చేశారు. ఆ నిధులన్నింటినీ పంచాయతీ జనరల్ ఖాతాకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకున్నారు. గతంలో కాతేరు పంచాయతీగా పని చేసి ప్రస్తుతం రూరల్ మండలంలోనే ఓ పెద్ద పంచాయతీలో పని చేస్తున్న కార్యదర్శి కుళాయి కనెక్షన్ కోసం ఇంటి యజమానుల వద్ద రూ.2,500 వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి మందలించడంతో 70 మందికి రూ.2500 లెక్కన తిరిగి ఇచ్చేశారు. ఇప్పటికీ లెక్కలు చెప్పని సస్పెండైన కార్యదర్శి, ప్రత్యేక అధికారి... పంచాయతీలో కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు రూ.1.30 కోట్లు గోల్మాల్ అయ్యాయన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో అధికంగా తప్పతోవ పట్టినట్టుగా తెలుస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు చేసినా ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన బిల్లులు పెట్టలేదంటున్నారు. ఈ వ్యవహారం దాదాపు నాలుగు నెలల నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదిర్శి నుంచి జమా లెక్కలు స్వాధీనం చేసుకోలేదు. చర్యలు చేపట్టామని చెప్పేందుకు తూతూ మంత్రంగా కార్యదర్శి సత్యప్రసాద్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని చోద్యం చూస్తున్నారు. ఇన్చార్జి కార్యదిర్శిగా తొర్రేడు కార్యదర్శిని నియమించి నెలరోజులకుపైగా అవుతున్నా పంచాయతీకి సంబంధించిన రికార్డులు అప్పగించలేదు. సోమవారం రూరల్ మండలంలోని పంచాయతీల పాలనపై కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కాతేరు నిధుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు అప్పటి కార్యదర్శి సత్యప్రసాద్ నుంచి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డీఎల్పీవో వరప్రసాద్ను ప్రశ్నించారు. కార్యదర్శిని సస్పెండ్ చేశామని డీఎల్పీవో బదులివ్వగా అతన్ను పిలిచి రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. ఇంటి ప్లాన్ అనుమతులు, ఆదాయం ఎంత? అన్న వివరాలు కూడా లేకపోవతే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు మాయం... కాతేరు పంచాయతీలో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారనడానికి ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఓ ఉదాహరణని అన్నారు. ఇలా ఇచ్చిన 65 భవన నిర్మాణాలకు సంబంధించిన యజమానుల దరఖాస్తులు మాత్రం మాయమయ్యాయి. ఆ 65 భవనాలు ఎక్కడివో తేల్చే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారా? ఇస్తే ఆ భవనాలు ఎవరివో విచారణలో తేలనుంది. మెమో జారీ చేస్తున్నాం... సస్పెండైన కార్యదర్శి రికార్డులు అప్పగించాల్సి ఉంది. ఈ విషయం ప్రస్తుత ఇన్చార్జ్ కార్యదర్శి మా దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన రికార్డులు కూడా అప్పగించాల్సిందిగా కార్యదిర్శి సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవోపీ ఆర్ అండ్ ఆర్డీలకు మెమో జారీ చేస్తున్నాం. 65 భవన నిర్మాణాలకు సంబంధించిన తీర్మానం పంచాయతీ కార్యాలయంలో ఉంది. కానీ 65 మంది భవన నిర్మాణదారులు దరఖాస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వ్యవహారం ప్రత్యేక అధికారిగా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టిలో ఉంది. – వరప్రసాద్, డీఎల్పీవో, రాజమహేంద్రవరం. -
పంచాయతీలకు ’పవర్’ కట్
బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ నోటీసులు చీకట్లో మగ్గుతున్న పల్లెలు చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని పల్లెలు చీకట్లో మగ్గాల్సిన దుస్ధితి తలెత్తింది. గ్రామాలను స్మార్ట్ విలేజ్లుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే రుద్దుతోంది. అసలే నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు విద్యుత్ బిల్లులు తలబొప్పి కట్టిస్తున్నాయి. బకాయిలు ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్న ఘటనలు 10 రోజులుగా జిల్లాలో పెరుగుతున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారికి నోటీసులు పంపించామని, సరైన స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక విద్యుత్ నిలిపివేస్తున్నామని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. గతంలో 13వ ఆర్థిక సంవత్సరం నిధులు పంచాయతీల విద్యుత్ బిల్లులకు కొంత సొమ్ము జమ చేశారు. అయినా.. బకాయిలు తీరలేదు. మేజర్ పంచాయతీల మాటెలా ఉన్నా మైనర్ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మైనర్ పంచాయతీలకు ఆదాయ వనరులు లేకపోవడంతో విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. దీంతో ట్రాన్స్కోకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలు కట్టకపోతే గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు సైతం విద్యుత్ నిలిపివేయక తప్పదని విద్యుత్ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ను పునరుద్ధరించేది లేదని భీష్మిస్తున్నారు. పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని చాలాకాలంగా సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. బకాయిలు రూ.170 కోట్లు జిల్లాలో చాలా పంచాయతీలకు ఇప్పటికే ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వీటిలో కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనధికారికంగా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ చాలా పంచాయతీలు నేటికీ చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో 906 పంచాయతీలు ఉండగా, రూ.170 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల విషయానికి వస్తే వీధిలైట్లు, పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రూ.22.94 కోట్లు బకాయిలు ఉండగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.57.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీలు వీధిలైట్లు, కార్యాలయాల విద్యుత్కు సంబంధించి రూ.22.23 కోట్లు బకాయి పడగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.67.22 కోట్లను బకాయిపడ్డాయి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యుత్ శాఖ చెబుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాత బకాయిలు చెల్లించి , ఆ తరువాత మూడు నెలల నుంచి ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ పంచాయతీల వద్ద నిధుల లేకపోవడంతో ప్రతినెలా బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. ప్రభుత్వమే చెల్లించాలి గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటికి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు. దీనికి తోడు తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి నిధులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో పాత బకాయిలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యుత్ బకాయిలను రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వమే ఆ మొత్తాలను చెల్లించాలి. మారిశెట్టి జగదీశ్వరరావు, సర్పంచ్, చింతలపూడి సరఫరా నిలిపివేస్తున్నాం విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీల్లో సరఫరా నిలిపివేస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత బకాయిలు వీటినుంచి కట్టించుకున్నా, ఆ తరువాత వరుసగా మూడు నెలల నుంచి పంచాయతీలు బిల్లులు చెల్లించడం లేదు. ఏ నెల బిల్లు ఆ నెల కట్టాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పంచాయతీలు చెల్లించడం లేదు. దీంతో బకాయిపడిన పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. ఈ విషయంలో మేం చేయగలిగిందేమీ లేదు సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్ -
పన్ను ‘పంచాయితీ’
పన్ను వసూలు లక్ష్యం రూ.22కోట్లు - మార్చి 31 నాటికి ముగియనున్న గడువు - ఇప్పటి వరకు 10 శాతం కూడా దాటని వసూళ్లు - గ్రామ పంచాయతీల్లో కొరవడిన ప్రణాళిక - కరువు నేపథ్యంలో పన్ను చెల్లించలేని పరిస్థితి కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు గడువు ముంచుకొస్తోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో 2015–16 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈలోపు జిల్లాలోని 889 గ్రామ పంచాయతీల నుంచి రూ.22 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలనేది లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 10 శాతం కూడా వసూలు కాకపోవడంతో నిర్ణీత సమయంలోగా వంద శాతం వసూలు సాధ్యామా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా పన్ను వసూలుపై పక్కా ప్రణాళికలు లేని కారణంగా నేటి వరకు మెజారిటీ గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలులో శ్రద్ధ చూపనట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తగినంత మంది పంచాయతీ కార్యదర్శులు లేని కారణంగా కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలులో పురోగతి కనిపించనట్లు తెలుస్తోంది. 889 గ్రామ పంచాయతీలకు గాను 460 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరిలో కూడా ఒక్కో పంచాయతీ కార్యదర్శి రెండుకు మించి గ్రామ పంచాయతీలకు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న కారణంగా పన్నుల వసూలుపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామ పంచాయతీల్లో 50 శాతాని కంటే తక్కువ వసూలు చేస్తే సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం సంబంధిత ఉన్నతాధికారులకు ఉంది. అలాగే 25 శాతానికంటే తక్కువ వసూలు అయితే సీసీఏ నిబంధనల మేరకు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒక వైపు నిబంధనలు కఠినతరంగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూలు మందకొడిగా సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు.. గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు ఏర్పడిన తాత్కాలిక కరువు కూడా పన్నుల వసూలుపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి, కుళాయి, లైటింగ్, డ్రైనేజీ తదితరాలకు పన్ను వసూలు చేయాల్సి ఉంది. అలాగే పన్నేతరముల కింద కుళాయి ఫీజులు, షాపింంగ్ కాంప్లెక్స్ల అద్దెలు, వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలాలకు సంబంధించిన మొత్తాలను వసూలు చేయాల్సి ఉంది. వలసల కారణంగా.. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా పడమటి ప్రాంతాలైన ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు అధిక శాతం మంది గ్రామాల్లో పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ కారణం వల్ల కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నులు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమానులతో పాటు కుటుంబ సభ్యులందరూ వలసలు వెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేని కారణంగా వసూళ్లకు వెళ్లిన వారికి తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. చిన్న పంచాయతీల్లో కొంత కష్టమే.. పన్ను వసూళ్లకు సంబంధించి పలు కారణాల వల్ల చిన్న పంచాయతీల్లో కొంత కష్టంగా ఉంటుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీల్లో నిర్ణీత సమయానికి నూటికి నూరు శాతం వసూలు చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పన్ను వసూలుపై అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన వసూలు చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. - కె.ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి -
దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
రాజమహేంద్రవరం రూరల్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి కట్టా చంద్రశేఖర్ను అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కె.గంగరాజు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... దివా¯ŒSచెరువు గ్రామానికి చెందిన బూరా అబ్బులు అదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో శానిటేష¯ŒS వర్కర్గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇప్పించాలని కార్యదర్శి చంద్రశేఖర్ను బూరా అబ్బులు, పంచాయతీ కార్మికులు కోరారు. జీతం బిల్లులు చేయడానికి కొంత ఖర్చవుతుందని కార్యదర్శి చెప్పాడు. దీంతో కార్మికులు సుమారు రూ.26 వేలు ఇచ్చారు. అయినా జీతాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి కార్మికులపై కక్షగట్టి ఒక చోట పనిచేసే వారిని మరో చోటకు మారుస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు కులంపేరుతో దూషించాడని బూరా అబ్బులు గత ఏడాది ఆగస్టు 23న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కనకారావు కేసు నమోదు చేయగా, అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కె.గంగరాజు విచారణ నిర్వహించారు. విచారణలో కులంపేరుతో దూషించడంతో పాటు, వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదు దారుడితోపాటు సాక్షులు చెప్పారు. దీంతో డీఎస్పీ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. -
యువరక్తం.. కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పటిష్టతపై నాయకత్వం దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో పార్టీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి యువరక్తాన్ని ఎక్కించడం, యువ తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి కొత్త రూపు ఇవ్వడంపై కసరత్తు చేస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు వచ్చే ఆరునెలల కాలానికి ఉద్యమ కార్యాచరణను సీపీఐ రూపొందించుకుంది. జనవరి–జూన్ల మధ్యలో ఏ నెలకు ఆ నెల ప్రాధాన్యతను సంతరించుకున్న ఆయా అంశాలు, సమస్యలపై వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు ముగింపుగా రాష్ట్ర దిగ్బంధం (తెలంగాణ బ్లాకేడ్)తోపాటు ఎక్కడికక్కడ మానవహారాల ఏర్పాటు ద్వారా రాజకీయంగా ప్రభావం చూపి రాష్ట్రస్థాయిలో ప్రజలను కదిలించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తదితర వర్గాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ›ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని తీర్మానించింది. గతంతో పార్టీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాలు, పార్టీలో క్రియాశీలక ంగా ఉంటూ, త్యాగాలు చేసిన వ్యక్తులు, కుటుంబాలను గుర్తించి, వాటిల్లో పార్టీని మళ్లీ పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. కొత్తరక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు... ఈ నెలలో పార్టీ సభ్యత్వనమోదు చేపట్టడం, యువతను పార్టీలోకి ఆకర్షించి కొత్త రక్తాన్ని నింపడం, ఫిబ్రవరిలో మండల, గ్రామస్థాయిల్లో పార్టీ యంత్రాంగ పటిష్టం, ఏప్రిల్–మే నెలల్లో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రను నిర్వహించడం వంటివి నిర్వహించాలని నిర్ణయించింది. మే చివర్లో లేదా జూన్లో రాష్ట్ర దిగ్బంధం, మానవహారాల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాజకీయంగా సత్తా చాటేలా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపేలా కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీకి కొత్తరూపును ఇవ్వడంలో భాగంగా నూతన నాయకత్వాన్ని, యువతను ప్రోత్సహించాలని నిర్ణయిం చింది. వివిధస్థాయిల్లో యువతరానికి నాయకత్వ స్థానాల్లో అవకాశం కల్పించడం ద్వారా పార్టీని, కేడర్ను మరింత చైతన్యవంతం చేసి నూతనోత్తేజం కలిగించేలా చూడాలని భావిస్తోంది. గతంలో సీపీఐగా ఉన్న ఆదరణను తిరిగి సాధించే దిశలో తీవ్రంగా శ్రమించాలని, అందుకు అవసరమైన కార్యాచరణను, ప్రణాళికలను కూడా రూపొందించుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 534 మండలా లకుగాను 388 మండలాల్లో పార్టీ కమిటీలు ఉన్నందున, మిగిలిన మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోను న్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయితోపాటు, అన్ని గ్రామాల్లోనూ చిన్నదో, పెద్దతో పార్టీ యూనిట్ ఉండేలా చూడాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. పార్టీ నేతలకు పని విభజన ముఖ్యనేతలు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులకు పని విభజన చేసి, ఆయా సమ స్యలు, వర్గాలవారీగా బాధ్యతలను చేప ట్టేలా ఏర్పాటు చేసింది. వారంలో మూడు రోజుల చొప్పున రాష్ట్రస్థాయిలో పార్టీ సమ న్వయం, ఆయా అంశాల పరిశీలన, ఇతర బాధ్య తలను రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావులకు అప్పగించారు. మాజీ ఎంపీ అజీజ్ పాషాకు ముస్లిం మైనారిటీలు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్కు షెడ్యూల్డ్ కులాలు సమస్యలపై, కార్యదర్శివర్గ సభ్యుడు ఈర్ల నర్సింహకు బీసీ, ఎంబీసీ, అంజ య్యనాయక్కు గిరిజన, ఆదివాసీల సమస్యలపై కార్యక్ర మాలను రూపొందించే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఈ సామాజిక రంగాలకు సంబంధించిన సమస్యలు,ఇతరత్రా అంశాలను ఈ నేతల నేతృత్వం లో అధ్యయనం చేసి ఆయా ముఖ్యమైన, ప్రాధాన్యత సంతరించుకున్న వాటిపై సొంతంగా ఉద్యమాలను నిర్మించేలా కార్యక్ర మాలను రూపొందిం చుకోనున్నారు. -
పది కుటుంబాల వెలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన సాక్షి, సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పంచాయితీలో తమ మాట వినకుండా కోర్టుకు వెళ్లారనే అక్కసుతో పదికుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ ‘పెద్దలు’తీర్పు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపూర్కి చెందిన చీకోటి లింగయ్య, చీకోటి పర్శయ్య, చీకోటి మల్లయ్య తమ భూములను అదే గ్రామానికి చెందిన మారుపాక రాజు, మారుపాక బాలయ్య, ఆశయ్య, చిన్న ఆశయ్య, పర్శయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, పరశు రాములు, వెంకటయ్య, రాములు సాగు చేసుకుంటున్నారని రెండు నెలల క్రితం పంచాయితీ పెట్టారు. తమ తాతలకాలం నుంచి 4.05 ఎకరాలు తమ ఆధీనంలోనే ఉందని బాధితులు చెప్పారు. ఈ క్రమంలో కుల పెద్దలు 4.05 ఎకరాల నుంచి 1.15 ఎకరాలను చీకోటి లింగయ్య, పర్శయ్య, మల్లయ్యకు చెందుతుందని తీర్పు చెప్పారు. వారి తీర్పు నచ్చని మారుపాక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పది కుటుంబాలను కుల బహిష్కరణ చేశా రు. బహిష్కరణకు గురైన వారితో ఎవరైనా మాట్లాడితే రూ. 500 జరిమానా నిబంధన విధించారు. చీకోటి కుటుంబం బావి నుం చి మారుపాక ఆశయ్య పొలానికి సాగునీరు బంద్ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాయి. క్రమంలోనే గత శనివారం కోర్టు నుంచి ఈ భూమి మారుపాక కుటుం బ సభ్యులకే చెందుతుందని తీర్పు కూడా వచ్చింది. అయినా బహిష్కరణ కొనసాగు తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ‘పెద్దల’తోపాటు అందుకు కారణ మైన వారిపై సోమ వారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
14వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు
విద్యుత్ బకాయిలు, పీడబ్ల్యూఎస్ స్కీం, గ్రామ పంచాయతీల నిర్వహణ పేరిట 60 శాతం కోత ఇప్పటికే పంచాయతీలను వేధిస్తోన్న నిధుల కొరత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్పంచ్ల ఆగ్రహం దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామ పంచాయతీల పరిస్థితి. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరింత కుదేలు కానున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల్లో వివిధ సాకులు చూపి 60 శాతం కోత పెట్టడం సర్పంచ్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. గ్రామాల పురోగతికి చేయూతనివ్వాల్సిందిపోయి వచ్చిన నిధులను వేరే వాటికి మళ్లించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్, పీడబ్ల్యూఎస్ బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి :గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1158 గ్రామ పంచాయతీలకు ఇటీవల మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం నిధులను వివిధ అవసరాల పేరుతో మళ్లిస్తోంది. ప్రధానంగా గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలకు పరిష్కారం చూపాలనే కోణంలో కేంద్రం నేరుగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లిస్తోంది. ముందుగానే చెక్కులు.. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం దారి మళ్లుతున్నాయి. ఇందులోంచి 30 శాతం మేరకు విద్యుత్ బకాయిలకు, 20శాతం పీడబ్ల్యూఎస్(పబ్లిక్ వాటర్ సప్లయ్ స్కీం) స్కీం నిర్వహణ, పది శాతం గ్రామ పంచాయతీ నిర్వహణ పేరిట కోత విధిస్తోంది. ఇందుకు గాను ముందస్తుగానే సర్పంచ్ల నుంచి చెక్కు లు తీసుకుంటున్నారు. చెక్కులు ముందస్తుగా ఇస్తేనే గ్రామం లో చేసిన వివిధ అభివృద్ధి పనులకు ఎంబీ రికార్డుల మేరకు చెక్కులపై కౌంటర్ సంతకాలు చేస్తున్నారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఇది కూడా కేవలం నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలోనే ఈఓపీఆర్డీ కౌంటర్ సంతకంతోనే సాగుతోంది. సర్పంచ్లకు నోటీసులు 15 ఏళ్ల క్రితం ఏర్పడిన సీపీడబ్ల్యూఎస్ స్కీం బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ట్రాన్స్కో ఉన్నతాధికారుల నుంచి సర్పంచ్లకు నోటీసులు అందాయి. ఉదాహరణకు గుండాల మండలంలోని తుర్కలాషాపురంలో నాలుగు సీపీడబ్ల్యూఎస్ స్కీం మోటార్ల విద్యుత్ బకాయిల కింద రూ.9.74లక్షలు చెల్లించాలని, ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని వంగాల గ్రామంలో గల మరో రెండు పీడబ్ల్యూఎస్ స్కీం విద్యుత్ మోటార్ల బకాయి బిల్లు కింద రూ.4.56లక్షలు చెల్లించాలంటూ సర్పంచ్లకు నోటీసులను అందజేశారు. తుర్కలషాపురం పంచాయతీ నుంచి బిల్లు వసూలు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పీడబ్ల్యూఎస్ స్కీం నిర్వహణ కింద 20శాతం గ్రాంట్ చెల్లించాని జీఓఆర్టీ నెంబర్ 544 పీఆర్, ఆర్జీ తేదీ 28/08/2015న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తుర్కలషాపురం గ్రామ పంచాయతీ నుంచి అధికారు లు రూ.1,18,498 లక్షలు వసూలు చేశారు. గ్రామాల్ని గ్రామా లే పాలించుకోవాలన్నది 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం నేరుగా ఆర్థిక సంఘం నిధులను గ్రా మ పంచాయతీలకు విడుదల చేస్తోంది. గ్రామాల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉండగా, ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు, పీడబ్ల్యూఎస్ స్కీం నిర్వహణ, పంచాయతీల నిర్వహణ పేరిట ముందస్తుగానే ఈఓఆర్డీల కౌంటర్ సంతకం ప్రయోగిస్తూ బి ల్లులు వసూలు చేస్తున్నారు. నిధులలేమితో గ్రామాల్లో సమస్య లు పేరుకుపోతున్నాయని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నెలాఖరులోపు 20 నోటిఫికేషన్లు..
2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ ఈ నెలాఖరులోగా మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్– 1, గ్రూప్– 3 పోస్టులతో పాటు మరికొన్ని ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువరించనుంది. మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్– 3లో 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు, గ్రూప్–3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక గ్రూప్– 1 కింద 94 పోస్టులకు కూడా ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 504 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే డిప్యూటీ సర్వేయర్లు 259, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 100, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 49, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 77, మెడికల్ ఆఫీసర్లు 53 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. -
పంచాయతీలకు నిధులొచ్చాయ్..
► గ్రామాల అభివృద్ధికి రూ.43.56కోట్లు ► 14వ ఆర్థిక సంఘం తొలిదఫా విడుదల ► విద్యుత్బిల్లులు, పెండింగ్ బకారుులకు మోక్షం కరీంనగర్సిటీ : పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.43.56 కోట్లు నిధులు కేటారుుంచారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, వివిధ అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ డెరైక్టర్ నీతూప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది నెలలు ఆలస్యంగా.. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థికసంఘం నిధుల కేటారుుంపులను ఏటా పెంచుతోంది. ఈ సంవత్సరం సైతం నిధులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛభారత్ నిర్మాణమే లక్ష్యంగా తాగునీరు, డ్రెరుునేజీలు, సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. అంతేకాకుండా ఈ నిధుల నుంచే పంచాయతీల విద్యుత్ బిల్లులు, బకారుులు ముప్పై శాతం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్థికసంవత్సరంలో నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈక్రమంలోనే జిల్లాల విభజన, మండలాల విలీనం, కొత్త కార్యాలయాల ఏర్పాటుతో పాలన గాడిలో పడడానికి సమయం పట్టింది. చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగం పెంచేందుకు ఆయా జిల్లాలవారీగా ప్రభుత్వం నిధులు కేటారుుంచింది. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఎనిమిది నెలలకు నిధులు విడుదల చేసింది. జనాభా ఆధారంగానే.. ఉమ్మడి జిల్లాలో 1,207 గ్రామాలుండేవి. సిద్దిపేట, వరంగల్ అర్బన్, ప్రొఫెసర్జయశంకర్ జిల్లాల పరిధిలోకి వెళ్లిన గ్రామాలు మినహారుుస్తే ప్రస్తుతం 1,020 గ్రామాలున్నారుు. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులను కేటారుుంచారు. ఉమ్మడి జిల్లాలో 37,76,269 జనాభా ఉంది. గతేడాది కంటే ప్రస్తుతం నిధులు అధికంగా వచ్చారుు. వీటితోపాటు పెద్ద నోట్ల రద్దుతో పంచాయతీలకు పన్నుల రూపంలో నిధుల వరద పారింది. ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల వరకు వసూలయ్యారుు. కొత్త జిల్లాలకు.. తాగునీటి సరఫరా పథకాలు, డ్రెరుునేజీలు, కల్వర్టుల నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, ఏఎన్ఎం సబ్సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, వీధిలైట్లు, తాగునీటి వాటర్ప్లాంట్ తదితర పను లు చేసుకునే అవకాశం ఉంది. నిధులను ఆయా జిల్లాల్లోని సబ్ ట్రెజరీ కార్యాలయా ల ద్వారా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తారు. కొత్త జిల్లాల్లోని జనాభా ఆధారంగానే నిధులు కేటారుుంచారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అధికంగా కేటారుుంచారు. సగటున గ్రామానికి రూ.5 నుంచి రూ.8లక్షల వరకు కేటారుుంచనున్నారు. తిరిగి మార్చిలో మరో రూ.40 కోట్లు విడుదలయ్యే అవకాశముంది. నిధులు రాక ఇలా.. జిల్లా నిధులు కరీంనగర్ రూ.12,31,64,800 రాజన్నసిరిసిల్ల రూ.7,98,82,300 జగిత్యాల రూ.13,79,29,100 పెద్దపల్లి రూ.9,46,28,600 -
నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి పై వేటు
సర్వీసు నుంచి తొలగిస్తూ కలెక్టరు ఆదేశాలు రాజానగరం : దివాన్చెరువు పంచాయతీ నిధులు దుర్వినియోగం పై ఆ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుతం ఏలేశ్వరం మండలం, యర్రవరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బీవీవీఎస్ఎన్ మూర్తి పై వేటు పడింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అతనిని సర్వీసు నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్.అరుణ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కాపీ స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి కూడా చేరింది. ఏపీసీఎస్ (సీసీఏ) రూల్ 1991 యాక్ట్ ననుసరించి ఈ చర్య తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో .... దివాన్చెరువు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దేశాల వెంకటరామారావు (శ్రీను) ప్రజావాణిలో 2015 ఆగస్టు మూడున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. సర్పంచ్ కొవ్వాడ చంద్రరావుతో కలిసి 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా గతేడాది నవంబరులో డీఎల్పీఓ చేసిన విచారణ నివేదిక ద్వారా గుర్తించి, సర్పంచ్కి, ఇన్చార్జి కార్యదర్శిగా ఉన్న మూర్తికి గత ఏడాది డిసెంబరు ఒకటిన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి మూర్తి జనవరిలో ఇచ్చిన జవాబును అనుసరించి డీఎల్పీఓ ఫిబ్రవరి 20న మరో నివేదికను అందజేశారు. దానిపై అప్పటికే రావులపాలెం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మూర్తిని సస్పెండ్ చేస్తూ మే 31న చార్జ్ మెమో ఇచ్చారు. దానిపై అతని నుంచి వచ్చిన సమాధానంతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం అతని సస్పెన్షన్ని రద్దు చేసి, ఏలేశ్వరం మండలం, యర్రంవరం పంచాయతీకి జూనియర్ అసిస్టెంట్గా జూన్ 22న ఉత్వర్వులిచ్చారు. సబ్ కలెక్టరు నివేదికతో పడిన వేటు ఇదిలావుండగా దివాన్చెరువు పంచాయతీ నిధుల దుర్వినియోగం సంఘటనపై వస్తున్న రకరకాల కథనాలు, జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరును విచారణకు ఆదేశించారు. సెప్టెంబరు 29న సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదికలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా గుర్తించడంతోపాటు ఇటువంటి వారిని సర్వీసులో కొనసాగించడం ప్రమాదకరమని, సర్వీసు నుంచి తొలగించాలంటూ ప్రతిపాధించారు. సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదిక ప్రకారం పంచాయతీలో రూ.78 లక్షల 80 వేల 755ల నిధులు దుర్వినియోగం అయినట్టుగా నిర్థారించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఖాతరు చేయకుండా, విచక్షణా రహితంగా బిల్లు కలెక్టరును, 44 మంది పారిశుద్ధ్య కార్మికులను (పోస్టులు మంజూరు లేకుండానే) నియమించుకోవడాన్ని తప్పుపట్టారు. అలాగే ఇంటి పన్నులుగా వసూలు చేసిన రూ. 67,961లు పంచాయతీ ఆదాయంలో జమ చేయకపోవడాన్ని, వాటర్ టాక్స్గా వసూలు చేసిన రూ.3,960ని కూడా జమ చేయకపోవడాన్ని గుర్తించారు. ఇదే విధంగా వివిధ రకాల ఖర్చులలో వచ్చిన తేడాలను, జరిగిన అవినీతిని తన నివేదికలో వివరంగా పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.34 లక్షల 34 వేల 613లు, పంచాయతీ సాధారణ నిధుల నుంచి రూ.36 లక్షల 51 వేల, 921లు, వాటర్ టాక్స్, పారిశుద్ధ్య కార్మికులకు నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించిన మొత్తం రూ.ఏడు లక్షల 22 వేల, 300లు, వసూలు చేసిన వాటర్ టాక్స్ని పంచాయతీ జమ చేయకుండా వాడకున్న మొత్తం రూ.71 వేల, 921లుగా ఉన్నాయి. ఇదిలావుండగా నిధుల దుర్వినియోగంలో పంచాయతీ సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు ఇప్పటికే సస్పెండ్ అయివున్నారు. కాగా ఈ విషయమై సర్వీసు నుంచి తొలగించబడిన మూర్తిని ఫోన్లో వివరణ కోరగా దుర్వినియోగంలో తాను నిర్థోషినన్నారు. అదే విషయాన్ని మరోసారి రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. -
ఆదాయంపై దాగుడు మూతలు
• ఓవైపు పడిపోతోందనే ఆందోళన.. మరోవైపు పెంచుకునే అవకాశాలు • నోట్ల రద్దును అనుకూలంగా మలుచుకుంటే భారీ ఆదాయం • పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెరిగిన వసూళ్లు • అన్ని శాఖల్లో బకారుుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ఓ వైపు ఆందోళన వ్యక్తమవుతున్నా.. ప్రస్తుత పరిణామాలను అనువుగా మలుచుకుంటే ఆదాయం పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వ ఫీజులు, చార్జీలు, పన్నులు, జరిమానాలన్నీ పాత కరెన్సీతో చెల్లించవచ్చంటూ కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలతో పాటు వివిధ కార్పొరేషన్లు తమ బిల్లులు, పన్నులు, బకారుుల వసూలు కు చేపట్టిన ప్రచారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.200కోట్లకు పైగా సమకూరారుు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో గ్రామ పంచాయతీల్లో రూ.32 కోట్ల పన్నులు, పాత బకారుులు వసూలయ్యారుు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నింటా పన్నుల వసూలు కోట్లలోకి చేరింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వసూళ్లు రూ.7.55 కోట్లు దాటారుు. కరెంటు బిల్లుల చెల్లింపులకు సైతం పాత నోట్లు తీసుకుంటుండడంతో ఎస్డీపీసీఎల్ పరిధిలో ఈ నెల 11 నుంచి శుక్రవారం వరకు రూ.851 కోట్ల బిల్లులు వసూలయ్యారుు. సాధారణ రోజులతో పోలిస్తే వసూలు రెట్టింపు స్థారుుకి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ బిల్లుల వసూలు వేగం పుంజుకుంది. ఈ పరిస్థితిని వినియోగించుకునేందుకు వాణి జ్య పన్నుల శాఖ కూడా రూ.1,194 కోట్ల బకారుుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అందులో గత వారంలో రూ.184 కోట్లు వసూలైనట్లు అధికారులు ప్రకటించారు. డీలర్లు, బకారుుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపించి.. పెద్ద నోట్లు వినియోగించుకునేలా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. వ్యాట్కు పెట్రోల్తో ఊరట రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ ద్వారా దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుం ది. నోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ స్తంభించడంతో ఈ ఆదాయం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమైంది. కానీ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లను వినియోగించే అవకాశమివ్వడంతో కొంత ఊరట లభిస్తోంది. నోట్ల రద్దు ప్రకటించిన తొలి మూడు రోజుల్లోనే 110 శాతం పెట్రోల్, 98 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగారుు. రాష్ట్రానికి వచ్చే వ్యాట్లో సింహభాగం పెట్రోలియం, మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతుం ది. దీంతో ఈ నెలలో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ప్రచారం లేకనే తగ్గిన రిజిస్ట్రేషన్లు నోట్ల రద్దు నిర్ణయం ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని దెబ్బతీసింది. 9, 10 తేదీల్లో పాత నోట్ల వినియోగంపై స్పష్టత లేకపోవటంతో ఈ శాఖపై ప్రభావం చూపింది. ఈ శాఖలో రోజుకు సగటున రూ.15 కోట్ల ఆదాయం వస్తుంది. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే ఇది రూ.90లక్షలకు పడిపోరుుంది. తర్వాత క్రమంగా పెరిగింది. పెద్ద నోట్లతో చెల్లించగలిగే విషయంపై ప్రచారం చేస్తే ఈనెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలున్నారుు. అరుుతే స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణం రంగం కుదేలయ్యే పరిస్థితులు ఉండడంతో భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోతుందనే అంచనాలున్నారుు. -
గ్రూప్-3 సిలబస్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-3 కింద పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్షల సిలబస్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందే అవకాశమున్నందున స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. అర్హులను మెరుున్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉండనుంది. ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహించే ఈ పరీక్షకు రెండున్నర గంటల సమయమివ్వనున్నారు. మెయిన్ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 150 చొప్పున 300 మార్కులతో ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్పై ప్రశ్నలుంటాయి. పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా ఏపీలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉంటారుు. గ్రూప్-3 సిలబస్ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.జీఓవీ.ఐఎన్)లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి వివరించారు. (గ్రూప్-3 స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ సిలబస్ వివరాలు సాక్షి భవితలో ) -
రేపటి నుంచి ఖేలో ఇండియా పోటీలు
– జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్చార్జ్ అ«ధికారి మల్లి ఖార్జున కర్నూలు (టౌన్): జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో ఖేలో ఇండియా పేరుతో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్చార్జ్ మల్లిఖార్జున వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2008 లో పంచాయతీ యువక్రీడ ఖేల్ అభియాన్, తర్వాత రాజీవ్ ఖేల్ అభియాన్ పేర్లతో కేంద్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వహించిందన్నారు. ఇప్పుడు ఖేలో ఇండియా పేరుతో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు 14, 17 ఏళ్ల వయస్సు ఉన్న క్రీడాకారులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పోటీల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టీమ్లుగా ఫుట్బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్, హాకీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజక వర్గ స్థాయిలో ఈనెల 19 నుంచి 23 వరకు, జిల్లా స్థాయిల్లో ఈనెల 28 నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 29 న కబడ్డీ (బాలురు), 30 న కబడ్డీ (బాలికలు), డిసెంబర్ 1 న ఖోఖో (బాలురు), 2 వ తేదీ ఖోఖో (బాలికలు), 3 వ తేదీ ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, 5 వ తేదీ ఆర్చరీ, హాకీ, బాక్సింగ్, రాష్ట్రస్థాయి పోటీలు 12 నుంచి14 వ తేదీ వరకు విజయవాడలోని మైలారం మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి క్రీడాపోటీలు నేటితో ముగియనున్నాయి. కాగా క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మండల స్థాయికి రూ. 30 వేలు, నియోజకవర్గ స్థాయికి రూ. 40 వేలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. -
నేటి నుంచి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు
– నగదు రహిత చెల్లింపుల బాధ్యత ఎంపీడీఓలదే – జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): అన్ని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ఉపాధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ, జన్ధన్ ఖాతాలు, నగదు రహిత లావాదేవీలు తదితర అంశాలపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో కూలీలు వలస పోకుండా చూడాలన్నారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాబ్కార్డులను అప్డేట్ చేయడం, ఫారంపాండ్ల పూర్తి, వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. 15 రోజుల్లో ఆయా పనులపై పురోగతి చూపించాలని ఆదేశించారు. ఎక్కడైనా కరువు పనులు చేపట్టకుంటే ఫోన్ ద్వారా కలెక్టరేట్కు సమాచారం అందించేలా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు, ఉపాధి కూలీలు, డ్వాక్రా సభ్యులు పలు ఇబ్బంధులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పాస్ విధానం ద్వారా చౌక ధరల దుకాణాలు, మందుల షాపుల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. జన్ధన్ ఖాతాలు లేని వారికి కొత్తగా ప్రారంభించేందుకు బ్యాంకర్లు సమ్మతించారని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్, సీపీఓ ఆనంద్నాయక్, డ్వామా పీడీ సీహెచ్ పుల్లారెడ్డి, ఎల్డీఎం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల వేడి
–నేడు పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన – రెండు జెడ్పీటీసీ, 18 సర్పంచ్ పదవులు, 22 ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నిక – 129 వార్డు పదవులకూ ఉప సమరం కొవ్వూరు : స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ప్రజాప్రతినిధుల ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల కమిషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా వీటికి ఉప ఎన్నికలు మరుగునపడ్డాయి. దాదాపు మూడేళ్ల నాలుగు నెలల అనంతరం ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఐదేళ్ల పదవీ కాలంలో ముగిసిన రోజులు మిన హాయిస్తే సుమారు ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. పదవీ కాలం తక్కువే అయినా ఉప ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, రెండు జెడ్పీటీసీ స్థానాలతోపాటు 129 పంచాయతీ వార్డు మెంబర్ పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు కొవ్వూరు, తణుకు మునిసిపాలిటీల్లో ఒక్కొక్క కౌన్సిలర్ ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల జెడ్పీటీసీ సభ్యులతోపాటు కుక్కునూరులో ఎనిమిది, వేలేరుపాడులో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విలీనమైన రెండు మండలాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పాలనాపరంగా రెండు మండలాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వపరంగా అందే రాయితీలకు సైతం ఇక్కడి ప్రజలు దూరమవుతున్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో అన్నీ పదవులు కలిపి 171 పదవులకు ఉప సమరం జరగనుంది. టీడీపీలో గుబులు అధికార టీడీపీకి ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీలతో పాటు కీలక హామీలు సక్రమంగా అమలు కాకపోవడం ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. గ్రామాల్లో ఏ ఒక్కరికీ ఇల్లు, ఇల్లు స్థలం మంజూరుకాకపోవడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు, నిరుద్యోగులకు రూ.2 వేలు భతి హామీలను తుంగలో తొక్కడంపై నిరుద్యోగులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా పేదలకు అందకపోవడం వంటి అంశాలు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సర్కారు అవలభిస్తున్న వైఖరి కారణంగా ఉప ఎన్నికలపై ఏవిధమైన ప్రభావం పడుతుందోన న్న భయం నాయకులను వెంటాడుతోంది. వ్యూహ, ప్రతివ్యూహాలు రానున్న ఉప ఎన్నికలకు అధికార టీడీపీ, వైఎస్సార్ సీపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. కులాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. పెద్ధేవం, కుమారదేవంలో వైఎస్సార్ సీపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీyీ పీ బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆరికిరేవుల, నెలటూరులో తమ ఎంపీటీసీ స్థానాలు పదిలం చేసుకోవాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిపక్షం బలమైన పాత్ర పోషిస్తుంది. దీంతో నవంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
వసూళ్ల ఫీవర్....?
–పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు ఉరుకులు...పరుగులు –కలెక్టర్ హెచ్చరికలతో అధికారుల్లో గుబులు –జిల్లా వ్యాప్తంగా రూ.77.84కోట్లు మేరకు బకాయిలు కొవ్వూరు: వారం రోజుల్లో తొభైశాతం కంటే తక్కువగా పన్నులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ హెచ్చరికలు ఈవోపీఆర్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల్లో గుబులు రేపుతున్నాయి.లక్ష్యాల సాధన కోసం పల్లెల్లో ఉరుకులు పరుగులు తీస్తున్నారు.2015–16 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో పంచాయతీలకు ఇంటి, కుళాయి పన్నులు కలిపి రూ.6.46 కోట్లు వసూలు కావాల్సి ఉంది.దీనిలో ఇళ్ల పన్నుల వసూళ్లు సరాసరి 93శాతం రాగా, కుళాయి పన్నులు మాత్రం 86 శాతమే వసూలు అయ్యాయి.దీంతో గత ఏడాది రావాల్సిన పన్నులను వారం రోజుల్లో తొభైశాతం పైబడి వసూలు చేయని వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఏలూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెచ్చరించారు.జిల్లాలో 23 మండలాల్లో తొభైశాతం లోపు పన్నులు వసూలు చేసిన మండలాలున్నాయి.కలెక్టర్ హెచ్చరికల నేపధ్యంలో ఆయా మండలా లకు చెందిన ఈవోపీఆర్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మైక్ ప్రచారాలతో పన్నుల వసూళ్లకు చర్యలు చేపట్టారు.కిందిస్ధాయి సిబ్బందికి పన్నుల వసూళ్లపై దిశనిరే్ధశం చేశారు.అయితే నిరే్ధశించిన మేరకు వీరిలో లక్ష్యాలను చేరుకునేది ఎంతమంది అనేది వేచిచూడాల్సిందే.ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే ఆరునెలలు పూర్తయ్యింది. పంచాయతీలకు ఇంటి,కుళాయి పన్నుల రూపేణా బకాయిలతో కలిపి రూ.77.84 బకాయిలు వసూలు కావాల్సి ఉంది.ఈ పన్నుల్లో కేవలం ఇంటి పన్నులు ఆరుశాతం, కుళాయి పన్నులు తొమ్మిది శాతం మాత్రమే వసూలయ్యాయి.ముఖ్యంగా పంచాయతీల్లో ఇళ్ల పన్నులు రివిజన్ చేయడం మూలంగా పన్నులు భారీగా పెరిగాయి.దీంతో లక్ష్యాల సాధనలో అధికారులు అపసోపాలు పడుతున్నారు.ఈ వారంలో నిరే్ధశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు కాకపోతే ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం అధికారులను వెంటాడుతుంది. 23 మండలాల్లో తక్కువగా వసూలైన పన్నులు: జిల్లా కేంద్రమైన ఏలూరు మండలంలో ఇంటి పన్నులు ఎనభై ఐదుశాతం వసూలైతే, కుళాయి పన్నులు 82శాతమే వసూలు చేశారు.వేలేరుపాడు మండలంలో ఇంటిపన్నులు నూరుశాతం వసూలు చేసినప్పటికీ కుళాయి పన్ను మాత్రం కేవలం మూడు శాతం వసూలు చేసి జిల్లాలో చివరిస్ధానంలో నిలిచింది.కుళాయి పన్నులు వసూళ్లలలో జిల్లాలో కుక్కునూరు,లింగపాలెం మండలాల్లో 42 శాతంతో వెనుకబడి ఉన్నాయి. మొగల్తూరులో 43 శాతం, పోలవరం 52 శాతం, వీరవాసరం లో 58 వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. పెదవేగి,చింతలపూడి, పెరవలి మండలాల్లో 70 శాతం లోపు కుళాయి పన్నులు వసూలు చేసిన జాబితాలో ఉన్నాయి. టి.నరసాపురం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి, దెందులూరు, గణపవరం, పెదవేగి, పెంటపాడు, ఉంగుటూరు, చాగల్లు, దేవరపల్లి, మండలాల్లోను,ఆచంట, ఆకివీడు, కాళ్ల మండలాల్లో కుళాయి పన్నులు తొభైశాతం లోపు మాత్రమే వసూలు అయ్యాయి.ఇళ్ల పన్ను వసూలులో చాగల్లులో 71శాతంతో చివరిస్ధానంలో ఉండగా పోలవరం 76శాతం,వీరవాసరం 77, లింగపాలెంలో 79 శాతం,ఏలూరులో 85,ఉండ్రాజవరం, దేవరపల్లి మండలాల్లో 89 శాతం వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. ఇప్పుడు లక్ష్య సా««దlన కోసం ఈ మండలాల్లో అధికారులు నానా ప్రయాసలు పడుతున్నారు. అక్రమ కుళాయిలపై నో యాక్షన్: జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో అక్రమ కుళాయి కనెక్షన్ లున్నాయి.రాజకీయ ఓత్తిళ్లు, ఇతర కారణాలతో వీటిని నియంత్రించ కపోవడంతో పంచాయతీలకు రావాల్సిన లక్షలాది రుపాయిల సోమ్ములు పక్కదారి పడుతుంది. అక్రమ కుళాయి కనెక్షన్లపై దష్టి సారిస్తే పంచాయతీలకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా దష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది. -
పంచాయతీలకు షాక్
– విద్యుత్ బిల్లులు మీరే కట్టుకోండి – 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోండి – పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు – తగదంటున్న సర్పంచ్లు ఏలూరు (ఆర్ఆర్ పేట) : గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు, మంచినీటి సరఫరా తదితర అవసరాలకు వినియోగించే విద్యుత్కు సంబంధించిన బిల్లులను చెల్లించే విషయంలో సర్కారు చేతులెత్తేసింది. ఆ బిల్లు బకాయిలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోవాలంటూ షాకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలకు ఉత్తర్వులు అందాయి. పన్నుల రూపంలో వస్తున్న కొద్దిపాటి ఆదాయం పంచాయతీల నిర్వహణకే సరిపోక సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న కొద్దోగొప్పో అభివద్ధి పనులు చేసుకోవచ్చని సర్పంచ్లంతా ఆశించారు. అయితే, ఏడాదికి పైగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో 12 శాతం వరకు సొమ్మును విద్యుత్ బిల్లులకు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో షాక్ తినడం పంచాయతీ పాలకుల వంతయ్యింది. పంచాయతీలపైనే భారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తరువాత పాలకులు ఆ భారాన్ని పంచాయతీలపై నెట్టేశాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా కనికరిస్తుందని పంచాయతీ పాలకవర్గాలు ఆశించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సైతం పంపించాయి. అయినా.. ప్రభుత్వం కనికరించలేదు. ఆ భారాన్ని పంచాయతీలు మోయాల్సిందేనంటూ.. 12వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ శాఖకు చెల్లించాలని ఆదేశాలందాయి. రాకరాక వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 12 శాతాన్ని విద్యుత్ బకాయిలు తీర్చడానికి వెచ్చిస్తే గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలకు ఏం ఖర్చు చేయగలమని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.7.53 కోట్ల బకాయిలు జిల్లాలోని అన్ని పంచాయతీలు విద్యుత్ శాఖకు రూ.7.53 కోట్ల బిల్లులను బకాయిపడ్డాయి. సెప్టెంబర్ నెల బిల్లులతో కలిపితే బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది. ఆర్థిక సంఘం నిధులు 57 కోట్లు 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాలోని 909 పంచాయతీలకు రూ.57 కోట్లు›విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు పంచాయతీలు తమకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 12 శాతం విద్యుత్ శాఖకు చెల్లిస్తే రూ.6.84 కోట్లు కరిగిపోతాయి. విద్యుత్ బిల్లుల బకాయి దాదాపు 95 శాతం వరకూ తీరుతుంది. డీపీవోతో చర్చిస్తాం పంచాయతీల బకాయిపడిన విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి మార్గదర్శకాలు అందాయి. దీనిపై జిల్లా పంచాయతీ అధికారితో చర్చించి పంచాయతీ పాలకవర్గాలు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరతాం. అనంతరం పంచాయతీలకు కొంత గడువు ఇస్తాం. అప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలపై చర్యలు చేపడతాం. – సీహెచ్.సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఈపీడీసీఎల్ -
గ్రంథాలయ సెస్ వసూలుకు చర్యలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్లైన్లో గ్రంథాలయ శాఖ ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ శ్రీరామమూర్తి బుధవారం సభ్యులతో సమీక్షించారు. గొల్లలకోడేరు, వేలూర్పు గ్రంథాలయ భవనాల నిర్మాణానికి చేరో రూ.26 లక్షలు, భీమవరం శాఖా గ్రంథాలయం మరమ్మతులకు రూ.6 లక్షలు, ఎలక్ట్రికల్ వాటర్ మోటారు తదితర మరమ్మతులకు రూ.6 లక్షలు, జంగారెడ్డిగూడెం గ్రంథాలయ మరమ్మతులకు రూ.5 లక్షలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ పై అంతస్తులోని భవనం మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిమిత్తం రూ.6.50 లక్షలు, ఆచంట గ్రంథాలయం ఆధునికీకరణకు సభ్యులు తీర్మానించారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సై, గ్రామ కార్యదర్శులు, గ్రూప్ వన్, టూ పోస్టులకు ఉచితంగా ఏలూరు శాఖా గ్రంథాలయంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఇస్తామన్నారు. డీఈవో డి.మధుసూదనరావు, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్వి సీహెచ్ మదారు, గ్రంథాలయ సంస్థ సభ్యులు బండి సుజాత, కొడవలి వెంకటరమణ, లైబ్రేరియన్ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
గ్రంథాలయ సెస్ వసూలుకు చర్యలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్లైన్లో గ్రంథాలయ శాఖ ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ శ్రీరామమూర్తి బుధవారం సభ్యులతో సమీక్షించారు. గొల్లలకోడేరు, వేలూర్పు గ్రంథాలయ భవనాల నిర్మాణానికి చేరో రూ.26 లక్షలు, భీమవరం శాఖా గ్రంథాలయం మరమ్మతులకు రూ.6 లక్షలు, ఎలక్ట్రికల్ వాటర్ మోటారు తదితర మరమ్మతులకు రూ.6 లక్షలు, జంగారెడ్డిగూడెం గ్రంథాలయ మరమ్మతులకు రూ.5 లక్షలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ పై అంతస్తులోని భవనం మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిమిత్తం రూ.6.50 లక్షలు, ఆచంట గ్రంథాలయం ఆధునికీకరణకు సభ్యులు తీర్మానించారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సై, గ్రామ కార్యదర్శులు, గ్రూప్ వన్, టూ పోస్టులకు ఉచితంగా ఏలూరు శాఖా గ్రంథాలయంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఇస్తామన్నారు. డీఈవో డి.మధుసూదనరావు, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్వి సీహెచ్ మదారు, గ్రంథాలయ సంస్థ సభ్యులు బండి సుజాత, కొడవలి వెంకటరమణ, లైబ్రేరియన్ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
‘ప్రత్యేకంగా’ మగ్గుతున్నాయి
పాలకుల్లేని పంచాయతీలు విలీన కొర్రితో ఐదేళ్లుగా ప్రత్యేక పాలనలో 37 పంచాయతీలు రెండేళ్లుగా అనపర్తి పంచాయతీలో ప్రత్యేక పాలన మరణాలు, రాజీనామాలతో ఇన్చార్జీల ఏలుబడిలో మరో ఏడు సమస్యలతో సతమవుతున్న ప్రజలు మండపేట : వెలగని వీధి దీపాలు...తొలగని చెత్త, డ్రైన్లలో పారని మురుగునీరు, కుళాయిల్లోంచి రాలని నీటిబొట్టు, వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు ఇవన్నీ పల్లెలను చుట్టుముడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా పాలకులు లేకుండా దుర్భరజీవనం సాగిస్తున్న పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, అధికారులు ఎప్పుడు వస్తారో తెలియని దుస్థితి. దీంతో నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయంగా తయారైంది. విలీన ప్రతిపాదనలు నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మృతులు, ఇతర కారణాలతో సర్పంచులు లేని పంచాయతీలు మరో ఏడు వరకూ ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేకపాలనలోనే మగ్గిపోతున్నాయి. 2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకుగాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాల నేపధ్యంలో జిల్లాలోని 37 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో విలీన నేపధ్యంలో రూరల్ మండలంలో 10 గ్రామాలు, రాజానగరం మండలంలో ఏడు, కోరుకొండ మండలంలో నాలుగు గ్రామాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాకినాడ కొర్పొరేషన్ పరిధిలో కాకినాడ రూరల్ మండలంలో ఏడు గ్రామాలు, మండపేట మున్సిపాల్టీ పరిధిలో ఆరు గ్రామాలు, సామర్లకోట పరిధిలో రెండు, పెద్దాపురం పరిధిలో ఒక గ్రామానికి ఎన్నికలు జరగలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4వ తేదీతో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి. దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. ఇదిలా ఉండగా విలీన ప్రతిపాధనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన వారు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. మరణాలు.. రాజీనామాలు... పెదపూడి మండలం జి.మామిడాడ, మలికిపురం మండలం ఇరుసుమండ, ఆత్రేయపురం మండలం లొల్ల తదితర పంచాయతీల్లో సర్పంచుల మృతితో ఉప సర్పంచులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జంటిల్మెన్ ఒప్పందంలో భాగంగాSకాజులూరు మండలం నామవానిపాలెం సర్పంచి రాజీనామా చేశారు. కరప మండలం పాతర్లగడ్డ సర్పంచి జెడ్పీటీసీగా గెలుపొందడంతో సర్పంచి పదవికి రాజీనామా చేయగా ఉప సర్పంచి ఇన్చార్జి ఉన్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఎన్నికలు జరుగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా : బూరిగ జానీ, ఏడిద, మండపేట మండలం మండపేట మున్సిపాల్టీలో విలీన ప్రతిపాదనతో పంచాయతీ ఎన్నికలు నిలిపివేశారు. ఏడిద పంచాయతీకి ఎన్నికలు జరపాలని రెండేళ్ల క్రితం హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవస్థలు పడుతున్నాం : నాగమణి, తూరంగి, కాకినాడ రూరల్. పట్టించుకునే వారు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమల విజృంభణతో జ్వరాలు పెరిగిపోతున్నాయి. -
తండాలను పంచాయతీలుగా గుర్తించాలి
– ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా 500 జనాభా కలిగిన గిరిజన తండాలు, చెంచు గూడేలు, ఎరుకల కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్నాయక్ కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు కరపత్రాలను కైలాస్నాయక్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది లంబాడీ, చెంచు, యానాది, ఎరుకల తదితర గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ముఖ్యమైన పదవులను గిరిజన వర్గాలకు రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్లతో భర్తీ చేయాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 50 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.1500 వృద్ధాప్య పింఛన్తోపాటు నిత్యావసరాలు అందించాలన్నారు. వచ్చే ఎన్నికల్లోS కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కనీసం ఒక్కో ఎమ్మెల్యే సీటును గిరిజనులకు కేటాయించాలన్నారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమితి రాయలసీమ ఇంచార్జీ రామచంద్రనాయక్, జాతీయ నాయకులు శంకర్నాయక్, నాయకులు ఆనంద్నాయక్, మల్యానాయక్, మారుబాయి, ఇజ్జిబాయి, మహేష్నాయక్, లోకేష్నాయక్ పాల్గొన్నారు. -
ప్రతి పంచాయతీలో రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు
– జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలను కాపాడేందుకు తక్షణం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రెండు రెయిన్గన్లు, రెండు స్ప్రింక్లర్లతో పాటు వాటికి అవసరమైన పైపులు సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితరులు సమన్వయంతో పంటలను కాపాడాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా టోల్ఫ్రీ నెంబర్తో సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 హెక్టార్లను ఒక యూనిట్గా గుర్తించినందున ఆ యూనిట్లో ఉన్న రైతులందరి వివరాలను సేకరించాలన్నారు. మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు, ఎంపీడీఓలు పంటలను తడపడంలో బాధ్యత తీసుకోవాలని, గ్రామ స్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఇఓలు పర్యవేక్షించాలన్నారు. ఒక్క ఎకరాలో కూడా పంట ఎండకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఉపపోరుకు నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 8న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ 26 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ వచ్చేనెల 3న నామినేషన్ల విత్డ్రా 4 సర్పంచ్, 24 వార్డు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో పంచాయతీ ఉప పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చే శారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన పలు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్దానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 26న జిల్లా ఎన్నికల అధికారి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. 26 ఉదయం 10.30 గంటల నుంచి 29 సాయంత్రం 5 గంటల వరనకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూటినీ, 31 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లపై ఆర్డీవో అప్పిళ్ళను స్వీకరిస్తారు. సెప్టంబర్ 1 అప్పిళ్ళను ఆర్డీవో పరిశీలించి వివరాలు వెల్లడిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. 8న ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికారుల హడావిడి జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్ , డీపీఓ నారాయణరావులు ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఈవీఎంలను సిద్ధం చేశారు. మొత్తం 90 ఈవీఎంలను పరిశీలించారు. వీటిలో 90 కంట్రోల్ యూనిట్, 90 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. పూర్తయిన ఓటరుజాబితా... 2016 మే 31 వరకు వచ్చిన ఓటరు దరఖాస్తులతో జూన్ 20న నూతన ఓటరు జాబితాను ప్రకటించారు. ఇందుకోసం 2016 జనవరిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఫొటో ఓటర్ల జాబితాలను ఆయా పంచాయతీలు, వార్డులలో ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సైతం అధికారులు గుర్తించారు. నోటిఫికేషనే తరువాయి... పంచాయతీల ఉప పోరుకు జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం ప్రకటించారు. ఈవీఎంల చెకప్ సైతం పూర్తవడంతో ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చుల అంచనాలను పంపారు. సర్పంచ్ స్థానాలివే... జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు, 24 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అ«ధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాటిలో చింతకాని , కల్లూరు మండలంలో చిన్నకోరుకొండ , రఘనాథపాలెం మండలంలో చిమ్మపూడి, టేకులపల్లి మండలంలో బడ్డుతండా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కామేపల్లి మండలం మద్దులపల్లి ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారు. వీటితో పాటు 24 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
పంచాయతీ ఉపపోరుకు నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 8న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ 26 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ వచ్చేనెల 3న నామినేషన్ల విత్డ్రా 4 సర్పంచ్, 24 వార్డు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో పంచాయతీ ఉప పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చే శారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన పలు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్దానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 26న జిల్లా ఎన్నికల అధికారి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. 26 ఉదయం 10.30 గంటల నుంచి 29 సాయంత్రం 5 గంటల వరనకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూటినీ, 31 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లపై ఆర్డీవో అప్పిళ్ళను స్వీకరిస్తారు. సెప్టంబర్ 1 అప్పిళ్ళను ఆర్డీవో పరిశీలించి వివరాలు వెల్లడిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. 8న ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికారుల హడావిడి జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్ , డీపీఓ నారాయణరావులు ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఈవీఎంలను సిద్ధం చేశారు. మొత్తం 90 ఈవీఎంలను పరిశీలించారు. వీటిలో 90 కంట్రోల్ యూనిట్, 90 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. పూర్తయిన ఓటరుజాబితా... 2016 మే 31 వరకు వచ్చిన ఓటరు దరఖాస్తులతో జూన్ 20న నూతన ఓటరు జాబితాను ప్రకటించారు. ఇందుకోసం 2016 జనవరిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఫొటో ఓటర్ల జాబితాలను ఆయా పంచాయతీలు, వార్డులలో ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సైతం అధికారులు గుర్తించారు. నోటిఫికేషనే తరువాయి... పంచాయతీల ఉప పోరుకు జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం ప్రకటించారు. ఈవీఎంల చెకప్ సైతం పూర్తవడంతో ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చుల అంచనాలను పంపారు. సర్పంచ్ స్థానాలివే... జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు, 24 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అ«ధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాటిలో చింతకాని , కల్లూరు మండలంలో చిన్నకోరుకొండ , రఘనాథపాలెం మండలంలో చిమ్మపూడి, టేకులపల్లి మండలంలో బడ్డుతండా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కామేపల్లి మండలం మద్దులపల్లి ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారు. వీటితో పాటు 24 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
నిడమనూరు : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంచాయితీ తీర్మానాలకు వేదిక మారుతోంది. పాఠశాలకు సెలవు ఉంటేచాలు ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుంటారు. పాఠశాల ఎదురుగానే పోలీస్స్టేషన్ ఉండడంతో దీనిని వేదికగా వినియోగించుకుంటున్నారు. వచ్చిన వారు మల, మూత్రాలు పాఠశాల ఆవరణలోనే విసర్జిస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. దీంతో తెల్లారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. పాఠశాల ప్రహరీ గోడకు అక్రమంగా దారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులు, ఇతరులు పాఠశాల ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి ఇతరులు పాఠశాల ఆవరణలో పంచాయితీలు పెట్టి.. అపరిశుభ్రంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
నిడమనూరు : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంచాయితీ తీర్మానాలకు వేదిక మారుతోంది. పాఠశాలకు సెలవు ఉంటేచాలు ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుంటారు. పాఠశాల ఎదురుగానే పోలీస్స్టేషన్ ఉండడంతో దీనిని వేదికగా వినియోగించుకుంటున్నారు. వచ్చిన వారు మల, మూత్రాలు పాఠశాల ఆవరణలోనే విసర్జిస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. దీంతో తెల్లారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. పాఠశాల ప్రహరీ గోడకు అక్రమంగా దారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులు, ఇతరులు పాఠశాల ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి ఇతరులు పాఠశాల ఆవరణలో పంచాయితీలు పెట్టి.. అపరిశుభ్రంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో కామన్ సర్వీసు సెంటర్లు(మీసేవకేంద్రాలు) ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తగిన ఆర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గవర్నెన్స్ పాలనలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మీసేవ కేంద్ర తరహాలో కామన్ సర్వీస్సెంటర్లు ఏర్పాటు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది వరకే మీసేవ కేంద్రాలు ఉన్న పంచాయతీలను మినాహాయించి మిగిలిన పంచాయతీల్లో కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులయి, కంప్యూటర్ డిప్లమో కలిగి తెలుగు, ఇంగ్లిషులలో చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల, దరఖాస్తులు చేసుకునేందుకు WWW.ESEVA.AP.GOV.IN, WWW.AP.MEESEVA.GOV.IN, WWW.APIT.AP.GOV.IN, WWW.ONLINEAP.MEESEVA.GOV.IN, WWW.MEESEVAONLINEAP.IN, WWW.KURNOOL.AP.GOV.IN వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. -
సమస్యల వాడి
ఇరుకు గదుల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జిల్లాలో ఒక్క కేంద్రానిక్కూడా అన్ని వసతులు లేవు సకల సౌకర్యాలతో ‘గుర్తింపు’ సాధించేదెప్పుడో? కనిపిస్తున్న ఈ పూరి గుడిసె అంగన్వాడీ కేంద్రమంటే నమ్మండి. ఇది పెద్దమండ్యం మండలంలోని పంచాయతీ కేంద్రం సీ.గొల్లపల్లె అంగన్వాడీ కేంద్ర ం. కేంద్రం లో 6 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 20మంది, 3ఏళ్లనుంచి ఆరేళ్ల చిన్నారులు 16 మంది ఉన్నారు. వీరంతా పాఠశాల వేళకు ఇక్కడికి వస్తారు. పౌష్టికాహారం స్వీకరించాక ఇళ్లకు వెళ్తారు. అంగన్వాడీ కేంద్రాలు ఏలా ఉన్నాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం. బి.కొత్తకోట: పొరుగున ఉన్న మహరాష్ట్రలోని అంగన్వాడీ కేంద్రాలు సకల సౌకర్యాలతో కొనసాగుతూ ఐఎస్ఓ గుర్తింపు పొందాయి. సాక్షాత్తూ మన ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. మన సర్కారుకు కూడా అక్కడ తీరుతెన్నులపై నివేదిక ఇచ్చారు. ఐఎస్ఓ గుర్తింపు మాటేమో గానీ మన జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు కనీస సౌకర్యాలకు కూడా దూరమయ్యాయి. బాల్యాన్ని ఇరుకుగదుల్లో బంధించేస్తున్నాయి. ఇరుకుగా, గాలి సోకని గదుల్లో కూర్చోబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో అన్ని వసతులు కలిగినవి వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంగన్వాడీ కేంద్రంలో మూడు గదులు, మరుగుదొడ్డి, స్నానా లగది, విద్యుత్, నీటివసతి ఉండాలి. దీనికిగానూ పట్టణప్రాంతాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 అద్దెగా నిర్ణయించి చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,768 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 6నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 2,20,679 మంది, 24,018మంది బాలింతలు వస్తున్నారు. ఇందులో 1,528 కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాల్లో మారుమూల ప్రాంతాల్లోని కొన్నింటి కనీస భద్రతకూడా లేదు. ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలకు అనువైన భవనాలు ఇచ్చేందుకు యజమానులు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఇరుకు గదుల్లోనే కేంద్రాల నిర్వహణ సాగిపోతోంది. కేంద్రానికి 51మంది అధికారులు చెబుతున్న లెక్కల ప్రకా రం ప్రధాన అంగన్వాడీ కేంద్రానికి సగటున 15 నుంచి 20మంది, మినీ కేంద్రానికి 10నుంచి 15మంది ఉన్నా రు. అధికారిక లెక్కల ప్రకారం గర్భిణుల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు సగటున 51మంది ఉన్నారు. ఇంతమందిని ఇరుకు గదిలో ఉంచడం అసౌకర్యంగా మారింది. కొత్త కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణలు చేపట్టారు. 1,528 అద్దె భవనాల్లో 2015-16లో మంజూరైన 159 భవనాలను ఒక్కోదానికి రూ.9లక్షలు మంజూరు చేశారు. ఈ భవనాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు నిధులు సరిపోని పరిస్థితి. 2016-17 సంవత్సరానికి 312 భవనాలు మంజూరుచేయగా ఒక్కో భవనానికి రూ.12లక్షలు కేటాయించారు. ఈ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. పశువులపాక అసంపూర్తి భవనం మండల కేంద్రం పెద్దతిప్పసముద్రంలో ఏనిమిదేళ్ల క్రితం రూ.7లక్షల బీఆర్జీఎఫ్ నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాలుగేళ్ల క్రితమే పనులు నిలిపివేయడంతో అసంపూర్తిగా ఆగిపోయింది. దీన్ని ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పశువులపాకగా మారిపోయింది. కొందరు స్థానికులు ఇందులో పశువులు, మేకలకు షెల్టర్గా వాడుకుంటున్నారు. గుర్తింపు సాధిస్తాం అంగన్వాడీ కేం ద్రాలకు కలెక్టర్ నిధులు మంజూ రు చేశారు. రూ.12 లక్షల వ్యయంతో నిర్మించే భవనాలకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. పక్కా భవనం, ప్రహరీగోడ, తా గునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, మైదానం లాంటి ఆవరణం ఉంటాయి. ఇలా సంపూర్ణ సౌకర్యాలతో ఐఎస్ఓ గుర్తింపు దక్కించుకుంటాం. -ఎస్.లక్ష్మి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ, చిత్తూరు -
బదిలీల జాతర!
♦ నేడు పంచాయతీ కార్యదర్శులకు కౌన్సెలింగ్ ♦ మూడేళ్లు పైబడిన వారికి స్థానచలనం ♦ ఏ,బీ,సీ కేటగిరీలుగా క్లస్టర్ల విభజన ♦ వీఆర్ఓల బదిలీలకు రంగం సిద్ధం ♦ అభ్యంతరాలను కోరుతూ నేడు నోటిఫికేషన్ పంచాయతీ కార్యదర్శుల బదిలీకి ముహూర్తం ఖరారైంది. మూడేళ్ల పైబడిన 265 మందికి స్థానచలనం కలిగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. పంచాయతీ గ్రేడ్కు తగ్గట్టుగా కార్యదర్శుల నియామకాలు లేకపోవడం.. కొన్ని క్లస్టర్లలో ఒకరే ఉండడం, శివార్లలో ఇద్దరు.. ముగ్గురు ఉండడంతో వీరిని హేతుబద్ధీకరించాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది. కొన్నేళ్లుగా బదిలీలపై ఆంక్షలు ఉండడం.. పలుకుబడి ఉన్నవారు నేరుగా శివారు పంచాయతీల్లో పోస్టింగ్లు పొందుతుండడం.. మారుమూల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొంతమంది కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందన్రావు పంచాయతీరాజ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యదర్శుల మార్పులు, చేర్పులకు తెరతీశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలోని 688 గ్రామ పంచాయతీలను అధికారులు 371 క్లస్టర్లుగా విభజించారు. దీంట్లో మూడేళ్ల పైబడినవారి జాబితాను సిద్ధం చేశారు. బదిలీల ను కూడా ఏ,బీ,సీ కేటగిరీలుగా వర్గీకరిం చారు. దీనికి అనుగుణంగా శివారు పంచాయతీల్లో పనిచేస్తున్నవారిని సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాలకు.. అక్కడి వారు ఇక్కడకు పోస్టింగ్ పొందేలా మండలాల వారీగా కేటగిరీలను నిర్దేశించారు. దీంతో శుక్రవారం జరిగే కౌన్సెలింగ్లో ఈ మేరకు ఆప్షన్ను ఇచ్చే అవకాశం కార్యదర్శులకు కల్పించారు. కాగా, 34 మందికి పదోన్నతులు కల్పించిన జిల్లా యంత్రాంగం.. మరో 33 మందిని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీల్లో సడలింపులు ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో వితంతు, వికలాంగులు, ఆఫీసు బేరర్లు, మరో కేట గిరీ వారికి మినహయింపులు ఇ చ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దొడ్డిదారి పోస్టింగులతో.. నగరానికి సమీపంలోని జిల్లాకు చెందిన పంచాయతీల్లో పనిచేసేందుకు పోటీ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో కొందరు సచివాలయ స్థాయిలో పైరవీలు నెరిపి ప్రత్యేక ఉత్తర్వులతో కీలక పంచాయతీల్లో తిష్టవేశారు. అధికారుల అండదండలతో.. అమాత్యుల ఒత్తిడితో ఒకే స్థానంలో కుర్చీకి అతుక్కుపోయారు. కుత్బుల్లాపూర్, సరూర్నగర్, మేడ్చల్, హయత్నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో ఒకటో శ్రేణి పంచాయతీల్లో తక్కువ కేడర్కు చెందిన వారిసంఖ్య ఎక్కువగా ఉంది. వీటిల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులే అధికం. తాజాగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు జిల్లా యంత్రాంగం పచ్చజెండా ఊపడంతో వారిలో గుబులు మొదలైంది. కౌన్సెలింగ్ ఇలా.. గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్లోని అపార్డ్లో జరగునుంది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,2,3 శ్రేణులకు చెందిన కార్యదర్శుల బదిలీలు నిర్వహించనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి గ్రేడ్-4 కార్యదర్శుల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు మండల విస్తరణ అధికారులుకు సంక్షిప్త సమాచారం ద్వారా సమాచారాన్ని పంపింది. తాజాగా క్లస్టర్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం చొరవ చూపుతుండడంతో మెజార్టీ కార్యదర్శులకు స్థానచలనం కలగనుంది. వీఆర్ఓల బదిలీలకు గ్రీన్సిగ్నల్! గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్ఓ) బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న 106 మందికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యంతరాలను కోరుతూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు. -
దుబ్బాక, బాదెపల్లిలకు ‘పన్ను’ పోటు
సిద్దిపేటలో విలీనమైన 6 గ్రామ పంచాయతీలకు సైతం సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన దుబ్బాక, బాదెపల్లి(జడ్చర్ల) నగర పంచాయతీలతో పాటు సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనమైన 6గ్రామపంచాయతీల్లో వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆస్తి పన్నుల మోత మోగనుంది. ఈమేరకు ఆస్తి పన్ను ల సవరణకు ప్రత్యేక ఆదేశాలిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నుల పెంపు అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక మునిసిపల్ కమిషనర్లకు సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం ఈ నెల 10వ తేదీలోపు ఆయా నగర పంచాయతీ/మునిసిపాలిటీ పాలకవర్గాలు.. భవనాలు, స్థలాలపై విధించే ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ తీర్మానం చేయాలి. ఆస్తి పన్నుల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల 15లోపు ప్రకటించి వచ్చే నెల 10వ తేదీలోపు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలి. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ వచ్చే నెల 30వ తేదీలోపు కౌన్సిల్లో మళ్లీ తీర్మానం చేస్తారు. అనంతరం పన్నుల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. వార్షిక అద్దె విలువలో 25 శాతానికి మించకుండా నివాస భవనాలపై, 35 శాతానికి మించకుండా నివాసేతర భవనాలపై ఆస్తి పన్నులను విధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాలపై మార్కెట్ విలువలో 0.20 శాతాన్ని ఆస్తి పన్నుగా విధిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటా సర్వే జరిపి శాస్త్రీయ పద్ధతుల్లో తీసుకున్న కొలతల ఆధారంగా ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేస్తారు. -
పెప్సికోను తాకిన వేడి
పాలక్కడ్: దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ సంస్థ పెప్సీకోను ఈ వేడి తాకుతోంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న పుథుస్సెరి పెప్సికో ప్లాంట్పై ఆ గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. గ్రామ ప్రజలు త్రాగునీరు దొరక్క అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైతం పెప్సికో వారు రోజుకు కొన్ని లక్షల లీటర్ల నీటిని భూమి నుంచి తోడుతుండటంపై ఆందోళన చెందిన పుథుస్సెరి పంచాయితీ సభ్యులు.. పెప్సీకో చర్యలను అడ్డుకోవాలని సోమవారం తీర్మానం చేశారు. దీనిపై కంపెనీకి నోటీసులు అందించాలని వారు నిర్ణయించారు. వారం తరువాత జరగనున్న మరో సమావేశంలో దీనిపై మరింత ముందుకు పోవాలని పుథుస్సెరి వాసులు భావిస్తున్నారు. -
మాట వింటే ఉండు.. లేదంటే వెళ్లిపో!
► ఏపీఓ చక్రవర్తిపై టీడీపీ నేతల ఫైర్ ► చెప్పిన పనులు చేయాలని హుకుం ► ఈ ఏపీఓ మాకొద్దని పీడీకి ఫిర్యాదు ఆలూరు రూరల్: ‘మా మాట వింటే ఉండు లేదంటే వెళ్లిపో.... మా పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పింది వినాల్సిందే. వారు అడిగిన పని చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకుండేది లేదు’ అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్గౌడ్ ఆలూరు ఏపీఓ చక్రవర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏపీఓ ఆలూరు మండలంలో వద్దు బదిలీ చేయాలని జిల్లా డ్వామాపీడీ పుల్లారెడ్డికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. కమ్మరచేడు గ్రామంలో టీడీపీ నేత చెప్పిన వారికి ఏపీఓ గడ్డపారలు పంపిణీ చేయలేదు. ఈ విషయంపై ఆ గ్రామ టీడీపీ నేత, ఏపీఓ చక్రవర్తి మధ్య గత వారం రోజులుగా వార్ సాగుతుంది. ఎట్టకేలకు ఏపీఓ చక్రవర్తి గ్రామ పంచాయతీ తీర్మానం, వంద రోజులు పనులు పూర్తి చేసిన వారికి ఫీల్డ్ అసిస్టెంటు, సీనియర్ మేటీలు పంపిన కూలీల పేర్లకే గడ్డపారలను పంపిణీ చేస్తామని తెగేసి చెప్పారు. దీనిని జీర్ణియించుకోలేక ఆ నేత బుధవారం ఆలూరుకు వచ్చిన నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే వారు ఏపీఓ కార్యాలయానికే వెళ్లారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పిన పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఏపీఓ సమాధానం చెబుతుండగానే.. డ్వామా పీడీ పుల్లారెడ్డికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్ ఫోన్ చేశారు. తమ మాట వినని ఏపీఓ ఇక్కడ పని చేయకూడదని ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నా.. కమ్మరచేడు గ్రామ టీడీపీ నేత ప్రజాప్రతినిధికి బంధువు అయినంత మాత్రాన ఆయన మాటలు విని, ఓ అధికారి అని కూడా చూడకుండా కించపరిచేలా సిబ్బంది ఎదుట మాట్లాడడం టీడీపీ నేతలకు తగదు. నిబంధనల ప్రకారం నడుచుకునే అధికారులపై ఒత్తిళ్లు తగవు. అవసరమైతే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమే. - చక్రవర్తి, ఏపీఓ -
అటకెక్కిన వివాహ రిజిస్ట్రేషన్లు..
పరిగి: వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటకెక్కింది. పంచాయతీలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడాలంటూ ప్రభుత్వం తప్పనిసరి నిబంధన విధించినా.. పంచాయతీలు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ వివాహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే పెళ్లిళ్లు జరిపించుకోవాలనే నిబంధన చట్టంలో చాలకాలం నుంచి ఉన్నప్పటికీ.. ఆ చట్టం సమగ్రంగా లేనందున ఎక్కడో ఓచోట తప్ప.. ఎక్కడా అమలుకు నోచుకోలేదు. పరిస్థితుల దృష్ట్యా అమలు పరిచేందుకు ఏ గ్రామ పంచాయతీ ఇప్పటివరకు సాహసించ లేదు. కానీ 2012లో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుపడింది. 2012 ముందువరకు ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మతాల ప్రాతిపదికన కొన్ని మినాహాయింపులు ఉండగా.. 2012 కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సర్వజనీనంగా అన్ని మతాలవారికి ఈ రిజిస్ట్రేషన్ చట్టం వర్తించేలా చట్టం మారింది. కానీ పంచాయతీల నిర్లక్ష్యంతో ఎక్కడా అది కనిపించడం లేదు. ఇదీ నిబంధన.. గత 2002 సంవత్సరంలో ప్రభుత్వం ముం దస్తు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమలుకోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించ లేదు. కనీసం గ్రామ పంచాయతీలకు సర్య్కులర్లు కూడా పంపలేదు. దీంతో చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయింది. అయితే బాల్యవివాహాల నిర్మూలన కోసం పనిచేసిన పలు స్వచ్ఛంద సంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2002 క్లాజ్ 12 ప్రకారం గ్రామపంచాయతీల్లో వివాహానికి ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2006లో ప్రభుత్వం పీఆర్ 193 జీఓను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత, తప్పనిసరిగా అమలు చేసే అధికారాలను గ్రామపంచాయతీలకు కట్టబెట్టింది. గతంలో బాల్యవివాహాల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా నియమించింది. కానీ చట్టంలో ఉన్న లొసుగులు, అధ్యంతరాలవల్ల ఏ ఒక్క చోట ఇది అమలుకు నోచుకున్న పాపానపోలేదు. పక్కాగా అమలు చేస్తే.. బాల్యవివాహాలు తగ్గే అవకాశం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 30 నుంచి 40 శాతం బాల్యవివాహాలే జరుగుతున్నాయని ఎంవీ ఫౌండేషన్, చైల్డ్లైన్ లాంటి స్వచ్ఛంద సంస్థల లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు తప్పనిసరిగా ముందస్తు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు జరిగితే బాల్యవివాహాలు పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బాల్యవివాహాల తగ్గుదలతోపాటు స్త్రీలకు రక్షణ చేకూరనుంది. దీని ద్వారా స్త్రీల అక్రమ రవాణా కూడా నివారించడానికి వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో వివాహాలు జరుగకున్నా మెడలో తాళి వేసి స్త్రీలను, బాలికలను విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కగా అమలు చేయటం ద్వారా బాలికలు, స్త్రీల అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పంచాయతీలకు మహర్దశ
► మరిన్ని అధికారాలు.. విధుల బదిలీకి సీఎం నిర్ణయం ► కేటీఆర్కు అధ్యయన బాధ్యత ► 164 కార్యదర్శుల పోస్టుల భర్తీకి అవకాశాలు ► మెరుగుపడనున్న గ్రామ పాలన సాక్షి, మంచిర్యాల : ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం.. లోపించిన పారిశుధ్యం.. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలు.. అరకొర సిబ్బందితో ఏటా లక్ష్యం చేరుకోని ఆస్తి పన్ను వసూళ్లు.. ఇలాంటి సమస్యలు మరెన్నో గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవరోధాలుగా మారాయి. మరోపక్క.. పల్లెల అభివృద్ధి కోసం గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ‘గ్రామజ్యోతి’ పథకం అమలు ఊసే లేదు. పథకం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా చాలా చోట్ల గ్రామసభలు కూడా పూర్తి కాలేదు. ఇలా.. పడకేసిన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. పంచాయతీల బలోపేతం.. బాధ్యతను మరింత పెంచే విధంగా గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పల్లె పాలన అభివృద్ధిని పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీ రాజ్శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ఓ కమిటీకి అధ్యయన బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో.. అభివృద్ధిలో వెనకబడిన.. అత్యధిక మారుమూల గ్రామాలు.. సమస్యల్లో చిక్కుకున్న పల్లెలకు మహర్దశ రానుంది. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు జిల్లాలో 866 గ్రామ పంచాయతీలున్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి 580 క్లస్టర్లుగా చేశారు. 70శాతం జనాభా గ్రామాలో ్లనే ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం.. నిధుల వినియోగంలో అక్రమాల కారణంగా అభివృద్ధి కుంటుపడింది. కనీసం గ్రామాల్లో పారిశుధ్యం.. రక్షిత తాగునీరు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు అధికారాలు.. విధులు.. బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు.. పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం(సర్పంచులతో జాయింట్ చెక్పవర్).. పలు ధ్రువీకరణ పత్రాల జారీ వంటి చిన్న చిన్న పనులకే పరిమితమైన పంచాయతీ కార్యదర్శులకు ఇకపై క్షేత్రస్థాయిలో అమలయ్యే ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకంలో భాగస్వాములను చేసి.. వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం నిర్ణయించారు. దీంతో పనుల పురోగతికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 580 క్లస్టర్లలో కేవలం 416 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం నిర్ణయంతో జిల్లాలో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న 164 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. పంచాయతీల నుంచి ఏటా రూ. 17లక్షల ఆస్తిపన్ను వసూలు కావాలి. కానీ కార్యదర్శులు లేకపోవడంతో 65 శాతానికి మించి వసూళ్లు జరగడం లేదు. కార్యదర్శుల పోస్టులు భర్తీ అయితే పన్నుల వసూళ్లతోపాటు గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వీలుంటుంది. మరోపక్క.. గ్రామజ్యోతి పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 654 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు వాటిలో ఏడు మాత్రమే ఏర్పాటయ్యాయి. 276 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలోనూ జిల్లా వెనకబడే ఉంది. జిల్లాకు 42,268 మరుగుదొడ్లు మంజూరైతే.. ఇప్పటివరకు 2,620 మాత్రమే పూర్తయ్యాయి. 8,346 నిర్మాణ దశలో ఉన్నాయి. పెద్ద ఇంకుడు గుంతల విషయానికొస్తే.. 5396 మంజూరైతే.. 1201 నిర్మాణ దశలో ఉన్నాయి. 179 మాత్రమే పూర్తయ్యాయి. చిన్న ఇంకుడు గుంతలు 40,255 మంజూరైతే.. 3,619 నిర్మాణ దశలో ఉన్నాయి. 800 మాత్రమే పూర్తయ్యాయి. సుమారు 14వేల పైచిలుకు శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు రెండు వేలకు మించి శ్మశాన వాటికల నిర్మాణాలు జరగలేదు. పల్లెల్లో పనుల వేగ వంతం.. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 580 క్లస్టర్లలో ఈ-పంచాయతీలు చేసింది. ఇప్పటి వరకు 30కి మించి ఈ-పంచాయతీలు జిల్లాలో కానరాని పరిస్థితి. విద్యుత్, ఆన్ లైన్ సమస్యతోపాటు పర్యవేక్షణ లేకే ఈ పంచాయతీల లక్ష్యం అమలుకు ఆమడ దూరంలో ఉంది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించేందుకు జిల్లాకు మూడు వేలకు పైగా సైకిల్ రిక్షాలు వచ్చే వీలుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకంతోపాటు సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో గ్రామాల దశ మారుతుందని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య అభిప్రాయపడ్డారు. -
నిరుపేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు
► స్మోక్ఫ్రీ గ్రామాల ఎంపికకు రంగం సిద్ధం ► సర్వే మొదలుకు ఆదేశాలు జారీ ► జిల్లాలో లక్ష గ్యాస్ కనెక్షన్ల పంపిణీకి చర్యలుఔ సాక్షి, కర్నూలు: గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకునే నిరుపేద మహిళల కష్టాలు ఇకపై తీరనున్నాయి. స్మోక్ఫ్రీ (పొగ రహిత) గ్రామాల సాధన లక్ష్యంగా కేంద్రం 2016-17 బడ్జెట్లో కేటాయించిన రూ. 2 వేల కోట్లతో బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు పంచాయతీరాజ్ శాఖ సహకారంతో సర్వే మొదలు పెట్టాయి. ఈ సర్వే పూర్తయితే మొదటి దశలో జిల్లాలోని ప్రతి మండలంలో కనీసంగా మూడు గ్రామాలు పొగ రహితంగా మారనున్నాయి. జిల్లాలో హెచ్పీ, ఐఓసీ, బీపీసీ ఆయిల్ కంపెనీల ద్వారా 5.45 లక్షల కుటుంబాలకు వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ఇటీవల దీపం పథకం ద్వారా లక్ష వరకు కనెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కనెక్షన్కు రూ. 1,600 రాయితీని భరించి మహిళలకు వీటని అందజేశారు. దీంతో జిల్లాలో గ్యాస్తో వంటచేసే కుటుంబాల సంఖ్య ఆరు లక్షలు దాటింది. దీపం ద్వారా డిపాజిట్ చెల్లించి గ్యాస్ కనెక్షన్ను పొందలేని నిరుపేద కుటుంబాలను గుర్తించి దశలవారీగా గ్రామాలను పొగ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్రం ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎలాంటి డిపాజిట్ లేకుండా గ్యాస్ కనెక్షన్(సిలిండర్, రెగ్యులేటర్)ను నిరుపేద కుటుంబాలకు అందిస్తారు. గ్యాస్ స్టౌవ్ మాత్రం పథకంలో చేర్చలేదు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని అమలు చేసేందుకు మండల పరిషత్తులు ఆ మండలాల పరిధిలోని పంచాయతీల సర్పంచుల సహకారంతో లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఈ దిశగా ఆయా గ్యాస్ డీలర్లకు, మండల పరిషత్తులకు ఆదేశాలు అందాయి. ఇలా పంచాయతీకి కనీసంగా 15 కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఆయిల్ కంపెనీలు తమ పరిధిలోని గ్యాస్ డీలర్లకు నిర్ధేశించాయి. -
స్నేహితుడే కాలయముడు!
►వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ► హతమార్చిన వైనం తల, చేతులు ►నరికి తీసుకెళ్లిన నిందితుడు ► కొండమల్లేపల్లి శివారులో మొండెం లభ్యం దేవరకొండ / మాడ్గుల : స్నేహితుడు, బంధువని చేరదీసిన వ్యక్తే కాలయముడయ్యాడు. ఆశ్రయమిచ్చిన మిత్రుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొని అడ్డుగా ఉన్నాడని చివరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం శరీర భాగాల ను వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కోల్మంతల్ పహాడ్ సమీపంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పరిధిలోని పాల్త్యీతండాకు చెందిన పి.రవి (31), శ్యామల దంపతులు. రోజువారీ కూలిపని చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అదే తండాకు చెందిన శ్రీధర్ సమీప బం ధువు, మిత్రుడు. దీంతో తరచూ రవి ఇంటికి వస్తూ ఉండేవా డు. ఈ క్రమంలోనే శ్యామలతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడటంతో రెండేళ్ల క్రితం రవి, శ్రీధర్కు మధ్య గొడవ జరిగింది. పెద్ద మనుషులను ఆశ్రయించడంతో పంచాయితీ పెట్టి శ్రీధర్ను హైదరాబాద్కు పం పించారు. అనంతరం రవి తన భార్యను తీసుకుని మహబూబ్నగర్ జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయిన పల్లి సమీపంలోని వెంకటేశ్వర పౌల్ట్రీఫాం లో పనికి కుదిరాడు. ఇటీవల శ్రీధర్ తిరిగి వచ్చి అక్కడే పని చేస్తున్నాడు. ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్ని ఈనెల 10న మాయమాటలు చెప్పి రవిని కొండమల్లేపల్లికి తీసుకెళ్లి అదే అర్ధరాత్రి చంపేశాడు. మరుసటి రోజు మృతుడి తండ్రి పీకానాయక్కు ఫోన్ చేసి ‘మృతదేహం కోల్మంతల్ పహాడ్ సమీపంలో ఉంది. వచ్చి తీసుకెళ్లండి..’ అని సమాచారమిచ్చా డు. దీంతో మృతుడి బంధువులు ముందుగా మాడ్గుల పోలీసులకు కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు చేశారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం సంఘటన స్థలానికి వెళ్లగా తల, చేతులు లేని మృతదేహాన్ని గుర్తించారు. కాగా, దేవరకొండ సీఐ గట్టు మల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అంతా మిస్టరీనే.. రవిని ఎలా హత్య చేశారనే విషయం పూర్తిగా బహిర్గతం కావడంలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో శ్రీధర్తోపాటు మరికొందరు కలిసి రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తల, చేతులను కత్తితో నరికి నిందితులు తీసుకెళ్లారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
ముదిరిన వివాదం
* సంధ్యారాణి వర్సెస్ భంజ్దేవ్ * కేంద్రమంత్రి అశోక్ వద్దకు చేరిన పంచాయితీ సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాయకుల మధ్య వైరం ముదిరిపోతుంటే వారిని అంటిపెట్టుకున్న కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. శాసన మండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆర్పి భంజ్దేవ్ల మధ్య ఆధిపత్య పోరు మరోమారు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ నాయకుల మధ్యే చాపకింద నీరులా ఉన్న వైరం ఈ సారి ఆయా వర్గాల వారీగా పోట్లాడుకు నేంతవరకు పాకింది. శాసన మండలి సభ్యురాలిగా పదవి ఉన్న తనను కాదని కొన్ని కార్యక్రమాలు, సభలకు భంజ్దేవ్ అన్నీతానై ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, సంధ్యారాణి తీవ్రంగా మండిపడుతున్నారు. పోస్టులు, నియామకాలు పక్క మండలానికి పాచిపెంట మండలానికి చెందిన పలు పదవులు, పోస్టులను సాలూరు మండలానికి చెందిన వారికి కట్టబెడుతున్నారని సంధ్యారాణి వర్గం అరోపిస్తోంది. పాచిపెంట మండలానికి చెందిన పారమ్మకొండ ఆలయ కమిటీ నియామకంలో స్థానిక మండల నాయకులకు కాకుండా సాలూరు మండల నాయకులకు కట్టబెట్టారన్నది సంధ్యారాణి వాదన. అలాగే ఇక్కడి విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను కూడా సాలూరు మండలానికే కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. మరో పక్క పాచిపెంట మండలంలోని పెద్ద గెడ్డ జలాశయం సాగునీటి సంఘం ఎన్నికలో కూడా సాలూరు ప్రాంత వాసులకే ప్రాధాన్యం ఇచ్చి ఏర్పాటు చేశారని సంధ్యారాణి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీని కాదని భంజ్దేవ్ అన్నీ తానే అయి ప్రొటోకాల్ను కూడా విస్మరించి ప్రారంభోత్సవాలు, సభలకు హాజరవుతున్నారని సంధ్యారాణి వర్గం వాపోతోంది. కష్టానికి లేని గుర్తింపు జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులు ఎవరు వచ్చినా సంధ్యారాణి సమాచారం ఇవ్వడం లేదని భంజ్దేవ్ వర్గంలోని పలువురు సాలూరు మండల నాయకులు చెబుతున్నారు. ఎంతో కష్టపడి మున్సిపాలిటీని సాధించుకుంటే ఏదైనా చిన్న కార్యక్రమం జరుగుతున్నా ఆమె వచ్చి హల్చల్ చేస్తుండడంతో తమ కష్టానికి తగిన గుర్తింపు ఉండడం లేదని మున్సిపల్ చైర్పర్సన్ భర్త గొర్లె మాధవ రావు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఒకరి రూట్ మరొకరు తెలుసుకుంటూ ఆయా వర్గాల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని వీడిపోవాలా? సాలూరులో వర్గపోరు తీవ్రమవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. నాయకుల మధ్య వైరం తమ పీకలమీదకి వచ్చిందనీ ఇలాగే కొనసాగితే పార్టీని వదిలి వెళ్లిపోవడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు ఇద్దరినీ హెచ్చరించినట్టు తెలిసింది. అశోక్ బంగ్లాకు భంజ్దేవ్ వర్గం సాలూరు నియోజకవర్గానికి సంధ్యారాణి వర్గం వల్ల ఇబ్బందులు తప్పవని ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వర్గంలోని నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాచిపెంట మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్బాబు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె మాధవరావు, మెంటాడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు జలుమూరి వెంకట రమణ, సాలూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి, మక్కువ మండలం జెడ్పీటీసీ భర్త తిరుపతి తదితరులు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకు వెళ్లి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఆయనను కలిసి సంధ్యారాణిపై ఫిర్యాదు చేశారు. ఇద్దర్నీ గట్టిగా నిలదీయండి పార్టీ పరిస్థితిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో అశోక్ గజపతిరాజు ఘాటుగా స్పందించారని తెలిసింది. పార్టీ పరువు ఎక్కువగా తీస్తున్న వారిద్దరినీ గట్టిగా నిలదీయండని అన్నట్టుగా సమాచారం. ఇటువంటి వారి వల్ల పార్టీ పరువు పోతోందని, సద్దుమణిగిద్దామని సముదాయించినట్లు భోగట్టా! -
రేప్ చేసిన వ్యక్తిని కాళ్లు పట్టించి వదిలేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికి రెండోసారి అన్యాయం జరిగింది. ఆమెపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందిపోయి కేవలం బాధితురాలి కాళ్లు పట్టించడం ద్వారా అతడిని వదిలేశారు. అనంతరం ఈ ఘటన ఇక మరిచిపొమ్మంటూ బాధితురాలిని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలి జిల్లాలో గల ఓ గ్రామపంచాయితీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల వితంతువుపై గత నెల జనవరి 28న లైంగికదాడి జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఆ గ్రామ పెద్ద ఆమెను ఆపి కేసు ముందుకు వెళ్లనివ్వకుండా స్టేషన్ బయటే పంచాయతి నిర్వహించాడు. నిందితుడితో బాధితురాలి కాళ్లను పట్టించి వదిలేశాడు. ఇకపై ఈ ఘటనపై నోరు మెదపవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక అరకొర!
జిల్లాలో ఇసుక రీచ్లకు వేలం లేనట్టే రీచ్లన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే {పభుత్వావసరాలకు సీనరేజ్ చెల్లిస్తే చాలు.. గ్రామ పరిధిలో వ్యక్తిగత అవసరాలకు ఉచితం తోపుడు బండ్ల ద్వారానే రవాణాకు అనుమతి ఆరు రీచ్ల్లోనే అందుబాటులో.. ఇసుక కష్టాలు రెట్టింపు విశాఖపట్నం : మారిన కొత్త ఇసుక విధానం జిల్లా వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కన్పిస్తోంది. ముఖ్యంగా నగరవాసులకు ఈ కష్టాలు మరింత రెట్టింపయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఉన్న రీచ్ల్లోని ఇసుకను విశాఖ, అనకాపల్లి, ఆనందపురం డిపోలకు తీసుకొచ్చి నగర పరిధిలోని అవసరాలను కొంతలో కొంత తీర్చేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక పాలసీ ప్రకారం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆర్డర్ పరిధిలో ఉండే జీవనదుల పరివాహక ప్రాంతాలలోని 20 వేల క్యూ.మీ. ఇసుక ఉన్న రీచ్లకు వేలం వేయాలని సర్కార్ ఆదేశించింది. థర్డ్ ఆర్డర్ పరిధిలో ఉండే చిన్న చిన్న నదులు.. వాగులు.. వంకల్లో ఉండే ఇసుక రీచ్ల నిర్వహణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించింది. గతేడాది జిల్లాలో డీ నోటిఫై చేసిన 25 రీచ్ల్లో 19 రీచ్ల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరు రీచ్ల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. అందులో ఏజెన్సీ పరిధిలో మంగమంద రీచ్లో మినహా మిగిలిన ఏ రీచ్లోనూ పట్టుమని నాలుగైదువేల క్యూ.మీ. ఇసుక కూడా లేదు. ప్రస్తుతం ప్రవాహం ఎక్కువగా ఉండడం. ఏజెన్సీ ఇసుక నిర్మాణానికి అంతగా అనువగా లేకపోవడంతో మంగబంద రీచ్కు వేలం వేసే పరిస్థితి లేదు. ఇక మిగిలిన గవరవరం, జుర్తాడ, సాగరం, గొట్టివాడ, కాశీపట్నం రీచ్ ల్లో మొత్తం 10 వేల క్యూ.మీ.కు మించి ఇసుక లేదు. ఇసుక లభ్యత అంతంతమాత్రమే: ఇటీవల మైన్స్ అండ్ జువాలజీ డిపార్టుమెంట్ సర్వే చేసి గుర్తించిన 39 రీచ్ల్లో కూడా ఎక్కడా పట్టుమని పదివేల క్యూ.మీ. ఇసుక లేని పరిస్థితి. పైగా రీచ్ల చుట్టూ స్ట్రక్చర్స్ ఉండంతో వాల్టా చట్టం ప్రకారం తవ్వకాలు జరిపే అవకాశం కూడా లేదని మైనింగ్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో రెండు మూడు నెలల పాటు డీనోటిఫై చేసిన రీచ్ల్లో ఇసుక నిల్వలను గుర్తించే అవకాశం లేదు. డ్రాప్ట్ గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఏ ఒక్క రీచ్కు వేలం వేసే చాన్స్ లేదు. థర్డ్ ఆర్డర్ పరిధిలో ఉండే రీచ్ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా స్థానికంగా ఉండే పంచాయతీలకే అప్పగించింది. ఆ మండల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సీనరేజ్ ఫీజు క్యూ.మీ.కు రూ.40 చొప్పున చెల్లించి ఎండ్లబండ్లపై మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలి. గ్రామ పరిధిలో వ్యక్తిగత అవసరాలకైతే పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న రీచ్ల్లోనే కాదు.. మిగిలిన రీచ్ల్లో ఇసుకను కూడా గ్రామం లేదా మండలం దాటి తీసుకెళ్లే అవకాశం లేదు. ఈ లెక్కన గ్రామీణ జిల్లాతో పాటు విశాఖ సిటీ పరిధిలో నిర్మాణ రంగానికికావాల్సిన ఇసుక కోసం పొరుగు జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇప్పటివరకు రీచ్ల్లో తవ్విన, పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఇసుకను జిల్లాలోని డిపోల ద్వారా విక్రయించే వారు. ప్రస్తుతం ఇసుక అమ్మకాలతో మైన్స్ అండ్ జువాలజీ, డీఆర్డీఎలకే కాదు.. జిల్లా కలెక్టర్కు కూడా సంబంధం లేదు. ఎవరైనా తమ అవసరాలకు ఇసుక కావాలంటే రాష్ర్టంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క ల్పించారు. పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనుగోలు విషయంలో బిల్డర్లు, బడా బాబులకు ఇబ్బంది లేకున్నా సామాన్యులకు మాత్రం ఇసుక కష్టాలు మరింత రెట్టింపయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రీచ్ల్లో అందుబాటులో ఉన్న ఇసుకను ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఈ నెలాఖరులోగా విక్రయించుకునే అవకాశాన్ని రీచ్లను నిర్వహిస్తున్న డ్వాక్రాసంఘాలకు ప్రభుత్వం కల్పించింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. -
'వాడిని బూట్లతో తన్ను'
లక్నో: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను బూట్లతో తన్నాలని ఉత్తరప్రదేశ్లోని ఓ పంచాయతీ పెద్దలు రేప్ బాధితురాలికి సూచిస్తూ తీర్పునిచ్చారు. అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని హెచ్చరించింది. రాష్ట్రంలోని తోడల్పూర్ అనే గ్రామంలో ఓ మహిళపై ఈ నెల 19న ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనై ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం పంచాయతీ పెద్దలకు తెలియడంతో వారు విభిన్నంగా తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.ఐదు లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే, లైంగిక దాడికి పాల్పడినవారిలో ఒకరు ఆ మొత్తం చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో వారి ముఖంపై అందరూ చూస్తుండగానే ఇంకు చల్లేందుకు, బూట్లతో తన్నేందుకు ఆ పంచాయతీ బాధితురాలికి అనుమతిస్తూ తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపట్ల పలువురు సామాజిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు గాలికొదిలేయడం వల్లే పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. -
రాష్ట్రాల సమస్యలపై పంచాయితీ!
నీతి ఆయోగ్ మధ్యవర్తిత్వంలో చర్చలు.. కేంద్రం కొత్త ప్రయోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను... ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్కు అప్పగించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో రాష్ట్రాలవారీగా ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరపాలని సూచించింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ భేటీలకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానించింది. రాష్టాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఆయా సమస్యలతో సంబంధమున్న కేంద్ర మంత్రిత్వశాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో చర్చలు జరిపితే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారమయ్యే అవకాశాలుంటాయని కేంద్రం భావిస్తోంది. నీతి ఆయోగ్ అధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే బృందానికి రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర విభజనతో ముడిపడిన వివిధ అంశాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో కొన్ని పరిష్కారమైనప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రధానంగా విద్యుత్, సాగునీటిపారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతులు, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల రంగాలతోపాటు ఉమ్మడి హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు తదితరాంశాల్లో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు సైతం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఢిల్లీలో జరిగే భేటీ సందర్భంగా ఈ అంశాలన్నింటిపై కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చించనున్నారు. సమస్యలున్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులందరూ ఈ సమావేశాలకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తోంది. సమస్యలు, సంబంధిత వివరాలతో నివేదికలు తయారు చేయాలంటూ రాష్ట్ర ప్రణాళికశాఖ అన్ని శాఖలకు సమాచారం చేరవేసింది. -
పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీకి ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 35,000 ప్రాంతీయ పంచాయతీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రముఖులు ఓటమి చెందారు. అత్యధిక స్థానాల్లో మంత్రులకు సంబంధించిన అభ్యర్ధులు ఓటమి చెందారు. ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బహదూర్ పాఠక్ మాట్లాడుతూ.. 'ఎన్నికల ఫలితాలు ప్రజల్లో సమాజ్ వాదీ పార్టీకి గల వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు' అని తెలిపారు -
సీమాంధ్రులతో పంచాయితీ లేదు
* రెండు రాష్ట్రాలు ఏర్పడకుంటే ఏపీ అభివృద్ధి చెందేదా: మంత్రి కేటీఆర్ * అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతాం * కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్లోని సీమాంధ్రులతో మాకు ఎలాంటి పంచాయితీ లేదు. వాళ్లు బావుండాలి, మనమూ బావుండాలి’ అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడగానే హైదరాబాద్లో అల్లకల్లోలం జరుగుతుందని, పారిశ్రామికవేత్తలు పారిపోతారని, తెలంగాణ వారికి పరిపాలన చేతకాదని, సీమాంధ్రుల్ని తరుముతారని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నర్సింహ యాదవ్ తన అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. రెండు రాష్ట్రాలుగా కాకుండా ఉమ్మడి ఏపీగానే ఉంటే అమరావతిలో కొత్త రాజధాని నిర్మించాలనే ఆలోచన వచ్చేదా, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటివి అభివృద్ధి చెందేవా, ఏపీకి లాభం జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్లే అభివృద్ధిలో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. 425 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ అన్ని వర్గాల వారినీ, అన్ని మతాల, ప్రాంతాల వారిని అక్కున చేర్చుకుందన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా, సఖ్యత దెబ్బకొట్టాలని ప్రయత్నించినా గట్టిగా నిలబడ్డామని, శాంతిభద్రతలను పరిరక్షించామని చెప్పారు. కూకట్పల్లి ప్రాంతంలో ఉంటున్న సీమాంధ్రులు ఆలోచించాలని కోరారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, గతంలో వీరు పాలించనట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నగరంలో 18 చోట్ల రూ.2,651 కోట్లతో స్కైవేలు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మూడు నె లల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ రోడ్లను తయారు చేస్తామన్నారు. శివారు మున్సిపాలిటీల సమస్యలనూ పరిష్కరిస్తామని, 30 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. దీనికోసం రూ. 1,700 కోట్లు హడ్కో రుణం మంజూరైందని, రూ.200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని మొత్తం గా రూ.1,900 కోట్లతో సమస్యలు తీరుస్తామని చెప్పారు. మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని దుయ్యబట్టారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతరం నర్సింహయాదవ్, ఆయన అనుచరులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. -
ఉపాధికి గొడ్డలిపెట్టు
రాజకీయ దురుద్దేశం మహత్తర పథకాన్ని నీరుగారుస్తోంది. దిశ చూపే సారథి లేకుండా రథాన్ని సాగించాలని చూస్తోందీ ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర వహించే క్షేత్ర సహాయకులను కుంటి సాకులతో తొలగించి కూలీల పొట్టగొడుతోంది. వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతిపిత పేరుతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ సర్కారు కుహనా రాజకీయాలతో అతలాకుతలం చేస్తోంది. ఫలితంగా ఏ పాపం ఎరుగని కూలీ బతుకుదెరువు కోసం నగరాలకు వలస పోతున్నాడు. - 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు ఖాళీ - 491 పంచాయతీల్లో మాత్రమే లక్ష్యం మేరకు పనులు - మిగిలిన చోట్ల అరకొర పనులు సాక్షి, చిత్తూరు: ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారం ఉపాధిహామీ పథకంలో లక్ష్యం చేరడానికి మరింత అడ్డంకిగా మారింది. అసలే అరకొర పనులు జరుగుతున్న ఈ పథకంలో నిర్దేశిత లక్ష్యాలు చేరుకోలేదంటూ ఒక్కసారిగా 365 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. జిల్లా వ్యాప్తంగా 1363 పంచాయతీల్లో ప్రస్తుతం 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు లేరు. ఇక వెయ్యి పనిదినాలు కూడా కల్పించలేని పరిస్థితిలో 159 పంచాయతీల్లో ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఇక వెయ్యి నుంచి ఐడు వేల లోపు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నారన్న కారణంగా 405 పంచాయతీలలో పీల్డ్ అసిస్టెంట్ల కు బదులు సీనియర్మేట్ల ను మాత్రమే నియమించారు. కాని వాటిలో కూడా క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యాలను అధిగమించలేదంటూ ఇటీవల 165 మందిని తొలగించారు. ఇక మిగిలిన 759 పం చాయతీల్లో మాత్రమే ఇటీవల వరకు ఫీల్డ్అసిస్టెంట్లు ఉన్నారు. అయితే పంచాయతీల్లో 5 వేల పనిదినాలకు తగ్గకుండా పనులు కల్పించడమే కాక ముందస్తు ప్రణాళికలో చూపించిన పనుల్లో 75 శాతం పైగా పనులు చేయించాల్సి ఉంది. ఈ రెండు లక్ష్యాలను అధిగమిస్తేనే ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతారు. కానీ వీరిలో లక్ష్యాలు చేరలేదంటూ 216 మంది క్షేత్ర సహాయకులను తాజాగా తొలగించా రు. దీంతో మొత్తం 381 మందిని తొలగించినట్లైంది. దీనికి తోడు ఖాళీగా ఉన్న 165 పంచాయతీలను కలిపితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 1363లో 640 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది లేరు. అయితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పేరుకు ఉపాధి పనులు జరుగుతున్నా కేవలం 491 పంచాయతీల్లో మాత్రమే నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు జరుగుతున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తేల్చింది. మిగిలిన పంచాయతీల్లో మొక్కుబడి పనులు మాత్రమే జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 6.5 లక్షల మంది ఉపాధి హామీ జాబ్కార్డులు పొందగా డ్వామా లెక్కల ప్రకారం రోజుకు 1.10 లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అరకొరగా మాత్రమే పనులు జరుగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.293.43 కోట్ల ఖర్చు చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో పాటు కూలీలకు గిట్టుబాటు కూలీ లభించకపోవడంతో ఉపాధి పనులపై వారు మొగ్గు చూపించడం లేదు. మరోవైపు కనీస వేతనం రూ.169కి పెంచినట్లు చెబుతున్నా అది కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. కోర్టును ఆశ్రయించిన ఫీల్డు అసిస్టెంట్లు నిర్ధాక్షిణ్యంగా తొలగించారంటూ చం ద్రగిరి నియోజకవర్గం నుంచి ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లు తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. మరో 50 మంది ఫీల్డు అసిస్టెంట్లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే నిబంధనల మేరకే ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు చర్యలు చేపట్టినట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. 2011 నుంచి డ్వామాలో ప్రోగ్రెస్ రిపోర్టు నిబంధనలు అమలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఫీల్డు అసిస్టెంట్ల పనితీరు ఆధారంగా 2012 డిసెంబర్లో 256 మందిని తొలగించగా, 2013 అక్టోబర్ 13లో 113 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. 2014లో కొత్తప్రభుత్వం ఏర్పడ్డాక ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కన పెట్టారు. తాజాగా 356 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచనల మేరకే ఈ కార్యక్రమం జరుగుతోందని అధికార వర్గాల భోగట్టా. తక్షణం ఖాళీగా ఉన్న పంచాయతీల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి మరింత మంది కూలీలకు పనులు కల్పిస్తేనే లక్ష్యాలు చేరే అవకాశం ఉంటుంది. -
మంత్రి చెప్పారని..నగదు డ్రా!
- కురుడు పంచాయతీ నుంచి రూ. 15లక్షలు విత్డ్రా - ఎంపీడీవో సొంత ఖాతాలోకి జమ - విచారణ చేసేందుకూ భయపడుతున్న జిల్లా అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారం ఉందికదా... ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారో... ఏమో మంత్రిగారు చెప్పారని ఓ పంచాయతీనుంచి మొత్తం రూ. 15లక్షలు డ్రా చేసుకుని తన సొంతఖాతాలో జమచేసుకున్నారు. ఇది సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళంజిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి ఎంపీడీఓ ఘనకార్యం. మంత్రిగారు వెనకున్నారని తెలుసుకున్న జిల్లా అధికారులు దీనిపై విచారణ చేపట్టేందుకు కూడా సాహసించడంలేదు. టెక్కలి నియోజకవర్గంలో సుమారు 120గ్రామాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచ్లున్నారు. అంతకుమించి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన సర్పంచ్లూ ఉన్నారు. రాజకీయ కక్షతో గత సెప్టెంబర్లో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి చెందిన 18మంది సర్పంచ్లకు చెక్ పవర్ తప్పించేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం తీర్మానాలు చేపట్టి, పనుల వివరాలను స్థానిక అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేసి నిధుల్ని పక్కాగా వినియోగించుకోవాల్సిన స్థానిక సిబ్బంది ఇదే అదనుగా సర్పంచ్లు లేని చోట, చెక్ పవర్ రద్దయిన చోట తమ సత్తా చూపించుకుంటున్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి ఎంపీడీఓ బి.రాజులు కురుడు పంచాయతీ నిధులు రూ.15లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. అసలేమైందంటే... కురుడు సర్పంచ్గా వైఎస్సార్సీపీకి చెందిన రొక్కం సూర్యప్రకాశరావు(జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు)కు రాజకీయ కక్షతో గత ఏడాది సెప్టెంబర్లో చెక్పవర్ రద్దు చేయించారు. అనంతరం మంత్రి కనుసన్నల్లో మార్చిలో రూ. 3లక్షల 25వేల పంచాయితీ నిధులు తప్పించేశారు. తాజాగా జూన్ 11వ తేదీన మంత్రి అనుచరుడు బోర నాగభూషణరావు పేరిట స్థానిక ఎంపీడీవో రాజులు రూ.15లక్షలు డ్రా చేయడమే గాకుండా కోటబొమ్మాళిలోని ఇండియన్బ్యాంకులోని తన సొంత ఖాతాలో జమ చేయించుకున్నారు. ఈ విషయం ట్రె జరీలో సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల్ని అక్కడి ఎంపీడీవో 004287/846నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004288/847నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004289/849నంబర్ చెక్కుద్వారా రూ.2లక్షల 90వేలు, 004290/849 నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 30వేలు, 004291/850 నంబర్ చెక్ ద్వారా రూ.2లక్షలతోపాటు జూన్ 11, 2015త తేదీనే చెక్కులతో పాటు ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా మరో రూ.2లక్షలు డ్రా అయినట్టు జిల్లా ట్రెజరీ అధికారులు సహకార హక్కుచట్టం ద్వారా చేసిన వినతికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై ఎంపీడీవోను అడిగితే ‘మంత్రిగారు డ్రా చేసుకోమన్నారు..డ్రా చేసుకున్నా’అని చెప్పడం గమనార్హం. మంత్రి కుటుంబీకులకు ఈ మొత్తాన్ని చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని స్థానికులు కొందరు జూన్ 24న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జెడ్పీ సీఈవోకు పరిశీలించాల్సిందిగా పంపించారు. జెడ్పీ సీఈవో టెక్కలి డీఎల్పీవోకు విచారణ చేయాలని అప్పగించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతీ లేదు. అయితే చేయని పనులు చేయించినట్టు ఇప్పుడు రికార్డులు సృష్టించే పనిలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. పాత తేదీలతో అంచనాలు తయారు చేయించేసి, ఎంబుక్ల నిర్వహణ, పనులు చేపట్టినట్టు రికార్డులు తయారు చేయించడానికి అక్కడి ఇంజినీర్లపైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈవో, టెక్కలి డీఎల్పీవో, ఎంపీడీవోలను వివరణ కోరేందుకు సాక్షి పలుమార్లు ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదు. చర్యలెందుకు తీసుకోవట్లేదు? పంచాయితీ చట్టానికి విరుద్ధంగా డబ్బులు డ్రా చేయడం, నిధులు మళ్లించే అధికారం ఎంపీడీవోకు ఎవరిచ్చారు. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఎంపీడీవో ఇక్కడెన్నో దారుణాలకు ఒడిగడుతున్నా అడిగే నాథుడే లేడు. మొత్తం రూ.15లక్షలు మాయమైతే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావట్లేదు. - రొక్కం సూర్యప్రకాశరావు, సర్పంచ్, కురుడు గ్రామ పంచాయితీ -
నేటినుంచి నామినేషన్ల పర్వం
సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీస్థానాలకు ఎంపీడీఓ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ స్థానానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఆ...ఆరు సర్పంచ్ స్థానాల ఎన్నికపైనే అనుమానాలు మండలాల్లో స్టేజ్-1 ఎన్నికల అధికారుల నియామకం అమల్లోకి వచ్చిన ఎన్నికలప్రవర్తన నియామవళి నల్లగొండ : స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సర్పంచ్ స్థానాలు 12, వార్డులు 46, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించేందుకు జిల్లా పంచాయతీ, జెడ్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు స్థానాలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. దీని కోసం ఆర్డీవోలు ప్రత్యేకంగా మండల స్థాయిలో స్టేజ్ -1 అధికారులను నియమించారు. మోత్కూరు మండలం ముసిపట్ల ఎంపీటీసీ స్థానానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పశుసంవర్థక శాఖ ఏడీ కృష్ణారావును నియమించారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికలు నిర్వహించే బాధ్యతను ఆయన పర్యవేక్షిస్తారు. నడిగూడెం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సూర్యాపేట పంచాయతీరాజ్ డీఈ కృష్ణమూర్తిని నియమించారు. నామినేషన్లు స్వీకరించేందుకు జిల్లా పరిషత్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సీఈవో రావుల మహేందర్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డెప్యూటీ సీఈ వో మోహన్ రావు వ్యవహరిస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆరు స్థానాల పైనే సస్పెన్స్... ఎన్నికలు జరిగే 12 సర్పంచ్ స్థానాల్లో ఆరు స్థానాలకు 2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడ ంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలు కూడా ఉన్నాయి. వాటిల్లో తుర్కపల్లి మండలం మోతీరాంతండా, బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్, కంచల్తండా, మేళ్లచెర్వు మండలం వజినేపల్లి, పెద్దవూర మండలం పోతునూరు, తిప్పలమ్మగూడెం పంచాయతీలు ఉన్నాయి. రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడంతో ఉపసర్పంచ్లునే కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు లేని పరిస్థితి వస్తే ఆ స్థానాలకు సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయే అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత గానీ ఆరు స్థానాలపై ఓ స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. అమల్లోకి వచ్చిన కోడ్... ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సర్పంచ్ ,వార్డు స్థానాలకు ఆయా గ్రామ పంచాయతీల పరిధి వరకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. జూలై 4 తేదీ సాయంత్రం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అలాగే మూసిపట్ల ఎంపీటీసీ స్థానానికి మోత్కూరు మండలం మొత్తానికి కోడ్ వర్తిస్తుంది. నడిగూడెం జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికల ప్రవర్తన నియామవళి సూర్యాపేట రెవిన్యూ డివిజన్ మొత్తానికి వర్తిస్తుంది. ఈ డివిజన్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో జూలై 6 తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వీల్లేదు. ఏకగ్రీవమా లేక ఎన్నికా..? నడిగూడెం జెడ్పీటీసీ సభ్యుడు మార్తి గురువులు అకాల మృతి కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ స్థానానికి ఎన్నిక లేకుండా గురువులు కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మా నించారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తేనే గురువులు కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తామని ఇతర పార్టీలు మెలికపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి వస్తే టీఆర్ఎస్, టీడీపీ, సీపీఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నాయి. గురువులు కుటుంబ సభ్యులు కాకుండా మరొకరిని పోటీలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. -
కుల వివక్ష వీడిన ఎల్గోయి.. వెలుగోయి
కులం చెదిరింది.. స్నేహం కుదిరింది నాడు కత్తులు దూసిండ్రు.. నేడు మిత్రులవుతుండ్రు ‘సాక్షి’ చిరు ప్రయత్నం.. నేడు గ్రామంలో వివాహం అందరికీ అందిన శుభలేఖలు సంగారెడ్డి: నిండు వేసవిలోనూ నిగనిగలాడే హరిత వనాల్లాంటి చెరుకు తోటలు.. వాటి నడుమ చుట్టూ ఏడూళ్ల శివార్లతో సరిహద్దు.. తెలగ, దళిత, లింగాయత్, బీసీ సబ్బండ జాతులు కలగలిసిన జీవనం.. వ్యవసాయమే జీవితం. రెక్కల కష్టమే జీవనాధారం. బాంధవ్యం, బంధుత్వమే వాళ్ల బలం. అలాంటి పల్లెలో కులం చిచ్చు రేగింది. దళితులు ‘ఆత్మగౌరవం’ కావాలంటే మరో సామాజిక వర్గం ‘అవమానం’గా భావించింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న వాళ్లు వైరి వర్గాలయ్యారు. కుల కట్టుబాట్లు పుట్టుకొచ్చాయి. కుల సంఘాలు చొచ్చుకొచ్చాయి. ఠాణా వరకు వెళ్లారు. పచ్చగా బతికిన పల్లె జనం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కులం కొలిమిలో మాడుతున్న ఆ పల్లె పేరు ఎల్గోయి. కత్తులు దూసుకున్న ఆ పల్లెలో ఇప్పుడిప్పుడే మళ్లీ పాత స్నేహం చిగురేస్తోంది. మునుపటి ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకునేందుకు తొలి అడుగు వేస్తోంది. ఊరి జనం కుల బంధనాల్లోంచి బయటికి రాబోతున్నారు. వైరి వర్గాలను కలపడం కోసం ‘సాక్షి’ ఓ చిరు ప్రయత్నం చేసింది. శనివారం గ్రామంలోని ముఖ్యులను ఒకచోట కలిపింది. పెద్దలంతా కలిసి మనుసు విప్పి మాట్లాడుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ గొప్పతనాన్ని గుర్తించారు.. దళితుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఆదివారం జరిగే తన కొడుకు పెళ్లికి రమ్మని కొత్తదొడ్డి రామన్న ఊరు ఊరంతా ‘శుభలేఖ’లు ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కూడా వీరి మైత్రికి తోడ్పడిందనే చెప్పాలి.. ఇదీ నేపధ్యం.. ఎల్గోయి గ్రామానికి చెందిన దళితులు.. సమాధుల కోసం బొందలు తీయడం ఆత్మగౌరవ సమస్యగా మారిందని, ఇకపై శవాలను ఖననం చేయడానికి బొందలు తీయకూడదని తీర్మానించుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన కొన్ని సామాజిక వర్గాలు వ్యవసాయ పనుల్లో దళితులను తీసుకోకూడదని, వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రతి తీర్మానం చేశాయి. 15 రోజుల పాటు కట్టుబా ట్లు రాజ్యమేలాయి. అది గొడవలకు దారి తీసింది. క్రమంగా విషయం బయటికి పొక్కడంతో మీడి యా, కుల సంఘాలు దళితులకు అండగా నిలబడ్డా యి. పోలీసులు రంగంలోకి దిగారు. దళితులు తమను వ్యతిరేకించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు. కేసు విచారణ దశలో ఉంది. ఎంతో కోల్పోయారు.. పల్లెలో కులం చిచ్చు రేగి నెల గడిచింది. వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టుబాట్లతో చెరకు తోటల్లో కలుపుతీత పనులు నిలిచిపోవడంతో కలుపు మొక్కలు పెరిగాయి. ఇక పోలీసుస్టేషన్లు, నేతల రాకపోకలతో ఖర్చేగానీ రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది. అన్నింటికి మించి పొద్దున లేచింది మొదలు ఇప్పటి దాకా ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ పనుల్లో ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే కుటుంబంగా కలసి బతికిన ప్రజలు.. ఇప్పుడు ఎడ ముఖం పెడముఖంగా బతికారు. మనసు మారిందిలా.. నిజానికి ఒక గ్రామ ప్రముఖుని ఇంట్లో నెల కిందట జరిగిన వివాహ మహోత్సవంలో దళితులకు అవమానం జరిగింది. దళితులు వాయించే బాజాభజంత్రీలను తప్పని పరిస్థితుల్లో వెనక్కి పంపించారు. కాలం గడిస్తున్న కొద్ది మిగిలిన సామాజిక వర్గాలు కూడా తమ తప్పును తెలుసుకున్నాయి. దళితుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని, మునుపటిలాగా కలసిమెలిసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంతోనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తదొడ్డి రామన్న తన కొడుకు వివాహానికి ఊరునంతా ఆహ్వానించారు. కుల గొడవలు పక్కనపెట్టి ఇంటింటికి పెళ్లి శుభలేఖలు ఇచ్చారు. సుమారు 2 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లికి తామంతా వెళ్తామని, కులమతాలకు అతీతంగా కొత్త దంపతులను ఆశీర్వదిస్తామని ఎంపీటీసీ మల్లికార్జున్ పటేల్, సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచులు బాబూమియా, నర్సింహులు ‘సాక్షి’ ప్రతినిధితో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అంతరమే పంచాయితీకి ఓ కారణం గ్రామంలో మొత్తం 120 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 22 కుటుంబాలకు అసలు భూమి లేదు. ఒక ఎకరా...అర్ధ ఎకరా భూమి కలిగి ఉన్న వాళ్లు 32 కుటుంబాలు ఉన్నాయి. మరి కొన్ని కుటుంబాలకు ఊరుకు తూర్పు భాగంలో ఉన్న సర్వే నెంబర్ 125, 54 ల్లో దాదాపు 75 మందికి భూములు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. పైగా నీళ్లు లేక భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో దళితులు వాటిని సాగుచేయడం లేదు. మరో వైపు ఊరు ఉత్తరం దిక్కున ఎక్కువగా ఇతర సామాజిక వర్గానికి చెందిన భూములున్నాయి.ఈ భూముల్లో నీటి సౌకర్యం ఉండటంతో మూడు కాలాల్లో కూడా పంటలు పండుతాయి. వీళ్ల భూముల్లోనే దళితులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ఉన్నఫలంగా దళితులను వ్యవసాయ పనుల్లోకి రాకుండా అడ్డుకోవడంతో వారు ఇందోళన చెంది తిరుగుబాటు చేశారు. ‘దళితులకు ప్రభుత్వం చెప్పినట్టుగా భూ పంపిణీ చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకు ప్రభుత్వం ఇతరులతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇచ్చి నీటి వసతి కల్పించాలి’ అని దళిత నాయకుడు తలారి వీరన్న చెప్పడం వారి ఆకాంక్షకు అద్దం పడుతోంది. అభివృద్ధి లేని పల్లె.... పల్లెలో స్వయం జీవన విధానమే కనిపించింది. దాదాపు 2,400 ఓట్లు ఉన్న గ్రామంలో కనీస వసతులు మాత్రం ఏమీ లేవు. 3,500 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సేద్యానికి పనికి వస్తున్నది కేవలం 2వేల ఎకరాలకు మించదు. దళిత, బీసీ కాలనీలు మట్టి రోడ్లతోనే ఉన్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా బజార్లు అన్ని గుంతలు పడి నడవటానికి వీలులేకుండా మారుతాయి. ఎస్సీ కాలనీలో 7,300 మీటర్ల పొడవైన సీసీ రోడ్డు, బీసీ కాలనీలో కనీసం 6వేల మీటర్ల సీసీ రోడ్డు అవసరం ఉన్నాయి. సీసీ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయా ప్రతిపాదనలకు అనుమతి రాలేదు. గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. ఆర్ఓఆర్ వాట ర్ ఫిల్టర్ యంత్రాలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అనుకోకుండా జరిగిపోయింది తాము అంతా కలసి మెలిసి ఉన్న వాళ్లమే. గ్రామంలో ఎక్కువతక్కువ కులం అనే అభిప్రాయభేదాలు లేవు. మొన్న జరిగిన సంఘటన ఒక పీడకల. అందరం కలసి పోవాలే. ఎప్పటిలాగే అన్ని శుభకార్యాలు కలసే చేసుకోవాలే. - బాబూమియా, మాజీ సర్పంచ్ ఈ నెల రోజులు చాలా కోల్పోయాం ఈ గొడవలతో చాలా కోల్పోయాం. వాళ్లు మేము ఎప్పుడూ ఎదురుపడి గొడవపడింది లేదు. పొలంలో కలుపు పెరిగిపోయింది. ఎన్ఆర్జీఎస్ పనులు ఆగిపోయాయి. ఒక రకంగా గ్రామం అభివృద్ధి ఆగిపోయింది. - జగన్నాథరెడ్డి రైతు నూతన జంటను ఆశీర్వదిస్తాం రామన్న ఇంటి పెళ్లికి మేం అంతా వెళ్తాం. నవ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వస్తాం. గతంలో మేం అంతా కలిసి ఉన్న వాళ్లమే. అనుకోకుండా జరిగిన సంఘటన మమ్ములను ఇబ్బంది పెడుతోంది. - మల్లికార్జున్ పటేల్, ఎంపీటీసీ -
కులాంతర పెళ్లికి 50 వేల పన్ను
కతిహార్: భిన్నంగా వ్యవహరిస్తూ మరోసారి బీహార్ కు చెందిన ఓ పంచాయతీ తీరు వార్తల్లోకి ఎక్కింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువజంటకు అక్షరాల రూ.50 వేల రూపాయల పన్ను వేసింది. కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు యాదవ్ తన పక్క గ్రామం అయిన రోహియాకు చెందిన సోని కుమాయ్ అనే మరో కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అనంతరం వారిద్దరు కతిహార్ లోకల్ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇదే కోర్టులోని హోటల్లో చోటు పనిచేస్తాడు. ఈ పెళ్లికి ముందు పెద్దల నుంచి సమస్యలు వచ్చినా తదనంతరం అంగీకరించారు. అయితే, తాజాగా వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు మాత్రం అసలు సమస్య మొదలైంది. గత నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన పంచాయతీ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నవారిరువురికి రూ.50 వేలు ట్యాక్స్ వేశారట. అది చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా నోటీసులు జారీ చేశారట. దీంతో చోటు యాదవ్ బుధవారం ఈ వివరాలు మీడియాకు తెలిపాడు. తాము చాలా పేదవాళ్లమని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పినా వినకుండా బెదిరించి మరి ఫైన్ వేశారని వాపోయాడు. -
టీడీపీ హైడ్రామా !
- అమీన్సాహెబ్ పాలెంలో పంచాయతీ సమావేశాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నాలు - వైఎస్సార్ సీపీ సభ్యులను పోలీస్స్టేషన్కు తరలించిన ఎస్ఐ - కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను దుర్భాషలాడిన దేశం నాయకులు - మోహరించిన పోలీసులు....నాటకీయ పరిణామాల మధ్య నిరవధిక వాయిదా - చివరిలో సర్పంచ్తోపాటు సభ్యులను ఓ గదిలో నిర్బంధించిన పోలీసులు - వైఎస్సార్ సీపీ సర్పంచ్ చేస్తున్న పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్ర నాదెండ్ల : వంద మంది పోలీసులు, వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఒకవైపు. నలుగురు వార్డు సభ్యు లు, సర్పంచ్ మరో వైపు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలగలసి వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు సభ్యులను భయభ్రాంతులకు గురిచేయటం చర్చనీయాంశంగా మారింది. నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పంచాయతీ సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే నిరవధికంగా 90 రోజుల పాటు వాయిదా పడింది..వివరాల్లోకి వెళితే.. మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన అమీన్సాహెబ్పాలెం గ్రామ పంచాయతీ సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. ముందుగానే 100 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు. తొలుత 10 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ ఉపసర్పంచ్ సత్తెనపల్లి శ్రీనివాసరావు, సభ్యులు తుపాకుల చెంచమ్మ, కారుచోల గోవిందమ్మ, కారుచోల రాజేశ్వరి హాజరయ్యారు. ఓ కేసులో నిందితుడిగా ఉండడంతో నిబంధనల మేరకు సర్పంచ్ కారుచోల చంద్రయ్య పోలీసులు అనుమతితో సమావేశానికి రావాల్సివుంది. ఈలోపు పంచాయతీ కార్యాలయానికి హాజరైన వైఎస్సార్ సీపీ నలుగురు సభ్యులను ఎస్ఐ సుబ్బానాయుడు తమ అనుమతి లేకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూ వారిని తమ జీపులో ఎక్కించుకొని రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ మీడియా ప్రశ్నించటంతో సర్పంచ్, వార్డు సభ్యులను కలిపి సమావేశానికి తీసుకువెళుతున్నట్టు చెప్పారు. ఓటింగ్ సరిసమానం.. 10.40 గంటలకు సర్పంచ్ కారుచోల చంద్రయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ హాజరయ్యారు. అజెండాలోని అంశాలను కార్యదర్శి కల్యాణి చదివి వినిపించగా, కొద్దిసేపటికి ఓటింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ సభ్యురాలు షేక్ ఆదమ్మను సమావేశానికి రానివ్వకుండా చేయడంతో మొత్తం 10 మంది సభ్యులకు 9 మంది హాజరయ్యారు. ఓటింగ్లో టీడీపీ సభ్యులు ఐదుగురు, వైఎస్సార్ సీపీ సభ్యులు నలుగురు పాల్గొన్నారు. సర్పంచ్ ఓటుతో సరిసమానమైంది. దీంతో ప్రత్యేకఅధికారి చంద్రశేఖర్ ఓటింగ్ సమానంగా ఉందని తీర్మానాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపడతామని చెప్పి సమావేశాన్ని 11.40 గంటలకు ముగించారు. సమావేశం ముగిసినా ...తప్పని వివాదం .... సమావేశం ముగిసిన అనంతరం సర్పంచ్ చంద్రయ్య, వైఎస్సార్సీపీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రూరల్ సీఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని గదిలో నిర్బంధించారు. నాటకీయ పరిణామాల మధ్య 12.10 గంటలకు అప్పటివరకు రానివైఎస్సార్ సీపీ సభ్యురాలు ఆదమ్మను రప్పించి సమావేశం తిరిగి నిర్వహించి, తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఓ దశలో అధికారులపై టీడీపీ నాయకులు దుర్భాష లాడటంతో చేసేది లేక ఆదమ్మ 12.10 గంటలకు హాజరైనట్లు తీర్మానం పుస్తకంలో రాసి సంతకం చేయించారు. అయినా తిరిగి సమావేశం నిర్వహించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నాయకుల ఒత్తిడితో 90 రోజుల వరకు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రత్యేక అధికారి ప్రకటించేలా చేశారు. పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ నాయకులు చివరకు సర్పంచ్ చంద్రయ్యతోపాటు వైఎస్సార్సీపీ సభ్యులను పోలీసులు తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. అనంతరం టీడీపీ నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి రెండు వైపులా ఉన్న తలుపులు మూయించి అధికారులను నానా విధాలుగా దుర్భాషలాడారు. బయటకు వచ్చిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ చంద్రయ్య, వార్డు సభ్యులను భయపెట్టడానికి సీఐ దిలీప్కుమార్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారని పలువురు ఆరోపించారు. పనులు జరగకుండా అడ్డుకోవటమే లక్ష్యం .... పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 10 లక్షలు కేటాయించింది. సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు జరగకూడదన్న దురుద్దేశంతోనే సమావేశాన్ని వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ సర్పంచ్, సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి అండదండలతో స్థానిక నాయకులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. -
ఇకపై భర్తల పెత్తనం చెల్లదు...
న్యూఢిల్లీ: 'సర్పంచ్ పతి' సంస్కృతికి ఇక చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్లుగా ఎన్నికైన మహిళల పేరుతో వారి భర్తలు పెత్తనం చెలాయించే పద్ధతికి ఇక కాలం చెల్లిందన్నారు. మహిళలు సాధికారత సాధించాల్సి అవసరం ఉందని, ఆవైపుగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలకు చట్టం సమాన హక్కులు కల్పించిందని, వాటిని మనం గౌరవించాలని మోదీ అన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్టుగా.. గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. బాలికల విద్య, డ్రాప్ అవుట్స్ను నిరోధించే విషయంలో, వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో గ్రామాలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాలికలు ఎవరైనా స్కూల్ మానేస్తే అది తీవ్రంగా పరిగణించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని సలహాలిచ్చారు. గ్రామాల పట్ల గౌరవంలేకపోతే అభివృద్ధిని సాధించలేమంటూ . ఐదు సంవత్సరాల ప్రణాళికతో ముందుకు పోవాలని పంచాయితీ, జిల్లా పరిషత్ అధికారులు సలహా యిచ్చారు. ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేసేలా పంచాయత్ సభ్యులు చూడాలన్నారు. జాతీయ పంచాయతీరాజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'ఈ- పంచాయితీ అవార్డు'లను ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్నజిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అభినందనలు తెలియజేశారు. -
పెళ్లొద్దా బాబూ.. 75పైసలు ఫైన్ చెల్లించు
హర్యానా: వివాదాస్పద తీర్పులిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే హర్యానాలోని ఖాప్ పంచాయతీ ఈసారి ఓ విచిత్రమైన తీర్పునిచ్చి ఆశ్చర్యాన్ని గొలిపింది. ఓ పక్క అమ్మాయి తరుపువాళ్లు పెళ్లి పనుల్లో తలమునకలై ఉండగా తనకు పెళ్లే వద్దని అంతకుముందు చేసుకున్న నిశ్చితార్థం రద్దుచేసుకుంటున్నాని ప్రకటించిన ఓ పెళ్లికొడుకుకు కేవలం 75 పైసల ఫైన్ వేసింది. ఈ తీర్పుతో ఇక ఇరుపక్షాలు సర్దుకోవాలని తీర్పు చెప్పింది. దీంతో ఖాప్ పంచాయతీల నిర్ణయానికి తిరుగు చెప్పలేని అమ్మాయి కుటుంబం కూడా మిన్నకుండా ఉండిపోయింది. ఫతేబాద్ జిల్లాలోని మాన్సి అనే అమ్మాయికి పంజాబ్కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. ఏప్రిల్ 22న పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, పెళ్లికి ముందే కారు, ఇతర విలువైన వస్తువులు తమకు కట్నంగా ఇవ్వాలని కోరడంతో అమ్మాయి తరఫువాళ్లు ఒప్పుకోలేదు. ఈ విషయం తొలుత పోలీసుల వద్దకు వెళ్లగా అనతరం ఖాప్ పంచాయతీ చేరింది. అక్కడి పెద్దలు ఓ గోశాల వద్ద విచారణ చేపట్టి అమ్మాయికి 75 పైసలు ఫైన్ చెల్లించాలని తీర్పిచ్చారు. అయితే, ఈ తీర్పుతో అమ్మాయి అసంతృప్తికి లోనై తిరిగి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం గమనార్హం. -
పంచాయతీలకు పైసలేవి
67 గ్రామాల్లో పుష్కర పనులకు రూ.8.08 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు నేటికీ నిధులు విదల్చని సర్కారు 38 వేల మంది పారిశుధ్య కార్మికుల అవసరమని అంచనా పర్యవేక్షణకు టాస్క్పోర్స్ కమిటీ కొవ్వూరు:జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 67 పంచాయతీల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నేటీకీ పైసా విదల్చలేదు. వివిధ పనులు చేపట్టేందుకు రూ.8.08 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసిన పంచాయతీరాజ్ అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు విడుదల కాలేదు. స్నానఘట్టాల వద్ద, ఏటిగట్టుపై లైట్ల ఏర్పాటు, చెత్త సేకరణ కు రిక్షాలు, ఆటోలు సమకూర్చుకోవడం, బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి కొనుగోలు, సూచిక బోర్డులు, డంపింగ్ యార్డుల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులను పంచాయతీలు చేపట్టాల్సి ఉంది. వీటికి సకాలంలో నిధులు అందకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 98 స్నానఘట్టాలు ఉండగా, వీటిని ఏ-గ్రేడ్లో 19, బీ-గ్రేడ్లో 27, సీ-గ్రేడ్లో 52 చొప్పున ఉన్నాయి. వీటిలో 24గంటలూ పారిశుధ్య పనులు నిర్వహించేందుకు పంచాయతీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. పారిశుధ్య పనులకు ముందస్తు ప్రణాళిక జిల్లాలో 14 వేల బ్లీచింగ్ బస్తాలు, 24వేల లీటర్ల ఫినాయిల్, 19వేల బస్తాల సున్నం, 3,600 డస్ట్బిన్స్ అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందిలో సగం మందిని పుష్కరాలు జరిగే 67 గ్రామాలకు తరలించాలని నిర్ణయించారు. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రభుత్వ ఖాళీ స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. చెత్తను తరలించేందుకు రిక్షాలు, హైడ్రాలిక్ ఆటోలను ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమకూర్చాల్సి ఉంది. అవసరాన్ని బట్టి సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తారు. ప్రతి ఘాట్కు ఈవోపీఆర్డీ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా నియమించాలని నిర్ణయించారు. ఘాట్ స్థాయిని బట్టి 10 నుంచి 15 మంది కార్యదర్శులను నియమించాలని ప్రతిపాదించారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు, సూచనలు చేసేందుకు ప్రతి స్నాన ఘట్టంలో మైక్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కరెంటు లేని సమయంలో స్నానఘట్టాల వద్ద జనరేటర్ సదుపాయం కల్పించేందుకు, ఏటిగట్టు వెంబడి సూచిక బోర్డులు, ట్యూబ్లైట్లు, సోడియం వేపర్ల్యాంప్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. స్నాన ఘట్టాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా రెండేసి చొప్పున మరుగుదొడ్లు, యూజ్ అండ్ పే పద్ధతిలో సులభ్ కాంప్లెక్స్లు వంటివి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నదీతీరంలో ఉన్న పంచాయతీలతోపాటు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతి స్నాన ఘట్టంలో వృద్ధులు, వికలాంగులు స్నానాలు ఆచరించేందుకు అనువుగా తుంపర స్నాన సౌకర్యం (షవర్లు) కల్పించాలని నిర్ణయించారు. నిధులు విడుదల కాకపోవడంతో వీటిలో ఒక్క పనీ చేపట్టలేని దుస్థితి నెలకొంది. పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్ కమిటీ పుష్కర పనుల పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో డీపీవో అధ్యక్షతన పనిచేసే విధంగా టాస్క్ఫోర్స్ కమిటీని నియమించారు. ప్రతి శుక్రవారం ఈ కమిటీ సమావేశమై ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, నదీ తీరంలో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల ఏర్పాట్లు, ఇతర పనులపై చర్చిస్తుంది. ఈ కమిటీకి డీపీవో చైర్మన్గా, ముగ్గురు ఈవోపీఆర్డీలు, నలుగురు కార్యద ర్శులు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్తో కలిపి 13 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటికే ఈ కమిటీ జిల్లాలో నాలుగు విడతలుగా సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించింది. 38 వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరం జిల్లావ్యాప్తంగా 67 పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు 38 వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరమని అధికారులు అంచనా వేశారు. ఏ-గ్రేడ్ స్నానఘట్టంలో 60 మంది, బీ-గ్రేడ్లో 50 మంది, సీ-గ్రేడ్లో 30 మంది చొప్పున సిబ్బందిని నియమించాల్సి ఉంది. మూడు షిఫ్టుల్లో వీరంతా పనిచేయాల్సి ఉంటుంది. వీరికి 12 రోజులపాటు వసతి, భోజన సదుపాయం ఆయా పంచాయతీల్లో కల్పిస్తారు. గ్రామాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కల్యాణ మండపాల్లో వసతి సదుపాయాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్వీపర్లకు రెండు జతల యూనిఫాం, గ్లౌజులు వంటి సమకూర్చాల్సి ఉంటుంది. -
ఆపరేషన్ ‘పన్ను’
* బకాయిల వసూలుకు కార్యాచరణ * మండలానికో ప్రత్యేక బృందం ఏర్పాటు * వారం రోజులలోనే రూ.13 కోట్లు కలెక్షన్ * 250 పంచాయతీలలో వంద శాతం సేకరణ లక్ష్యం * నిర్లక్ష్యంగా ఉన్న కార్యదర్శులకు నోటీసులు జారీ ఇందూరు : మార్చి 31 వరకు 250 పంచాయతీలలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకోసం గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే గ్రామ పంచాయతీల అభివృద్ధికి గట్టి పునాది పడుతుందనే నినాదంతో, పేరుకుపోయిన బకాయిలను వసూలుచేయ డానికి జిల్లా పంచాయతీ శాఖ నడుం బిగించింది. సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించనివారిని నిద్ర లేపి మరీ పన్నులు చెల్లించేలా వసూళ్ల డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి డీపీఓ కృష్ణమూర్తి సారథ్యం వహిస్తున్నారు. జిల్లాలో 36 మండలాలు 718 పంచాయతీలుండగా,ఇందులో మొదటి దశగా 250 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. వారం రోజుల క్రితం ‘ఆపరేషన్ పన్ను’ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. తగిన కార్యాచరణ రూపొందించి మండాలనికో బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్, ఈఓపీఆర్డీ ఉంటారు. బృందానికి ఈఓపీఆర్డీ సారథ్యం వహిస్తారు. ప్రతీ మండలంలో ఐదుకు పైగా గ్రామాల నుంచి వంద శాతం బకాయి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రజలలో అవగాహన కల్పిండంతోపాటు మైకు సెట్ల ద్వారా, డప్పు చాటింపు. మహిళా సంఘాల ద్వా రా చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే బకాయిదారులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసుల ద్వారా పన్నులు చెల్లిస్తే సరి, లేదంటే ఏదో ఒక సౌకర్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరిక కూడా జారీ చేశారు. డివిజన్ స్థాయిలో డీఎల్పీఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు డీపీఓ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. మూడు రోజుల క్రితం స్వయంగా డీపీఓనే కందకుర్తి గ్రామంలో పర్యటించి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. తక్కువ సమయంలోనే రూ.13కోట్ల కలెక్షన్ పంచాయతీ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ పన్ను’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. వారం రోజులలోనే రూ.13 కోట్ల వర కు బకాయిలను వసూలు చేసి భేష్ అనిపించుకున్నారు. ఇదే స్పూర్తితో మార్చి 31 నాటికి 250 గ్రామ పంచాయతీలలో వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని సిబ్బం దికి ఆదేశాలు ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు నీటి, ఇంటి, లైటింగ్, మురికి కాలు, గ్రంథాలయ, సంత వే లం, తదితర పన్నులు కట్టకపోవడంతో రూ.52 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం వసూలైతే, అభివృద్ధి నిధులకు లోటుండదు. ప్రజలకు సౌకర్యాలు అందుతాయి. కార్యదర్శులకు, మండలాధికారులకు నోటీసులు ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయడానికి పంచాయతీ శాఖ అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు, మండలాధికారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసినవారిపై చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, ఇన్ చార్జ్లుగా ఉన్న పంచాయతీలు కాకుండా, సొంతగా పనిచేస్తున్న పంచాయతీలలో వంద శాతం పన్నులు రాబట్టాలని పక్కా ఆదేశాలిచ్చారు. ఎప్పటికప్పుడు వారి పనితీరును గమనిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుతున్నారు. ప్రజలు సహకరించి పన్నులు కట్టాలి గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో పేరుకు పోయిన బకాయి పన్నులను వసూలు చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలు సహకరించి పన్నులు చెల్లించాలి. ప్రజలు చెల్లించే పన్నులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతాయనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. -కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి -
'రూ. 41 వేలు తీసుకుని.. రేప్ మర్చిపో'
పాట్నా: ఓ దళిత మహిళ శీలానికి 41 వేల రూపాయిలు ఖరీదు కట్టారు. ఈ డబ్బులు తీసుకుని అత్యాచార ఘటనను మరచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని పంచాయతీ పెద్దలు బాధితురాలిని ఆదేశించారు. బీహార్లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. అయితే నిందితుడు బాధితురాలికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీనిపై బాధితురాలు నిరసన వ్యక్తం చేయగా, నిందితుడు ఆమె భర్తకు నిప్పంటించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కటిహర్ జిల్లా ఎస్పీ క్షత్రనీల్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల పనికో్సం పంచాయతీ కార్యాలయానికి వెళ్లినపుడు ప్రకాశ్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు చెప్పింది. ఈ కేసులో నరేష్ రవిదాస్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు. బీహార్లోనే నలుగురు అన్నదమ్ములు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పంచాయతీ పెద్దలు బాధితురాలికి 50 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. -
ఎన్నికల చుట్టే రాజకీయం
సాక్షిప్రతినిధి నల్లగొండ :అన్ని ఎన్నికలూ ఒకే ఏడాది.. సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జెడ్పీ, ఎంపీపీ... ఇలా అందరి ఎన్నికా ఒకే సంవత్సంలోనే.. ఎన్నికలకు తోడు నూతన రాష్ట్ర ఆవిర్భావం.. దేశంలో 29వ రాష్ట్రంగా నవతెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కూడా ఈ వత్సరంలోనే... రాజకీయ నాయకుల రాతలు మారి ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అయి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రభ కోల్పోవడం.. గతంలో ఎలాంటి ప్రభావం చూపని నేతలు ఇప్పుడు కీలకంగా మారింది కూడా ఈ 12 నెలల్లోనే.. ముఖ్యంగా 1973 తర్వాత తొలిసారి రాష్ట్రపతిపాలన వచ్చింది కూడా ఈ ఏడాదిలోనే... అదే 2014... జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలా ఏదో రాజకీయ సంచలనమే.... ఏడాదంతా రాజకీయ పరిణామాలే... కొన్ని అనూహ్యమైతే.. మరికొన్ని ఊహిం చినవి.. ఇంకొన్ని ఆశించినవి.. ఏవైతేనేమి జరిగిందంతా మన మంచికే అన్నట్టు ఈ పరిణామాలు జిల్లా రూపురేఖలు మార్చే దిశలో వెళుతున్నాయి. నూతన రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అగ్రగామిలో నిలిచేందుకు ఈ ఏడాది వేదికైందనే చెప్పాలి. మొత్తంమీద జనవరి నుంచి డిసెంబర్ వరకు రాజకీయంగా బిజీబిజీ అయిన ఈ ఏడాదికి తెలుగు క్యాలెండర్ ఆధారంగా ఏ పేరు పెట్టినా.. ఘటనల పరంగా ‘తెలంగాణ పేరు పెట్టాల్సిందే... తెలంగాణ నామ సంవ త్సరంగా కీర్తికెక్కనున్న ఈ ఏడాదిలో జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలను ఓసారి అవలోకనం చేసుకుందామా! అనూహ్యం... అద్భుతం ఈ ఏడాది జరిగిన రాజకీయ పరిణామాలు ఎన్ని ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడిన రోజు నుంచే రూపుదాల్చిన ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఆరుదశాబ్దాల తర్వాత 2014లో ఫలించింది. ఈ పోరాటాలకు ఆది నుంచీ అండగా ఉన్నది నల్లగొండ జిల్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అగ్రగామిగా పోరాటాలు చేసింది జిల్లా ప్రజానీకం. ఇక, మలిదశ ఉద్యమంలో మన పాత్ర మరువలేనిది. ఎంతగా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి పేర్లు చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ పదిజిల్లాలు చెప్పే పేరు మనజిల్లావాసి శ్రీకాంతాచారిదేనని గర్వంగా చెప్పుకోక తప్పదు. ఆ స్థాయిలో నల్లగొండ జిల్లాకు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఖ్యాతి లభించింది. అమరుల పోరాట ఫలంతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. కొత్త రాష్ట్రం.. తొలి పదవి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు తొలి విస్తరణలోనే కేబినెట్ మంత్రి పదవి దక్కడం ఈ ఏడాదిలో జరిగిన కీలక రాజకీయ పరిణామంగానే చెప్పుకోవాలి. సూర్యాపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచిన గుంటకండ్ల జగదీష్రెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ మంత్రి హోదా ఇచ్చారు కేసీఆర్. టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగడించిన జగదీష్రెడ్డికి మంత్రి పదవి లభించడం అనూహ్యమేమీ కాకపోయినా తెలంగాణలో తొలి రాష్ట్ర మంత్రిగా ఆయనకు అవకాశం దక్కడం గమనార్హం. కుదేలైన టీడీపీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది కుదేలయిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. దీనికి తోడు జిల్లా పార్టీలోని గ్రూపు గొడవలు.. ఇక ఆ తర్వాత టీఆర్ఎస్ హవా.. అన్నీ కలిపి టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టే వరకు పరిస్థితులు వచ్చి ఆ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తోన్న సంవత్సరం కూడా 2014. ఉన్న నేతల్లో ఐక్యత లేకపోవడం, పార్టీ కేడర్కు భరోసానిచ్చే వారు లేక కొంత స్తబ్ధత నెలకొంది. -
తాళిబొట్టు తెంపారు..
రూ.92వేలు జరిమానా వేశారు చింతకాని: భార్యాభర్తల గొడవపై కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు. శారీరకంగా, మా నసికంగా హింసిస్తున్న భర్తను వారించకపోగా.. బాధితురాలికే ఆ ‘పెద్దలు’ శిక్ష విధించారు. ఆమె తాళిబొట్టును లాక్కున్ని, 92వేల రూపాయలు జరిమానా కట్టాలని ‘తీర్పు’ ప్రకటించారు. దీనిపై ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రచింది. ఆమె తెలిపిన ప్రకారం... వరంగల్ జిల్లా కురవికి చెందిన భద్రమ్మ-బక్కయ్య దంపతుల రెండవ కుమార్తె ఉప్పమ్మకు, చింతకాని మండలం రాఘవాపురం గ్రామస్తుడు నెర్సుల కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం మూడు నెలలపాటు సజావుగా సాగింది. ఆ తరువాత నుంచి, ఆమె శీలాన్ని అతడు శంకించసాగాడు. ఈ నెపంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. కుల పెద్దలు 12సార్లు పంచారుుతీ నిర్వహించారు. వారి సూచనతో, ఆరు నెలల క్రితం రాఘవాపురం నుంచి లచ్చగూడెం గ్రామానికి మకాం మార్చారు. అరుునప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, ఆమె కూలీనాలీ చేసిన సంపాదించిన డబ్బుతో భర్త తాగి వచ్చి కొట్టేవాడు. అతడి దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె ఈ నెల 5న తన భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘పోలీస్ స్టేషన్కు వద్దు. కుల పంచారుుతీలో మాట్లాడుకుందాం’ అని కుల పెద్దలు చెప్పడంతో ఆమె తన ఊరుకుంది. ఆ తరువాత కూడా అతడి వేధింపులు కొనసాగుతుండడంతో కుల పెద్దలు ఇటీవల పంచాయతీ నిర్వహించారు. భర్త వేధింపులను ఇక భరించలేనని కుల పెద్దలతో చెప్పింది. దీనిని వారు జీర్ణించుకోలేకపోయూరు. ఆమెను తప్పుబట్టారు. ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కుని, 92వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేనని చెబుతున్నా వినలేదు. ఆమె బాబాయి సంగయ్యపై దాడి చేసి, ఆయనతోప్రాంసరీ నోటుపై సంతకాలు తీసుకున్నారు. ‘‘నా నాలుగేళ్ల కుమారుడు మహేష్ను ఎక్కడో దాచిపెట్టారు. నాకు చూపించడం లేదు. నాకు అన్యాయం చేసిన కుల పెద్దలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. నాకు తగిన న్యాయం చేయాలి’’ అని, బాధితురాలు ఉప్పమ్మ పోలీసులను కోరింది. -
పింఛన్ బెంగతో 14 మంది మృతి
సాక్షి నెట్వర్క్: పింఛన్ రాదేమోనని, రాలేదని వేర్వేరు జిల్లాల్లో 14 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుం డారం గ్రామానికి చెందిన ఎల్కంటి కొండాల్రెడ్డి(85)కి గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. తాజాగా తన పింఛన్ రద్దు కావడంతో బెంగపెట్టుకొని, సోమవారం గుండెపోటుకు గురయ్యా డు. ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెం దిన సముద్రాల గట్టయ్య(68)కు గతంలో పిం ఛన్ వచ్చేది. తాజాగా తొలగించడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. రామగుండం మండలం గోలివాడకి చెందిన గుడి లక్ష్మి(70)కూ గతం లో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. తాజా జాబితా లో పేరు లేకపోవడంతో పింఛన్ వస్తుందో రాదోనని బెంగతో తుదిశ్వాస విడిచింది. ఇదే జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన కొంకట రాజయ్య(85) పింఛన్ రాలేద న్న బెంగతో సోమవారం గుండెపోటుకు గురయ్యాడు. హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి పంచాయతీ పరిధి బొడిగపల్లికి చెందిన బొడి గె సారయ్య(50) వికలాంగుడు. తాజా జాబితాలో పింఛన్ రాకపోవడంతో బెంగతో సోమవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లికి చెందిన పచ్చివెండ్ల రామలచ్చవ్వ(75)కూ తాజా జాబితాలో పేరు లేకపోవడంతో ఆదివారం రాత్రి నిద్ర లోనే చనిపోయింది. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనపతుర్తి శివారు రామోజీతండాకు చెందిన గుగులోతు పెద్ద పంతులు (80)కు పింఛన్ రాదని అధికారులు తేల్చడం తో సోమవారం చనిపోయాడు. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశ్వాపురానికి చెందిన పెద వీరయ్య(80), యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన జి. బిక్షపతి(80), ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని శ్రీపతి నగర్కు చెందిన పారుపెల్లి రమాదేవి(35), ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ గౌన్ల రామవరం ప్రాంతానికి చెందిన కండె ముసలయ్య(79), చండ్రుగొండ మండలం గానుగపాడు పంచాయతీ పరిధి అన్నారం తండాకు చెందిన నూనావత్ కేళీ(71), ఖమ్మంకి చెందిన కవడి వెంకటేశ్వర్లు(73), వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామానికి చెందిన మామడిశెట్టి రాజేశ్వరి(75) పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆందోళనకు గురై సోమవారం మృతి చెందారు. -
పంచాయతీలకు ‘షాక్’
విద్యుత్ బకాయిల విషయంలో గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కారు ‘షాక్’ ఇచ్చింది. పెండింగ్ పడిన వీధి దీపాలు, నీటి సరఫరా పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని స్పష్టం చేయడంతో సర్పంచులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు బకాయిల చెల్లింపు కోసం ట్రాన్స్కో ఒత్తిడి చేస్తోంది. ఇందూరు : భారమైనప్పటికీ విద్యుత్ బకాయిలను ఎంతో కొంత మేరకు కట్టుకుంటూపోవాల్సిన బాధ్యత పంచాయతీలదేనని, నిధులు సరిపోని తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు (485సీపీఆర్ అండ్ ఆర్ఈ/జీ1 2014) జారీ అయ్యాయి. దీంతో జిల్లాలో పేరుకుపోయిన రూ.117కోట్లకు పైగా బకాయి లను ప్రస్తుతం పంచాయతీలే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదా యం అంతంత మాత్రమే. సపాయి కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా ఆ నిధులు సరిపోవు. ఇలాంటి తరుణంలో స్వయంగా పంచాయతీలే విద్యుత్ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని అం టున్నారు. ప్రత్యామ్నాయంగా 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ నిధుల నుంచి చెల్లించుకోవచ్చని కాస్త ఊరట కలిగించే ఆదేశాలను ప్రభుత్వం ఇచ్చింది. కానీ పెద్ద మొత్తంలో ఉన్న విద్యుత్ బకాయిలను పంచాయతీలవారీగా చూస్తే లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల నిధుల్లోంచి ఒకటి రెండు నెలలకు సంబంధించిన బకాయిలను మాత్రమే చెల్లించే అవకాశం ఉన్నం దున పాత, కొత్త బిల్లులను కట్టడానికి వీలుపడదు. ఫలితంగా ఆదాయం లేని పంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించడం తీరని భారంగానే మారబోతుంది. జిల్లాలో పేరుకుపోయిన రూ.117 కోట్ల బకాయి విద్యుత్ బిల్లులను చెల్లించడం తమ వల్ల కాదని గ్రామాల సర్పం చులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖ అధికారులకు నెల రోజుల క్రితంం స్పష్టం చేశా రు. జిల్లా, రాష్ట్ర సర్పంచు ఫోరం నేతలు పంచాయతీరాజ్ కమిషనర్ను, ఇతర ఉన్న తాధికారులను కలిసి బకాయిల భారాన్ని వివరించారు. విద్యుత్ బిల్లులను ప్రభుత్వం భరించకపోతే అందోళనకు పూనుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. హామీ ఇచ్చిన మంత్రులు కూడా చేతులెత్తేయడంతో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వాలు జీఓ నం.80 ప్రకారం పంచాయతీలకు సంబంధించి విద్యుత్ బిల్లులను భరించాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో సర్పంచులకు నిరాశను మిగిల్చింది. జి ల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువగా సర్పంచులుగా గెలిచారు. మరి కొందరు గెలిచిన తరువాత పార్టీలోకి చేరారు. బకాయిల చెల్లింపు విషయంలో సొంత ప్రభుత్వం పై ఆందోళన చేయడానికి సర్పంచు ఫోరం నేతలు వెనకడుగు వేస్తున్నారు. కనీసం నిరసన తెలుపడానికి కూడా వీలు లేకుండా పోయిందని అంటున్నారు. ఇదిలా ఉండగా మలిదశగా బకాయిలను వసూలు చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలలో ఎంతో కొంత కడితేనే కరెంటు సరఫరా ఉంచాలని లేకపోతే కనెక్షన్ కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేజర్ పంచాయతీలకు కరెంటోళ్ల బాధలు ఉండకపోయినా మైనర్ పంచాయతీలకు తిప్పలు తప్పేలా లేవు. మైనర్ పంచాయతీలకు ఆదాయం అంతంత మాత్రమంగానే ఉండగా, 13వ ఆర్థిక సం ఘం, జనరల్ ఫండ్ నిధులు కూడా చాలీ చాలని విధంగా రావడంతో బకాయిలు చెల్లించడం ఇబ్బం దికరంగానే మారబోతుంది. ముఖ్యంగా నీటి పథకాలకు ఆటంకం కలుగడంతో పాటు గ్రామాలే అంధకారంలో ముగినిపోయే ప్రమాదముంది. మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విన్నవించి కనెక్షన్లు తొలగించకుండా ప్రయత్నాలు చేయాల్సిందేనని సర్పంచులు వాపోతున్నారు. -
మృతులకూ పింఛన్లు
కణేకల్లు : కణేకల్లు మేజర్గ్రామ పంచాయితీలో పింఛన్ల పంపిణీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. చచ్చినోళ్ల పింఛన్లను రద్దు చేయకుండా అప్పనంగా ప్రతి నెలా మెక్కేశారు. రెండేళ్ల నుంచి ఈ స్వాహా వ్యవహారం సాగుతోంది. కణేకల్లు పంచాయితీలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కలిపి మొత్తం 1569 మంది (సెప్టెంబర్ వరకు)కి పింఛన్లు మంజూరవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులకు రూ.200, వికలాంగులకు రూ.500 ప్రకారం పింఛన్లు మంజూరయ్యేవి. 2012 నుంచి ఇప్పటి వరకు 52 మంది పింఛన్దారులు మృతి చెందారు. అయితే వీరి పేరిట పింఛన్లు మంజూరు అవుతూనే ఉన్నాయి. వెలుగు చూసిందిలా... సెప్టెంబర్ వరకు వీరు పింఛన్లు తీసుకొన్నట్లు అక్విటెన్స్ల్లో వేలిముద్రలు కూడా ఉన్నాయి. పింఛన్ల సర్వే సందర్భంగా పింఛన్ల అక్రమాల బాగోతం బయటపడింది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ముడుపులకు ఆశపడే అధికారులు విషయాన్ని మరుగునపరచినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంపిణీదారు నుంచి మామూళ్లు తీసుకొన్న అధికారులు స్వాహా సొమ్ము రికవరీ చేయకుండా మౌనంగా ఉంటున్నట్లు తెల్సింది. ఇది ఇలా ఉండగా చనిపోయినోళ్ల పేరిట పింఛన్లు తీసుకొన్నరన్నా విషయం తెల్సుకొన్న వారి బంధువులు నిర్వహకుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి స్వాహా చేసిన పింఛన్ల సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్వాహాకు తెరలేిసిందిలా... పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వందశాతం పూర్తి కాలేదు. అనేక మందికి స్మార్ట్ కార్డులు లేవు. దీనిని ఆసరగా చేసుకొన్న పంపిణీదారులు చనిపోయిన వారి పేరిట పింఛన్ల స్వాహాకు తెరలేపారు. ఒక నెల వృద్ధులు పింఛన్ల కోసం రాకపోతే వారి గురించి ఆరా తీసి మరుసటి నెల నుంచి వారి పింఛన్లను తమ జేబులో వేసుకొం టున్నారు. వారు పింఛన్లు తీసుకొన్నట్లు అక్విటెన్స్లో వేలిముద్రలు కూడా వేయించుకోవడం గమనార్హం. చనిపోయిన పింఛనుదారుల వివరాలు.. రహింబీ.. (వరస సంఖ్య 650697) ఈమె ఒకటిన్నర సంవత్సరం కిందట మృతి చెందారు. షరిఫా (వరస సంఖ్య 435406) ఈమె చినిపోయి ఏడాదైంది. ఖాసీంబీ (వరస సంఖ్య 435407) చనిపోయి ఎనిమిది నెలలైంది. ఖాసీంబేగ్ (వరస సంఖ్య 611392) చనిపోయి ఏడాదైంది. కలేకుర్తి అబ్బాస్ (వరస సంఖ్య 626499) ఏడాది కిందట చనిపోయారు. ఇస్మాయిల్ (వరస సంఖ్య 129643) చనిపోయి ఏడాదిన్నరైంది. ఏం.మాబుసాబ్ (వరస సంఖ్య 434949) చనిపోయి ఒకటిన్నర ఏడాదైంది. వన్నూర్బీ (వరస సంఖ్య 129706) చనిపోయి ఏడాదైంది. ఇలా సుమారు మరో 44 మంది పేర్లతో పంపిణీదారులు పింఛన్లు స్వాహా చేశారు. -
నిరుపేదలకు అండగా ఉంటాం
మంత్రి మహేందర్రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్ల సంఘఅధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు. మంత్రి మహేందర్రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్ల సంఘఅధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు. ఎంపీ ప్రసంగానికి అడ్డంకులు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ అనాలని దుండిగల్కు చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ అనాలని దుండిగల్కు చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. -
కృష్ణావర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.7.17 కోట్లు
ఆరు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి తొలుత అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కృష్ణా వర్సిటీ వీసీ పున్నం వెంకయ్య వెల్లడి మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వున్నం వెంకయ్య తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇం దుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాలను గతంలో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పారు. ఈ భూమిలో రూ.72 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. భవనాల నిర్మాణ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్, ఈఈ నాగేశ్వరరావులకు మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును ఈ సందర్భంగా వీసీ అందజేశారు. 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనం అకడమిక్ భవనాన్ని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అంచనాలు రూపొందించామని వీసీ తెలిపారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు. జీ+2 పద్ధతిలో ఈ భవనాలు నిర్మించాలని నమూనాలు తయారు చేశారని, అయితే మొదటి విడతలో మాత్రం జీ+1 పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. నిధుల వెసులుబాటును బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండంతో రోడ్డుకు మూడున్నర అడుగుల ఎత్తులో మెరక చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ భూముల్లో పటిష్టమైన నిర్మాణాల కోసం 70 అడుగుల లోతుకు వెళ్లి భూ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భూమిపై శ్లాబు వేసి, దానిపై భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను హైదరాబాదుకు చెందిన జేఎన్టీయూ సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. రూ.72 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ తరహాలో ఇక్కడ భవనాల నిర్మాణం జరుగుతుందని, 100 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవన నిర్మాణం కోసం మొదటి విడతగా సీపీడబ్ల్యూడీపీకి 10శాతం నిధులను సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి విడతగా రూ. 7.17 కోట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేసినట్లు వీసీ వివరించారు. నగదు అందజేసిన అనంతరం టెండర్ల ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని, డిసెంబరు లేదా జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్ మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను డీడీ రూపంలో అందజేసేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, సిబ్బంది తమకు సహకరించారని తెలిపారు. పబ్లిక్ లెక్చర్ సిరీస్ కృష్ణా యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ లెక్చర్ సిరీస్ను నవంబరులో నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. నవంబరులో నిర్వహించే 3వ పబ్లిక్ లెక్చర్ కార్యక్రమానికి కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఫర్ ఆసియా డెరైక్టర్ డాక్టర్ సంజయ్మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. నాలుగో లెక్చర్కు నాక్ మాజీ చైర్మన్ రామ్తక్వాలే ముఖ్య అతిథిగా హాజరై దేశంలోని ఉన్నత విద్య విధానంపై ఉపన్యసిస్తారని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ నవంబరు మొదటి వారంలో స్మారక ఉపన్యాసం జరుగుతుందని రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరున ఈ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా తరంగ్-2014 యువజనోత్సవాలను నవంబరులోనే యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఆన్లైన్ పరీక్షా విధానం అమలు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. పరీక్షా కేంద్రానికి 40 నిమిషాల ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్లో పంపుతామని, ఈ ప్రశ్నాపత్రాన్ని తెలుసుకునేందుకు పాస్వర్డ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.టెక్ కోర్సు ప్రారంభం కృష్ణా వర్సిటీలో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ చెప్పారు. పీజీ ఇంజినీరింగ్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్బాబు పాల్గొన్నారు. -
పల్లెకు చేరిన ఈ-పాలన
సంతకవిటి : పంచాయతీ ల్లో ఈ పాలన మొదలైంది. దీంతో గ్రామీణ ప్రజలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో కొన్ని పంచాయతీలో ప్రారంభమైన ఈ ప్రక్రియ దశలవారీగా అన్ని పంచాయతీలకు విస్తరించనుంది. ఇప్పటివరకూ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణతోపాటు అన్ని రకాల పనులు రాతకోతల రూపంలోనే జరుగుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండే ది కాదు. కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందిరపై రుద్దేవారు. ఈ పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపరచడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఏం జరుగుతుందన్నది ఎవరైనా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అక్రమాలను అరికట్టగలగడంతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వీలవుతుంది. పంచాయతీ కార్యదర్శుల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ మూసి ఉండే గ్రామసచివాలయాలు ఇక నుంచి 365 రోజులు ప్రజలకు సేవలందించనున్నాయి. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలు ఉండగా తొలిదశగా ప్రస్తుతం 87 పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. సంతకవిటి మండలంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా ఆరు పంచాయతీల్లో వీటిని గత నెలాఖరు నుంచే ప్రా రంభించారు. మందరాడ, వాసుదేవపట్నం, సంతకవిటి, మామిడిపల్లి, బొద్దూరు, గుళ్లసీతారాంపురం పంచాయతీలు ఆన్లైన్లో చేరాయి. ఈ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు ఉన్నచోటనే కంప్యూటర్లు ఏర్పా టు చేశారు. పక్కా భవనాలు లేని ప్రాం తాల్లో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిం చేందుకు చర్యలు చేపడుతున్నామని సంతకవిటి ఎంపీడీవో ఎ.త్రినాథస్వామి తెలి పారు. నెట్లో సమాచార సమస్తం ఈ సేవలు ప్రారంభించిన పంచాయతీల కు సంబంధించిన సమస్త సమాచారం, వాటి పరిధిలో లభించే సేవల వివరాలన్నీ ంటర్నెట్లో సంబంధిత పంచాయతీ వెబ్సైట్లో లభ్యమవుతాయి. పంచాయతీలోని వార్డులు, ఓటర్లు, జానాభా వివరాలు, స్త్రీలు, పురుషులు, పిల్లల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు, జనన, మరణ వివరాలు, ధ్రువీకరణ పత్రా ల జారీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆన్లైన్లోనమోదవుతుంటాయి. అలాగే పంచాయతీల ఆస్తులు, పన్నుల వివరాలు, విని యోగ ఫలితాలు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిధుల మంజూరు, వినియోగ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
కరెంటు బిల్లులు కట్టలేక పంచాయతీలు విలవిల
మోర్తాడ్ : వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అవి పంచాయతీలకు గుది బండలుగా మారాయి. బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ పంచాయతీలపై ఒత్తిడి పెం చింది. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతకూ వెనుకాడడం లే దు. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. పంచాయతీల ఆదాయం తక్కువగా ఉందని భావించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన హయాంలో పంచాయతీల వీధి దీపాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తప్పింది. అయితే, రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను చెల్లించే ఆంశాన్ని మరుగున పడేశారు. అప్పటి నుంచి పంచాయతీల కు విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. అప్పటి నుంచే 2010 నుంచి గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల విద్యుత్ బిల్లులను ఎన్పీడీసీఎల్కు చెల్లిం చడం లేదు. గతంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. మేజర్ పంచాయతీల బిల్లులను మాత్రం పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాల్సి వచ్చేది. సర్పంచుల విజ్ఞప్తి మేర కు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా చ ర్యలు తీసుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా చేశారు. తరువాత ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు పంచాయతీలు భారీగా బిల్లులు బకాయి పడ్డాయి. 2010 నుంచి ఇప్పటి వరకు రూ. 108 కోట్ల బకాయిలు జిల్లాలోని పంచాయతీలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 72 మేజర్ పంచాయతీలకు సంబంధించి రూ. 51 కోట్లు, 646 మైనర్ పంచాయతీలకు సంబంధించి రూ. 57 కోట్ల బకాయిలు ఉన్నాయి. తడిసి మోపెడు మేజర్ పంచాయతీలలో ఒక్కొక్కటి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆదాయం తక్కువగా ఉండటంతో విద్యుత్ బిల్లులను చెల్లించే స్థితిలో పంచాయతీలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉన్నతాధికారుల హామీతో గురువారం రాత్రి జిల్లాలోని అనేక గ్రామాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఎంతో కొంత బకాయి చెల్లిస్తామని పంచాయతీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో శుక్రవా రం నుంచి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. కాగా ప్రభుత్వం విద్యుత్ బకాయిల విషయంలో స్పష్టత ఇవ్వకపోతే పంచాయతీలకు ఇబ్బం ది తప్పేలా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి విద్యుత్ బకాయిలను చెల్లించి పంచాయతీలకు ఊర ట కలిగించాలని పలువురు సర్పంచులు కోరుతు న్నారు. -
తొలగింపు బాధ్యత మీదే!
అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యత పంచాయతీలకు పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లే అవుట్ల వివరాలు వీజీటీఎం ఉడా నూతన నిర్ణయం సిబ్బంది కొరత వల్లేనని చెబుతున్న అధికారులు సాక్షి, విజయవాడ : అక్రమ లే అవుట్ల తొలగింపునకు వీజీటీఎం ఉడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించారు. అన్ని అనుమతులు ఉన్న లే అవుట్ల జాబితాను ఉడా వెబ్సైట్లో పొందుపరిచారు. వారంలోపు ఆ జాబితాలను ఉడా పరిధిలోని అన్ని పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే అక్రమ లే అవుట్ల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కూడా అక్రమ లే అవుట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే లే అవుట్లకు అనుమతులు ఇవ్వడంతోపాటు సంబంధిత ఫీజులను ఉడా వసూలు చేస్తోంది. దీంతో లే అవుట్ల తొలగింపునకు పంచాయతీ అధికారులు ఎంత మేరకు ముందుకు వస్తారనేది ప్రశ్నార్థకమే. సిబ్బంది కొరత వల్లే! వీజీటీఎం ఉడా పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, సుమారు 1,400 గ్రామాలు ఉన్నాయి. ఉడాలో 120 మంది పనిచేయాల్సి ఉండగా, 58 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయడం సాధ్యం కావడం లేదని ఉడా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యతలను చేపట్టాలని ఆయా గ్రామ పంచాయతీలకు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై మాత్రం చర్యలు తీసుకుంటామని ఉడా అధికారులు చెబుతున్నారు. ఉడా పరిదిలో 476 లేఅవుట్ల ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో కలిపి 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఉన్న లే అవుట్లు 476 మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఉడా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో కూడా కొన్ని వెంచర్లు ఉన్నాయి. వీటితోపాటు అనధికారికంగా సుమారు 100 వెంచర్లు ఉన్నాయని ఉడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనధికార వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని ఉడా అధికారులు ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని అనుమతులు ఉన్న 476 లే అవుట్ల వివరాలతో ఉడా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అనధికార లేఅవుట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రెండు వైపులా నలిగిపోతున్నాం
పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారు మావోయిస్టులు ప్రాణాలు తీశారు మాజీ మావోయిస్టు కమాండర్ కవిత ఆవేదన ఒకవైపు పోలీసులు మరోవైపు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నామని మాజీ మావోయిస్టు కమాండర్ కొర్ర కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత పెద్దనాన్న కొడుకు నరేశ్. ఇతడిని మావోయిస్టులు శుక్రవారం రాత్రి చంపేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నామని పోలీసులు బైండోవర్ పెడితే ఏకంగా మావోయిస్టులు... పోలీసులకు అనుకూలంగా ఉన్నామని చంపేశారని ఆవేదన చెందారు. కొయ్యూరు: యూ.చీడిపాలెం పంచాయతీలో ఎండకోటకు చెందిన కవిత 2000లో మావోయిస్టుల్లో చేరారు. దళ సభ్యురాలి నుంచి 2006 నాటికి గుర్తేడు లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జీఎస్) కమాండర్ వరకు ఎదిగారు. దళంలో ఉండగానే ప్రస్తుతం జైలులో ఉన్న చడ్డా భూషణం అలియస్ నాగరాజును వివాహం చేసుకున్నారు. ఆమె 2007లో కాకినాడలో అప్పటి ఎస్పీ ముందు లొంగిపోయారు. ఈమెకు రూ. ఐదు లక్షల రివార్డు వచ్చినా తీసుకోలేదు. నాటి నుంచి ఎండకోటలో సీహెచ్డబ్ల్యూగా పనిచేస్తున్నారు. బతికేందుకు వేరే మార్గం లేకపోవడంతో ఎండకోట మినీ అంగన్వాడీ వర్కర్గా దరఖాస్తు చేస్తే ఆ పోస్టు ఇటీవల ఆమెకు ఇచ్చారు. అయితే మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని భావించిన ఆమె వై.రామవరంలో ఉండిపోయారు. నరేశ్ను చంపడంతో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబంలో ఎవరికీ పోలీసులతో సంబంధాలు లేవని చెప్పారు. అయినా మావోయిస్టులు కొందరు చెప్పిన తప్పుడు మాటలు విని తమను అపార్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసులకు సమాచారం ఇస్తున్నామన్న అనుమానంతో ఉన్నారన్నారు. వాస్తవానికి పోలీసుల కారణంగా తమ కుటుంబం ఇబ్బందులు పడుతోందన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వై.రామవరం పోలీసులు తనతోపాటు పెదనాన్న అప్పారావు, ఇప్పుడు చనిపోయిన నరేశ్పై బైండోవర్ కేసు పెట్టారన్నారు. ఎక్కడ ఏమి జరిగినా బాధ్యత మాదేనంటూ హెచ్చరించారన్నారు. తమను అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నించి ఆగిపోయారన్నారు. -
వారం వ్యవధిలో ముగ్గురి మృతి
లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత సత్యవరంలో ఐదుగురికి డెంగ్యూ ఆందోళన లో గ్రామస్తులు పాడేరు రూరల్ : మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత అధికమైంది. వారం రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువుతో పాటు మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మంజెలి పిన్నయ్య అనే గిరిజనుడు రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి ఒక్క సారిగా విషమించటంతో అంబులెన్స్లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గంమధ్యలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పలాసి రాజయ్య, రెండు నెలల శిశువు వారం రోజుల్లో మృత్యువాత పడ్డారు. మంచినీటి పథకం మూలకు చేరడంతో గిరిజనులు గెడ్డల్లోని కలుషిత నీరు తాగుతుండడంతో వల్లే అనారోగ్యంబారిన పడుతున్నారు. వాస్తవానికి గురువారమే మినుములూరు వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించినా జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. తక్షణమే మెరుగైన వైద్య శిబిరం ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీరందించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సత్యవరంలో డెంగ్యూ బెంగ మాడుగుల : మండలంలోని సత్యవరం గ్రామంలో డెంగ్యూ, జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మిరియాల దేముడమ్మ, మీసాల సూరిబాబులతో పాటు మరో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు వారిని విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ బాధితుల తరలింపుతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామంలో మరో 10 మందికి జ్వరాలుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కింతలి పీహెచ్సీ వైద్యులను సంప్రదించగా ఈ నెల 9న వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అయినా జ్వరాలు తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. కలుషిత నీరు కారణంగా పరిస్థితి మళ్లీ దిగజారి ఉండొచ్చని తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. -
పంచాయతీలకు పైసల్లేవ్!
మైనర్ పంచాయతీలను వేధిస్తున్న నిధుల సమస్య పారిశుద్ధ్య పనులకూ డబ్బుల్లేవు విజృంభిస్తున్న దోమలు అల్లాడుతున్న జనం పట్టించుకోని ప్రభుత్వం మచిలీపట్నం/నూజివీడు : నిధుల కొరత వల్ల జిల్లాలోని మైనర్ పంచాయతీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఏ పని చేయాలన్నా పైసా డబ్బుల్లేవని సర్పంచిలు వాపోతున్నారు. కనీసం పన్నులు వసూలు చేసినా, కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. కానీ, కార్యదర్శులపై పని ఒత్తిడి వల్ల వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అందించినా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన కలగానే మిగులుతోంది. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో దోమలు పెరిగి ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మూడేళ్లుగా నిధులు నిల్..! జిల్లాలో ప్రస్తుతం 970 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 820 మైనర్ పంచాయతీలే. స్థానికంగా వసూలు చేసే పన్నులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ), వృత్తి పన్ను, సీనరేజీ, భూముల క్రయ, విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం,కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే తలసరి ఆదాయం పంచాయతీల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి ఎస్ఎఫ్సీ, వృత్తి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. సుమారు 13వేల మంది జనాభా ఉన్న పంచాయతీకి ఏడాదికి తలసరి ఆదాయం కింద రూ.80వేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా, మూడేళ్లుగా ఆ నిధులు కూడా రావడంలేదు. ఈ ఏడాది కాలంలో కేవలం 13వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వచ్చాయని, వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సి ఉండటంతో అత్యవసర పనులు చేపట్టలేకపోతున్నామని పలువురు సర్పంచిలు తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మంగళం మైనర్ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేజర్ పంచాయతీలకు కూడా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ మరణానంతరం ఈ విధానానికి పాలకులు మంగళం పాడారు. ఒక్కో మేజర్ పంచాయతీ ఏడాదికి రూ.10 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో వచ్చిన ఆదాయంలో సగభాగం దానికే సరిపోతోంది. దీంతో నిధుల లేమి కారణంగా మేజర్ పంచాయతీల్లోనూ కనీస వసతులు కల్పించలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యక్రమాలతో అదనపు భారం పంచాయతీలకు అరకొరగా వస్తున్న ఆదాయం వీధి లైట్ల కొనుగోలు, గుమస్తాల జీతభత్యాలకు సరిపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రభుత్వం ఏదో ఒక పేరుతో వారోత్సవాలు, పొలం పిలుస్తోంది.. బడిపిలుస్తోంది.. తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో వాటికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించేదుకు సైతం పంచాయతీల వద్ద నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల మేట పంచాయతీలకు ఆదాయం లేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు సకాలంలో మంజూరు కావడంలేదు. దీంతో డ్రెయినేజీలకు కనీస మరమ్మతులు చేయించేందుకు, దోమల నివారణకు మందుల పిచికారీ చేసేందుకు కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షాలకే కొన్ని ప్రాంతాల్లో మురుగు సమస్య తలెత్తింది. ముసునూరు మండలంలోని చక్కపల్లి, కొర్లగుంట పంచాయతీలలో సైడు కాలువల్లో మురుగునీరు ముందుకు కదలడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి, మీర్జాపురం, అన్నవరం, తుక్కులూరు, పడమర దిగవల్లి, వెంకటాయపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆగిరిపల్లి మండలంలో చొప్పరమెట్ల, నర్శింగపాలెం, చిన్నాగిరిపల్లి, కొత్త ఈదర, నెక్కలం గొల్లగూడెం, సూరవరం ప్రాంతాల్లో డ్రెయినేజీలకు కనీస మరమ్మతుల చేసిన దాఖలాలు లేవు. విస్సన్నపేట మండలంలోని పుట్రేల, తెల్లదేవరపల్లి, రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వ, ముచ్చనపల్లి, పాతనాగులూరు, రంగాపురం పంచాయతీల్లోనూ రోడ్లు, సైడు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మైలవరం మండలం చంద్రాల, తోలుకోడు, కీర్తిరాయునిగూడెం, ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరం, రేపూడి, మచిలీపట్నం మండలంలో ఎస్ఎన్ గొల్లపాలెం, చిన్నాపురం, వాడపాలెం తదితర గ్రామాలలోని సైడు కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడదతో ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నందిగామ, గూడూరు, బంటుమిల్లి మండలాల్లో జ్వరాలు ప్రబలాయి. ఈ పరిస్థితి జిల్లా అంతటా వ్యాపించక ముందే పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు జిల్లాలో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయంలో 119 పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఏకగ్రీవమైన ఒక్కో పంచాయతీకి ప్రోత్సాహకంగా రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. రాష్ర్టం విడిపోయింది. ఈ తరుణంలో గతంలో ప్రకటించిన విధంగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందిస్తుందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కొరవడింది. పన్నుల వసూలుపై దృష్టి పెట్టని కార్యదర్శులు జిల్లాలో 970 పంచాయతీల నుంచి ఈ ఏడాది రూ.41.09 కోట్లను వన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.18.26 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో పన్నుల వసూలుపై దృష్టి సారించలేకపోతున్నామని కార్యదర్శులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల కార్యక్రమానికి సంబంధించి రోజూ వివిధ ఫార్మాట్లలో నివేదికలు పంపడానికే సమయం సరిపోవడం లేదని, ఇతర పనులపై ఎలా దృష్టి పెట్టగలని పలువురు పేర్కొంటున్నారు.