post
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది. -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
కలలు రూపుదిద్దుకుంటున్నాయి.. సింధు పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Anupama Parameswaran: 2025లో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ ఇదే! (ఫోటోలు)
-
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
బంగ్లాదేశ్ సోషల్మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో మాత్రం నిందితుని అరెస్ట్కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్గా పోస్టల్ సేవలు -
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
సామ్ జ్ఞాపకాల్లో చైతూ.. ఆ ఒక్క ఫొటో డిలీట్ చేయలేదుగా! (ఫొటోలు)
-
తులం బంగారం రూ. 113 మాత్రమే *
మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు. -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
అనంత్- రాధిక వెడ్డింగ్: అందానికే అర్థంలా సానియా మీర్జా (ఫొటోలు)
-
‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
ఉత్కంఠభరితంగా బార్బడోస్లో జరిగిన మ్యాచ్లో టీ-20 ప్రపంచ కప్ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్గా మారింది.ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. ‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance. But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్బాల్తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాష్ట్ర కేబినెట్లో జనసేన నుంచి అధినేత పవన్కళ్యాణ్తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.వీరే ఆశావహులు.. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్ మంత్రి పదవుల రేసులో ఉన్నారు. -
టీ20 వరల్డ్కప్-2024: భర్త క్రికెట్తో.. భార్య యాంకరింగ్తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్ఫామ్లోని కొన్ని ఖాతాలు, పోస్ట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
నేను అలాంటి పనులు చేయను !
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటీంచిన ‘సిద్ధు ఫ్రమ్ సీకాకుళం’(2008) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రద్ధాదాస్. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషల్లో పలు సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆ మధ్య హీరోయిన్ మన్నారా చోప్రా గురించి శ్రద్ధాదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ‘‘జిద్’ (2014) అనే హిందీ సినిమాలో మన్నారా చోప్రాతో కలిసి నటించాను. ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చోప్రా కావాలనే నన్ను నిజంగానే కొట్టింది.. బలవంతంగా మెట్లపైకి తోసేసింది.. ఆమె వల్ల గాయాలపాలయ్యాను’’ అంటూ గతంలో మాట్లాడారు శ్రద్ధాదాస్. ఆ మాటలపై తీవ్ర దుమారం రేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్ మరోసారి స్పందించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు శ్రద్ధాదాస్. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీ గురించి నేను ఏ మీడియాకి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం నా వ్యక్తిగత పీఆర్వో సిబ్బంది కూడా లేరు. నేను కావాలనుకుంటే ‘ఎక్స్’ లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేసి పబ్లిసిటీ పొందుతాను. కానీ, నేను అలాంటి పనులు చేయను. ఆమె విషయంలో గతంలో నేను బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ శ్రద్ధాదాస్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారంది. పాజిటివ్ మైండ్సెట్తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్ఫుల్గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్తో సరిసమానమైన క్రేజ్తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
28న మరికొన్ని గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీలో ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, తెలంగాణలోని 14 రహదారులను స్టేట్ హైవేలుగా మార్చాలని కేంద్రమంతిని కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రంతో తరచూ సంప్రదిస్తూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల గుంతలను మట్టితో పూడ్చిందని, తమ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిపైనా తాము కక్ష సాధింపులకు దిగబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. ఈ విషయంపై మంగళవారం అధికారులతో సమీక్ష జరుపుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాను కలిసి రాజీనామాపత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. -
సీఎం పదవిపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్తో డేటింగ్ రూమర్స్పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
హోంమంత్రి వాహనం తనిఖీ.. సహకరించిన మంత్రి
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహిస్తున్న మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ వాహనాన్ని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద బుధవారం ఎస్ఐ హరిప్రసాద్ తనిఖీ చేశారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో హోం మంత్రి దిగి పోలీసులకు సహకరించారు. వాహనాన్ని పరిశీలించి పంపించారు. తనిఖీల్లో నగదు సీజ్ నారాయణపేట రూరల్: మండలంలోని జలాల్పూర్ చెక్పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక వాహనంలో రూ.90,500నగదు గుర్తించినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వేమన ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేసి గ్రీవియన్ కమిటీకి పంపించినట్లు తెలిపారు. కొత్తకోట రూరల్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తున్నండగా హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న పుల్లయ్య కారును అపి తనిఖీ చేయడంతో రూ.1,10,000 నగదు లభించింది. నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి వనపర్తికి కారులో వెళ్తున్న రాజు నుండి రూ.50,500 నగదు లభించింది. ఎలాంటి అనుమతులు లేకపోడంతో సీజ్ చేసినట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
Glenn Maxwell’s Wife Vini Raman: మాక్స్వెల్, వినీ రామన్ అపురూప (ఫొటోలు)
-
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
హైదరాబాద్లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగళూరు టెక్ హబ్గా అవతరించింది, అయితే భాగ్యనగరం (హైదరాబాద్) ఇప్పుడిప్పుడే వేగంగా ఈ దిశవైపు పరుగులు పెడుతోంది. కాగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువగా ఉంటాయని ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నెలకు రూ. 40,000 ఆదా చేస్తున్నట్లు, దీంతో చాలా హ్యాప్పీగా గడుపుతున్నట్లు పోస్ట్ చేసాడు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు నిజమే అని అతని మాటలతో ఏకీభవించగా.. మరి కొందరు ఇదెలా సాధ్యం, ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Moved from Bangalore to #Hyderabad Saved 40k per month expenses. One family can live peacefully with that money. 💰 Not seeing any a point of living alone when my values match with my family’s. — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 కొంతమంది బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడున్నారు, ప్రస్తుతం హైదరాబాద్లో కూడా రెంట్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి రూ. 40వేలు ఎలా ఆదా చేస్తున్నావని ఒక నెటిజన్ అడగగా దానికి రిప్లై ఇస్తూ రెంట్, మెయింటెనెన్స్, వాటర్, కరెంట్ బిల్ అని వెల్లడించాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! బెంగళూరులో అయినా.. హైదరాబాద్లో అయినా ఉన్న ప్రాంతన్ని బట్టి ఇంటి అద్దె ఉంటుంది. ఇక నిత్యావసరాలు, ప్రయాణ చార్జీలు ఇలా తీసుకుంటే ఎక్కడైనా దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Rent + maintenance + water, electric bills + food — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'రక్షాబంధన్' సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రక్షాబంధన్ సందర్భంగా తన చిప్పప్పుడు తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా సిస్టర్ రాధిక నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసాను. అయితే దానిని ఎవరో దయతో కలర్ ఫోటోగా మార్చారు' అంటూ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చెల్లెలు అనుజకు క్షమాపణలు అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి వేల సంఖ్యలో లైక్స్ రాగా, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ — anand mahindra (@anandmahindra) August 30, 2023 -
ల్యాండర్ కాలుమోపగానే.. చంద్రయాన్ 3 ఫస్ట్ మెసేజ్..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 'ఇండియా అంటే నేను లక్ష్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్పై పీఎం మోదీ.. -
నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్రాజ్పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
ఉత్తరం రాయండి.. బహుమతి పొందండి..
పోస్ట్.. అనే పిలుపు కోసం ఎదురు చూసిన క్షణాలు గుర్తున్నాయా.. అభిమాన లేఖలు, సమాచారం మోసుకొచ్చిన ఉత్తరాలు అందుకొని అపురూపంగా చదువుకొని ఎన్నాళ్లయిందో.. మనసులోని భావాలను కాగితంపై పెట్టి అందమైన దస్తూరితో అవతలి వారికి చేరవేయడం ఈ తరం వారికి తెలీనే తెలీదు. సెల్ఫోన్ మెసేజ్లు, ఈ–మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం నేటి ట్రెండ్. అందుకే ఉత్తరాన్ని ఓసారి గుర్తు చేద్దామని తపాలా శాఖ తలపెట్టింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. కలం కదిలించండి. బహుమతులు ఇవీ.. విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (12 మందికి మించకుండా) నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారి లేఖలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందిస్తారు. అనకాపల్లి రూరల్: నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. పెన్ను, పేపర్ పట్టి లేఖ రాయడం అందరూ మరిచారు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సమస్త సమాచారం క్షణాల్లో తెలుసుకొనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉత్తరాలు కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వదస్తూరితో లేఖలు రాసేవారు. నేటితరానికి ఆ అవసరం లేకుండా పోయింది. ఆనాటి సమాచార సాధనం గురించి యువతరానికి తెలపాలని, మరిచిపోయిన ఆనాటి తరానికి గుర్తు చేయాలని తపాలాశాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో థాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఎవరు పాల్గొనవచ్చంటే.. భారతదేశ పౌరులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు వారిని ఒక కేటగిరీగా, 18 ఏళ్ల పైబడిన వారిని మరో కేటగిరీగా పరిగణిస్తారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు ,అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చాలి. ఏ4 సైజు పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో ఉంచి పంపించవచ్చు. లేదా ఇన్లాండ్ లెటర్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. చేతితో రాసి వ్యాసం పంపాలి. లేఖలను పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయసు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ‘ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ–520013’ చిరునామాకు అక్టోబరు 31 లోగా పంపించాలి. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాలు పోటీతత్వాన్ని పెంచుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఈ పోటీపై అవగాహన కల్పిస్తున్నాం. ఆంగ్లం, హిందీలతోపాటు స్థానిక భాషల్లో కూడా వ్యాసం రాయవచ్చు. డిజిటల్ యుగంలో స్వదస్తూరితో ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది. మళ్లీ దానిని అలవాటు చేయడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయి. –సంజయ్ కుమార్ పాండా, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్ మంచి అవకాశం తపాలాశాఖ రూపొందించిన ఈ ఉత్తరాల పోటీ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశం. అన్ని వయసులవారూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్టు చేయాలి. మా ఇన్స్పెక్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, బీపీఎంలు పోటీపై ప్రచారం చేపడుతున్నారు. –జనపాల ప్రసాద్బాబు, పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్ -
మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్కు మరో షాకిచ్చిన అనసూయ
యాంకర్ అనసూయ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై, వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ సందడి చేస్తూ ఉంటోంది. చాలాసార్లు అనసూయ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేస్థాయిలో వాటికి అనసూయ కూడా తనదైన స్టెల్లో సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అనసూయ ఏడుస్తూ చేసిన ఆ వీడియోను చూసి అభిమానులంతా ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్) అందరూ అనుకుంటున్నట్లు నేను సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఆ వీడియో చేయలేదని ఫ్యాన్స్కు షాకిచ్చింది. అసలు ఆ పోస్ట్ను మీరు చదవలేదా? అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో చేసిన తర్వాత హ్యాపీగా సెలూన్కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నానని తెలిపింది. నా లైఫ్లో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను సోషల్ మీడియాలో నెగెటివిటీకి భయపడనని పేర్కొంది. దానివల్ల నాకు ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. నాకు సింపతి అనేది అసలు నచ్చదు.. నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యే మనిషిని కాదంటూ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఏడ్చే అలవాటు తనకు లేదని.. ఆ విషయమైతే కోపంతోనే సమాధానం చెబుతానని బదులిచ్చింది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా నువ్వు.. నీ ఓవర్ యాక్టింగ్ అంటూ విమర్శిస్తున్నారు. మీ తప్పు లేదు.. మీ వీడియోలు చూస్తున్న మాదే తప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు. అనసూయ వీడియో చూసి కొందరు నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా? ) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ఈ చీపురు తింటే.. ఫన్నీ పోస్టుకు కేకపుట్టించే కామెంట్లు!
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి. చీపురుపై ఉన్న ర్యాపర్పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు. ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు the broom has a calorie chart … in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k — JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023 -
గుజరాత్లో బీజేపీకి షాక్.. ప్రదీప్సిన్హా గుడ్ బై..
అహ్మదాబాద్: 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ కేంద్ర కార్యనిర్వహణ వర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రస్తుతం ఉన్న నాయకుల బలబలాలను అంచనా వేసి, ఉంచాలా? దించాలా? నిర్ణయం తీసుకుంటోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ పరిణామాల అనంతరం..గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సిన్హా వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడిన ప్రదీప్ సిన్హా.. మరికొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సీఆర్ పాటిల్ పదవికే ప్రదీప్ సిన్హ గురిపెట్టాడనే ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన ప్రదీప్ .. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రదీప్ సిన్హ వాఘేలా 2016 ఆగష్టు 10న బాధ్యతలు చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చాకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే వాఘేలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా ఇటీవల చెప్పటింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ప్రముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో దాదాపు 26 లోక్ సభ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ర్యాలీలను నిర్వహించింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ వర్గాల్లో భారీ మార్పులే చేసింది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్.. బీహార్ నుండి స్పెషల్ మటన్ తెప్పించి.. -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు!
ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా పాక్ పోలీసులు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. సీరియస్గా మారిన సిల్లీ పోస్ట్! పాక్ న్యూస్ వెబ్సైట్ ‘ఆజ్ ఇంగ్లీష్’లోని ఒక కథనం ప్రకారం ముహమ్మద్ గులాబ్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా అనే ఒక బ్రిటీష్ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. కేసు నమోదు.. అరెస్టు! అనంతరం పోలీసులు ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్ మార్గం గుండా అక్రమంగా భారత్లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్కు చెందిన అంజూ తన ఫేస్బుక్ ప్రెండ్ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే.. -
ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు. -
ఆ కోట ఎక్కాలని ఉంది.. ఆనంద్ మహీంద్ర ఆసక్తికర పోస్టు..
మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపారంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ తనను ఆలోచింపజేసిన ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలను పంచుకుంటూ ఫాలోవర్స్నూ ఆలోచింపజేస్తారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని కళావంతి కోట గురించి పోస్టు చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కోటను ఎక్కాలని ఉందంటూ తన అభీష్టాన్ని పంచుకున్నారు. కలావంతీ కోట మహారాష్ట్రలో ఉన్న అతి దుర్భేద్యమైన కోట. శత్రువులు చేరలేని స్థితిలో దాన్ని నిర్మాణం జరిగింది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. యువకులు ఛాలెంజ్గా ఈ కోటను ఎక్కుతారు. ఇన్ని రోజుల నుంచి ఈ కోట గురించి తనకు తెలియదని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ కోటను ఎక్కాలని ఉందని నెటిజన్లతో తన అభీష్టాన్ని పంచుకున్నారు. ఓ వ్యక్తి ఈ కోట నుంచి వేగంగా దిగుతున్న వీడియోను షేర్ చేశారు. I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy — anand mahindra (@anandmahindra) July 22, 2023 ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు తమ స్పందనలతో కామెంట్ బాక్స్ను నింపేశారు. కోట మార్గం నిటారుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే మంచి షూ ధరించి వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కుదిరితే ఈ కోటకు వెళ్లడానికి మీరూ ట్రై చేస్తారా మరి..? ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
ఆక్సిజన్ మాస్క్తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్
-
ఫాస్ట్గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్లోని బకింగ్హామ్ ప్యాలస్లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
‘బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’
సాక్షి, కరీంనగర్: జీతాలు రాకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడంలేదని వాపోతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘రెండు నెలలు బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’’ అంటూ సోషల్ మీడియాలో కరీంనగర్ నగరపాలక సంస్థ పొరుగు సేవల ఉద్యోగి పోస్ట్ వైరల్గా మారింది. దళితుడినయినా తనకు న్యాయం చేకూర్చాలంటూ కరీంనగర్కు చెందిన పొరుగు సేవల ఉద్యోగి కొండ్ర సుధాకర్ కొండ్ర విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని ఆవేదన చేస్తున్న సుధాకర్.. తనకు అన్యాయం జరిగిందని ఉద్యోగం ఇవ్వాలంటూ మొర పెట్టుకున్నారు. Bleeching powder valla health sick 3days live 4days job join ayyan 2month work chesaka salary adegithe job nuddi tholigichnaru kindla sir please any section gave the job sir I am sc B KNR thank you sir pic.twitter.com/KlE1BbfZRp — Sudhakar Kondra (@KondraSudh67685) May 19, 2023 -
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
విడాకులపై ఇన్డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?..
-
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
కొందరు అనుకోకుండా మన జీవితంలోకి వస్తారు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్తో పాటే ఉంటోంది. రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. రేణు తన ఇన్స్టాలో రాస్తూ..' కొంతమంది మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వేసవి రోజుల్లో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడతారు. అదోక రహస్యమైన భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మీపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మీ కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు. అలాగే మిమ్మల్ని నవ్విస్తారు కూడా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ కోసం ఫారిన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లైట్లో తన కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కాగా.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగాల తీసివేత ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికిన సంస్థలో తాజా ఆకస్మిక తొలగింపులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగాలదీ ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. సోషల్ మీడియాలో గుండెల్ని పిండేస్తున్న కథనాలు, పంచుకుంటున్న అనుభవాలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన గూగుల్ ఉద్యోగి ఆవేదన ఆ కోవలో నిలిచింది. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్గా నిలిచినా కూడా ఉద్యోగంనుంచి తొలగించారంటూ హర్ష్ విజయ్ వారిగ్య తన ఆవేదనను పంచుకున్నారు. (91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్లో బిజినెస్ టైకూన్) గూగుల్ ఆపరేషన్స్ సెంటర్లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య. ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఈ సంతోషంనుంచి తేరుకోకముందే కంపెనీ షాక్ ఇచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చూసి నివ్వెరపోయిననాయన లింక్డ్ఇన్ సుదీర్ఘమైన పోస్ట్లో తన అనుభవాన్ని షేర్ చేశారు. పాప్-అప్ ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన గుండె ఆగినంత పని అయిపోయిందనీ, ''స్టార్'' పెర్ఫార్మర్ని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ తనను తొలగించింది. ఎందుకిలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సంస్థలోని తొలగింపు ప్రభావం ఎలా ఉండబోతోందో వెల్లడించారు. ఇకపై వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే.. ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ ఆగమైపోయాయని పేర్కొన్నారు, ఈ షాక్నుంచి తేరుకుని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని, ఇపుడిక తన మనుగడ కోసం పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు హర్ష్ విజయ్ వారిగ్య. కాగా గురుగ్రామ్లోని గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆకృతి వాలియా ఇటీవలే తొలగించింది సంస్థ. సంస్థలో తన 5 సంవత్సరాల-గూగుల్వర్సరీ వేడుకలను జరుపుకున్న సంతోషంలో ఉండగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ దర్శనమిచ్చింది. మీటింగ్కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థంకావడం లేదంటూ లింక్డ్ ఇన్లో పోస్ట్లో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. -
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్లాక్ ఇచ్చి ఫ్యాన్స్కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
ఈసారి బర్త్డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
'మీరు మారలేదు అలానే ఉన్నారు': జెలెన్స్కీ భార్య భావోద్వేగ పోస్ట్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 45వ ఏటలోకి అడుగుపెట్టారు. జవనరి 25 జెలెన్స్కీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఒలెనా జెలెన్స్కా భావోద్వేగ పోస్ట్ తోపాటు జెలెన్స్కీ ఫోటోను కూడా పంచుకున్నారు. "మీరు నన్ను తరుచుగా ఎలా మారాను అని అడుగుతుంటారు. కానీ మీరు ఎప్పటికీ మారలేదు. నేను 17 ఏళ్ల వయసులో కలుసుకున్నప్పుడూ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడూ చాలా అరుదుగా నవ్వుతున్నారు. మీరు మరింత బాగా నవ్వుతూ ఉండేలా పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నా అందుకు ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఐతే మీకు కాస్త మొండి పట్టదల ఎక్కువ. ప్రధానంగా ముందు మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మంచిగా నవ్వండి. ఎప్పటికీ నీకు దగ్గరగా ఉండేలా అవకాశం ఇవ్వు" అని ఒలెన భావోద్వేగంగా ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా, ఈ జంట 2003లో పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరూ పిల్లలు కూడా. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు మీరిద్దరూ ప్రపంచానికే గొప్ప హిరోలు, దేశాన్ని రక్షించటం కోసం పోరాటానికి సిద్ధపడిన రియల్ హిరో జెలెన్ స్కీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వారిద్దర్నీ ప్రశంసలతో ముంచెత్తారు. I am often asked about how you have changed this year. And I always answer: "He haven't changed. He is the same. The same guy I have met when we were seventeen." But actually, something has changed: you smile much less now. For example, like on this photo... 1/2 pic.twitter.com/fBUFXkFCIR — Олена Зеленська (@ZelenskaUA) January 25, 2023 (చదవండి: లాక్డౌన్లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్ గురించి మాత్రం కాదట!) -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ