post
-
లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)
-
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
లోన్ క్లియర్ చేయడం ఆలస్యమైతే ప్రయోజనాలా?: పోస్ట్ వైరల్
ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థ నుంచి లోన్ తీసివుంటే.. ఎప్పుడెప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా ఉందామా అనుకుంటారు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం మూడేళ్ళలో క్లియర్ చేయాల్సిన లోన్ను ఎనిమిదేళ్లలో క్లియర్ చేసాడు. ఎందుకు ఆలస్యం చేసాడు అనేదానికి సంబంధించిన వివరాలను రెడ్డిట్లో షేర్ చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బెంగళూరు పూర్వ విద్యార్థి.. మొదట్లో సాధ్యమైనంత త్వరగా తన లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలస్యం చేయడంలో లాభాలు ఉన్నాయని కొన్ని లెక్కల ద్వారా తెలుసుకుని.. లోన్ చెల్లించడానికి తొందరపడటం ఉత్తమ చర్య కాదని గ్రహించాడు.ఎంబీఏ గ్రాడ్యుయేట్ లోన్ ఆలస్యంగా చెల్లించాలి, అనుకోవడానికి ప్రధాన కారణం పన్ను ప్రయోజనాలు అని రెడ్డిట్లో వెల్లడించారు. బహుశా ఈ ప్రయోజనాల గురించి ఎవరికీ తెలుసుకుండకపోవచ్చు లేదా తెలిసినా పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, పన్ను చెల్లింపుదారులు ఎనిమిది సంవత్సరాల వరకు చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు పొందుతారు. రెండు లేదా మూడేళ్ళలో లోన్ క్లియర్ చేస్తే ఈ మినహాయింపు లభించదు. కాబట్టి పూర్తి వ్యవధిలో లోన్ చెల్లించి పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎందుకు తగ్గించకూడదని.. అన్నారు.రెండో కారణం ఏమిటంటే.. ఒక వ్యక్తి రూ. 20 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుంటే.. 9 శాతం వడ్డీతో మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న మొదటి రోజుల్లో లేదా ఈఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్ అవుతుంది. క్రమంగా ఆ వడ్డీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నా డబ్బును తొందరగా తిరిగి చెల్లించడానికి బదులు.. దానిని పొదుపులు & పెట్టుబడులతో సమతుల్యం చేసుకున్నానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్నేను లోన్ తీసుకుని.. దానిని మళ్ళీ చెల్లించే విషయంలో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఉత్తమ ఆర్థిక నిర్ణయం అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ పేర్కొన్నాడు. అయితే త్వరగా అప్పులు తీర్చుకోవడం మంచిది, కానీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండటం కూడా మంచిదని.. అదే తాను నేర్చుకున్న పాఠమని వెల్లడించారు. -
ఆశా వర్కర్ కుటుంబం వెలి
సంతబోమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు తీరప్రాంత గ్రామంలో సోమవారం గ్రామ పెద్దలు దారుణ నిర్ణయానికి పాల్పడ్డారు. ఓ ఆశావర్కర్ తాము చెప్పినట్టు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని వెలివేశారు. 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు ఏం చెబితే అక్కడ అదే వేదంగా నడుస్తోంది. బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్గా 2014 నుంచి పనిచేస్తోంది.ఇటీవల గ్రామంలోని ఆశ వర్కర్, అంగన్వాడీ పోస్టులకు గ్రామ పెద్దలు వేలం నిర్వహించారు. ఆ మేరకు డబ్బులు ఇచ్చిన వారికి ఆ పోస్టులను అమ్మేశారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టును రూ.2 లక్షలకు ఓ మహిళ దక్కించుకుంది. దీంతో అప్పటి వరకూ పనిచేస్తున్న హరిదేవితో రాజీనామా చేయించారు. ఆశా వర్కర్ పోస్టునూ రూ.1.90 లక్షలకు వేలంలో అమ్మేశారు.అయితే ప్రస్తుత ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎవరూ సాయం చేయకూడదని, శుభకార్యాలకు వెళ్లకూడదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో చంద్రమ్మ మంగళవారం యూనియన్తో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
‘మండలి’లో టీడీపీ సెల్ఫ్గోల్
సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టేసిందంటూ ‘మండలి’లో టీడీపీ ప్రశ్న వేసి సెల్ఫ్గోల్ చేసుకుంది. 2019–24 మధ్య రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టిన విషయం వాస్తవమేనా అని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, పరుచూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి.. సీఎం చంద్రబాబు తరఫున మంత్రులు బుధవారం ‘మండలి’లో సమాధానం ఇవ్వాల్సి ఉండగా, సభ్యులు ప్రశ్నను ఉపసంహరించుకున్నారని ప్రకటించారు. పరువుపోతుందని విత్డ్రా ‘మండలి’లో బుధవారం ఈ ప్రశ్న పోస్ట్ అవడంతో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా అనుబంధ ప్రశ్నలు వేయడంతో పాటు, గత ప్రభుత్వంపై బురద జల్లడానికి వీలుగా టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమైనట్లు తెలిసింది. పైగా ఆ పత్రికలో ప్రచురించిన తప్పుడు కథనం తాలూకు ప్రతులను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. అయితే, ఈ ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం ‘మండలి’కి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ఈ అంశంపై యథావిధిగా సమాధానమిస్తే తమ పరువే పోతుందని ప్రభుత్వ పెద్దలు భావించారో ఏమో.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, సభ్యులే ప్రశ్నను విరమించుకున్నారని ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే.. రూ.370 కోట్లకు రాష్ట్ర సచివాలయ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ‘తాకట్టులో సచివాలయం’ అంటూ గతేడాది మార్చి 3న బూతు పత్రిక ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం అవాస్తమని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు అప్పట్లోనే కొట్టిపారేశారు. అయినా, ఇదే అంశంపై శాసన మండలిలో టీడీపీ ప్రశ్నవేసి తోక ముడిచింది. -
‘పోసాని’పై ఎలాంటి కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి/నరసరావుపేట టౌన్/కర్నూలు (టౌన్) : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని విశాఖపట్నం వన్టౌన్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, గుంటూరు పట్టాభిపురం, అల్లూరి జిల్లా పాడేరు, మన్యం జిల్లా పాలకొండ పోలీ స్స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ అమలుచేసిన నేపథ్యంలో, తనపై కేసు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏమాత్రం వర్తించని సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై పట్టాభిపురం, భవానీపురం, పాడేరు, పాలకొండ, విశాఖపట్నం వన్టౌన్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. భవానీపురం పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్ను అమలుచేసినందున పోసాని పిటిషన్ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యా యమూర్తి జస్టిస్ హరినాథ్.. అదనపు ఏజీ, పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ పోసాని క్వాష్ పిటిషన్ను కొట్టేశారు. విశాఖ వన్టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసులో మాత్రం పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.పోసానికి బెయిల్ మంజూరు..పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్. ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు జామీన్దారులు ఒక్కొక్కరు రూ.10 వేలు పూచీకత్తు చొప్పున సమర్పించేలా ఉత్తర్వులు జారీచేశారు. రాజంపేట సబ్జైల్లో ఉన్న పోసానిని ఈనెల 3న పీటి వారెంట్పై నరసరావుపేట టూటౌన్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ అనంతరం గుంటూరు సబ్జైలులో ఉన్న ఆయనను పీటి వారెంట్పై కర్నూలు పోలీసులు అక్కడ నమోదైన కేసులో తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆదోని సబ్జైల్లో పోసాని ఉన్నారు. ఇక పోసానిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను సోమవారం కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మంగళవారం తీర్పు వెలువడనుంది. -
ఉమెన్స్ డే స్పెషల్.. తల్లి, చెల్లితో సాయిపల్లవి (ఫోటోలు)
-
ప్రతిరోజు నీ ప్రేమలో.. భార్య గురించి మనోజ్ అలా (ఫొటోలు)
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది. -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
కలలు రూపుదిద్దుకుంటున్నాయి.. సింధు పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Anupama Parameswaran: 2025లో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ ఇదే! (ఫోటోలు)
-
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
బంగ్లాదేశ్ సోషల్మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో మాత్రం నిందితుని అరెస్ట్కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్గా పోస్టల్ సేవలు -
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
సామ్ జ్ఞాపకాల్లో చైతూ.. ఆ ఒక్క ఫొటో డిలీట్ చేయలేదుగా! (ఫొటోలు)
-
తులం బంగారం రూ. 113 మాత్రమే *
మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు. -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
అనంత్- రాధిక వెడ్డింగ్: అందానికే అర్థంలా సానియా మీర్జా (ఫొటోలు)
-
‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
ఉత్కంఠభరితంగా బార్బడోస్లో జరిగిన మ్యాచ్లో టీ-20 ప్రపంచ కప్ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్గా మారింది.ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. ‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance. But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్బాల్తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాష్ట్ర కేబినెట్లో జనసేన నుంచి అధినేత పవన్కళ్యాణ్తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.వీరే ఆశావహులు.. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్ మంత్రి పదవుల రేసులో ఉన్నారు. -
టీ20 వరల్డ్కప్-2024: భర్త క్రికెట్తో.. భార్య యాంకరింగ్తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్ఫామ్లోని కొన్ని ఖాతాలు, పోస్ట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
నేను అలాంటి పనులు చేయను !
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటీంచిన ‘సిద్ధు ఫ్రమ్ సీకాకుళం’(2008) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రద్ధాదాస్. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషల్లో పలు సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆ మధ్య హీరోయిన్ మన్నారా చోప్రా గురించి శ్రద్ధాదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ‘‘జిద్’ (2014) అనే హిందీ సినిమాలో మన్నారా చోప్రాతో కలిసి నటించాను. ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చోప్రా కావాలనే నన్ను నిజంగానే కొట్టింది.. బలవంతంగా మెట్లపైకి తోసేసింది.. ఆమె వల్ల గాయాలపాలయ్యాను’’ అంటూ గతంలో మాట్లాడారు శ్రద్ధాదాస్. ఆ మాటలపై తీవ్ర దుమారం రేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్ మరోసారి స్పందించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు శ్రద్ధాదాస్. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీ గురించి నేను ఏ మీడియాకి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం నా వ్యక్తిగత పీఆర్వో సిబ్బంది కూడా లేరు. నేను కావాలనుకుంటే ‘ఎక్స్’ లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేసి పబ్లిసిటీ పొందుతాను. కానీ, నేను అలాంటి పనులు చేయను. ఆమె విషయంలో గతంలో నేను బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ శ్రద్ధాదాస్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారంది. పాజిటివ్ మైండ్సెట్తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్ఫుల్గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్తో సరిసమానమైన క్రేజ్తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
28న మరికొన్ని గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీలో ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, తెలంగాణలోని 14 రహదారులను స్టేట్ హైవేలుగా మార్చాలని కేంద్రమంతిని కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రంతో తరచూ సంప్రదిస్తూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల గుంతలను మట్టితో పూడ్చిందని, తమ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిపైనా తాము కక్ష సాధింపులకు దిగబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. ఈ విషయంపై మంగళవారం అధికారులతో సమీక్ష జరుపుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాను కలిసి రాజీనామాపత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. -
సీఎం పదవిపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్తో డేటింగ్ రూమర్స్పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
హోంమంత్రి వాహనం తనిఖీ.. సహకరించిన మంత్రి
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహిస్తున్న మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ వాహనాన్ని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద బుధవారం ఎస్ఐ హరిప్రసాద్ తనిఖీ చేశారు. పోలీసులు వాహనాన్ని ఆపడంతో హోం మంత్రి దిగి పోలీసులకు సహకరించారు. వాహనాన్ని పరిశీలించి పంపించారు. తనిఖీల్లో నగదు సీజ్ నారాయణపేట రూరల్: మండలంలోని జలాల్పూర్ చెక్పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక వాహనంలో రూ.90,500నగదు గుర్తించినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వేమన ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేసి గ్రీవియన్ కమిటీకి పంపించినట్లు తెలిపారు. కొత్తకోట రూరల్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తున్నండగా హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న పుల్లయ్య కారును అపి తనిఖీ చేయడంతో రూ.1,10,000 నగదు లభించింది. నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి వనపర్తికి కారులో వెళ్తున్న రాజు నుండి రూ.50,500 నగదు లభించింది. ఎలాంటి అనుమతులు లేకపోడంతో సీజ్ చేసినట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
Glenn Maxwell’s Wife Vini Raman: మాక్స్వెల్, వినీ రామన్ అపురూప (ఫొటోలు)
-
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
హైదరాబాద్లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగళూరు టెక్ హబ్గా అవతరించింది, అయితే భాగ్యనగరం (హైదరాబాద్) ఇప్పుడిప్పుడే వేగంగా ఈ దిశవైపు పరుగులు పెడుతోంది. కాగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువగా ఉంటాయని ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నెలకు రూ. 40,000 ఆదా చేస్తున్నట్లు, దీంతో చాలా హ్యాప్పీగా గడుపుతున్నట్లు పోస్ట్ చేసాడు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు నిజమే అని అతని మాటలతో ఏకీభవించగా.. మరి కొందరు ఇదెలా సాధ్యం, ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Moved from Bangalore to #Hyderabad Saved 40k per month expenses. One family can live peacefully with that money. 💰 Not seeing any a point of living alone when my values match with my family’s. — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 కొంతమంది బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడున్నారు, ప్రస్తుతం హైదరాబాద్లో కూడా రెంట్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి రూ. 40వేలు ఎలా ఆదా చేస్తున్నావని ఒక నెటిజన్ అడగగా దానికి రిప్లై ఇస్తూ రెంట్, మెయింటెనెన్స్, వాటర్, కరెంట్ బిల్ అని వెల్లడించాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! బెంగళూరులో అయినా.. హైదరాబాద్లో అయినా ఉన్న ప్రాంతన్ని బట్టి ఇంటి అద్దె ఉంటుంది. ఇక నిత్యావసరాలు, ప్రయాణ చార్జీలు ఇలా తీసుకుంటే ఎక్కడైనా దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Rent + maintenance + water, electric bills + food — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'రక్షాబంధన్' సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రక్షాబంధన్ సందర్భంగా తన చిప్పప్పుడు తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా సిస్టర్ రాధిక నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసాను. అయితే దానిని ఎవరో దయతో కలర్ ఫోటోగా మార్చారు' అంటూ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చెల్లెలు అనుజకు క్షమాపణలు అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి వేల సంఖ్యలో లైక్స్ రాగా, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ — anand mahindra (@anandmahindra) August 30, 2023 -
ల్యాండర్ కాలుమోపగానే.. చంద్రయాన్ 3 ఫస్ట్ మెసేజ్..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 'ఇండియా అంటే నేను లక్ష్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్పై పీఎం మోదీ.. -
నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్రాజ్పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
ఉత్తరం రాయండి.. బహుమతి పొందండి..
పోస్ట్.. అనే పిలుపు కోసం ఎదురు చూసిన క్షణాలు గుర్తున్నాయా.. అభిమాన లేఖలు, సమాచారం మోసుకొచ్చిన ఉత్తరాలు అందుకొని అపురూపంగా చదువుకొని ఎన్నాళ్లయిందో.. మనసులోని భావాలను కాగితంపై పెట్టి అందమైన దస్తూరితో అవతలి వారికి చేరవేయడం ఈ తరం వారికి తెలీనే తెలీదు. సెల్ఫోన్ మెసేజ్లు, ఈ–మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం నేటి ట్రెండ్. అందుకే ఉత్తరాన్ని ఓసారి గుర్తు చేద్దామని తపాలా శాఖ తలపెట్టింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. కలం కదిలించండి. బహుమతులు ఇవీ.. విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (12 మందికి మించకుండా) నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారి లేఖలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందిస్తారు. అనకాపల్లి రూరల్: నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. పెన్ను, పేపర్ పట్టి లేఖ రాయడం అందరూ మరిచారు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సమస్త సమాచారం క్షణాల్లో తెలుసుకొనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉత్తరాలు కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వదస్తూరితో లేఖలు రాసేవారు. నేటితరానికి ఆ అవసరం లేకుండా పోయింది. ఆనాటి సమాచార సాధనం గురించి యువతరానికి తెలపాలని, మరిచిపోయిన ఆనాటి తరానికి గుర్తు చేయాలని తపాలాశాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో థాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఎవరు పాల్గొనవచ్చంటే.. భారతదేశ పౌరులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు వారిని ఒక కేటగిరీగా, 18 ఏళ్ల పైబడిన వారిని మరో కేటగిరీగా పరిగణిస్తారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు ,అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చాలి. ఏ4 సైజు పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో ఉంచి పంపించవచ్చు. లేదా ఇన్లాండ్ లెటర్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. చేతితో రాసి వ్యాసం పంపాలి. లేఖలను పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయసు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ‘ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ–520013’ చిరునామాకు అక్టోబరు 31 లోగా పంపించాలి. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాలు పోటీతత్వాన్ని పెంచుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఈ పోటీపై అవగాహన కల్పిస్తున్నాం. ఆంగ్లం, హిందీలతోపాటు స్థానిక భాషల్లో కూడా వ్యాసం రాయవచ్చు. డిజిటల్ యుగంలో స్వదస్తూరితో ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది. మళ్లీ దానిని అలవాటు చేయడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయి. –సంజయ్ కుమార్ పాండా, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్ మంచి అవకాశం తపాలాశాఖ రూపొందించిన ఈ ఉత్తరాల పోటీ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశం. అన్ని వయసులవారూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్టు చేయాలి. మా ఇన్స్పెక్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, బీపీఎంలు పోటీపై ప్రచారం చేపడుతున్నారు. –జనపాల ప్రసాద్బాబు, పోస్టల్ సూపరింటెండెంట్, అనకాపల్లి డివిజన్ -
మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్కు మరో షాకిచ్చిన అనసూయ
యాంకర్ అనసూయ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై, వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ సందడి చేస్తూ ఉంటోంది. చాలాసార్లు అనసూయ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేస్థాయిలో వాటికి అనసూయ కూడా తనదైన స్టెల్లో సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అనసూయ ఏడుస్తూ చేసిన ఆ వీడియోను చూసి అభిమానులంతా ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్) అందరూ అనుకుంటున్నట్లు నేను సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఆ వీడియో చేయలేదని ఫ్యాన్స్కు షాకిచ్చింది. అసలు ఆ పోస్ట్ను మీరు చదవలేదా? అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో చేసిన తర్వాత హ్యాపీగా సెలూన్కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నానని తెలిపింది. నా లైఫ్లో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను సోషల్ మీడియాలో నెగెటివిటీకి భయపడనని పేర్కొంది. దానివల్ల నాకు ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. నాకు సింపతి అనేది అసలు నచ్చదు.. నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యే మనిషిని కాదంటూ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ఏడ్చే అలవాటు తనకు లేదని.. ఆ విషయమైతే కోపంతోనే సమాధానం చెబుతానని బదులిచ్చింది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా నువ్వు.. నీ ఓవర్ యాక్టింగ్ అంటూ విమర్శిస్తున్నారు. మీ తప్పు లేదు.. మీ వీడియోలు చూస్తున్న మాదే తప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు. అనసూయ వీడియో చూసి కొందరు నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా? ) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ఈ చీపురు తింటే.. ఫన్నీ పోస్టుకు కేకపుట్టించే కామెంట్లు!
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి. చీపురుపై ఉన్న ర్యాపర్పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు. ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు the broom has a calorie chart … in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k — JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023 -
గుజరాత్లో బీజేపీకి షాక్.. ప్రదీప్సిన్హా గుడ్ బై..
అహ్మదాబాద్: 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ కేంద్ర కార్యనిర్వహణ వర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రస్తుతం ఉన్న నాయకుల బలబలాలను అంచనా వేసి, ఉంచాలా? దించాలా? నిర్ణయం తీసుకుంటోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ పరిణామాల అనంతరం..గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సిన్హా వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడిన ప్రదీప్ సిన్హా.. మరికొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సీఆర్ పాటిల్ పదవికే ప్రదీప్ సిన్హ గురిపెట్టాడనే ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన ప్రదీప్ .. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రదీప్ సిన్హ వాఘేలా 2016 ఆగష్టు 10న బాధ్యతలు చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చాకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే వాఘేలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా ఇటీవల చెప్పటింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ప్రముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో దాదాపు 26 లోక్ సభ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ర్యాలీలను నిర్వహించింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ వర్గాల్లో భారీ మార్పులే చేసింది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్.. బీహార్ నుండి స్పెషల్ మటన్ తెప్పించి.. -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు!
ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా పాక్ పోలీసులు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. సీరియస్గా మారిన సిల్లీ పోస్ట్! పాక్ న్యూస్ వెబ్సైట్ ‘ఆజ్ ఇంగ్లీష్’లోని ఒక కథనం ప్రకారం ముహమ్మద్ గులాబ్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా అనే ఒక బ్రిటీష్ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. కేసు నమోదు.. అరెస్టు! అనంతరం పోలీసులు ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్ మార్గం గుండా అక్రమంగా భారత్లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్కు చెందిన అంజూ తన ఫేస్బుక్ ప్రెండ్ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే.. -
ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు. -
ఆ కోట ఎక్కాలని ఉంది.. ఆనంద్ మహీంద్ర ఆసక్తికర పోస్టు..
మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపారంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ తనను ఆలోచింపజేసిన ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలను పంచుకుంటూ ఫాలోవర్స్నూ ఆలోచింపజేస్తారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని కళావంతి కోట గురించి పోస్టు చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కోటను ఎక్కాలని ఉందంటూ తన అభీష్టాన్ని పంచుకున్నారు. కలావంతీ కోట మహారాష్ట్రలో ఉన్న అతి దుర్భేద్యమైన కోట. శత్రువులు చేరలేని స్థితిలో దాన్ని నిర్మాణం జరిగింది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. యువకులు ఛాలెంజ్గా ఈ కోటను ఎక్కుతారు. ఇన్ని రోజుల నుంచి ఈ కోట గురించి తనకు తెలియదని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ కోటను ఎక్కాలని ఉందని నెటిజన్లతో తన అభీష్టాన్ని పంచుకున్నారు. ఓ వ్యక్తి ఈ కోట నుంచి వేగంగా దిగుతున్న వీడియోను షేర్ చేశారు. I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy — anand mahindra (@anandmahindra) July 22, 2023 ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు తమ స్పందనలతో కామెంట్ బాక్స్ను నింపేశారు. కోట మార్గం నిటారుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే మంచి షూ ధరించి వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కుదిరితే ఈ కోటకు వెళ్లడానికి మీరూ ట్రై చేస్తారా మరి..? ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
ఆక్సిజన్ మాస్క్తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్
-
ఫాస్ట్గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్లోని బకింగ్హామ్ ప్యాలస్లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
‘బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’
సాక్షి, కరీంనగర్: జీతాలు రాకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడంలేదని వాపోతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘రెండు నెలలు బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’’ అంటూ సోషల్ మీడియాలో కరీంనగర్ నగరపాలక సంస్థ పొరుగు సేవల ఉద్యోగి పోస్ట్ వైరల్గా మారింది. దళితుడినయినా తనకు న్యాయం చేకూర్చాలంటూ కరీంనగర్కు చెందిన పొరుగు సేవల ఉద్యోగి కొండ్ర సుధాకర్ కొండ్ర విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని ఆవేదన చేస్తున్న సుధాకర్.. తనకు అన్యాయం జరిగిందని ఉద్యోగం ఇవ్వాలంటూ మొర పెట్టుకున్నారు. Bleeching powder valla health sick 3days live 4days job join ayyan 2month work chesaka salary adegithe job nuddi tholigichnaru kindla sir please any section gave the job sir I am sc B KNR thank you sir pic.twitter.com/KlE1BbfZRp — Sudhakar Kondra (@KondraSudh67685) May 19, 2023 -
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
విడాకులపై ఇన్డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?..
-
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
కొందరు అనుకోకుండా మన జీవితంలోకి వస్తారు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్తో పాటే ఉంటోంది. రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. రేణు తన ఇన్స్టాలో రాస్తూ..' కొంతమంది మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వేసవి రోజుల్లో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడతారు. అదోక రహస్యమైన భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మీపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మీ కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు. అలాగే మిమ్మల్ని నవ్విస్తారు కూడా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ కోసం ఫారిన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లైట్లో తన కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కాగా.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగాల తీసివేత ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికిన సంస్థలో తాజా ఆకస్మిక తొలగింపులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగాలదీ ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. సోషల్ మీడియాలో గుండెల్ని పిండేస్తున్న కథనాలు, పంచుకుంటున్న అనుభవాలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన గూగుల్ ఉద్యోగి ఆవేదన ఆ కోవలో నిలిచింది. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్గా నిలిచినా కూడా ఉద్యోగంనుంచి తొలగించారంటూ హర్ష్ విజయ్ వారిగ్య తన ఆవేదనను పంచుకున్నారు. (91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్లో బిజినెస్ టైకూన్) గూగుల్ ఆపరేషన్స్ సెంటర్లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య. ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఈ సంతోషంనుంచి తేరుకోకముందే కంపెనీ షాక్ ఇచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చూసి నివ్వెరపోయిననాయన లింక్డ్ఇన్ సుదీర్ఘమైన పోస్ట్లో తన అనుభవాన్ని షేర్ చేశారు. పాప్-అప్ ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన గుండె ఆగినంత పని అయిపోయిందనీ, ''స్టార్'' పెర్ఫార్మర్ని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ తనను తొలగించింది. ఎందుకిలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సంస్థలోని తొలగింపు ప్రభావం ఎలా ఉండబోతోందో వెల్లడించారు. ఇకపై వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే.. ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ ఆగమైపోయాయని పేర్కొన్నారు, ఈ షాక్నుంచి తేరుకుని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని, ఇపుడిక తన మనుగడ కోసం పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు హర్ష్ విజయ్ వారిగ్య. కాగా గురుగ్రామ్లోని గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆకృతి వాలియా ఇటీవలే తొలగించింది సంస్థ. సంస్థలో తన 5 సంవత్సరాల-గూగుల్వర్సరీ వేడుకలను జరుపుకున్న సంతోషంలో ఉండగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ దర్శనమిచ్చింది. మీటింగ్కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థంకావడం లేదంటూ లింక్డ్ ఇన్లో పోస్ట్లో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. -
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్లాక్ ఇచ్చి ఫ్యాన్స్కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
ఈసారి బర్త్డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
'మీరు మారలేదు అలానే ఉన్నారు': జెలెన్స్కీ భార్య భావోద్వేగ పోస్ట్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 45వ ఏటలోకి అడుగుపెట్టారు. జవనరి 25 జెలెన్స్కీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఒలెనా జెలెన్స్కా భావోద్వేగ పోస్ట్ తోపాటు జెలెన్స్కీ ఫోటోను కూడా పంచుకున్నారు. "మీరు నన్ను తరుచుగా ఎలా మారాను అని అడుగుతుంటారు. కానీ మీరు ఎప్పటికీ మారలేదు. నేను 17 ఏళ్ల వయసులో కలుసుకున్నప్పుడూ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడూ చాలా అరుదుగా నవ్వుతున్నారు. మీరు మరింత బాగా నవ్వుతూ ఉండేలా పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నా అందుకు ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఐతే మీకు కాస్త మొండి పట్టదల ఎక్కువ. ప్రధానంగా ముందు మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మంచిగా నవ్వండి. ఎప్పటికీ నీకు దగ్గరగా ఉండేలా అవకాశం ఇవ్వు" అని ఒలెన భావోద్వేగంగా ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా, ఈ జంట 2003లో పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరూ పిల్లలు కూడా. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు మీరిద్దరూ ప్రపంచానికే గొప్ప హిరోలు, దేశాన్ని రక్షించటం కోసం పోరాటానికి సిద్ధపడిన రియల్ హిరో జెలెన్ స్కీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వారిద్దర్నీ ప్రశంసలతో ముంచెత్తారు. I am often asked about how you have changed this year. And I always answer: "He haven't changed. He is the same. The same guy I have met when we were seventeen." But actually, something has changed: you smile much less now. For example, like on this photo... 1/2 pic.twitter.com/fBUFXkFCIR — Олена Зеленська (@ZelenskaUA) January 25, 2023 (చదవండి: లాక్డౌన్లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్ గురించి మాత్రం కాదట!) -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ -
ఇక సెలవు.. ఉంటా మరి..! టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పిన మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్ను నియమించింది. ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఠాగూర్ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. -
న్యూ ఇయర్ పై సమంత పోస్ట్ వైరల్
-
ఎఫ్బీలో ఓవర్ యాక్షన్: బీటెక్ విద్యార్థికి జైలు, భారీ జరిమానా
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్కి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జడ్జి సిఎం గంగాధర అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రశంసిస్తూ, భారత సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇంజనీరింగ్ విద్యార్థి రషీద్ను 2019 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి బెయిల్ మంజూరు కాలేదు. విచారణలో తాజాగా కోర్టు తీ ర్పునిచ్చింది. రషీద్ నిరక్షరాస్యుడు కాదని, కావాలనే ఫేస్బుక్లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని న్యాయమూర్తి అన్నారు. ఇది జాతికి వ్యతిరేకమైందనీ, హేయమైందని న్యాయమూర్తి గంగాధరను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. కాగా ఫైజ్ ఫేస్బుక్ పోస్ట్లో, భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఫైజ్ను అరెస్ట్ చేసి, అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 2019, ఫిబ్రవరి 24న పుల్వామా దాడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్తో కరీనా కపూర్కు 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జేహ్) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్తో సమాధానమిచ్చింది. ప్రస్తుతం సైఫ్, ఇద్దరి పిల్లలతో వెకేషన్లో ఉంది కరీనా. ఈ వెకెషన్కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్ చెప్పాడు' అని ఇన్స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్ రూమర్స్కు చెక్ పడినట్లయింది. కాగా కరీనా కపూర్ తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. చదవండి: చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm — Kareena Kapoor Khan (@KareenaK_FC) July 15, 2022 చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్
Prathap Pothen Last Posts About Death Goes Viral: ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు హాఠాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జులై 15) ఉదయం ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతెన్ (70) కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మరణానికి ముందు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రతాప్ పోతెన్ గురువారం ఉదయం 9:38 గంటలకు జార్జ్ కార్లిన్ కోట్తో కూడిన ఫొటోను పోస్ట్ చేశారు. 'చాలా కాలంగా చిన్న మొత్తంలో లాలాజలం మింగడం వల్ల మరణం సంభవిస్తుంది' అని ఈ పోస్ట్లో రాసి ఉంది. తర్వాత ఆయన మరణానికి 16 గంటల ముందు 'ఒక సమస్య మూల కారణానికి చికిత్స చేయకుండా దాని లక్షణాలకు చికిత్స చేసినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు' అని పోస్ట్ పెట్టారు ప్రతాప్ పోతెన్. దీంతోపాటు 'జీవితం అనే ఆటలో ప్రతీ జనరేషన్ ఒకేలా ఆడుతుంది' అని రాసుకొచ్చారు. అనంతరం ఆయన తుదిశ్వాస విడవటానికి 15 గంటల ముందు పెట్టిన జిమ్ మోరిసన్ కోట్లో 'నేను కళల్లో గుర్తింపు ఉందనుకున్నాను. ఇంకా చెప్పాలంటే చలనచిత్రాల్లో ఉందనుకున్నాను. కానీ ప్రజలు తమకు నచ్చినవాటిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఉంది. ఈ కోట్స్ చూస్తుంటే ప్రతాప్ పోతెన్ తన మరణాన్ని ముందే ఊహించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారి, ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాగా ప్రతాప్ పోతెన్ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాలతో కలిపి సుమారు 100 సినిమాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాకుండా 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. -
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్
Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నితిన్. దిల్, సై, ఇష్క్ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్లో ఎమోషనల్గా పోస్ట్ చేశాడు నితిన్. ❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3 — nithiin (@actor_nithiin) June 14, 2022 -
తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu And Namrata Special Birthday Wishes To Super Star Krishna: తొలి తెలుగు జేమ్స్బాండ్, కౌబాయ్ హీరో అని ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన 1965లో వచ్చిన 'తేనె మనసులు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తర్వాత వచ్చిన మూడో సినిమా 'గూఢచారి 116' సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం అనేక బ్లాక్బ్లస్టర్ హిట్లు ఇచ్చిన ఆయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్ స్టార్గా అభిమానులకు ఎవర్గ్రీన్ హీరోగా ఖ్యాతి సాధించిన కృష్ణ పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. 'హ్యపీ బర్త్డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022 'చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే మామయ్య. వి లవ్ యూ.' అని నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాలో ఎమోషనల్గా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గౌతమ్, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ?
Rajkummar Rao Shared His Back Wife Patralekhaa Impressed: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇటీవల 'బదాయి దో' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో భూమి పెడ్నేకర్తో తొసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ఈ మూవీ జాతియ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం 'బదాయి హో'కి సీక్వెల్గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. రాజ్ కుమార్ రావుకు ఇన్స్టాగ్రామ్లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్డేట్ వంటి విషయాలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు రాజ్ కుమార్. చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ ఈ పోస్ట్ చూసిన రాజ్ కుమార్ రావు అభిమానులు అమెజింగ్, అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ రాజ్ కుమార్ రావు సతీమణి, నటి పత్రలేఖ దృష్టిని ఆకర్షించింది. ఈ జిమ్ ఫొటోకు తను స్పందిస్తూ 'హాయ్' అని రాస్తూ రెండు ఫైర్ ఎమోజీస్ను రిప్లైగా ఇచ్చింది. ఈ ఫొటోలో రెసిస్టాన్స్ బ్యాండ్తో రాజ్ కుమార్ చేస్తున్న వర్క్ అవుట్కు అతని బ్యాక్ కర్వ్ తిరిగి ఉండటం మనం చూడొచ్చు. కాగా బదాయి దో చిత్రంలో రాజ్ కుమార్ రావు బాడీ బిల్డర్గా మారాలనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాడు. అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలను కొల్లేజ్ రూపంలో పోస్ట్ చేశాడు రాజ్ కుమార్. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ -
చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై: తిరువొత్తియూరు డీఎంకే ఎమ్మెల్యే కేపీ శంకర్ చిక్కుల్లో పడ్డారు. కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ను ఆయన చెంప మీద కొట్టినట్టుగా వచ్చిన ఫిర్యాదుతో పార్టీ పదవి నుంచి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తొలగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసుల్ని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్సింగ్ బేడీ కోరారు. వివరాలు.. తిరువొత్తియూరు నటరాజన్ వీధిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల సమయంలో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కేపీ శంకర్ విధుల్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ ఇంజినీరు చెంప మీద కొట్టినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం తీవ్రంగా పరిగణించింది. అసలు ఎమ్మెల్యే చెంప మీద కొట్టాల్సింత పరిస్థితి ఎందుకు వచ్చిందో అని ఆరా తీశారు. రోడ్డు పనుల గురించి తనకు సమాచారం ఇవ్వలేదనే ఆగ్రహంతోనే వీరంగాన్ని ప్రదర్శించినట్టు వెలుగు చూసింది. దీంతో కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం కాస్త ప్రభుత్వ వర్గాల దృష్టికి చేరింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ శనివారం ఓ ప్రకటన చేశారు. కేపీ శంకర్ చేతిలో ఉన్న తిరువొత్తియూరు పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తప్పించారు. దీంతో ఎమ్మెల్యేకు చిక్కులు తప్పలేదు. అదే సమయంలో చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్కు కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఇందుకు తగిన లేఖను ఆయనకు పంపించడంతో తిరువొత్తియూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డ్రైవర్కు వరుణ్ భావోద్వేగపు నివాళి.. ఎమోషనల్ అయిన ఫ్యాన్స్
Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మనోజ్కు నివాళిగా తన ఇన్స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు వరుణ్. బీచ్లో లవ్ షేప్లో ఇసుకను పేర్చి అందులో 'మనోజ్ భాయ్ మిస్ యూ సోమచ్' అని రాశాడు. ఈ స్టోరీకి 'అందంగా ఉంది. మనోజ్ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.' అని ఒక అభిమాని కామెంట్ పెట్టగా 'ఈ పోస్ట్తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.' అని మరొకరు రాశారు. వరుణ్తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వరుణ్ వెళ్లిన ఒక యాడ్ షూట్కు తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. -
ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్
Varun Dhawan Pens Emotional Note After His Driver Death By Heart Attack: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇంట్లో విషాదం నెలకొంది. వరుణ్ ధావన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ అకస్మాత్తుగా మృతిచెందాడు. బాంద్రాలోని మెహబూబ్ స్డూడియోలో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో బాధపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మరణం విని వరుణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆసుపత్రి బయట చాలాసేపు తచ్చాడాడు. అనంతరం వరుణ్ తన కారులో ఆసుపత్రి నుంచి బయలుదేరాడు. వరుణ్ ధావన్ దగ్గర చాలా ఏళ్లుగా మనోజ్ సాహు ఎంతో నమ్మకస్థుడిగా ఉన్నాడు. అతనంటే వరుణ్కు అమితమైన ప్రేమ. మనోజ్ దాదా అంటూ ముద్దుగా పిలిచేవాడు. మనోజ్ సాహుపై తనకున్న ప్రేమను ఇన్స్టా గ్రామ్ వేదికగా వరుణ్ పంచుకున్నాడు. అతని గొప్పదనం గురించి ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. '26 ఏళ్లుగా మనోజ్ నాతో ఉన్నాడు. అతనే నాకు సర్వస్వం. నా బాధను తెలిపేందుకు నా దగ్గర పదాలు లేవు. కానీ నాకు కావాల్సింది అతని అద్భుతమైన తెలివి, హాస్య చతురత, జీవితం పట్ల అతనికున్న అభిరుచిని ప్రజలు గుర్తుంచుకోవడమే. నువ్ నా జీవితంలో నాతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను మనోజ్ దాదా.' అని భావోద్వేగంగా రాసుకొచ్చాడు. (చదవండి: విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి
Rhea Chakraborty's Post Its Not Been Easy To Get Here About 2021 Year: 2021 సంవత్సరానికి బై బై చెబుతూ 2022 న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారికి ఈ ఏడాది ఎలా గడిచిందో అభిమానులతో పంచుకుంటున్నారు. కష్టం నుంచి చిరునవ్వు వరకు అంటూ ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి 2021 ఇయర్ తనకు ఎలా గడిచిందో చెప్పుకొచ్చింది. ఈ ఏడాదిని బాధ, దాన్ని నయం చేసిన సంవత్సరంగా తెలుపుతూ అందమైన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో 'నేను నవ్వడం నువ్ చూశావ్. కానీ ఇక్కడికి రావడం (ఇలా మారడం) అంత సులభం కాదు. బాధ, బాధను నయం చేసుకునేందుకు ఈ ఏడాది మొత్తం గడిచింది. కానీ ఇప్పుడు నేను నిన్ను (2021) నవ్వుతూ చూస్తున్నాను. ఎందుకంటే నిన్ను కష్టపెట్టనిది ఏది నిన్నుస్ట్రాంగ్గా మార్చలేదు. మీ ప్రియమైన వారితో ఈ 2022 సంవత్సరాన్ని జరుపుకోండి. 2022 మనందరిపై దయ, ప్రేమతో ఉండాలి.' అని రియా పేర్కొంది. 2020లో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు రియా ప్రేరేపించిందన్న ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్ -
ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. సమంత రియాక్షన్
Upasana Konidela Shares Emotional Post On Her Wedding Photo: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకలు దోమకొండ గడికోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరైంది. ఈ సెలబ్రేషన్స్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సందడి చేసిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇప్పటికే షేర్ చేసింది. అయితే తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి వేడుకలలో తన వివాహ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల్లో భాగంగా పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు. ఉపాసన తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో 'దుస్తులను వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అంది నాకు గర్వంగా ఉంటుంది. నాణ్యత ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలబ్రేషన్స్ దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్' అని తెలిపారు. అలాగే ప్రస్తుత ఫొటోలతోపాటు తన వివాహ ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్కు పలువురు స్పందించగా, స్టార్ హీరోయిన్ సమంత 'బ్యూటిఫుల్' అంటూ రియాక్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) ఇదీ చదవండి: అనుష్పల పెళ్లి వేడుకలో పోచమ్మ పండుగ, రామ్చరణ్, ఉపాసన సందడి -
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా 2190 వేల పోస్టులు.. భర్తీకి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్దమొత్తంలో వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్తపోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్లతో పాటు వైద్యకళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది. (చదవండి: ఏపీలో షిప్ రిపేరింగ్ యూనిట్! ) 2190 కొత్త పోస్టులు 35 మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులలో 2190 కొత్త పోస్టులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కొత్తగా సృష్టించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు చూస్తే.. ప్రొఫెసర్లు- 51, అసోసియేట్ ప్రొఫెసర్లు-187, అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 130, నర్సింగ్ -1040, పారామెడికల్ -782 ఉన్నాయి. దేశంలోనే అత్యధిక పోస్టులు ఒకేసారి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా మంజూరైన పోస్టుల కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నన్నాయి. చదవండి: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్ -
Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..?
సాక్షి, కరీంనగర్: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పి చేతివాటం ప్రదర్శించారు. అదే అధికారి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ తన చతురతను ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆ అధికారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అమ్మకం జరిగాయని పలువురు చర్చించుకుంటున్న నేపథ్యంలో... ఒక పోస్టును ఆసుపత్రిలోనే ఔట్సోర్సింగ్లో పనిచేసే వ్యక్తికి కట్టబెట్టేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ముట్టజెప్పిన సదరు వ్యక్తి కూడా తనకు పోస్టు దక్కుతుందనే భరోసాతో ఉన్నట్లు తోటి దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఖరారైన పోస్టు రూ.2 లక్షలు పలుకగా, మరో పోస్టుకు మాత్రం లాభసాటిగా బేరం కుదుర్చేందుకు డబ్బులు పెట్టే సత్తా ఉన్న అభ్యర్థిని వెతుకుతున్నట్లు తెలిసింది. 2 పోస్టులు.. 87 దరఖాస్తులు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు పోస్టులకు 87 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అదనుగా కీలక అధికారి బేరసారాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టులన్నీ సదరు అధికారి కనుసన్నల్లలోనే భర్తీ కావడంతో అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టు వచ్చినట్లేనని ప్రచారం బహిరంగంగా జరుగుతోంది. అర్హుల ఎంపికతో నోటీసు... దరఖాస్తుదారుల లిస్టు ప్రకారం అర్హులు, అనర్హుల లిస్టు తయారు చేసి ఈ నెల 14న అధికారులు ఆసుపత్రిలో నోటీసు బోర్డుపై అంటించారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలుంటే తెలపాలని, లేని పక్షంలో రెండు పోస్టులకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎంఎల్టీ చేసిన వారు అనర్హులట.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) పూర్తి చేసి పారా మెడికల్ బోర్డునుంచి సర్టిఫైడ్ అయిన వాళ్లని సైతం అనర్హులుగా ప్రకటించారు. పారామెడికల్ బోర్డు ఆక్ట్ నెం.38 ఆఫ్ 2006 ప్రకారం ఎంఎల్టీ చదివిన వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొత్త నిబంధన పెట్టారని పలువురు ఎంఎల్టీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల ఎంపికపై అభ్యంతరం... ఎంఎల్టీ చదివిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై శ్రీనాథ్ అనే దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలుపుతూ లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్కు గురువారం లేఖను అందించారు. ఈ లేఖలో మరో వివాదాన్ని సైతం లేవనెత్తారు. నోటిఫికేషన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నప్పటికీ, ఎంపిక నోటీసు వచ్చే సరికి జోనల్ స్థాయి నియామకం అని ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎల్టీ చదివిన వారికి న్యాయం చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్.. ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నిబంధనల ప్ర కారమే చేపట్టాం. డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకుంటామని నోటిఫికేష న్లో స్పష్టం చేశాం. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నాం. – డాక్టర్ రత్నమాల, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
SBI: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్న్యూస్
ముంబై: ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్న్యూస్ అందించింది. కొద్దీ రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది. ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసి అప్డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లోని విధించిన కోవిడ్ -19 లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు పోస్ట్ ద్వారా స్వీకరించిన పత్రాల ఆధారంగా శాఖలు కేవైసీ నవీకరణను నిర్వహించగలవని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్ను వ్యక్తిగతంగా బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదు. "అంతేకాక కేవైసీ అప్డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF — State Bank of India (@TheOfficialSBI) May 1, 2021 చదవండి: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ -
విజనరీ ఫిలాంత్రఫిస్ట్: బాలీవుడ్ బ్యూటీ ఇంట్రస్టింగ్ పోస్ట్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్కు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మద్దతుగా నిలిచారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత వారం సోనూ షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన గ్లోబల్ బ్యూటీ సోనూపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు విజనరీ ఫిలాంత్రఫిస్ట్, దూరదృష్టి కలిగిన పరోపకారి సోను అంటూ తన సహ నటుడిని కొనియాడారు. (సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!) మొదటగా సోనూ సూద్ నిశితమైన పరిశీలన తనను ఆకట్టుకుందని కమెంట్ చేశారు. అలాగే టిపికల్ సోనూ శైలిలో పరిష్కారం కోసం ఆలోచించడం, సలహాలతో ముందుకు రావడం తనకు చాలా న చ్చిందని ఆమె పేర్కొన్నారు. దీనిక ప్రభుత్వ, ప్రభుత్వేతన శక్తులు స్పందించి ముందుకు రావాలని కోరారు. ప్రతీ విద్యార్థికి విద్య అనేది పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించే వ్యక్తిగా ఈ విషయంలో తన పూర్తి మద్దతు సోనూకేనని పీసీ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా అవతరించిన సోనూసూద్ విద్యార్థుల ఆన్లైన్ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కేవలం ఒక విద్యార్థిని కోసం మొత్తం గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన పెద్ద మనుసు సోనూ సూద్ సొంతం. ఇలా అనేక రకాలుగా గత ఏడాది కాలంగా నిరంతరాయంగా పూర్తి నిబద్ధతతో తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 29న ఒక వీడియోను పోస్ట్ చేశారు. కాగా కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లల చదువుకు అంతరాయం కలగకూడదని. తల్లిదండ్రులను పోగొట్టుకున్న కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక కారణాలు వారి చదువుకు అడ్డు కాకూడదని కోరుకున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం దేశం కలిసికట్టుగా ఈ గండం నుంచి గట్టెక్కాలని పేర్కొన్నారు. ఈ వీడియోనే తాజాగా ప్రియాంక చోప్రాను ఆకర్షించడం విశేషం. (ఆ పిల్లలకు ఉచిత విద్య అందించాలి: సోనూసూద్) .@SonuSood #EveryLifeMatters https://t.co/fpDKac1PSx pic.twitter.com/cHvpOuZEvp — PRIYANKA (@priyankachopra) May 3, 2021 -
హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి..
టీ.నగర్: నాగర్కోవిల్ టౌన్ రైల్వేస్టేషన్లో గోనెసంచిలో దూరి నిద్రిస్తున్న యువకుడు హత్యకు గురైనట్లు వాట్సాప్లో వ్యాపించిన సమాచారం సంచలనం రేపింది. మొదటి ప్లాట్ఫాంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండో ప్లాట్ఫాంలో మాత్రమే రైళ్లు వచ్చి వెళతాయి. ఉదయాన్నే అనేక మంది ఇక్కడికి వాకింగ్కు వస్తుంటారు. శనివారం ఉదయం వాకింగ్కు రాగా కొంతమంది ఒకటో ప్లాట్ఫాం సమీపంలో పసుపురంగు గోనెసంచిలో శరీరమంతా మూసుకుని ఒకరు కనిపించారు. ఉదయం ఎనిమిది గంటలకు అలాగే పడివుండడంతో గోనెసంచిలో యువకుడి శవం అంటూ వాట్సాప్లో పలువురు షేర్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచిన యువకుడు పక్కనున్న పాదరక్షలు వేసుకుని నడిచివెళ్లాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకుంటూ వెళ్లారు. వాట్సాప్ సమాచారం ఎంతపని చేస్తాయనుకుంటూ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చదవండి: మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల ఇండియా బుక్లోకి ‘ఎన్నికల వీరుడు’ -
ఒక పోస్టుకు 32 మందే పోటీ..
సాక్షి, హైదరాబాద్: త్వరలో పోలీసు శాఖలో కొలువుల భర్తీ కానున్నా యి. దాదాపు 20వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు పోలీసు శాఖలోని ఆయా విభాగాల్లోని ఖాళీలను పోలీసు శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మేరకు దాదాపు 19,400లకుపైగా వరకు పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. గతేడాది 18వేలకు పైగా పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి గతం కంటే దాదాపు వెయ్యి పోస్టులు అధికంగానే రానున్నాయి. కిందటి సారి ఎస్సై, కానిస్టేబుల్ జాబులకు దాదాపు 6 లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కనిష్టంగా 6 లక్షలు గరిష్టంగా 8 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. పోస్టులు ఇవే! ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ పరిధిలోని ఖాళీలపై నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం.. ఎస్సై మొత్తం 425 పోస్టులు కాగా, అందులో సివిల్ 368, ఏఆర్ 29, కమ్యూనికేషన్స్ 18 ఉన్నాయి. కానిస్టేబుళ్ల విషయానికి వస్తే సివిల్ 7,664, ఆర్మ్డ్ రిజర్వ్డ్ 6,783, టీఎస్ఎస్పీ 3,700, 15వ బెటాలియన్ 561, కమ్యూనికేషన్ 320. మొత్తంగా 19,453 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించింది. వీటిలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వనుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేస్తుంది. గురి పెడితే జాబ్ రావాల్సిందే.. ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగానికే వేలాది మందితో పోటీ పడాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ తాకిడి మరింత అధికంగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు వేలు, లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. అయితే పోలీస్ భర్తీలో ఈసారి ఒక్కో పోస్టుకు బరిలో నిలిచేది 32 మందే. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. అందుకే కాస్త కష్టపడితే బరిలో నిలిచి కోరుకున్న కొలువు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి దశలోనూ పోటీ తగ్గు ముఖం! దరఖాస్తు ప్రక్రియకు ఈ సారి ఆరు లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. అంటే పోస్టుకు తొలుత 32 మంది పోటీ పడ్డా.. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్తున్న కొద్దీ పోటీ అంతకంతకూ తగ్గుతూ వెళ్తుంది. తొలుత నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు 6 లక్షల మందిలో 99 శాతం మంది హాజరవుతారు. ఫలితాల అనంతరం 60 శాతం మందికిపైగా అనర్హులవుతారు. దీంతో మిగిలిన వారే పోటీలో ఉంటారు. అంటే పోటీ 15 మందికి కాస్త అటూఇటూగా వస్తుంది. ప్రిలిమినరీ అనంతరం నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత పోటీ దాదాపు 25 శాతానికి తగ్గుతుంది. అంటే దాదాపు పోస్టుకు ఏడుగురితో పోటీ పడుతూ.. మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి దశలోనూ 50% పోటీ తగ్గుతూ వస్తుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే.. అతి తక్కువ మందిని వెనక్కి నెట్టి కొలువు సాధించొచ్చని పలువురు పోలీసులు, పరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
లిస్ట్లో పేరొచ్చినా.. పోస్ట్ రాలే
సాక్షి, సంగారెడ్డి టౌన్: గతేడాది జూలైలో ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాసిన విద్యార్థులు అదే ఏడాది అక్టోబర్లో వచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూలైలో పాసైనట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండటంతో ఆన్లైన్లో పేర్కొన్న అన్ని విషయాలను చదివి దరఖాస్తును పూర్తి చేశారు. డిసెంబర్ 15, 2019లో పరీక్ష రాశారు. ఫలితాలు రాగానే ర్యాంకుల ఆధారంగా కరెంట్ పోల్ పరీక్షలోనూ నెగ్గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇలా మెరిట్ సాధించి మంచి ర్యాంకులు కలిసిన అభ్యర్థులు తమ ట్రేడ్ సర్టిఫికెట్లో డేట్ అని ఉన్నచోట నవంబర్ 6 అని ముద్రించడంతో అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మీ మెమోలు నోటిఫికేషన్ తేదీ తర్వాత ఇష్యూ అయ్యాయంటూ సదరు అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా తేల్చేశారు. చదవండి: ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్! ఇతర పరీక్షలకు భిన్నంగా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ.. వారు పేర్కొన్న అర్హత కోర్సు నోటిఫికేషన్ వచ్చే నాటికి పాసైతే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం పరీక్షలో పాసైన నెలను వదిలిపెట్టి.. మెమో తయారు చేసిన తేదీని పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలో ట్రేడ్ కోర్సు పూర్తి చేసుకున్నట్లు సదరు ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఇవ్వగా ధ్రువపత్రం తయారీ తేదీని మాత్రమే ఎలా పరిగణలోకి తీసుకుంటామని మండిపడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం విద్యుత్ శాఖపై మమకాలంతో ఐటీఐ ట్రేడ్ కోర్సు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ గుర్తింపుతో 2019 జూలైలోనే పాసైన అభ్యర్థులు జేఎల్ఎం పరీక్షలో మెరిట్ ర్యాంక్లు సాధించినా ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. పాసైనా నెల సరి్టఫికెట్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. మెమో తయారైన తేదీని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేవరకు న్యాయపోరాటం చేస్తాం. అభ్యర్థులకు మా పూర్తి మద్దతు అందిస్తున్నాం – ప్రభాకర్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు షాక్ అయ్యాను.. టీఎస్ఎస్పీడీసీఎల్ గతేడాది అక్టోబర్ నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే నాటికే మేము ఐటీఐ ట్రేడ్ పరీక్ష పాసయ్యాం. సంగారెడ్డి నుంచి నా జిల్లా ర్యాంక్ 468. ఇక్కడ 1000 ర్యాంకు వరకు ఉద్యోగాలొచ్చాయి. కేవలం మెమోపై తేదీ నవంబర్ 6 అని ఉండటం వల్లే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందరిలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ఫైనల్ రిజల్ట్లో నా పేరు, హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం చూసి షాకయ్యా.. – సురేష్ నాయక్, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మెరిట్ ర్యాంక్ వచ్చి పోస్ట్ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు జిల్లా అభ్యర్థుల సంఖ్య సిద్దిపేట 12 సంగారెడ్డి 08 మెదక్ 05 మొత్తం 25 -
కబురు తెచ్చే మనిషి
చూపులు గుమ్మం మీదే ఉండేవి. చెవులు సైకిల్ బెల్ కోసం రిక్కించేవి. ‘పోస్ట్’ అన్న పిలుపూ ఆ వెంటనే గేటు మీదుగా ఊపుగా వచ్చి పడే జాబు.. ఇవి ఎన్నో ఇళ్లను వెలిగించేవి. ఎన్నో ఇళ్లను ఓదార్చేవి. కొన్నింటిని విచారంలో ముంచేసేవి. పోస్ట్మేన్ వచ్చి పోతున్నాడంటే ఆ ఇల్లు సజీవంగా ఉన్నట్టు అర్థం. ప్రతి ఇంటి ఖాకీ బట్టల బంధువు పోస్ట్మేన్. ఆ జ్ఞాపకాలు, ఆ కథలు, అతడు ఉన్న సినిమాలు... మరపు రావు ఆ పాత రోజులు. ‘‘ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు... ఇన్ని కళ్లు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలికి చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు’ అని రాశాడు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘తపాలా బంట్రోతు’ కవితలో. ప్రపంచంలో అతి పెద్ద తపాలా వ్యవస్థ మన దేశంలో ఉన్నా దాని వాహకుడు మాత్రం పోస్ట్మేనే. పోస్టాఫీసును, పోస్టు డబ్బాను, పోస్టు కోసం ఎదురు చూసే ఇంటిని పోస్ట్మేనే కలుపుతాడు. కబురు తెస్తాడు. కొలువు కాగితం తెస్తాడు. క్షేమ సమాచారం తెలుపుతాడు. కాని గుక్కెడు మంచినీళ్లు కూడా తాగే తీరిక లేకుండా సైకిల్ మీద పెడల్ తొక్కుతూ మరో గడపకు చేరుకుంటాడు. అక్టోబర్ 9 ‘ప్రపంచ తపాలా దినోత్సవం’. 1874లో అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ ఏర్పడిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇవాళ పోస్ట్మేన్ సేవలు మారవచ్చు. పోస్ట్మేన్ ప్రాధాన్యం మారవచ్చు. సెల్ఫోనే కలం, కాగితంగా మారాక, జనం రాయడం మర్చిపోయాక, ఉత్తరానికి ఉన్న ఆఘ్రాణింపు కరువైపోయాక పోస్ట్మేన్తో బంధం పలుచబడింది కాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పోస్ట్మేన్ కబుర్ల రారాజు. ప్రతి ఇంటి దగ్గరి మనిషి. సంచినిండా జీవితాలను మోసుకుంటూ వచ్చే వాహకుడు. పది దాటాక... ఉదయం పది దాటాక ఎప్పుడైనా పోస్ట్మేన్ రావచ్చు. ఎండ కాయనీ, వాన కుమ్మరించనీ, చల్లగాలులు చిమ్ముకుంటూ తిరగనీ.. పోస్ట్మేన్ రావాల్సిందే. రాకపోతే ఏమవుతుంది? లోకం కదలదు. దూరాన సైన్యంలో ఉన్న కొడుకు క్షేమం తెలియదు. మెట్టినింట నెలలతో ఉన్న కూతురు ఎప్పుడు తనను తీసుకెళ్లమంటుందో తెలియదు, స్నేహితుడు పెట్టుకున్న కుమారుడి పెళ్లికబురు తెలియదు. దగ్గరి చుట్టం అవసరానికి ఏదో అడిగితే సాయం గురించి ఆలోచన చేయడం తెలియదు, మీ అమ్మాయి మాకు నచ్చింది... త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం అనే మాట ఉత్తరంలో కాకుండా ఇక దేనిలో తెలుస్తుంది. పరాయి దేశం వెళ్లిన భర్తకు భార్య గురించి భార్యకు భర్త గురించి ఉత్తరమే కదా తెలిపేది. అందుకే అందరూ వీధి గుమ్మం వైపు చూసేవారు. పనులకు మగవాళ్లు వెళ్లిపోగా చేటలో బియ్యం చెరుగుతూ, స్టౌ మీద కూరను గరిటెతో కలియబెడుతూ స్త్రీలు ఒక కన్ను వీధి వైపు వేసేవారు. పోస్ట్ అన్న కేక వినగానే పెట్టే పరుగు ప్రతి ఇంటి వీధి గుమ్మానికి తెలుసు. మని ఆర్డర్.. టెలిగ్రామ్ ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్.. క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్. కాని ‘మనీఆర్డర్’లో ఉండే మజా ఇప్పుడు ఎక్కడా? దాని కోసం ఎదురు చూస్తూ... ఇవాళ రాలేదు మాష్టారు అని పోస్ట్మేన్ చెప్తే నిరాశ పడుతూ... తీరా వచ్చాక అందులో నుంచి ఒక రూపాయో ఐదో పోస్ట్మేన్ చేతిలో పెట్టి సంతోషపడుతూ... మధురం. ఇక అర్జెంట్ కబురుకు టెలిగ్రామ్ వచ్చిందంటే అందరి గుండే గుబగుబే. టెలిగ్రామ్ ఎందుకనో దుర్వార్తకే స్థిరపడింది కాని ‘ఉద్యోగం వచ్చిందనో’, ‘మనమరాలు పుట్టిందనో’ అది మాత్రం మంచి కబురు తేలేదా? చదువరి పోస్ట్మేన్ ఈ దేశంలో కేవలం ఉత్తరం అందించి ఊరుకోలేదు. దానిని చదివి కూడా పెట్టాడు. కోట్లాదిగా ఉండే నిరక్షరాస్య భారతీయులకు పోస్ట్మేనే చదువరి. ‘కాస్త చదివిపెట్టు నాయనా’ అంటే వచ్చిన ఉత్తరాన్ని చదివిపెట్టేవాడు. కాస్త రాసి పెట్టు నాయనా అంటే రాసిపెట్టేవాడు. అందరి కష్టసుఖాలు అతనికి తెలుసు. ఇందరు బంధువులు ఉండే భాగ్యం ఏ వృత్తిలోనూ మరొకరికి సాధ్యం కాదు. అందరూ అతని ద్వారా తమవారి క్షేమసమాచారాలు తెలుసుకునేవారే తప్ప అతని క్షేమం గురించి ఆలోచించేవారు కాదు. దసరా పండుగనాడు రెండు రూపాయల మామూలే పోస్ట్మేన్కు పెన్నిధి. కథలను నడిపించినవాడు అసలు పోస్ట్మేన్ లేకపోతే తెలుగులో చాలా కథలు మొదలై ఉండేవి కావు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే వాక్యంతో వందలాది కథలు మొదలవుతాయి. ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’లో ఆ ఇంటి ఆడపిల్లను కూతురికి మల్లే వాత్సల్యంగా చూసే పోస్ట్మేన్ ఆ పిల్ల పెళ్లికి రెండు రోజుల ముందు వచ్చిన బంధువు చావు వార్తను దాచేస్తాడు. పెళ్లయ్యాకే ఆ ఉత్తరం ఇచ్చి పెళ్లి మూడ్ పాడు కాకుండా చూస్తాడు. రవీంద్రనాథ్ టాగోర్ ‘ది పోస్ట్మాస్టర్’ కథ ప్రఖ్యాతం. అసలు పోస్ట్మేన్ ఉన్నాడని రాసింది తీసుకెళ్లి ఇస్తాడని ఎందరో పెద్దలు కార్డు ముక్కనో, ఇన్లేండ్ కవర్నో సాహితీ పత్రంగా మార్చేశారు. పోస్ట్మేన్ చేతుల మీదుగా నడిచిన ‘లేఖా సాహిత్యం’ అపూర్వం. కందుకూరి లేఖలు, గురజాడ లేఖలు, సి.ఆర్.రెడ్డి– రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మధ్య నడిచిన లేఖలు, త్రిపురనేని రామస్వామి చౌదరి అలనాడు ముట్నూరి కృష్ణారావుకు రాసిన లేఖలు, చలం ‘ప్రేమలేఖలు’, త్రిపురనేని గోపిచంద్ ‘పోస్ట్ చేయని ఉత్తరాలు’... ఎన్నని. ఇవాళ ఈ రాసే లేఖా సాహిత్యం అంతమైంది. పోస్ట్మేన్ రిక్తహస్తాలతో నిలబడ్డాడు. మనిషి స్పర్శ ఉత్తరం అంటే మనిషి స్పర్శ. మనిషి తాకిన లేఖను మరో మనిషి తాకుతాడు. మనిషి రాసిన రాతను మరొక మనిషి చదువుతాడు. ఈ మొత్తంలో స్పర్శ ఉంది. దగ్గరి తనం ఉంది. ఒక ఎస్.ఎం.ఎస్, ఒక వాట్సప్ మెసేజ్, ఒక ఈ మెయిల్ అందరిదీ అందరికీ ఒక్కలాగే కనిపిస్తుంది. కాని ఉత్తరం అలా కాదు. అది మనిషి మనిషికి మారుతుంది. ఆ స్పర్శ ఇవాళ మిగల్లేదు. దానికి ప్రత్యక్షసాక్షి అయిన పోస్ట్మేన్ ముఖం తెలియడం లేదు. ఇవాళ పోస్టాఫీసులు, పోస్ట్మేన్లు సామాన్యుల ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ సేవలు అందిస్తున్నారు. మిస్సవుతున్నదల్లా ‘ఉత్తరం వచ్చిందా’ అనే ప్రశ్న... ‘పోస్ట్’ అనే పిలుపు. – సాక్షి ఫ్యామిలీ -
ఒక్క పోస్ట్... వంద రూపాలు
తిరువనంతపురం: కేరళలో ఒక ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన యానిమేటెడ్ పోస్ట్ రాజకీయంగా వివిధ మలుపులు తిరుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు దాన్ని మార్చుకొంటున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కేరళకు చెందిన ఆశిన్మున్ను అనే ఆర్టిస్ట్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వర్షం కురుస్తున్నప్పుడు ఒక గొడుగును గట్టిగా పట్టుకొని దాని కింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లు ఒక యానిమేటెడ్ పోస్టర్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దానిలో చిన్నపిల్లలు, కరోనా పేషెంట్స్, ముసలివాళ్లు, డాక్టర్లు, పోలీసులు అందరూ ఉన్నారు. వారందరిని కేరళ ప్రభుత్వం కాపాడుతుంది అనే ఉద్దేశంతో ఆ మీమ్ని తయారు చేశాడు. అయితే దీనిని ఏప్రిల్ 17న మున్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. (జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ) దీనిని చూసిన కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్ ఇదే పోస్టర్ని కొన్ని మార్పులతో ఆయన అఫిషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పినరయి విజయన్ పైన ప్రధాని మోదీ ఇంకో పెద్దగొడుగుతో అందరిని కాపాడుతున్నట్లుగా ఉన్న మీమ్ని ఆయన షేర్ చేశారు. ఇలా చేసినందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేని ట్రోల్ చేశారు. తరువాత ఎవరికి తగ్గట్టుగా వారు దాన్ని మార్చుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. మరొకరు ప్రతిపక్షనేత రమేష్ చెన్నితల.. ప్రధాని మోదీ గొడుగుపైన ఒక టెంట్ పట్టుకున్నట్లు మీమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవి కేరళ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్నాయి. (మోదీ వీడియో కాన్ఫరెన్స్కు విజయన్ గైర్హాజరు) -
ఊరించి.. ఉసూరుమనిపించి
పుత్తూరు: నగరి టీడీపీ ఇన్చార్జి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో సమావేశమయ్యారు. ఇన్చార్జి పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకుండానే వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆధిపత్యపోరుతో టీడీపీ కేడర్ వర్గాలుగా చీలిపోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు శనివారం సమావేశానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముద్దు కుటుంబానికి క్లాస్ అభిప్రాయ సేకరణ అనంతరం నాయకులతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ముద్దుక్రిష్ణమనాయుడి కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముద్దు పెద్ద కుమారుడు భానుప్రకాష్, తల్లి గాలి సరస్వతమ్మ మధ్య విభేదా లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇద్దరి కుమారుల మధ్య ఉన్న విభేదాలపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు వేర్వేరుగా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై పార్టీ మండల అధ్యక్షులను నిలదీశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కఠినంగా చెప్పారు. కుటుంబం ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు. అందుకుగాను ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ కలుగజేసుకుని ఏకాభిప్రాయంతో వస్తే పార్టీ అభ్యర్థిత్వం ముద్దు కుటుంబానికే కేటాయిస్తారా..? అని అన్నట్టు తెలిసింది. కలిసి వస్తే పరిశీలిస్తానని సర్ది చెప్పినట్లు సమాచారం. ముఖ్య నాయకులతో సమావేశం ముగించుకున్న అధినేత బయట ఉన్న కేడర్తో మాట్లాడిన సమయంలోనూ ఇన్చార్జి విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా గెలిపించి ముద్దుకృష్ణమకు ఘనంగా నివాళులర్పించాలని ముక్తాయించి నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి సమావేశం నిర్వహించడం ఎందుకని టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆదివారం సాయంత్రంలోపు సయోధ్య కుదిరినప్పటికీ అభ్యర్థిత్వంపై అధినేత తేల్చడనే మాటలు టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది. అభిప్రాయ సేకరణ టీడీపీ అధినేత తన సహజ వైఖరి నాన్చుడు దోరణిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులతో ఉండవల్లిలో శనివారం అధినేత సమావేశం కానున్నట్లు ముందురోజు సమాచారం అందింది. నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై విస్పష్ట ప్రకటన ఉంటుందని భావించిన ముద్దుక్రిష్ణమనాయుడి ఇద్దరు కుమారులు సమావేశానికి మందీమార్బలంతో హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర నాయకుడు టీడీ జనార్దన్ అభిప్రాయ సేకరణ జరిపారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, రెండు మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్తోపాటు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్రాజు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్చంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి విజయబాబు తదితరులతో అభిప్రాయాలు సేకరించారు. -
ఏజీ లేని రాష్ట్రం!
సాక్షి, హైదరాబాద్ : అడ్వొకేట్ జనరల్ (ఏజీ).. రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైనది.. న్యాయపర వ్యవహారాల్లో అమూల్యమైన సలహాలతో రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమైన వ్యక్తి.. శాసనసభలో ఆయనకు ఎప్పుడూ ఓ ప్రత్యేక సీటు కేటాయించి ఉంటుంది.. అంతటి కీలక పదవి ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉంది.. అదీ 3 నెలలుగా.. దేశంలో ఏజీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణే. ఏజీని నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశ్రాంత, సిట్టింగ్ న్యాయమూర్తుల్లోనూ ప్రభుత్వ తీరుపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే తెలంగాణ తొలి ఏజీ నియామకం జరిగింది. తొలి ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమిస్తూ జూన్ 21న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగారు. 2017 జూలై 12న రాజీనామా చేశారు. సరిగ్గా 5 రోజులకు (జూలై 17న) కొత్త ఏజీగా దేశాయ్ ప్రకాశ్రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో ఏడాది తిరగక ముందే ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఎసరు తెచ్చిన హామీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం విషయంలో ప్రభుత్వం, శాసనసభ తరఫున హైకోర్టుకు హామీ ఇవ్వడం ప్రకాశ్రెడ్డి పదవికి ఎసరు తెచ్చింది. కోమటిరెడ్డి విసిరిన హెడ్ఫోన్ వల్ల మండలి చైర్మన్ గాయçపడ్డారన్న ఆరోపణలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచుతానని ఏజీ హామీ ఇవ్వడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అప్పటికే ప్రకాశ్రెడ్డి వ్యవహారశైలిపై ఐఏఎస్ అధికారులు ఫిర్యాదులు చేయడం, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కోర్టుకు హామీ ఇవ్వడంతో ఇక ఆయన్ను సాగనంపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. తమను సంప్రదించకుండానే హామీ ఇవ్వడంపై ప్రకాశ్రెడ్డిని గట్టిగానే నిలదీశారు. దీంతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ప్రకాశ్రెడ్డి రాజీనామా ఇచ్చి 3 నెలలైనా ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించకపోవడం విశేషం. రాజీనామాను ఆమోదించాలంటూ ప్రభుత్వానికి ప్రకాశ్రెడ్డి లేఖ రాసినట్లు కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ప్రభుత్వం తన రాజీనామాను ఆమోదించకపోవడంతో సీనియర్ న్యాయవాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసుల్లోనూ ఆయన హాజరు కాలేకపోతున్నారు. సీఎం మల్లగుల్లాలు ప్రకాశ్రెడ్డి రాజీనామా తరువాత ఎవరిని ఏజీగా నియమించాలన్న విషయంలో సీఎం కేసీఆర్ పెద్ద కసరత్తే చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఏజీ పదవి అప్పగించాలన్న కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. పోస్టుకు అర్హులైన వారి గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏజీ తరువాతి స్థానంలో ఉంటూ వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి కొందరి పేర్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పేర్లు పరిశీలించిన సీఎం.. ఇంటెలిజెన్స్ ద్వారా వారికి సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. ఏజీ స్థాయి పదవిని నిర్వహించే సామర్థ్యం వారికి లేదని ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదించడంతో ఏజీ ఎంపిక ఆయనకు తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో ఏజీ తరువాత స్థానంలోని వ్యక్తి ఏజీ పదవి తమకివ్వాలంటూ ఒకరిద్దరు నేతల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. అతని శక్తి, సామర్థ్యాలు మొదటి నుంచి తెలిసిన సీఎం కేసీఆర్.. ఇలాంటి సిఫార్సులు చేయొద్దంటూ ఆ నేతలకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఏజీ లేక న్యాయ వ్యవహారాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం కరవుతోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వం విధానాపర నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు అందుబాటులో ఉంటూ ఏజీ తగు సలహాలు ఇవ్వాలి. ఏజీ లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్చంద్ర మిశ్రా కేసు (1978)లో సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులు ఏ తేదీన పదవికి రాజీనామా చేస్తారో ఆ రోజు నుంచే అమల్లోకి వస్తుందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. రాజీనామా లేఖపై నిర్దిష్ట తేదీ రాసి సమర్పించి ఉంటే ఆ తేదీన ఆ వ్యక్తి రాజీనామా చేసినట్లేనని పేర్కొంది. ఇలాంటి సమయంలో ఆ రాజీనామా లేఖను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రాజీనామా లేఖపై భవిష్యత్ తేదీ ఉంటే ఆ రాజీనామా పరిపూర్ణమైంది కాదని పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం ప్రకాశ్రెడ్డి రాజీనామా చేసిన తేదీ నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు అవుతుంది. -
అమ్మకానికి డీలర్ పోస్టులు..!
విజయనగరం గంటస్తంభం: చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీలో అక్రమాలకు తెరలేచింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులకు కట్టబెట్టేందుకు అధికారపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి ఏ డిపోకు ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై ఇప్పటికే జాబితాలు సిద్ధమైనట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. వీటికే అధికారులు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోందని సమాచారం. మరోవైపు ఈపోస్టులు కట్టబెట్టేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభను కాదని... పోస్టు ఏదైనా ప్రతిభను పక్కన పెట్టి తమ అనుయాయులకు కట్టబెట్టడంలో టీడీపీ నేతలకు మించిన వారు లేరు. ఇప్పటికే నాలుగేళ్లుగా అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో తమ వారిని నియమించారన్నది అందరికీ తెలిసిందే. మెరిట్ ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయి ఆందోళన చేసిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. తాజాగా తెలుగు తమ్ముళ్ల కన్ను డీలర్ పోస్టుల భర్తీపై పడింది. విజయనగరం డివిజన్లో 95 రేషన్డిపో డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడంతో వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఇందులో ఆరింటికి అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో మిగతా పోస్టుల్లో మాత్రం తమవారిని నియమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రాత పరీక్ష ముగియడం, ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనుండడంతో.. అందులో తమ వారినే ఎంపికచేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్వ్యూలు నామమాత్రమేనా..? ఇంటర్వ్యూలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఇతర నేతలు తమ వారి పేర్లుతో జాబితాలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ వివరాలను ఇప్పటికే ఎంపిక చేపడుతున్న విజయనగరం ఆర్డీవోకు పంపించారన్న చర్చ జోరందుకుంది. విజయనగరంలో ఒక కీలకనేత తన పరిధిలో 20 డిపోలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలన్న జాబితా సిద్ధం చేసి ఇచ్చేసినట్లు సమాచారం. ఎవరి పేర్లు ప్రతిపాదించారన్న విషయం కూడా బయట చెప్పుకుంటున్నారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలో అన్నింటిలోనూ మెరిట్ ఉన్నా లేకున్నా తమ వారికే ఇవ్వాలని అక్కడ నేత అధికారులకు సూచించినట్లు అధికారపార్టీ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు తమ వారి పేర్లును సూచించారు. ఆర్డీవో జె.వి.మురళి వీరి సిఫార్సులు ఎంతవరకు పరగణలోనికి తీసుకుంటారో చూడాలి. ప్రతిభను కాదని ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని తెలిసి నిజాయితీగా వ్యవహరిస్తారా?, నేతల ఒత్తిడికి తలొగ్గుతారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. ఆర్డీవో మాత్రం అంతా నిష్పక్షపాతంగా చేస్తామని ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటనను అభ్యర్థుల నమ్మడంలేదు. గరివిడి మండలం కుమరాం డీలరు పోస్టుకు ప్రతిభ ఉన్న వారిని పక్కన పెట్టి ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారని ముషిడి కుమార్, మరికొందరు ఇప్పటికే ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పూల్బాగ్లో ఒక డిపోకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూకు పిలిచారన్న ఆరోపణలు ఉండడంతో అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్డీవో వద్ద ఇంటర్వ్యూకు సంబంధించి 20 మార్కులు ఉండడంతో వాటితో మేనేజ్ చేసి నేతలు చెప్పిన వారికి ఇస్తారని అభిప్రాయపడుతున్నారు. పోస్టుకో రేటు? ఇదిలా ఉండగా తెలుగు తమ్ముళ్లకే డీలర్ పోస్టులు ఇచ్చేలా సిఫార్సు చేస్తున్నా ఇక్కడ కూడా నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.50వేలు అధికారపార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విజయనగరంలో ఒక పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.30వేలు రేటు పెట్టగా గజపతినగరంలో రూ.50 వేలు వరకు, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్లలో రూ.40వేల వరకు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ వారే కాకుండా ఇతరలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తక్కువైనా తమ వారికే చేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఎంతోకొంతకు డీలరు పోస్టులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా నిజాయితీగానే చేస్తాం చౌకధరల డీలరు పోస్టు భర్తీ నియమనిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రతిభ ఉన్న వారినే ఎంపిక చేస్తాం. ఈ విషయంలో ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దు. ఎటువంటి వదంతులూ నమ్మొద్దు. కొన్ని డిపోల మెరిట్ జాబితాపై ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని పరిశీలిస్తాం. మొత్తం పక్రియ నిజాయితీగా చేస్తాం. – జేవీ మురళి, ఆర్డీవో, విజయనగరం -
నారీ స్వరాజ్యం
గ్రామాల్లో అంతా పెదరాయుళ్లు, పాపారాయుళ్లే! మగాడిదే రాజ్యం. ఇంట్లో అయినా,పంచాయతీలో అయినా రాయుళ్లదే శాసనం. ఆడవాళ్లకు మాట్లాడే చాన్స్ ఉండదు. అయితే ఈ ఏడుగురు యువతులు.. సర్పంచ్ అనే మీనింగ్కి చలాన్ రాసి పడేశారు. సర్పంచ్ పదవికే గౌరవం తెచ్చారు. ఊరికి నవశకం తెచ్చారు. తీర్పులిచ్చే పీఠాన్ని కాలితో తన్నేసి, మార్పు కోసం బాధ్యత అనే తట్టల్ని నెత్తికి ఎత్తుకున్నారు. కండువాను గిరగిర తిప్పి మెడలో వేసుకోడానికి కాకుండా, శ్రమకు చిందిన నుదిటి స్వేదాన్ని తడుచుకోడానికి మాత్రమే భుజంపై వేసుకున్నారు. చావీ రజావత్ (36), రాజస్తాన్ దేశంలో అందరికీ తెలిసిన మహిళా సర్పంచ్. పేరున్న టెలికం కంపెనీలో పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి ‘సోడా’ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. గెలిచారు. 2010లో చావీ సర్పంచ్ అయ్యారు. స్వచ్ఛమైన తాగు నీరు, సౌరశక్తి; రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, బ్యాంక్.. ఇవన్నీ చావీ తన గ్రామానికి సాధించిపెట్టారు. సర్పంచ్ అయిన రెండో ఏడాదే ఆమె ఐక్యరాజ్యసమితి ‘ఇన్ఫోపావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్’కి ప్రతినిధిగా వెళ్లారు! షహనాజ్ ఖాన్ (24), హరియాణా ఈ ఏడాదే, మార్చిలో షెహనాజ్ సర్పంచ్ అయ్యారు. భరత్పూర్ పరిధిలోని గర్హజాన్ గ్రామం అది. షెహనాజ్ ఎం.బి.బి.ఎస్. చదివారు. మొత్తం మేవాత్ ప్రాంతానికే అతి చిన్న వయస్కురాలైన సర్పంచ్. తొలి మహిళా సర్పంచ్ కూడా. గర్హజాన్ చరిత్రలోనే అందరి కన్నా ఎక్కువ చదువుకున్న అమ్మాయి షెహనాజ్. గ్రామంలో వ్యాధులను నివారించడానికి శుభ్రత, పారిశుద్ధ్యంపై ఆమె ఎక్కువ దృష్టిపెట్టారు. మేవాత్లో ఎవ్వరూ తమ ఆడపిల్లల్ని బడికి పంపించరు. వాళ్లలో మార్పు తేవడం కోసం షెహనాజ్ ఇంటింటికీ వెళ్లి, ‘నన్ను చూడండి’ అని గ్రామస్తులను, బాలికలను మోటివేట్ చేశారు. చదువులో ఎంత శక్తి ఉందో తననే ఒక ఉదాహరణగా చూపుకున్నారు. అత్రం పద్మాబాయి (38), తెలంగాణ పద్మాబాయి 2013లో బ్యాంకు నుంచి 30 వేల రూపాయల రుణం తీసుకుని ఆ డబ్బుతో కార్మికుల వెట్టి చాకిరీ తగ్గించే పరికరాల తయారీని ప్రారంభించారు. అలా తయారైన వేట కొడవళ్లు, చిన్న గొడ్డళ్లు, తాపీలు, గడ్డపారలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. చుట్టుపక్కల గ్రామాల్లోని పేద కార్మికులు, కర్షకులకు కూడా తక్కువ ధరకు (రోజుకు 2 నుంచి 5 రూపాయలు) అద్దెకు దొరికే సౌలభ్యం కలిగించారు. పద్మాబాయి పటేల్గూడా సర్పంచ్. ఆ గ్రామానికి, మరో రెండు ఊళ్లకు సిమెంట్ రోడ్లు వేయించారు. వర్షపు నీటిని నిలవ ఉంచే కుంటల తవ్వకం కోసం ప్రభుత్వ అనుమతి తెప్పించుకున్నారు. ఊళ్లోని పాఠశాలకు మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేయించారు. ఆర తీదేవి (28), ఒడిశా మొదట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. దాన్నొదిలిపెట్టి ధుంకపర గ్రామ సర్పంచ్గా వచ్చేశారు. స్థానికంగా ఉండే సంప్రదాయ జానపద కళకు పునరుజ్జీవం తెచ్చారు. ప్రభుత్వ పథకాలన్నిటినీ ఉపయోగించుకునేలా గ్రామస్తుల్ని జాగృతం చేశారు. ‘ప్రభుత్వ బాధ్యత, పారదర్శకత’ అనే టాపిక్ మీద యు.ఎస్.కాన్సులేట్ ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్’ కి సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. భక్తి శర్మ (28), మధ్యప్రదేశ్ యు.ఎస్.లో చదువు ముగించుకుని వచ్చిన భక్తి శర్మ భోపాల్ శివార్లలోని బర్ఖేడీ అబ్దుల్లా గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 2016లో ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భక్తి శర్మ కూడా ఉన్నారు. పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత చదువుల కోసం టెక్సాస్లోని బంధువుల ఇంట్లో ఉండేందుకు వెళ్లారు. అయితే ఆమెలో ఏ మూలో ఉన్న సేవాభావం ఇండియా రప్పించింది. అందుకోసం ఆమె పెద్ద ఉద్యోగాన్నీ, పెద్ద జీతాన్ని వదులుకుని వచ్చారు. ప్రభుత్వ ప్రథకాలన్నీ ప్రతిదీ గ్రామస్తులకు అందేలా ఆమె కృషి చేస్తున్నారు. తన గ్రామాన్ని మోడల్ పంచాయతీగా మార్చాలని ఆమె తపన. రాధాదేవి (30), రాజస్థాన్ రాధాదేవి ఐదో తరగతిలోనే బడి మానేశారు. అయితే సర్పంచ్గా ఆమె ఇప్పుడు తన భద్సియా గ్రామ పంచాయితీలో ఒక్క విద్యార్థి కూడా బడి మానే పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘రైట్ టు ఎడ్యుడేషన్ యాక్ట్’ ద్వారా బాలికల హాజరును ఆమె పెంచగలిగారు. సుష్మా బాధు (32), హరియాణా సుష్మ తన ముఖాన్ని ఘూంఘట్తో కప్పుకోకపోవడం ధాని మియాన్ ఖాన్ గ్రామంలో పెద్ద విప్లవానికే దారితీసింది! ముగ్గురు పిల్లల తల్లయిన సుష్మ మొదట ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ‘‘హరియాణా కోడళ్లకు పని చేసుకోడానికి వీల్లేకుండా ఈ గుడ్డ ముఖానికి అడ్డు తగులుతోంది. తీసేస్తాను’’ అని చెప్పింది. ఆయన నివ్వెరపోయి చూశాడు. ఆమె అలా చెప్పిన వారానికి 2012, జూలై 22న చుట్టుపక్కల 25 గ్రామాల్లోని పంచాయతీ మహిళా సభ్యులు, విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలతో భారీ సదస్సు జరిగింది. ఆ సదస్సులో వేదిక పైనుంచి బహిరంగంగా తన ముసుగును తొలగించారు సుష్మా! ఆమె చదివింది ఏడు వరకే. అయినప్పటికీ గ్రామం కోసం ఒడుపుగా ఎన్నో పనులు చక్కబెట్టారు. ఆమె నేతృత్వంలో ఆ గ్రామం.. పారిశుధ్యంలో, ‘జీరో డ్రాపవుట్’ రేట్లో (ఒక్కరూ మధ్యలో బడి మానేకపోవడం), బాలబాలికల జనాభా చక్కటి నిష్పత్తిలో ఉండటంలో అనేక అవార్డులు గెలుచుకుంది. హరియాణాలోనే ధాని మియాన్ ఖాన్ గ్రామం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. -
మొదటి ప్రయత్నంలోనే విజయం
కర్నూలు (అగ్రికల్చర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ యువకుడు నిరూపించారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువుల సలహాలు, సూచనలు పాటిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–2 ద్వారా వ్యవసాయాధికారి పోస్టు సాధించారు. కర్నూలులో గుత్తి పెట్రోలు బంక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని రామకృష్ణనగర్కు చెందిన వి.వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమారుడు వి.విజయ్కుమార్ అనంతపురం జిల్లా యాడికి మండల వ్యవసాయాధికారిగా నియమితులయ్యారు. తండ్రి ట్రెకోడెర్మా విరిడి కేంద్రాన్ని నడుపుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండగా, కుమారుడు కూడా వ్యవసాయాధికారిగా ఎంపిక కావడం విశేషం. విజయ్కుమార్ 10వ తరగతి వరకు కర్నూలు సర్వేపల్లి విద్యానిలయంలో చదువుకున్నారు. ఇంటర్ మీడియట్ కర్నూలులోనే రత్నం కాలేజీలో చదివారు. ఎంసెట్ ద్వారా మహానంది వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు సాధించి అక్కడే ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్లో గ్రూపు–2 వ్యవసాయాధికారి టెక్నికల్ నోటిఫికేషన్ వెలువడటంతో ఎలాగైనా పోస్టు సాధించాలని కష్టపడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి వ్యవసాయాధికారిగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యవసాయాధికారిగా ఎంపికయ్యాయని విజయకుమార్ చెబుతున్నారు. వ్యవసాయంలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తానంటున్నారు. -
‘అంగన్వాడీ’ల భర్తీకి నోటిఫికేషన్
నల్లగొండ : అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తోన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో 2,093 అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 205 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ ప్రకటించింది. అంగన్వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. హేతుబద్ధీకరణకు ముందు కేంద్రాల్లో ఖాళీలు 227 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 205కు తగ్గింది. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లోని పోస్టులకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ పోస్టుల్లో అంగన్ వాడీ టీచర్లు 48, ఆయాలు 125, మినీ అంగన్వాడీ టీచర్లు 32 పోస్టులు ఉన్నాయి. పోటాపోటీ... ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ.10, 500, ఆయాలకు రూ.7,300 వరకు వేతనాలు పెంచింది. ఓ వైపు వేతనాలు పెరగడం, చాలా సంవత్సరాల తర్వాత ఖాళీలు భర్తీ చేస్తుండడంతో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగానే ఉండనుంది. నియామకాల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చేసేందుకు ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసింది. నియామకాలకు సంబంధించిన నిబంధనలు కూడా మార్పు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. పాత కమిటీలో ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి, ఇంటర్వూలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్వూల్లేవు. కేవలం పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు... దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నారు. wdcw.tg.nic.in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24 నుంచి 30 వరకు దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రాజెక్టు కార్యాలయాల్లో స్క్రూట్నీ చేయించుకోవాలి. లేదంటే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. సర్టిఫికెట్స్తో పాటు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, జాబ్కార్డు కూడా తీసుకురావాలి. దరఖాస్తు స్వీకరణ గడువు ముగిశాక అర్హులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ప్రొ ఫార్మాను, అర్హత సర్టిఫికెట్లను సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలి. అర్హతలు.. - అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. - జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాలు వయసు నిండి 35 ఏళ్లు మించరాదు. - అభ్యర్ధి తప్సనిసరిగా వివాహితురాలై ఉండాలి. - స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18–35 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. - ఎస్సీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. - ఎస్టీకి కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు అదే ఆవాస ప్రాంతానికి చెందిన అభ్యర్థులై ఉండాలి. వికలాంగులు : - వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు అర్హులు. - అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు. - కాళ్లు, చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు.. - పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం. - కుల ధ్రువీకరణ పత్రం - విద్యార్హత ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా. - నివాస స్థల ధ్రువీకరణ పత్రం - అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం - వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం - అనాథ అయితే అనాథ సర్టిఫికెట్ - వికలాంగులు అయితే సంబంధించిన సర్టిఫికెట్ - దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి అటిస్టేషన్తో ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించాలి. జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల ఖాళీల వివరాలు.. ప్రాజెక్టుపేరు అంగన్వాడీ అంగన్వాడీ మినీఅంగన్వాడీ టీచర్లు ఆయాలు టీచర్లు అనుముల 9 19 13 చింతపల్లి 3 9 0 నకిరేకల్ 2 6 0 దేవరకొండ 6 13 0 కొండమల్లేపల్లి 12 17 4 మునుగోడు 3 16 1 దామరచర్ల 5 16 12 నల్లగొండ 6 21 2 మిర్యాలగూడ 2 8 0 మొత్తం 48 125 32 -
హలో డాక్టర్..హార్ట్ మిస్సాయే..!
పాలమూరు: మారిన జీవన శైలితో ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలా జిల్లాలో ఎవరికైనా గుండెపోటు వచ్చిందా.. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తే చికిత్స అందే పరిస్థితులు లేవు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యి నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం లేకపోవడం దురదృష్టకరం. నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో అత్యంత ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన నిపుణులు లేకపోవడంతో అత్యవసర కేసులను హైదరాబాద్ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయలేక.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. సాధారణ వైద్యమే.. మూత్రపిండాల సమస్య ఉందా.. ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందా.. కేన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే హైదరాబాద్, లేదంటే ఇతర ఇతర నగరాలకు వెళ్లాల్సిందేనంటూ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రే కాదు.. ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఇచ్చే సలహా ఇది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులు తప్ప పెద్ద జబ్బులకు ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా భావించే మహబూబ్నగర్లోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఖాళీల కారణంగా పేద ప్రజలు వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడి పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తద్వారా అత్యవసర విభాగాల్లోనూ ఎంబీబీఎస్, శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులతోనే వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి చేజారాక అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాల్సి వస్తే మధ్యలో ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చి నాలుగేళ్లవుతున్నా నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉండాల్సిన విభాగాలు, వైద్యులు, వసతులు కల్పించకపోవడం గమనార్హం. ప్రైవేట్లోనూ లేరు మహబూబ్నగర్ పట్టణంలో గుండెకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ లేవు. ఇక గుండె సంబంధిత నిపుణులు లేకపోవడంతో పేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. ఇవీ పోస్టులు గుండె సంబంధిత నిపుణులే కాదు.. జనరల్ ఆస్పత్రిలో ఇతర విభాగాల్లోనూ వైద్యుల కొర త ఉంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 పోస్టులకు ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక జనరల్ సర్జరీలో 14 మందికి ఇద్దరు, ఆర్థోలో ఆరుగురికి ఒకరు, పీడియాట్రిక్లో 12 మందికి ముగ్గురు, గైనిక్లో 12 మందికి ముగ్గురు, ఈఎన్టీలో ముగ్గురికి ఒక్కరు, డెర్మటాలజీలో ముగ్గురికి ఒక్కరు, అనస్థీషియాలో 14 మంది కి నలుగురు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నా రు. దీంతో పేదలకు నిరాశే ఎదురవుతోంది. కార్డియాలజీ సేవలు అవసరం జనరల్ ఆస్పత్రిలో ఒక్కరైనా కార్డియాలజిస్ట్ ఉండాలి. ఈ విభాగం లేకపోవడం, వైద్యుల నియామకం జరకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైనా వస్తే జనరల్ మెడిసిన్ వైద్యులు చూస్తున్నారు అత్యవసరమైతే హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో నిపుణులను నియమించాల్సి ఉంది. – డాక్టర్ రామకిషన్, సూపరింటెండెంట్ -
స్టాంపులను సగం చించి వాడేద్దామా!
ఓ పోస్టు పంపాలి.. రూ.15 స్టాంపులు కావాలి. కానీ మీ దగ్గర రూ.10 స్టాంపులు రెండు ఉన్నాయి. ఓ రూ.10 స్టాంపును సరిగ్గా సగానికి కత్తిరించి వాడుకోవడం కుదురుతుందా.. ఇక్కడ మాత్రం కుదిరింది. స్టాంపులు మొదలైన తొలి రోజుల్లో వాటి ముద్రణ, వితరణ ఊపందుకోని సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇతర యూరోపియన్, ఆసియా దేశాల్లో దీన్ని అనుమతించారు. సరిగ్గా కర్ణం (డయాగోనల్)లా కత్తిరించిన స్టాంపులు వాటి ముఖ విలువలో సగంగా పరిగణించేవారు. కొన్ని కొన్ని సార్లు మరింత ముందుకెళ్లి మూడు వంతులు, నాలుగు వంతులుగా కూడా కత్తిరించి వాడేవారు. మెక్సికోలో అయితే మూడు, నాలుగు, ఎనిమిది వంతులుగా కత్తిరించి ఉపయోగించేవారు. స్టాంపుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అమలు చేశారు. పక్కనున్న ఫొటోలోని పోస్టల్ స్టాంపును చూశారుగా.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గురెన్సీ ద్వీపంలో సగానికి కత్తిరించి అతికించి పోస్టు చేశారు..! -
బాలకృష్ణకు పదవి ఇస్తారా ? లేదా ?
గుంటూరు, పెదనందిపాడు: రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్రా బాలకృష్ణకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ పదవి ఇస్తారో చెప్పే వరకు కదలనివ్వబోమని అడ్డుకున్నారు. మంగళవారం పెదనందిపాడులో టీడీపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో తాము ఒట్లు వేసి గెలిపించింది ఇందుకోసమేనా అంటూ మంత్రిని నిలదీశారు. తన చేతుల్లో ఏమీ లేదని, పార్టీ ఆధిష్టానంతో చర్చించి చెబుతానని మంత్రి సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లను పక్కకు నెట్టేసి మంత్రిని పంపించారు. ఆగ్రహించిన కార్యకర్తలు లిఫ్టు ఇరిగేషన్ ప్రారంభోత్సావానికి వెళ్లకుంగా మిన్నకుండిపోయారు. -
'దంగల్' బ్యూటీ షేమ్లెస్ సెల్ఫీ
‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ మరోసారి సెల్ఫీతో నెటిజన్ల ముందుకు వచ్చారు. బాలీవుడ్ తారలు ధరిస్తున్న డ్రెస్సులపై నెటిజన్లు మండిపడుతున్న సమయంలో ‘షేమ్లెస్’ సెల్ఫీతో సోషల్ మీడియాలో కలకలం రేపారు. చీర, బ్లౌజ్ ధరించి 'షేమ్లెస్ సెల్ఫీ' అంటూ చిన్న క్యాప్షన్ పెట్టి ఫొటో పోస్ట్ చేసిన ఈ అమ్మడు తీరు ఏమీ బాగాలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక మహిళ చీర, బ్లౌజ్ ధరించే తీరు ఇదేనా? అసభ్యంగా వున్న ఈ సెల్ఫీ ద్వారా నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో.. చేతుల కింది దాకా బ్లౌజ్తో, నాభి కనిపించేలా ఉన్న ఈ సెల్ఫీపై కొందరు ప్రశంసలు గుప్పించారు. అంతకుముందు ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీ పైనా కూడా నెటిజన్లు తిట్లవర్షం కురిపించారు. విమర్శలను పట్టించుకోకుండా తాజా మరో సెల్ఫీ పోస్ట్ చేశారు. :) 📸 @arjunkamath87 💄 @dsimrock 💇🏻 @nakitadsouza 💃 @nekkosha thank you nekko😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Nov 7, 2017 at 2:08am PST Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Oct 8, 2017 at 7:49am PDT -
గిరిజన డిగ్రీ కాలేజీల్లో 1,455 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ కేటగిరీలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తల పోస్టులను సైతం మంజూరు చేసింది. మొత్తం 1,455 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోస్టులు భర్తీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు సూచించింది. వీటిలో డిగ్రీ కాలేజీలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది కింద 1,430 పోస్టులు, కార్యదర్శి కార్యాలయానికి 25 పోస్టులను కేటాయించింది. వీటిలో అత్యధికంగా 880 డిగ్రీ లెక్చరర్ పోస్టులున్నాయి. గురువారం ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టులివే.. విభాగం: టీటీడబ్ల్యూ డిగ్రీ కాలేజీ పోస్టు కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 22 డిగ్రీ లెక్చరర్ 880 లైబ్రేరియన్ 22 ఫిజికల్ డైరెక్టర్ 22 పరిపాలనాధికారి 22 సూపరింటెండెంట్ 22 మెస్ మేనేజర్/వార్డెన్ 22 స్టాఫ్ నర్స్ 44 సీనియర్ అసిస్టెంట్ 22 కేర్ టేకర్ 22 ల్యాబ్ అసిస్టెంట్ 88 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 44 అసిస్టెంట్ లైబ్రేరియన్ 22 జూనియర్ అసిస్టెంట్/డీఈఓ 22 స్టోర్ కీపర్ 22 మ్యూజియం కీపర్ 22 రికార్డ్ అసిస్టెంట్ 22 ఆఫీస్ సబార్డినేట్ 88 విభాగం: కార్యదర్శి కార్యాలయం రిజిస్ట్రార్ 1 డిప్యూటీ సెక్రెటరీ 2 అసిస్టెంట్ సెక్రెటరీ 2 సూపరింటెండెంట్ 3 సీనియర్ అసిస్టెంట్ 3 జూనియర్ అసిస్టెంట్ 3 ఆఫీస్ సబార్డినేట్ 3 రీజినల్ కోఆర్డినేటర్ 8 -
కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లో తపాలా సేవలు
విశాఖ పోస్టల్ రీజియన్లో తొలిసారిగా అమలాపురం నుంచి శ్రీకారం ప్రారంభించిన రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత అమలాపురం టౌన్ (అమలాపురం) : తపాలా సేవలపరంగా 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల తమ శాఖ ఇక నుంచి వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా, దీటుగా సేవలు అందించేందుకు కొత్తగా కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లోకి అడుగు పెట్టిందని విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత అన్నారు. ఈ సరికొత్త సేవలను తమ రీజియన్ పరిధిలోని అమలాపురం పోస్టల్ డివిజన్ నుంచే ప్రథమంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. అమలాపురంలోని డివిజన్ పోస్టల్ కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు)లో ఏర్పాటుచేసిన కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ విధానాన్ని ఆమె సోమవారం ఉదయం ప్రారంభించారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ జి.షణ్ముఖేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోర్ సిస్టమ్స్ వల్ల తపాలా సేవలు మరింత వేగంగా... పారదర్శకంగా అందనున్నాయన్నారు. ఈ విధానంతో దేశమంతా తపాలా సేవలు ఆన్లైన్ అనుసంధానంతో ఒకే ప్లాట్ ఫారంపైకి వచ్చినట్లయిందని చెప్పారు. వినియోగదారులు పోస్టల్ సేవలు పొందేందుకు తమ వద్ద ఉండే మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థతో పొందవచ్చని తెలిపారు. వాణిజ్య బ్యాంక్లు ఎన్ని రకాలు సేవలు అందిస్తున్నాయో అలాంటి సేవలన్నీ తమ శాఖ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుందన్నారు. తమ రీజయిన్ పరిధిలో 1,500 వాణిజ్య బ్యాంక్లు ఉంటే తమ తమ శాఖ కార్యాలయాలు ఆరు వేల ఉన్నాయని గుర్తు చేశారు. పోస్టల్ అంటే ఓ నెట్ వర్కింగ్...ఐటీ ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ వినూత్న, విస్తృత సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైతం ప్రచారం చేసేందుకు తమ సిబ్బంది ఫొటోలు, వీడియోలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా సాధ్యం కాదని...వారు కూడా ప్రజల్లోకి వెళ్లాలి...నోటి మాటలతో అర్థమయ్యే రీతిలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కోర్ సిస్టమ్స్ సేవలను రీజియన్ పరిధిలోని తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో జూలై నెలాఖరుకు విస్తరింప చేస్తామని... వచ్చే సెప్టెంబర్ నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపడతామని శ్రీలత వివరించారు. త్వరలోనే రెండు పాస్ పోర్టు సేవా కేంద్రాలు తమ పోస్టల్ శాఖ కోర్ సిస్టమ్స్ సేవలనే కాకుండా త్వరలోనే పోస్ట్ ఆఫీసుల్లో పాస్పోర్టు సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆ సేవలు అందించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీలత వెల్లడించారు. తొలి ప్రయత్నంగా రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో ఈ సేవా కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ, విదేశాంగ శాఖ ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చాని తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే పోస్టు ఆఫీసుల్లోనే పాస్పోర్టు దరఖాస్తు చేసుకునే వెసులబాటు వస్తుందన్నారు. అమలాపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్వీ రాజేష్, హెడ్ పోస్టు మాస్టర్ వై.ప్రసాద్, పోస్టల్ ఇన్స్పెక్టర్లు వి.హరిబాబు, బీవీఎల్ విశ్వేశ్వరరావు, ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. రీజియన్లో తొలిసారిగా అమలాపురంలో కోర్ సిస్టమ్స్ ప్రారంభానికి ముందు శ్రీలత కేక్ కట్ చేయటంతో సిబ్బంది వేడుక చేసుకున్నారు. -
అయ్యో!
– చేతిదాక వచ్చి ఇమాంబీకి దక్కని పోస్టు – మెరిట్జాబితాలో పేరున్నా కానిస్టేబుల్ పోస్టు గల్లంతు – బీసీ–ఈ కేటగిరిలో 83 మార్కులకే పోస్టు – ఈ యువతికి 90 మార్కులొచ్చినా దక్కని ఉద్యోగం కోవెలకుంట్ల: ఎలాగైనా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆ యువతి నిరంతరం శ్రమించింది. ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. మెరిట్ జాబితాలో పేరు ఉండటంతో పోస్టు గ్యారెంటీ అని ఆ యువతితో పాటు కుటుంబసభ్యులు సంతోషపడ్డారు.అయితే, రిక్రూట్మెంట్ బోర్డు తప్పిదం పోస్టు చేజారేలా చేసి వారికి నిరాశమిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్బాషా కుమార్తె షేక్ చిన్న ఇమాంబీ 2016 సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని ప్రాథమిక పరీక్ష, ఈవెంట్స్ పూర్తి చేసుకుంది. మెయిన్ పరీక్షలో 90 మార్కులు సాధించి మెరిట్ జాబితాలో చేరింది. సివిల్ పోస్టుకు 90 మార్కులు, ఏఆర్ కానిస్టేబుల్పోస్టుకు సంబంధించి 94 మార్కులు వచ్చాయి. బీసీ–ఈ కేటగిరీలో మహిళా కోటాలో 83 మార్కులకే పోస్టును కేటాయిస్తూ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక జాబితాను రిక్రూట్బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలో ఇమాంబీ పేరు లేదు. 83 మార్కులకే పోస్టు రాగా 90 మార్కులు వచ్చినా ఎంపిక జాబితాలో పేరు లేకపోవడంతో ఆందోళన చెందిన ఇమాంబీ తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆకేరవికృష్ణను కలిసి వివరాలు అందజేశారు. రిక్రూట్మెంట్ బోర్డు నిర్వాకంతో చేతిదాక వచ్చిన పోస్టు దక్కకుండా పోయిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేయండి సారూ.. ఖాదర్బాషా గౌండా పనిచే సుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు కానిస్టేబుల్ పోస్టు వస్తుందని ఆనందపడగా బోర్డులో చోటు చేసుకున్న తప్పిదంతో పోస్టు చేజారింది. మొదట రిక్రూట్మెంట్ అధికారులు క్రిమిలేయర్ సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పి తర్వాత సర్టిఫికెట్ మెలిక పెట్టారని ఇమాంబీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేసి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపిక చేయాలని ఆ యువతి తల్లిదండ్రులు రిక్రూట్మెంట్ అధికారులను కోరుతున్నారు. -
డబ్బుకు ‘దేశం’ దాసోహం
- ఖరీదైన చైర్మన్ పీఠం - బేరం రూ.15 లక్షలు పైమాటే - ఇద్దరు నేతల మధ్య ఒప్పందం మాటలు: కష్టపడే కార్యకర్తకు పట్టం కడతాం. జెండాను భుజాన మోసిన వ్యక్తికే పదవులు. పార్టీ అలాంటివారినే ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది...గుండెల్లో పెట్టుకుంటుంది తమ్ముళ్లూ ... మీరు పని చేయండి ... పార్టీ ప్రతిష్టను నిలబెట్టండి ... పదవులు అవే వస్తాయి. - మినీ మహానాడులో నుంచి విశాఖలో ముగిసిన మహానాడు వరకు జిల్లా నుంచి ఆ పార్టీ అధినేత చెప్పే మాటలివీ.. చేతలు: కష్టపడే నేతలు కాదు పార్టీ ‘పెద్దల’కు ఇష్టపడే నేతలుంటే చాలు పదవులు వాటికవే వచ్చి ఒడిలో వాలిపోతాయి. ఒక్క ఇష్టం ఉంటే సరిపోదండోయ్... కరెన్సీ తూకం సరిపోవాలి...అప్పుడు గతంలో ఇచ్చిన హామీలు ... ఒప్పంద పత్రాలన్నీ బలాదూర్. ఎవరి బేరం భేషుగ్గా ఉంటే పదవి పరుగులు తీసి వరించేస్తోంది. ఔనా అని ముక్కున వేలేసుకోకండి...ఈ కథనం చదివేయండి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధినేత దగ్గర నుంచి అట్టడుగు వరకు డబ్బు డబ్బు..డబ్బు...అంతా డబ్బుమీదే నడుస్తోంది. పని కావాలంటే డబ్బు..పదవి కావాలంటే డబ్బు.. ‘డబ్బుకు లోకం దాసోహం...అన్నట్టుగా డబ్బుకు దాసోహం టీడీపీ అయిపోయిందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు మినీ మహానాడులో జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా మంత్రులు కార్యకర్తలు, నాయకులే పార్టీకి పట్టుగొమ్మలని చెప్పిన చిలక పలుకులు జిల్లాలో ఎక్కడా వినిపించడం లేదు. ఉదాహరణకు కోనసీమలోని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గిరీనే తీసుకుందాం.ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ సుమారు కోటిన్నర వార్షిక ఆదాయంతో నడుస్తోంది. ఆ కమిటీ చైర్మన్ పదవీ కాలం గత మార్చి 20తో పూర్తయింది. కొత్త పాలకరవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 30 గ్రామాలున్నాయి. రాజోలు నియోజకవర్గ పరిధిలో 14, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 16 గ్రామాలు ఈ కమిటీలో ఉన్నాయి. ఈ చైర్మన్ గిరీకి జిల్లాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. చైర్మన్ పీఠాన్ని రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారు చైర్మన్ పదవి ఆశిస్తున్న మాటేమోగానీ ఆ ఆశలను ఆసరాగా పార్టీ ముఖ్యనేతలు సొమ్ము చేసుకోవాలని బాగా ఆరాటపడుతున్నారు. ఆ హామీ ఏమయింది...? మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికే చైర్మన్ పీఠం కట్టబెడతామని నిన్న మొన్నటి వరకు ఆశలు రేకెత్తించిన ముఖ్య నేతలు కాస్తా ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. చైర్మన్ పీఠాన్ని రూ.15 లక్షలకు బేరం పెట్టారు. పదవీ కాలం రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండటంతో అందినంతా దోచుకోవాలనే తాపత్రయంలో పార్టీ సీనియర్లను సైతం పక్కనబెట్టేస్తున్నారని కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మార్చి వరకు చైర్మన్గా కొమ్ముల నాగబాబు కొనసాగారు. గత చైర్మన్ రేసులో నాగబాబుతోపాటు చివరకు మామిడికుదరు మండల టీడీపీ అధ్యక్షుడు సూదా వెంకట స్వామినా యుడు (బాబ్జీ) కూడా పోటీపడ్డారు. వివిధ సమ‘తూకా’ల్లో చివరకు నాగబాబుకే చైర్మన్ గిరీ దక్కింది. అప్పుడు నిరాశకు గురైన బాబ్జీకి వచ్చేసారి అంటే (ప్రస్తుతం) అవకాశం ఇస్తామని ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత హామీ ఇచ్చారు. హామీనే కాకుండా చైర్మన్ బాబ్జీకే ఇస్తామని కాగితంపై రాసి కూడా ఇస్తానని అప్పుడు బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని పార్టీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. రెండేళ్లు గడిచే సరికి ఆ నాయకుడు ఇచ్చిన మాటలు గన్నవరం గోదావరిలో కలిపేశారు. చైర్మన్ పదవి మార్పు చేయాల్సి వచ్చేసరికి పార్టీలో సీన్ రివర్స్ అయింది. కరెన్సీ కట్టల ముందు పార్టీ కోసం సేవలు, క్రమశిక్షణ అనే మాటలు గాలిలో కలిపేశారు. కళ్లెదుట లక్షలు కనిపిస్తుంటే అవన్నీ ఎందుకు గుర్తుంటాయని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రహస్య ఒప్పంద నేపథ్యంలో... రూ.15 లక్షలకు బేరం పెట్టి మరోసారి కూడా బాబ్జీకి అన్యాయం చేయడానికి వెనుకాడటం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాజోలు నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్యనేత శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సిఫార్సు కూడా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొదట్లో రాజోలు నియోజకవర్గ ప్రాతినిధ్యంలో ఉన్న ప్రాంతానికి చైర్మన్ ఇచ్చేది లేదని భీష్మించిన గన్నవరం నేత ఇటీవల కాస్త మెత్తపడ్డారంటున్నారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సర్థుబాటు జరగడంతోనే రహస్య ఒప్పందానికి వచ్చారంటున్నారు. రూ.15 లక్షల్లో పి. గన్నవరం ప్రాంత నేతకు రూ.10 లక్షలు, రాజోలు నేతకు రూ.5 లక్షలు ఇవ్వాలనేది ఒప్పంద సారాంసమని కోనసీమ కోడైకూస్తోంది. ఇన్ని లక్షలు ముడుపులు ముట్టచెబితే కమిటీ ద్వారా రైతులకు సేవలు ఎలా చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో అంబాజీపేట మార్కెట్ కమిటీ విషయంలో కూడా ఇలానే అప్పట్లో లక్షలు చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి. ఇలా అయితే పార్టీ కోసం జెండా భుజాన మోసిన నేతలంతా ఏమైపోవాలనేది కార్యకర్తల ప్రశ్న. దీనికి నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. -
అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారు: ఇలియానా
'అబ్బాయిలు శృంగారం గురించి ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి ఆలోచిస్తారు' అని ఇలియానా తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్టు విపరీతంగా షేర్ అవుతోంది. అబ్బాయిలు కేవలం శృంగారం గురించే ఆలోచిస్తారు. కానీ, అమ్మాయిలు అలా కాదు ఆహారం, శృంగారం, చెప్పులు, బట్టల గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఇంకా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారనే దానిపై అబ్బాయిలకు కొన్ని క్లూలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎలాగైనా జిమ్కి వెళ్లాలి?. అతను నా ఫోటోకు ఎందుక లైక్ కొట్టడం లేదు? ఇలాంటి విషయాలను కూడా అమ్మాయిలు తీవ్రంగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది ఇలియానా. అంతేకాదు పెదవులకు ఇంజక్షన్ చేయించుకోవాల్సిన పని ఉందా?. నా ఇంటి పేరును మొదట పెట్టుకోవాలా లేక చివర్లో పెట్టుకోవాలా?. నా కనుబొమ్మలు ఎలా ఉన్నాయి?. ఈ రోత గోళ్లను నేను వదిలించుకోగలనా?. కొంచెం తొందరగా మందు కొడుతున్నానా? లాంటి విషయాలను ప్రతి ఐదు సెకన్లకు అమ్మాయిలు ఆలోచిస్తుంటారని తెలిపింది ఇలియానా. అందుకే అమ్మాయిలు క్రేజీగా ఉంటారని చెప్పింది. 😂🤣😂🤣 A post shared by Ileana D'Cruz (@ileana_official) on May 24, 2017 at 8:32pm PDT -
భారతీయ ఆర్మీ పోస్టును కూల్చేశాం: పాక్ ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో గల భారతీయ ఆర్మీ పోస్టులను కూల్చేశామంటూ పాకిస్తాన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఓ భారతీయ ఆర్మీ అధికారి పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో అబద్దమని తెలిపారు. బుల్లెట్లను తట్టుకుని నిలబడగల సామర్ధ్యం భారతీయ పోస్టుల గోడలకు ఉందని వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ పోస్టులను నేల కూల్చిన వీడియోను భారత్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏం చేయాలో అర్ధం కాని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు నౌషెరాలో గల భారత ఆర్మీ పోస్టుపై మంగళవారం దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఓ నకిలీ వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ ట్వీటర్ ద్వారా వీడియోను విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీన భారతీయ ఆర్మీ అమాయకులైన పాకిస్తాన్ పౌరులపై కాల్పులు జరిపి హతమార్చినందుకు ప్రతీకారంగా భారత చెక్ పోస్టుపై దాడి చేశామని పేర్కొంది. On 13 May 2017, India targeted innocent civilians. In befitting response Pak Army destroyed Indian posts in Nowshera Sec. 2/2. pic.twitter.com/jHLZVOoHSa — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 23 May 2017 -
ఒక్క రోజు కాపురం చేసి.. పోస్టులో తలాక్!
యాకుత్పురా: రెండో వివాహం చేసుకొని ఒక్క రోజు కాపురం చేసి పోస్టుద్వారా విడాకులు పంపిన ఓ వ్యక్తిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లి ప్రకాశం పంతులునగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హనీఫ్ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహదురున్నీసాకు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే మగ పిల్లవాడు కావాలని నిర్ణయించుకున్న హనీఫ్ రెండో వివాహం చేసుకునేందుకు భార్య బహదురున్నీసాను ఒప్పించాడు. తలాబ్కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి భార్య నుంచి విడాకుల పత్రం లేకపోవడంతో ఖాజీ నిఖా చేసేందుకు నిరాకరించడంతో మరుసటి రోజు అందజేస్తామని చెప్పి గత నెల 9న మొఘల్పురాలోని కన్వీల్లా ఫంక్షన్ హాల్లో ఫర్హీన్ను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూకట్పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. పెళ్లి రోజు రాత్రి పర్హీన్తో గడిపిన హనీఫ్ ఉదయం వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫర్హీన్కు ఫోన్ చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని సూచించాడు. అంతేగాకుండా ఈ నెల 18న పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. తాను పంపిన విడాకుల పత్రంలో పెళ్లి ఇష్టం లేదు... అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై బాధితురాలు ఫర్హీన్ బేగం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు, గురువారం రాత్రి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హెచ్ఎం పోస్టల భర్తీ
కర్నూలు సిటీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించి.. ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ స్థానాలను భర్తీ చేశారు. ఇందుకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 20 ఖాళీలు ఉంటే 19 మంది హాజరయ్యారు. వికలాంగుల కోటా కింద ఒక పోస్టుకు అర్హులు లేరు. దీంతో 19 హెచ్ఎం పోస్టులు భర్తీ చేశారు. అనంతరం పదోన్నతులు పొందిన వారికి నియమాక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ - అయిదు ప్రశ్నలు
హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించేందుకే నేను ఉన్నానని తరచూ చెప్పుకునే పవర్ స్టార్ తాజాగా ట్విట్టర్ లో్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ట్విట్టర్ ద్వారా బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు అడగదల్చుకున్నట్టు గురువారం వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ముఖ్యంగా బీజేపీని నమ్మి ఓట్లేసిన వారిని నుంచి సేకరించానని పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీ కూటమికి ఏపీ, తెలంగాణా, కర్ణాటకలో జనసేన మద్దుతిచ్చిందని గుర్తు చేసిన పవన్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తాను అయిదు ప్రశ్నలు అడగనున్నట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనే సపోర్ట్ చేయలేదని కర్ణాటకలో కూడా వారి తరఫున ప్రచారం చేశానన్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరారు. గోవధ నిషేధంపై బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం నిజాయతీగా ఉంటే లెదర్ తో తయారు చేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలని అన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతీ బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. విభజన రాజకీయాల ద్వారా గోమాంసం తినే ప్రజల్లో భయాందోళలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గోవులను పూజించే ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొడుతోందని పవన్ వ్యాఖ్యానించారు. గోవధ, వేముల రోహిత్ ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదాల అంశాలపై తన ట్విట్టర్ ద్వారా వరుసగా ప్రశ్నించనున్న అంశాలని తెలిపారు. ఈ క్రమంలో రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నిస్తానంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/f63aZBvMeT — Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016 -
రూ.30 లక్షలిచ్చినా ముప్పుతిప్పలే..!
∙అంగట్లో ఏఎంసీ చైర్మ¯ŒS గిరీ ∙సంపర కమిటీ పీఠం మరింత కీలకం ∙చక్రంతిప్పిన రూరల్ రాజ్యాంగేతర శక్తి సాక్షిప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS పీఠాలకు రేట్లు నిర్ణయించడమనేది పాత విషయమే అయినా సరికొత్త పద్ధతుల్లో దందాను కొనసాగిస్తున్నారు. కోనసీమలో అంబాజీపేట మొదలుకుని నగరం, తాటిపాక, అల్లవరం..ఇలా దాదాపు అన్ని ఎఎంసీ చైర్మ¯ŒS పీఠాలను అంగట్లో పెట్టి అమ్మేసుకున్నవే. ఏడెనిమిది లక్షలు నుంచి రూ.15 లక్షలు వరకు వీటి ధర పలుకుతోంది. చివరకు టీడీపీలో సీనియర్లు కూడా సొమ్ములు ఇవ్వకుండా పోస్టులు పొందలేకపోయారంటే పార్టీలో పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో భర్తీ కాని సంపర మార్కెట్ కమిటీ చాలా కీలకమైంది. ఎందుకంటే ఆ కమిటీ నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ మార్కెట్ కమిటీ పన్నుల రూపంలో ఏటా కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఏఎంసీలున్నా రాజకీయంగా సంపర కమిటీ చైర్మ¯ŒS పదవి చాలా కీలకమైంది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి, పిఠాపురం నియోజకవర్గంలో యు.కొత్తపల్లి, నియోజకవర్గ కేంద్ర మండలం కాకినాడ రూరల్, అదే నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు గ్రామంతో కలిసి సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీగా ఉంది. ఉప ముఖ్యమంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలో ఈ కమిటీ ఉండటంతో జిల్లాలో చాలా ప్రాధాన్యం ఉన్న కమిటీగా సంపరకు పేరుంది. అందుకు తగ్గట్టు చైర్మ¯ŒS గిరీ కోసం నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు పలువురు నేతలను ప్రతిపాదించారు. మా గతేంగాను... పార్టీలో మొదటి నుంచీ ఉన్న తమ పరిస్థితి ఏమిటని మిగిలిన సీనియర్లు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఈ చైర్మ¯ŒS గిరీని కాకినాడ రూరల్ మండలం నుంచి పుల్లా ప్రభాకరరావు, రామదేవు సీతయ్యదొర, కర్రి సత్యనారాయణలు ఆశిస్తున్నారు. వీరిలో ప్రభాకరరావు పార్టీలో సీనియర్. ఇతనికి వరుసకు కుమారుడైన పుల్లా సుధాచంద్ర రూరల్ ఎంపీపీగా ఉండటంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం రాదని వెనక్కు పెట్టారంటున్నారు. మరో సీనియర్ నాయకుడు సీతయ్యదొర. ఎన్టీఆర్æ వీరాభిమాని. ఆవిర్భావం నుంచి పార్టీ జెండా భుజాన మోసిన దొర పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురులో చైర్మ¯ŒS గిరీ ఎవరిని వరిస్తుందా అని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.రూ.30 లక్షలు మింగేసి చైర్మ¯ŒS పీఠం ఇవ్వకపోగా, వైస్ చైర్మ¯ŒS పోస్టు కోసం అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పోటీ నెలకొనడంతోనే చైర్మ¯ŒSగిరీ పెండింగ్లో ఉందని రూరల్ నేత ఒకరు బుజ్జగిస్తున్నారు. ఎవరో ఒకరికి చైర్మ¯ŒS ఇవ్వకుండా ఇంకా ఎంత కాలం ఇలా జాప్యం చేస్తారని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఆ ప్రాతినిధ్యం మాదే కావాలి... ఆ చైర్మ¯ŒS గిరీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో తమ నియోజకవర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ముఖ్యనేత పట్టుబడుతున్నారు. గత కాంగ్రెస్ హయాంలో పెదపూడి మండలానికి చెందిన అద్దంకి ముక్తేశ్వరరావు చైర్మ¯ŒSగా వ్యవహరించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా కాపు సామాజిక వర్గానికే కేటాయించాలని ఆ ముఖ్యనేత ప్రతిపాదించారు. నియోజకవర్గంలో అన్నింటా తానై రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకుడు చైర్మ¯ŒSగిరీ కోసం అంతగా పట్టుబట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఈ చైర్మ¯ŒS పీఠానికి ముఖ్యనేత రూ.30 లక్షలుగా నిర్ణయించి మెజార్టీ సొమ్ము ఇప్పటికే జేబులో వేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలు, చివరకు మంత్రుల పర్యటనల ఖర్చు కూడా చైర్మ¯ŒS ఆశిస్తున్న కాకినాడ రూరల్కు చెందిన ఒక నాయకుడే భరిస్తున్నాడు. ఆ ఖర్చుతోపాటు రెండు దఫాలు (రూ.16 లక్షలు ఒకసారి, రూ.9 లక్షలు మరోసారి) మొత్తంగా రూ.25 లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు ముట్టజెప్పారని పార్టీలో చర్చ జరుగుతోంది. ముందుగా కుదిరిన డీల్ రూ.30 లక్షలు ప్రకారం చూస్తే పాతిక లక్షలు ఇప్పటికే ముట్టజెప్పగా, ఏడాదిన్నర ఖర్చుల కింద మిగిలిన ఐదు లక్షలు చూసుకోవాలని చైర్మ¯ŒS రేసులో ఉన్న నాయకుడు లెక్కలు చెప్పారని తెలిసింది. అన్ని లక్షలు తీసుకున్నప్పటికీ ఆ ముఖ్యనేత చైర్మ¯ŒS గిరీ ఈవేళ, రేపు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న తీరుతో చేతి చమురు వదుల్చుకున్న నేత వర్గీయులు మండిపడుతున్నారు. -
ప్రారంభమైన కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష జరుగనుంది. మొత్తం 9,281 పోస్టుల కోసం తెలంగాణ వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్తో హాజరు కావాలని అధికారులు సూచించిన సంగతి విధితమే. -
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష
-
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష
⇒రాష్ట్రవ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలు ⇒9,281 పోస్టులకు 81,523 మంది ⇒అభ్యర్థుల పోటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతిం చమని బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపింది. మొత్తం 9,281 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 153 కేంద్రాల్లో 81,523 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్తో హాజరు కావాలని అధికారులు సూచించారు. -
సర్వీస్రూల్స్ సాధిస్తాం
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నిజామాబాద్అర్బన్: సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతున్నారని, త్వరలో వాటిని సాధిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, త్వరలో హెల్త్కార్డులు అందేలా చూస్తామన్నారు. దీని కోసం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు మాత్రమే పాటిస్తామన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, కమలాకర్రావులు జిల్లాలో ఎస్ఎంస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మాణం చేశారు. మోడల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడి సంఘం రెండుగా విడిపోయినప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండలాల బాధ్యులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి.. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ఇండియా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం అప్రజాస్వామికమని, దాన్ని రద్దు చేయాలని దశల వారీగా పోరాటాలు చేస్తామన్నారు. పీర్టీయూ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో డిప్యూటీ డీఈవోలకు పదోన్నతి కల్పించి డీఈవోలుగా నియమించాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో కొనసాగేలా చూడాలన్నారు. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలను దసరా, దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయలని, ఉపాధ్యాయుల జీపీఏకు సంబంధించి 100 కోట్ల వడ్డీని వెంటనే విడుదల చేయలన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ చైర్మనా... మాకొద్దుబాబోయ్..!!
–సెంటిమెంట్తో భయపడుతున్న నాయకులు –పదవి తీసుకున్న వారి ఎదుగుదల ఆగిపోతుందని భయం –నాటి నుంచి నేటి వరకు అంతే కోదాడ: అధికార పార్టీ నాయకులు ఎన్నోరోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న కోదాడ మార్కెట్ చైర్మన్ పదవికి ఇపుడు సెంటిమెంట్దెబ్బ తగులుతోంది. ఇప్పటి వరకు ఈ పదవిపై ఆశ పెట్టుకున్న వారు సెంటిమెంట్ దెబ్బకు కాస్తా వెనుక, ముందూ ఆలోచిస్తున్నారు. దీంతో ఈ పదవి కోసం రాష్ట్ర నేతల వద్దకు వెల్లడం కూడ మానేశారు. వారు పిలిచి ఇచ్చినపుడు చూద్దాంలే అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే మార్కెట్ పాలకవర్గం పట్టించుకోకపోవడానికి కారణమని భావిస్తున్నప్పటికి తాజాగా దీనికి నాయకుల సెంటిమెంట్ కూడ తోడవ్వడంతో నేతలు మార్కెట్ చైర్మన్ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం ఇంతకీ ఏమిటా సెంటిమెంట్.. వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నేతల రాజకీయ భవష్యత్తు అంతటితోనే ఆగిపోవడం. అలాగే వారు నియోజకవర్గ స్థాయి పదవిని కూడ పొందలేక పోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరిది అదే పరిస్థితి కావడంతో నిజమే కాబోలు అనుకునే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలందరిది ఇదే పరిస్థితి. కోదాడ మార్కెట్కు తొలి చైర్మన్గా కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన ముండ్రా నాగేశ్వరరావు వ్యవహరించారు. ఆయన ఆ పదవితోనే సరిపెట్టుకున్నారు తరువాత ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. ఇక ఆయన తరువాత చైర్మన్లుగా వ్యవహరించిన ఏర్నేనిబాబు, జెట్టి వెంకటరెడ్డి, చల్లా రామ్మూర్తి, ఎండీ మహబూబ్ జానీ, పయిడిమర్రి సత్యబాబు ఇలా అందరు నియోజకవర్గం దాటి రాజకీయంగా ఎదిగింది లేదు. బయటకు వెల్లింది లేదు ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుల తరుణం తాజాగా టీఆర్ఎస్ నాయకులను ఈ పదవి ఒక పక్క ఊరిస్తుండగా మరో పక్క తీసుకుంటే వారి పరిస్థితి కూడ ఇదే విధంగా మారుతుందేమోననే సంకోచం నేతలకు ఎక్కడో కలుక్కుమనిపిస్తుంది. మరి కొందరు మాత్రం సెంటిమెంట్ లేదు ఆయింట్మెంట్ లేదు.. పదవి తీసుకుంటే నియోజకవర్గంలో చక్రం తిప్పడంతో పాటు రానున్న ఎన్నికల సమయానికి టికెట్ సాధించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ పదవి ఎవ్వరిని వరిస్తుందో.. వారికి సెంట్మెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే మరి. స్థానిక నేతలు ఇలా ఆలోచిస్తుండగా పానకంలో పుడకలాగా కోదాడకు చెందిన ఒక ఎన్ఆర్ఐ తనకు మార్కెట్ చైర్మన్ పదవి కావాలని రాష్ట్ర నాయకత్వానికి అమెరికా నుంచి విజ్ఞాపనల మీద విజ్ఞాపనలు పంపడం, వాటి కాపీలను స్థానిక మీడియాకు పంపించి కొద్ది రోజుల్లోనే తనకు చైర్మన్ పదవి వస్తుందని, రాష్ట్ర నాయకత్వం తనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
20 మంది అమ్మాయిలను వేధించాడు..
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ పాఠశాల డైరెక్టర్ 15 ఏళ్ల బాలికను శారీరకంగా వేధించి, ఆ బాలికకు చెందిన నగ్న దృశ్యాల వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. నిందితుడు జితేందర్ సింగ్ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాఠశాలలో 20 మందికి పైగా బాలికలను సింగ్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. సింగ్ గత ఏడాది కాలంగా తనను శారీరకంగా వేధిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. రోజులో ఏదో ఒక సమయంలో ఆఫీసు రూమ్ కు పిలిచి తన కోర్కె తీర్చాలని వేధించేవాడని, లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేగాక పరీక్షల్లో ఫెయిల్ చేసి కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. పాఠశాలకు చెందిన 20 మందికి పైగా అమ్మాయిలను సింగ్ శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది. గురువారం ఫోన్ చేసి తన నివాసానికి రావాలని చెప్పాడని, అందుకు తాను నిరాకరించినట్టు చెప్పింది. ఆ తర్వాత వీడియోను వాట్సాప్ లో పోస్ట్ చేశాడని, తన కుటుంబాన్నంతటినీ చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పింది. -
పీహెచ్ డీ, పీజీలు చేసిన వాళ్లు..
చదివిన చదువులు పెద్దవి.. ఆశపడే ఉద్యోగాలు చిన్నవి. చిన్న ఉద్యోగాలపై మోజుకాదుకానీ.. ఉద్యోగం వస్తే చాలనుకునేంత పరిస్థితి. మరోపక్క అర్హతకు తగిన ఉద్యోగాలను అందించలేని పరిస్థితి ప్రభుత్వాలది. వెరసి ప్రభుత్వ ఉద్యోగానికి ఇలా నోటిఫికేషన్ పడిందో అలా వెంటనే ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. మరోసారి మధ్యప్రదేశ్ లో పరిస్థితి దీనంతటికి అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన 14,000 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లురాగా, వాటిలో పీహెచ్ డీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. 1.19 లక్షల మంది డిగ్రీ ,14,652 మంది పీజీ, 9,629 మంది ఇంజనీర్లు, 12 మంది పీహెచ్ డీ పూర్తి చేసిన వారు ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన 14,000 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లురాగా, వాటిలో పీహెచ్ డీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. 1.19 లక్షల మంది డిగ్రీ ,14,652 మంది పీజీ, 9,629 మంది ఇంజనీర్లు, 12 మంది పీహెచ్ డీ పూర్తి చేసిన వారు ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత ఇంటర్ కాగా, పీహెచ్ డీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారని ఎమ్పీపీఈబీ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష వచ్చేనెల 17న నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంటర్ విద్యార్హతతో దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేశారని చెప్పారు. 3,438 మంది డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు చదువు, వయోపరిమితుల నుంచి సడలింపు ఉండటంతో దాదాపు 2.58 లక్షల ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతి అని తెలిపారు. -
కొరియర్ లో టీసీలు
♦ ఫీజు చెల్లించలేదని 22 మంది విద్యార్థులకు ఉద్వాసన ♦ అమృతా విద్యాలయం నిర్వాకం హైదరాబాద్ : ఫీజు చెల్లించలేదన్న కారణంగా నగరంలోని ఓ స్కూల్ 22 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చింది. నేరుగా ఇస్తే తీసుకోరన్న ఉద్దేశంతో కొరియర్ ద్వారా నేరుగా విద్యార్థుల ఇళ్లకు పంపడం గమనార్హం. మహేంద్రహిల్స్లోని అమృత విద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు అమృత స్కూల్లో గెంటివేతకు గురైన విద్యార్థులను తీసుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు పాఠశాలలో గత నాలుగేళ్లుగా ఏటా ఫీజులు పెంచుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులను తగ్గించాలని పట్టుబట్టినా యాజమాన్యం తిరస్కరించిందన్నారు. వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కాగానే.. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కొరియర్లో టీసీలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఈఓ, పాఠశాల విద్య కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవును.. టీసీలు ఇచ్చాం: ప్రిన్సిపాల్ గతేడాది ఫీజులు చెల్లించని 22 మంది విద్యార్దులకు టీసీలను పోస్టు ద్వారా పంపించినట్లు అమృత విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీకుమారి అగీకరించారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ముగిసిన తరువాత వారికి ఫలితాలు వెల్లడించి టీసీలు ఇచ్చామన్నారు. నగరంలో అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోకెల్లా తామే తక్కువ ఫీజు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలు సరికాదని, తమ స్కూల్కు సంబంధించిన ప్రతి రికార్డు డీఈఓ కార్యాలయంలో ఉందన్నారు. -
ఇంత పచ్చపాతమా..?
పాత శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధిష్టానం చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ పల్లెల్లో అభాగ్యుల కడుపు కొడుతోంది. తాజాగా వన సేవకుల నియామకం విషయంలో ఈ విషయం మరోమారు తేట తెల్లమైంది. నందిగాం మండలంలోని ఓ గ్రామంలో వన సేవకుని నియమించాల్సి ఉంది. అయితే ఈ ని యామకానికి నిబంధనలతో పని లేకుండా ఓ టీడీపీ కార్యకర్త భార్యకు పోస్టు కేటాయించారు. వారేమో విధులకు వెళ్లకుండానే అధికారులపై బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు చేసేదేమీ లేక నోరు మెదపడం మానేశారు. ఇది ఒక్క నందిగాం మండలంలోనే కాదు. జిల్లాలో గల ఐదు రేంజ్ ఫారెస్టు పరిధుల్లోనూ జరుగుతున్న వ్యవహారం. ఏంటీ పోస్టు..? స్కూలు విద్యార్థుల అవగాహన కోసం ఫారెస్టు రేంజ్ పరిధిలో ఓ నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో గంగరావి, మహాగని, స్పేధోడియా, దేవకాంచన, ఎర్రతురాయి, పచ్చతురాయి, నిద్రగన్నేరు, వేప, నీలగిరి, టేకు, సరుగుడు తదితర పూల మొక్కలను పెంచుతారు. వీటి పెంపకానికి కేటాయించిన పోస్టే ఈ వన సేవకులు. వీరు నర్సరీలో మొక్కలు పెంపకంతో పాటు శానిటేషన్ పనులు చేయాలి. ప్రభుత్వ సంస్థలకు, రైతులకు ఉచితంగా మొక్క లు ఇవ్వాలి. కానీ ఐదు రే ంజ్ల పరిధిలో అలా జరగడం లేదు. కొన్ని రేంజ్లలో ఇంకా నర్సరీలే ప్రారం భం కాలేదు. వన సేవకులు చేసే పనుల్లో లోపాలపై రేంజ్ అధికారులు ప్రశ్నిస్తే తమపైనే బ్లాక్మెయిలింగ్కు తిరగబడుతున్నారని ఓ రేంజ్ అధికారి తన ఆవేదన వెళ్లగక్కాడు. కార్యకర్తలకే ప్రాధాన్యతా..? * గడిచిన ఏడాది డిసెంబర్ నెలలో అటవీశాఖ ద్వారా నియమితులైన వన సేవకుల్లో సగం కంటే ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, వారి బంధువులే. * జిల్లాలోని 23మండలాల్లో 56 పాఠశాలల్లో నర్సరీ ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ శ్రీకారం చుట్టింది. అందులో కేవలం 43 పాఠశాలల్లోనే స్కూల్ నర్సరీ, వనసేవ కులను నియమించుకున్నారు. మిగిలిన 13 స్కూల్లో నర్సరీలను, వనసేవలకులను ఇంకా నియమించుకోవల్సి ఉంది. పేరుకే మహిళలు... వాస్తవంగా వన సేవకులుగా మహిళలనే ఎంపిక చేసుకోవాలి. అన్ని పనులను వారితోనే చేయాలి. కానీ అటవీ శాఖల్లో ఈ వ్యవహారమంతా విడ్డూరంగా కనిపిస్తోంది. మహిళల పేరు మీద బినామీలుగా పురుషులే సేవకుల అవతారమెత్తుతున్నారు. జీతభత్యాల విషయంలో మాత్రం మహిళల పేరుమీద నెలకు రూ.7,800 జమ చేస్తున్నట్లు రేంజ్ అధికారులు ఖాతాలు చూపిస్తున్నారు. ఆయా రేంజ్ల పరిధిలో గల టీడీపీ సర్పంచ్లే ఈ వ్యవహారమంతటికీ కారణమని వినిపిస్తోంది. పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి.. స్కూల్ నర్సరీ, వన సేవలకులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. కొన్ని రేంజ్లలో ఇంకా నర్సరీ పనులు చేయాల్సి ఉంది. కొంతమంది వనసేవకులు రేంజ్ అధికారులపై బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. వర్షాలు పడే సమయం ఆసన్నమైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. - లోహితాస్యుడు, జిల్లా ఫారెస్ట్ అధికారి -
త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు. -
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!
న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది. పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు. స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో ఈ కామర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు. -
నాలుగు కోట్ల నవ్వులు!
అలవాటుగా ఓ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. యు.ఎస్.లోని డాలస్కు చెందిన క్యాన్ డేస్ పైన్ (37) తన పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు ఏదైనా బహుమతి కొందామని షాపుకెళ్లి అక్కడ ఒక సో బక్కా మాస్క్ (చింపాంజీ లాంటి)ను చూసి ముచ్చటపడి కొనుగోలు చేసింది. ఇంటికి వస్తూ.. కారులో దాన్ని ధరించి ఒక నిమిషం వీడియో తీసి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతే! అది క్షణాల్లో హల్చల్గా మారింది. అత్యధికమంది వీక్షించిన రికార్డును సొంతం చేసింది. 4 కోట్ల 80 లక్షలమంది ఈ ఫన్నీ వీడియోను చూశారు. దీంతో పైన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. పోస్ట్ చేసిన కొద్దినిమిషాల్లోనే విపరీతమైన కామెంట్లతో తన ఇన్బాక్స్ నిండిపోయిందని పైన్ తెలిపింది. లెక్కలేనన్ని ఈ మెయిల్స్ రిసీవ్ చేసుకున్నానంది. ఈ వీడియో చూడడం ద్వారా తమ డిప్రెషన్ మాయమైందని, చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. అయితే స్థానిక చర్చ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పైన్ ఇలాంటి వీడియోలను ఇక ముందు కూడా పోస్ట్ చేయనున్నదట. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. -
31 కేంద్రాల్లో ఎస్సై రాత పరీక్ష
హాజరు కానున్న 21, 250 మంది ‘ఎస్సై’ అభ్యర్థులు వివరాలు వెల్లడించిన సీపీ వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 17న నిర్వహించ నున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 21,250 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
మహిళలకు స్ఫూర్తిగా ఫేస్ బుక్ కథ!
కలలను సాకారం చేసుకునేందుకు వయసుతో పని లేదని చెబుతోంది ముంబైకి చెందిన ఓ మహిళ. ఐదు పదుల వయసులో కాలేజీలో విద్యార్థినిగా చేరి అనుకున్నది సాధించేందుకు నడుం కట్టింది. ఇంటర్ చదివిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసెయ్యడంతో అక్కడే ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తోంది. ఉమ్మడి కుటుంబంలో సంసారం సాగించిన 30 ఏళ్ల తర్వాత కొంత బాధ్యతలు తీరడంతో తన కల సాకారం చేసుకోడానికి తిరిగి ప్రయత్నం ప్రారంభించింది. పట్టుదలతో ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాస్తోంది. 30 ఏళ్ల తర్వాత తాను కాలేజీలో చేరానంటూ 51 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన అనుభవాలను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. కొద్ది గంటల్లోపే ఆమె కృషిని పొగుడుతూ, ఆమెను ప్రోత్సహిస్తూ వేలకొద్దీ షేర్లతోపాటు, ఇబ్బడిముబ్బడిగా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఇంటర్ పూర్తయిన తర్వాత పెళ్లి కావడం, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లడంతో చదువును కొనసాగించలేకపోయానని ఆమె తెలిపింది. అయితే చదువుకోవాలనే కోరిక కారణంగా.. ఏదో కోల్పోయినట్లుగా ఫీలయ్యేదాన్నని, అందుకే చదువుకు వయసుతో సంబంధం లేదని భావించి ప్రస్తుతం కాలేజీలో చేరి డిగ్రీ పరీక్షలు రాస్తున్నట్లు ఆమె ఫేస్ బుక్ పేజీలో తెలిపింది. తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి పెళ్లయి, మరో ఇద్దరు కాలేజీలో చదువుతుండగా ఆమె తిరిగి చదవాలని నిర్ణయించుకొంది. కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు కాలేజీలో విద్యార్థినిగా చేరి, ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఆమె కథ... ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. -
నకిలీల స్థానాల్లో కొత్తవారికి
26మంది డీ ఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన జాబితా చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2014లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కు అర్హత సాధించిన 1,200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఇటీవల విద్యాశాఖ పరిశీలించిన విషయం విధితమే. ఇందులో 26 మంది సర్టిఫికెట్లు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. వారు ఆ జాబితాను పక్కనబెట్టి కొత్త జాబితాను మంగళవారం రాత్రి డీఈవో కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ఆ జాబితాలోని అభ్యర్థులు బుధవారం సాయంత్రం లోగా ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో డీఈవో కార్యాలయానికి చేరుకోవాలని వారి సెల్ఫోన్లకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సందేశం పంపారు. 26 మంది అభ్యర్థులలో ఎస్జీటీలు 18 మంది, ల్యాంగ్వేజ్ పండిట్లు(హిందీ)-01, (తెలుగు)-05, వికలాంగులు - 2 ఉన్నట్లు డీఈవో కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈవో నాగేశ్వరరావు సమక్షంలో డీఎస్సీ సెక్షన్ సూపరింటెండెంట్ పురుషోత్తం, సిబ్బంది కుమార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. -
విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు
విధ్వంసకర విన్స్టన్ తుఫానుతో ఫిజి పౌరులు నిరాశ్రయులయ్యారు. తుఫాను బీభత్సంతో అతలాకుతలమైన ఆ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఫిజి ద్వీపంలో చెలరేగిన శక్తివంతమైన తుఫాను వల్ల సుమారు 20 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిజి తుఫాను సృష్టించిన బీభత్సం ప్రాణ నష్టంతో పాటు... తీవ్ర ఆస్తి, పంట నష్టాన్ని తెచ్చిపెట్టింది. పునరావాస కేంద్రాల్లోని తుఫాన్ బాధితులకు తిరిగి ఆశ్రయం కల్పించే పనులు ప్రారంభించినట్లు ఫసిఫిక్ పశ్చిమ డివిజన్ అధిపతి తెలిపారు. మరో ఐదు రోజుల్లో బాధితులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కమిషనర్ మానస చెప్పారు. ఫిజి ద్వీపాల్లోని తుఫాను బాధిత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ప్రధాన ద్వీపమైన విటి లెవుతో సహా పవర్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. తుఫాను కారణంగా ఫిజి ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ను సోమవారం ఎత్తివేసినప్పటికీ... తక్షణ పునరుద్ధరణ పనులకోసం 30 రోజులపాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రాథమిక సాయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫిజికి 5 మిలియన్ డాలర్ల సాయాన్నిఅందించింది. గృహాలను కోల్పోయిన తుఫాన్ బాధితులకు ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి తక్షణ సాయం అందించేందుకు ఆ నిధులను వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జూలీ బిషప్ చెప్పారు. ఫిజినుంచీ వర్జిన్ ఆస్ట్రేలియా, ఎయిర్ న్యూజిల్యాండ్, ఫిజి ఎయిర్వేస్ విమానాలను ఇప్పటికే పునరుద్ధరించాయని, అయితే జెట్ స్టార్ మాత్రం మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను వల్ల ఫిజి సందర్శకులకు ఎటువంటి ముప్పు లేదని, వారంతా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని ఫిజి టూరిజం మంత్రి ఫయాజ్ సిద్ధిక్.. ప్రభుత్వ ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 'విటి లెవు' ప్రాంతంలో అత్యధికంగా ఉన్న హోటళ్లకు ఎటువంటి నష్టం జరగలేదని, మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫేస్బుక్లో చేసిన ఆ పోస్టే..
న్యూ ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఏ విధంగా వల వేస్తున్నారనే విషయాన్ని తెలియజేసే ఉదంతం ఇది. ఉగ్రదాడులకు కుట్ర పన్ని అరెస్టైన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి మహ్మద్ అక్లాక్ విచారణలో.. అతను ఉగ్రవాదులతో ఏ విధంగా సంబంధాలు మొదలెట్టాడనే విషయం వెల్లడైంది. ఫేస్బుక్లో అక్లాక్ చేసిన ఒకే ఒక పోస్టు అతన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దగ్గర చేసిందని అధికారులు గుర్తించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్లాక్ 2014 డిసెంబర్ 6న ఫేస్బుక్లో దీనిపై ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. దానికి సోషల్ మీడియాలో వందలాది లైక్స్, హిట్స్ వచ్చాయి. అంతే కాదు ఆ పోస్టు అతన్ని ఐఎస్ ఉగ్రవాదులకు దగ్గర చేసి అతని జీవితాన్నే మార్చేసింది. అక్లాక్ పోస్టు చేసిన మరుసటి రోజు ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన యూసుఫ్ అనే వ్యక్తి నుండి ఓ మెసేజ్ అందుకున్నాడు. ఆ మెసేజ్లో అక్లాక్ను తెలివైన, దైర్యసాహసాలు కలిగిన వాడిగా పొగడ్తలతో ముంచెత్తిన యూసుఫ్.. అతన్ని ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపేలా ప్రేరేపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. యూసుఫ్ను ఇస్లామిక్ స్టేట్ కమాండర్గా అధికారులు అనుమానిస్తున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరపున ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడటానికి అక్లాక్ అంగీకరించినట్లు తేలింది. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్లాక్ను ఇస్లామక్ స్టేట్ ఉగ్రవాదులు అక్లాక్ను సంస్థలో చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నట్లు గుర్తించిన మరో నలుగురు విద్యార్థులు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో సంబంధాలు మొదలెట్టారని అధికారుల విచారణలో తేలడంతో సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
భారీగా భర్తీ
కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి పలు పోస్టులు మంజూరు ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలను విస్తృతం చేసేందు కు అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు పోస్టులు కేటారుుస్తూ మంగళవారం జీవో నంబర్ ఎంఎస్ 5 విడుదల చేసింది. -
ఆదిలాబాద్ హెడ్పోస్టాఫీస్లో ఏటీఎం ప్రారంభం