Profits
-
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
బ్యాంకుల లాభాలకు గండి!
మొండిబకాయిల ప్రభావం ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బ్యాంకింగ్ (Banks)లాభదాయకతపై ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్ సంస్థ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ లాభదాయకత 2024–25లో ‘‘పీక్’’ స్థాయిలో ఉండగా, 2025–26లో ఇది దిగివచ్చే అవకాశాలు అధికమని వివరించింది. రిటైల్ రంగం నుంచి ప్రధానంగా మొండి బకాయిల సవాళ్లు తలెత్తే వీలుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ అండ్ డైరెక్టర్ కరణ్ గుప్తా నివేదికలో వెల్లడించారు. నివేదికలోని ముఖ్యాంశాలు... » మొండి బకాయిలు నియంత్రణ స్థాయిలోనే ఉంటాయి. రూ.50,000 కంటే తక్కువ రిటైల్ సురక్షిత రుణాలు బ్యాంకుల రుణాల మొత్తంలో 0.4 శాతంగా ఉన్నాయి. 11 శాతానికి పైగా వడ్డీ రేటు కలిగిన రుణాలు మొత్తం రుణాల్లో 3.6 శాతంగా ఉన్నాయి. » 2024–25లో రుణ వృద్ధి మందగించింది. 2023–24తో పోల్చితే ఈ రేటు 15 శాతం నుండి 13–13.5 శాతానికి తగ్గే వీలుంది. » బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2025–26లో 0.10 శాతం తగ్గిపోతుంది. డిపాజిట్ వడ్డీ రేటు పెంపు, కొత్త అకౌంటింగ్ విధానాలు దీనికి కారణంగా ఉంటాయి. » 2025–25లో రుణ–డిపాజిట్ వృద్ధి మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రాజెక్ట్ ఫైనాన్స్ కొత్త నిబంధనలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, క్రెడిట్ నష్టాల అంచనా విధానం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను సృష్టిస్తాయి. » 2024–25లో మైక్రోఫైనాన్స్ ఆస్తుల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. 2024–25లో ఇది 12 శాతానికి పెరుగుతుంది. గ్రామీణ ఎకానమీ బలోపేతం మైక్రోఫైనాన్స్ రంగానికి లాభదాయకంగా ఉండొచ్చు. శక్తికాంతదాస్ విధానాలు భేష్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ తీసుకున్న సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలంగా మార్చాయని నివేదిక పేర్కొనడం గమనార్హం. అయితే కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ నిబంధనల్లో పూర్తిగా కాకున్నా, కొంతమేర సరళతరం అయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.వ్యక్తిగత రుణాలు, సురక్షిత వ్యాపార రుణాలు, మైక్రోఫైనాన్స్ రంగంపై అవుట్లుక్ ‘స్థిరత్వం’ నుండి ‘దుర్వినియోగ పరిస్థితి‘ గా మారుతోందని నివేదిక పేర్కొంది. బ్యాంకులు, నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఇండ్రా రేటింగ్ తన అవుట్లుక్ను కొనసాగించింది. అయితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని అసెట్ సెగ్మెంట్లపై అవుట్లుక్ను సవరించింది. -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతంముడి సరుకుల ధరల పెరుగుదల..ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. -
‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్టెన్ వీరే
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాటా సాధించిన టాప్టెన్ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ–1కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు. మందమర్రి కేకే–5కు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎస్ఆర్పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్కు చెందిన ఫోర్మెన్ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్కట్టర్ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనికి చెందిన ఓవర్మెన్ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రూ.2.88 లక్షలు సాధించారు. వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి సోమవారం సీఅండ్ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్!
దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్ పేఔట్) విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. వార్షికంగా పేఔట్ దాదాపు 5 శాతం నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్ ప్రకటించిన 999 లిస్టెడ్ కంపెనీలను పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం.. ముంబై: దేశీ లిస్టెడ్ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! కోవిడ్–19 ముందు.. గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 2017లో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్ పేఔట్ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్ పేఔట్ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్టైమ్ గరిష్టం 41 శాతాన్ని తాకింది. కారణాలు.. సగటున పేఔట్ రేషియో నీరసించడానికి మార్కెట్ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో డిమాండ్ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఒక్క కఠిన నిర్ణయం.. నెట్ఫ్లిక్స్కు రికార్డ్ లాభాలు!
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరగనున్నాయి. ‘వన్ డే’ పాపులర్ షో విడుదల, పాస్వర్డ్ షేరింగ్ కట్టడి చర్యల తర్వాత నెట్ఫ్లిక్స్ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. 2020 కోవిడ్ లాక్డౌన్ల తర్వాత సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్ఫ్లిక్స్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్వర్డ్ షేరింగ్ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్ఫ్లిక్స్కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్ (Refinitiv) డేటా ప్రకారం.. నెట్ఫ్లిక్స్ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్లో నెట్ఫ్లిక్స్ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ రెండో క్వార్టర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులను గమనించవచ్చు. నవంబర్ 8న(బుధవారం), 10న(శుక్రవారం) ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఇటీవల మార్కెట్ల ట్రేడింగ్పై పరిమిత ప్రభావాన్ని చూపుతోంది. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారితే మార్కెట్ మూమెంటం మరింత ఊపందుకుంటుంది. నిఫ్టీకి ఎగువన 19,330 – 19,440 శ్రేణిలో కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,060 వద్ద కీలక మద్దతు లభించవచ్చు’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. రెండో క్వార్టర్ ఫలితాలపై కన్ను గత వారాంతంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, డెల్హవరీ, వేదాంతలు వెల్లడించిన ఆర్థిక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 సూచీలోని భాగమైన దివీస్ ల్యాక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీలతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 2400 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్తో పాటు మరికొన్ని దేశాల పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. చైనా అక్టోబర్ వాణిజ్య లోటు మంగళవారం, యూరోజోన్ సెపె్టంబర్ రిటైల్ విక్రయాలు బుధవారం వెల్లడి కానున్నాయి. అమెరికా వారంతాపు నిరుద్యోగ డేటా గురువారం ప్రకటించనుంది. బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు డేటా శుక్రవారం, అదేరోజున భారత సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా ద్రవ్యోల్బణం, వాహన విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండు లిస్టింగులు, 3 ఐపీఓలు సెల్లో వరల్డ్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. అదే రోజున ఐటీ ఆధారిత సొల్యూషన్ కంపెనీ ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ ఐపీఓ ప్రారంభం కానుంది. హొనాసా కన్జూమర్ షేర్ల లిస్టింగ్ మంగళవారం(నవంబర్ 7న) ఉంది. ఈ రోజే అస్క్ ఆటోమోటివ్ ఐపీఓ, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ల ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. కొనసాగుతున్న ఎఫ్పీఐల అమ్మకాలు నవంబర్లో 3 సెషన్లలో రూ. 3,400 కోట్లు ఉపసంహరణ వడ్డీ రేట్ల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో రాజకీయ..¿ౌగోళిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. నవంబర్లో తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే రూ. 3,412 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్పీఐలు ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, అంతకు ముందు సెపె్టంబర్లో రూ. 14,767 కోట్ల మేర విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. దానికన్నా ముందు మార్చ్ నుంచి ఆగస్టు వరకు వరుసగా ఆరు నెలల్లో ఎఫ్పీఐలు ఏకంగా రూ. 1.74 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. బాండ్ ఈల్డ్ల (రాబడులు) పెరుగుదలే అమ్మకాలకు ప్రధాన కారణమని, అయితే వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్ ఉదార వైఖరి తీసుకోవడంతో ఈల్డ్లు తిరుగుముఖం పట్టి, ఎఫ్పీఐల విక్రయాలకు కాస్త అడ్డుకట్ట పడొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. మరోవైపు, డెట్ మార్కెట్లోకి అక్టోబర్లో రూ. 6,381 కోట్లు, నవంబర్ తొలి నాళ్లలో రూ. 1,984 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూల పరిస్థితులు వచ్చే వరకు నిధులను స్వల్పకాలికంగా భారతీయ డెట్ సాధనాలకు మళ్లించాలని ఇన్వెస్టర్లు భావిస్తుండటం ఇందుకు కారణం కావచ్చని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు నికరంగా ఈక్విటీల్లోకి రూ. 92,560 కోట్లు, డెట్లోకి రూ. 37,485 కోట్ల మేర వచ్చాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు అత్యధికంగా పెట్టుబడులు దక్కించుకున్నాయి. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలకు బ్రేక్! లాభాల్లోకి స్టాక్మార్కెట్లు
today stock market opening: వరుస నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 65,589 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,535 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజస్, నెస్లే, హెచ్యూఎల్, ఐచర్ మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మ్యూచుఫల్ ఫండ్స్లో పెట్టుబడులు ఎలా ఉండాలి?
ఈ వారం ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 19600 స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో హెక్సాగాన్ కాపిటల్కు చెందిన శ్రీకాంత్ భగవత్ తో కారుణ్యరావు సంభాషణ విందాం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉండబోతోంది. నిఫ్టీతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు బాగా పెరిగాయి. క్విక్ రాలీతోపాటు వాల్యూయేషన్లను పరిశీలించాలి. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచింది. అలాగే బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తూ డెట్ ఫండ్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? రిటర్న్న్ ఎలా ఉంటాయి అంటే మిగతా అన్ని పరిస్థితులు బావుంటే.. మీడియం టర్మ్ డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు మంచి ఫలితాలుండే అవకాశాలన్నాయి. క్రెడిట్ గ్రోత్ రికవరీ అవుతున్న తరుణంలో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే డెట్ ఫండ్స్లో పెట్టుబడుల వైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. హైబ్రిడ్ ఫండ్స్లో టాక్స్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ పండ్స్తో పోలిస్తే డెట్స్ ఫండ్స్తో రిస్క్ ఎలా ఉంటుంది? అనేది పరిశీలిస్తే మ్యూచుఫల్ డెట్ ఫండ్స్ ఈల్డ్స్ బావున్నాయి. ఇంట్రరెస్ట్, క్రెడిట్, లిక్విడిటీ అనే మూడు రిస్క్లు ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు పడతాయి. లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కరెంట్ మార్కెట్లో లార్జ్ క్యాప్లో మీడియం టెర్మ ఫండ్ బావుంటుంది. పీఎస్యూ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు మంచిది. (Disclaimer: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మహిళా మార్ట్.. లాభాల్లో బెస్ట్
సాక్షి, అమరావతి : పట్టణాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అందించిన సాయంతో జగనన్న మహిళా మార్ట్లను నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఏర్పాటు చేసిన మార్ట్లు నెలకు సగటున రూ.79.40 లక్షల వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. పొదుపు సంఘాల్లోని మహిళలు కేవలం రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టి.. తమ ఇంటికి అవసరమైన సరుకులను డిస్కౌంట్ ధరకు పొందుతూనే రోజువారీ అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.19 లక్షల నికర లాభాలను ఆర్జిస్తున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాల్లోని 37,308 మంది మహిళలు మెప్మా ఎండీ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మార్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఒక్కో సభ్యురాలు కేవలం రూ.150 చొప్పున రూ.55,96,200 పెట్టుబడిగా పెట్టి గత ఏడాది మే నెలలో జగనన్న మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏడాదిన్నరలో రూ.4.89 కోట్ల అమ్మకాలు చేసి, రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటాదారులకు రూ.20 లక్షల మొత్తాన్ని డివిడెంట్గా పంచి.. మిగిలిన రూ.10 లక్షలను సభ్యుల అంగీకారంతో మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ఆర్థిక స్వావలంబన దిశగా.. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా మహిళా సమాఖ్యలు ఉన్నా వీరు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకునేవారు. వారికి మెరుగైన ఆర్థిక స్వావలంబన ఉండాలని, సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలన్న లక్ష్యంతో ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి సమాఖ్య సభ్యులను సూపర్ మార్కెట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారు. ఆసక్తి గల సభ్యులతో రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టించి ‘జగనన్న మహిళా మార్ట్’లను ఏర్పాటు చేశారు. 2021 జనవరిలో పులివెందులలో తొలి మార్ట్ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ స్టోర్ రూ.2.50 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు రూ.18 లక్షల లాభాన్ని ఆర్జించింది. దాంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించారు. ఇప్పుడు తిరుపతి పట్టణంలోని మహిళా మార్ట్ వాటాదారులు డివిడెంట్ అందుకోనున్నారు. కాగా.. ఈ రెండేళ్ల కాలంలో పులివెందుల, రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, మారా>్కపురం, ఒంగోలు పట్టణాల్లో 10 జగనన్న మహిళా మార్ట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇది సమైక్య విజయం పెట్టుబడిదారులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు మహిళలే. మార్ట్ల నిర్వహణ కోసం మెప్మా ఆధ్వర్యంలోశిక్షణ ఇచ్చాం. మార్ట్ ఏర్పాటు, నిర్వహణ ప్రతి దశను ఎస్హెచ్జీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏడాదిన్నలో రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఇందులోని సభ్యులకు రూ.20 లక్షల డివిడెండ్ చెల్లించి.. మిగతా మొత్తంతో సభ్యుల అంగీకారంతో కొత్త వ్యాపారంలో ప్రారంభిస్తాం. ఇందులోనూ మహిళలే సభ్యులుగా ఉండి వచ్చిన లాభాలను పంచుకుంటారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేలా చేయడమే మెప్మా లక్ష్యం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
నాటుకోళ్ల పెంపకం.. నెలకు రూ.80వేలకు పైగా లాభాలు
పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది. అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం. చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్ కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం. అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి. వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం. -
గణేషుడు నేర్పే పెట్టుబడి పాఠాల గురించి మీకు తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆధ్యాత్మికంగానే కాకుండా మనం ఆర్థికంగా, పెట్టుబడులపరంగా కూడా ఎలా మసలుకోవాలో పాఠాలు నేర్పుతాడు. ఆయన గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఏనుగు తల జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద చెవులు దేన్నైనా ఏకాగ్రచిత్తంతో వినాల్సిన ఆవశ్యకతను సూచిస్తాయి. ఆయన శరీరం బలాన్ని, శక్తిని అలాగే ఆయన వాహనమైన ఎలుక.. నమ్రతను ప్రతిబింబిస్తాయి. వినాయకుడి విగ్రహం చూస్తే ఒక దంతం విరిగి ఉంటుంది. పురాణాల ప్రకారం వేద వ్యాస మహర్షి, మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు .. తనకు వచ్చే ఆలోచనలను అంతే వేగంగా అక్షరబద్ధం చేయగలిగే వారు ఎవరు ఉన్నారని అన్వేషించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని మహాగణపతిని కోరాడు. వినాయకుడు ఒక సాధారణ పక్షి ఈకతో రాయడానికి ఉపక్రమించగా, అది మధ్యలో విరిగిపోయింది. కానీ, మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడక, ఆయన తన దంతాన్ని విరిచి, దానితో రాయడాన్ని కొనసాగించాడని ప్రతీతి. ఆయన నిబద్ధత, అంకితభావం కారణంగానే మనకు అమూల్యమైన మహాభారతం లభించింది. నిలకడతత్వం, అంకితభావంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలోనూ, జీవితంలోనూ మనం ఎన్నింటినో చాలా ఆసక్తిగా ప్రారంభిస్తాం. కానీ ఏదైనా చిన్న అవాంతరం ఎదురుకాగానే వెంటనే విరమించుకుంటాం. ఉదాహరణకు, ఈ ఏడాది కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తీర్మానించుకుని, ప్రతి ఏడాది జనవరి 1న జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతాం. ఫిట్నెస్ లక్ష్యాన్ని అటకెక్కిస్తాం. పెట్టుబడుల విషయంలోనూ అలాగే చేస్తుంటాం. ఏదో ఆర్థిక లక్ష్యం పెట్టుకుని పెట్టుబడుల ప్రస్థానం మొదలెడతాం. కానీ మార్కెట్లు ఏకాస్త ఒడిదుడుకులకు లోనైనా, పడిపోయినా వెంటనే మన సిప్లను ఆపేస్తాం. అంతేగాకుండా ముందుగానే మన పెట్టుబడులను వెనక్కి కూడా తీసేసుకుంటాం. సిప్లను మధ్యలోనే ఆపేయడం వల్ల మనకు రావాల్సిన ప్రయోజనాలు దక్కవు. అలా కాకుండా మిగతా సమస్యలు ఎన్ని ఎదురైనా మనం జిమ్కు మానకుండా వెళ్లడం కొనసాగించినా లేదా మార్కెట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడులను కొనసాగించినా ఎలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి? దీనిపై స్పష్టత కోసం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మార్కెట్లు పడిన వెంటనే ఎవరైనా తమ పెట్టుబడులను మధ్యలోనే ఆపేస్తే ఏం జరుగుతుంది, ఆపకుండా కొనసాగించి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. 2018 సెప్టెంబర్ 1 నుంచి రాము ప్రతి నెలా రూ. 2,000 చొప్పున సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించాడు. అయితే, 2020 మార్చిలో ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. అలాంటప్పుడు అతను తన పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకుని ఫిక్సిడ్ డిపాజిట్లలో పెట్టి ఉంటే ఏమై ఉండేది? అలా చేయకుండా పెట్టుబడులను కొనసాగించి ఉంటే ఎలా ఉండేది? ఒకసారి పరిశీలిద్దాం. (ఇందుకోసం నిఫ్టీ 50 టీఆర్ ఇండెక్స్ను ప్రామాణికంగా తీసుకుందాం.) 2023 ఆగస్టు 31 నాటి డేటా ప్రకారం మూలం:ఎన్ఎస్ఈ సూచీలు, ఎస్బీఐ వెబ్సైట్, అంతర్గత రీసెర్చ్ ఏ తుది మొత్తాన్ని 28–03–2020 నుంచి 3 ఏళ్లకు లెక్కించేందుకు ఎస్బీఐ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు (5.7 శాతం) పరిగణనలోకి తీసుకున్నాం. చూశారుగా, 2020లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రాము తన సిప్ను కొనసాగించి ఉంటే ఇప్పుడది సుమారు రూ. 1.76 లక్షలు అయి ఉండేది. సంపద సృష్టిలో నిలకడగా వ్యవహరించడం ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాబట్టి మిగతా పనులెన్ని వచ్చి పడినా జిమ్కు వెళ్లడం కొనసాగించి ఉన్నా, లేక మార్కెట్ హెచ్చుతగ్గులకు వెరవకుండా పెట్టుబడులను కొనసాగించి ఉన్నా ఏం జరిగి ఉండేది? మనం మరింత ఫిట్గా, మరింత ఆరోగ్యంగా ఉండేవాళ్లం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన పెట్టుబడుల విషయంలో జై గణేశా అంటూ ముందుకు సాగుదాం! -
రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్.. ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– వెంకటరమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య పెట్టుబడులను వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం పథకాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్క్యాప్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్క్యాప్నకు కేటాయించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ రియల్ ఎస్టేట్ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లును ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకునే విషయం కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. మరో కోణం నుంచి చూస్తే.. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే క్రమం తప్పకుండా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా ఉండొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. -
సాక్షి మనీ మంత్రా: వారెవ్వా..నిఫ్టీ! ఆల్టైం రికార్డ్
Today StockMarket Nifty above 20k దేశీయస్టాక్మార్కెట్లు జోరుమీద ఉన్నాయి. కీలక సూచీలు రెండూ దలాల్స్ట్రీట్లో మెరుపులు మెరిపించాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి పుంజు కున్నాయి. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 67,467 వద్ద ముగియగా, నిఫ్టీ 77 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 20,070 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ చరిత్రలో తొలిసిర 20వేలకు ఎగువన ముగియడం విశేషం. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభపడ్డాయి.ముఖ్యంగా ఆగస్టులో దేశీయ CPI ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చల్లబడడం, పారిశ్రామిక ఉత్పత్తి డేటా భారత ఆర్థికవ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. దాదాపు అన్ని రంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. గ్రాసిం, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, ఎయిర్టెల్, టైటన్ టాప్ గెయినర్స్గానూ, జియో ఫైనాన్షియల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ఎం లార్సెన్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: గత ముగింపు 82.92తో పోలిస్తే డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టంతో 82.98 వద్ద ముగిసింది. -
జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: అధిక వాల్యూయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాల్ని కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 412 పాయింట్లు పెరిగి 67,539 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 20,110 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. చివరికి 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద నిలిచింది. యుటిలిటీ, పవర్, టెలికం, రియల్టి, ఆటో, ఆయిల్అండ్గ్యాస్, మౌలిక రంగ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3% చొప్పున నష్టపోయాయి. ఇరు సూచీలకు ఈ ఏడాది అతిపెద్ద పతనం కావడం గమనార్హం. చివరి రోజు నాటికి ఈఎంఎస్ లిమిటెడ్ ఐపీఓ 75.28 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.07 కోట్ల షేర్లను జారీ చేయగా, 81.21 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 29.79 రెట్లు సబ్ర్స్కిప్షన్ సాధించాయి. -
ఆర్టీసీలో అనగనగా ఓ రోజు.. సెప్టెంబర్ 11
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేవలం నాలుగు డిపోలు మాత్రమే ఖర్చులను మించి ఆదాయాన్ని సాధించాయన్న విషయం అధికారులు ఆయన ముందుంచారు. తాజాగా ఆర్టీసీ చేసిన ఫీట్ ఏంటంటే.. ఆర్టీసీలో 96 డిపోలు ఉండగా, గత సోమవారం (సెప్టెంబరు 11) రికార్డు స్థాయిలో 90 డిపోలు నిర్వహణ ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందాయి. ఇక ఈనెల సెప్టెంబర్ 11వ తేదీ వరకు వరసగా 71 డిపోలు లాభాల(నిర్వహణ ఖర్చులను మించి)ను ఆర్జించాయి. టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ రెండు ఫీట్లు నమోదయ్యాయి. ప్రభుత్వంలో విలీనం అవుతున్న నేపథ్యంలో మంచి ఊపుమీద ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కలిసికట్టుగా, పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ రికార్డులను సాధించటం విశేషం. ఫలితాన్నిస్తోన్న ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’ ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో కొద్ది రోజులుగా ఆర్టీసీ అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఇప్పుడు ఈ రూపంలో సరికొత్త ఫలితాలని అందించింది. సాధారణంగా సోమవారం రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ సోమవారాల్లో రూ.16–రూ.17 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఈనెల 11న (చివరి ‘శుభముహూర్త’సోమవారం) ఏకంగా రూ.20.22 కోట్ల ఆదాయం నమోదైంది. ♦ సోమవారం రోజున ముషీరాబాద్–2, ఉట్నూరు, కోస్గి, భైంసా, మిధాని, నారాయణ్ఖేడ్ డిపోలు మినహా మిగతా 90 డిపోలు నిర్వహణ ఖర్చులను మించి ఆదాయాన్ని పొందాయి. నారాయణఖేడ్ డిపో ఖర్చు కంటే కేవలం రూ.వేయి మాత్రమే తక్కువ ఆదాయాన్ని పొందింది. నష్టాలు పొందిన మిగతా ఐదు డిపోలు కూడా రూ.22 వేల నుంచి రూ.1.45 లక్షల నష్టాన్ని మాత్రమే పొందటం గమనార్హం. ♦ ఆర్టీసీలో సాధారణంగా కొన్ని బస్సులను స్పేర్లో ఉంచుతారు. మరికొన్ని మరమ్మతు కోసం పక్కన పెడతారు. శ్రావణ శుభముహూర్తాల నేపథ్యంలో అస్సలు నడవలేని డొక్కు బస్సులు తప్ప అన్నింటినీ బాగుచేసి రోడ్డెక్కించారు. 11న ఆక్యుపెన్సీ రేషియో 85.19 శాతంగా నమో దైంది. సాధారణ రోజులతో పోలిస్తే గత పది రోజుల్లో కనీసం 5 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ పేర్కొంటోంది. ♦ కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కొన్ని రూట్లలో తక్కువగా ఉంటుంది. డెడికేటెడ్ సరీ్వ సుల పేరుతో, ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండే మార్గాల్లోనూ బస్సులు తిప్పే అలవాటు ఉండేది. ఇప్పుడు, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఎటు ఉందో ఆయా మార్గాల్లోనే ఎక్కువ బస్సులు తిప్పుతున్నారు. గత పక్షం రోజులుగా రోజువారీ ఆదాయం దాదాపు రూ.కోటిన్నర మేర పెరిగింది. ♦ ఇటీవలే దాదాపు 650 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, 200 డీలక్స్ బస్సులు చేతికందాయి. వాటిని పూర్తి సామర్ధ్యంతో తిప్పుతున్నారు. సాధారణ రోజుల్లో 28 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పుతుండగా 11న 34 లక్షల కి.మీ. తిప్పారు. ♦ ఇతర సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రధాన పాయింట్ల వద్ద వినియోగించారు. దీనివల్ల సమయానుకూలంగా బస్సులు, రావటం, వచ్చిన బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కేలా చూడటం, ప్రైవేటు వాహనాల వైపు వెళ్లేవారిని మళ్లించటం లాంటివి జరిగాయి. ♦ సెలవులను నియంత్రించి వీలైనంతమంది సిబ్బంది విధుల్లో ఉండేలా చూశారు. -
Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. 324 ఎకరాల్లో బొప్పాయి సాగు జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది. – దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
పొగాకు రైతు ఇంట సిరుల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది. భారీగా పెరిగిన ఉత్పత్తి .. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్ఎల్ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు. వీటిలో ఎస్బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్ఎల్ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది. రికార్డు ధరలు ఈ ఏడాదే.. గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది. అయితే ఈ ఏడాది గ్రేడ్లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం. రెండింతలైన బ్యారన్ కౌలు.. ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది. ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకున్న ఒక్క బ్యారెన్తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు. పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్లో నేరుగా మార్క్ఫెడ్ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది. దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు. -
భారీగా పెరిగిన లైఫ్స్టైల్ లాభం
న్యూఢిల్లీ: రిటైల్ స్టోర్ చైన్ లైఫ్స్టైల్ ఇంటర్నేషనల్ గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 160 శాతం అధికంగా రూ. 700 కోట్ల నికర లాభం ఆర్జించింది. దుబాయ్కు చెందిన రిటైల్, ఆతిథ్య రంగ సంస్థ ల్యాండ్మార్క్ గ్రూప్నకు చెందిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం 50 శాతం జంప్ చేసింది. రూ. 11,672 కోట్లను తాకింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 10,877 కోట్ల కు చేరాయి. కాగా.. అంతక్రితం ఏడాది (2021 –22)లో రూ. 7,806 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 269 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ లైఫ్స్టైల్ స్టోర్స్(భారీ డిపార్ట్మెంటల్ విభాగం)తోపాటు, గృహాలంకరణ విభాగంలో హోమ్ సెంటర్, ఫ్యాషన్ చైన్లో మ్యాక్స్ బ్రాండ్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. -
ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్వోఎఫ్లను ఆయా ఫండ్స్ హౌస్లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్వోఎఫ్లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్వోఎఫ్లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్వోఎఫ్లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్వోఎఫ్లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్వోఎఫ్లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్లెట్లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
వర్షాల్లోనూ పెట్టుబడులకు రక్షణ
ఎకానమీ, పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి నిశితంగా పరిశీలించే అంశాల్లో రుతుపవనాలు, ‘‘సాధారణ’’ వర్షపాతం గణాంకాలు కూడా ఉంటాయి. నైరుతి రుతుపవనాలతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇటు ఖరీఫ్, అటు రబీ రెండు పంటలకు అవసరమయ్యే మొత్తం నీటి వనరుల్లో దాదాపు 75 శాతం భాగాన్ని ఇవి అందిస్తాయి. ఖరీఫ్ పంటల సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు, రబీ పంటల సీజన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటలపై నేరుగా ప్రభావం చూపడమే కాకుండా.. తదుపరి రబీ పంటల కోసం వినియోగించే నీరుని రిజర్వాయర్లు, చెరువులు మొదలైన వాటిల్లో నిల్వ చేసుకునేంతగా వర్షాలనిస్తాయి. ఇలాంటి వర్షాలు అటు పంటలపైనే కాదు మన పెట్టుబడుల పోర్ట్ఫోలియోనూ ప్రభావితం చేస్తాయి. ఎలాగంటే... ద్రవ్యోల్బణం: వ్యవసాయోత్పత్తిపై వర్షాల ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. బియ్యం, సోయాబీన్, చెరకు, నూనెగింజలు మొదలైన వాటి దిగుబడిని వర్షం ప్రభావితం చేస్తుంది. వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండక.. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి వస్తువుల ధరలు : తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతరత్రా పంటలతో వివిధ పరిశ్రమలకు అవసరమైన ముడి వస్తువులు సమకూరుతాయి. వ్యవసాయోత్పత్తి ప్రభావం అటు ముడి వస్తువుల రేట్లపైనా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటు: రుతుపవనాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయి. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై ఆధారపడే కంపెనీల ధరలు, రంగాలపైనా మీద ప్రభావం పడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ (ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు), ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి రంగాలు వీటిలో ఉంటాయి. ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు.. అగ్రి–ఎకానమీకి, మార్కెట్ సెంటిమెంటుకి రుతుపవనాలు ముఖ్యమే అయినప్పటికీ.. గత కొన్నేళ్లుగా మొత్తం మీద ఎకానమీపై వాటి ప్రభావం గణనీయంగా తగ్గింది. స్టాక్ మార్కెట్ కదలికలను ఏ ఒక్క అంశమో ప్రభావితం చేయలేవు. ఎఫ్ఐఐ పెట్టుబడులు, వడ్డీ రేట్లు, కార్పొరేట్ ఫలితాలు, భౌగోళికరాజకీయాంశాలు, రుతుపవనాలు మొదలైనవన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి వర్షపాతం గురించి అంచనాలు వేసుకోవడం, వాటిని బట్టి స్పందించడం కాకుండా.. ఇన్వెస్టర్లు సరైన ఆర్థిక ప్రణాళికలను వేసుకుని దానికి కట్టుబడి ఉండటం ముఖ్యం. ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవడంలో సహాయం అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజరును సంప్రదించడం శ్రేయస్కరం. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్స్ ఇటీవలి కాలంలో మంచి ర్యాలీ చేయడాన్ని చూశాం. దీర్ఘకాలంలో లార్జ్క్యాప్తో పోలిస్తే మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ ఎక్కువ రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకే స్మాల్క్యాప్, మిడ్క్యాప్ అనుకూలంగా ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం వరకు మిడ్, స్మాల్క్యాప్ విభాగాలకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా స్మాల్క్యాప్ విభాగంలో దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం కూడా ఒకటి. కనుక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇది స్మాల్క్యాప్ పథకమే అయినా మిడ్, స్మాల్క్యాప్నకు సమ ప్రాధాన్యం ఇస్తోంది. పనితీరు ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం పనితీరుకు బీఎస్ఈ 250 స్మాల్క్యాప్ టీఆర్ఐ రాబడి ప్రామాణికం. బీఎస్ఈ 250 స్మాల్క్యాప్ సూచీతో పోలిస్తే ఎస్బీఐ స్మాల్క్యాప్ కొన్ని కాలాల్లో మెరుగైన పనితీరు చూపించింది. ముఖ్యంగా ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బీఎస్ఈ 250 స్మాల్క్యాప్ కంటే ఈ పథకమే అధిక రాబడులు అందించింది. ఐదేళ్లలోపు చూస్తే ప్రామాణిక సూచీ కంటే వెనుకబడింది. ఈ పథకంలో అధిక శాతం పెట్టుబడులు మిడ్క్యాప్లో ఉన్నందున ప్రామాణిక సూచితో పోల్చుకోవడం అంత అర్థవంతంగా ఉండదు. కనీసం ఏడేళ్లు అంతకుమించిన దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకంలో నికరంగా 20 రాబడిని ఇచ్చింది. కానీ, బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఇదే కాలంలో 29 శాతం పెరిగింది. ఇక మూడేళ్ల కాలంలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ పథకం వార్షికంగా 36 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 18.87 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఏడేళ్లలో ఈ పథకంలో రాబడి 21 శాతం, పదేళ్లలో 27 శాతం చొప్పున ఉంది. కానీ బీఎస్ఈ స్మాల్క్యాప్ 250 సూచీ రాబడి ఐదేళ్లలో 14.59 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 19 శాతం చొప్పునే ఉంది. ఇక ఈ పథకం ఆరంభమైన 2009 సెప్టెంబర్ నుంచి చూస్తే ఏటా 20 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం నష్టాలను తగ్గించే విధంగా పనిచేసింది. అంతేకాదు 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో స్మాల్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,625 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్ఫోలియోని గమనించినట్టయితే 94 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఇది పేరుకు స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్క్యాప్ పెట్టుబడులు 38.57 శాతంగానే ఉన్నాయి. మిడ్క్యాప్లో 60 శాతం ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు ఒక శాతం కంటే తక్కువే ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 54 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 16.38 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ రంగానికి 13.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 13.30 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 7.88 శాతం, మెటల్స్, మైనింగ్ కంపెనీలకు 7.86 శాతం, కెమికల్స్ కంపెనీలకు 6.97 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. -
ప్రభుత్వ బ్యాంకుల లాభాల జోరు..క్యూ1 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపాయి. మొత్తం 12 సంస్థలు ఉమ్మడిగా రూ. 34,774 కోట్ల నికర లాభం ఆర్జించాయి. గతేడాది(2022–23) క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 15,306 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. అధిక వడ్డీ రేట్ల పరిస్థితులు ఇందుకు సహకరించాయి. రుణ రేట్ల సవరణ కారణంగా పలు బ్యాంకుల వడ్డీ మార్జిన్లు బలపడ్డాయి. వెరసి నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3 శాతానికిపైనే నమోదయ్యాయి. బీవోఎం అదుర్స్ పీఎస్యూ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఐఎం అత్యధికంగా 3.86 శాతానికి చేరగా.. సెంట్రల్ బ్యాంక్ 3.62 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.61 శాతం మార్జిన్లను సాధించాయి. నాలుగు సంస్థలు 100 శాతానికిపైగా నికర లాభంలో వృద్ధిని అందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 307 శాతం అధికంగా రూ. 1,255 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ బాటలో నంబర్ వన్ సంస్థ ఎస్బీఐ నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో రికార్డ్కాగా.. మొత్తం పీఎస్యూ బ్యాంకుల లాభాల్లో 50 శాతం వాటాను ఆక్రమించింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 176 శాతం జంప్ చేసి రూ. 1,551 కోట్లకు చేరింది. గతేడాది మొత్తం లాభాల(రూ. 1.05 లక్షల కోట్లు)లోనూ ఎస్బీఐ నుంచి 50 శాతం సమకూరిన సంగతి తెలిసిందే. ఐదు బ్యాంకులు భేష్ క్యూ1లో ఐదు ప్రభుత్వ బ్యాంకులు 50–100 శాతం మధ్య లాభాలు ఆర్జించాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 95 శాతం వృద్ధితో రూ. 882 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 88 శాతం అధికంగా రూ. 4,070 కోట్లు, యుకో బ్యాంక్ 81 శాతం వృద్ధితో రూ. 581 కోట్లు సాధించాయి. కేవలం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే 25 శాతం క్షీణతతో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు పీఎస్యూ బ్యాంకుల పురోగతికి దోహదపడ్డాయి. గుర్తింపు, పరిష్కారం, పెట్టుబడులు, సంస్కరణల పేరుతో అమలు చేసిన వ్యూహాలు ఫలితాలినిచ్చాయి. దీంతో మొండి రుణాలు దశాబ్దకాలపు కనిష్టం 3.9 శాతానికి చేరాయి. ఇదే సమయంలో(గత ఎనిమిదేళ్లలో) మొండి రుణాల నుంచి రూ. 8.6 లక్షల కోట్ల రికవరీని సాధించాయి. 2017–21 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3,10,997 కోట్ల పెట్టుబడులను పీఎస్యూ బ్యాంకులకు అందించింది. -
ఎస్బీఐ రికార్డ్లు.. నికర లాభం 178 శాతం దూసుకెళ్లి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 6,068 కోట్లు ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 7,325 కోట్ల నుంచి రూ. 18,537 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 94,524 కోట్ల నుంచి రూ. 1,32,333 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి, ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.24 శాతం మెరుగై 3.47 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 1.13 శాతం పుంజుకుని 14.56 శాతాన్ని తాకింది. వడ్డీ ఆదాయం ప్లస్ క్యూ1లో ఎస్బీఐ మొత్తం ఆదాయం(స్టాండెలోన్) సైతం రూ. 74,989 కోట్ల నుంచి రూ. 1,08,039 కోట్లకు జంప్ చేసింది. వడ్డీ ఆదాయం రూ. 72,676 కోట్ల నుంచి రూ. 95,975 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 38,905 కోట్లను తాకింది. పొదుపు ఖాతాల్లో 63 శాతం, రిటైల్ ఆస్తులలో 35 శాతం యోనో(డిజిటల్) ద్వారా పొందినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో దాదాపు రూ. 490 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంస్థ ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే యోచనలో లేనట్లు స్పష్టం చేశారు. రుణ నష్టాలకు ప్రొవిజన్లు 38 శాతం తగ్గి రూ. 2,652 కోట్లకు చేరాయి. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 1,278 కోట్లతో పోలిస్తే 107 శాతం అధికమయ్యాయి. -
అదరగొట్టిన ఎస్బీఐ: లాభాలు హై జంప్
State Bank of India Q1 results: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు వరుసగా నాలుగో త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేయడం విశేషం.ఆస్తుల నాణ్యత మెరుగుదల నికర వడ్డీ ఆదాయం వృద్ధి, లాభాలకు దారి తీసింది. (యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్...ఇక పండగే!) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.16,884.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లోని రూ.6,068.08 కోట్ల లాభాలతో పోలిస్తే ఇది ఏకంగా 178.24 శాతం అధికం. మార్కెట్ విశ్లేషకులు అంచనా 12.-160 శాతం కంటే ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం 24.71 శాతం ఎగిసి రూ.38,905 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు, ఇతర హైలైట్స్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఏడాదికి 12 శాతం పెరిగి రూ.45.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.40.46 లక్షల కోట్లుగా ఉంది. విదేశీ కార్యాలయాల డిపాజిట్లు ఏడాదికి 22.74 శాతం పెరిగి రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిపాజిట్లు 11.60 శాతం పెరిగి రూ.43.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. CASA డిపాజిట్ సంవత్సరానికి 5.57 శాతం పెరిగింది. అయితే CASA నిష్పత్తి జూన్ 30 నాటికి 42.88 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు గత ఏడాది త్రైమాసికంలో 3.23 శాతం నుంచి జూన్ త్రైమాసికంలో 24 బేసిస్ పాయింట్లు పెరిగి 3.47 శాతానికి ఎగిసింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకు ఈ త్రైమాసికానికి రూ.2,501.31 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది. జూన్ 30, 2022 నాటికి రూ.29,00,636 కోట్లతో పోలిస్తే స్థూల అడ్వాన్సులు 13.90 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరాయని బ్యాంక్ నివేదించింది. అలాగే డిపాజిట్లు రూ.45,31,237 కోట్ల నుంచి రూ.45,31,237 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ ఖర్చు 0.32 శాతం ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 0.61 శాతంగా నమోదైంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరు.. భారీగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
స్టేట్ ఫస్ట్
తాళ్లరేవు: మహిళా సంఘాల ఆర్థిష్టేక పరిపుష్టే ధ్యేయంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రారంభించిన సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే రూ.కోటిన్నరకు పైగా విక్రయాలతో రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి రూ.1.55 కోట్ల మేర అత్యధిక సరాసరి విక్రయాల ద్వారా కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తాళ్లరేవు మండలంలోని సుమారు 2,200 మహిళా సంఘాల్లోని దాదాపు 22 వేల మంది మహిళల భాగస్వామ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రూ.70 లక్షల పెట్టుబడితో కోరంగి మహిళా మార్ట్ను ప్రారంభించారు. కార్పొరేట్ మార్ట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిలో అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇక్కడ పూర్తిగా మహిళలే వ్యాపార లావాదేవీలు సాగిస్తారు. మహిళా గ్రూపుల సభ్యులతో పాటు ఇతర ప్రజలు కూడా ఈ మార్ట్లో సరకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను సైతం ఇక్కడ విక్రయిస్తున్నారు. సరసమైన ధరలకు విక్రయిస్తూండటంతో ఈ మార్ట్లో అన్ని వర్గాల ప్రజలూ సరకులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. దీనిపై స్వయం సహాయక సంఘాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతో.. కోరంగిలోని చేయూత మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. ప్రారంభించిన రెండు నెలల్లోనే విక్రయాలు రూ.కోటి దాటగా, మూడు నెలలు పూర్తయ్యేసరికి రూ.కోటిన్నర పైగా అమ్మకాలు చేసి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి లాభాలు వస్తున్నాయి. గ్రామ సంఘాల అసిస్టెంట్లు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో ఈ ఘనత సాధించాం. – రెడ్డి సన్యాసిరావు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతి పథం ప్రజల నుంచి విశేష స్పందన అన్ని రకాల నిత్యావసరాలతో పాటు కార్పొరేట్ మార్ట్లలో ఉండే అత్యాధునిక వస్తువులు సైతం మా వద్ద అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు వారికి అవసరమైన వస్తువులను సైతం మావద్ద ఉంచుతున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టోర్ తెరచి ఉంచడంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. – తాతపూడి మహేష్, స్టోర్ మేనేజర్, చేయూత మహిళా మార్ట్ చాలా ఆనందంగా ఉంది కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడవడం చాలా ఆనందంగా ఉంది. మా మార్ట్లో సుమారు 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వస్తువుల విక్రయాల నుంచి సరఫరా వరకూ అన్నీ మహిళలే చేస్తారు. మార్ట్ నిర్వహణకు సంబంధించి మహిళా సంఘాల సభ్యులతో కొనుగోలు, పర్యవేక్షణ, నిర్వహణ, తనిఖీలకు నాలుగు కమిటీలు వేశాం. వ్యాపార లావాదేవీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వ్యాపార రంగంలో సైతం మహిళలు సత్తా చాటుకునే విధంగా తోడ్పాటు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. – దండుప్రోలు నూకరత్నం, ప్రెసిడెంట్, చేయూత మహిళా మార్ట్, కోరంగి, తాళ్లరేవు మండలం -
ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుతం భారత్లో గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో ఏదైనా ఉందా అంటే అది టమోటా అనే చెప్పాలి. కొనగోలుదారులకు చుక్కలు చూపిస్తూ, రైతులకు కనక వర్షం కురిపిస్తోంది. ఇక దొంగలు కూడా బంగారం, డబ్బులు వదిలేసి టమోటాలపై పడ్డారు. కర్ణాటకలో ఓ రైతు ఏళ్లుగా సాగు చేసినా ఏనాడు కాసింత లాభాలు కూడా మిగల్చని టమాట పంటనే ఈ పర్యాయం ఆయనపై ధనవర్షం కురిపించనుంది. కొన్ని రోజుల్లో లక్ష్మీదేవి అతని ఇంటి తలుపులు తట్టనుంది. అసలు కథ ఏంటంటే.. చిక్కబళ్లాపురం తాలూకా పట్రేనహళ్లికి చెందిన రైతు దేవరాజు ఐదేళ్లుగా టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు వచ్చినప్పుడల్లా ధరలు నేలచూపు చూశాయి. దీంతో పెట్టుబడులు కూడా దక్కేవి కాదు. అయినప్పటికీ దేవరాజు టమాట సాగు చేయడం మానలేదు. ఈ ఏడాది అర ఎకరాలో సాగు చేయగా ప్రస్తుతం నిండుపూతతో ఉంది. కొద్ది రోజుల్లో పంట కోతకు రానుంది. అర ఎకరాకు రూ.లక్షా50వేలు వ్యయం చేశాడు. ప్రస్తుతం కిలో టమాట ధర 120 పలుకుతోంది. పది రోజుల వరకు ఇవే ధరలు కొనసాగితే రూ.9 నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం వస్తుందని దేవరాజు ధీమాతో ఉన్నాడు. పంటకు తెగుళ్లు, చీడ పీడలు ఆశించాయని, మందులు పిచికారీ చేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రైతు దేవరాజు తెలిపాడు. చదవండి: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి -
Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత
Infosys Q1 results: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్లతో పోలిస్తే లాభాలు 10.9 ఎగిసాయి. అయితే, రూ. 6,141 కోట్ల లాభం సాధిస్తుందన్న ఎనలిస్టుల అంచనాలనుమిస్ చేసింది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) స్థిరమైన కరెన్సీ (CC) పరంగా, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ. 37,933 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 20.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. త్రైమాసికంలో దీని అట్రిషన్ 17.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాది కంపెనీ ఆదాయ మార్గదర్శకాన్ని 1 శాతం- 3.5 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతంగా ఉంచింది. (మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్) క్యాస్ట్ ఆప్టిమైజేషన్పై తమ దృష్టి నేపథ్యంలో అనిశ్చిత స్థూల వాతావరణంలో క్యూ1లో ఆపరేటింగ్ మార్జిన్లు నిలకడగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. 4.2 శాతం పటిష్టమైన Q1 వృద్ధిపట్ట ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ సంతృప్తిని వ్యక్తం చేశారు . భారీ ఒప్పందాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇదే భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని వేస్తుందన్నారు. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా? -
టాప్ గేర్లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!
సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్ఝన్వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా భార్య రేఖా ఝున్ఝన్వాలా నెట్వర్త్లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది. టైటన్లో ఝున్ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది. -
క్యూ1లో పేటీఎమ్ జోరు: జీఎంవీ 37 శాతం జూమ్
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండు ఫిన్టెక్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ) 37 శాతం జంప్చేసి రూ. 4.05 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది (2022-23) క్యూ1లో రూ. 2.96 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాపారస్తుల(మర్చంట్స్)కు జరిగిన చెల్లింపుల విలువను జీఎంవీగా పేర్కొనే సంగతి తెలిసిందే. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) కాగా.. పేటీఎమ్ ద్వారా పంపిణీ అయిన రుణాలు 2.5 రెట్లు ఎగసి రూ. 14,845 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది క్యూ1లో రూ. 5,554 కోట్ల రుణాలు పంపిణీకాగా.. వీటి పరిమాణం సైతం 85 లక్షల నుంచి 51 శాతం జంప్చేసి 1.28 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. మరిన్ని బిజినెస్ వార్తలు అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
చిన్న ప్రాజెక్ట్లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
మహీంద్రా సూపర్.. రూ. 2,637 కోట్ల లాభం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ -
అంత సీన్ లేదు! బీఎస్ఎన్ఎల్ కూడా ఉంటుంది..
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఒకటి, రెండు సంస్థల గుత్తాధిపత్యానికి అవకాశం లేదని ఆ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ స్థిరమైన కంపెనీగా అవతరించనుందని చెప్పారు. వొడాఫోన్ ఐడియా సంస్థ కస్టమర్లను కోల్పోతూ, ఆర్థికంగా బలహీనపడుతుండడంతో, టెలికం రంగం ఇక ద్విఛత్రాధిపత్యం (డ్యుయోపలీ) కిందకు వెళుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో మంత్రి స్పందించారు. ఈ ఆందోళలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు, ప్రభుత్వరంగం నుంచి బీఎస్ఎన్ఎల్ ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ పరంగా బీఎస్ఎన్ఎల్ నిలదొక్కుకుంటున్నట్టు మంత్రి వైష్ణవ్ చెప్పారు. ‘‘బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభాలను ప్రస్తుతం ఆర్జిస్తోంది. బీఎస్ఎన్ఎల్ది టర్న్అరౌండ్ స్టోరీ (పరిస్థితి మారిపోవడం). బీఎస్ఎన్ఎల్ భారత 4జీ, 5జీ టెక్నాలజీని వినియోగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక పరిజ్ఞానాల కంటే మెరుగైనవి’’అని మంత్రి వివరించారు. నాలుగు సంస్థలు వర్ధిల్లుతాయా లేక మూడు రాణిస్తూ, ఒకటి సమస్యలను ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్నకు మార్కెట్ నిర్ణయిస్తుందన్నారు. సరైన ఏర్పాట్లు, వసతులు ఉంటే వచ్చే ఐదేళ్లలో భారత్ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా అవతరిస్తుందంటూ, ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్డ్ ఆరోపణలతో అదానీ గ్రూపు భారీ నష్టాలను మూటగట్టుకుంది. లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్ తుడిచుపెట్టుకుపోతోంది. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీకి చెందిన 'స్టాక్స్ అన్నీ తిరిగి ఫామ్లోకి వచ్చాయి. సంస్థ మార్కెట్ క్యాప్ కూడా పది లక్షల కోట్లను అధిగమించింది. ఈ క్రమంలో టాప్ఇన్వెస్టర్ విజయగాథ వైరల్గా మారింది. రాజీవ్ జైన్, భారీ లాభాలు జీక్యూజీ పార్ట్నర్స్ చైర్మన్ రాజీవ్ జైన్ అదానీ నాలుగు కంపెనీలలో పెట్టిన పెట్టుబడులతో కేవలలో 100 రోజుల లోపే 65.18 శాతం రాబడిని పొందారు. విలువ పరంగా మార్చి 2న రూ.15,446.35 కోట్లగా ఉన్న పెట్టుబడులు మంగళవారం నాటి ట్రేడింగ్తో కలిపి ఏకంగా రూ.10,069 కోట్లు పెరిగి రూ.25,515 కోట్లకు చేరింది. మార్చిలో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ పెట్టుబడి రూ.15,446 కోట్లతో పోలిస్తే ఇది 65 శాతం పెరగడం విశేషం. (ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్ ) కేవలం 52 ట్రేడింగ్ సెషన్లలో జీక్యూజీ పార్టనర్స్ పెట్టుబడి రూ 25 వేల కోట్లకు పెరిగింది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై పెట్టుబడి దారులు ఆశ్చర్య పోనవసరం లేదని, సమర్థుడైన ప్రమోటర్ ద్వారా నిర్వహించిన ఆస్తులని రాజీవ్ జైన్ ప్రకటించారు. కాగా జీక్యూజీ చైర్మన్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ రాజీవ్ జైన్, 2 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ బిలియనీర్స్ 2023 జాబితాలో ప్రవేశించారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలు 20-75 శాతం మధ్య ర్యాలీ చేశాయి. దీనికి తోడు అదానీ గ్రూపులో అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం నియమించిన ప్యానెల్ తేల్చి చెప్పడంతో అదానీ షేర్లలో ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. ఫలితంగా సోమవారం నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. ఫిబ్రవరి 27నాటి కనిష్ట స్థాయి రూ.6.8 లక్షల కోట్ల నుంచి 50 శాతానికి పైగా రికవరీ. ఫిబ్రవరి 8న మొదటిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కు కంటే దిగువకు పడి పోయింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికకు ఒకరోజు ముందు గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.2 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) -
బాష్కు రూ.399 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఆటో, గృహోపకరణాల సంస్థ బాష్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లాభాల్లో 14 శాతం వృద్ధిని చూపించింది. రూ.399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.350 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.4,063 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1,424 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని బాష్ ప్రకటించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,217 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.11,781 కోట్ల నుంచి రూ.14,929 కోట్లకు పెరిగింది. ‘‘2022 సంవత్సరాన్ని భారత్లో శతాబ్ది సంవత్సరంగా జరుపుకున్నాం. అదే ఏడాది మార్కెట్లో ఎన్నో సవాళ్లను చవిచూశాం. ఎన్నో అవరోధాలు ఉన్నా బలమైన వృద్ధితో సానుకూలంగా ముగించాం’’ అని బాష్ లిమిటెడ్ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు. (చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమోటివ్ మార్కెట్ పట్ల ఆశావహ అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.280 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఒక్కో షేరుకు రూ.480 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది. ఇదీ చదవండి: సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే -
3 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో సూచీలు మూడు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం కలిసొచ్చాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 61,302 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 18,125 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 374 పాయింట్లు ర్యాలీ చేసి 61,486 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు దూసుకెళ్లి 18,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే యూరప్ మార్కెట్ల బలహీన ట్రేడింగ్ ప్రభావంతో చివర్లో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆఖరికి సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 61,355 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా ఎనిమిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 18,148 వద్ద ముగిసింది. కాగా ఈ ఇండెక్స్కిది అయిదోరోజూ లాభం ముగింపు కావడం విశేషం. వరుస ర్యాలీ క్రమంలో సూచీలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసీసీ, టెలీకమ్యూనికేషన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1997 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.394 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదుపైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ప్రారంభానికి ముందు(మంగళవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలు గడించాయి. ప్రస్తుతం సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18180 – 18200 శ్రేణిలో కీలక నిరోధం కలిగి ఉంది. దిగువ స్థాయిలో 18050 – 18000 పరిధిలో తక్షణ మద్దతు కలిగి ఉందని’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ షేరు 16 శాతం పెరిగి రూ.566 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 18 శాతం ఎగిసి రూ.595 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 63% వృద్ధితో రూ.79 కోట్లను సాధించడం ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ♦ ఏప్రిల్లో ఎన్ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేరు రాణించింది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం బలపడి రూ.110 వద్ద స్థిరపడింది. ♦ కేంద్రం ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ ట్యాక్స్ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఓఎన్జీసీ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.164 వద్ద ముగిసింది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్చేశాయి. -
అదరగొట్టిన రిలయన్స్ జియో
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది. నికర లాభంతో 13 శాతం జంప్చేయగా, ఆదాయం 11.9 శాతం ఎగిసింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 23,394 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,901 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగిందని రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చినప్పటికీ, ఐదు త్రైమాసికాల్లో లాభం, రాబడి వృద్ధి మందగించడం గమనార్హం. దీనికి ఇటీవలి కాలంలో జియో టారిఫ్ పెంపు లేకపోవడం, అధిక ఖర్చులు కారణంగా మార్కెట్వర్గాలు భావిస్తున్నాయి. (నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్బీ ఫన్నీ ట్వీట్ వైరల్) గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,173 కోట్లతో పోలిస్తే నికర లాభం సంవత్సరానికి 13 శాతం (YoY) పెరిగి రూ. 4,716 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో రూ.4,638 కోట్ల లాభంతో పోలిస్తే లాభం 1.7 శాతం పెరిగింది. అలాగే ఈ త్రైమాసికంలో రూ.23,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1.7 శాతం పుంజుకుంది. ఈ త్రైమాసికంలో ఎబిటా రూ. 12,210 కోట్లుగాను, ఎబిటా మార్జిన్ 52.19 శాతంగా ఉంది. (నెట్ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) -
కళ తప్పిన బంగారం ఈటీఎఫ్లు.. కారణమిదే!
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం ప్రియం.. వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి. ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే. బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు. -
ఆదాయం బాటలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి. కార్గో సేవలతో ఊపు ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయవాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా. ఇతర ఆదాయ వనరుల ద్వారా.. అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచిపెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది. -
చెరకు పిప్పితో కాసుల పంట.. టన్నుకు రూ.5000 ఆదాయం!
సాక్షి, అమరావతి: చెరకు పిప్పి.. అదో వ్యర్థ పదార్థం, ఎందుకూ పనికిరాదు అనుకున్నాం ఇన్నాళ్లూ.. కానీ, ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాన్నే శాస్త్రవేత్తలు కాసులు కురిపించే ముడిసరుకుగా తేల్చారు. చెరకు రైతులకు అదనపు ఆదాయం చేకూరుస్తుందని నిరూపించారు. ఈ పిప్పిని బ్రికెట్స్ (ఓ మోస్తరు కర్రలు లాంటివి) మాదిరిగా తయారుచేస్తే వంట చెరుకుగానే కాకుండా ఇంధన కొరతకు ప్రత్యామ్నాయంగా.. శుభకార్యాల్లో ఉపయోగించే కప్పులు, ప్లేట్లులా కూడా తయారుచేసి వాడుకోవచ్చని వారంటున్నారు. చెరకు పిప్పి, ఎండుటాకులను బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ బ్రికెట్స్ను తయారుచేసి రైతులకు అదనపు ఆదాయం లభించేలా అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆధునిక యంత్ర పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా.. పంట కోసిన తర్వాత వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను ‘బయోమాస్’ అంటారు. వీటిని మెజారిటీ రైతులు వంట చెరుకుగా వినియోగిస్తారు. సహజ రూపంలో నిల్వ చేయాలంటే వీటికి ఎక్కువ స్థలం అవసరం. వీటి రవాణా ఖర్చులూ ఎక్కువే కాదు.. వీటి నుంచి వచ్చే ఉష్ణశక్తి తక్కువే. టన్ను పిప్పి నుంచి 35 టన్నుల బ్రికెట్స్ వంద టన్నుల చెరకు నుంచి సుమారు 30 టన్నుల పిప్పి, 10 టన్నుల ఎండుటాకులు వస్తాయి. పిప్పిలో 70 శాతం, ఎండుటాకుల్లో 50 శాతం వంట చెరకుగా, బెల్లం తయారీ కోసం వినియోగిస్తారు. మిగిలిన వాటిని వృధాగా వదిలేయడం లేదా పంట పొలాల్లో కాల్చేయడం చేస్తుంటారు. అదే బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా వంద టన్నుల పిప్పి, ఎండుటాకుల నుంచి 35 టన్నుల బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇక సహజ రూపంలో ఈ పిప్పిని వంట చెరుకుగా వినియోగిస్తే కిలోకి 1,200 నుంచి 1,300 కిలో కేలరీల ఉష్ణశక్తి మాత్రమే వెలువడుతుంది. అదే బ్రికెట్స్ రూపంలోకి మార్చి మండిస్తే కిలోకి ఏకంగా 4,452 కిలో కేలరీల ఉష్ణశక్తి వెలువడుతుండడం ఈ బ్రికెట్స్ ప్రత్యేకత. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిల్వచేయడమే కాదు.. వీటిని సులభంగా, చౌకగా కూడా తరలించొచ్చు. అంతేకాదు.. ఇవి మండినప్పుడు పొగ రాకపోవడంవల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉండదు. పైగా.. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కన్నా ఇవి భూమిలో సులభంగా కలిసిపోతాయి. మార్కెట్లో బ్రికెట్లకు మంచి గిరాకీ ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటళ్లలో వరి ఊకనే ప్రధాన వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి ఈ బ్రికెట్లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ బ్రికెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను చెరకు రూ.2,850 ధర పలుకుతుంటే ఈ బ్రికెట్స్ మాత్రం టన్నుకు ఏకంగా రూ.5వేల నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నాయి. చెరకు పిప్పిని బ్రికెట్స్గానే కాదు.. శుభకార్యాలకు ఉపయోగించేలా కప్పులు, ప్లేట్లను కూడా తయారుచెయ్యొచ్చు. చెరకు పిప్పిని బాగా ఎండబెట్టి, మెత్తని పొడిలా చేసి ఎటువంటి రసాయనాలు కలపకుండా నేరుగా మౌల్డింగ్ యంత్రం ద్వారా మనకు కావాల్సిన రూపంలో తయారుచేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. టబ్రికెటింగ్ యంత్రం ద్వారా ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను బైండరుతో కలిపి బ్రికెట్లుగా తయారుచేసుకోవచ్చు. అదే చెరకు పిప్పికైతే బైండర్ అవసరం లేకుండానే బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చు. ట ముందుగా చెరకు పిప్పిని 7–12 శాతం తేమ వరకు బాగా ఎండబెట్టాలి. ట తరువాత పిప్పిని చిన్నచిన్న ముక్కలుగా చేసి బ్రికెటింగ్ యంత్రంలోని హేమర్ మిల్లు ద్వారా పొడిచేసి బేరల్ ద్వారా పంపించి ఒత్తిడికి గురిచేయాలి. ట బ్రికెటింగ్ మిషన్లోని డై సైజును బట్టి బ్రికెట్ల పరిమాణం ఉంటుంది. ట బ్రికెట్లుగా తయారుచేయడం వలన చెరకు పిప్పి పరిమాణం 90 శాతం వరకు తగ్గుతుంది. ట సులభంగా నిల్వచేసుకుని సీజన్లో బెల్లం తయారీకి ఉపయోగించవచ్చు లేదా విక్రయించుకోవచ్చు. చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు! -
మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్లైన్స్
ముంబై: కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్లైన్స్ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్లైన్స్పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ .. కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్లైన్స్ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది. ► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది. ► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. ► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది. ► ఏవియేషన్ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది. ► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది. ► బడా ఎయిర్లైన్ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది. ► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్లేవైనా వచ్చి కోవిడ్–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
అదానీ షేర్ల అండ: ఎట్టకేలకు లాభాల్లో సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో కళ కళలాడాయి. వరుసగా ఎనిమిదో రోజుల నష్టాల తరువాత లాభాలో ప్రారంభమైన సూచీలు మిడ్ సెషన్నుంచి పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్, అదానీ గ్రూపు షేర్ల లాభాలు మద్దతిస్తాయి. సెన్సెక్స్ 449 పాయింట్లు ఎగిసి 59,411వద్ద నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 17,451 వద్ద స్థిరపడ్డాయి. గత రెండు రోజుల గ్రూపు షేర్ల లాభాలతో అదానీ గ్రూపు మార్కెట్ క్యాప్ 75 వేల కోట్లు పుంజుకోవడం విశేషం. హిండెన్బర్గ్ వివాదం రేపిన అలజడితో భారీగా కుదేలైన అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, యూపీఎల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్గా నిలవగా, బ్రిటానియా, పవర్ గగ్రిడ్, సిప్లా, బీపీసీఎల్, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 20పైసలు ఎగిసి 82. 50 వద్ద ముగిసింది. -
మ్యూచువల్ ఫండ్, న్యూ ఫండ్ ఆఫర్కు మధ్య తేడా ఏంటి?
మ్యూచువల్ ఫండ్ పథకానికి, న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)కు మధ్య తేడా ఏంటి? – డి.తరుణ్ ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడుల నమూనాలతో నూతన పథకాలను (ఎన్ఎఫ్వో) తీసుకొస్తుంటాయి. ఇలా వచ్చిన పథకం కొంత కాలానికి పాతది అయిపోతుంది. ఆయా పథకం పెట్టుబడుల తీరు, మార్కెట్ కరెక్షన్లలో, మార్కెట్ ర్యాలీల్లో పథకాల పనితీరు ఎలా ఉందో పరిశీలించొచ్చు. ఎన్ఎఫ్వో అన్నది కొత్తగా మొదలయ్యే పథకం. ఇన్వెస్టర్లు అప్పగించిన పెట్టుబడులను ఆ ఫండ్ మేనేజర్ అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. కొత్త పథకం పెట్టుబడి లక్ష్యాలు, ఫండ్ మేనేజర్ గతంలో నిర్వహించిన పథకాల ట్రాక్ రికార్డు గురించి తెలుసుకోవచ్చు. అలాగే, ఎన్ఎఫ్వో ఆరంభమైన సమయంపై పనితీరు ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయాల్లో పథకాన్ని ప్రారంభించి, అనంతరం మార్కెట్లు పెరిగిపోతే సహజంగానే పథకంలో రాబడులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే కొత్త పథకం మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడా లేక కనిష్టాల్లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుందా అన్నది ఇన్వెస్టర్ తప్పకుండా పరిశీలించాలి. ఎన్ఎఫ్వో రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంటాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి. చాలా మంది ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా ఎన్ఎఫ్వోల్లో అంత భారీ మొత్తంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చాల్సి వస్తుంది? – పవన్ కుమార్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు దీర్ఘకాలం కోసం అంటే రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. కావాల్సిన మొత్తం సమకూరితే పెట్టుబడిని మొత్తం తీసేసుకోవచ్చు. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక మీరు ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత ముందు చూసిన అంశాలు మారిపోయినట్టయితే మీ పెట్టుబడులను విక్రయించుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. కాకపోతే మీరు అప్రమత్తం అయ్యేందుకు ఒక కారణంగా చూడొచ్చు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. -
సిరులు కురిపిస్తున్న ఆయిల్పామ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఆయిల్పామ్ రైతు పంట పండుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది ధర తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం ఏలూరు జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో పామాయిల్ సాగు తొమ్మిది జిల్లాల్లో ఉండగా.. అందులో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం మొత్తంతో పోలి్చతే జిల్లాలోనే సుమారు 50 శాతం ఉండటం విశేషం. గడిచిన నాలుగేళ్లలో ఏటా సగటున నాలుగు వేల ఎకరాల చొప్పున పామాయిల్ సాగు పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఉమ్మడి పశి్చమలో 1988లో ఆయిల్పామ్ సాగు జిల్లాకు పరిచయమైంది. 1992లో టీఎంఓపీ పథకం ద్వారా దీన్ని ప్రారంభించి పెదవేగి ఆయిల్ఫెడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో 1996 నుంచి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం ప్రారంభమైంది. అధిక ఆదాయంతో పాటు అంతర పంటలకు అవకాశం ఉన్న ఆయిల్పామ్ను ప్రభుత్వం ప్రోత్సహించడంతో మెట్ట ప్రాంతంలో రైతులు ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి చూపారు. ఆయిల్పామ్ కంపెనీల ద్వారా మొక్కలను సబ్సిడీపై రైతులకు అందించి హెక్టారుకు రూ.5,250 చొప్పున మొదటి నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుకు జమ చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2,16,192 ఎకరాల్లో ఈ ఏడాది ఆయిల్పామ్ సాగవుతోంది. పామాయిల్ మొక్క ఇవ్వడం మొదలుకుని దిగుమతి వచ్చేవరకు అన్నీ ఆయిల్పామ్ కంపెనీలు చూస్తుండడం, సాగుకు సబ్సిడీలు ఉండడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతంలో ప్రధాన పంటగా మారిపోయింది. ప్రతి ఏటా ముడిచమురు, పామాయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం, ఆయిల్ఫెడ్ కంపెనీలు కలిసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) ప్రకారం ధర నిర్ణయిస్తాయి. గతేడాది అంతర్జాతీయంగా పామాయిల్కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23 వేలకు చేరింది. ఆయిల్పామ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం టన్ను రూ.13,400గా ఉంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా సాగు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావడం, ఐదో సంవత్సరం నుంచే దిగుబడి వస్తుండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఐదో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమై ప్రతి మొక్క 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. నీటి వనరులు మినహా ఎలాంటి నిర్వహణ ఖర్చులూ ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో... ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో 2,16,190 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులో ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉందని, 3.12 లక్షల ఎకరాలు పామాయిల్ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉందని ఉద్యాన శాఖాధికారులు నిర్ధారించారు. దీనిలో 2.16 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. కామవరపుకోట, చింతలపూడి, టి.నర్సాపురం, ద్వారకాతిరుమల మండలాల్లో ఇది అధికం. జిల్లాలో నవభారత్ ఆగ్రో, 3 గోద్రేజ్ ఆర్గో వెట్ కంపెనీలు, ఏపీ ఆయిల్ఫెడ్, పతంజలి ఫుడ్స్, ఫుడ్స్ అండ్ ప్యాడ్స్ తదితర కంపెనీల ద్వారా మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు కొనసాగుతోంది. ప్రతి కంపెనీకి కొన్ని మండలాలు కేటాయించి, వాటి పరిధిలో మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో కంపెనీయే నిర్వహించేలా చూస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ప్రోత్సాహం ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, ఇతర సాంకేతిక పరమైన పరిష్కారాల కోసం ఆయిల్ఫెడ్ పరిశోధనా స్థానం కూడా ఉంది. సాగులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. – ఎ.దుర్గేష్, ఇన్చార్జి డీడీ -
తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభం
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పడిపోయి రూ.480 కోట్లకు వచ్చి చేరింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఉన్నప్పటికీ ఆశించిన క్రెడిట్ నష్టానికి అదనపు కేటాయింపులు చేయడం ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ ప్రకటించింది. రాని బాకీల కోసం చేసిన అదనపు కేటాయింపులు డిసెంబర్ త్రైమాసికంలో రూ.7,285 కోట్లుగా ఉన్నాయి. 2021 అక్టోబర్–డిసెంబర్లో ఇది రూ.5,716 కోట్లు. స్థూల నిరర్ధక ఆస్తులు 5.04 నుంచి 4.75 శాతానికి వచ్చి చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు 3.2 నుంచి 2.4 శాతంగా ఉన్నాయి. ఆదాయం 16 శాతం దూసుకెళ్లి రూ.5,871 కోట్లు, నికర వడ్డీ ఆదాయం 10 శాతం ఎగసి రూ.1,606 కోట్లుగా ఉంది. జారీ చేసిన రుణాలు రూ.17,770 కోట్ల నుంచి రూ.16,100 కోట్లకు వచ్చి చేరాయి. -
ఆర్బీఐ వడ్డింపు: సెన్సెక్స్ జూమ్, బ్యాంకు షేర్లకు దెబ్బ!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్బీఐ పాలసీ రివ్యూ ప్రకటించిన అనంతరం సెన్సెక్స్ 300పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 60596 వద్ద, 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17800 ఎగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో తప్ప, దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్గా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 11 శాతం ఎగిసింది. అదానీ పోరర్ట్స్ , హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్ భారీగా లాభపడుతుండగా, పవర్ గగ్రిప్, కోల్ ఇండియా, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, ఐఫర్ మోటార్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి స్వల్ప లాభాలతో 82.68 వద్ద ఉంది. కాగా రిజర్వ్ బ్యాంకు ఇండియా అనుకున్నట్టుగా రెపో రేటు పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతంగా కీలక వడ్డీరేటు 6.50 శాతానికి పెరిగింది. ఇది వరుసగా ఆరోపెంపు. -
ఎస్బీఐ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్– డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్ క్యూ3లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. -
ఊహించని ఫలితాలు.. దుమ్మురేపిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్– డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్ క్యూ3లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 3.2 శాతం జంప్చేసి రూ. 544 వద్ద ముగిసింది. చదవండి: కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు -
వారాంతంలో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్గా సూచీలు ఆ తరువాత మరింత కోలుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 910 పాయింట్లు ఎగిసి 60842 నిఫ్టీ 244 పాయింట్ల లాభంతో 17854వద్ద స్థిరపడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, బజాజ్ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ భారీగా లాభ పడగా, దివీస్ లాబ్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, హిందాల్కో,ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపీ 34 పైసలు లాభంతో 81.83 వద్ద ముగిసింది. -
బడ్జెట్పైనే ఆశలు: ఫ్లాట్గా ముగిసిన సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. రేపటి బడ్జెట్కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. ఫలితంగా రోజంతా ఒడి దుకుడుల మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 59550 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 17662 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, ఆటో షేర్లు లాభపడగా, ఐటీ ఫార్మ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్ట పోయాయి. ఎంఅండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ లాభపడగా, బజాజ్ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్ర, సన్ఫార్మ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు నష్టంతో 81.50 వద్ద ముగిసింది. -
‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం డివిజన్లో 200 ఎకరాల్లో సాగవుతుండగా 150 ఎకరాలు మండలంలోనే సాగవుతోంది. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి రూ.4.8 లక్షల విలువైన 600 కిలోల పట్టుగూళ్ల దిగుబడి సాధిస్తున్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా చూపింది. పట్టుగూళ్లు కొనేవారు లేక పట్టుగుడ్లు (లేయింగ్స్) లభించక రెండేళ్లలో రంపచోడవరం డివిజన్లో 300 నుంచి 200 ఎకరాలకు సాగు తగ్గిపోయింది. అప్పటిలో పట్టుగూళ్ల ధర రూ.300కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో మెరుగైన పరిస్థితులు కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత మార్కెట్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. పట్టుగూళ్ల ధర కిలో రూ.600 నుంచి రూ.700 వరకు పెరిగింది. దీంతో మళ్లీ రైతులు సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదాయం ఆశాజనకంగా ఉన్నందున మండలంలో 20 ఎకరాలు అదనంగా సాగు పెరిగింది వై.రామవరం మండలంలో 4, రంపచోడవరం మండలంలో 7 ఎకరాలు, అడ్డతీగలలో 4 ఎకరాల్లో కొత్తగా పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పట్టుపరిశ్రమశాఖ అధికారవర్గాలు తెలిపాయి. రంపచోడవరం డివిజన్లో ఉన్న గరప నేలలు మల్బరీ తోటల పెంపకానికి అనువైనవని పట్టుపరిశ్రమ శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతమైన మల్బరీ ఆకులు దిగుబడి వస్తున్నందున నాణ్యమైన పట్టు లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెప్పారు. ఇక్కడి పట్టు గూళ్లను హనుమాన్ జంక్షన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఉత్తమ రైతుకు పురస్కారం మండలంలోని కిండ్రకాలనీకి చెందిన పామి చినసత్యవతి పట్టుపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణం సాగు చేపట్టిన ఈమె రికార్డు స్థాయిలో ఆదాయం పొందారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి రూజ4.25 లక్షల ఆదాయం పొందారు. ఈమెను ఇటీవల ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిల్క్ బోర్డు అధికారులు సత్కరించారు. చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! వాణిజ్య పంటల కన్నా లాభం రైతులు వాణిజ్య పంటల కన్నా మల్బరీ సాగు చేపట్టడం మంచిది. కోవిడ్లాంటి విపత్కర పరిస్థితుల వల్ల అప్పటిలో పట్టుగూళ్ల ధర పతనమైంది. అలాంటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎదురుకాదు. అప్పటిలో కిలో రరూ.600 నుంచి రూ.300కు పోయింది. ఇప్పుడు ధర చాలా బాగుంది. పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వ్యవసాయ సూచనలు అందించి ప్రోత్సహిస్తున్నాం. వచ్చే జూన్ నాటికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. –రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం వివరాలకు: రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం 9652714914 -
టీఎస్ఆర్టీసికి సంక్రాంతి బొనాంజ.. 11 రోజుల్లో భారీ ఆదాయం!
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. “టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బోయిన్పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ అధికారులకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిన సంక్రాంతి
విజయవాడ: ఈ సంక్రాంతి ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను ప్రయాణిలు విశేషంగా ఆదరించడంతో భారీగా ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. తిరుగు ప్రయాణానికి కూడా తగినన్ని బస్సులు వేయడంతో విశేష ఆదరణ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 1,483 ప్రత్యేక బస్సులు నడిపడమే కాకుండా, జనవరి 6వ తేదీ నుండి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. కాగా, సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్ ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు. రాను-పోను టికెట్లపై బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఏపీఎస్ ఆర్టీసీ భారీ ఆదాయానికి కారణమైంది. -
అంచనాలు మించిన ఇన్ఫోసిస్: లాభాలు, ఆదాయం జంప్
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలను సాధించింది. ఈ క్వార్టర్లో ఏకీకృత నికర లాభం 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది.గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.లాభం గత త్రైమాసికంలో రూ. 6,021 కోట్లతో పోలిస్తే 9 శాతం పెరిగింది అలాగే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.31,867 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లగా నమోదైంది. ఇన్ఫోసిస్ తన 2023 ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాన్ని(రెవెన్యూ గైడెన్స్) 16.0-16.5 శాతానికి పెంచింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22శాతంగా ఆదాయ ఫలితాల సందర్భంగా ఇన్పీ గురువారం ప్రకటించింది. -
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
-
TSRTC: లాభాల కిక్తో 2023లోకి ఆర్టీసీ.. పదేళ్లలో తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్ఆరీ్టసీ... కొత్త ఏడాదిలో నూతనోత్సాహంతో అడుగుపెడుతోంది. గతేడాది ఏకంగా 26 డిపోలను లాభాల్లో నిలపడంతోపాటు మిగతా డిపోల్లో నష్టాలను భారీగా తగ్గించుకొని 2022కు గుడ్బై చెప్పేసింది. జూలైలో డీజిల్ సెస్ను సవరించడం ద్వారా రోజువారీ టికెట్ ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ... గత మూడు వారాలుగా ప్రాఫిట్ చాలెంజ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద ప్రభావాన్నే చూపింది. డీజిల్ సెస్ను పెంచాక నవంబర్ వరకు కొన్ని డిపోలే లాభాల్లోకి రాగా, ప్రాఫిట్ ఛాలెంజ్ ప్రారంభించాక వాటి సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఏమిటీ చాలెంజ్..? గత కొన్ని నెలలుగా ఆరీ్టసీలో రకరకాల చాలెంజ్లు నిర్వహిస్తున్నారు. గత దసరా వేళ ఆదాయం మరింత పెరిగేలా సంస్థ యాజమాన్యం దసరా ఛాలెంజ్ను నిర్వహించింది. అలాగే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ చాలెంజ్, శుభకార్యాలు అధికంగా ఉండి ప్రయాణాలు ఎక్కువగా ఉండే శ్రావణమాసంలో శ్రావణమాస చాలెంజ్ లాంటివి నిర్వహించింది. ఈ కొత్త ప్రయత్నాలకు తగ్గట్లుగానే వివిధ డిపోలకు అవే పండగలకు గతంలో వచ్చిన ఆదాయం కంటే ఈసారి ఎక్కువ ఆదాయం వచి్చంది. అలాగే 3 నెలలపాటు డిపోలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టేలా సంస్థ 100 రోజుల చాలెంజ్ నిర్వహించి గరిష్ట ఆదాయాన్ని పొందింది. వాటితో పోలిస్తే మరింత ప్రభావవంతంగా పనిచేసేలా.. డిపోల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తూ గత మూడు వారాలుగా ప్రాఫిట్ చాలెంజ్ను మేనేజ్మెంట్ విసిరింది. ఇది ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది. డీజిల్ సెస్ పెంచాక నవంబర్ వరకు 13 డిపోలు లాభాల్లోకి రాగా ప్రాఫిట్ చాలెంజ్ మొదలయ్యాక ఆ సంఖ్య ఏకంగా 26కు చేరుకుంది. ఏప్రిల్ వరకు కార్పొరేషన్ లాభాల్లోకి! ప్రాఫిట్ ఛాలెంజ్లో భాగంగా రోజువారీ టికెట్ ఆదాయం పెరిగేలా చేయడంతోపాటు ఖర్చులను తగ్గించాలి. ఇందుకు 15 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. వాటిని ఎలా నిర్వహించాలో డిపో మేనేజర్లకు శిక్షణ ఇవ్వగా వారు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డిపోలను లాభాల్లోకి తెచ్చేందుకు సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఏప్రిల్ నాటికి సిటీలోని కొన్ని మినహా మిగతా డిపోలు లాభాల్లోకి వచ్చి మొత్తం కార్పొరేషన్ బ్రేక్ ఈవన్ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 26 డిపోలు లాభాల్లో ఉండగా మరో 10 డిపోల్లో రోజువారీ నష్టాలు రూ. లక్షలోపు ఉన్నాయి. ఇంకో పది డిపోల్లో నష్టాలు రూ. 2 లక్షల్లోపు ఉన్నాయి. వెరసి మరో 20 డిపోలు త్వరలోనే లాభాల్లోకి రానున్నాయి. అధిక నష్టాలు వచ్చే వాటిల్లో మొదటి 10 స్థానాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని డిపోలే ఉన్నాయి. వాటిని నియంత్రించగలిగితే కార్పొరేషన్ పరిస్థితి బాగా మెరుగుపడనుంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే ఇబ్రహీంపట్నం, జగిత్యాల, గోదావరిఖని, కరీంనగర్–1, వనపర్తి, సిద్దిపేట, వరంగల్–1, నల్లగొండ, యాదగిరిగుట్ట, హనుమకొండ, కోదాడ, జనగామ, మెదక్, వేములవాడ, సంగారెడ్డి, దేవరకొండ, భూపాలపల్లి, మణుగూరు, మహేశ్వరం, పరిగి, నర్సాపూర్, మిర్యాలగూడ, నార్కట్పల్లి, హైదరాబాద్–2, హైదరాబాద్–1, పికెట్. చదవండి: ఐటీ కారిడార్కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్.. -
భారీ లాభాలు: బ్యాంకింగ్, ఐటీ జూమ్, ఇన్ఫీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే లాభపడిన సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రయివేటు, ప్రభుత్వ బ్యాంకింగ్, ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియల్ ఎస్టేట్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఐటీ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. సెన్సక్స్ ఏకంగా 403 పాయింట్లు ఎగిసి 62533 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 18608 వద్ద స్థిరపడ్డాయి. తద్వార సెన్సెక్స్ 62500 ఎగువకు, నిఫ్టీ 18600 ఎగువకు చేరాయి. ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం ఓఎన్జీసీ, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడగా, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో బీపీసీఎల్, యూపీఎల్, హీరోమోటా టాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 32 పైసలు కుప్ప కూలి 82.79 వద్దకు చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో ట్రేడర్లు పాజిటివ్గా స్పందించారు. -
స్పైస్ జెట్ ఏజీఎం 26న ఆర్థిక ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: స్పైస్జెట్ ఈ నెల 26న సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. 2021–22 ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. డైరెక్టర్గా అజయ్ సింగ్ను తిరిగి ఎంపిక చేయడంపై వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు తెలియజేసింది. అజయ్ సింగ్ ప్రస్తుతం స్పైస్జెట్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. సింగ్ 2004 నవంబర్ 4న డైరెక్టర్గా నియమితులయ్యారు. తదుపరి 2010 ఆగస్ట్ 27న రాజీనామా చేశారు. తిరిగి 2015 మే 21న ఎండీగా ఎంపికైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
వావ్.. ఓయో...ఐపీవోకు ముందు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి అర్ధభాగం ఫలితాలు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉన్న కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్లో రూ. 63 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 280 కోట్ల ఇబిటా నష్టం ప్రకటించింది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?) మొత్తం ఆదాయం 24శాతం ఎగసి రూ. 2,905 కోట్లను తాకింది. ఫలితాలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. తాజా సమీక్షా కాలంలో సర్దుబాటు తదుపరి రూ. 63 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇవీ చదవండి: ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? -
ఆదాయంలో ఎంఎస్ఎంఈలో జోరు
ముంబై: కరోనా మహమ్మారి ముందుస్థాయికి సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు(ఎంఎస్ఎంఈలు) నెమ్మదిగా చేరుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో దాదాపు అన్ని సంస్థలూ 2020 స్థాయి ఆదాయాన్ని సాధించగలవని అంచనా వేసింది. అయితే అప్పటి మార్జిన్లను సగానికిపైగా కంపెనీలు అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. విలువరీత్యా 43 శాతం సంస్థలు కరోనా ముందు ఏడాది స్థాయిలో లాభదాయకతను సాధించలేకపోవచ్చని తెలియజేసింది. పెరిగిన కొన్ని కమోడిటీ ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేకపోవడం, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వివరించింది. ఎంఎస్ఎంఈ రంగంలోని 69 రంగాలు, 67 క్లస్టర్లు ఆధారంగా క్రిసిల్ నివేదికను రూపొందించింది. ఉమ్మడిగా వీటి ఆదాయం రూ. 56 లక్షల కోట్లుకాగా.. జీడీపీలో 20–25 శాతం వాటాకు సమానమని క్రిసిల్ తెలియజేసింది. నివేదిక ప్రకారం.. బౌన్స్బ్యాక్ ఆదాయాన్ని పరిగణిస్తే ఈ ఏడాది మొత్త ఎంఎస్ఎంఈ రంగం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 1.27 రెట్లు వృద్ధిని సాధించే అవకాశముంది. అయితే విలువరీత్యా 43 శాతం కంపెనీలు 2020 స్థాయి నిర్వహణ మార్జిన్లు అందుకోలేకపోవచ్చు. వీటిలో 30 శాతం కెమికల్స్, పాలు, డెయిరీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలుకాగా.. చమురు, పాల ధరలు ప్రభావం చూపనున్నాయి. మిగిలిన 13 శాతంలో ఫార్మా(బల్క్ డ్రగ్స్), జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి నమోదుకానున్నాయి. రూపాయి పతనం మార్జిన్లను దెబ్బతీయనుంది. మహమ్మారికి ముందు డాలరుతో మారకంలో రూపాయి విలువ 70.9కాగా.. 2022 అక్టోబర్లో 82.3కు జారింది. ఇక ముడిచమురు ధరలు సైతం 2020లో బ్యారల్కు సగటున 61 డాలర్లుకాగా.. ఏప్రిల్– అక్టోబర్ మధ్య 104 డాలర్లకు చేరింది. చమురు, చమురు డెరివేటివ్స్ను కెమికల్స్, డైలు, పిగ్మెంట్స్, రోడ్ల నిర్మాణం తదితర రంగాలలో వినియోగించే సంగతి తెలిసిందే. దీంతో కెమికల్స్, రోడ్ల నిర్మాణం రంగంలో 2.5–3 శాతం మార్జిన్లు నీరసించే వీలుంది. పాలు, డెయిరీ తదితరాలలో ఈ ప్రభావం 0.5–1 శాతానికి పరి మితం కావచ్చు. చదవండి: ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్పీసీఎల్కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
దివీస్ ల్యాబొరేటరీస్కు షాక్.. ఈ సారి తగ్గింది!
ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
క్యూ2లో అదానీ గ్యాస్కు షాక్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 139 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 159 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 73 శాతం జంప్చేసి రూ. 1,190 కోట్లను తాకింది. సీఎన్జీకి డిమాండ్ పుంజుకోవడంతో గ్యాస్ విక్రయాలు 9 శాతం వృద్ధితో 19.1 కోట్ల ఘనపు మీటర్లను తాకాయి. ఈ కాలంలో నేచురల్ గ్యాస్ వ్యయాలు రెట్టింపై రూ. 860 కోట్లకు చేరినట్లు కంపెనీ సీఈవో సురేష్ పి.మంగ్లానీ పేర్కొన్నారు. సహజవాయువు సీఎన్జీగా మార్పిడి ద్వారా ఆటో మొబైల్స్కు, పైప్డ్ నేచురల్ గ్యాస్గా మార్చి వంటలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికల్లా 33 కొత్త సీఎన్జీ స్టేషన్లను జత చేసుకుంది. వీటి సంఖ్య 367కు చేరింది. ఇదే విధంగా 61,000 గృహాలకు కొత్త కనెక్షన్ల ద్వారా పీఎన్జీ నెట్వర్క్ను 6.25 లక్షలకు పెంచుకుంది. కొత్తగా 412 బిజినెస్ కస్టమర్లను కలుపుకుని వాణిజ్య కనెక్షన్ల సంఖ్యను 6,088కు చేర్చుకుంది. ఫలితాల నేపథ్యంలో అదానీ టోటల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 3,647 వద్ద ముగిసింది. -
రేమండ్ లాభంలో రెండు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: రేమండ్ లిమిటెడ్ అంచనాలను మించి బలమైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.162 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.2,168 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.56 కోట్లు కాగా, ఆదాయం రూ1,551 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో ఆశావహ వాతావరణం, వినియోగ డిమాండ్ మెరుగుపడడంతో వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ మంచి పనితీరు చూపించినట్టు రేమండ్ తెలిపింది. టెక్స్టైల్స్, రియల్టీ, కన్జ్యూమర్ కేర్ తదితర విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బీటూసీ వ్యాపారం మంచి వృద్ధిని చూపించగా, వస్త్రాల ఎగుమతులు సైతం బలంగా నమోదయ్యాయి. యూఎస్, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్ల రాక సానుకూలంగా ఉంది. రియల్టీలోనూ మంచి వృద్ధిని కొనసాగించినట్టు రేమండ్ తెలిపింది. సంస్థ నికర రుణ భారం రూ.1,286 కోట్లకు తగ్గింది. టెక్స్టైల్స్ విభాగం ఆదాయం రూ.911 కోట్లు, షర్టింగ్ విభాగం నుంచి రూ.210 కోట్లు, అప్పారెల్ నుంచి రూ.370 కోట్లు, టూల్స్ రూ.132 కోట్లు, హార్డ్వేర్ నుంచి రూ.132 కోట్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్మెంట్ నుంచి రూ.247 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. -
ఉసూరుమనిపించిన వర్ల్పూల్: నికర లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ప్రముఖ కంపెనీ వర్ల్పూల్ ఇండియా సెప్టెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 88 శాతం పడిపోయి రూ.49 కోట్లకు పరిమితమైంది. ఒకవైపు కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావం ఉండగా, మరోవైపు క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఏకీకృత లాభం చూపించడం ఈ వ్యత్యాసానికి కారణమని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.413 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.1,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,607 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదు కాలేదు. కంపెనీ వ్యయాలు 3 శాతం పెరిగి రూ.1,567 కోట్లకు చేరాయి. ‘‘నికర లాభం తగ్గడానికి ప్రధానంగా కమోడిటీల (తయారీలో వినియోగించే) ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణం. అయితే తయారీ పరంగా కొన్ని చర్యలు తీసుకోవడం, ధరలు పెంచడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించాం. ఎలికా ఇండియా కొనుగోలు అనంతరం కంపెనీ సబ్సిడరీగా మారింది. భారత అకౌంటింగ్ ప్రమాణాల మేరకు ఎలికా ఇండియాలో మా వాటాల పారదర్శక విలువ ఆధారంగా, రూ.324 కోట్ల లాభాన్ని గతేడాది సెప్టెంబర్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ ఫలితాల్లో గుర్తించాం. ఇది మినహాయించి చూస్తే నికర లాభంలో క్షీణత 45 శాతమే ఉంటుంది’’ అని కంపెనీ తెలిపింది. 88 శాతం పడిపోయిన నికర లాభం -
ఐనాక్స్ లీజర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మల్టీప్లెక్స్ చైన్ నిర్వాహక కంపెనీ ఐనాక్స్ లీజర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం సగానికిపైగా తగ్గి రూ. 40.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 88 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 47.44 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు దూసుకెళ్లింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గత క్యూ2లో స్వల్ప టర్నోవర్ నమోదైంది. అయితే ప్రస్తుత క్యూ2లో మొత్తం వ్యయాలు సైతం రెండు రెట్లు ఎగసి రూ. 434 కోట్లను దాటాయి. ఈ కాలంలో 11.6 మిలియన్లమంది సినిమాలను వీక్షించగా.. సగటు టికెట్ ధర రూ. 215కు చేరింది. ఒక్కో వ్యక్తి సగటు వ్యయం రికార్డు నెలకొల్పుతూ రూ. 102ను తాకింది. కొత్తగా 13 తెరలను ఏర్పాటు చేసింది. దీంతో కంపెనీ 165 మల్టీప్లెక్స్ల ద్వారా 74 పట్టణాలలో 705 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐనాక్స్ లీజర్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 514 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పీవీఆర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
మూలధన లాభాలు బేసిక్ లిమిట్ దాటకుంటే
ప్రశ్న: నేను రిటైర్ అయ్యాను.పెన్షన్ లేదు. కానీ ఇతర ఆదాయాలు నికరంగా రూ. 5,50,000. మా ఆవిడకు ఎటువంటి ఆదాయంలేదు. ఇద్దరికి చెరొక ప్లాటు .. అంటే జాగా ఉంది. ఇద్దరం ఒకేసారి ఒకే ధరకి అమ్ముతున్నాం. మిత్రులు లెక్కలు వేసి ఇద్దరికి మూలధన లాభాలు చెరొక రూ. 3,00,000 వస్తాయని తేల్చారు. మా ఆవిడ విషయంలో పన్ను భారం ఉండదు, కానీ నేను మాత్రం పన్ను కట్టాలి అంటున్నారు. దీనిలో అంతరార్థం ఏమిటి? మీ శ్రీమతి వయస్సు 60 సంవత్సరాలు దాటి ఉంటుంది అనుకుంటున్నాం. మీ మిత్రులు వేసిన లెక్కలు .. చెప్పిన మాటలు కరెక్టే. నిజానికి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందుగా మీ విషయం తీసుకుందాం. మూలధన లాభాలతో నిమిత్తంలేకుండా మీ నికర ఆదాయం రూ. 5,50,000 అంటున్నారు. సేవింగ్స్, డిడక్షన్లు పోనూ రూ.5,50,000 ఉంటే మీరు పన్ను పరిధిలో ఉన్నట్లే. పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి .. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి లేదా సెల్ఫ్ అసెస్మెంట్ చలాన్ ద్వారా చెల్లించి రిటర్న్ వేయండి. మీకు కూడా 60 సంవత్సరాలు దాటిందనే అనుకుంటున్నాం. 60 సంవత్సరాలు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 3,00,000. మీ నికర ఆదాయం లెక్కింపులో బేసిక్ లిమిట్ దాటిన మొత్తానికి పన్ను లెక్కిస్తారు. మీరు ఇప్పటికి బేసిక్ లిమిట్ని వినియోగించుకున్నట్లే. ఒక వ్యక్తికి ప్రతి శీర్షిక కింద బేసిక్ లిమిట్ ఉండదు. జీతం, ఇంటద్దె, వ్యాపారం మీద ఆదాయం, మూలధన లాభాలు.. ఇతర ఆదాయం ఈ ఐదింటిని కలిపిన తర్వాత ఒకసారే బేసిక్ లిమిట్ని వినియోగించుకోవాలి. మీ విషయంలో బేసిక్ లిమిట్ వినియోగించుకున్నారు కాబట్టి ఇక మూలధన లాభాల మీద ఇవ్వరు. ఇక మీ శ్రీమతి గారి విషయం. ఆవిడకు ఎటువంటి ఆదాయం లేదు. అంటే జీరో ఇన్కం. కాబట్టి ఆవిడకు బేసిక్ లిమిట్ దాకా పన్ను భారం లేకుండా అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూలధన లాభాలు రూ. 3,00,000 దాటకపోతే బేసిక్ లిమిట్ కంపల్సరీగా అమలుపర్చాలి కాబట్టిఆ సదుపాయం లేదా బేసిక్ లిమిట్ ఇస్తారు. మూలధన లాభాలు ఇద్దరివి ఒకే మొత్తం, సమానం అయినప్పటికీ ఇతర విషయాల్లో ఎంతో తేడా ఉంది. ► మీకు ఇదివరకే ఇతర ఆదాయాల మీద పన్ను భారం ఉంది. ► మీ శ్రీమతి గారికి పన్నుకి గురయ్యే ఆదాయం జీరో. ► బేసిక్ లిమిట్ మీకు మూలధన లాభాల మీద వర్తించదు. ► మేడంగారికి మూలధన ఆదాయం ఒక్కటే ఉన్నా ఇతరత్రా ఏ ఆదాయం లేదు కాబట్టి బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను భారం లేదు.ఇదే దీనిలోని అంతరార్థం. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఇండెక్స్ ముందు చిన్నబోయిన లార్జ్క్యాప్ ఫండ్స్
ముంబై: లార్జ్క్యాప్ పథకాలు పనితీరు పరంగా సూచీల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది జూన్ వరకు ఏడాది కాలానికి చూసుకుంటే 91 శాతం పథకాలు రాబడుల విషయంలో ఇండెక్స్ల కంటే వెనుకబడ్డాయి. వీటితో పోలిస్తే మెజారిటీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు మెరుగైన పనితీరు చూపించాయి. సూచీల కంటే పనితీరులో వెనుకబడిన మిడ్/స్మాల్క్యాప్ పథకాలు కేవలం 27.45 శాతంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ డౌజోన్స్ ఇండిసెస్ ఓ నివేదిక రూపంలో ఈ వివరాలను విడుదల చేసింది. ఇక 75.61 శాతం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ (పన్ను ఆదా చేసే) కూడా వాటి సూచీలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇవ్వలేకపోయాయి. 2022 ఆరంభం నుంచి లార్జ్క్యాప్ ఫండ్ మేనేజర్లకు కష్టంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 87.5 శాతం ఫండ్స్ మొదటి ఆరు నెలల్లో సూచీల కంటే తక్కువ రాబడినిచ్చినట్టు వెల్లడించింది. ఇక మరీ ముఖ్యంగా 2022 జూన్ నాటికి అంతక్రితం ఐదేళ్ల కాలలోనూ 89 శాతం లార్జ్క్యాప్ ఫండ్స్ వాటి సూచీల కంటే తక్కువ రాబడులను ఇచ్చాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39.88 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. దీర్ఘకాలలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు మంచి పనితీరు చూపించినట్టు ఎస్అండ్పీ నివేదిక తెలిపింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
అదే టార్గెట్, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి లాభాల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వెల్లడించింది. 2020– 21లో కంపెనీ రూ.2,428 కోట్ల టర్నోవర్పై రూ.4,588 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021– 22లో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే లాభం/నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్ కో–ఫౌండర్ దివ్య గోకుల్నాథ్ తెలిపారు. అలాగే భారత్తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. ‘వీరిలో సగం మందిని భారత్ నుంచి ఎంచుకుంటాం. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. టీచర్లను భారత్, యూఎస్ నుంచి ఎంపిక చేస్తాం’ అని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 50,000 మంది పనిచేస్తున్నారు. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
మూన్లైటింగ్పై విప్రో సీఈవో కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3శాతం క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15శాతం పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా లాభం సుమారు 4శాతం, ఆదాయం 5శాతం వృద్ధి చెందాయి. (‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్) ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్లైటింగ్పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్ ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. (క్లిక్ : అంచనాలు మించి అదరగొట్టిన హెచ్సీఎల్ టెక్) -
అబ్బ నీ కమ్మని దబ్బ..తక్కువ పెట్టుబడితో అదిరిపోయే ఆదాయం!
సీతంపేట(పార్వతిపురం మన్యం): మన్యంలో పుల్లదబ్బ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడి పెరగడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోవడంతో భామిని, సీతంపేట ఏజెన్సీలో సుమారు 2 వందల ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో గిరిజనరైతులు పండిస్తారు. అక్కడక్కడ పోడులో వీటిని వేస్తారు. సుమారు 100 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. కావిడ దబ్బ రూ. 200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి ఇవే ధరలకు అమ్మేవారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంభాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా పండుతుంది. వారపు సంతల్లో విక్రయాలు ఒక్కో పుల్ల దబ్బ పండు మైదాన ప్రాంతాల్లో ఒక రూపాయికి విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో కిలోల వంతున విక్రయిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి ఖరీదు చేస్తున్నారు. పుల్లదబ్బ ఎక్కువగా పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతూ గిరిజన రైతులు నిర్ణయించిన ధరలు కాకుండా సిండికేట్గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు గిరిజనులు విక్రయించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా వ్యాపారుల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో వ్యాపారులకు సరుకు అప్పగిస్తారు. వ్యాపారుల ధరకే విక్రయిస్తున్నాం పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది దబ్బ పంట. కావిళ్లలో మోసుకుని తీసుకువస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్మకాలు చేస్తున్నాం. – ఎస్.రైకన్న, అక్కన్నగూడ పంట దిగుబడి బాగుంది ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంది: కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. ఈ సీజన్ వచ్చేనెల వరకు ఉంటుంది. ఒడిశా వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. – ఎస్.ఎల్లంగో, మెట్టుగూడ చదవండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే.. -
మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!
తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడికి అధికంగా లాభాలు రావాలని ఏ ఇన్వెస్టరైనా భావిస్తాడు. అయితే అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నప్పటికీ సరైన ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే, లాభాలనిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Gensol Engineering Ltd ).. గత 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్లలో ఒకటిగా నిలివడంతో పాటు ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టుల కోసం సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో ప్రస్తుత ప్రాజెక్ట్లను కలిగి ఉంది. వామ్మో.. రూ. లక్షకి 20 లక్షలు ఇటీవల జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు రూ. 1,390.65 వద్ద ముగిశాయి. అయితే అంతకుముందు షేర్ రూ.1,426.45 వద్ద ముగిసింది. క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 2.51% తగ్గింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ని గమనిస్తే దీని ధర గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. బహుశా ఈ స్థాయిలో పెరుగుతుందని అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఊహించిఉండరేమో. ఈ షేర్ ధరపై ఓ లుక్కేస్తే.. గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా ఉండేది. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఈ స్టాక్ రూ.1,390.65కి చేరుకుంది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ₹ 21.93 లక్షల రాబడినిచ్చింది. ఇదే షేర్ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇస్తూ ఇన్వెస్టర్లకి కాసుల పంట కురిపించిందనే చెప్పాలి. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది. ఇటీవలే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), భారత ప్రభుత్వం, బ్రైత్వైట్ & కో. లిమిటెడ్ (BCL) సహా క్లయింట్ల నుంచి రూ. 531 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో దాదాపు 121 MWp సామర్థ్యంతో నిర్మించనున్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
లాభాలతో కూడిన వృద్ధికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఇంతకాలం కేవలం వృద్ధిపైనే దృష్టి పెట్టిన విద్యారంగ స్టార్టప్ బైజూస్ తన విధానాన్ని మార్చుకుంది. దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ బైజూస్, లాభాల ఆధారిత వృద్ధిపైకి తన దృష్టిని మళ్లించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్ రూ.4,564 కోట్ల భారీ నష్టాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం తెలిసిందే. ఈ క్రమంలో బైజూస్ ఉద్యోగులకు సీఈవో లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఐదు నెలలుగా ప్రతి నెలా రూ.1,000కోట్లకు పైగా టర్నోవర్ నమోదు చేస్తున్నామని, కే12 విభాగంలో మన తర్వాతి రెండు స్థానాల్లో ఉన్న పోటీ సంస్థల టర్నోవర్ కంటే ఇది 20 రెట్లు అధికమని చెప్పారు. ‘‘2022–23 ఆ తర్వాతి నుంచి వృద్ధికి, నిలదొక్కుకునే సామర్థ్యాలను జోడిస్తాం. వనరులను మరింత సమర్థవంతంగా వినియోగిస్తాం’’అని రవీంద్రన్ ప్రకటించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్ ఆదాయం 3.3 శాతం క్షీణించి రూ.2,428 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020–21 ఆడిటింగ్ చాలా ఆలస్యమైనట్టు రవీంద్రన్ చెప్పారు. దీనిపై అనేక నిరాధార ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, కంపెనీ వృద్ధి స్థాయికి అనుగుణంగా ఆడిటింగ్కు తగిన విధంగా సన్నద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని చెప్పారు. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
సింగరేణి లాభాలు రూ.1,500 కోట్లు?
శ్రీరాంపూర్(మంచిర్యాల): సింగరేణి సంస్థ 2021–22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,500 కోట్ల లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది. మార్కెట్లో కోల్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత సంవత్సరం సాధించిన బొగ్గు ఉత్పత్తి, అమ్మకాల దృష్ట్యా ఈసారి కూడా అంత మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అంతకుముందు 2020–21లో కంపెనీ రూ.273 కోట్ల లాభాలు సాధించింది. మార్కెట్లో బొగ్గు డిమాండ్ను సింగరేణి సద్వినియోగం చేసుకోవడంతో ఈసారి లాభాలు అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాలు ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కంపెనీ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన బుధవారం జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఉత్కంఠకు తెరపడనుంది. ఈ సమావేశానికి కోల్ సెక్రెటరీలు, సింగరేణి డైరెక్టర్లు, కోలిండియా డైరెక్టర్లు హాజరు కానున్నారు. దీనికి ముందుగా సోమవారం ప్రీబోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాభాలతోపాటు ఓసీపీ ఓబీ పనుల టెండర్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. లాభాల ప్రకటన తర్వాత కంపెనీ అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు, టీఆర్ఎస్ కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతాన్ని ప్రకటించాలని కోరతారని తెలిసింది. క్రితంసారి 29శాతం లాభాల వాటా ప్రకటించిన సీఎం ఈసారి గతం కంటే ఎక్కువ శాతమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
బైజూస్ ఆదాయం హైజంప్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్ స్థూల ఆదాయం మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు రెట్లు దూసుకెళ్లింది. బైజూస్ బ్రాండుతో విద్యా సంబంధ సేవలందించే కంపెనీ రూ. 10,000 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. 202021లో నష్టాలు రూ. 4,588 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో రూ. 2,428 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. కొద్ది నెలల ఆలస్యం తదుపరి కంపెనీ ఆడిటెడ్ ఫలితాలను విడుదల చేసింది. భారీ నష్టాలకు ప్రధానంగా వైట్హ్యాట్ జూనియర్ విభాగం ఆదాయం, నష్టాలను వాయిదా వేయడం, ఆదాయ మదింపులో చేపట్టిన మార్పులు కారణమైనట్లు బైజూస్ పేర్కొంది. 2019–20లో దాదాపు రూ. 232 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్లతో పోలిస్తే ఆదాయం సైతం 1 శాతం తగ్గినట్లు తెలియజేసింది. ఆదాయ నమోదును వాయిదా వేసినప్పటికీ వ్యయాల నమోదును కొనసాగించడంతో నష్టాలు భారీగా పెరిగినట్లు బైజూస్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ వివరించారు. అంతేకాకుండా వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నష్టాలు నమోదు చేస్తున్న వైట్హ్యాట్ జేఆర్ తదితర సంస్థల కొనుగోళ్లు కూడా ఇందుకు కారణమైనట్లు తెలియ జేశారు. అయితే గతేడాది లాభం లేదా నష్టం వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం! తొలి 4 నెలల్లో జూమ్ 2022 ఏప్రిల్-జులైలో సాధించిన రూ. 4,530 కోట్ల ఆదాయం 2021లో నమోదైన మొత్తం ఆదాయం కంటే అధికమని రవీంద్రన్ వెల్లడించారు. కీలక బిజినెస్ 150 శాతం పురోగమించినట్లు తెలియ జేశారు. ఆకాష్, గ్రేట్ లెర్నింగ్ సంస్థల కొనుగోళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు తదుపరి బిజినెస్లో రెట్టింపు వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. వైట్హ్యాట్ జేఆర్ మాత్రం అంతంత మాత్ర పనితీరును చూపుతున్నట్లు ప్రస్తావించారు. 50 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరణకు కంపెనీ నిర్వహిస్తున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు తెలియజేశారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం అబుధాబి సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 40–50 కోట్ల డాలర్లు, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి 25–35 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులను సమకూర్చుకునే వీలుంది. నిధులను 23 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశాన్ని పక్కనపెట్టినట్లు రవీంద్రన్ తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే బిలియన్ డాలర్లకు దేశీ సంస్థ ఆకాష్ను సొంతం చేసుకోగా.. సింగపూర్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ను 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో యూఎస్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 50 కోట్ల డాలర్లకు, కోడింగ్ సైట్ టింకర్ను 20 కోట్ల డాలర్లకు చేజిక్కించుకుంది. ఆస్ట్రియా గణిత శాస్త్ర సంస్థ జియోజెబ్డ్రాను 10 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో ప్రస్తుత ఉపాధ్యాయుల సంఖ్య 20,000కాగా వచ్చే ఏడాదిలో మరో 10,000 మందిని జత చేసుకునే ప్రణాళికల్లో బైజూస్ ఉంది. కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య ప్రస్తుతం 50,000కు చేరింది. -
Telangana: నాలుగేళ్లు.. 10,000 కోట్లు
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాం సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే దీని ఫలితాలు రాష్ట్రానికి, రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఆయిల్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర జీడీపీలో ఆయిల్పాం వాటా ఏకంగా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందని తెలిపాయి. – సాక్షి, హైదరాబాద్ లక్షల టన్నుల పామాయిల్ రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఏకంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 26 జిల్లాల్లో సాగు చేపట్టేలా చర్యలు చేపట్టింది. రైతులకు అవసరమైన సహకారం, పంట కొనుగోలుకు ఆయిల్ఫెడ్ సహా 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్లలో పామాయిల్ గెలలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మొత్తం 10 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దాని ద్వారా రూ. 13,680 కోట్ల విలువైన 15.20 లక్షల పామాయిల్ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో రాష్ట్ర అవసరాలకుపోను ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో నాలుగేళ్ల తర్వాత జీడీపీలో పామాయిల్ వాటా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందంటున్నారు. రైతులకు ఎకరానికి రూ. 80 వేల చొప్పున ఏడాదికి ఆదాయం సమకూరుతుందని... మున్ముందు ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఆయిల్పామ్ రంగంలో వచ్చే నాలుగైదేళ్లలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మొదటగా ఆయా కంపెనీలు 25 క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉండగా ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్ల మేర పెట్టుబడులు తరలిరానున్నాయి. ఆయా ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అలాగే ఆయిల్పామ్ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 2,500 మందికి పామాయిల్ రవాణా రంగంలో ఉపాధి లభిస్తుందని ఆయిల్ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. ఆయిల్పామ్ రంగంలో ఆయిల్ఫెడ్ ద్వారానే ఏకంగా రూ. 750 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ సురేందర్ చెప్పారు. దీనివల్ల ఆయిల్ఫెడ్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఆయిల్పాం సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని, రూ. లక్షల్లో ఆదాయం సమకూరనుందని పేర్కొన్నారు. మరోవైపు పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీల్లో ముడినూనెను బయటకు తీస్తారు. దాన్ని శుద్ధి చేసి పామాయిల్ వంటనూనె తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి క్రషింగ్ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాల్సి ఉంటుంది. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
సెప్టెంబర్లో సింగరేణి లాభాలు ప్రకటిస్తాం: డైరెక్టర్ ఎన్.బలరాం
శ్రీరాంపూర్: ఆర్థిక సంవత్సరం 2021–22లో సింగరేణి సాధించిన లాభాలను సెప్టెంబర్లో ప్రకటిస్తామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడు లాభాలు పెరిగాయని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సింగరేణి ఎస్సీఓఏ క్లబ్ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన ఏసీ హాల్ను ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ సంస్థ లాభాలపై సెంట్రల్ ఆడిట్ కావాల్సి ఉందని, సెప్టెంబర్లో లాభాల లెక్క తేలుస్తామన్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మల్లన్నసాగర్లో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలోని నైనీబొగ్గు బ్లాక్ను ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పలేదని, ఓబీ పనులు, కోల్ ఆపరేషన్స్ అవుట్ సోర్సింగ్తో చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల, అధికారుల పిల్లలకోసం 15 శాతం సీట్లు కేటాయించాలని ఆరోగ్యశాఖను కోరామన్నారు. సింగరేణికి వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటూ డైరెక్టర్ రవిప్రసాద్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ఖాదిర్, ఏరియా ఇన్చార్జి ఎస్ఓటూ జీఎం గోపాల్సింగ్, క్లబ్ సెక్రెటరీ సంతోష్కుమార్, డీజీఎంలు శివరావు, గోవిందరాజు, ఓసీపీ పీవో రాజేశ్వర్రెడ్డి, ఏజెంట్ సత్యనారాయణ, ఎస్టేట్స్ అధికారి స్వప్న పాల్గొన్నారు. -
పీసీ మార్కెట్ జోరు.. 37 లక్షల సేల్స్, తగ్గేదేలే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విపణి జోరు మీద ఉంది. ఏప్రిల్–జూన్లో 37 లక్షల యూనిట్ల డెస్క్టాప్స్, నోట్బుక్స్, వర్క్ స్టేషన్స్ అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 17.8 శాతం అధికం అని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. ఐడీసీ ప్రకారం.. మొత్తం విక్రయాల్లో 26 లక్షల యూనిట్లతో నోట్బుక్స్ విభాగం తన హవాను కొనసాగిస్తోంది. అయితే గడిచిన మూడు త్రైమాసికాల్లో నోట్బుక్స్ సగటున 30 శాతం వృద్ధి చెందితే 2022 ఏప్రిల్–జూన్లో ఇది 7.3 శాతానికే పరిమితం అయింది. 10 లక్షలకుపైగా డెస్క్టాప్స్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఒక మిలియన్ యూనిట్లు దాటడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. ప్రభుత్వ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణం. ఆన్లైన్ బిగ్ సేల్ప్సై ఆశలు.. డెస్క్టాప్స్ విక్రయాల విషయంలో గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఎంటర్ప్రైస్ విభాగం తక్కువగా 14.9 శాతం వృద్ధి చెందింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు రెండు త్రైమాసికాల కంటే తక్కువగా నమోదైంది. అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయం, డాలర్ ధర హెచ్చుతగ్గులు ముఖ్యంగా స్టార్టప్లలో పీసీల సేకరణను నెమ్మదించాయి. పెద్ద సంస్థలు ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నాయి. రాబోయే ఆన్లైన్ బిగ్ సేల్స్ వినియోగదారుల విభాగంలో ఆశాకిరణంగా ఉండవచ్చు. అయితే వాణిజ్య విభాగంలో ప్రభుత్వ సంస్థల నుంచి బలమైన ఊపు, ఎంటర్ప్రైసెస్ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లు సానుకూల అంశం. స్టోర్లకు కస్టమర్ల రాక.. కొన్ని త్రైమాసికాలుగా ఆన్లైన్ సేల్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఆఫ్లైన్ స్టోర్లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరవడం ప్రారంభించడంతో పీసీ మార్కెట్ వృద్ధి తగ్గింది. తద్వారా రిమోట్ లెర్నింగ్ డిమాండ్ తగ్గిందని ఐడీసీ ఇండియా పీసీ డివైసెస్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ భరత్ షెనాయ్ తెలిపారు. ‘కళాశాలల ప్రారంభం ఆలస్యమైంది. కళాశాలల ప్రమోషన్లతో తిరిగి అమ్మకాలు ఊపందుకుంటాయని విక్రేతలు ఇప్పటికీ ఆశిస్తున్నారు. ఆన్లైన్ అమ్మకాలు కూడా 2022 మూడవ త్రైమాసికం చివరిలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అధిక నిల్వలు ఆందోళన కలిగించే విషయం. రాబోయే కొద్ది నెలల్లో సరుకు నిల్వల దిద్దుబాటు అనివార్యం’ అని వివరించారు. ముందంజలో హెచ్పీ పీసీల అమ్మకాల్లో హెచ్పీ ముందంజలో ఉంది. ఏప్రిల్–జూన్ కాలంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో 11.53 లక్షల యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది. రెండవ స్థానంలో ఉన్న డెల్ వాటా 21.6 శాతంగా ఉంది. ఈ కంపెనీ 8.07 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. లెనోవో 19.6 శాతం వాటాతో 7.34 లక్షల యూనిట్లను విక్రయించింది. ఏసర్ గ్రూప్ 8.9 శాతం వాటాతో 3.32 లక్షలు, ఆసస్ 6.1 శాతం వాటాతో 4.86 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించాయి. చదవండి: ద్రవ్యోల్బణం: అధికారులతో ఆర్బీఐ గవర్నర్ భేటీ.. కీలక అంశాలు ఇవే! -
2022-23 క్యూ1 ఫలితాలు: టాటా కన్జూమర్ లాభం, ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 38 శాతం జంప్చేసి రూ. 277 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 200 కోట్లు మాత్రమే ఆర్జించింది. వ్యయ నియంత్రణలు, ధరల పెంపు లాభాలు పుంజుకునేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం ఎగసి రూ. 3,327 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 3,008 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఆదాయంలో దేశీ వాటా 9 శాతం వృద్ధితో రూ. 2,145 కోట్లను తాకగా.. అంతర్జాతీయ బిజినెస్ సైతం 9 శాతం పుంజుకుని రూ. 837 కోట్లకు చేరింది. నాన్బ్రాండెడ్ బిజినెస్ రూ. 278 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా కన్జూమర్షేరు బీఎస్ఈలో 0.25 శాతం లాభపడి రూ. 790 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 4,462 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,343 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్చేసి రూ. 19,831 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 14,241 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. -
అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 229 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) క్యూ1లో కేవలం రూ. 109 కోట్లు ఆర్జించింది. వడ్డీ మార్జిన్లు బలపడటం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.55 శాతం నుంచి 3.82 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.97 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.69 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చాయి. ఈ బాటలో ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 247 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు వెనకడుగు వేశాయి. క్యూ1లో ఆభరణ రుణ పోర్ట్ఫోలియో 13 శాతం పుంజుకుని రూ. 14,873 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం లాభపడి రూ. 55.35 వద్ద ముగిసింది. చదవండి: Canara Bank: వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్! -
ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్లుక్ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి. చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా? -
నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
నగరి/విజయపురం(చిత్తూరు జిల్లా): సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చదవండి: జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ! పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది. 200 ఎకరాల్లో సాగు విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు. ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. లాభాలనిస్తోంది.. పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా. ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది. – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. అవగాహన కల్పిస్తున్నాం నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్లో ఎక్కువగా డిమాడ్ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. – లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి -
డబుల్ బొనాంజా.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్!
Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో లాభాలు ఆర్జిస్తున్న ఇన్వెస్టర్లకు మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత మరో గుడ్న్యూస్ చెప్పింది. తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 19.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీంతో ఆ సంస్థలోని పెట్టుబడిదారులు డబుల్ బొనాంజా పొందారనే చెప్పాలి. వేదాంత ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజ్ వేదాంత షేర్లు భారీ స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత వాటి షేరు ధర పెరుగుతూ రూ.253.25కి చేరింది. జూలై 1 తర్వాత ఈ స్థాయిలో స్టాక్ పెరగడం ఇదే తొలిసారి. ఇటీవల షేర్లు లాభాలతో పాటు వాల్యూమ్స్ కూడా మద్దతుగా ఉన్నాయి. అంటే వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత వాల్యూమ్లు కూడా 20 రోజుల సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. టెక్నికల్గా వీటిని పరిశీలిస్తే.. స్టాక్ ధర 20-రోజుల మూవీంగ్ యావరేజ్ కంటే పైన ట్రేడవుతోంది. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పైన షేర్ ధర 250 వద్ద పటిష్టంగా కొనసాగుతుంది. కాగా వేదాంత షేర్ ఆల్టైం హై ధర రూ. 259.95గా ఉండడం గమనార్హం. చదవండి: ఆకాశ ఎయిర్: టికెట్ ధరలు, స్పెషల్ మీల్ -
అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు!
ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు జూన్ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది. మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది. -
19 డిపోలు లాభాలబాట
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డిపోలు క్రమంగా లాభాలు ఆర్జించడం మొదలుపెట్టాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 19 డిపోలు లాభాలను సమకూర్చుకున్నాయి. మొత్తం 97 డిపోలున్న సంస్థ ప్రతినెలా రూ.100 కోట్లకు తగ్గకుండా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో ఇది వెలుగురేఖలా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో కేవలం 4 డిపోలు, మే నెలలో ఎనిమిది డిపోలు లాభాలు చవిచూడగా, జూన్లో లాభాలు సాధించిన డిపోల సంఖ్య 19కి చేరినట్టు అధికారులు తేల్చారు. జూన్లో ఈ డిపోల మొత్తం లాభాలు రూ.7.43 కోట్లు. జూన్కు సంబంధించి ఆర్టీసీ సంస్థ మొత్తం నష్టాలు రూ.52.67 కోట్లు. వెరసి మొత్తం రూ.40 కోట్ల వరకు నష్టాలు తగ్గినట్టు తెలుస్తోంది. 2014 తర్వాత..? రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 జూన్లో తొలిసారి లాభ నష్టాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు విడివిడిగా చూపాయి. ఆ నెలలో తెలంగాణ ఆర్టీసీ రూ.7.87 కోట్ల లాభాలను తెచ్చిపెట్టినట్టు లెక్కల్లో తేల్చారు. కానీ, సరైన పర్యవేక్షణ, ప్రణాళిక లేకుండా వ్యవహరించటం, భారీగా పెరిగిన సిబ్బంది జీతాలు, ఒకేసారి పెద్ద సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ వెరసి... ఆర్టీసీ నష్టాలబాట పట్టింది. ఏడాదికి రూ.వంద కోట్లలోపు నష్టాలతో మొదలై క్రమంగా అది రూ.2 వేల కోట్లకు చేరింది. రెండుమూడు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, మూడు నాలుగు నెలల్లో లాభాల్లోకి రాకుంటే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల హెచ్చరించడంతో ఆర్టీసీ పనితీరులో మార్పు కనిపించడమేకాక లాభాలబాటపట్టింది. డీజిల్ సెస్.. వంద రోజుల ప్రణాళిక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెండు నెలల క్రితం 100 రోజుల ప్రణాళిక ప్రారంభించి అధికారులు, సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించారు. దీంతో డిపోలలో నష్టాలు, ఖర్చులకు కొంత బ్రేక్ పడింది. డీజిల్ ఖర్చు భారీగా పెరిగినందున సజ్జనార్ డీజిల్ సెస్ ప్రవేశపెట్టారు. నెల రోజుల వ్యవధిలో మళ్లీ సెస్ సవరించారు. జూన్లో ఈ సవరింపు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం రూ.2 కోట్ల కంటే ఎక్కువగా పెరుగుదల నమోదైంది. జూన్ నెలాఖరులో భారీ వర్షాలు కురవటంతో ప్రయాణికుల సంఖ్య తగ్గి ఆదాయానికి కొంత గండిపడింది. లేని పక్షంలో కనీసం మరో 10 డిపోలు లాభాల్లోకి వచ్చేవని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలంలో సెప్టెంబర్ వరకు సాధారణంగా ఆదాయం పడిపోతుంది. మళ్లీ అక్టోబర్ తర్వాత పుంజుకోవటం సహజం. 2022 మే నెలలో డిపోలవారీ లాభాలు పరిగి: రూ.2.53 లక్షలు, జహీరాబాద్: రూ.6 లక్షలు, నిజామాబాద్–1 డిపో రూ.11.75 లక్షలు, మిర్యాలగూడ: 38.53 లక్షలు, పికెట్: 62.46 లక్షలు, హైదరాబాద్–1 డిపో: 1.45 కోట్లు, హైదరాబాద్–2 డిపో: 1.28 కోట్లు, యాదగిరిగుట్ట: 2.62 కోట్లు చొప్పున లాభాలు సాధించాయి. వెరసి ఈ ఎనిమిది డిపోలు 6.5 కోట్ల లాభాలు సాధించిపెట్టాయి. తాజాగా లాభాల్లోకి వచ్చిన 19 డిపోలు ఇవే హైదరాబాద్–1, 2, పికెట్, మణుగూరు, దేవరకొండ, భద్రాచలం, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, యాదగిరిగుట్ట, పరిగి, వరంగల్–1, సత్తుపల్లి, నిర్మల్, గోదావరిఖని, నిజామాబాద్–1, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.9,579 కోట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లుగా నమోదైంది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.10,055 కోట్లతో పోల్చినప్పుడు (సీక్వెన్షియల్గా) కొంత తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం వృద్ధితో రూ.19,481 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం సైతం 35 శాతం వృద్ధిని చూపించి రూ.7,700 కోట్లకు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు/ఎన్పీఏలు) జూన్ చివరికి 1.28 శాతానికి మెరుగుపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 1.47 శాతంగా ఉన్నాయి. రుణాల్లో వృద్ధి కార్పొరేట్, హోల్సేల్ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితం కాగా, రిటైల్ రుణాల్లో 21.7% వృద్ధి నమోదైంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా రుణాల్లో 28.9 శాతం వృద్ధి సాధ్యమైంది. చదవండి: Google Play Store: 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.57 శాతంగా నమోదైంది. జేఎస్పీఎల్ లాభం హైజంప్ ప్రైవేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. -
వరుస లాభాలు: వారంలో 1700 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసాయి.వారాంతంలో బలమైన లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగిసి 54481 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 16220 వద్ద ఉత్సాహంగా ముగిసాయి. అలాగే ఈ వారంలో ఇప్పటివరకు సెన్సెక్స్ దాదాపు 1,700 పాయింట్లు పెరగడం విశేషం. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థతో M&M, EVCo రూ.1,925 కోట్లుపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ఆరంభంలో 5.4 శాతం పెరిగింది. కానీ చివరల్లో లాభాలను కోల్పోయింది. ఆటో షేర్లు లాభాలనార్జించగా ఐటీ మెటల్, రియల్టీ, పీఎస్యూ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, టాటామోటార్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా నిలిచాయి. టాటాస్టీల్, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ నష్టపోయాయి. మరోవైపు డాలరు మాకరంలో రూపాయి మరోసారి బేర్ మంది. 11 పైసల నష్టంతో 79.26 వద్దకు చేరింది. -
క్రూడ్ ఎఫెక్ట్: 54 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గ్లోబల్ ముడి చమురు ధరలు దిగి వస్తున్న క్రమంలో సూచీలు అప్ ట్రెండ్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 54వేల పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16 వేల స్థాయిని సునాయాసంగా అధిగమించింది. సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 54178 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 16132 వద్ద ముగిసాయి. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపించింది. టైటన్, ఎల్ అండ్టీ, యూపీఎల్, హిందాల్కో, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, జూబ్లియంట్ ఫార్మా ఇండస్ ఇండ్, బీవోబీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు సిప్లా, భారతి ఎయిర్టెల్ నెస్లే, బజాజ్ ఫైనాన్స్, డా.రెడ్డీస్ నష్ట పోయాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అటు చమురు బ్యారెల్కు 100 డాలర్లకు పతనమైంది. చమురు ధరలు వరుసగా మూడో రోజు కూడా నేల చూపులు చూస్తుండటంతో దేశీయ కరెన్సీ రూపాయికి బలవ చ్చింది. 16 పైసల లాబంతో 79.17 వద్ద ఉంది. -
సెన్సెక్స్ జంప్, స్పైస్జెట్కు భారీ షాక్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్ ఎఫ్ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 616 పాయింట్లు ఎగిసి 53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి. బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, హెచ్యూఎల్ టాప్ గెయనర్స్గా, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు ఇటీవల వరుస సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో స్పైస్జెట్ షేర్లు బుధవారం కూడా పతనమైనాయి. 7 శాతం క్షీణించి ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరాయి. గత 18 రోజుల్లో స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం వరుసగా ఇది ఎనిమిదో ఘటన.దీంతో వీటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈక్విటీ మార్కెట్ల అండతో దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. 13 పైసలు ఎగిసి 79.27 వద్ద ఉంది. -
రిలయన్స్కు భారీ దెబ్బ: బ్యారల్పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్కు 40 డాలర్లు (విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్ఐఎల్పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
మార్కెట్లో లాభాలు.. అంతా ఆశామాషీ కాదు గురూ!
వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం, బ్యాంకు వడ్డీరేట్లు సోసోగా ఉండటంతో ఇటీవల కాలంలో అనేక మంది ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్మార్కెట్ వైపు చూస్తున్నారు. ఇలా మార్కెట్లోకి వెళితే అలా సొమ్ము రెట్టింపు చేసుకోవచ్చన్నట్టుగా ఆత్మవిశ్వాసం చూపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ఆన్లైన్ స్టాక్మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ కీలక సూచనలు చేశారు. స్టాక్మార్కెట్లో లాభాలపై నితిన్ కామత్ స్పందిస్తూ.. చాలా మంది సోషల్ మీడియా మాయలో ఉండిపోయి స్టాక్ మార్కెట్పై ఏవేవో అంచనాలు పెంచుకుంటున్నారు. స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే లాభాలు అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. కానీ వాస్తవం అలా ఉండదు. షేర్ మార్కెట్లో లాభాలు పొందడం అంత సులభమైన పని కాదు’ అని తెలిపారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్లో లాభాలు పొందడం అన్నది ప్రపంచంలో ఉన్న కష్టమైన పనుల్లో ఒకటని నితిన్ అన్నారు. గడిచిన కొన్ని నెలలలు మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా మార్కెట్లో లాభాలు తెచ్చుకోవడం అన్నది మరింత కష్టసాధ్యమైన పనిగా మారిందని నితిన్ అభిప్రాయపడ్డారు. బేర్ పంజా దెబ్బలకు మార్కెట్ విలవిలాడుతుంది. సాధారణంగా ‘లాంగ్’ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ‘షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెట్టుబడి పెట్టడం బెటరనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎదుగుదలకు చాలా సమయం పడుతుంది కానీ కుప్పకూలడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి. కానీ అదే పనిగా షార్ట్స్ మీద పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం కూడా చాలా కష్టంగా ఉంది అంటూ ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను నూతన ఇన్వెస్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు నితిన్ కామత్. గతేడాది నవంబర్ నుంచి మార్కెట్లో అస్థితర రాజ్యమేలుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 62 వేల గరిష్టాలను టచ్ చేసి ఆరు నెలల వ్యవధిలోనే 52 వేల కనిష్టాలకు కూడా పడిపోయింది. నిఫ్టీ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పేటీఎం, జోమాటో వంటి షేర్లు ఇన్వెస్టర్లకు రక్తకన్నీరు మిగిల్చాయి. ఇక బీరాలు పలుకుతూ వచ్చిప ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్ రోజునే ఢమాల్ అంది. For most traders living in the social media bubble, it must seem like everyone except you is killing it trading the markets. FYI, it mostly ain't real. Trading is one of the toughest ways to make money & the kind of volatility of the last few months makes it even tougher. 1/2 — Nithin Kamath (@Nithin0dha) June 27, 2022 చదవండి: ఇలా చేయడం వల్లే ఆ కంపెనీకి ఎన్నడూ లేనన్ని లాభాలు! -
దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను ఎలా వేస్తారంటే?
ఈ వారం దీర్ఘకాలిక మూలధన లాభాలు, వాటి వల్ల ఏర్పడే పన్నుభారం గురించి తెలుసుకుందాం. ఆస్తి కొన్న తేది నుండి రెండు సంవత్సరాల తర్వాత .. ఆ ఆస్తి మీ చేతిలో కనీసం 2 ఏళ్లు దాటి ఉంటే దీర్ఘకాలికంగా వ్యవహరిస్తారు. ఇలా ఉండటాన్ని ‘హోల్డింగ్ పీరియడ్‘ అంటారు. అలాంటి ఆస్తిని అమ్మగా వచ్చే లాభాన్ని మూలధన లాభం అంటారు. ఇటువంటి మూలధన లాభంమీ పన్ను రేటు ప్రత్యేకంగా ఉంటుంది. మామూలుగా అయితే, శ్లాబులు, రేట్ల ప్రకారం పన్ను భారం లెక్కిస్తారు. అయితే, స్పెషల్ రేట్లు వర్తించే విషయంలో శ్లాబులు ఉండవు. రేటు 20 శాతంగా ఉంటుంది. అమ్మిన విలువలో నుంచి కొన్న విలువను తీసివేయగా వచ్చే మొత్తాన్ని లాభం అంటారు. ఈ లాభాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయమే పన్నుకు గురవుతుంది. పన్ను లెక్కింపు ఇలా 2001 సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి అయితే.. కొన్న విలువకు బదులు 01–04–2001 నాటి మార్కెట్ విలువను కొన్న విలువగా పరిగణిస్తారు. మార్కెట్ విలువను కాగితాల ద్వారా తీసుకోవాలి. నోటి మాటను పరిగణించరు. రికార్డులతో ధృవీకరించాలి. ఆ విలువను కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ (ఇౌట్ట ౌజ ఐnఛ్ఛీ) ద్వారా పెంచుతారు. 01–04–2001 నాడు 100గా ఉన్నది 2021–22 ఆర్థిక సంవత్సరంలో 317కి సమం అవుతుంది. మీరు 2001కి ముందు స్థిరాస్తి రూ. 75,000 కొన్నారనుకోండి లేదా రూ. 1,000 అనుకోండి లేదా వందే అనుకోండి. 01–04–2021 నాడు మాత్రం దాని విలువ రూ.1,20,000 అనుకోండి. దాన్ని 2021–22లో విక్రయిస్తే రూ. 1,20,000 / 100 గీ 317 = రూ. 3,80,400ని కొన్న ధరగా లెక్కిస్తారు. దీన్ని మీరు రూ. 10,00,000కు అమ్మారనుకోండి అప్పుడు క్యాపిటల్ గెయిన్ లేదా మూలధన లాభం.. రూ. 10,00,000 – 3,80,400 = రూ. 6,19,600 అవుతుంది. ఈ రూ. 6,19,600 మీ ద 20 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. సుంకం అదనం. అంటే సుమారుగా రూ. 1,28,900గా ఉంటుంది. చెల్లించకుండా ఉండాలంటే.. పన్ను చెల్లించకుండా చట్టప్రకారం ఎన్నో మార్గాలు ఉన్నాయి. నిర్దేశించిన విధంగా ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం ఉండదు. అలా వద్దనుకుంటే లావాదేవీ జరిగిన తర్వాత ఒకేసారి చెల్లించవచ్చు. ఏప్రిల్ 2022లో లావాదేవీ అయితే వెంటనే చెల్లించండి లేదా జూన్లో 15 శాతం, సెప్టెంబర్లో 30 శాతం, డిసెంబర్లో 30 శాతం, మార్చ్లో 25 శాతాన్ని అడ్వాన్స్ ట్యాక్స్గా చెల్లించండి. మార్చిలోపు మొత్తం చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నుండి గడువు తేదీలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ విషయం అంత తేలిగ్గా తేల్చలేము. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. - కేసీహెచ్ఎవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు -
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
సిటీలో ఊపందుకున్న క్లౌడ్ కిచెన్ ట్రెండ్.. నాగచైతన్య, రానా కూడా..
జొమాటో, స్విగ్గీల వంటి ఫుడ్ యాప్లకు హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కస్టమర్ బేస్ ఉంది. సదరు ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు కోరుకుంటారు. ఫుడ్ యాప్లకు రెస్టారెంట్లుండవు. వారు సిటీలోని పలు రెస్టారెంట్లపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో వారు కోరుకున్న రుచులు శరవేగంగా అందించేందుకు పుట్టుకొచ్చినవే క్లౌడ్ కిచెన్స్. స్పీడ్.. క్లౌడ్.. ∙భోజన ప్రియులను కూర్చోబెట్టి ఆతిథ్యం అందించే రెస్టారెంట్ తరహా వసతులేవీ లేకుండా కేవలం ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుని వండి సరఫరా చేసేవే క్లౌడ్ కిచెన్లు. అలా చాలా రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నప్పటికీ, ధర, టైమ్, నాణ్యత, రుచి లో కూడా క్లౌడ్ కిచెన్లు మరింత మెరుగ్గా ఉంటున్నాయంటున్నారు సిటిజనులు. నగరంలో డైన్ ఇన్ సేవలు అందించే కొన్ని పేరొందిన రెస్టారెంట్స్ తమ కిచెన్కు అనుబంధంగా ఈ తరహా క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తుండగా కొన్ని ఇతర బ్రాండ్లకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నాయి. కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు కిచెన్ ఏర్పాటు చేసి నిపుణులను నియమించుకుని బిజినెస్ ప్రారంభించేసే అవకాశం ఉండడం అనేక మందిని ఆకర్షిస్తోంది. జాతీయ స్థాయిలో పేరొందిన రెబల్ ఫుడ్స్ నగరంలో 30కిపైగా కిచెన్స్ను నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాడు. ఇక మన టాలీవుడ్ నటుడు నాగచైతన్య షోయు పేరుతో స్విగ్గీపై తన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాడు. మరో నటుడు రానా సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాడు. కోవిడ్.. క్లౌడ్ దౌడ్... ∙కోవిడ్ ఉద్ధృతి టైమ్లో, ఆ తర్వాత కూడా నగరవాసులు రెస్టారెంట్స్లో తినే అలవాటు తగ్గించుకున్నారు. దీంతో డైన్ ఇన్ రెస్టారెంట్స్ బాగా దెబ్బతిన్నాయి. (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2021లో రెస్టారెంట్ పరిశ్రమ 53 శాతం కుదేలైంది.) ఆ పరిస్థితిలోనే క్లౌడ్ కిచెన్ల ఊపందుకున్నాయి. ∙క్లౌడ్ కిచెన్ల నిర్వహణలో భాగంగా మార్కెటింగ్, డిజిటల్ బ్రాండింగ్పై తప్పనిసరి. ఆహారం ఆర్డర్లు మోసుకొచ్చే జొమాటో, స్విగ్గీ వంటి మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించాలి. ఇంట్లో వండే అలవాటు తగ్గుతున్న మధ్య తరగతి వల్ల భవిష్యత్తులోనూ ఈ తరహా కిచెన్లు మరిన్ని రావడం తధ్యమని ఆన్లైన్ రెస్టారెంట్ల పరిశ్రమలో అతిపెద్ద సంస్థ రెబల్ ఫుడ్స్కి చెందిన కల్లోల్ బెనర్జీ అంటున్నారు. ఒకటే కిచెన్ ఆరు బ్రాండ్స్.. అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ...కోవిడ్ సమయంలో క్లౌడ్ కిచెన్స్కు బాగా ఆదరణ పెరిగింది. మేం ప్రస్తుతం 2 బ్రాండ్స్ పేరిట చైనీస్ ఫుడ్, బిర్యానీలు ఆన్లైన్ సప్లయి చేస్తున్నాం గతంలో 6వరకూ అందించిన అనుభవం ఉంది. ఆకట్టుకునే ప్యాకేజీ, అందుబాటు ధర, నాణ్యత మూడూ ఈ బిజినెస్లో చాలా ముఖ్యమైనవి. – రుత్విన్ రెడ్డి, దావత్ క్లౌడ్ కిచెన్స్ పెద్ద ప్లేస్ అక్కర్లేదు. వెయిటర్స్, ఫ్రంట్ డెస్క్ స్టాఫ్ అవసరం లేదు. పార్కింగ్ స్పేస్ ఇవ్వక్కర్లేదు. ఏసీలూ, ఫర్నిచరూ.. వగైరాలూ తప్పనిసరి కాదు. పెట్టుబడి కూడా స్వల్పమే. కానీ ఓ పెద్ద రెస్టారెంట్కి పోటీ ఇవ్వొచ్చు. అదే రెస్టారెంట్కి ఆదాయ వనరుగా కూడా మారొచ్చు. ఊపందుకుంటున్న ఆ వ్యాపారం పేరే క్లౌడ్ కిచెన్. నాగచైతన్య, రానా వంటి సినీ తారలు కూడా ఈ ట్రెండీ బిజినెస్కు మేము సైతం అంటున్నారు. చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు! -
ఝమ్మని దూసుకుపోయిన జియో లాభాలు
రిలయన్స్ జియో 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభాల్లో దూసుకుపోయింది. గతేడాది ఇదే క్వార్టర్ లాభాలతో పోల్చితే ఈసారి 15.4 శాతం అధిక లాభాలను సాధించింది. తాజాగా ప్రకటించిన క్వార్టర్ 4 ఫలితాల్లో రూ. 20,901 కోట్ల రెవిన్యూపై రూ. 4,173 కోట్ల లాభాలను సాధించింది. అయితే గతేడాది ఇదే కాలానికి ఫలితాలతో పోల్చితే రెవిన్యూ పెరగగా లాభాలు తగ్గాయి. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఈ క్వార్టర్లో రూ.10,510 కోట్ల లాభాలు రాగా అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 9,514 కోట్లుగా ఉంది. చదవండి: Telecom Service: టెలికాం సంస్థలకు భారీ షాక్! తగ్గిన స్థూల ఆదాయం! -
టెలికాం సంస్థలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో టెలికం సంస్థల స్థూల ఆదాయం 2.64 శాతం క్షీణించింది. రూ. 69,695 కోట్లకు పరిమితమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతక్రితం ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో టెల్కోల ఆదాయం రూ. 71,588 కోట్లు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సుమారు 16 శాతం పెరిగి రూ. 47,623 కోట్ల నుంచి రూ. 55,151 కోట్లకు పెరిగింది. ఏజీఆర్ ఆధారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు, చార్జీలు మొదలైనవి ఆధారపడి ఉంటాయి. సమీక్షా కాలంలో ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో రూ. 4,541 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్యూసీ) రూ. 1,770 కోట్లు దఖలు పడ్డాయి. లైసెన్సు ఫీజు కలెక్షన్ 19.21 శాతం, ఎస్యూసీ వసూళ్లు 14.47 శాతం పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ అత్యధికంగా రూ. 19,064 కోట్లుగా నమోదు కాగా, భారతి ఎయిర్టెల్ది రూ. 4,484 కోట్లు, వొడాఫోన్ ఐడియాది రూ. 6.542 కోట్లుగా నమోదైంది. 2021 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 0.9 శాతం క్షీణించి రూ. 117.84 కోట్లకు పరిమితమైంది. -
అదిరిందయ్యా అదానీ.. ‘పవర్’ఫుల్ లాభాలు!
లాభాల్లో అదానీ గత రికార్డులను తిరగ రాశాడు. కనివినీ ఎరుగని రీతిలో ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ కంపెనీకి సాధ్యం కానీ విధంగా లాభాలను కళ్ల జూసింది అదాని పవర్. 2022 మార్చి 31తో ముగిసిన క్వార్టర్ ఫలితాలు 2022 మే 5న ప్రకటించింది అదానీ పవర్. ఈ తాజా ఫలితాల్లో అదానీ పవర్ లాభాలు రూ.4,645 కోట్లుగా నమోదు అయ్యింది. అంతుకు ముందు ఏడాదికి ఇదే క్వార్టర్లో అదానీ పవర్ లాభాలు కేవలం రూ.13 కోట్లుగా ఉన్నాయి. తాజా ఫలితాలతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోయాయి. 2021-22 ఆర్థిక సంవత్సంరలో అదాని పవర్ రెవన్యూ 13,,308 కోట్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య రూ.6,902 కోట్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే అదానీ పవర్ లాభం 93 శాతం ఎగిసింది. ఈ ఏడాది కాలంలో ఆదాని పవర్ షేరు ధర రూ.97 నుంచి రూ.279.50కి పెరిగింది. ఈ షేర్లపై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్నులు అందాయి. ఇటీవల ఆదాని పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటింది. చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు! -
నాలుగు నెలల్లో దిగుబడి, తక్కువ ఖర్చు.. మార్కెట్లో ఫుల్ డిమాండ్
సాక్షి,రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని విసంపేట గ్రామంలో పలువురు రైతులు కీర దోసకాయ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో నాలుగు నెలల్లో గరిష్టంగా దిగుబడి పొందే అవకాశం ఉండటంతో పలువురు రైతులు కీర దోస సాగుపై మొగ్గు చూపారు. విసంపేటలో సుమారు 20 ఎకరాల్లో కీర దోస సాగు చేస్తున్నట్లు ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఖర్చు తక్కువ.. దిగుబడి అధికం కీర దోస సాగు ప్రారంభించిన తర్వాత నాలుగు నెలల కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వస్తుంది. భూమిలో బలం కోసం నెలకోసారి యూరియా చల్లితే సరిపోతుంది. నెల తర్వాత దిగుబడి ప్రారంభమై ప్రతిరోజూ సుమారు క్వింటాల్ కీర దోస పడుతుంది. భూమిపై పూర్తిగా పరుచుకొని సాగవుతుండటంతో కలుపు సమస్య ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువ. దిగుబడి ప్రారంభమయ్యాక ప్రతిరోజూ కాయలు తెంపాలి. మరుసటి రోజు తెంపితే ముదిరిపోయే అవకాశం ఉంటుంది. అధిక పోషక విలువలు.. ∙కీర దోసకాయల్లో అధిక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ∙నీటి శాతం, అంటీ యాక్సిడెంట్లు ఎక్కువ.హైడ్రేషన్ను ప్రోత్సహిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ జీవప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. ∙వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు, గొంతు తడిగా ఉంటూ శరీరం చల్లాగా ఉండేందుకు ఉపయోపడుతుంది. ∙300 గ్రాముల పొట్టు తీసిన దోసకాయలో కేలరీలు 45 గ్రాములు, కార్పొహైడ్రేట్స్ 11 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ సీ 14%, ప్రతీరోజు తీసుకోవడం వల్ల 62% కాల్షియం, మెగ్నీషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12% లభ్యమవుతాయి. ∙శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ∙బరువు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గడంలో సహాయపడుతుంది. ∙మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముక ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆదాయం బాగుంది నాకున్న అర ఎకరంలో ఫిబ్రవరి 10వ తేదీన దోస సాగు ప్రారంభించా. నెల రోజులకు దిగుబడి ప్రారంభమైంది. ప్రతిరోజూ సుమారు 50 కిలోల దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండటంతో తెంపిన క్షణంలోనే విక్రయిస్తున్న. 50 కిలోలకు రూ.800వరకు ధర పలుకుతోంది. ఆదాయం బాగుంది. – బర్పటి సంతోశ్, కీర దోస సాగు రైతు, విసంపేట రైతులను ప్రోత్సహిస్తున్నాం నిత్యం మార్కెట్లో విరివిగా డిమాండ్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కాయలను ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. విసంపేటలో రైతులు కీరదోసతో లాభాలు గడించడంతో మరికొంత మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లిస్తారు. – శ్రీకాంత్, ఉద్యానవనశాఖ అధికారి ప్రయోజనకరం వేసవిలో కీర దోస ఎంత ఎక్కువ తింటే అంత ప్రయోజనం. నీటి శాతం ఎక్కువ ఉండటంతో డీహైడ్రేషన్కు అవకాశం ఉండదు. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉండటంతో సైడ్ ఎఫెక్టŠస్ ఉండవు. శరీరంలో నీటిశాతం పెరగడంతో వేడిని గ్రహించదు. దాని విలువ తెలియడంతో ప్రతీ ఫంక్షన్, హోటల్లలో ముందుగా కీరదోస ముక్కలు అందిస్తున్నారు. – డాక్టర్ కటుకం అమర్నాథ్, ఎండీ(ఆయుర్వేదం) -
లాభాల్లోకి యస్ బ్యాంక్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్చేసి రూ. 1,819 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. -
వందల కోట్లే..ఎస్బీఐ కార్డ్స్కు పెరిగిన లాభం!
ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ మార్చి త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం మూడు రెట్లు వృద్ధితో రూ.581 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.175 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,468 కోట్ల నుంచి రూ.3,016 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం మార్చి త్రైమాసికానికి రూ.1,266 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,082 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫీజులు, కమీషన్ల రూపంలో వచ్చిన ఆదాయం రూ.1,114 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం 64 శాతం వృద్ధి చెంది రూ.1,616 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.984 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 17 శాతం మేర పెరిగి రూ.11,301 కోట్లుగా ఉంది. మొండి బకాయిల విషయంలోనూ ఎస్బీఐ కార్డ్స్ పనితీరు మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.22 శాతం, నికర ఎన్పీఏలు 0.78 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి 4.99 శా తం, 1.15 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్
ముంబై: వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్లో బ్రేక్ పడింది. క్రితం రోజు సూచీలు భారీగా నష్టపోవడంతో అనేక కంపెనీల షేర్ల ధరలు దిగి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధం , మూడో ప్రపంచ యుద్ధమంటూ రష్యా చేసిన హెచ్చరికలు మార్కెట్ను ప్రభావితం చేయలేకపోయాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ఈ రోజును ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. ఉదయం 9 గంటలకు 57,066 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత పైపైకి వెళ్లింది. ఓ దశలో 57,442 పాయింట్లను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 776 పాయింట్ల లాభంతో 57,356 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్లు లాభపడి 17,200 పాయింట్ల దగ్గర ముగిసింది. చదవండి: Stock Market: రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం! -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం హైజంప్!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం జంప్చేసి రూ. 7,719 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,886 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 59 శాతం ఎగసి రూ. 7,019 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 23,953 కోట్ల నుంచి రూ. 27,412 కోట్ల కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 44 శాతం వృద్ధితో రూ. 23,339 కోట్ల నికర లాభం సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 19.16 శాతంగా నమోదైంది. వడ్డీ ఆదాయం అప్ తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పుంజుకుని రూ. 12,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.84 శాతం నుంచి 4 శాతానికి బలపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 3.6 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు సైతం 1.14 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గాయి. రికవరీలు, అప్గ్రేడ్స్ రూ. 493 కోట్లు అధికమై రూ. 4,693 కోట్లను తాకాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 2,883 కోట్ల నుంచి సగానికిపైగా తగ్గి రూ. 1,069 కోట్లకు పరిమితమయ్యాయి. బ్యాంక్ హోల్సేల్ రుణాల చీఫ్ విశాఖ మూల్యే పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుత రిటైల్ బిజినెస్ హెడ్ అనుప్ బాగ్చీకి బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ బాటలో బాగ్చీ బాధ్యతలను ప్రస్తుత సీఎఫ్వో రాకేష్ ఝా చేపట్టనున్నట్లు వెల్లడించింది. -
వరుస నష్టాలకు చెక్.. మూడో రోజు లాభాలతో ముగింపు
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు వచ్చిన నష్టాలకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఆటోమొబైల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. చైనాలో కోవిడ్ పరిస్థితులు, ఉక్రెయిన్ ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నా వాటి ప్రభావం ఈ రోజు మార్కెట్పై కనిపించలేదు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,741 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో గరిష్టంగా 57,216 పాయింట్లను టచ్ చేసింది. చివరకు 57,053 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రోజు సెన్సెక్స్ 30 సూచీ 590 పాయింట్లు లాభపడింది. మరోవైపు నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 17,146 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగియగా స్మాక్ క్యాప్ షేర్లు ఇంకా నష్టాల బారి నుంచి బయట పడలేదు. ఈ రోజు మార్కెట్లో ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజూకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, షేర్లు లాభపడగా ఐసీఐసీఐ,. బజాజ్ ఫిన్ సర్వీస్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన దేశీ సూచీలు
ముంబై: మూడు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్కి బూస్ట్ని అందించాయి. ముఖ్యంగా కీలకమైన రెపోరేటు, రివర్స్ రెపోరేటులో ఎటువంటి మార్పులు చేయకపోవడం సానుకూలంగా మారింది. దీంతో ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు సూచీలు లాభపడ్డాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. 59,256 పాయింట్ల దగ్గర మొదలైన పరుగు ఓ దశలో గరిష్టంగా 59,654 పాయింట్లను తాకింది. అయితే చివరి గంటలో కొద్దిగా అమ్మకాలు సాగడంతో మార్కెట్ ముగిసే సమయానికి 412 పాయింట్ల లాభంతో 59,447 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ విషయానికి వస్తే 145 పాయింట్లు లాభపడి 17,784 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మిడ్క్యాప్ కంపెనీల షేర్లు 0.98 శాతం వృద్ధి చూపించగా స్మాల్క్యాప్ కంపెనీలు 0.39 వృద్ధిని కనబరిచాయి. ఐటీసీ, రెడ్డీస్, ఎంఅండ్ఎం, టైటాన్, రిలయన్స్, టాటాస్టీల్ షేర్లు లాభాలు పొందగా టెక్మహీద్రా, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. -
పూత నిలవలె..పిందె ఎదగలె
జగిత్యాల అగ్రికల్చర్/ కొల్లాపూర్: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తున్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3.5 టన్నుల చొప్పున రావాల్సిన దిగుబడి.. ప్రస్తుతం 1 నుంచి 1.5 టన్నుకు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు తెలంగాణ రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, నాగర్కర్నూల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేలల రకాన్ని బట్టి ఎకరానికి 3.5 టన్నుల చొప్పున 11.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల తొలుత అంచనా వేశారు. ఎర్రనేలల్లో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించారు. అధిక వర్షాలతో తేమ ఆరక.. అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. కానీ గత ఏడాది నవంబర్ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. రసం పీల్చిన పురుగులు అధిక వర్షాలతో దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం వంటి పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో నల్ల తామర, తేనెమంచు పురుగులు పంట కాలానికి ముందు చెట్టు కాండం, కొమ్మల బెరడులో దాక్కుని పూత, పిందె సమయంలో చెట్టు పైకి వచ్చి నష్టం చేశాయి. పురుగులు గుంపులుగా చేరి పూలు, పిందెల నుంచి రసం పీల్చాయి. దీంతో పూత రాలిపోయింది. నల్ల తామర పురుగులు పిందెల దశలో చర్మాన్ని గోకి రసం పీల్చి నష్టం కలిగించాయి. తగ్గనున్న దిగుబడులు.. పురుగులు, తెగుళ్లకు తోడు పోషకాల లోపంతో ఈ ఏడాది మామిడి దిగుబడి ఎకరాకి టన్ను నుంచి 1.5 టన్నుల వరకు పడిపోయే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 5–6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా 41– 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉన్న పిందెలు, కాయలు కూడా రాలిపోతున్నాయి. కొల్లాపూర్ మామిడికీ కరువే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన దిగుబడులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లకు బాగా ప్రసిద్ధి. అందులోనూ బేనీషాన్ రకం పండ్లకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్ మామిడి పండ్లకు ఈసారి కరువొచ్చే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,670 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిన్నరసాలు, పెద్దరసాలు, దెసేరీ, నీలిషాన్ తదితరాలతో పాటు ప్రధానంగా బేనీషాన్ రకం మామిడిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈసారి 60 శాతం తోటల్లో జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో పూత వచ్చింది. ఇదే సమయంలో వర్షాలు పడడంతో పూతను దెబ్బతీసింది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు సోకే నల్ల తామర పురుగు మామిడి పంటకు సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం కేవలం 40 శాతం తోటల్లోనే మామిడి కాపు కాసింది. టన్ను ధర లక్ష పైచిలుకే.. పంట దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి మామిడి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ముంబై వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 దాకా చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను ధర రూ.లక్ష పైచిలుకు పలుకుతోంది. పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఎకరాకి రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. రెండు, మూడుసార్లు రసాయన మందులు చల్లినా పూత నిలువలేదు. పిందె ఎదగలేదు. కాయలను చూస్తే.. పెట్టుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. – పడిగెల రవీందర్రెడ్డి, రాయికల్, జగిత్యాల జిల్లా తేనె మంచుతో రాలిన పూత సాధారణంగా నవంబర్ నెలాఖరులో, డిసెంబర్లో మామిడిపూత ప్రారంభం కావాలి. కానీ ఆలస్యంగా ప్రారంభమైన పూత ఈ ఏడాది మార్చి వరకు వస్తూనే ఉంది. ఆ సమయంలోనే తేనె మంచు ఆశించింది. పూత రాలిపోయింది. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన అధికారి, జగిత్యాల ఒక్క కాయ కూడా తెంచలేదు సొంత భూమి 30 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల మామిడి తోట కౌలు కు తీసుకున్నా. రూ.35 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లు, వాతావరణ మార్పులతో ఒక్క తోటలోనూ పూత నిలబడ లేదు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంచలేదు. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి దిగుబడి ఈసారి 60 శాతం తగ్గింది. సకా లంలో పూత రాకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నల్ల తామర తెగులు సోక డంతో పంట దిగుబడి తగ్గింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. పంటనష్టం, దిగుబడి వివరాలను అధికారులకు చెప్పాం. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ -
ఆ పంట వేశా.. ఆకారం వినూత్నంగా ఉండడంతో ఎగబడి కొంటున్న జనం!
వీణవంక(హుజూరాబాద్): ఏళ్లుగా వరి సాగు చేయడంతో భూసారం దెబ్బతింటుంది. దీనికి తోడు ధాన్యం విక్రయించడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో పుచ్చ సాగును ఎంచుకున్నాడు. కొత్తరకం వంగడాలను తీసుకొచ్చి సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన రైతు కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి. తనకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు సాగు చేశాడు. ప్రస్తుతం రెండెకరాల్లో కోత పూర్తయింది. మరో రెండెకరాలు పూత దశలో ఉంది. ఏప్రిల్లో కోతకు రానుంది. ఒకే సారి నాలుగెకరాల్లో పంట వేస్తే కోత ఒకేసారి వస్తుంది. దీంతో కాయలకు డిమాండ్ తగ్గుతుందనే ఆలోచనతో ఈ విధంగా సాగు చేశాడు. మరో ఎకరంలో మిర్చి, మిగిలిన ఎకరంలో వరి సాగు చేశాడు. రెండేళ్లుగా సాగు.. తనకున్న ఆరెకరాల్లో 20ఏళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. ఒకే రకమైన పంట ఏళ్లుగా వేస్తుండడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి పెరిగింది. దీంతో డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో పుచ్చ సాగు చేయగా గతేడాది 100టన్నుల దిగుబడి వచ్చింది. ఖర్చులు పోనూ రూ.2లక్షల ఆదాయం సమకూరింది. కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకున్నాడు. నీటి తడులు తగ్గించేందుకు డ్రిప్ ఏర్పాటు చేశాడు. ‘ఎల్లో’ పుచ్చకు డిమాండ్ గతేడాది తెల్లపుచ్చ సాగు చేయగా ఈసారి ‘ఎల్లో’పుచ్చను రెండెకరాల్లో సాగు చేశాడు. రిలయన్స్ కంపెనీకి 10టన్నుల పంటను కిలోకు రూ.20 చొప్పున విక్రయించాడు. ఒక్కో కాయ 3నుంచి 4కిలోల బరువు ఉంది. మరో 5టన్నులు చేను వద్దకే వచ్చి ప్రజలు కొన్నారు. మరో రెండెకరాల్లో పంట పూత దశలో ఉంది. ఎల్లో పుచ్చ ఆకారం వినూత్నంగా ఉండటంతో ప్రజలు కొనుగోలుకు మొగ్గు చూపినట్లు రైతు తెలిపాడు. పచ్చి మిర్చికీ ఆదాయం గతేడాది ఎకరంలో అరటి పంట వేయగా దిగుబడి రాలేదు. దీంతో ఈసారి ఎకరంలో మిర్చి వేశాడు. చేను ఏపుగా పెరిగి దిగుబడి బాగా వచ్చింది. 10క్వింటాళ్ల పచ్చిమిర్చికి రూ.90వేల ఆదాయం వచ్చినట్లు శ్రీనివాస్రెడ్డి తెలిపాడు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే అధిక లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఉద్దేశంతో పుచ్చ సాగును ఎంచుకున్న. ఆరెకరాల పొలం మడులను చెడగొట్టి చెలక చేసిన. చేను చుట్టూ నీరు నిల్వ ఉండకుండా కందకాలు కొట్టిచ్చిన. పుచ్చ పంటతో మంచి లాభం వచ్చింది. పచ్చి మిర్చి మీదమీదనే అమ్ముడు పోయింది. వచ్చే ఏడాది కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తా. రైతులు కూడా ఒకేరకం కాకుండా ఇతర పంటల వైపు చూడాలి. – కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, రైతు, మామిడాలపల్లి -
సింపుల్ పని చేశారు.. రూ.1.35 కోట్ల జాక్పాట్ కొట్టేశారు..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్ స్టాక్ ఐనా దీపక్ నైట్రేట్ కంపెనీ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత కొద్ది రోజులుగా మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ప్రముఖ కెమికల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీపక్ నైట్రేట్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 2010 అక్టోబర్లో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో స్టాక్ ధర రూ. 17.81 పైసలుగా ఉంది. గత పది ఏళ్లలో స్టాక్ విలువ భారీగా ఎగబాకింది. ప్రస్తుతం ఈ స్టాక్ షేర్ ధర రూ. 2013.45 చేరింది. ఈ స్టాక్ ధర ఒకానొక సమయంలో ఏకంగా రూ. 2897.80కు చేరుకుంది. కాగా పదేళ్ల క్రితం ఈ స్టాక్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 1.35 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్ హోల్డర్లకు దాదాపు 1,900 శాతం రాబడిని అందించింది. సుమారు పదేళ్ల పాటు నిరీక్షించిన షేర్ హోల్లర్లకు దీపక్ నైట్రేట్ కాసుల వర్షాన్ని కురిపించింది. దీపక్ నైట్రేట్ దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఒక స్వదేశీ రసాయన తయారీ సంస్థ. దీని తయారీ కేంద్రాలు గుజరాత్లోని నందేసరి, దహేజ్, మహారాష్ట్రలోని రోహా, తలోజా, తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నాయి. 2020లో కంపెనీ నికర ఆదాయం రూ. 611 కోట్లుగా ఉంది.దీపక్ ఫినోలిక్స్ లిమిటెడ్ , దీపక్ నైట్రేట్ కార్పొరేషన్ ఇంక్ , నోవా సింథటిక్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. చదవండి: యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ బ్యాంక్ బిజినెస్ -
జీ టీవీకి ఝలక్ !
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రూ. 99 కోట్లు తగ్గి రూ. 299 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 398 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,130 కోట్లకు క్షీణించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం వ్యయాలు రూ. 1,701 కోట్లకు చేరాయి. క్యూ3 టర్నోవర్లో ప్రకటనల నుంచి రూ. 1,261 కోట్లు, సబ్స్క్రిప్షన్ ఆదాయం రూ. 790 కోట్లు, ఇతర సర్వీసులు, అమ్మకాల నుంచి రూ. 62 కోట్లు చొప్పున లభించాయి. గత క్యూ3లో ఇతర సర్వీసుల పద్దుకింద భారీగా రూ. 842 కోట్ల ఆదాయం నమోదుకావడం గమనార్హం! ఈ కాలంలో సోనీ పిక్చర్స్ అనుబంధ సంస్థతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. -
కాసులు కురిపిస్తున్న వ్యాపారం, ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్గ్రీనే !
డాబాగార్డెన్స్(విశాఖ): మామ్మూళ్ల బెడద లేదు. కరెంటు.. ఇంటి అద్దె ఖర్చు లేదు. ఒకే వ్యాపారం చేయాలన్న ఒత్తిడి లేదు. నచ్చిన చోట మెచ్చిన వ్యాపారం. టిఫిన్ సెంటర్ నుంచి షర్బత్ బండి వరకు.. వినియోగదారులకు మెచ్చే ఆహారం. మొబైల్ బిజినెస్ ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్గ్రీన్ ట్రెండ్. పట్టణీకరణ పెరగడంతో సాటి మానవుడి అవసరాలు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బిజీబిజీ జీవనంలో శుచి, శుభ్రతతో ఉన్న వస్తువులు తమ వాకిట్లో లేదా తాము విధులు నిర్వహించే చోట, ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. జీవనం యాంత్రికం అయిపోవడంతో హోటళ్లు, షాపులకు వెళ్లే సమయం చాలా మందికి దొరకడం లేదు. దీంతో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగానే వ్యాపారులు తమ వ్యాపార పద్ధతులను మార్చుకున్నారు. వాహనాల్లో మొబైల్ హోటళ్లు, షర్బత్లు సిద్ధం చేస్తున్నారు. పచ్చళ్లు, కాయగూరలు, విద్యుత్ బల్బులు, స్వీట్లు, దుస్తులు, కొబ్బరి బొండాలు, ఐస్క్రీంలు, పలు రకాల పండ్లు కూడా ఆటోల ద్వారా విక్రయిస్తున్నారు. దీని వల్ల వినియోగదారుల చెంతకే ఆహార పదార్థాలు చౌకైన ధరలకు అందడం ఒక విషయమైతే.. వ్యాపారులు కూడా ఒకే చోట ఉండి అ క్కడి పరిస్థితుల మీదనే ఆధార పడకుండా ఎక్కడ, ఏ సమయంలో వ్యాపారం జరుగుతుందంటే అక్కడ వాలిపోతున్నారు. ఫలితంగా వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నగరంలో గజం స్థలం ధర చుక్కలంటడం, పైగా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుందామన్నా పలు విధాల ఒత్తిళ్లు, మామ్మూళ్లు బెడద ఎక్కువైపోయింది. వీటన్నింటిని నుంచి విముక్తితో పాటు కరెంటు, ఇంటి అద్దె వంటి తదితర ఇబ్బందులు లేకపోవడంతో ఈ మొబైల్ వ్యాపారమే చాలా భేషుగ్గా ఉందని వ్యాపారులు అంటున్నారు. వినియోగదారులు అయితే హోటల్కు వెళ్లి వేచి ఉండాల్సిన పని లేకుండా పనులకు వెళ్లే దారిలోనే టిఫిన్ కానిచ్చేస్తున్నారు. పండ్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు జీవీఎంసీ పరిధి దక్షిణ నియోజకవర్గంలో కొకొల్లాలు. నగరంలోని సౌత్జైల్రోడ్డులో ఫుడ్ ఆన్ వీల్స్ ఘుమఘుమలు పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా వాటికి బ్రేక్ ఇచ్చారు. ఇక సాయంత్రమైతే చాలు.. చినవాల్తేరు, బీచ్రోడ్డు పలు ప్రాంతాల్లో ఫుడ్ ఆన్ వీల్స్.. వందలాది బండ్లు అక్కడకు చేరుకుంటాయి. చేతిలో కార్డు ఉండే చాలు. చక చకా ఏం కావాలో అవి తినొచ్చు. ఏటీఎం డెబిట్/క్రెడిట్ కార్డ్స్తో పాటు పేటీఎం, గూగూల్ పే.. ఇలా ఎన్నో రకాలుగా నగదు చెల్లించేయొచ్చు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు (ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్నందున రాత్రి 9 గంటల వరకే) ఇక్కడ టిఫిన్, నూడిల్స్, చికెన్ జాయింట్లు..ఫ్రైడ్ రైస్.. అన్ని రకాల చికెన్ వంటకాలతో పాటు చల్లని పానీయాలు కూడా మొబైల్ వ్యాన్ల ద్వారానే లభిస్తున్నాయి. మొత్తానికి ఈ బిజినెస్ ఇటు వినియోగదారులకు.. అటు వ్యాపారులకు ఇద్దరికీ సంతృప్తిని కలిగిస్తోంది. -
ఎల్ఐసీ దూకుడు..తొలి ఆర్నెళ్లలో రాకెట్లా..
ముంబై: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–సెప్టెంబర్లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,437 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఏప్రిల్–సెప్టెంబర్లో రూ. 6.14 కోట్లు మాత్రమే ఆర్జించింది. కొత్త బిజినెస్ ప్రీమియం 554 శాతం వృద్ధి చూపింది. మొత్తం నికర ప్రీమియంలు రూ. 1,679 కోట్లు పెరిగి దాదాపు రూ. 1.86 లక్షల కోట్లను తాకాయి. ఈ పద్దుకింద గతేడాది ఇదే కాలంలో రూ. 1.84 లక్షల కోట్లు నమోదైంది. మొత్తం ప్రీమియంలు, పెట్టుబడులపై ఆదాయం రూ. 17,404 కోట్లు ఎగసి రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. వీటిలో పెట్టుబడులపై ఆదాయం వాటా రూ. 15,726 కోట్లు పెరిగి రూ. 1.49 లక్షల కోట్లయ్యింది. చదవండి: Maruti Suzuki: మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! ఆ రెండూ తీవ్రంగా దెబ్బతీశాయి..! -
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. దీర్ఘకాలం కొనసాగిన కరెక్షన్ వల్ల షేర్ల ధరలు పడిపోవడంతో దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లో జోష్ కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 9:20 గంటల సమయానికి 331 పాయింట్లు లాభపడి 57,771 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 17,177 దగ్గర కొనసాగుతోంది. -
సింగరేణి.. సూపర్ హిట్! ఈ ఏడాది లాభం ఎంతంటే ?
సాక్షి, మంచిర్యాల: కరోనా పరిస్థితులను అధిగమించిన సింగరేణి సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడా ది కరోనా ప్రభావంతో నష్టాలను మూటగట్టుకోగా, ఈసారి మొదటి నెల నుంచే తిరిగి వృద్ధిని కొనసాగిస్తోంది. సంస్థ చరిత్రలో తొలిసారిగా రూ.16,512 కోట్ల మేర విద్యుత్, బొగ్గు అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించినట్లు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.924 కోట్ల లాభం గతేడాది కన్నా 63 శాతం అ«ధికంగా విక్ర యాలు జరిపి, ఈ ఆర్థిక సంవత్సరంలో గత 8 నెలల కాలానికిగాను రూ.924.40 కోట్ల లాభాలను ఆర్జించింది. బొగ్గు అమ్మకాల్లో రూ.13,973 కోట్లతో గతేడాది కంటే 75 శాతం అధికంగా వృద్ధి సాధించింది. రూ.2,539 కోట్ల మేర విద్యుత్ అమ్మకాలు జరిపి, గతేడాది కంటే 18 శాతం మెరుగ్గా పురోగమించింది. గతంలో నష్టాలు గతేడాది కోవిడ్ కారణంగా ఇదే సమయానికి సంస్థ రూ.1,038 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గుఅమ్మకాల్లో చూస్తే 75 శాతం, విద్యుత్ అమ్మకాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది కంటే అధికలాభాలు సాధించినందుకు కార్మికు లు, అధికారులు, కార్మిక సంఘాలకు సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. వచ్చే మూడున్నర నెలల్లోనూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కోరారు. చదవండి:సింగరేణికి సోలార్ ఎక్సలెన్స్ పురస్కారం -
ఈ స్పెషల్ హ్యాండ్బ్యాగ్ని అమ్మితే.. కోట్లలో లాభాలు..
పెట్టుబడి మీద మంచి లాభాలు కొనాలంటే బంగారం, రియల్ ఎస్టేట్ సులువైన మార్గాలు. కొంచెం శ్రమిస్తే స్టాక్మార్కెట్ కూడా ఎక్కువ లాభాలే అందిస్తుంది. కానీ వీటన్నింటిని ఈ బ్యాగును కొన్ని కొన్నాళ్లు వాడుకుని అమ్మేసినా చాలు పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్ను మించి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంతకీ కాసుల పంట పండిస్తున్న ఆ బంగారుబాతు లాంటి బ్యాగు పేరు హెర్మిస్ బిర్కిన్. హోదాకు చిహ్నం సెలబ్రిటీ, ధనవంతుల ప్రపంచంలో బిర్కిన్ బ్యాగులకు ఉండే క్రేజ్ వేరు. ఐశ్వర్యవంతుల కుటుంబ సభ్యులు బిర్కిన్ బ్యాగుని ధరించడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ బ్యాగును కొనుగోలు చేసేందుకు ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకడారు. ఫుట్బాల్ స్టార్ ఆటగాడు బెక్హామ్ భ్యార విక్టోరియా బెక్హామ్ దగ్గర వందకు పైగా బిర్కిన్ బ్యాగులు ఉన్నాయి. వీటి విలువ రూ. 7 కోట్లకు పైమాటే. అదే విధంగా సింగపూర్ ఎంట్రప్యూనర్ జేమీ చువా దగ్గర అయితే ఏకంగా ఈ బ్యాగులు రెండు వందలకు పైగానే ఉన్నాయి. హిమాలయ ధర రూ.3.75 కోట్లు హెర్మిస్ బిర్కిన్ బ్యాగుల్లో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ ఇందులో అత్యంత ప్రత్యేకమైనవి హిమాలయ శ్రేణి హ్యాండ్ బ్యాగులు. ఈ బ్యాగు తయారీలో ప్రత్యేకమైన జంతు చర్మం ఉపయోగించడంతో పాటు 18 క్యారెట్ బంగారంతో చేసిన మెటీరియల్ 200 వజ్రాలు ఈ బ్యాగులో పొదిగి ఉంటాయి. అమెరికన్ బెట్టింగ్ రారాజు డేవిడ్ ఓనాసియా హిమాలయన్ బ్యాగుని ఇటీవల 5 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 3.75 కోట్లు )చెల్లించి కొనుగోలు చేశాడు. ఒక్క హ్యాండ్ బాగుకి సంబంధించి ఇదే అత్యధిక ధర. ప్రపంచ రికార్డు కూడా. కానీ త్వరలోనే ఈ రికార్డు కూడా మాయం కాబోతుంది. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో ఈ బ్యాగుని 20 లక్షల డాలర్ల (రూ.14 కోట్లు)కి అమ్మేస్తానంటూ చెబుతున్నాడు డేవిడ్ ఓనాసియా. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ బ్యాగుకి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఎలా వచ్చాయి ఇంగ్లండ్కి చెందిన నటీ సింగర్ జేన్ బిర్కిన్ ఓసారి ప్యారిస్ నుంచి లండన్కి విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె తన హ్యాండ్బ్యాగుని లగేజ్ ర్యాక్లో పెట్టగా.. మార్గమధ్యంలో స్ట్రాప్ ఊడిపోయి అందులో వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ హెర్మీస్ సీఈవో లూయిస్ డ్యుమాస్, జేన్ కిర్బిన్ ఇబ్బందిని గమనించాడు. ఇకపై మీకు ఈ సమస్య ఉండదంటూ ఆమెకు హమీ ఇచ్చాడు. ఏడాదిలోగా అన్నట్టుగానే ఏడాది తిరిగే సరికి అత్యంత సుందరైన, సౌకర్యవంతమైన బ్యాగుని తయారు చేసి దానికి బిర్కిన్ అనే పేరు పెట్టి ఆ నటికి బహుమతిగా అందించాడు. ఈ ఘటన 1984లో జరిగింది. ఎంపిక చేసిన జంతువుల చర్మాలతో ఎంతో కళాత్మకంగా పూర్తి హ్యాండ్ మేడ్గా బిర్కిన్ బ్యాగు రూపొందింది. పైగా ఆనాటి ప్రముఖ నటి పేరు మీదుగా రావడం దీనికి ప్లస్ అయ్యింది. అంతే ఐదేళ్లు తిరిగే సరికి బిర్కిన్ బ్యాగ్ సెలబ్రిటీల హోదాకు ప్రత్యామ్నయంగా మారింది. డిమాండ్ ఎందుకు సెలబ్రిటీల హోదాకు బిర్కిన్ చిహ్నంగా మారడంతో 90వ దశకంలో ధనవంతులు ఈ బ్యాగులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటం మొదలైంది. అయితే డిమాండ్ ఎంత ఉన్నా హెర్మిస్ సంస్థ ఈ బ్యాగులను పరిమితంగానే తయారు చేయడం ప్రారంభించింది. ఎంతటి ధనవంతులైనా.. ఎంత డబ్బులు చెల్లిస్తామన్నా ఎన్నంటే అన్ని బ్యాగులు తయారు చేయదు హెర్మిస్. పైగా బ్యాగులు కొనుగోలుపై కూడా పరిమితి విధిస్తుంది. దీంతో వీటి పట్ల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వీటిని తమ భాగస్వామికి బహుమతిగా అందించేందుకు కోటీశ్వరులు ఊవ్విళ్లూరుతారు. ఎలాగైనా ఈ బ్యాగు ఉండాల్సిందే అనుకునే మగువల క్యూ అంతకంతకు రెట్టింపయ్యింది. అందుకే కోట్ల రూపాయలు పోసీ బిర్కిన్ బ్యాగులు కొనేస్తున్నారు. 500ల శాతం పరిమిత సంఖ్యలో బ్యాగులు లభించడం, అపరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో అనతి కాలంలోనే బిర్కిన్ బ్యాగుల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దానికి తగట్టే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని కొనేందుకు పోటీ పెరిగింది. వాడిన బ్యాగులైనా సరే అసలు కంటే ఎక్కువ ధర పెట్టి కొనడం మొదలైంది. 2017లో చేపట్టిన సర్వేలో బిర్కిన్ బ్యాగుల విలువ గడిచిన 35 ఏళ్లలో 500 శాతం పెరిగినట్టు.. ప్రతీ ఏడు ఈ బ్యాగుల విలువ 14 శాతం పెరుగుతూ వస్తోందని తేలింది. ఫేక్ల వెల్లువ బిర్కిన్ బ్యాగులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లో ఫేక్ బ్యాగులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. అయినా సరే ఫేక్లను పూర్తిగా అరికట్టలేకపోయారు. - సాక్షివెబ్ ప్రత్యేకం -
విజయ డయాగ్నోస్టిక్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విజయ డయాగ్నోస్టిక్స్ లాభం స్వల్పంగా పెరిగి రూ. 27.7 కోట్లుగా నమోదైంది. గత క్యూ2లో ఇది రూ. 26.4 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 113.1 కోట్ల నుంచి రూ. 112.1 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన కోవిడ్యేతర పరీక్షలపరమైన ఆదాయం 22 శాతం పెరగ్గా, కోవిడ్ టెస్టులపరమైన ఆదాయం (ఆర్టీ–పీసీఆర్, యాంటీబాండీ పరీక్షలు) 70% క్షీణించినట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే ఐపీవోకి వచ్చి న విజయ డయాగ్నోస్టిక్స్.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కొత్తగా 5 సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి తెలిపారు. -
లేడీ బాస్ ఉదారత.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్
సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు. ఇప్పుడు ఈ బాస్ల టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా బాస్ మీద ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్. ఆ వివరాలు... (చదవండి: ట్రెండింగ్లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే) స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్బైబిల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ బ్లాక్స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది సారా. ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది. (చదవండి: అద్భుతం చేసిన ఫేస్బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత) "ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని తమదైన రీతిలో జరుపుకోవాలని, జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్లో బిగ్బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు -
మండే.. ‘మనీ’డే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఒక రోజు ఆదాయాన్ని పొందింది. సోమవారం ఏకంగా రూ.14.79 కోట్ల ఆదాయాన్ని టికెట్ల రూపంలో సాధించింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో సోమవారం 34.37 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కాగా, దసరా రద్దీ నేపథ్యంలో నమోదవుతున్న ఆదా యాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం రూ.13.35 కోట్లను సంస్థ లక్ష్యంగా నిర్ధారించుకుంది. 111% లక్ష్య సాధనతో రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే రోజున రూ.4.80 కోట్లు మాత్రమే సమకూరింది. ఈసారి ఆక్యుపెన్సీ రేషియో 77.15గా నమోదైంది. కి.మీ.కు ఆదా యం (ఈపీకే)రూ.40.74గా నమోదైంది. మొత్తం ఆదాయంలో కరీంనగర్, హైదరాబాద్ జోన్లు రూ.10.98 కోట్లు సాధించటం విశేషం. ఆదిలాబాద్, రంగారెడ్డి రీజియన్లు మినహా మిగతా 9 జోన్లు 100 శాతాన్ని మించి లక్ష్యాన్ని సాధించాయి. సగటున రూ.9 కోట్ల రోజువారీ ఆదాయం దసరా రద్దీ వేళ ఆర్టీసీ సాధారణ ఆదాయాన్నే పొందింది. బుధవారం నుంచి ఆదివారం వరకు రూ.43.73కోట్ల ఆదాయాన్ని పొందింది. బుధవారం రూ.10.42 కోట్లు, గురువారం రూ.9.93 కోట్ల ఆదాయం వచ్చింది. దసరా, మరుసటి రోజు రూ.5.74కోట్లు, రూ.7.43 కోట్లు వచ్చాయి. మళ్లీ తిరుగుప్రయాణాల్లో ఆదివారం రూ.10.21 కోట్లు వచ్చిపడ్డాయి. కాగా, ఏసీ బస్సుల్లో సగం సీట్లు మిగిలిపోయాయి. -
ఇవి షేర్లా.. బుల్లెట్ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి
వియ్ డోంట్ బ్రేక్ రికార్డ్స్, వియ్ క్రియేట్ రికార్డ్స్ ఈ క్యాప్షన్ ఓ సినిమా ప్రచారానికి సంబంధించింది. ఇప్పుడు ఇదే క్యాప్షన్ ఐఆర్సీటీసీ షేర్లకు అన్వయించే పరిస్థితి స్టాక్ మార్కెట్లో నెలకొంది. పాత రికార్డుల సంగతి దేవుడెరుగు వారానికో కొత్త రికార్డు నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఐఆర్సీటీసీ షేర్లు మరోసారి దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేర్లతో ఒక్కసారిగా వచ్చిపడుతున్న లాభాలతో ఇన్వెస్టర్లు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరోవైపు ఈ దూకుడుకు కారణాలు వెతికే పనిలో మార్కెట్ విశ్లేషకులు ఉన్నారు. ఆల్టైం హై ఆన్లైన్లో రైలు టిక్కెట్స్ బుకింగ్ సర్వీసును అందించే ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థ షేర్లు బుల్లెట్ రైలును తలపిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట ఆల్టైం హై ధరగా ఒక్కో షేరు ధర రూ.4786లు పలికింది. దీంతో చాలా మంది విశ్లేషకులు ఇంత కంటే ధర పెరగడం కష్టమంటూ పేర్కొన్నారు. లాభాలు స్వీకరించాలనుకునే వారు ఇక్కడే షేర్లను అమ్మివేయడం బెటర్ అంటూ సూచించారు. కానీ వారి అందరి అంచనాలు వారం రోజుల వ్యవధిలో తలకిందులయ్యాయి. ఐదు వేలు అలవోకగా ఐఆర్సీటీసీ షేర్లకు 5000 దగ్గర రిసిస్టెన్స్ తప్పదని అంచనాలు నెలకొన్నాయి. ఐదు వేల మార్క్ చేరుకునేందుకు చాలా సమయం పడుతుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అదంతా తప్పని తేలియపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒక్కో షేరు రూ. 4786 నుంచి రూ. 5480కి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. గత వారం ఆల్టైం హై దగ్గర అనుమానంగా ఈ కంపెనీ షేర్లను కొన్నవారికి సైతం భారీ లాభాలను అందించింది ఐఆర్సీటీసీ. ఏడాది క్రితం సరిగ్గా ఏడాది కిందట అక్టోబరు 15న ఐఆర్సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పటి నుంచి ప్యాసింజర్ రైలు తరహాలో నెమ్మదిగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. 2021 జులై మొదటి వారంలో ఒక్కో షేరు ధర రూ. 2300లకు అటుఇటుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ వేగం అందుకుని కేవలం రెండు నెలల వ్యవధిలో అంటే సెప్టెంబరు మొదటి వారం నాటికి ఒక్కో షేరు ధర రూ. 3300లను టచ్ చేసింది. ఆ తర్వాత సూపర్ఫాస్ట్ వేగంతో నాలుగు వేలు,. బుల్లెట్ రైలు వేగంతో ఐదువేలు క్రాస్ చేసి ఆల్టైం హై రూ. 5480ని టచ్ చేసింది. అందువల్లేనా కోవిడ్ అనంతరం రైలు ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దేశం మొత్తం మీద ఆన్లైన్లై టిక్కెట్టు అందించే వ్యవస్థ ఐఆర్సీటీసీ ఒక్కటే ఉంది. కాబట్టి ఈ కంపెనీ పనితీరుకి ఢోకా లేదనే నమ్మకం ఇన్వెస్టర్లలో నెలకొందని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒక్క రైలు టిక్కెట్స్ అమ్మకమే కాకుండా దాదాపుగా అన్ని నగరాల్లో ఆతిధ్య సేవలు అందివ్వడం పైనా ఐఆర్సీటీసీ దృష్టి పెట్టిందని, ఇప్పటికే హోటల్ చెయిన్స్తో ఒప్పందాలు కూడా ఖరారు అయ్యాయని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగాడియా అంటున్నారు. లాభాలు ఇలా సరిగ్గా ఏడాది కిందట ఐఆర్సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పుడు రూ.1,32,900లను ఇన్వెస్ట్ చేసి వంద షేర్లు కొంటే ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ. 5,48,000 చేరుకుంది. అంటే ఏడాదిలో నికరంగా రూ. 4,16,900 లాభం అందింది. ఇక గత వారం రూ. 4,78,600 వెచ్చింది వంద షేర్లు కొన్న వారికి సైతం సుమారు రూ.70,000ల లాభం అందింది. స్టాక్మార్కెట్లో టాటా గ్రూపు జోరు మధ్య సైతం ఐఆర్సీటీసీ తన వేగాన్ని కొనసాగిస్తోంది. చదవండి: ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే -
ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే
వెండితెరపై హీరో హీరోయిన్ల జోడీ బాగా కుదిరితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటారు. అచ్చంగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు, లాభాల మధ్య కెమికల్ షేర్ల విషయంలో ఏడాది కాలంగా చక్కని కెమిస్ట్రీ కుదురుతోంది. ఈ కెమికల్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. యాక్షన్.. రియాక్షన్ అణువులు పరమాణువులు అందులో ఉండే ఎలక్ట్రాన్ల మధ్య చర్యలతో కూడినదే కెమిస్ట్రీ. కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కొత్త పదార్థాలు పుట్టుకొస్తాయి. అదేవిధంగా ఎక్కడో చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహరాలు ఇండియాలో కెమికల్ షేర్ల ధరలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. ఏడాదిలో ఐదింతలు ఏడాది వ్యవధిలోనే దేశీ స్టాక్మార్కెట్లో ఐదు కెమికల్ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది వ్యవధిలోనే కనీసం లక్షకు రెండు లక్షలు మొదలు ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు అందించాయి. ఐటీ, మెటల్, ఫైనాన్స్ కంపెనీలను వెనక్కి నెట్టి ముదుపరులకు అతి భారీ లాభాలను స్వల్ప కాలంలోనే కెమికల్ షేర్లు అందిస్తున్నాయి. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన కొన్ని కంపెనీలు, వాటి షేర్ల ధరల వివరాలు ఇన్వెస్టర్ల ఇంట సిరుల పంట - బాలాజీ అమీన్స్ అనే కెమికల్ కంపెనీ 1988లో మార్కెట్లో లిస్టయ్యింది. అప్పటి నుంచి గతేడాది వరకు ఈ కంపెనీ షేరు విలువ సాధారణ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కానీ గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ షేరు విలువ 450 శాతం పెరిగింది. 2020 అక్టోబరు 20న ఈ కంపెనీ ఒక షేరు విలువ రూ. 816 ఉండగా 2021లో ఈ ధర అమాంతం పెరిగి రూ.4,488లకు చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ 14,525 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఫార్మా రంగానికి సంబంధించిన కెమికల్స్ తయారు చేస్తోంది. - గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీ 1987లో నోయిడా సమీపంలో స్థాపించారు. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్, కాస్టిక్ సోడా, క్లోరో మీథేన్ తదితర రసాయనాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ 2020 అక్టోబరులో రూ. 484 ఉండగా ప్రస్తుతం ఈ విలువ రూ. 2,167లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే కంపెనీ షేర్ వ్యాల్యూ 348 శాతం పెరిగింది. - దీపక్ నైట్రేట్ సంస్థ బల్క్ కెమికల్ కమోడిటీస్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేరు విలువ గతేడాది రూ. 716లు ఉండగా 2021 అక్టోబరు వచ్చేసరికి 298 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ. 2,852లుగా పలుకుతోంది. పెట్రోకెమికల్స్, అగ్రోకెమికల్స్, ఫార్మా తదితర రంగాలకు ఈ కంపెనీ నుంచి బల్క్ కెమికల్స్ వెళ్తుంటాయి. - ప్రివీ స్పెషాలిటీ కెమికల్ సంస్థ షేర్లు ఏడాది వ్యవధిలో 258 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరులో షేరు విలువ రూ.527లు ఉండగా ప్రస్తుతం అది రూ.1,891కి చేరుకుంది. ఏడాది వ్యవధిలో గరిష్టంగా రూ.2,070ని తాకగా కనిష్టంగా రూ.501కి పడిపోయింది. - అల్కైల్ అమీన్స్ సంస్థ పెయింట్స్, రబ్బర్, వాటర్ ట్రీట్మెంట్ తదితర రంగాలకు కెమికల్స్ని సరఫరా చేస్తుంది,. గతేడాది ఈ కంపెనీ షేరు విలువ రూ.1,228 ఉండగా ఏడాది కాలంలో 223 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3970 దగ్గర ట్రేడవుతోంది. ఈ ఏడాది కాలంలో గరిష్టంగా రూ.4,749కి చేరుకోగా కనిష్టంగా రూ. 1,138కి పడిపోయింది. కారణం ఇదేనా? కరోనా విపత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కెమికల్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా అతి పెద్ద తయారీ, సరఫరాదారుగా ఉండేది. కానీ కరోనాతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్వైపు చూస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం చైనా దిగుమతుల పట్ల సానుకూలంగా లేదు. దీంతో దేశీ కెమికల్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. బ్లూచిప్లను మించి మెరుగైన పనితీరు కనిపిస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీల్లోనే ఉన్నప్పటికీ ముదుపరులకు భారీ లాభాలు అందివ్వడంలో బ్లూచిప్ కంపెనీలను వెనక్కి నెడుతున్నాయి. చదవండి:9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
ఈ షేర్లకు ఏమైంది! వారంలోనే ఇంత లాభాలా?
స్టాక్ మార్కెట్ని ఐఆర్సీటీసీ షేర్లు కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, సెబీ రూల్స్ అండ్ గైడెన్స్ ఇవేమీ పట్టవన్నట్టుగా పైపైకి దూసుకుపోతుంది. ఈ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తోంది. టాప్గేర్లో గత నాలుగైదు రోజులుగా స్టాక్మార్కెట్ బ్రోకర్లు, ఇన్వెస్టర్లు ఇలా ఎవరి నోట విన్నా ఒకటే మాట ఐఆర్సీటీసీ. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పోరేషన్ షేర్లు గత మూడు నెలలుగా ఇన్వెస్టర్లకు లాభాలు అందిస్తున్నా.. గడిచిన వారం రోజులుగా అయితే ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ షేర్లు చెలరేగిపోతున్నాయి. ఆకాశమే హద్దు సెప్టెంబరు 7న ఐర్సీటీసీ కంపెనీ షేరు ధర రూ.3,296లుగా నమోదు అయ్యింది. అప్పటి నుంచి వెనుకడుగే లేదన్నట్టుగా షేరు ధర పెరుగుతూనే పోతుంది. అలా పైపైకి చేరుకుంటూ సెప్టెంబరు చివరి నాటికి ఒక షేరు ధర రూ. 3,867 రూపాయలకు అటు ఇటుగా నమోదు అయ్యింది. ఈ సమయంలోనే ఐఆర్సీటీసీ షేర్లను స్ప్లిట్ చేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. పది రూపాయలు ముఖ విలువ ఉన్న షేరుని రెండు రూపాయల ముఖ విలువతో ఐదు షేర్లుగా మారుస్తామని తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వస్తుందంటూ అక్టోబరు ఫస్ట్ వీక్లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో షేర్ల ధరకు కొత్త రెక్కలు వచ్చాయి. దీంతో అక్టోబరు 8న ఒక్కో షేరు ధర రూ.4,867లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడేం చేయాలి ఐఆర్సీటీసీ షేర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు సైతం బుల్ ట్రెండ్నే కొనసాగిస్తుండటంతో ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా పెరుగుతున్న షేరు ధరపై సెబీ నిఘా పెట్టింది. మరోవైపు షేర్లు కొనుగోలు చేసిన వారు అమ్మేయాలా ? లేక ఉంచుకోవాలా అనేది తెలియక సతమతం అవుతున్నారు. లాభాలే లాభాలు మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ఝున్ఝున్వాలా గత నెలలో యాభై లక్షల జీ మీడియా షేర్లను ఒక్కోక్కటి రూ.220 వంతున కొనుగోలు చేయగా వారం రోజుల్లో ఆ షేరు ధర రూ. 337కి పెరిగింది. ఈ ఒక్క డీల్లోనే ఆయన సంపాదన రూ.50 కోట్లు పెరిగింది. అలాంటిది వారం రోజుల్లోనే ఐఆర్సీటీసీ షేర్లు వారం రోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయలు పెరగడంతో ఇందులో పెట్టుబడి పెట్టిన వారు జాక్పాట్ కొట్టినంత పనయ్యింది. కలిసొచ్చిన ప్రైవేటీకరణ భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఐఆర్సీటీసీ పాలిట వరంగా మారింది. ఇప్పటికే ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ , నిర్వాహన బాధ్యతలు కూడా ఐఆర్సీటీసీకే దక్కాయి. దీంతో అప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టాక్ మార్కెట్కు సంబంధించి యాక్టివ్గా ఉండే పేజీలు, వ్యక్తులు ఐఆర్సీటీసీ షేర్ల జోరుతో విస్తుబోతున్నారు. అసలు ఐఆర్సీటీసీనీ అడ్డుకునేది ఏదీ లేదంటూ రకరకాల మీమ్స్తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. IRCTC in a nutshell Company: Stock: pic.twitter.com/9xADTelunb — Sharesmind Gujarati (@SharesGujarati) October 7, 2021 I hv none shares of irctc I m like#irctc pic.twitter.com/SDrULvVt67 — Smita Panwar (@panwar_smita) October 6, 2021 IRCTC share holder these days be like 😆😆😆 pic.twitter.com/E4MGAmsGOn — Prashant mehta (@PrashantM69) October 6, 2021 #IRCTC the Daddy of All Shares 😂😂 Girta hi nhi hai https://t.co/WpTmItlo2l — Umang Tiwari (@umg_tiw_36) October 6, 2021 😎I have 1250 shares of irctc at 735 pic.twitter.com/NrINjLfN6E — Aman Sharma (@AmanSha86978564) October 6, 2021 చదవండి :10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్ -
ఉద్యోగం రావడానికి టైం పడుతుంది కదా.. అభిరుచితో ఆదాయం
కరోనా విజృంభణ కాలంలో ఆందోళనగా, నిస్సారంగా గడిపిన ఖాళీ సమయాలను మర్చిపోలేం. అయితే, చాలా మంది ముఖ్యంగా యువత ఆ ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ తమకున్న అభిరుచులను పెంచుకునే దిశగా కృషి చేశారు. కొంతమంది కొత్త కొత్త అభిరుచులవైపు తమ దృష్టిని మళ్లించుకున్నారు. ఆ కళాత్మక దృష్టి వారిని కొత్త వ్యాపారం వైపు ప్రయాణించేలా చేసింది. దీపాక్షి దత్తా, దృష్టి అరోరా, తవ్లీన్కౌర్, నాజియా నసీఫ్లు ఖాళీ సమయాన్ని సద్వియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఆన్లైన్ వేదికగా తమ అభిరుచులకు పదును పెట్టుకున్నారు. అదే ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్పారు. చదువుకుంటూ, ఇంటివద్ద ఉంటూ ఆదాయాన్ని, గుర్తింపునూ పొందుతున్నారు. నాట్స్ ఆఫ్ లవ్ కోల్కతాకు చెందిన 24 ఏళ్ల దీపాక్షి దత్తా knotsoflovebydeepakshi అనే ఆన్ లైన్ స్టోర్ నడుపుతోంది. దీపాక్షి మాట్లాడుతూ, ‘నాకు ఉద్యోగం రావడానికి టైమ్ పడుతుంది. దాని కోసం ఎదురుచూసుకుంటూ ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మహమ్మారిలో, ప్రజలు ఎక్కువ మంది ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. నైపుణ్యాలు నేర్చుకోగల పెద్ద పాఠశాల ఆన్లైన్ అయ్యింది. ఇదే నాకు ఉపాధిని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ అల్లికలు అల్లుతూ, నేర్పిస్తూ ఆదాయం పొందుతున్నాను’ అని ఆనందంగా చెబుతుంది. ఆత్మీయ ఫొటో కార్డ్ @artsymomo ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న టవ్లీన్ కౌర్ రాజ్పాల్ వయసు 19. తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా ఫొటో కార్డ్ తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ‘నా ఫ్రెండ్ ఆ ఫొటో కార్డ్ చూసి చాలా సంతోషించింది. కుటుంబంలోని వ్యక్తుల ఆత్మీయ క్షణాలను బంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని కార్డ్స్ రూపంలో తయారు చేసి, లామినేట్ చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు మంచి పేరును, ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలు కూడా చేస్తున్నాను. ఇవి జనాలకు బాగా నచ్చుతున్నాయి’అని ఆనందంగా వివరిస్తుంది. కళాదృష్టి 21 ఏళ్ల దృష్టి అరోరా నివాసం ఢిల్లీలో @kalaadrishti అనే పేరుతో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దృష్టి ‘నేను మా అత్త నుండి కొన్ని బేసిక్ కుట్లు నేర్చుకున్నాను. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి, రింగ్స్ తయారీ నేర్చుకున్నాను. డిజిటల్ ఇలస్ట్రేషన్ నుండి కోచింగ్ వరకు, తెలుసుకోవడానికి కొరతే లేదు. వీటన్నింటినీ నేర్చుకోవడానికి, తయారీకి సమయం ఏ మాత్రం సరిపోవడం లేదు’ అని వివరిస్తుంది. కళాత్మక అన్వేషణ పాట్నాకు చెందిన నాజియా నఫీజ్ వయసు 30. ఇద్దరు పిల్లల తల్లి. కుటుంబ బాధ్యతలతో సమయమే సరిపోయేది కాదు. పైగా కుటుంబంలో ఆమె ఆలోచనలను ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ కరోనా మహమ్మారి కాలంలో చేసిన ఆల్లికలు ఆమెలోని కళాత్మక దృష్టిని సమాజం ముందుకు తీసుకు వచ్చేలా చేశాయి. ఆమె ఇప్పుడు @crazy_knot పేజీ ద్వారా చెప్పులు, జూకాలు, గాజులు.. రంగుదారాల అల్లికతో మంచి ఆదాయాన్ని పొందుతోంది. కుటుంబానికి అండగా నిలబడింది. వీరెవ్వరూ గొప్ప కళాకారులు, అనుభవజ్ఞులైన వ్యాపార వేత్తలు కాదు. తమకున్న కళను అమ్మడం అనే ఆలోచనే వారెప్పుడూ చేయలేదు. ఆర్డర్ తీసుకున్నాక, తను పంపాల్సిన ప్యాకేజీలను సరిగ్గా చేయకపోడం వల్ల టవ్లీన్ కొన్నిసార్లు నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ‘వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే రోజులు ఉంటాయి. నేర్చుకునే ప్రక్రియలో ఇది కూడా ఓ భాగం’ అంటోంది దృష్టి. అంతేకాదు వ్యాపార మెలకువల కోసం ఆమ్స్టర్ డ్యామ్ యూనివర్శిటీ నుంచి ఆన్లైన్ పాఠాలు కూడా నేర్చుకుంటోంది. తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సంవత్సరం ఆమె తన కాలేజీ ఫీజులో సగం చెల్లించానని టవ్లీన్ సంతోషంగా చెబుతుంది. టవ్లీన్, దీపాక్షి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే చదువుపై దృష్టి పెడుతున్నారు. దృష్టి తన వ్యాపారాన్ని ఫ్రీలాన్స్ అవకాశంగా చూస్తోంది. నాజియా ఇదొక సొంత వ్యవస్థాపక ప్రయాణంగా భావిస్తోంది. ‘నాట్స్’పై పెద్ద ప్రణాళికలను రచిస్తూనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంలో నిమగ్నమైంది. వీరంతా వేల మైళ్లు ప్రయాణించలేదు. ఇంటి వద్ద ఉండే ఉన్న వనరులతో కళాత్మక దృష్టికి పదునుపెట్టారు. ఆ అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని ఉపాధి పొందుతున్నారు. -
తస్సాదియ్య.. రొయ్య దూకుడు మామూలుగా లేదయ్యా!
సముద్రంలో వేటకు వెళ్లాలంటే మత్స్యకారుల్లో ఏదో తెలియని నైరాశ్యం. నాలుగైదు రోజుల పాటు నడి సంద్రంలో వేటాడినా కూలి డబ్బులు కూడా దక్కక డీలా పడేవారు. రెండు నెలల నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రంలో వల విసిరితే చాలు నిండా రొయ్యల సంపద వచ్చిపడుతోంది. వేటకు వెళ్తున్న మత్స్యకారులు రెండు రోజులకే బోట్లను రొయ్యలతో నింపుకుని తీరం బాట పడుతున్నారు. ఆ వెంటనే వేటకు సిద్ధమైపోతున్నారు. బాపట్ల(గుంటూరు):మూడేళ్లుగా వరుస తుఫాన్లతో సముద్రంలో వేట సక్రమంగా సాగక డీలాపడిన తీరప్రాంత మత్స్యకారులు ఇప్పుడు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.రొయ్యల వేట వారికిప్పుడు పండుగ వాతావరణం తెచ్చింది. ఈ ఏడాది రెండు నెలలుగా వేట బాగా కలిసి వస్తోంది. కోనమ్.. సందువాలు.. మొయ్య.. పండు చేపలకే పరిమితమైన సముద్రపు వేట కాస్తా ఇప్పుడు రొయ్యలు పుష్కలంగా పడుతుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. సాధారణంగా ఆక్వా సాగులో 40 నుంచి 25 కౌంట్ సైజు రొయ్యల్ని చూడాలంటే రైతులకు ఎంతో కష్టంగా ఉంటుంది. అది కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఇటీవల సముద్రంలో 20 కౌంట్ రొయ్యలు కూడా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందం అవధులు దాటింది. వల వేస్తే చాలు నిండా రొయ్యలే వస్తుండటంతో సముద్రంలో కనీసం నాలుగైదు రోజుల పాటు వేట చేసే మత్స్యకారులు ఇప్పుడు రెండు రోజులకే ఇళ్లకు చేరుతున్నారు. ధర బాగు.. బాగు బాపట్ల మండలంలోని అడవి పల్లెపాలెం, కృపానగర్, దాన్వాయ్పేట, ఓడరేవు ప్రాంతాల్లో రొయ్యల వేట వేగవంతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో 3 వేల మత్స్యకార కుటుంబాలు ఉండగా.. వేటకు వెళ్లే బోట్లు 800 వరకు ఉన్నాయి. చేపల వేటకు ఉపయోగించే వలలు కాకుండా రొయ్యలకు డిస్కో వలలను ఉపయోగించటం వలన రొయ్యల వేట సంతృప్తికరంగా ఉంటోందని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక్కొక్క బోటులో 8 నుంచి 10 మంది వేటకు వెళ్తున్నారు. ఎక్కువగా వనామీ, టైగర్ రొయ్యలు వలలకు చిక్కుతున్నాయి. 400 కేజీల వనామీ రొయ్యలు పడితే వాటిలో 40 నుంచి 50 కేజీలు టైగర్ రొయ్యలు పడుతున్నాయి. అదికూడా 20 నుంచి 40లో కౌంట్ ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వనామీ 40 కౌంట్ రొయ్యల ధర రూ.480 నుంచి 500 ఉండగా.. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతోంది. తక్కువ దూరంలోనే.. వాతావరణం అనుకూలంగా ఉండటంతో సముద్ర తీరం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే మత్స్య సంపద దొరుకుతోంది. దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఒక్కసారి వేటకు వెళితే గతంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.20 వేల లోపే ఖర్చవుతోంది. – జి.అప్పలరాజు, మత్స్యకారుడు ఓడరేవులోనే మార్కెట్ రొయ్యలు ఎక్కువగా పడుతుండటంతో చీరాల ఓడరేవుకే కొనుగోలుదారులు వస్తున్నారు. కొనుగోలు చేసిన రొయ్యలకు వారం రోజుల్లోపు నగదు చెల్లిస్తున్నారు. ఐస్, సబ్సిడీపై డీజిల్ అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. – చొక్కా సత్యనారాయణ, మత్స్యకారుడు చదవండి: భద్రతకు ‘దిశ’ నిర్దేశం -
రిహాన్నా ఫోర్బ్స్ సంపన్న గాయని
ప్రతిభ ఉండాలేగానీ ఏ రంగంలోనైనా ఎదగవచ్చు అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పాప్ సింగర్ రిహాన్నా. అమెరికన్ పాప్ సింగర్గా ప్రపంచానికి తెలిసిన రిహాన్నా ‘బ్యూటీ ప్రోడక్ట్స్’ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్ ‘రిచెస్ట్ లేడీ మ్యూజీషియన్’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎప్పడూ హాట్ హాట్ డ్రెస్సులతో హాట్ ఐకాన్గా నిలిచే రిహాన్నా తన ప్రతిభతో సింగర్గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ ఏకంగా ప్రపంచంలోనే ‘అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలిగా’ నిలిచింది. కేవలంసం గీతంతోనే ఆమెకు వందల కోట్ల ఆదాయం రాలేదు. ఆమె ఎంత చక్కగా పాడగలదో అంతే సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ.. రిచెస్ట్ మ్యూజీషియన్గా నిలిచింది సంగీత ప్రపంచంలో బాగా పాపులర్ అయిన రాబిన్ రిహాన్నా ఫెంటీ 1988లో బార్బడాస్లోని మోనికా ఫేంటీ, రోనాల్డ్ దంపతులకు మూడో సంతానంగా పుట్టింది. ఆమెకు పద్నాలుగేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే రిహన్నా అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పుట్టుకతో వచ్చిన మధురమైన గొంతుతో ఈ స్థాయికి ఎదిగింది. రిహాన్నా స్కూల్లో చదివేటప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా పాటలు పాడేది. 2003లో క్రిస్టమస్ వెకేషన్లో భాగంగా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత ఇవాన్ రోజర్స్ కుటుంబంతో బార్బడోస్ సందర్శించారు. ఆ సమయంలో రిహాన్నా గొంతు విన్న ఆయన ఆమెతో కలిసి కొన్ని పాటలు రికార్డు చేద్దామని న్యూయార్క్ ఆహ్వానించాడు. అప్పుడు న్యూయార్క్ వెళ్లి రోజర్స్తో కలిసి డజన్ల సంఖ్యలో పాటలను కంపోజ్ చేసింది. తరువాత తన పాటలను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ రిహాన్నా పాటలు, పనితీరు నచ్చడంతో బాగా పేరొందిన జేజడ్ రికార్డింగ్స్ కంపెనీవారు .. ‘పొన్డి రిప్లే’ పేరిట డెబ్యూ ఆల్బమ్ను 2005లో విడుదల చేశారు. అది బాగా హిట్ అవడంతో.. మరిన్ని పాటలను పాడి ఆల్బమ్స్ రూపంలో విడుదల చేసింది. ఈ క్రమంలో రిçహాన్నా పాడిన 50 మిలియన్ల ఆల్బమ్స్, 190 మిలియన్ల సింగిల్ ఆల్బమ్స్ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. రిహాన్నా పాటలు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్గా నిలిచాయి. వీటిలో ‘అంబ్రెల్లా’, ‘టేక్ ఏ బౌ’, ‘డిస్టర్బియా’, ‘లవ్ ద వే యూ లై’ లు చాలా పాపులర్ అయ్యాయి. డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్ రిహాన్నా పాటలకు ఆడియెన్స్ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్ మ్యూజిక్, బిల్బోర్డ్ మ్యూజిక్, బీఆర్ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్బోర్డ్ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్’ అనే బిరుదును ప్రదానం చేసింది. ఫెంటీ బ్యూటీ... ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రాబిన్ రిహాన్నా ఫెంటీ 2017లో ‘ఫెంటీæ బ్యూటీ’ పేరిట కంపెనీని ప్రారంభించింది. మహిళలు ఎక్కడకు వెళ్లినా వాడుకోగల బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడంతో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లుగా ఉండడంతో, ఫోర్బ్స్ జాబితాలో ఓప్రా విన్ఫ్రే తరువాత రిహాన్నా రెండో స్థానంలో నిలిచింది. ఫెంటీ బ్యూటీలో ఆమెకు యాభై శాతం వాటా ఉంది. అదే 1.4 బిలియన్ డాలర్లకు సమానం అని ఫోర్బ్స్ అంచనా. మిగతా విలువంతా ‘సావెజ్ ఎక్స్ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్ వల్ల వస్తోంది. సావెజ్ కంపెనీ మార్కెట్ అంచనా విలువ 270 మిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులు, లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లల్లో విక్రయిస్తూ సక్సెస్పుల్ బ్యూటీ ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో 101 మిలియన్ ఫాలోవర్స్, ట్విటర్లో 102.5 మిలియన్ ఫాలోవర్స్తో దూసుకుపోతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
పెట్టుబడి 5 లక్షలు .. ఏడాది తిరిగేసరికి 18 లక్షలు!
ముంబై: స్టాక్ మార్కెట్లో జోమాటో పబ్లిక్ ఇష్యూ సంచలనం రేపింది. షేర్ మార్కెట్లో ట్రేడ్ అయిన మొదటి రోజే లక్ష కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఒకే ఒక్క రోజులో షేరు ధర 60 శాతానికి పైగా పెరిగింది. జోమాటో తరహాలో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచిన కంపెనీల గురించి తెలుసుకుందాం. లక్స్ బనియన్లు లక్స్పేరు వినగానే సినీ తారలు వాడే సబ్బు అనే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ మందికి గుర్తుకు వస్తుంది. కానీ లక్స్ బ్రాండ్తో బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే కంపెనీ కూడా ఉంది. టీవీలో ప్రకటనలు కూడా వస్తుంటాయి. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించిన కంపెనీగా లక్స్ నిలిచింది. గతేడాది ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టి పెట్టుకున్న వారు ఏడాది తిరిగేలోగా భారీ లాభాలను కళ్ల జూశారు. ఏడాదిలోనే బాంబే స్టాక్ మార్కెట్లో 2020 జులై 23న లక్స్ కంపెనీ షేర్ ధర రూ. 1,146.35గా నమోదు అయ్యింది. ఏడాది తిరిగే సరికి 2021 జులై 24న ఈ కంపెనీ షేర్ ధర రూ. 4,120కి చేరుకుంది. అంటే గతేడాది రూ. 5 లక్షలు పెట్టి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఏడాది తిరిగే లోగా ఈ షేర్ల విలువ రూ. 17.97 లక్షలకు చేరుకుంది. ఏడాది తిరిగే సరికి ఏ తీరుగా లెక్కించినా కనీసం పది లక్షల రూపాయల లాభాలను వాటాదారులకు ఈ కంపెనీ అందించింది. నిలకడైన పనితీరు గత కొంతకాలంగా లక్స్ కంపెనీ నిలకడగా ఫలితాలు సాధిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 30 కోట్ల నికర లాభాలు రాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 91 కోట్ల ఆదాయాన్ని పొందినట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటం మార్కెట్లో బుల్ జోరు కొనసాగడంతో లక్స్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వగలిగింది. పెట్టుబడులపై ఆసక్తి స్టాక్ మార్కెట్పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. గతంలో పోల్చితే డిమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం నగదుపై రాబడి కోసం బ్యాంకులపై ఆధారపడిన వారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. -
డిస్కౌంట్ల డీమార్ట్... లాభాలు ఎంతో తెలుసా ?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 95 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 40 కోట్లు మాత్రమే ఆర్జించింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలు ప్రభావితమైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 3,883 కోట్ల నుంచి రూ. 5,183 కోట్లకు జంప్చేసింది. మొత్తం వ్యయాలు రూ. 3,875 కోట్ల నుంచి రూ. 5,077 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్డౌన్లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలగుతూ వచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. -
Stockmarket: రిలయన్స్ జోరు,
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అత్యధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా గత రెండు రోజుల్లో నష్టాలనెదుర్కొన్న సూచీలు బుధవారం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతోఆరంభంలో 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 129 పాయింట్ల లాభంతో 52648 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి15,790 వద్ద ట్రేడవుతోంది. ఆటో, ఐటి, ఎఫ్ఎంసిజి, మీడియా, ఫార్మా, పిఎస్యు బ్యాంక్ సూచీలు లాభపడు తుండగా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ రియాల్టీ రంగాలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా అబుదాబిలోని రువైస్లో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడుతోంది. క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పివిసి)ను తయారు చేస్తుంది. మారుతి సుజుకి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందాల్కో, జెఎస్డబ్ల్యు స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలలో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎన్టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల కొనుగోలుతో పాటు, రిలయన్స్ ఇండిస్ట్రీస్ 44వ యాన్యువల్ జనరల్ మీటింగ్ మార్కెట్పై అనుకూల ప్రభావం పడింది. ఐపీఓ తర్వాత తొలిసారి రిలయన్స్ నిర్వహిస్తున్న మీటింగ్లో కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఏం చెబుతారా' అని షేర్ హోల్డర్లు ఆసక్తిగా ఎదురు చూస్తుడడంతో 9.24గంటల సమయానికి మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 52,472 వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 36 పాయింట్లతో 15,722 కొనసాగుతుంది. ఐటీ స్టాక్స్ జోరు సెన్సెక్స్ సూచీల్లో ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా తో పాటు ఎల్ అండ్ టీ, యాక్సిక్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అత్యధికంగా జేఎస్డబ్ల్యూస్టీల్ స్టాక్ ప్రైస్ 1.34శాతం పెరిగింది. జాతీయస్థాయిలో పలు ఆటో మొబైల్ సంస్థలు వాహనాల ధరల్ని పెంచడంతో వాటి ప్రభావం మార్కెట్పై ప్రభావం చూపి 0.6శాతం తగ్గింది.హీరో మోటర్ కార్ప్,టాటా మోటార్స్ నష్టపోయాయి. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు -
చెరకు రసం వ్యాపారం: రైతులకు లాభాల తీపి..
సాక్షి, అమరావతి: పండించిన పంటను రైతే నేరుగా వినియోగదారుడికి అమ్ముకోగలిగితే అధిక ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 265 మంది వరకు రైతులు తాము పండించిన చెరకు నుంచి రసం తీసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్రెడ్డి చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. నాబార్డు రుణం పొందవచ్చు నాబార్డ్లోని నాబ్–కిసాన్ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింప చేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్కుమార్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది. యంత్రం ఎలా పని చేస్తుందంటే.. ఆధునిక చెరకు రసం తీసే యంత్రం ఏటీఎం మెషిన్ తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని ఉంచితే గ్లాస్లోకి రసం వస్తుంది. నిమ్మకాయ, అల్లాన్ని కూడా మెషిన్లోనే కలిపి ఇవ్వొచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. రైతులే ఈ వ్యాపారంలోకి దిగితే దాన్ని రూ.50కి అమ్మినా 500 లీటర్లకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ.17 వేల నుంచి రూ.18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం టన్ను చెరకును రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఆవాల సాగు.. లాభాలు బాగు -
మారుతికి కోవిడ్ దెబ్బ: లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: కోవిడ్-19 మహమ్మారి బెడద దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలతో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో క్యు4 లో ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 25.1 శాతం క్షీణితతో నికర లాభం రూ .4,229.7 కోట్లుగా ఉందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. అలాగే ఆదాయం 7.2శాతం క్షీణించి రూ.66562 కోట్లకి పరిమితమైంది. మరోవైపు కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .45 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. (ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్సేల్: భారీ ఆఫర్లు) జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 10శాతం క్షీణత నమోదు చేసింది. 9.7 శాతం తగ్గి1,166.10 కోట్లకు చేరుకోగా, నికర అమ్మకాలు 33.6 శాతం పెరిగి రూ .22,958 కోట్లకు చేరుకున్నాయి. వాహన విడిభాగాల ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ, నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ క్షీణత నమోదైనట్లు కంపెనీ చెప్పింది. కరోనా, సంబంధిత ఆంక్షల నేపథ్యంలో అమ్మకాలు 6.7 శాతం క్షీణించి 14,57,861 వాహనాలకు చేరుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 21.7 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు 6.8 శాతం క్షీణించి 13,61,722 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 5.9 శాతం తగ్గి 96,139 యూనిట్లకు చేరుకున్నాయి. నికర అమ్మకాలు ఈ ఏడాదిలో 66,562.10 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం తక్కువ. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) చదవండి : సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్! -
SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్ కార్డ్ల కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం రెట్టింపైంది. రూ. 175 కోట్లుగా నమోదైంది. 2019–20నాలుగో క్వార్టర్లో ఇది రూ. 84 కోట్లు. తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 2,510 కోట్ల నుంచి రూ. రూ. 2,468 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 2,398 కోట్ల నుంచి రూ. 2,234కోట్లకు దిగివచ్చాయి. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 1,245 కోట్ల నుంచి రూ. 985 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రెట్టింపై 2.01 శాతం నుంచి 4.99 శాతానికి పెరగ్గా.. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి చేరాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారీ ఆర్డర్ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు (ఎంఈఐఎల్) చెందిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ కంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్ల సరఫరాకై రూ.30 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఓ అమెరికన్ కంపెనీ నుంచి రూ.15 కోట్లు, భారత్కు చెందిన పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి రూ.15 కోట్ల ఆర్డర్ ఉంది. ప్రస్తుతం ఆర్డర్ బుక్ రూ.60 కోట్లుఉందని ఒలెక్ట్రా ఇన్సులేటర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేశ్ బాలయ్య తెలిపారు. మరో రూ.30 కోట్ల ఆర్డర్లు కొన్ని నెలల్లో చేజిక్కించుకోనున్నట్టు చెప్పారు. సాగర్ సిమెంట్స్లో ఎస్సీఆర్ఎల్ విలీనం అనుబంధ కంపెనీ సాగర్ సిమెంట్స్ (ఆర్) లిమిటెడ్ను (ఎస్సీఆర్ఎల్) మాతృ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపిందని సాగర్ సిమెంట్స్ సోమవారం ప్రకటించింది. ఎస్సీ ఆర్ఎల్కు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా గుడిపాడు వద్ద సిమెంటు తయారీతోపాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఎస్సీఆర్ఎల్గా పేరు మారినకర్ణాటకకు చెందిన బీఎంఎం సిమెంట్స్లో 100% వాటాలను 2015–16లో సాగర్ సిమెంట్స్ చేజిక్కించుకుంది. -
ఫెడ్ వ్యాఖ్యలు : మార్కెట్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎ గిసి కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించాయి. ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో కౌంటర్లు ఇవాళ్టి మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 50104వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 14807 వద్ద ట్రేడవుతోన్నాయి. ఫెడరల్ రిజర్వ్ దాదాపు 40 ఏళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించనుందని దాదాపు 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోనుందని ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా ఉన్నాయి. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్లాభాల్లో ఉండగా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ దివిస్ ల్యాబ్స్ , బ్రిటానియా టాప్లూజర్స్గా ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ లాభాలు: పార్లమెంటరీ ప్యానెల్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలను ఆర్జించొచ్చని.. ఇది కూడా పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా రూపొందించిన విధానాలు, ప్రణాళికల అమలు, మిగులు భూముల విక్రయంపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నిర్వహణపరమైన లాభాల్లోకి మాత్రమే అడుగు పెట్టినట్టు గుర్తు చేసింది. అంటే పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు లాభాల్లో ఉండడం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్లో ఆమోదం తెలిపిన విషయం గమనార్హం. ఇందులో భాగంగా అధిక శాతం మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ పథకం కింద తగ్గించుకుని నిర్వహణ వ్యయాలను ఆదా చేసుకోవడం ఒకటి. ఇది అమలైంది. అలాగే, ఈ సంస్థలకు ఉన్న భూముల విక్రయాలు, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ప్యాకేజీలో భాగమే. -
బీహెచ్ఈఎల్షేరు ఢమాల్: ఎందుకంటే
సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్ తగిలింది. క్యు3లో ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్లో బీహెచ్ఈఎల్ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును మరింత దెబ్బ తీసింది. 2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో 218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన కంపెనీ, మార్కెట్ వర్గాలను భారీగా నిరాశపర్చింది. అలాగే ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభం, ఆర్డర్ల క్షీణత కూడా కంపెనీ లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్ కాల్ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత కొనసాగుతుందని గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది. -
ఆటో జోరు: భారీ లాభాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజూ భారీ లాభాలతో కళ కళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 51343 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 15100 వద్ద ట్రేడవుతోన్నాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా ఉన్నాయి. ఎం అండ్ ఎం, అదాని పోర్ట్స్ గెయిల్ టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అటు దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఎన్టీపీసీ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు అటు బీపీసీఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బాల్కృష్ణ ఇండస్ట్రీస్, బాంబే డైయింగ్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి.