rabi season
-
నత్తనడకన ఈ–కేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: రబీ సీజన్కి సంబంధించి ఈ–కేవైసీ( E-KYC) నమోదు నత్తనడకన సాగుతోంది. నోటిఫై పంటలకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి కాకపోతే పంటల బీమా పరిహారం పొందడంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. రబీ సీజన్లో సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 14 లక్షల మంది రైతులు 38.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 30 లక్షల ఎకరాల్లో (77 శాతం) సాగవుతున్న పంటలను మాత్రమే ఈ – పంటలో నమోదు చేశారు.ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం అసలు ముందుకు సాగడం లేదు. వీఏఏలు 27.60 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 23.95 లక్షల ఎకరాలకు సంబంధించి అథెంటికేషన్ పూర్తి చేయగా, కేవలం 4 లక్షల మంది రైతులు 10.88 లక్షల ఎకరాలకు (30 శాతం) మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేయగలిగారు. నోటిఫై పంటలకు ఈ–కేవైసీ తప్పనిసరిప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ క్రాప్ నమోదులో కొన్ని మార్పులు చేశారు. అన్ని పంటలకు 50 మీటర్ల పరిధిలో జియో రెఫరెన్స్ తప్పనిసరి చేసారు. నాన్ నోటిఫైడ్ పంటలు, సామాజిక అడవులకు సంబం«ధించి ఈ–కేవైసీని రైతులు ఇష్టపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. పంటల బీమా కోసం నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. తొలుత రైతులు సాగు చేసే పంట వివరాలను రైతు సేవాకేంద్రం (ఆర్ఎస్కే)లోని ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఫొటోలను ఈ–పంట యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ (ఈ–కేవైసీ) పూర్తయిన తరువాత భౌతికంగా రసీదులిస్తారు. కౌలుగుర్తింపు కార్డు లేక పోయినా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేరిటే నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రబీ సీజన్లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటల విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా 9.93 లక్షల ఎకరాలకే రైతులు బీమా చేయించుకున్నారు. అయితే ఎవరు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో బీమా చేయించుకున్నారో తెలియని పరిస్థితి. నోటిఫైడ్ పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతి ఎకరాకు ఈ–కేవైసీ నమోదు చేయాల్సిందే. లేకుంటే ఆ మేరకు పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించిన రైతులు నష్టపోతారు.ఫిబ్రవరి 25లోగా నూరు శాతం ఈ–కేవైసీనిర్ధేశించిన గడువులోగా ఈ–పంట నమోదు పూర్తవుతుందో లేదో అనే ఆందోళన నెలకొంది. నోటిఫైడ్ పంటలకు సంబంధించి నూరుశాతం ఈ–కేవైసీ నమోదు చేయాలన్న నిబంధనతో ఆర్ఎస్కే సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో వలంటీర్ల సహకారంతో ఈ–పంట నమోదుతో పాటుగా ఈ–కేవైసీ కూడా వేగంగా పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సర్వే బాధ్యతలు కూడా ఆర్ఎస్కే సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు సందర్భంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ–పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ నమోదుకు ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువిచ్చారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు ఆర్ఎస్కేల్లో జాబితా ప్రదర్శిస్తారు. 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మార్చి 15న తుది జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. మరోవైపు ఈ–పంట నమోదు కాకపోతే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారాన్ని రైతులు కోల్పోతారు. చివరికి పంట అమ్ముకునే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. -
సర్వర్లు పనిచేయవు...వెబ్సైట్ ఓపెన్ కాదు!
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి వెబ్సైట్లోనే అప్డేట్కు అవకాశం తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్సైట్లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. -
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్పుట్సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
96 శాతం ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: రబీసాగు చివరి దశకు చేరుకుంటోంది. ఈసారి సాగుతో పాటు ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తికాగా, ఈ–కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ–కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్ నుంచి ఈ–క్రాప్ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్ ద్వారా డిసెంబర్ 8వ తేదీన ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్ల్యాండ్ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకుంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ‘ఈ–ఫిష్’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ–క్రాప్లో బ్లాక్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు కాగానే రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు, ఈ–కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
జోరుగా రబీ సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు. అనంతపురంలో 70 శాతం సాగు రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది. సమృద్ధిగా ఎరువుల నిల్వలు రబీ సీజన్కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
Andhra Pradesh: రైతన్నకు ‘మద్దతు’
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇన్పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది. సోషల్ ఆడిట్లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
నిండుకుండల్లా జలవనరులు.. రబీకి జలసిరులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్లతో పాటు మేకపాటి గౌతమ్రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు. కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. -
ఖరీఫ్ సాగు భళా..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండటం.. కేసీ కెనాల్కు నీరు రావడంతో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీ‹ఫ్ సీజన్కు సంబంధించి సాధారణం కంటే అధికశాతంలో పంటలు సాగయ్యాయి. కొన్ని పంటలు వందశాతం, మరికొన్ని రెండువందల శాతం, ఇంకొన్ని మూడువందలశాతంపైగా కూడా సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సోయాబీన్ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగై రికార్డు సృష్టించింది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 91991 హెక్టార్లు ఉండగా ఖరీఫ్ ముగిసే ఆక్టోబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 1,10,514 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు. సాధారం కంటే ఈ ఏడాది 18,523 హెక్టార్లలో అధికంగా పంటలు సాగై 120.14 శాతం నమోదైంది. దీంతోపాటు ఈ క్రాపు, ఈకేవైసీ నమోదులోనూ రాష్ట్రంలోనే వైఎస్సార్జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అత్యధికంగా సాగైన సోయాబీన్ ఈ ఏడాది జిల్లాలో సోయాబీన్ పంటను అత్యధికంగా సాగు చేశారు. పొద్దుటూరు, పులివెందుల, పెద్దముడియం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్పల్లెతో పాటుపలు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో సోయాబీన్ సాధారణ సాగు 63 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,753 హెక్టార్లలో సాగు చేశారు. గతంలో మెట్టప్రాంతంలో ఏ పంటను సాగు చేయకుండా ఏగిలి పెట్టుకుని రబీ ప్రారంభం కాగానే శనగ సాగు చేసుకునేవారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం, పంటదిగుబడి కాలం 70 నుంచి 80 రోజులు కావడంతో ఎక్కువ మంది సోయాబీన్ ఖరీఫ్లో సాగు చేసుకున్నారు. తగ్గిన వరి విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడాది వరి సాగు తగ్గింది. సాధారణం కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు 32,741 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 27,058 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్నా చాలా మంది ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపారు. వరి సాగుకు ఖర్చులు పెరగడం, తెగుళ్లు ఎక్కువగా ఉండటం, పంట దిగుబడి సమయానికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది రైతులు సాగు తగ్గించారు.కొందరు రెండోపంటగా వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పాలి. రెండో పంట దిగుబడి సమయానికి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బెడద తగ్గుతుంది.అందువల్ల రైతులు ఆ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తగ్గిన వేరుశనగ..పెరిగిన మినుము సాగు విస్తీర్ణం... జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాధారణ సాగు 7,454 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3,787 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గత ఖరీఫ్లో జిల్లాలో 22,503 హెక్టార్లలో సాగైంది. మినుముకు సంబంధించి 1268 హెక్టార్లో సాధారణ సాగు ఉండగా 3838 హెక్టార్లలో సాగైంది. ఇతర పంటల సాగు వివరాలు ఇలా... జిల్లాలో పత్తి 17,303 హెక్టార్లలోసాగు చేయాల్సి ఉండగా 46,263 హెక్టార్లలో సాగై 267.37 శాతంగా నమోదైంది కుసుమ పంట 4 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 11 ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు పంట 874 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1870 హెక్టార్లలో సాగై 206.75 శాతం, టమాటా 1246 హెక్టార్లకుగాను 2041 హెక్టార్లలోసాగై 136 శాతం, ఉల్లి 3603 హెక్టార్లకుగాను 3690 హెక్టార్లలో సాగై 109.91 శాతం, రాగి 4 ఎకరాలకుగాను 7 ఎకరాల్లో సాగై 175 శాతం, ఆముదం 534 హెక్టార్లకుగాను 1031 ఎకరాల్లోసాగై 193.07 శాతం సాగయ్యాయి. çసజ్జలు, మొక్కజొన్న, కందులు, మిరప పంటలు సాధారణం కంటే తక్కువ హెక్టార్లలో సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది ప్రాజక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్ సీజన్లో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. సాధారణం కంటే అధికంగా సాగైంది. ఈ ఏడాది ఈ క్రాపు, ఈకే వైసీని కూడా వందశానికి మించి చేసి రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిపాం. చాలా సంతోషంగా ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి -
గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్కు నీరిస్తాం
మద్దిపాడు: వచ్చే రబీ సీజన్కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్కు, వచ్చే రబీ సీజన్లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు. గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్ కాలువల ద్వారా రిజర్వాయర్ నింపుతామని తెలిపారు. మూడో నంబర్ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు. వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్ హౌస్లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్ పార్క్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. -
సాగులో ‘డ్రోన్స్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై డ్రోన్లు ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో ఉపయోగాలెన్నో.. ► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు ► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు ► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు ► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు ► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు. ► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు సాధ్యమైనంత త్వరగా సీహెచ్సీల ఏర్పాటు డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
పొలంబడి.. కొత్త ఒరవడి
కడప అగ్రిక్చలర్: సేద్యం లాభసాటి కావాలి. సాంకేతిక సలహాలు, సాగు అధ్యయన అంశాలపై రైతులకు అవగాహన పెరగాలి. వ్యవసాయ అధికారులు పొలం వద్దకే వెళ్లి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి శాస్త్రీయ సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలనే ఉద్దశంతోతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో ఒక పొలంబడిని నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లావ్యాçప్తంగా 387 పొలంబడులను ఎంపిక చేశారు. ఇందులో వరి, పత్తి, అపరాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి. రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ఆధ్యయన అంశాలను వివరించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తక్కువ òపెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా సాధించవచ్చు? ఇందుకు శాస్త్రయ సాగు విధానం ఎలా ఉపయోగపడుతుందో రైతులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఒకటి, రెండు చొప్పున మాత్రమే పొలంబడులను నిర్వహించేవారు. అది కూడా కొన్ని పంటలకు మాత్రమే పరిమితం చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అన్ని పంటలకూ పొలంబడి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం బేస్లైన్ సర్వేను నిర్వహిస్తున్నారు. త్వరలో సాగుకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,93, 000 ఎకరాలు. ఇందులో వరి 32,741 హెక్టార్లలో, వేరుశనగ 7,454 హెక్టార్లలో, పత్తిపంట 17,303 హెక్టార్లలో, కందిపంట 3,685 హెక్టార్లలో, జొన్న 2021 హెక్టార్లలో, సజ్జలు 1,091 హెక్టార్లలో, మిరప 1070 హెక్టార్లలో, పసుపు 3420 హెక్టార్లలో, ఉల్లి 3603 హెక్టార్లలో, మొక్కజొన్న 624 హెక్టార్లలో, మినుములు 1268 హెక్టార్లలో, పొద్దు తిరుగుడు 874 హెక్టార్లలో, పెసర 225 హెక్టార్లలో, అముదం 534 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఇందులో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలసాగు చేపట్టగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ∙తక్కువ పెట్టబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా చూడటం. ∙ఇందులో ఎంపిక చేసిన గ్రామాల్లో 10 హెక్టార్లను గుర్తించి 20 నుంచి 30 మంది రైతులను భాగస్వాములను చేసి సహజ సి ద్ధవనరులతో సాగు చేయించడం. ∙భూసార పరీక్ష ఫలితాల అధారంగా ఎరువుల వినియోగంపై చైతన్యం కల్పించడం. ∙వానపాములు, సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిచేలా చూడటం. ∙ విత్తన శుద్ధితో చీడపీడల నివారణ, అంతర మిశ్రమ పంటల ద్వారా మిత్ర పురుగు వృద్ధి, పక్షి స్థావరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలియజేయడం. ∙రైతులను సాగు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేయడం, స్వయం నిర్ణయం తీసుకునేలా.. సాధికారత సాధించేలా సమగ్రశిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కార్యక్రమం ఉద్దేశం. ప్రతి నెల మంగళవారం నుంచి శుక్రవారంలోపు పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ప్రతి గ్రా మంలో 14 వారాలపాటు 30 మంది రైతులతో స్థానికంగా సాగు చేస్తున్న పంటలపై శిక్షణ ఇస్తారు. శత్రు, మిత్ర పురుగుల ఉనికిని గుర్తించి మిత్ర పురుగుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. పంటలో చీడపీడల పరిశీలన, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను వివరిస్తారు. రైతు లతో ముఖాముఖి మాట్లాడి శాస్త్రీయ సాగు విధానంపై పూర్థిస్థాయిలో అవ గాహన కల్పిస్తారు. సాగులో ఎదురయ్యే ఆటుపోట్లును అధిగమించేలా సాంకేతిక సలహాలిస్తారు. సాగు పెట్టుబడి వ్య యం 15 శాతం తగ్గించడం, దిగుబడిలో 15 శాతం అధికంగా అందేలా ప్రణాళికలను రూపొందిస్తారు. గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులు నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలస్థాయిలో పర్యవేక్షిస్తారు. సబ్డివిజన్ స్థాయిలో ఏడీఏæ, జిల్లాస్థాయిలో జేడీఏ పర్యవేక్షిస్తారు. త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్కు 387 పొలంబడి కా ర్యక్రమాలు నిర్వహించనున్నాం. త్వరలో ప్రారంభంకానున్న సీజన్కు అను గుణంగా ఆయా పంటల సాగు నుంచే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ సారి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా విద్యార్థులను ఈ కార్యక్రమంలో మమేకం చేయనున్నాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
పల్నాడు ప్రవర్ధిని
పల్నాడు జిల్లా ధాన్యసిరులతో తుల తూగనుంది. రబీలో సాగు చేసిన వరి పొలాలు కోతకొచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 బస్తాల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పంట సేకరణకూ ప్రభుత్వం సిద్ధమైంది. 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీలో 72,731 ఎకరాల్లో వరి సాగైంది. ప్రధానంగామాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం పంట కోతదశకొచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడిని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికి మద్దతు ధర కూడా ప్రకటించింది. సూపర్ ఫైన్ రకం క్వింటాకు రూ.1960, దుడ్డురకం క్వింటాకు రూ.1940 చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఖరీఫ్ కంటే భేష్ గత ఖరీఫ్ సీజన్లో సేద్య ఖర్చులు పెరగడంతోపాటు ఎలుకల బెడదతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 సెంట్ల నుంచి 30 సెంట్లలోని పంటను ఎలుకలు పాడుచేశాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలే దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు రబీ సీజన్ ఆశాజనకంగా ఉందని, ఖరీఫ్ మిగిల్చిన స్వల్ప నష్టాలను రబీ భర్తీ చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో చీడపీడల బెడద లేదని చెప్పారు. ఎకరానికి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టులో నీటి లభ్యత గతేడాది కంటే అధికంగా ఉండడం కూడా కలిసొచ్చిందని, ఏప్రిల్ 15 వరకు సాగు జలాలు విడుదలయ్యాయని తెలిపారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు్ల చేశాం. సోమ వారం నుంచి ఎక్కడైతే ధాన్యం పండించారో అక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గన్నీ బ్యాగులు, తేమను కొలిచే పరికరాలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొంటాం. – ఎ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ‘రబీ’ బాగుంది నాకున్న నాలుగెకరాల పొలంలోని రెండెకరాల్లో ఖరీఫ్లో వరిసాగు చేశా. 65 బస్తాల దిగుబడి వచ్చింది. రబీలో మూడెకరాలు పంట వేశా. దిగుబడి బాగుంది. చీడపీడలు లేవు. ఎలుకల బాధ అంతగా లేదు, ఖర్చు తక్కువగా ఉంది. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి 120 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. మరో మూడు నాలుగు రోజుల్లో వరికోత కోస్తా. – షేక్.సైదాసాహెబ్, విప్పర్ల, రొంపిచర్ల మండలం దిగుబడి పెరిగింది ఖరీఫ్లో ఆరెకరాలు వరిసాగు చేయగా 175 బస్తాలు దిగుబడి వచ్చింది. రబీలో మళ్లీ ఆరెకరాలు సాగు చేశా. ఈసారి పంట చాలా బాగుంది. పెట్టుబడి వ్యయం తగ్గింది. ఆరెకరాల మీద 240 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. 75 కేజీల బస్తా రూ.1500 వరకు పలుకుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. – చిలకా ఆదేయ్య, మాచవరం, రొంపిచర్ల మండలం -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
ఊపందుకున్న రబీ.. సాగు లక్ష్యం 60 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలు, భారీ వరదలతో మొదలైన రబీ సీజన్ క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం సాగు లక్ష్యంలో ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతినడంతో ఇక్కడ రెండోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా.. 2018–19లో 53.04 లక్షలు, 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో సాగైంది. చదవండి: నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు గతేడాది రెండో పంటకు నీరివ్వడం, వాతావరణం కలిసి రావడంతో 62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం రబీలో 60 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 124.45 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండో పంటకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడం, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గనుండగా అపరాలు, చిరు ధాన్యాల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరి లక్ష్యం 21.50 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా.. 2019–20లో 19.38 లక్షల ఎకరాలు, 2020–21లో 23.49 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 4.67లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదలవల్ల నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. పెరగనున్న అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.05 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 1.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 87వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల సాగు లక్ష్యం ఈ ఏడాది 24.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 14.32 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 8.22 లక్షల ఎకరాల్లో కందులు, 4.77 లక్షల ఎకరాల్లో మినుములు, 60వేల ఎకరాల్లో పెసలు సాగయ్యాయి. నూనె గింజల సాగు లక్ష్యం 3.67 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.17లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ 95 వేల ఎకరాల్లో సాగైంది. పొగాకు సాగు లక్ష్యం 1.77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 72 వేల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు లక్ష్యం 75 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. రాయలసీమలో రికార్డు వర్షపాతం సీజన్ ఆరంభంలోనే ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో 24.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 294 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 365.9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో 235.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, 431.2 మి.మీ.ల వర్షపాతం (82.9 శాతం అధికం) కురిసింది. కోస్తాంధ్రలో 381.2 మి.మీ.ల వర్షపాతానికి 416.2 మి.మీ.ల వర్షపాతం (9.2 శాతం అధికం) కురవగా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 271.7 మి.మీ.ల వర్షపాతానికి 259.4 మి.మీ.ల వర్షపాతం (–4.5 శాతం తక్కువ) కురిసింది. మళ్లీ నారు పోశాం 20 ఎకరాల్లో నెల్లూరు జీలకర్ర సన్నాలు రకం వరి నారుమడి వరదలకు కొట్టుకుపోయింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతో మళ్లీ నారుమళ్లు పోసుకున్నా. నాట్లు వేయాలి ఇక. – పి.విశ్వనాథ్, నెల్లూరు జిల్లా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు అకాల వర్షాలు, వరదలతో రబీ సీజన్ మొదలైంది. నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పోసుకుంటున్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి అపరాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్ను భవిష్యత్లో ఎఫ్సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
ఏపీ లోని రైతులకు శుభవార్త
-
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
అన్నదాతకు 'ఆర్థిక దన్ను'
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉండటంతో వారికి మరింత చేయూత లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రైతులతోపాటు కౌలుదారులకు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సీజన్ ఆరంభం కాగానే పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతంగా ఉండేవి. చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా అదునుకు రుణాలందేవి కావు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చేది. వచ్చిన పంటను అప్పు ఇచ్చినవాళ్ల చేతిలో పెట్టగా మిగిలిందే రైతులకు దిక్కయ్యేది. ఒకవేళ పంట విపత్తు బారిన పడితే ఆ అప్పులు తీర్చేదారి కనిపించేదికాదు. రెండేళ్లుగా ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే చేతికందుతున్న వైఎస్సార్ రైతుభరోసాతో నారుమళ్లు పోసుకునేందుకు ఇబ్బందిలేకుండా ఉంది. 2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు ప్రభుత్వం రైతుకు దన్నుగా ఉండటంతో వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019–20 వ్యవసాయ సీజన్లో రూ.1.15 లక్షల కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా.. 94,47,103 మంది రైతులకు రూ.1,13,998 కోట్ల రుణాలిచ్చాయి. ఖరీఫ్లో పంట రుణాలు 48.60 లక్షల మందికి రూ.52,669 కోట్లు, టర్మ్ రుణాలు 6,36,266 మందికి రూ.12,908 కోట్లు ఇవ్వగా.. రబీలో పంటరుణాలు 34,48,181 మందికి రూ.36,604 కోట్లు, టర్మ్ రుణాలు 5,02,656 మందికి రూ.11,817 కోట్లు ఇచ్చాయి. 2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 2020–21 వ్యవసాయ సీజన్లో రూ.1,28,659 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులు జనవరి 20 నాటికి 69,87,298 మంది రైతులకు రూ.90,558 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. గడిచిన ఖరీఫ్లో రూ.75,237 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56,74,500 మంది రైతులకు రూ.74,155 కోట్లు (99శాతం) ఇచ్చాయి. దీన్లో 48,19,306 మంది రైతులకు రూ.57,575 కోట్ల పంటరుణాలు, 8,55,194 మందికి రూ.16,580 కోట్ల టర్మ్ రుణాలు ఉన్నాయి. 2019 ఖరీఫ్తో పోలిస్తే గడిచిన ఖరీఫ్లో పంటరుణాలు రూ.4,906 కోట్లు, టర్మ్రుణాలు రూ.3,672 కోట్లు అదనంగా ఇచ్చాయి. రబీలోను అదే జోరు ప్రస్తుత రబీ సీజన్లో రూ.53,422 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకులకు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 13,12,798 మంది రైతులకు రూ.16,403 కోట్లు ఇచ్చాయి. పంటరుణాలు రూ.36,407 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 11,33,185 మంది రైతులకు రూ.12,584 కోట్లు అందజేశాయి. టర్మ్రుణాలు రూ.17,015 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,79,613 మంది రైతులకు రూ.3819 కోట్లు ఇచ్చాయి. సీసీఆర్సీపై రూ.లక్ష రుణమిచ్చారు. నాకు సొంతంగా ఎకరం ఉంది. ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. దాళ్వాలో కంద, క్యాబేజీ, మినుము సాగుచేస్తున్నా. కౌలుకార్డు (సీసీఆర్సీ) ఇచ్చారు. ఆ కార్డుపైనే మా గ్రామంలో సహకార బ్యాంకులో అప్పు కోసం దరఖాస్తు చేశా. రూ.లక్ష మంజూరు చేశారు. గతంలో ఇలా కార్డుపై ఎప్పుడూ రుణం పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. – పావులూరి మురళీకృష్ణ, కౌలురైతు, పెద ఓగిరాల, కృష్ణాజిల్లా లక్ష్యానికి మించే రుణాలిస్తాం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించే రుణాలిస్తాం. ఖరీఫ్లో 99 శాతం రుణాలిచ్చాం. రబీలో ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలిచ్చాం. వచ్చే రెండు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలిస్తాం. – బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ కౌలురైతులకు విరివిగా రుణాలు 2020–21 వ్యవసాయ సీజన్లో బ్యాంకులు 1,81,102 మంది కౌలుదారులకు రూ.760 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 4,13,278 మంది సాగుదారులకు క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డు (సీసీఆర్సీ) జారీచేయగా, వారిలో 58,772 మందికి వ్యక్తిగతంగా రూ.318 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ కార్డుదారులతో ఏర్పాటైన 16,387 జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్జీ), రైతుమిత్ర గ్రూపు (ఆర్ఎంజీ)ల్లోని 1,22,330 మందికి రూ.442 కోట్ల రుణాలు మంజూరు చేశారు. -
రబీ.. రయ్ రయ్
సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తోంది. లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఇప్పటికే సాగులోకి వచ్చింది. రబీ అధికారికంగా అక్టోబర్ ఒకటిన మొదలైనా నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో పంటలు వేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి, పునాస పంట కోతలు ప్రారంభం కాగా.. రైతులు రెండో పంట వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఓ వైపు ఖరీఫ్ పంటల్ని ఒబ్బిడి చేసుకుంటూనే.. మరోవైపు రబీ పంటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా సాగయ్యే వాటిలో వరి, శనగ, మినుము తదితర పంటలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందజేసిన రైతు భరోసా సాయంతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందుబాటులోకి రావడంతో రైతులు కాడీ, మేడీ పట్టి ముందుకు సాగుతున్నారు. రబీలో సాగు విస్తీర్ణం 22.75 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సీజన్కు అవసరమైన 15 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై సరఫరా చేస్తోంది. 2,71,612 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేయగా.. ఇప్పటికే 69,389 మంది రైతులు ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలను అందుకున్నారు. రబీకి అవసరమైన యూరియా సహా అన్నిరకాల ఎరువుల్ని అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. సాగులోకి వచ్చిన పంటల వివరాలివీ.. రబీలో వరి సాగు విస్తీర్ణం 7.12 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 24 వేల హెక్టార్లలో వేశారు. 11 వేల హెక్టార్లలో నూనె గింజలు, 32వేల హెక్టార్లలో శనగ, 4 వేల హెక్టార్లలో అపరాలు, మిగతా విస్తీర్ణంలో ఇతర పంటల్ని ఇప్పటికే విత్తారు. ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. -
సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు
సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కన్నా 33 వేల హెక్టార్లు ఎక్కువ. రబీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రబీకి సంబంధించిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. మేలైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచే ఆర్డరు చేసుకునేలా వ్యవసాయ శాఖ పెద్దఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. రబీ సాగు ప్రణాళిక ఇలా.. రబీ సీజన్ అక్టోబర్ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్లో ప్రధానంగా పండించే పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలున్నాయి. 8.05 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయించడం ద్వారా 57.12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. 4.03 లక్షల హెక్టార్లలో శనగ, 3.85 లక్షల హెక్టార్లలో మినుము, 1.36 లక్షల హెక్టార్లలో పెసర, 70 వేల హెక్టార్లలో పొగాకు సాగు విస్తీర్ణంగా ఉంది. ఆర్బీకేల వద్ద సబ్సిడీ విత్తనాలు గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచే మేలైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటే భరోసా ఉంటుందని ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. ముందుగా పరీక్షించిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు సరఫరా చేస్తుంది. రబీలో రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాభివృద్ధి సంస్థ 4,08,151 క్వింటాళ్ల వివిధ రకాల వంగడాలను సిద్ధం చేసింది. ఇందులో చిరుధాన్యాలైన కొర్ర, ఊద, అరిక, సామ, ఆండ్రు కొర్రలు వంటివి కూడా ఉన్నాయి. ఎరువుల పరిస్థితి రబీ సీజన్కు కావాల్సిన మొత్తం ఎరువులు 25.04 లక్షల టన్నులు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏయే నెలలో ఎంతెంత అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు సిద్ధం చేసింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు 10 లక్షల టన్నుల యూరియా, 2.50 లక్షల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల మ్యూరేట్ పొటాషియం, 9 లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్షన్నర టన్నుల ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్పేట్), 4 టన్నులు ఇతర ఎరువులు కావాల్సి ఉంటాయని భావిస్తోంది. -
రబీ రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తోంది. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆగస్ట్ నెలాఖరు వరకు రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ.. నెల్లూరు వంటి జిల్లాల్లో ఆలస్యంగా కోతలు ప్రారంభించడం, ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో అక్కడక్కడా ధాన్యం తడిసిపోయింది. దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీజన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు ఉపశమనం కల్పిస్తోంది. సీజన్ ముగిసినా కొనుగోళ్లు ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1,442 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.6,088.51 కోట్లు విలువ చేసే 32.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ► ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని అక్టోబర్ 31వ తేదీ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ► గ్రామ స్థాయిలోనే ధాన్యం సేకరించడం వల్ల కొనుగోలు కేంద్రాలు లేదా మిల్లులకు తరలించేందుకు అయ్యే రవాణా చార్జీల భారం నుంచి రైతులు బయటపడ్డారు. ► లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, అండమాన్, నికోబార్ దీవులకు బియ్యం పంపించి మన రాష్ట్రం అక్కడి ప్రజల ఆహార కొరత తీర్చగలిగింది. ► ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశారు. -
31,53,524 మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. ► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎమ్మార్) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
రబీలో రికార్డు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2019–20 రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 31.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ ఏడాది 3.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అదనంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ► దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఇందులో మొదటి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. ► తెలంగాణ 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 31.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచాయి. ► లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో తొలుత ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ సారి రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో రైతులకు రవాణా కష్టాలు కూడా తగ్గాయి. ► గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ చర్యల వల్ల దళారుల మోసాల నుంచి రైతులకు మిముక్తి లభించింది. ► రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. కాగా, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయం. ► ఇప్పటి వరకు 31.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. ► గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,835, సాధారణ రకం ధాన్యానికి రూ.1,815లను మద్దతు ధరగా నిర్ణయించారు. ► ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రేపటి (జూన్ 20 శనివారం) వరకే కొనుగోలు చేస్తారు. ► మొత్తం 1,434 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ. -
'వరి'వడిగా..
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల కొరత లేదు, యంత్రాలూ సిద్ధంగా ఉండటంతో కోతలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందటంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇలా... ► ఖరీఫ్లో 48.10 లక్షల టన్నుల ధాన్యాన్ని 4,57,823 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ.8755 కోట్లు ఉంటుంది. 11 జిల్లాల్లో 1702 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రబీలో ఎలా జరుగుతోందంటే... ► ఇప్పటివరకు 1,295 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, అనంతపురంలో తెరవాల్సి ఉంది. ► 1.63 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.299.28 కోట్లు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోంది. వరి సాగు ఇలా... ► ఖరీఫ్లో 15,18,984 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా 14,67,069 హెక్టార్లు సాగు అయింది. రబీలో సాగు విస్తీర్ణ లక్ష్యం 6,98,398 హెక్టార్లు కాగా అంతకుమించి రికార్డు స్థాయిలో 8,06,803 హెక్టార్లలో సాగయింది. రబీలో 60,14,189 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ► ఖరీఫ్లో హెక్టార్కు దిగుబడి 5,248 కిలోలు కాగా రబీలో హెక్టార్కు రికార్డు స్థాయిలో 7,095 కిలోలు ఉండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో రబీలో హెక్టార్కు 5,928 కిలోలు దిగుబడి ఉంది. ► లాక్డౌన్తో రబీ కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ► అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరి కోత యంత్రాలను అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. ► రాష్ట్రంలో 2,985 కంబైన్డ్ హార్వెస్టర్లు, 1,746 వరి రీపర్లు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల అద్దె గంటకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంది. ఇంతకు మించి ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే సమీపంలోని వ్యవసాయాధికారికి లేదా 1902కి రైతులు ఫిర్యాదు చేయవచ్చు. రైతులకు వ్యవసాయ కమిషనర్ సూచనలు ఇవీ... ► లాక్డౌన్ వల్ల కూలీలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం హార్వెస్టర్లను తరలిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ► ఇతర జిల్లాల నుంచి కూడా హార్వెస్టర్లను తెప్పించి పాస్లు ఇచ్చాం. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ► ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.1815, ఏ గ్రేడ్ రకం రూ.1835కి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఈ ధర కన్నా ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దు. ► వరి కోతలు, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించండి. మాస్క్లు ధరించండి. 3 కిలోల అదనంపై సీఎంకు ఫిర్యాదు... ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు క్వింటాల్కు అదనంగా మూడు కిలోలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా తిరువూరు రైతులు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా 17 శాతం తేమను బట్టి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉండగా 21 శాతం తేమ ఉందంటూ తరుగు తీసుకుంటున్నారని, గోనె సంచులు రైతులే తెచ్చుకోవాలంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో రైతు సుమారు రూ.55 వరకు నష్టపోతుండటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించింది ‘మా జిల్లాలో 80 శాతం వరికోతలు యంత్రాల ద్వారానే సాగుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభంలో రూ.3,000 చొప్పున అద్దె వసూలుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంది’ – కె.చిరంజీవి, పెరవలి,పశ్చిమ గోదావరి జిల్లా -
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఈసారి ‘పంట’ పండింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలకూ అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్ (2019–20) సీజన్లో అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరిస్తే.. పుష్కలంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్థిక గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.68 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి అంచనా కన్నా ఇది ఎక్కువ. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి, పత్తి, వేరుశనగ, కంది దిగుబడులు కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. గణనీయంగా పెరిగిన దిగుబడులు.. ఏపీలోని ప్రధాన పంటల దిగుబడులన్నీ పెరిగాయి. గతంలో హెక్టార్కు 5,029 కిలోలుగా ఉన్న వరి ఈ ఖరీఫ్లో 5,166 కిలోలకు చేరింది. జొన్న, సజ్జ, చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్కు రెండు మూడింతలు పెరిగాయి. 2018–19లో హెక్టార్కు 130 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,013 నుంచి 2,322 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్కు గతేడాది ఖరీఫ్లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. వేరుశనగ దిగుబడి హెక్టార్కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది. ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఖరీఫ్లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఖరీఫ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. ఒక్క పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపకరించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ జలకళను సంతరించుకోవడంతో గరిష్టంగా అరకోటి ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి చేసిన, పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కిందే 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చే అవకాశముండగా, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిన సాగు జరగనుంది. సాగర్ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు.. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ప్రాజె క్టులో నీటి నిల్వలు 315 టీఎంసీల మేర ఉన్నాయి. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలున్నాయి. తాగునీటి అవసరాలకు మరో 25 టీఎంసీల వరకు అవసరముంటుంది. తాగునీటికి పక్కనపెట్టినా, మరో 50 టీఎంసీల మేర తెలంగాణకు వాటా దక్కే అవకాశం ఉన్నందున పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్వకుర్తి కింద కనిష్టంగా 3 లక్షల ఎకరాలు.. ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశముంది. కల్వకుర్తికి కనిష్టంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 25 టీఎంసీల మేర నీటి కేటాయింపులు చేయనున్నారు. జూరాలపై లక్ష ఎకరాలు, దానిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాల పరిధిలో చెరో రెండు లక్షల ఎకరాల మేర కలిపి 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 600లకు పైగా చెరువులు నింపారు. వీటికింద కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం ఉంది. 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వఉన్న 90 టీఎంసీలతో పాటు లోయర్మానేరు డ్యామ్ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చెరువులు నింపే కార్యక్రమం జరుగుతోంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా చెరువులు నింపుతూ నీరు వదులుతున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలు దేవాదుల కింద ఇప్పటికే 7 టీఎంసీల గోదావరి నీటితో 300 చెరువులకు నీరివ్వడంతో పాటు ఆయకట్టుకు నీరిస్తున్నారు. యాసంగిలోనూ మరో 12 నుంచి 13 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటే ఏఎంఆర్పీ, కాళేశ్వరం నదీ జలాలను ఎత్తిపోసే పరిమాణాన్ని బట్టి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి రానుంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. వీటిద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆస్కారముంది. చెరువుల కిందా జోరుగానే.. ఈ ఏడాది చెరువుల కింద గరిష్ట సాగుకు అవకాశముంది. ఇప్పటికే 43 వేలకు పైగా ఉన్న చెరువుల్లో 22 వేల చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మొత్తం చెరువుల్లో 17 వేల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 4,700 చెరువులు 75 శాతం వరకు నీటితో ఉన్నాయి. వీటితో పాటే సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని తరలించేలా 3 వేల తూముల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే వెయ్యికి పైగా పూర్తయ్యాయి. ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తి స్థాయిలో నింపే అవకాశముంది. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, 14 లక్షలకు తగ్గకుండా సాగు జరిగే అవకాశముంది. ఇక ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, ఇందులో ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. మొత్తంగా చిన్న నీటి వనరుల కిందే 16 లక్షల ఎకరాల మేర సాగుకు ఈ ఏడాది నీరు అందే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. 2.52 లక్షల ఎకరాల్లో రబీ సాగు సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సీజన్ సాగు లక్ష్యం, ఇప్పటివరకు ఎంత సాగైందన్న వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు నివేదించింది. దాని ప్రకారం రబీ సాధా రణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో (8%) సాగైంది. అందులో అత్యధికంగా వేరుశనగ సాగైంది. వేరుశనగ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1.67 లక్షల (51%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు లక్ష్యం 2.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52,500 ఎకరాల్లో (18%) సాగయ్యాయి. అందులో కేవలం శనగ పంట సాగైంది. ఇక రబీలో కీలకమైన వరి సాధారణ సాగు 17.07 లక్షల ఎకరాలు కాగా, నాట్లు మొదలు కావాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురవడం, రిజర్వాయర్లు, చెరువులు నిండిపోవడంతో లక్ష్యానికిమించి వరి నాట్లు పడతాయని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక మొక్కజొన్న రబీ సాధారణ సాగు లక్ష్యం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 ఎకరాల్లో (2%) మాత్రమే సాగైంది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నాగర్కర్నూలు జిల్లాలో 64% విస్తీర్ణంలో రబీ పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా లో 53% సాగయ్యాయి. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలోనూ పంటల సాగు మొదలుకాలేదని నివేదిక తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికం ఈ ఏడాది వర్షాలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి ఆలస్యంగా మొదలైనా, ఆగస్టు నుంచి పుంజుకోవడంతో ఇప్పటివరకు అధిక వర్షాలే కురుస్తున్నాయి. జూన్లో 33 శాతం లోటు కనపడింది. జూలైలో 12 శాతం లోటున్నా సాధారణ వర్షపాతంగానే రికార్డయింది. ఇక ఆగస్టులో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏకంగా 92 శాతం అధికంగా కురవడం విశేషం. ఆ తర్వాత రబీ మొదలైన అక్టోబర్ నెలలోనూ ఏకంగా 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం ఇక పంట రుణాలపై బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. గత ఖరీఫ్లో 102 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి ఏకంగా 131 శాతం సాగైంది. గత ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇచ్చింది రూ.16,820 కోట్లే. ఇక రబీ సీజన్ ప్రారంభమైనా రుణాలు అత్యంత తక్కువగానే ఇచ్చాయి. రబీ పంట రుణ లక్ష్యం రూ.17,950 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచి్చనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పెద్ద ఎత్తున వరి నాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఆదుకోకుంటే రైతులకు అప్పులు మాత్రమే మిగులుతాయని అంటున్నారు. -
అంచనాలకు మించి పంటల సాగు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ సీజన్ ఆశించిన దానికన్నా గొప్పగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ముమ్మరంగా వర్షాలు కురుస్తుండడం.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లన్నీ పొంగిపొర్లుతుండడం.. సాగర్ కుడికాల్వకు ఇప్పటికే నీళ్లు వదలడం వంటివన్నీ ఇందుకు శుభసూచనలేనని అటు రైతులు ఇటు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు మిగిల్చిన స్వల్ప లోటును ఈశాన్య రుతుపవనాలు అధిగమించడంతో పాటు ఇప్పటి వరకు 1.2% మిగులు వర్షాలు కురిసినట్లు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇదే పెద్ద రికార్డు. ఫలితంగా ఖరీఫ్లో సాగులోకి రాని విస్తీర్ణాన్ని ప్రస్తుత రబీ భర్తీచేస్తుందని అధికారులు భావిస్తున్నారు. నీటి సౌకర్యం బాగా ఉండడంతో ప్రత్యేకించి దాళ్వా వరిసాగు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 22.77లక్షల హెక్టార్లు కాగా.. ఈసారి లక్ష్యం 25.84 లక్షల హెక్టార్లు. ఇందులో 7.40 లక్షల హెక్టార్లలో వరి, 3.96 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, చిరుధాన్యాలు.. 11.53 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు, 1.63 లక్షల హెక్టార్లలో నూనె గింజలు, పొగాకు 91 వేల హెక్టార్లు, మిర్చి 23 వేల హెక్టార్లు, ఉల్లి 800 హెక్టార్లు, కొత్తిమీర 700 హెక్టార్లు, 300 హెక్టార్లలో పత్తి సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా, సాధారణంగా రబీ సీజన్లో వరి సాగు 6.98లక్షల హెక్టార్లకు మించదు. కానీ, ఈసారి 7.40లక్షల హెక్టార్లలలో సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది రిజర్వాయర్లనీ నిండుగా తొణికలాడుతుండడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు సాగర్ కుడికాల్వకు జలకళ నాలుగైదేళ్లుగా నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద నాట్లు పడలేదు. తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి. అందుకు భిన్నంగా ఈసారి సెప్టెంబర్ నుంచే కాలువకు నీళ్లు వదిలారు. ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ముందుగానే నార్లు పోసుకుని ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. అలాగే, గుండ్లకమ్మ రిజర్వాయర్ కింద కూడా ఈసారి వరి వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలలో నాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆయాచోట్ల 12వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలలో పునాస పంటగా పిలిచే ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత నాట్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ జిల్లాలలో వరి పొట్టదశ దాటి గింజ పోసుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి కోతలు మొదలవుతాయి. మరోవైపు.. ప్రస్తుత రబీకి 14,180 క్వింటాళ్ల వరి వంగడాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై పంపిణీ చేసింది. ఆశాజనకంగా ఖరీఫ్ వరి ఇదిలా ఉంటే.. ఖరీఫ్లో సాగవుతున్న వరి పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 15.19 లక్షల హెక్టార్లయితే 14.67 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, వరదలకు రాష్ట్రంలో అక్కడక్కడా కొంత ముంపునకు గురైనా ఇప్పుడు అంతా తేరుకుని పరిస్థితి సజావుగా ఉందని తెలిపారు. పలు ప్రాంతాలలో పంట గింజ పోసుకుంటోందని వివరించారు. కలిసొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతుభరోసా పథకం అన్నదాతలకు కలిసొచ్చింది. చిన్న, సన్నకారు, మధ్య తరహా, కౌలు రైతుల మొదలు పెద్ద రైతుల వరకు.. అందరికీ అమలవుతున్న ఈ పెట్టుబడి సాయం.. రైతులు బ్యాంకులను, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా చేసింది. రైతుల ఖాతాలకే నేరుగా నగదు జమ కావడం.. ఆ మొత్తాన్ని వేరే అప్పుల కోసం బ్యాంకులు సర్దుబాటు చేసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలివ్వడంతో రైతులు ఆ మొత్తాన్ని సాగుకు వినియోగించుకోగలుగుతున్నారు. -
రబీకి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రబీకి విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెల 1 నుంచి రబీ సీజన్ ప్రారంభం కావడంతో ప్రణాళిక పూర్తి చేసింది. ఈ రబీలో 5 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు చేసి, కొన్ని విత్తనాలను క్షేత్రస్థాయికి పంపింది. సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం రూ.87.09 కోట్లు కేటాయించింది. అందులో 75 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలకు సబ్సిడీ రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. రబీలో సాగు చేసే శనగ, వేరుశనగ విత్తనాలను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపారు. శనగలు 1.5 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 75 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచనున్నా రు. మొత్తం సరఫరా చేసే విత్తనాల్లో వరి 2.5 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 12 వేల క్వింటాళ్లు, పప్పుధాన్యాల విత్తనాలు 8,500 క్వింటాళ్లు రబీకి అందజేయనున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేస్తారు. జిల్లాల్లో 22,767 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచగా, అందులో 20,136 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. గడ్డకట్టిన యూరియా అంటగట్టేలా చర్యలు.. రబీకి కూడా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు పెంచాలని వ్యవసాయ శాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ రబీకి కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రాష్ట్రానికి కేటాయించింది.lవాస్తవానికి రాష్ట్ర అవసరాలకు 7.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించింది. యూరియాను ఎంఆర్పీ ధరకే విక్రయించాలని నిర్ణయించారు. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ ఫీజు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గడ్డకట్టిన పాత యూరియాను రైతులకు అంటగట్టాలని మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల గడ్డకట్టిన యూరియా ఉంది. అది 2013–14 నుంచి 2015–16 మధ్యకాలంలో గోదాముల్లో పేరుకుపోయి ఉంది. దాన్ని ఎలాగైనా రైతులకు, సహకార సొసైటీలకు అంటగట్టాలని భావిస్తోంది. కానీ రైతులు, సహకార సొసైటీలు దీన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. ధర తక్కువ ఉన్నా కూడా అవసరం లేదని రైతులు చెబుతున్నారు. కానీ ఎలాగైనా అంటగట్టాల్సిందేనని జిల్లాలకు మార్క్ఫెడ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూరియా 45 కిలోల బస్తాలతో ఉండగా, పాత యూరియా 50 కిలోల బస్తాలతో ఉన్నాయి. -
వరి పెరిగె... పప్పులు తగ్గె..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం సీజన్లో ఏకంగా 28.49 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.64 కోట్ల టన్నులకు చేరింది. అంటే అదనంగా 54 లక్షల టన్నులు పెరిగింది. ఇక కీలకమైన పత్తి దిగుబడి పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేల్స్ ఉత్పత్తి కాగా, 2018–19లో కేవలం 2.87 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 52 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిందన్నమాట. గులాబీ పురుగు కారణంగా దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయినట్లు కేంద్రం అంచనా వేసింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా కాస్త మందగించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల టన్నులకు పడిపోయింది. అంటే 5 లక్షల టన్నులు తగ్గింది. ఇక నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.22 కోట్ల టన్నులకు పెరగడం గమనార్హం. మొక్కజొన్న 2.72 కోట్ల టన్నులు, సోయాబీన్ 1.37 కోట్ల టన్నులు, వేరుశనగ 66 లక్షల టన్నులకు పెరిగింది. చెరుకు రికార్డు స్థాయిలో 40.01 కోట్ల టన్నులు ఉత్పత్తి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మూడో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 2018–19 సీజన్లో ఖరీఫ్, రబీ కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 91.93 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే 2018–19 సీజన్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2016–17లో 1.01 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండగా, 2017–18 సీజన్లో 96.20 లక్షలకు పడిపోయింది. ఈసారి ఇంకాస్త పడిపోవడం గమనార్హం. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014–15లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 72.18 లక్షల టన్నులు మాత్రమే. ఆ తర్వాత 2015–16లో ఇంకా తగ్గి 51.45 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే అప్పటినుంచి పెరుగుతూనే వస్తుంది. వర్షాలు, సీజన్లను బట్టి ఉత్పత్తి వత్యాసాలు ఉన్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
దిగుబడి లేదు.. ధరా లేదు
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఖరీఫ్ సీజన్లో వచ్చి తిత్లీ తుపానుతో నియోజకవర్గంలోని వరి పంట మొత్తం నాశనమైంది. రైతులకు ఖరీఫ్ వరి పంట పెట్టుబడి కూడా మిగల్లేదు. రబీ సీజన్లో అపరాల పంటలపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అపరాల విస్తీర్ణం పెరిగినప్పటకీ వరుణుడు కరుణించకపోవడం, చీడపీడలు అధికం అవ్వడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులకు అందని మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర మాత్రం అపరాల పంట పండించే రైతులకు అందడంలేదు. నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాల్లో రబీ సీజన్లో అపరాల పంటను సాగు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను కొనుగోలు చేసి పండించారు. పంట చేతికందక ముందు ధరలు విపరీతంగా పెంచి, పంట చేతికందే సమయానికి గిట్టు బాటు ధర లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు వేసిన నాటి నుంచి వర్షాలు లేవు. వాతావరణం అనుకూలించక పోవడంతో పంటకు చీడపీడలు ఆశించి దిగుబడులు కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే పరిమితమవుతోంది. మద్దతు ధరకు బయట మార్కెట్ ధరలకు పొంతన ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు ధర రైతులకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. బయట మార్కెట్లో 100 కిలోల పెసల ధర రూ.5 వేలు, మినుములు బస్తా రూ.3200లకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసలు వంద కిలోలకు రూ.7 వేలు, మినుములు వంద కిలోలకు రూ.5,600 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెసలు, మినుములు కొనుగోలు చేయడంలేదు. అపరాల పంటను ఎండ వేస్తున్న రైతు పెరిగిన పెట్టుబడి.. అపరాల పంట ఎకరాకు కనీసం 4 నుంచి 5 వందల కిలోల దిగుబడులు వస్తుండేవి. ఈ సంవత్సరం అందులో సగం కూడా రాని పరిస్థితి. పంటకు అనుకూలించక పోవడంతో రెండు నుంచి మూడు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. విత్తనాల పెట్టుబడి, పంట తీయడానికి, నూర్పుడిలు చేయడానికి ఎకరానికి సుమారు రూ.8 వేలవరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. కనీస దిగుబడులు కూడా రాకపోవడంతో మినుము, పెసర పంటను తీయకుండా ఆవులకు మేతగా చాలా చోట్ల విడిచిపెడుతున్నారు.ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గింది ఖరీఫ్ సీజన్లో వరి పంట పూర్తిగా నష్టపోయాం. అపరాల పంటపై ఆశలు పెట్టుకున్నాం. పంట దిగుబడి తగ్గడంతో కూలీలు ఖర్చు కూడా గిట్టు బాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – ఎం.సోమేశ్వరరరావు, రైతు, లక్కవరం -
అందని రబీ పెట్టుబడి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం జిల్లాలో కొంతమంది రైతులకే పరిమిత మవుతోందనే వాదన వినిపిస్తోంది. రబీ సీజన్ ప్రారంభమై జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో చెక్కుల అందజేసి బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రబీలోనూ చెక్కు లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా ముందస్తు ఎన్నికలతో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లాలో ఇంకా దాదాపు 23వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టుబడి పైసలు వస్తాయా రావా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ తోటివారికి డబ్బులు వచ్చి తమకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ రైతుబంధు రైతన్న దరికి చేరడం లేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే కొద్దిరోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. మరో నెల గడిస్తే రబీ ముగియనుంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు సాయం అందకపోవడంతో బ్యాంకుల, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరీక్షణ.. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి 23,113 మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదు. 20 మండలాల్లో భూమి కలిగిన రైతులు 1,36,718 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.120,74,92,810 పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,433 మంది రైతులకు రూ.90,29,26,930 డబ్బులు చెల్లించారు. మొత్తం 136718 రైతులకు గాను అధికారులు 1,21,268 మంది రైతుల వివరాలు సేకరించి అన్లైన్లో నమోదు చేశారు. పరిశీలన అనంతరం 1,18,918 మంది రైతులను గుర్తించారు. 15450 మంది రైతులు అందుబాటులో లేరని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు తప్పని ఎదురుచూపులు.. పెట్టుబడి సాయం అందని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, బ్యాంకుల్లో జమకానున్నాయని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే మీ ఫోన్కు మెస్సేజ్ వస్తుందని ఆ తర్వాతే రావాలని చెబుతున్నారు. పెట్టుబడి సొమ్ము వస్తుందని చాలా మంది రైతులు రబీలో అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అప్పుకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుకార్లతో ఆందోళన.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రైతుబంధుపై దుష్ప్రచారం నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతుబంధు తాత్కాలికమే అని వస్తున్న పుకార్లతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇవి కేవలం గాలి వార్తలే అని కొట్టిపారేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దశల వారీగా అందరి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాయం అందడంలేదు నాకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. వారసత్వంగా వచ్చింది. ఆభూమిని నా పేరుపై ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. నాకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో మెదటి విడత చెక్కులు అందలేదు. రెండో విడత కూడా వచ్చేలా లేదు. నాలాంటి వాళ్లు మండలంలో చాలమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాస్ పుస్తకాలు అందించాలి. – వామనరావు, రైతు, మహదేవ్పూర్ వారంలో సాయం అందిస్తాం.. వారంలో రైతులకు సాయం అందనుంది. ట్రెజరీకి వివరాలు పం పించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సబంధించి రైతుల నుంచి ఏఈఓలు వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల చివరలో కేంద్ర సాయం కూడా అందనుంది. – గౌస్ హైదర్, ఏడీఏ -
కరువు ప్రకటన కలేనా.!
కడప అగ్రికల్చర్ : రబీ సీజన్లో సాగు చేసిన పంటల నివేదికను పంపాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినా ఆ దిశగా మెజార్టీ ప్రభుత్వ శాఖలు నివేదికలు పంపలేదు. దీంతో కరువు ప్రకటన వెలువడలేదనే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 11 శాఖలు తమకు ఇచ్చిన అంశాలను పొందుపరుస్తూ ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ తగు నివేదికలు పంపాలని విపత్తులశాఖ జనవరి నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు గడచినా ఇంతవరకు కొన్ని శాఖలు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లోని విపత్తుల నిర్వహణ విభాగానికి వివరాలు పంపలేదని ఆ విభాగం అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా వర్షపాతం, వర్ష విరామం, వాతావరణ పరిస్థితులు, భూగర్భజలాల స్థితిగతులు, , తాగునీటి వనరులు, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పంటల సాగు, పంట దిగుబడులు, పంటకోత ప్రయోగాల వివరాలు, ఉపాధి హామీ, కూలీలకు కల్పిస్తున్న పనుల నివేదిక, పాడిపరిశ్రమ, పశుపోషణ, పశుగ్రాసం నిల్వలు, గ్రాసం కొరత, పశువుల, జీవాల వలసలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని 11 శాఖలు నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడచిపోయింది. ఈ విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తమ నివేదికను తయారు చేసి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. రెండు సీజన్లలోనూ నష్టమే.. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ సీజన్కుగాను పంటలు దెబ్బతినగా ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.15.58 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. మామూలుగా అయితే ఒక్క సీజన్ పంటలకే ఇన్పుట్ చెల్లించే విధంగా విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే 2018–19లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణను, మార్గదర్శకాలను సడలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీని ఆధారంగా ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జె.మురళీకృష్ణ రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించిన ప్రాథమిక అంచనాల నివేదికను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూ.71.36 కోట్లు అవసరమవుతుందని జిల్లా కలెక్టర్కు నివేదికను అందజేశారు. అయితే మారిన నిబంధనల ప్రకారం విపత్తుల విభాగం అధికారులు పలు అంశాలను జోడించి ఆయా అంశాల వారీగా నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ నెల రోజులు కావస్తున్నా ఆయా శాఖలు మాత్రం నివేదికలు ఇవ్వలేదు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, షెడ్యూల్ విడుదల చేస్తే కరువు ప్రకటన వెలువడే అవకాశం ఉండదని రైతు సంఘాలు అంటున్నాయి. రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. జిల్లా నుంచి నివేదికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు ఇంతవరకు పంపలేదు. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జోక్యం చేసుకుని వెంటనే నివేదికను పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆయా శాఖలలో చలనం లేకపోవడం గమనార్హం. రబీలో ఏర్పడిన కరువు, పంటల పరిస్థితి, దిగుబడులు, వర్షపాతం, భూగర్భజలాల స్థితి తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు పంపింది. ఇది ఇలా ఉండగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా పంటల సాగు, విస్తీర్ణం, ఆయా పంటల స్థితిగతులపై నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ రబీలో సాధారణ పంటల సాగు 1,72,929 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, ఉలవ, మొక్కజొన్న, మినుము పంటలున్నాయి. అయితే ఈ పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టం చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు కూడా తీరలేదని పంటకోత ప్రయోగాలు చెబుతున్నాయి. రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటిస్తే ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించే అవకాశం ఉందని అ«ధికారులు చెబుతున్నారు. -
రబీలో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: రబీలో వరి సాగు వద్దని, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కాలం కలసి రాకపోవడం, అనేక చోట్ల బోర్లు, బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో వరి వేస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా జిల్లా వ్యవసాయాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి వనరులున్నచోట మాత్రమే వరికి వెళ్లాలని, మిగిలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నట్లు రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో రబీలో అనుకున్న స్థాయిలో వరి నాట్లు పడలేదు. వరి నాట్లు పుంజుకోలేదు. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు కేవలం 10 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు లక్ష ఎకరాల లోపే నాట్లు పడ్డాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలుకాగా 2 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అలాగే మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పురుగు కారణంగా మొక్కజొన్న నాశనమై పోయింది. దీంతో పరిస్థితిని గమనించిన వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలే మేలు... వరికి ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సాహించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ, కలెక్టర్ ఇప్పటికే ‘రబీలో వరి వద్దు... ఆరుతడి పంటలే మేలంటూ’పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. సాగునీటి వనరులు లేకపోవడంతో వరి వైపు వెళ్లి నష్టపోకూడదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఎకరా వరి సాగయ్యే నీటితో కనీసం మూడెకరాల ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారానైతే ఐదారు ఎకరాలూ సాగు చేసుకోవచ్చు. పైగా పంటల మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి కూడా ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి కంటే కూడా పొద్దు తిరుగుడు, శనగ, నువ్వుల పంటకాలం కూడా తక్కువుంటుందని, పైగా ఆరుతడి పంటలకే మద్దతు ధర అధికంగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,770 అయితే, పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ. 5,388 ఉందని తెలిపింది. సాగు ఖర్చు కూడా తక్కువని పేర్కొంది. ప్రస్తుతం రబీ కోసం 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో జిల్లాల్లో ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 65 వేల క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. ఇక రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికకు వెళ్లాల్సి ఉన్నందున ఇతర విత్తనాలను కూడా ఆగమేఘాల మీద అందుబాటులో ఉంచాలని రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. -
రబీ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీలో నీరిచ్చే అవకాశాలు సజీవమయ్యాయి. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటిలభ్యత ఉండటంతో అక్కడ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, మిగతా నీటిని రబీ అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) నిర్ణయించింది. ఎస్సారెస్పీ, కడెం, నాగార్జున సాగర్ పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండగా, నిజాంసాగర్, సింగూరు, జూరాల ప్రాజెక్టు ల్లో నిల్వలు ఆశించినంత లేని కారణంగా కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం శివమ్ కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్కుమార్తోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింద తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యతిస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టు నుంచి నీటి విడుదల కోసం రైతుల నుంచి వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగింది. ఎస్సారెస్పీలో తాగునీటి కోసం పక్కన పెట్టగా కాకతీయ కెనాల్కు 15 టీఎంసీల నీటిని పంటలకు సప్లిమెంటేషన్ చేసేలా విడుదల చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నీటితో కనిష్ఠంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇక లక్ష్మి కెనాల్, సరస్వతి కెనాల్ కింద చెరో 1.6 టీఎంసీల నీటితో 40వేల ఎకరాలకు ఇవ్వవచ్చని వివరించారు. దీనికి శివమ్ కమిటీ ఓకే చెప్పింది. ఇక కడెం కింద సైతం 2 టీఎంసీలతో గూడెం లిఫ్ట్ ద్వారా 20వేల ఎకరాలకు నీరిచ్చేందుకు సమ్మతించింది. నాగార్జునసాగర్ కింద ప్రస్తుతం 23 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నందున దీనిద్వారా కనిష్టంగా 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అయితే ఎన్ని తడులకు ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇవ్వాలన్న దానిపై తుది నిర్ణయం ఇంకా చేయలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలు, గడ్డెన్నవాగు కింద మరో 2వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. -
ఊహలు.. ఆశలు
వర్షాలు పడడం లేదు. ఏం చేయలేం. ఈ ఏడాదికి ఇంతే.. సోమశిలలో నీరు తక్కువగా ఉంది. ఉన్న దాంట్లో సర్దుకోండి. ఇది పాలక పక్షం తీరు. నీటి కేటాయింపులు మొదలుకొని సాగు విస్తీర్ణం వరకు అన్నీ ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయాయి. లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన అధికార గణం తక్కువ ఎకరాలకు నీటి కేటాయింపులు ప్రకటించారు. అదేమని సభలో ప్రశ్నిస్తే జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం పడితే వాటితో ఈ ఏడాది గట్టెక్కేద్దామంటూ పాలకుల జవాబు. గురువారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం ఊహలు, ఆశలు, నామమాత్రపు కేటాయింపులతో ముగిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రబీ సీజన్ రైతుల ఆశలకు అధికారులు పాలకులు గేట్లు వేశారు. రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. వానలు లేవు.. సోమశిలలో ఉన్న నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న రైతాంగాన్ని ఉస్సూరుమనిపించారు. జిల్లాలో గతేడాది 50.02 టీఎంసీల నీటిని సోమశిల నుంచి విడుదల చేసి 4.98 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉంది. సోమశిలలో నీటి నిల్వ తక్కువగా ఉందని 31 టీఎంసీల నీటిని 3.21 లక్షల ఎకరాలకు ఇస్తామని ప్రకటించారు. 2015 నుంచి కరువు కోరల్లో జిల్లా కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది అయితే జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రైతులు అందరు సోమశిల సాగునీటిపైనే ఆశలు పెంచుకున్నారు. మరో వైపు 63 శాతం లోటు వర్షపాతం నమోదు కావటంతో సోమశిల నీరే ఆధారంగా జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. అయితే అధికారులు ముందు చూపు లేకపోవటం గతంలో సోమశిలకు వచ్చిన వరద నీటిని కండలేరుకు వదిలి అక్కడి నుంచి చెన్నై, చిత్తూరు జిల్లాలకు తాగునీటి అవసరాలకు తరలించడం వంటి పరిణామలతో ఈ ఏడాది సోమశిలలో నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రతి ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి, నీటి కేటాయింపులు ప్రకటించగానే దానికి అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేది. అక్టోబర్లో ముగించాల్సి ఉన్న సాగునీటి సమావేశాన్ని నవంబర్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. సోమశిల రిజర్వాయర్లో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 42 టీఎంసీల నీరు ఉంది. డెడ్ స్టోరేజ్ లెవల్, తాగునీటి అవసరాలకు పోనూ 31 టీఎంసీల నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో డెల్టాలో 1.91 లక్షల ఎకరాలకు ఉత్తర, దక్షిణ కనుపూరు, కావలి పరిధిలో ఉన్న ఆయకట్టులో 50 శాతం అయకట్టుకు మాత్రమే నీరిస్తామని ప్రకటించారు. కండలేరులో ఉన్న 13 టీఎంసీల నీటిని మనుబోలు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు తిరుపతి, చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. మోటార్లు కట్టడి చేస్తేనే నీరు అక్రమ మోటార్ల ద్వారా జిల్లాలో నీటిని తోడేస్తుంటారు. ముఖ్యంగా కావలి కెనాల్ పరిధిలో 48 వేల అనధికార మోటార్లు, కనుపూరు కెనాల్ కింద 32 వేల అనధికార మోటార్ల ద్వారా నీటిని కొందరు తోడేస్తున్నారు. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులకు ప్రతి మో టారుకు 10 వేల చొప్పున వసూలు చేసి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి భూముల రైతులకు నీరు అందని పరిస్థితి. రైతు సంఘ నాయకులకుఅవకాశం కల్పించాలి నెల్లూరు(పొగతోట): జిల్లా సాగు నీటి సలహా మండలి (ఐఏబీ)లో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్.అమర్నాథ్రెడ్డికి విష్ణువర్ధన్రెడ్డి, రైతు సంఘాల నాయకుడు బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించగలిగితే రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. సాగునీరు అందక చివరి భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వీలైనంత నీటిని అధిక ఎకరాలకు కేటాయించాలన్నారు. నీటిని విడుదల చేయని ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మంచి నీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందేలా చెరువులకు నీటిని విడుదల చేయాలని కోరారు. -
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
రెండో విడత రైతుబంధుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రైతుబంధు సొమ్ము పంపిణీకి సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలోగా పెట్టుబడి సొమ్ము పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఆ లోగానే పెట్టుబడి సాయం రైతులకు ఇస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ రైతుకూ పెట్టు బడి సొమ్ము ఇస్తారు. ఆయా రైతులు సాగు చేసి నా, చేయకపోయినా పెట్టుబడి సొమ్ము అందనుంది. ఖరీఫ్లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలై తే, రబీలో 31.92 లక్షల ఎకరాలే. పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్ లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్డులా? చెక్కులా? ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేలు అందజేసిన సంగతి తెలిసిం దే. ఆ ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే చెక్కులను గ్రామాలకు సరఫరా చేసింది. ఇప్పటివరకు 49 లక్షల చెక్కులను రైతులకు అందజేశారు. 9 లక్షలకు పైగా చెక్కులు మిగిలిపోయాయి. వాటి ల్లో దాదాపు లక్షన్నర చెక్కులకు చెందిన రైతులు చనిపోయారు. మరో లక్ష చెక్కులు ఎన్ఆర్ఐలకు సంబంధించినవి. మిగిలినవి ఇతరత్రా కారణాల తో తీసుకోలేదు. రెండో విడత రైతుబంధు సొమ్ము ను రైతులకు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డుల వంటి వాటిని ఇవ్వాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీపై సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. దీంతో బ్యాంకు కార్డులు ఇస్తే అంత ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. చెక్కులను ఇస్తేనే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో చెక్కులవైపే సర్కారు మొగ్గు చూపుతుందని అనుకుంటున్నారు. కాగా, జిల్లాల్లో మిగిలిపోయిన చెక్కులను వెనక్కు పంపా లని వ్యవసాయశాఖ ఆదేశించింది. అందుకు కారణాలు వివరిస్తూ నివేదిక పంపాలని పేర్కొంది. -
రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి!
సాక్షి, హైదరాబాద్ : రబీ సీజన్లోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు భావిస్తోంది. ఖరీఫ్లో రైతు బంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ రబీలోనూ అందజేయాలని యోచిస్తోంది. ఈ లెక్కన రబీలో రైతులు సాగు చేసినా, చేయకపోయినా ఆర్థిక సాయం అందనుంది. ఖరీఫ్లో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును అందజేయనున్నారు. అయితే రబీలో మాత్రం కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం గతంలో నిర్ణయించింది. పంటలు సాగు చేసిన రైతుల లెక్కలు తేల్చి.. వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని భావించారు. అయితే తాజాగా ఆ నిర్ణయానికి సవరణ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం’అని చెప్పారు. వాస్తవానికి ఖరీఫ్ కంటే రబీలో పంటల సాగు మూడో వంతుకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. రబీ విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రబీ నాటికి నీరందితే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగు కానుందని అంటున్నారు. రూ.12 వేల కోట్ల బడ్జెట్ ఉందిగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఖరీఫ్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించి, రబీలో కొందరికే ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైగా రబీలో ఎవరు సాగు చేశారు, ఎవరు చేయలేదన్నది తేల్చడం కష్టమైన వ్యవహారం. ఖరీఫ్లో విజయవంతంగా అమలు చేసి, రబీలో వివాదంగా మారితే అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్కారులో ఉంది. ఎలాగూ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించినందున రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తే వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చన్నది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు. రబీలోనూ అందరికీ పెట్టుబడి సొమ్ము ఇచ్చే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. -
చేతికి రాని పంట!
మోర్తాడ్(బాల్కొండ):సాధారణంగా రబీ సీజనులో ఈదురు గాలులు, అకాల వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాల పరిమితిలో చేతికి వచ్చే వరి రకాలను సాగు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసిన కేఎన్ఎం 118 రకం వరి వంగడాలను రుద్రూర్ పరిశోధన కేంద్రంలో సీడ్ ప్రాసెసింగ్ చేసి రైతులకు సరఫరా చేశారు. దాదాపు 900 సంచుల కేఎన్ఎం 118 రకం వరి విత్తనం ఉండటంతో ఈ విత్తనాలను రైతులకు ఈ రబీ సీజనుకు గాను పరిశోధన కేంద్రం ఉద్యోగులు విక్రయించారు. జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్పల్లి, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్ తదితర మండలాల్లోని రైతులు ఈ కొత్త రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో సాగు చేశారు. 125 రోజుల్లో వరి పంట చేతికి వస్తే అకాల వర్షాలు రాక ముందే పంట కోత దశకు చేరుకుంటుందని రైతులు ఆశించారు. సాధారణంగా రబీ పంటల సాగు డిసెంబర్లోనే మొదలు పెడుతున్నారు. డిసెంబర్లో నారు పోస్తే జనవరిలో పంటను నాటుతారు. ఈ లెక్కన ఏప్రిల్ రెండో వారంలో పంట కోత దశకు చేరుకుంటుంది. నెలలు, రోజుల ప్రకారం లెక్కలు వేసిన రైతులు కేఎన్ఎం 118 రకం వరిని సాగు చేశారు. శాస్త్రవేత్తలు ప్రకటించిన ప్రకారం 125 రోజుల్లో వరి పంట చేతికి రావాల్సి ఉంది. అయితే 145 రోజులు గడుస్తున్నా ఇంకా వరి పంట కోత దశకు చేరుకోలేదు. ఈ పంట చేతికి రావాలంటే మరో 10 రోజుల సమయం పడుతుంది. వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట ఇంకా కోత దశకు చేరుకోకపోవడంతో రైతులు తమ పంట పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేఎన్ఎం 118 రకం తక్కువ కాల పరిమితితో పాటు ఎకరానికి 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఈ రకం వరి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేశారు. దిగుబడి మాట ఎలా ఉన్నా పంట కోత దశకు చేరుకోకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఖరీఫ్లోనే తక్కువ సమయంలో చేతికి వస్తుంది కేఎన్ఎం 118 రకం ఖరీఫ్లోనే 125 రోజుల్లో కోతకు వస్తుంది. రబీలో 10 రోజుల కాల పరిమితి ఎక్కువ అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రకారం ఇంకా పది రోజుల సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఈ వంగడాన్ని మేము కేవలం ప్రాసెసింగ్ మాత్రమే చేశాం. ఉత్పత్తి చేసిన వారు కునారం వారు.– ప్రభాకర్రెడ్డి,శాస్త్రవేత్త, రుద్రూర్ పరిశోధన కేంద్రం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్కు చెందిన రైతు బద్దం ప్రసాద్ రబీలో అకాల వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే వరి రకాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇచ్చిన ఒక ప్రకటన చూసి కేఎన్ఎం 118 రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి పది ఎకరాల్లో వరిని సాగు చేశారు. కేఎన్ఎం 118 రకం సాగు చేస్తే 125 రోజుల్లో పంట కోతకు వస్తుందని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాని బద్దం ప్రసాద్ సాగు చేసిన వరి పంటకు 145 రోజులు గడచిపోయినా పంట ఇంకా కోత దశకు చేరుకోలేదు. ఈ పంట కోత దశకు చేరుకోవాలంటే మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఒక బద్దం ప్రసాద్కు సంబంధించిన సమస్యనే కాదు. జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. -
గట్టెక్కించిన సీలేరు
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది. నీటి ఎద్దడి ఉందన్నా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు. సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది. ఇప్పటికీ సీలేరు నుంచే.. డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ డ్రాప్ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది. -
‘కొనుగోలు’ ప్రణాళిక సిద్ధం చేయండి
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రబీ ధాన్యం కొనుగోళ్లపై గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మే నెలలో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోదాంలకు దగ్గరగా ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా తాడిపత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గన్నీ బ్యాగ్ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో 259 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 62 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. సీఎంఆర్ రికవరీ 99.5 శాతం పూర్తయిందని, ఇంకా రెండు మిల్లర్ల నుంచి ధాన్యం రావాల్సి ఉందన్నారు. డిఫాల్టర్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టామని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 2,739 దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినట్లు వెల్లడించారు. సివిల్ సప్లయి కార్పొరేషన్ డీఎం హరికృష్ణ, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్వో కృష్ణప్రసాద్, మార్కెటింగ్ ఏడీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారధాన్యాలు.. 27.74 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా భారీగా పెరిగింది. దేశంలో 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లో ఆహారధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతాయ ని కేంద్రం అంచనా వేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ రెండో అంచనా నివేదికను బుధవారం విడుదల చేసింది. 2016–17 సీజన్లో 27.51 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2017–18 సీజన్లో 27.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. గతేడాది కంటే 23 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి కానున్నాయి. అందులో వరి ఉత్పత్తి గతేడాది 10.97 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.10 కోట్ల టన్నులు దిగుబడి రానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి గతేడాది 2.31 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కానున్నాయి. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.98 కోట్ల టన్నులకు పడిపోనున్నాయి. పత్తి ఉత్పత్తి గతేడాది 3.25 కోట్ల బేళ్లు కాగా, ఈసారి 3.39 కోట్ల బేళ్లు ఉత్పత్తి కానుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నులకే పరిమితమైంది. వరి ఉత్పత్తి లక్షం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని వెల్లడించింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 2.94 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి గణనీయంగా 3.71 లక్షల టన్నులకు చేరింది. అందులో కంది ఉత్పత్తి లక్ష్యం 2.03 లక్షల టన్నులు కాగా, 2.84 లక్షలకు చేరింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 15.70 లక్షల టన్నులకు పడిపోయింది. పెసర 64 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, 59 వేల టన్నులకు పడిపోయింది. మినుముల ఉత్పత్తి లక్ష్యం 26 వేల టన్నులు కాగా, నూటికి నూరు శాతం ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో నిరాశపరిచిన ఆహారధాన్యాల ఉత్పత్తి, రబీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 44.72 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అందులో వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నులు అవుతుందని అంచనా వేసింది. -
రబీ కొనుగోళ్లకు 161 కేంద్రాలు
సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం 161 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీవో, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను మార్చి మూడో వారంలో ప్రారంభించాలని, అందుకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజే ట్యాబ్ల్లో నమోదు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీటివసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా, హమాలీల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పుటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్డీవో బి.రవీందర్, డీఎస్వో పద్మ, జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అనిల్కుమార్, మార్కెటింగ్శాఖ జిల్లా మేనేజర్ షాహబొద్దీన్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయాధికారి కె.తిరుపతి, ఐకేపీ ఏపీఎం పర్శరాం తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సాగు నీటి ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణను పకడ్బందీగా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. బుధవారం భారీ ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణ, సాధించిన ఆయకట్టు, మిషన్ భగీరథ అవసరాలపై సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో మంత్రి జలసౌధలో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీలో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలకు, ఎల్ఎండీ దిగువన 1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్ భగీరథ అవసరాలకు జలాశయాల్లో నీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలన్నారు. అక్రమంగా తూములు, కాల్వలు పగులగొట్టకుండా, గేట్లను ఎత్తివేయకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. 19 లక్షల ఎకరాలకు నీరు.. ప్రస్తుతం శ్రీరాంసాగర్లో 10 టీఎంసీల నీరు ఉందని చీఫ్ ఇంజనీర్ మంత్రికి తెలిపారు. మరో నాలుగు తడులకు 4 టీఎంసీల నీరు అవసరమని.. మిగతా 6 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ అవసరాలను వినియోగిద్దామని చీఫ్ ఇంజనీర్ అన్నారు. ఏప్రిల్ 16న ఎస్సారెస్పీ కాల్వ మూసివేయాలని, మార్చి 20న ఎల్ఎండీ కాలువ మూసివేయాలని హరీశ్ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టీఎంసీలు, సాగర్లో 30 టీఎంసీలు మొత్తం కలిపి 62 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. ఇప్పటికే 7 తడులకు నీటిని విడుదల చేశామని, మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసముందన్నారు. ఏప్రిల్ 5న సాగర్ ఎడమ కాలువ తూము మూసివేయాలని హరీశ్ సూచించారు. ఈ రబీలో శ్రీరాంసాగర్ కింద 6 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 5 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సీతారామ ఎత్తిపోతలపైనా మంత్రి హరీశ్ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. సీతారామ లిఫ్ట్ పథకం ఫేజ్ –1లో 3 పంప్హౌస్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్, తుమ్మల అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సీఎస్ జోషికి సన్మానం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జలసౌధకు వచ్చిన ఎస్కే జోషిని మంత్రి హరీశ్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా, ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షించిన జోషి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. తన 34 ఏళ్ల సర్వీస్లో ఎందరో మంత్రులను చూశానని, కానీ హరీశ్ వంటి మంత్రిని చూడలేదని జోషి అన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి మంత్రి పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు. -
10 జిల్లాల్లో మొదలుకాని రబీ సాగు
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ పంటల సాగు ఊపందుకోలేదు. పది జిల్లాల్లోనైతే అసలు ఒక్క ఎకరాలో కూడా పంటల సాగు మొదలు కాలేదు. మేడ్చల్, మెదక్, నల్లగొండ, యాదాద్రి, జయశంకర్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రబీ పంటల సాగు మొదలు కాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.67 లక్షల ఎకరాల్లో సాగు కావాలి. గతేడాది ఇదే సమయానికి 3.45 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు కేవలం 2.47 లక్షల ఎకరాలకే (8%) సాగు పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 23.7 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 87,500 ఎకరాల్లోనే (4%) సాగయ్యాయి. పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.15 లక్షల ఎకరాలు కాగా, 72,500 ఎకరాల్లో (23%) సాగయ్యాయి. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలైతే, 67,500 ఎకరాల్లోనే (29%) సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.47 లక్షల ఎకరాల్లో (39%) సాగుచేశారు. వరి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 15.1 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఇంకా నాట్లు మొదలు కాలేదు. పత్తిని ఇంకా గులాబీరంగు పురుగు పట్టిపీడిస్తోందని వ్యవసాయశాఖ వెల్లడిం చింది. వరంగల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నాగర్కర్నూలు, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గులాబీ కాయతొలుచు పురుగుతో పత్తి పరిస్థితి అధ్వానంగా ఉంది. -
కృష్ణమ్మ.. కరుణిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: గత నెల రోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు.. రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఖరీఫ్ పూర్తిగా డీలా పడ్డా..రబీ ఆశలు మాత్రం సజీవమవుతున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండేందుకు దగ్గరవడం, ఇక వచ్చే నీరంతా దిగువన సాగర్లోకి చేరనుండటం ఆయకట్టు రైతాంగాన్ని ఆనందంలో ముంచుతోంది. దీనికి తోడు వచ్చే జూలై వరకు రాష్ట్ర తాగు, సాగు అవసరాలను సిద్ధం చేసిన తెలంగాణ నీటి పారుదల శాఖ, సాగర్ పరిధిలో పూర్తిస్థాయి రబీ ఆయకట్టుకు నీరిచ్చేలా తమకు 54.5 టీఎంసీల మేర కేటాయింపులు చేయాలని కృష్ణాబోర్డును కోరడం, అందుకు తగ్గట్లే ప్రణాళిక రూపొందించడం ఆయకట్టు రైతుల్లో ఆశలు నింపుతోంది. నిండేందుకు సిద్ధంగా శ్రీశైలం.. నాగార్జునసాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేందుకు సిద్ధమైంది. గడచిన ఇరవై రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకొంది. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి 45 వేలు, నారాయణఫూర్ నుంచి 52వేల క్యూసెక్కుల పైచిలుకు నీరు దిగువకు వస్తోంది. దీంతో జూరాలవద్ద 30వేల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదుకాగా, ఈ ప్రాజెక్టు నుంచి 34,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి దిగువకు ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలానికి 52,375 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో ఉంది. ఇక్కడి నుంచి 9,625 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల నిల్వకు గానూ 203.43 టీఎంసీల లభ్యత ఉంది. మరో 12.38 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 52,375 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో పాటు మరింత నీరు చేరే అవకాశాలుండటంతో మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నిండిన పక్షంలో విడుదలచేసే నీరంతా దిగువ సాగర్కే రానుంది. ప్రస్తుతం సాగర్లో 147.46 టీఎంసీల నిల్వలున్నాయి. కాగా, మరో 164.59 టీఎంసీలు వస్తేనే ప్రాజెక్టు నిండుతుంది. అయితే శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో మున్ముందు నీటి నిల్వలు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. తాగు, సాగు అవసరాలకు 103 టీఎంసీలు జూన్ మొదలు ప్రస్తుత అక్టోబర్ వరకు ప్రవాహాలు లేని కారణంగా ఖరీఫ్ లో సాగర్ కింద ఒక్క ఎకరాకూ సాగు నీరందలేదు. అయితే ప్రస్తుతం ఎగువన ప్రాజెక్టులు నిండటం, దిగువకు ప్రవా హాలు వస్తున్న నేపథ్యంలో రబీపై ఆశలు పెరిగాయి. ప్రస్తుతం సాగర్లో ఉన్న నిల్వ, వస్తున్న ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ వచ్చే జూలై వరకు ప్రాజెక్టు కింద అవసరాలపై అంచనా లెక్కలను సిద్ధం చేసింది. వాటిని సోమవారం కృష్ణా బోర్డుకు అందించ నుంది. శ్రీశైలం, సాగర్ల నుంచి తెలం గాణకు సాగు, తాగు నీటికోసం 103 టీఎంసీల కేటాయింపులు కోరుతున్న రాష్ట్రం, అందులో కల్వకుర్తి కోసం 6 టీఎంసీలు మినహా, సాగర్కింది తాగు, సాగు అవసరాలకే 97 టీఎంసీలు అడు గుతోంది. ఇందులో నల్లగొండ జిల్లా పరిధిలోని కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్ల కింద 47వేల ఎకరాల రబీ అవసరాలకు 34.50 టీఎంసీలు కోరగా, ఖమ్మం జిల్లాలో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 20 టీఎంసీలు కేటాయించాలని కోరుతోంది. నిజానికి సాగర్ ఎడమ కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఇంతవరకు చుక్క నీటిని వినియోగించలేదు. ఈ నేపథ్యంలో రబీలో తప్పక కేటాయింపులు జరుగుతా యని రాష్ట్రం అంచనా వేస్తోంది. సాగర్ ఎడమకాల్వ కింది 6 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరిచ్చేలా ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
-
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
♦ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ♦ తొలుత ఒక జిల్లాలో అమలు ♦ క్రమంగా మిగతా జిల్లాలకు.. సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి.. తర్వాత మిగతా జిల్లాలకూ విస్తరించనుంది. రబీ సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్లోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ట్రాన్స్కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శరవేగంగా ఏర్పాట్లు.. గతంలో పంటలకు గరిష్టంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వచ్చే రబీ నుంచి విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచేందుకు ట్రాన్స్కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రూ.1,000 కోట్ల వ్యయంతో కొత్త లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీ డీసీఎల్ తొలుత తమ పరిధిలోని ఒక్కో పాత జిల్లా పరిధిలో ఆగస్టు 15 నుంచి పంటలకు 24 గంటల విద్యుత్ను సరఫరాను ప్రారంభించనున్నాయి. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా.. 24 గంటల సరఫరాతో విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. 24 గంటల సరఫ రాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు పెరుగుతుందని.. మొత్తంగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,000 మెగావా ట్లను మించనుందని డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ను సమీకరణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచితే డిస్కంలపై అదనంగా ఏటా రూ.1,000 కోట్ల భారం పడుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల రూపంలో ఈ భారాన్ని భరించనుంది. -
రబీకి ఫుల్ కరెంట్
► యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ►రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ ►సాగును లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం ►ఇందుకు 6 సూత్రాల ప్రణాళిక ►మాతాశిశువులకు ప్రభుత్వ ఆత్మీయ కానుకలు ►నేటి నుంచి కేసీఆర్ కిట్స్, రేపట్నుంచి ఒంటరి మహిళలకు జీవనభృతి ►డిసెంబర్లోగా అన్ని గ్రామాలకు నదీజలాలు ►ఈ నెలలోనే గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం హైదరాబాద్: వచ్చే యాసంగి (రబీ) నుంచే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రెండు పంటలకు కలిపి రూ.8 వేలు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ సురక్షిత తాగునీటిని అందజేస్తామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అతితక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచిందని.. పేద ప్రజల ఆత్మవిశ్వాసం పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గన్పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు దళాల వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెపుడో..’అన్న మహాకవి దాశరథి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ వాక్యాలు తన మదిలో నిరంతరం మెదులుతుంటాయని.. ఆ కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో, అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తానని కేసీఆర్ ప్రతినబూనారు. వేడుకల్లో కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లాభసాటి వ్యవసాయం కోసం ప్రణాళిక ‘‘వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. రైతులు, వ్యవసాయ నిపుణులతో చర్చలు జరిపి పటిష్టమైన కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టింది. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి సాగునీరు అందించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎకరానికి రూ. 8 వేల చొప్పున వ్యవసాయానికి పెట్టుబడిగా అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. ఇలా ఆరు అంశాలతో సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి. ఎవరు అడ్డుకున్నా ఆగదు కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దుష్ట ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయినా ఏటా రూ. 25 వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి మరీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వ ముమ్మరం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8 వేలను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తాం. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజిస్తాం. దాంతో రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్ల నిధిని సమకూరుస్తుంది. పంటల కొనుగోలుకు ఆ మూలధనాన్ని వినియోగించి.. కనీస మద్దతు ధర అందడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే సంక్షోభం సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. మిషన్ కాకతీయ ద్వారా గత రెండేళ్లలో 16 వేల చెరువులు పునరుద్ధరించుకున్నం. ఈ ఏడాది 5 వేలకుపైగా చెరువుల పనులు జరుగుతున్నాయి. ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నం. పాలిహౌస్, గ్రీన్హౌస్ సాగు, మైక్రో ఇరిగేషన్కు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నం. యాసంగి నుంచే 24 గంటల విద్యుత్ విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ విజయం సాధించింది. కొరతను అధిగమించి.. కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే స్థితికి వచ్చాం. ఈ ఏడాది యాసంగి పంటకాలం నుంచే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషి ఫలించి మూడు దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు అన్ని గ్రామాలకు నదీ జలాలు అందే అవకాశముంది. దాంతో తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమవుతుంది. అవతరణ ఆత్మీయ కానుకలు రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ప్రభుత్వం మరో రెండు మానవీయ నిర్ణయాలు తీసుకుంది. ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లింపు ఎల్లుండి (ఆదివారం) నుంచే అందుతుంది. మాతాశిశు సంరక్షణకు ఉద్దేశించిన రూ.15 వేల విలువైన ‘కేసీఆర్ కిట్’పథకం రేపట్నుంచే (శనివారం) అమల్లోకి వస్తుంది. గర్భిణులు కూలికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి, పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక. ఆదాయ వృద్ధిలో అగ్రస్థానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని ఉద్యమ సమయంలో నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యమైంది. వచ్చే నెలలో హరితహరం మూడోదశ పచ్చదనం పెంపొందించడం కోసం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’మూడోదశ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఉత్సాహంగా అందులో పాలుçపంచుకోవాలి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం నలుమూలలా రహదారులన్నీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం. పారిశ్రామిక ప్రగతికి ఉద్దేశించిన టీఎస్–ఐపాస్ చట్టం సత్ఫలితాలను సాధిస్తోంది..’’ ఈ నెల నుంచే గొర్రెల పంపిణీ గొల్లకుర్మలకు 75 శాతం భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను అందజేసే పథకం ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. తొలిదశలో రూ.5 వేల కోట్లతో 84 లక్షల గొర్రెలను అందిస్తాం. ఇక చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని భరించి.. లాభాలను బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందిస్తాం. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. నూలు, రసాయనాలను యాభై శాతం సబ్సిడీతో అందిస్తాం. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటు కోసం నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. రజకులకు బట్టలుతికే అధునాతన యంత్రాలు, విశ్వబ్రాహ్మణులకు వృత్తి పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపడతాం. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వృత్తులకు మారే వారికి కూడా తగిన ఆర్థిక తోడ్పాటు అందిస్తాం. అత్యంత వెనుకబడిన సంచార, ఆశ్రిత కులాలను, వర్గాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పలు పథకాలు రూపొందిస్తుంది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి. తెలంగాణ వేగంగా పురోగమించాలి: మోదీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేశారు. సంక్షేమానికే రూ.40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ప్రజా సంక్షేమానికే ఖర్చు పెడుతున్నాం. రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు కొత్తగా 512 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్లే... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికీ నెలకు ఆరుకిలోల బియ్యం, చదువుకునే పిల్లలకు సన్న బియ్యం అన్నం అందిస్తున్నాం. బడుగులు గౌరవంగా బతికేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. -
1.56 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సీజన్లో వేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బోరు బావుల కింద వేసిన పంటలే అధికంగా ఎండినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసిన ఆ శాఖ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ ప్రకారం మొత్తం 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాల్లో వరి ఎండింది. అలాగే 4,130 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. 17 జిల్లాలకు చెందిన 197 మండలాల్లో పంటలు ఎండిపోయినట్లు నివేదిక తెలిపింది. అత్యధికంగా మెదక్ జిల్లాలోని 20 మండలాల్లో 33,620 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 28,572 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 28 వేల ఎకరాల వరి పంట ఎండిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. బోరు బావుల కిందే 1.46 లక్షల ఎకరాలు...: జిల్లాల్లోని 197 మండలాల్లో 26.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 18.54 లక్షల ఎకరాల్లో బోరు బావుల కింద సాగయ్యాయి. మిగిలినవి చెరువులు, కాలువలు, ఎత్తిపోతల కింద సాగయ్యాయి.అన్ని పంటలు కలిపి 1.56 లక్షల ఎకరాల్లో ఎండిపోగా, అందులో 1.46 లక్షల ఎకరాలు బోరు బావుల కిందే ఎండిపోవడం గమనార్హం. బోరు బావుల్లో నీరు అడుగంటిపోవడమే కారణమని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. -
పంట బీమాపై రైతుల అనాసక్తి
⇒ ఈ రబీలో బీమా చేయించిన రైతులు లక్షన్నర మందే ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబాటులో ఉంది. 2016–17 రబీ సీజన్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధా రిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీ ఐఎస్) ద్వారా రాష్ట్రంలో కేవలం 1.56 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించు కున్నారు. అందులో బ్యాంకు రుణం తీసుకు నే రైతులు 1.46 లక్షల మంది కాగా.. రుణం తీసుకోని రైతులు 10 వేల మంది ఉన్నారు. వీరు రూ.34.26 కోట్లు ప్రీమియం చెల్లించా రని కేంద్ర వ్యవసాయ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 7.7లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఈసారి ప్రైవేటు కంపెనీలే బీమా చేయించడంతో రైతులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందున్న పక్క రాష్ట్రాలు.. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 36.26 లక్షల మంది రైతులు రబీలో పంటల బీమా చేయించారు. ఆ తర్వాత రాజస్థాన్లో 30.76 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 28.80 లక్షల మంది, బిహార్లో 11.54లక్షల మంది రైతులు పంటల బీమా చేయించారు. హరి యాణాలోనూ 5.75లక్షల మంది, అలాగే తమిళనాడులో 15.19 లక్షల మంది, కర్ణాటక లో 11.72 లక్షల మంది, మహారాష్ట్రలో 8.05 లక్షల మంది బీమా చేయించారు. ఏపీలోనూ 1.44 లక్షల మంది రైతులే పంట బీమా చేయించారు. నష్టపరిహారం సకాలంలో రాక పోవడంతో రైతులు ఆసక్తి చూపడంలేదని అధికారులు చెబుతున్నారు. -
రబీ ఆశలపై నీళ్లు
- కేవలం 35 శాతం విస్తీర్ణంతో ముగిసిన రబీ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ను కకావికలం చేసిన వరుణుడు రబీలోనూ కరుణించకపోవడంతో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు రాకపోవడంతో 7.62 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు నిలువునా ఎండిపోయాయి. అక్టోబర్లోనూ వరుణుడు ముఖం చాటేయడంతో ప్రస్తుత రబీ సీజనూ రైతన్నలను చావు దెబ్బ తీసింది. రెండు సీజన్లలోనూ వర్షాలు లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లా చరిత్రలో ఖరీఫ్, రబీలు దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. పడిపోయిన విస్తీర్ణం సీజన్ ముగుస్తున్నా రబీ పంటల విస్తీర్ణం 35 శాతానికి మించలేదు. ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1.31 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవ్వాల్సి ఉండగా, 44 వేల హెక్టార్లకే పరిమితమయ్యాయి. 77,564 హెక్టార్లలో సాగులోకి వస్తుందనుకున్న ప్రధానపంట పప్పుశనగ 23 వేల హెక్టార్లు, 20 వేల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 12,500 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 6.672 హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 2,500 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లకు గానూ 3 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 1,200 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకుగానూ కేవలం 180 హెక్టార్లకు పరిమితమయ్యాయి. వర్షాల్లేక భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. దీంతో వరి 10 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ప్రస్తుతానికి 1,400 హెక్టార్లలోనే సాగవుతోంది. సజ్జ, రాగి, మినుము, అలసంద, పెసర, కుసుమ, ధనియాలు, పత్తి తదితర అన్ని పంటల సాగు విస్తీర్ణమూ గణనీయంగా పడిపోయింది. వేసిన పప్పుశెనగ కూడా వర్షాలు లేక ఎండిపోవడంతో ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పెట్టుబడుల్లో సగం కూడా దక్కడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటాడిన వర్షాభావం వర్షాభావ పరిస్థితులు రబీని కూడా వెంటాడటంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. కీలకమైన అక్టోబర్, నవంబర్లో వర్షాలు పూర్తిగా మొహం చాటేయడంతో అరకొర తేమలో అక్కడక్కడ పంటలు సాగు చేశారు. సాగైన పంటలు కూడా దిగుబడులు లేక దయనీయంగా తయారయ్యాయి. అక్టోబర్లో 110.7 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 7.1 మి.మీ. వర్షమే పడింది. నవంబర్లోనూ 34.7 మి.మీ. గానూ కేవలం 1.7 మి.మీ. కురిసింది. రెండు మూడు తుఫాన్లు వచ్చినా జిల్లాపై కనీస ప్రభావం చూపలేకపోవడంతో రబీ ఆశలు గల్లంతయ్యాయి. మొత్తమ్మీద రబీలో 155.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 26.6 మి.మీ. కురిసింది. మొత్తమ్మీద ఈ సంవత్సరం ఇప్పటివరకు 495 మి.మీ.గానూ 283 మి.మీ. వర్షం కురిసింది. అంటే 43 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. కనీసం ఒక్క మండలంలోనూ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. గుమ్మగట్ట, రామగిరి, కగానపల్లి లాంటి కొన్ని మండలాల్లో 60 నుంచి 80 శాతం తక్కువగానూ, మరో 30 మండలాల్లో 40 నుంచి 60 శాతం తక్కువగానూ నమోదైంది. వరుసగా 45 రోజులు, 52 రోజుల పాటు వర్షం పడని విరామం (డ్రైస్పెల్స్) నమోదు కావడంతో భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పాతాళానికి పడిపోయాయి. బోర్లలో నీళ్లు రావడం గగనంగా మారింది. ప్రస్తుతం భూగర్భజలమట్టం 22.40 మీటర్లుగా ఉంది. -
సాగర్ ఆయకట్టుకు రబీ గండం!
-
సాగర్ ఆయకట్టుకు రబీ గండం!
6 లక్షల ఎకరాలకు నీటి కరువు ► ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో లభ్యత జలాలు 53 టీఎంసీలు ► గరిష్టంగా ఏపీకి దక్కే వాటా 35 టీఎంసీలు ► తెలంగాణకు దక్కే వాటా 1820 టీఎంసీలు ► ఆవిరి నష్టాలను తీసేస్తే ఇంకా తగ్గే అవకాశం ► ఇందులోనూ 10 టీఎంసీలు తాగు అవసరాలకే ► మిగతా 8 టీఎంసీలతో రబీ సాగు చేసేదెట్లా? ► మొదలైన పంటల సాగు.. ఆందోళనలో రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రబీ సాగుకు జల గండం పొంచి ఉంది. సాగర్ కింద ఆయకట్టు లక్ష్యాలు ఘనంగా ఉండటం.. నీటి లభ్యత తక్కువగా ఉండటం ఆయకట్టు రైతాంగాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే పంటల సాగు మొదలైన నేపథ్యంలో... రానున్న రోజుల్లో ఏమేరకు నీటి విడుదల ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోవడం, కృష్ణా బోర్డు తీరును బట్టి గరిష్టంగా 8 నుంచి 10 టీఎంసీలు మాత్రమే దక్కవచ్చన్న అంచనాలతో ఆందోళన నెలకొంది. ఇదే జరిగితే గతేడాది మాదిరే ఈసారి కూడా 6 లక్షల ఎకరాల రబీ సాగుకు నీటి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండో ఏడాదీ ఇక్కట్లే.. సాగర్ జలాలపై ఆధారపడి నల్లగొండ జిల్లా పరిధిలో కాలువల కింద 2.8 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2014–15 రబీలో) మాత్రమే ఈ ఆయకట్టుకు ఆశించిన స్థాయిలో నీరందింది. ఆ ఏడాది కృష్ణాలో మొత్తంగా 585 టీఎంసీల మేర లభ్యత జలాల్లో తెలంగాణకు 38 శాతం వాటా లెక్కన 216 టీఎంసీలు దక్కాయి. ఇందులో సాగర్ కింద ఖరీఫ్లో 104 టీఎంసీలతో 5.22 లక్షల ఎకరాలకు, రబీలో 35 టీఎంసీలతో 3.5 లక్షల ఎకరాలకు నీరందించారు. ఎస్ఎల్బీసీ కింద 2.22 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి గాను.. 13.5 టీఎంసీలతో 1.7 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. కానీ తర్వాత వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఒక్క ఎకరానికీ నీరందలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా వాడేయడం వల్లే! ఈసారి కృష్ణాబేసిన్లో ఆశించిన మేర నీరు వచ్చినా.. సాగర్ మాత్రం పూర్తి స్థాయిలో నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టు చేరిన జలాలను ఆంధ్రప్రదేశ్ ఇష్టారీతిన లాగేయడం, తెలంగాణ సైతం మహబూబ్నగర్ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయడమే దీనికి కారణం. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 515.4 అడుగుల మేర 141.02 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం (డెడ్ స్టోరేజ్) అయిన 510 అడుగులకు ఎగువన వినియోగించుకోగలిగిన నీటి నిల్వ గరిష్టంగా 10 టీఎంసీలు మాత్రమే. దీంతో రబీ కోసం పూర్తిగా శ్రీశైలంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను... ప్రస్తుతం 856 అడుగుల వరకు 95.59 టీఎంసీల నిల్వ ఉంది. ఇందులో కనీస మట్టమైన 834 అడుగులకుపైన లభ్యమయ్యేది 40 నుంచి 45 టీఎంసీలు మాత్రమే. అంటే సాగర్, శ్రీశైలం రెండు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం లభ్యత జలాలు 53.4 టీఎంసీలు మాత్రమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటినే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంది. గండి కొట్టిన ఏపీ, కృష్ణా బోర్డు వాస్తవానికి ఈ ఏడాది రబీలో నాగార్జున సాగర్ కింద 5.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 50 టీఎంసీలు కేటాయించాలని గత నవంబర్లోనే కోరింది. కానీ దీనికి ఏపీ అభ్యంతరం చెప్పడం, బోర్డు సైతం ఏపీకి వత్తాసు పలకడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఆయకట్టు లక్ష్యాన్ని 3.5 లక్షల (జోన్–1లో 2.3 లక్షలు, జోన్–2లో 1.2 లక్షల) ఎకరాలకు కుదించింది. అయినా ప్రస్తుత లభ్యత నీటితో ఈ ఆయకట్టుకు కూడా నీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 53.4 టీఎంసీల్లో... ఏపీకే 30 నుంచి 35 టీఎంసీల వరకు దక్కే అవకాశం ఉండగా, తెలంగాణకు 18 నుంచి 20 టీఎంసీలు అందవచ్చని అంచనా. ఈ నీటిలోనూ వచ్చే ఐదు నెలల పాటు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం నెలకు 2 టీఎంసీల చొప్పున 10 టీఎంసీలు అవసరం. మిగతా 8 టీఎంసీలతో రబీ కింద నిర్ణయించిన 3.5 లక్షల ఎకరాల సాగు సాధ్యమయ్యే అవకాశాల్లేవు. వీటిన్నింటికీ తోడు వేసవిలో 6 నుంచి 7 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి. అదే జరిగితే ఆయకట్టుకు చుక్క నీరూ అందే అవకాశం ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. -
రబీకి ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఆరు తడుల పంటలను ప్రోత్సహించండి సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచండి వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి నెల్లూరు రూరల్ : వర్షాభావ పరిస్థితుల్లో రబీ ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కె.ధనుంజయరెడ్డి ఆ శాఖ జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో గత రబీలో వర్షాలు ముంచెత్తగా ఈ రబీకి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాగు నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో వరి, కరువు ప్రాంతాల్లో అపరాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో నెల్లూరు జిల్లా కీలకమని, పంటల నిర్దేశించిన లక్ష్యం చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మండలంలో ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, విత్తన కొరత లేకుండా పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్డెంట్ పెట్టాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండి సాగు విస్తీర్ణం పెంచాలని, పొలంబడి, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా సూక్ష్మపోషకాల వాడకం, పురుగు మందులు తగ్గించడం, సరైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బయోప్రొడక్ట్ పేరుతో నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చాయని, రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్న నకిలీలపై దృష్టి సారించాలన్నారు. డీలర్ల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించాలని, నకిలీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లతో ఏఓకు కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటలను కాపుడుకునేందుకు రెయిన్గన్స్ ఉపయోగించాలన్నారు. రాష్ట్ర అపరాల స్పెషలిస్టు ఎన్డీఆర్కే శర్మ, జేడీఏ హేమమహేశ్వరారవు, ఆత్మ పీడీ దొరసాని, డీడీఏలు విజయభారతి, నాగజ్యోతి, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు. -
రైతులకు 21వేల కోట్ల రుణాలు
-
మొదలైన రబీ వరి నాట్లు
⇒ 12,500 ఎకరాల్లో నాట్లు... వ్యవసాయశాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్లో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో 13.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా... బుధవారం నాటికి 12,500 ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. రబీ సీజన్లో అన్ని రకాల పంటల సాగు 26.64 లక్షల ఎకరాలు కాగా...ఇప్పటివరకు 8.27 లక్షల ఎకరాల్లో (27%) సాగయ్యాయి. రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అక్టోబర్లో 30%, నవంబర్లో 96% వర్షపాతం కొరత ఉండటంతో వర్షాభావ పంటలపై ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు. -
రైతులకు 21వేల కోట్ల రుణాలు
- నాబార్డ్కు కేంద్రం అనుమతి - అరువుపై ఎరువులు అమ్మాలని కంపెనీలకు ఆదేశం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు ప్రకటించింది. రబీ సీజన్ నేపథ్యంలో రైతులు సులువుగా రుణం పొందేలా, నగదు లభ్యత కోసం సహకార సంఘాల ద్వారా రూ. 21 వేల కోట్లు రైతులకు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబారు)్డకు అనుమతినిచ్చింది. సహకార సంఘాల నుంచే 40 శాతంపైగా చిన్న రైతులు పంట రుణాలు పొందుతున్నారని, వారికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు. ఆన్లైన్ బుకింగ్పై రైల్వే ఇప్పటికే సర్వీసు చార్జీ రద్దు చేసిందని, డిసెంబర్ 31దాకా ఉచిత మొబైల్ బ్యాంక్ సేవలు వినియోగించుకునేందుకు టెలికం ఆపరేటర్లు అంగీకరించారన్నారు. అరువుపై ఎరువులు అమ్మండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు తగినంత నగదును అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ, బ్యాంకులకు సూచించామని, రబీ సీజన్లో పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని దాస్ పేర్కొన్నారు. నగదు లభ్యత, బ్యాంకు సేవలు లేని చోట్ల అరువుపై ఎరువులు అమ్మాలంటూ తయారీ కంపెనీలను కేంద్రం ఆదేశించిందన్నారు. రైతుల నుంచి చెక్కు, డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో సహకార సంఘాలు, డీలర్లు, ఇతర రిటైలర్లు కొనుగోళ్లు జరిపేందుకు కంపెనీలు సహకరించాలని కోరారు. ఎరువులకు క్రెడిట్, డెబిట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కుల ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ రిటైలర్లు, హోల్సేల్ వర్తకులు అనుమతించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్లకు కేంద్రం సూచించిందని శక్తికాంత దాస్ తెలిపారు. టోల్ వసూలుకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూలు) కేంద్రం కోరింది. కొత్తగా మార్కెట్లో విడుదల చేసే వాహనాలకు డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ(రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ ఏర్పాటు చేయాలని ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించామని శక్తికాంత్ చెప్పారు. దీనివల్ల టోల్ ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద నగదు రహిత చెల్లింపులకు వీలవుతుందని చెప్పారు. టోల్ ప్లాజాల గుండా వాహనాలు వెళ్లినప్పుడు దానంతట అదే ఆర్ఎఫ్ఐడీ కార్డు నుంచి టోల్ మొత్తం వసూలవుతుంది. ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు ‘తమ ఉద్యోగులకు ప్రీపెరుుడ్ కార్డులు ఇవ్వాలంటూ బ్యాంకులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కోరుతున్నారుు. ప్రైవేట్ రంగ కంపెనీలు ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు చేస్తారని భావిస్తున్నాం. కంపెనీల సీఎండీలతో భేటీలో అందుకు అంగీకరించారు’ అని దాస్ తెలిపారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి డిసెంబర్ 31 వరకు టెలికం ఆపరేటర్లు ఉచిత మొబైల్ సందేశాలు పంపుతున్నారన్నారు. అది మోదీ రక్తంలోనే లేదు: వెంకయ్య ఏదైనా నిర్ణయం వెనక్కి తీసుకోవడమనేది ప్రధాని మోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లను పోస్టాఫీసుల్లోని సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ చేయడానికి పాత నోట్లను అనుమతించబోమని ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. అరుుతే పోస్టాఫీసుల్లో మాత్రం సేవింగ్స డిపాజిట్లకు వెసులుబాటు కల్పించినట్లు మంత్రి చెప్పారు. డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ రద్దు డెబిట్ కార్డుల ద్వారా జరిగే అన్ని వ్యవహారాలపై డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీని కేంద్రం రద్దు చేసింది. ప్రభుత్వబ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, డెబిట్, క్రెడిట్ కార్డు సేవలు అందిస్తున్న సర్వీసు ప్రొవైడర్లు ఈ ఏడాది చివరి వరకూ సర్వీసు రుసుం వసూలు చేయవు. డెబిట్ కార్డుపై స్విచ్చింగ్ చార్జీల్ని ‘రూపే’ ఇప్పటికే రద్దు చేయగా...మాస్టర్ కార్డు, వీసా వంటి అంతర్జాతీయ సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయని దాస్ తెలిపారు. ‘డెబిట్ కార్డు వాడితే వసూలు చేసే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు, బ్యాంకు సర్వీస్ చార్జీలు, స్విచ్చింగ్ చార్జీలను పూర్తిగా ఎత్తివేశాం. డెబిట్ కార్డుల వినియోగంపై ఇక నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు’ అని వెల్లడించారు. కాగా, ఈ-వాలెట్ల ద్వారా నగదు చెల్లింపు పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. ఇక నుంచి రూ. 20 వేల వరకూ వాడుకోవచ్చు. డిజిటల్ నగదు చెల్లింపుల వాడకం ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఏం ఒరుగుతుంది ? డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీల రద్దుతో సామాన్యుడికి ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 53 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవన్నది అంచనా. దేశంలో 92 శాతం పల్లెలకు గ్రామీణ బ్యాంకుల సదుపాయమే లేదు. జన్ధన్ పథకంలోనే 25 కోట్ల డెబిట్ కార్డులిచ్చినా అందులో అధికశాతం వినియోగంలో లేవు. దేశం మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉంటే అందులో 10 శాతం కూడా గ్రామీణ ప్రాంతాల్లో లేవు. గ్రామాల్లో 75 శాతం పైగా వ్యవహారాలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ ఎత్తివేత ఎంతమందికి ఉపయోగమో ఆలోచించాలంటున్నారు. విద్యార్థి ఆత్మహత్య బండా(యూపీ): కాలేజీ ఫీజుకు కావాల్సిన నగదు డ్రా చేసేందుకు రోజుల తరబడి బ్యాంకు క్యూలో నిల్చొని నగదు దొరక్క 18 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని మవాయ్ బుజుర్గ్లో మంగళవారం జరిగింది. సురేశ్ బ్యాంకు క్యూలో నిల్చున్నా డబ్బు దొరక్కపోవడంతో ఇంటికొచ్చి తల్లి చీరతో ఉరేసుకున్నాడు. తిండ్వారీ పోలీసు స్టేషన్ పరిధిలో చికిత్స కోసం డబ్బు దొరక్కపోవడంతో బ్యాంకు ఆవరణలోనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. -
పాత నోట్లపై మళ్లీ మెలిక
► కేంద్రం ప్రకటించినా..పాత నోట్లు తీసుకోని విత్తన పంపిణీ కేంద్రాలు ►జీవో రాలేదని రైతులను తిప్పి పంపిన అధికారులు ►జరుగుమల్లి విత్తన కేంద్రం వద్ద ఆందోళన ►పట్టించుకోని జిల్లా అధికారులు ఒంగోలు టూటౌన్ : పాత నోట్లతో అటు పాలకులు.. ఇటు అధికారులు రైతులను అగచాట్లు పాలు చేస్తూనే ఉన్నారు. రబీ సీజన్లో అష్టకష్టాలు పడుతూనే సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు పాత నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నారుు. ఒక సారి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తా రు.. మరోసారి తీసుకోమని ఉత్తర్వులు ఇస్తారు. ఇలా అన్నదాతలను పాలకులు అడుకుంటున్నారు. ఇటీవల పాత నోట్లు తీసుకోవద్దని ఇచ్చిన ఆదేశాలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం దిగొచ్చింది. వెంటనే సోమవారం రైతుల వద్ద పాత నోట్లు రూ.500, రూ.1000 తీసుకోవాలని ప్రకటిం చింది. దీంతో ఊరట చెందిన రైతులు మంగళవారం విత్తన కేంద్రాల వద్దకు పాత నోట్లు తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు పాత నోట్లు తీసుకోకపోగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వలు గాని జీవోగాని రాలేదు. మేము తీసుకోమని ఖరాఖండిగా చెప్పడంతో రైతులు ఖంగు తిన్నారు. మండల కేంద్రాల్లో విత్తన కేంద్రాల వద్ద పాత నోట్లు తీసుకోకపోవడంతో ఒంగోలులోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి కొంతమంది రైతులు వచ్చారు. జిల్లా ఏపీ సీడ్స మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. పాత నోట్లు తీసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రైతులకు చెప్పడంతో చేసేదేం లేక వెనుదిరగాల్సి వచ్చిందని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుమల్లిలో.. జరుగుమల్లి మండలంలోని విత్తన కేంద్రం వద్ద పాత నోట్లతో నిరసనకు దిగారు. ప్రభుత్వ పాత నోట్లు తీసుకోమని ప్రకటించినా.. అధికారులు కనికరించడం లేదని ఆందోళన చేశారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వలేదన్న సామెతగా పాలకుల తీరు ఉందని ఆవేదన చెందారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించ లేదని రైతు సంఘ నేతలు తెలిపారు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల వద్ద పాత నోట్లు తీసుకోవాలని ప్రకటిస్తే.. అధికారులు ఉత్తర్వులు రాలేదని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అరుుతే విత్తనాలు లేకుం డా సేద్యం ఎలా చేయాలని రైతులు మండిపడుతున్నా రు. బుధవారం కూడా ఇదే పరిస్థితి రైతులకు ఎదురైతే జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు నిరసనకు దిగే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారించాలని రైతు సంఘాలు కోరుతున్నారుు. -
పాత నోట్లతో అన్నదాతల్లో అయోమయం
► రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దంటూ మళ్లీ ఆదేశాలు ► పాలకుల నిర్ణయాలపై రైతన్నల ఆగ్రహం ఒంగోలు టూటౌన్ : అన్నదాతకు పాత నోట్ల ఇక్కట్లు తప్పేలా లేవు. విత్తన కొనుగోలులో పాత నోట్లు తీసుకోవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం రాత్రే ఈ ఆదేశాలు వ్యవసాయశాఖకు అందారుు. ప్రస్తుతం రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేస్తోంది. శనగలతో పాటు ఇతర విత్తనాలు రాయితీపై ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల ర ద్దు నేపథ్యంలో వాటిని విత్తన సరఫరా కేంద్రాల వద్ద రైతుల నుంచి తీసుకోవడం లేదు. పది రోజులు దాటినా కొత్త నోట్లు, పాతనోట్ల కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలతో నానాకష్టాలు పడుతున్నారు. అసలే రబీ సీజన్ రబీ సీజన్ కావడంతో పురుగుమందులు, ఎరువులు, విత్తన కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత పెద్ద నోట్లు తీసుకునేది లేదని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా పాతనోట్లతో నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు పాతనోట్లను తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే ప్రకటనను వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ కూడా పత్రికలకు విడుదల చేశారు. మళ్లీ అంతలోనే పాత నోట్లు తీసుకోవద్దంటూ శుక్రవారం రాత్రే ఉత్తర్వులు వచ్చాయని జేడీ తెలిపారు. అటు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా మనీ కోసం పడిగాపులు కాస్తున్న వారితో పాటు అక్షర జ్ఞానం లేని ఎంతో మంది రైతులు ఉన్న పాత నోట్లు మార్చుకునే విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో పాతనోట్లు ఎప్పుడు మార్చుకోవాలి? విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేదెట్ల?.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కొత్త నోట్లు వచ్చినా.. చిల్లర సమస్యతో సతమతమవ్వాల్సి రావడం ఖాయం. కొత్త రూ.2 వేల నోట్లకు చిల్లర దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్ణయాలపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. -
కరువు కోరల్లో రబీ
– దెబ్బ మీద దెబ్బ... – 11 వేల హెక్టార్లకు పరిమితమైన పంటలు – 9 వేల హెక్టార్లతో ఆగిపోయిన పప్పుశనగ – వందేళ్ల 'అనంత' చరిత్రలో ఇదే తొలిసారి ఖరీఫ్ పంటలను అత్యంత దారుణంగా దెబ్బతీసిన వరుణుడు రబీని కూడా వదలలేదు. మరింత కసిగా కరువు కోరల్లోకి నెట్టేశాడు. అది కూడా అనంతపురం జిల్లా వందేళ్ల చరిత్రలో ఎపుడూ లేనంతగా శాసించాడు. ఫలితంగా ఖరీఫ్ కష్టాల నుంచి ఇంకా తేరుకోని రైతులకు రబీ ఆశలు కూడా గల్లంతయ్యాయి. దెబ్బ మీద దెబ్బ పడటంతో రైతులు కోలుకోవడం కష్టంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో అన్ని పంటలూ కలిపి 1,30,965 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సి ఉండగా ప్రస్తుతానికి 11 వేల హెక్టార్లకు పరిమితమైపోయింది. అందులో ప్రధానపంట పప్పుశెనగ 77,564 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేయగా 9 వేల హెక్టార్లకు పరిమితమైంది. పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెల సరైన సమయం కాగా నవంబర్ 15 వరకు వేసుకున్నా ఫరవాలేదని శాస్త్రవేత్తలు, అధికారులు భరోసా ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేయాల్సి ఉండగా ఐదారు మండలాల్లో మాత్రమే అరకొర తేమలో పంట వేశారు. వేసిన ప్రాంతాల్లో పంట దిగుబడులు రావడం కష్టమంటున్నారు. అక్టోబర్, నవంబర్లో కూడా వర్షం జాడ కనిపించకపోవడంతో రబీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగు అనుకూలమని చెబుతున్నారు. 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని అంచనా వేయగా.. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అది కూడా అరకొరగా సాగయ్యే పరిస్థితి నెలకొంది. ఇక 10 వేల హెక్టార్ల అంచనాతో ఉన్న వరి సాగు మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతానికి జొన్న 1100 హెక్టార్లలో వేశారు. మొక్కజొన్న, ఉలవ, పొద్దు తిరుగుడు, రాగి, కుసుమ, పత్తి తదితర పంటలు కూడా వందలోపు హెక్టార్లకే పరిమితమయ్యాయి. దెబ్బతీసిన వర్షాలు అక్టోబర్లో 110.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా నెలంతా కలిపి కేవలం 7.1 మి.మీ నమోదైంది. అంటే ఏకంగా 94 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో రబీ ముందుకు సాగలేదు. నవంబర్లో కూడా 34.7 మి.మీ సగటు నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 1 మి.మీ మాత్రమే నమోదైంది. జూన్, జూలై మినహా ఆగస్టు నుంచి నవంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు 462.8 మి.మీ గానూ 265.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తం మీద 43 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గతంలో ఎపుడూ ఇంత దయనీయమైన పరిస్థితిని చూడలేదని అధికారులు, రైతులు చెబుతున్నారు. పాలకులు చిన్నచూపు ప్రకృతి కరుణించినా పాలకులు సహకరించకపోవడంతో ఈ ఏడాది 'అనంత' వ్యవసాయం పెనుసంక్షోభంలో కూరుకుపోయింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట సర్వనాశనం కావడంతో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో సాగైన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతినడంతో రూ.వేలాది కోట్లు మట్టిలో కలిసిపోయాయి. ఇక గతేడాది ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నయాపైసా విడుదల కాకపోవడం, రూ.105 కోట్ల ప్రీమియం చెల్లించినా కేవలం 24 మండలాల రైతులకు నామమాత్రంగా రూ.109 కోట్లు వాతావరణ బీమా పరిహారం మంజూరు కావడంతో రైతు ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో 29 వేల హెక్టార్లలో మల్బరీ, 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలు కూడా చాలా వరకు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. రక్షకతడుల పేరిట హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 'అనంత'మైన కష్టాలకు ఇపుడు భరోసా కల్పించే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల దుస్థితి దయనీయంగా మారింది. -
రైతుకు దూరంగా ‘వ్యవసాయ బీమా’
రాష్ట్రంలో మొదటిసారిరైతు పంటల బీమాపై ఏఐసీ విముఖత రబీలో రెండు ప్రైవేటు కంపెనీలకు 10 పంటల బీమా అప్పగింత ఖరీఫ్లో 6.55 లక్షల మంది రైతుల ప్రీమియం.. ఇందులో ఏఐసీ వాటానే అధికం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యూబీసీఐఎస్)లను రబీ సీజన్లో అమలు చేసే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) వైదొలగింది. రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్వహించిన బిడ్లలో కేవలం మూడు ప్రైవేటు కంపెనీలే పాల్గొన్నాయి. ఏఐసీ పాల్గొనలేదు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్బీవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలకు దారులు తెరిచింది. ఖరీఫ్లో పీఎంఎఫ్బీవై పథకాన్ని ఏఐసీ సహా బజాజ్ అలియంజ్ జీఏసీ లిమిటెడ్ అమలు చేశాయి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్లు అమలు చేశాయి. పీఎంఎఫ్బీవై పథకం అమలు కోసం రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అన్ని కంపెనీలు కలసి ఈ ఏడాది ఖరీఫ్లో 6.55 లక్షల మంది రైతుల నుంచి రూ.85 కోట్లు ప్రీమియం వసూలు చేశాయి. అందులో ఏఐసీ వాటానే అధికంగా ఉండటం గమనార్హం. ఏళ్లుగా ఏఐసీ ఒక్కటే రైతు పంటల బీమాను అమలు చేస్తోంది. కానీ, ఈ రబీలో వైదొలగడంపై మాత్రం వ్యవసాయశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బీమా కంపెనీ పోటీ నుంచి లేకపోతే ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. రబీలో 2 కంపెనీలకు... పది పంటలు ఈ రబీలో బజాజ్ అలియంజ్, చోల ఎంఎస్ బీమా ప్రైవేటు కంపెనీలకు 10 పంటలకు బీమా అప్పగిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు పీఎంఎఫ్బీవై పథకం కింద బీమా వర్తింపచేస్తారు. డబ్ల్యూబీసీఐఎస్ పథకంలో మామిడికి అవకాశం కల్పించారు. మొక్కజొన్న, శనగ పంటలకు డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి రైతులకు గడువు ఖరారు చేశారు. మిగిలిన పంటలన్నింటికీ ఆ నెలాఖరు వరకు గడవు ఇచ్చారు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులకు, తీసుకోనివారికీ ఇవే గడువులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. మామిడికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. మిగిలిన పంటలన్నింటికీ ఆయా జిల్లాల్లో ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. రాష్ట్రంలోని జిల్లాలను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్ను ఒక్కో బీమా కంపెనీకి అప్పగిస్తారు. -
మూగ రోదన
– కరుణ చూపని వరుణుడు – పిడికెడు మేత కోసం కాపరుల పాట్లు లేపాక్షి : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా వరుణుడు కరుణ చూపకపోవడంతో జిల్లాలో వర్షాలు పడక గడ్డిపోచ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిడికెడు మేత కోసం కాపరులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలు పండుతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు వివిధ రకాల పంటలను పెట్టుకున్నారు. దుక్కిలు చేసుకోవడానికి, విత్తనాలు విత్తుకోడానికి, కలుపులు తీసే సమయానికి సకాలంలో వర్షాలు అనుకూలించాయి. అయితే విత్తన ఉత్పత్తి దశలో పూర్తిగా వర్షాలు రాకపోవడంతో పంటలు చేతికి అందకుండా పోయాయి. కనీసం పశుగ్రాసం కూడా దొరక్కపోవడంతో పశువులు, గొర్రెలు, మేకల కాపరులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చాలామంది పాడి ఆవులు, వ్యవసాయం చేసే పశువులను సంతల్లో చౌక బేరానికే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం కొరత అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుని కాపరులు, రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విత్తుకు విత్తమేది?
► రైతన్నకు నయా పైసా అందని రబీ రుణం ► కాలం కలిసొచ్చినా కరుణించని బ్యాంకులు ► రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది శూన్యం ► ప్రభుత్వం ముందు సై.. రైతుల ముందు నై ► పుష్కలంగా నీళ్లున్నా సొమ్ము లేక అన్నదాత విలవిల ► పెట్టుబడుల కోసం అప్పులు.. తప్పని ‘ప్రైవేటు’ తిప్పలు ► బ్యాంకులపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలం సాక్షి, హైదరాబాద్: కాలం కలిసొచ్చింది.. వర్షాలు దండిగా కురిశాయి.. చెరువులు, బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గింజ వేస్తే చాలు చేలన్నీ పైర్లతో కళకళలాడుతాయి... కానీ రైతన్న చేతిలో చిల్లిగవ్వ లేదు.. విత్తుకు విత్తం(సొమ్ము) లేదు.. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. రబీ సీజన్ మొదలై నెల కావస్తున్నా పంట రుణం కింద నయా పైసా ఇవ్వలేదు. రైతులు గత్యంతరం లేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మళ్లీ చేయి చాచాల్సి వస్తోంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ. 29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్ లక్ష్యంలో బ్యాంకులు కేవలం రూ. 11,546 కోట్లే ఇచ్చాయి. రబీలో రైతులకు విరివిగా రుణాలిస్తామని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకర్లు హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నందున మాఫీకి సంబంధించిన సొమ్ముపై రైతులను బలవంతం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఆర్థిక మంత్రి ఈటల బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. అయినా బ్యాంక్లు తమ వైఖరి మార్చుకోలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రబీ సీజన్ మొదలైనా ఇప్పటివరకు రైతులకు ఒక్కపైసా పంట రుణాలు ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. మాఫీ బూచీ చూపి.. రుణమాఫీ సొమ్ము పూర్తిగా చెల్లించకపోవడం వల్లే పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామంటూ బ్యాంకులు చేస్తున్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. వడ్డీ సహా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చినా బ్యాంకర్లు దాన్నే బూచీగా చూపడం సరికాదని కాదని మంత్రి పోచారం అన్నారు. మూడో విడత రుణమాఫీలో సగమే (రూ.2,020 కోట్లు) విడుదల చేశారని.. మిగతా రూ.2,020 కోట్ల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన సగంతో పాటు వచ్చే ఏడాది చెల్లించాల్సిన బకాయిలను కూడా ముందుగానే చెల్లిస్తామని బ్యాంకర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సాగు లక్ష్యం 30 లక్షల ఎకరాలు.. ఈ సెప్టెంబర్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ నెలలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా... 361.5 మి.మీ. కురిసింది. ఏకంగా 180 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలో 30 వేల చెరువులు నిండాయి. నాగార్జునసాగర్ మినహా గోదావరి, కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో భూగర్భ జలాలు 11.74 మీటర్ల లోతులో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్లో 8.98 మీటర ్లలోనే అందుబాటులో ఉన్నాయి. అంటే 2.76 మీటర్లు పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రబీలో 31 లక్షల ఎకరాలకు పక్కాగా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద మరో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించింది. వాస్తవంగా రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి 17.33 లక్షల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 3.70 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. అలాగే ఈ సీజన్లో 42.85 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించాలని లక్ష్యంగా ప్రకటించారు. అందులో ధాన్యం ఒక్కటే 31.4 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక పప్పుధాన్యాలు 1.73 లక్షల టన్నులు పండించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు వరకు మొత్తంగా అన్ని రకాల పంటలు కలిపి 2.27 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. రబీ లక్ష్యాల మేరకు ఏర్పాట్లు చేయడంలో బ్యాంకులు, వ్యవసాయశాఖ విఫలమయ్యాయి. వ్యవసాయశాఖ ఇప్పటికీ శనగ విత్తనాలను కూడా అందించలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత జిల్లాల వారీగా 2016–17 రబీ రుణాల లక్ష్యం (రూ.కోట్లలో..) జిల్లా లక్ష్యం ఆదిలాబాద్ 1,174.99 కరీంనగర్ 1,724.24 వరంగల్ 1,286.55 ఖమ్మం 1,100.93 నల్లగొండ 1,289.86 మహబూబ్నగర్ 1,874.41 రంగారెడ్డి 836.69 మెదక్ 1,123.64 నిజామాబాద్ 1,229.24 –––––––––––––––– మొత్తం 11,640.55 –––––––––––––––– -
ముందుకు "సాగే"నా..!
– గత 30 ఏళ్లలో తొలిసారిగా పడిపోయిన విస్తీర్ణం – కయాంక్ తుఫాను ఆశలు పెట్టుకున్న అనంత రైతులు అనంతపురం అగ్రికల్చర్ : ప్రకతి కన్నెర చేయడం, పాలకుల చిన్నచూపు కారణంగా ఖరీఫ్ పంట సంక్షోభంలో కూరుకుపోగా... రబీ కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే గత 30 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా రబీ వ్యవసాయం పూర్తీగా పడకేసింది. నైరుతీ దారుణంగా దెబ్బకొట్టగా కనీసం ఈశాన్యమైనా కొంతలో కొంత గట్టెక్కిస్తుందనే ఆశతో రంగంలోకి దిగిన రైతులను రబీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ పాటికి కనీసం లక్ష హెక్టార్లలో పప్పుశెనగ, ఇతర పంటలు సాగులోకి రావాల్సివుండగా కేవలం 5 వేల హెక్టార్లలోపే పరిమితం కావడం విశేషం. అది కూడా ఈనెల 11న కురిసిన తేలికపాటి వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, ఉరవకొండ డివిజన్లలో అరకొర తేమలోనే పంటలు వేయడంతో చాలా వరకు మొలకెత్తకపోవడం గమనార్హం. పప్పుశెనగ సాగుకు ఇక గరిష్టంగా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటి వారం తర్వాత పప్పుశెనగ వేసుకున్నా ఫలితం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దెబ్బతీసిన వర్షాలు: పగలు ఎండలు, రాత్రి చలితో కూడిన విచిత్ర వాతావరణం నెలకొని ఉండటంతో మామూలుగా వర్షం పడే సూచనలు లేవంటున్నారు. రబీ సీజన్లో సాధారణ వర్షపాతం 155 మి.మీ కాగా అందులో అక్టోబర్ వర్షాలే కీలకం. అక్టోబర్లోనే 110.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నవంబర్లో 38 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ మాత్రమే సాధారణ వర్షపాతం. అక్టోబర్ నెల చివరి వారంలో అడుగిడినా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది. కయాంక్ తుఫానుపై ఆశలు దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంగా జిల్లా రైతులు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంక్ తుఫానుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈనెల 28 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు కయాంక్ తుఫాను ప్రభావం చూపనుందని చెబుతుండటంతో జిల్లాలో కనీస వర్షపాతం నమోదైనా రబీలో కొంత కదలిక వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. లేదంటే పప్పుశెనగ సాగు ప్రశ్నార్థకమవుతుండగా నీటి వసతి కింద వేయనున్న వరి, వేరుశనగ, మొక్కజొన్న లాంటి పంటలు, వర్షాధారంగా వేయనున్న జొన్న, ఉలవ, పొద్దుతిరుగుడు లాంటి పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఏడాది ఖరీఫ్, రబీ జిల్లా రైతులకు భారీ నష్టాలు మిగిలిస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రబీ విస్తీర్ణం దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. -
నేల రాలని చినుకు..
– ముదిరిన ఎండలు, పెరిగిన చలి, పత్తాలేని వరుణుడు – పప్పుశనగ, ఇతర రబీ పంటలు సాగు ప్రశ్నార్థకం – క్షీణిస్తున్న భూగర్భజలాలు, పట్టు, పండ్లతోటలకూ నష్టం నైరుతీ నైరాశ్యం మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా జిల్లా రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీవిని ఎరుగని రీతిలో ఆగస్టులో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు 7.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలను అతలాకుతలం చేయగా... ఇపుడు అక్టోబర్లో నెలకొన్న అనావష్టి 1.50 లక్షల హెక్టార్ల రబీ ఆశలను తుంచేసే పరిస్థితి నెలకొంది. వాన చినుకు కరువైపోవడంతో ‘అనంత’ వ్యవసాయం పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెట్ట వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న లక్షలాది ‘అనంత’ రైతుల బతుకులు దుర్భరంగా మారాయి. ప్రశ్నార్థకంగా పప్పుశనగ ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రబీ ప్రధాన పంట పప్పుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్ మాదిరిగానే అక్టోబర్లో కూడా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో వరుణుడి జాడ కరువైపోంది. ఎక్కడా పంట సాగుకు అనువుగా వర్షం పడలేదు. ఈ నెలలో 110.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ నమోదైంది. నల్లరేగడి భూములు కలిగిన 35 మండలాల్లో 80 నుంచి 90 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పప్పుశనగ సాగు చేయాల్సివుంది. అందులోనూ 10 మండలాల్లో 8 నుంచి 10 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంట వేస్తున్నారు. అయితే ఈ నెల 11న కురిసిన వర్షానికి అరకొర తేమలోనే అక్కడక్కడ 6 నుంచి 8 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేయడం విశేషం. పప్పుశనగ సాగుకు సరైన సమయం అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే. అయితే ప్రస్తుత పరిస్థితులను దష్టిలో ఉంచుకుని నవంబర్ 15వ తేదీ వరకు వేసుకున్నా ఫరవాలేదంటూ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. వర్ష సూచనలేవీ? నవంబర్ 15వ తేదీ వరకు పప్పుశనగ విత్తుకోవచ్చు అంటున్నా... ఇపుడు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వర్షం వచ్చే సూచనలు లేవంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డి్రగ్రీలు పెరగడంతో ఎండలు ముదిరాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతులు కూడా సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో శీతల వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మామూలుగా వర్షం పడటం కష్టమని చెబుతున్నారు. అల్పపీడనాలు, తుఫాన్లు సంభవిస్తే తప్ప వర్షం కురవడం కష్టమంటున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన ఆగస్టు, సెప్టెంబర్లోనే వరుణుడు మొహం చాటేయడంతో వర్షం వస్తుందనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లింది. ఆగస్టులో 88.7 మి.మీ గానూ ఏకంగా 80 శాతం తక్కువగా కేవలం 18.1 మి.మీ, అలాగే సెప్టెంబర్లో 118.4 మి.మీ గానూ 65 శాతం తక్కువగా కేవలం 41.9 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ కకావికలమైంది. అందులోనూ 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట నిలువునా ఎండిపోవడంతో అంతులేని నష్టం వాటిల్లింది. ఇతర రబీ పంటలు కూడా వర్షం జాడ లేకపోవడంతో పప్పుశనగతో పాటు నీటి వసతి కింద సాగు చేసే వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర ఇతర రబీ పంటల సాగు కూడా కష్టంగా మారింది. వచ్చే ఖరీఫ్లో విత్తన కొరత ఏర్పడకుండా ఉండాలంటే రబీలో పండే వేరుశనగే కీలకం. వర్షాలు లేక భూగర్భజలాలు రోజురోజుకూ క్షీణించిపోతుండటంతో బోరుబావులు కూడా కట్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 వేల బోర్లలో నీళ్లు రావడం లేదని అధికారిక నివేదికలు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగగర్భజలమట్టం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వర్షం రాకుంటే నీళ్లు రాని బోర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రబీ పంటలతో పాటు వచ్చే వేసవిలో 28 వేల ఎకరాల్లో ఉన్న పట్టు, 1.70 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచివుండటంతో రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. -
ఇంకెప్పుడిస్తారో?
– స్ప్రేయర్లు లేవు, టార్పాలిన్లు ఇవ్వలేదు – రూ.1.25 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయని వైనం – రబీ వచ్చినా అందకపోవడంతో ఇబ్బందులు అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ప్రారంభమైనా రైతులకు స్ప్రేయర్లు లేవు.. టార్పాలిన్లు ఇవ్వలేదు. యాంత్రీకరణ పథకం కింద రూ.20 కోట్ల బడ్జెట్తో మినీట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రోపకరణాలు ఇస్తున్నామని అధికారులు గొప్పగా చెబుతున్నా అత్యవసరమైన వివిధ రకాల స్ప్రేయర్లు, చిన్నపాటి టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. రైతుకు పెద్ద పీట వేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం అమలులో మాత్రం విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా పాలకుల దారిలో నడుస్తూ సకాలంలో పథకాలు సక్రమంగా అమలు చేయలేక చతికిల పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 8 నుంచి 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వర్షాధారంగా ఖరీఫ్ పంటలు వేస్తారు. మెట్ట వ్యవసాయానికి చిరునామాగా ఉన్న ‘అనంత’ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏటా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్ప్రేయర్లు అత్యవసరం : ట్రాక్టర్లు ఇతరత్రా పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నా లేకున్నా జిల్లాలో పంట కాలంలో రైతు ఇంట స్ప్రేయర్లు, పంట తొలగింపు, నూర్పిడి సమయంలో టార్పాలిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది, పెసర లాంటి పంటలకు తరచూ పురుగు మందులు పిచికారీ చేస్తే కానీ పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి. తెగుళ్లు అధికం : ‘అనంత’లో వాతావరణానికి చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువే. ఈ క్రమంలో రైతు ఇంట ఏదీ లేకున్నా ఫరవాలేదు కానీ స్ప్రేయర్లు మాత్రం ఉంటాయి. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా స్ప్రేయరు, టార్పాలిన్ మంజూరు చేయలేదు. రెండు పథకాల కింద అక్షరాలా రూ.1.25 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా అందులో పైసా కూడా వెచ్చించలేదు. 7.65 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ ఇప్పటికే ముగిసింది. ఇపుడు రబీలో అడుగుపెట్టారు. ఇప్పటికీ కూడా వాటిని రైతులకు పంపిణీ చేస్తామనే ఆలోచన చేయకపోవడం గమనార్హం. అధికారులు ఏమంటున్నారంటే.. : స్ప్రేయర్లకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీలు తమకు అందలేదంటూ చేతులెత్తేస్తున్నారు. టార్పాలిన్లకు సంబంధించి గతేడాది బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఆలస్యమవుతోందని చెబుతున్నారు. వాటి కోసం వేలాది మంది రైతులు కళ్లకు కాయలు కట్టేలా ఎదురుచూస్తూ విసిగిపోతున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు. -
రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) ఎల్.జయశంకర్ వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. కాగా.. సెప్టెంబర్ 30తో ముగిసిన 2016 ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు తెలిపారు. 5.95 లక్షల మంది రైతులకు రూ.4,434 కోట్ల పంట రుణాలు, 82 వేల మందికి రూ.550 కోట్ల బంగారు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాల పంపిణీ కొనసాగుతోందన్నారు. -
రబీలోనూ..అదే గోడు
– మొహం చాటేసిన వరుణుడు – మేఘాలు ఊరిస్తున్నా.. నేల రాని చినుకు – పంటల సాగుకు ఆటంకం ఖరీఫ్ను కల్లోలం చేసిన వరుణుడు రబీని కూడా వెంటాడుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రధాన పంట పప్పుశనగ సాగుకు ఈ నెలంతా మంచి అనుకూలం. అయితే.. ఇప్పటి వరకు వాన చినుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన సమయంలో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. గత పది రోజులుగా ఇదే పరిస్థితి. అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో ప్రధానంగా నల్లరేగడి భూములు కల్గిన మండలాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. 80 వేల నుంచి 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే..వర్షాభావం వల్ల ఇప్పటివరకు ఎక్కడా పంట విత్తుకోలేదు. అలాగే వేరుశనగ 20 వేల హెక్టార్లు, వరి పది వేల హెక్టార్లు, జొన్న, మొక్కజొన్న, ఉలవ తదితర‡ పంటలు మరో 30 వేల హెక్టార్లలో వేయనున్నారు. మొత్తమ్మీద రబీలో అన్ని పంటలు కలిపి 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సివుంది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చేవి. ఈ సారి ఇప్పటికీ నల్లరేగళ్లు కలిగిన దాదాపు 30 మండలాల్లో పదును వర్షం కాదు కదా.. కనీసం తుంపర్లు కురవలేదు. అక్టోబర్లో సాధారణ వర్షపాతం 110.7 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. ఇప్పటివరకు కేవలం 2.3 మి.మీ నమోదైంది. అంటే వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్లో కురిసే వర్షాలే రబీ పంటలకు ప్రాణం. తర్వాత నవంబర్లో 35 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు రబీ సాగుకు కీలకమైన అక్టోబర్లో వర్షాలకు బదులు ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో 32 నుంచి 34 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు.. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, రాయదుర్గం, పెనుకొండ వ్యవసాయ డివిజన్ల పరిధిలో నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పప్పుశనగ, నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు వేస్తారు. వర్షం పడకపోవడంతో పంటల సాగులో ఇప్పటికీ కదలిక లేదు. భారీ వర్షాలు లేదా జడివాన పడితే కానీ నల్లరేగడి భూముల్లో విత్తుకు సరిపడా పదును అయ్యే పరిస్థితి లేదు. వర్షం లేక ఖరీఫ్లో వేసిన కంది, ఆముదం, పత్తి లాంటి పంటలకు కూడా ఇబ్బంది తలెత్తుతోంది. -
రబీకి సన్నద్ధం
88 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు సీజన్ ప్రారంభం కాగానే పంపిణీ త్వరలో రూ.197.97కోట్ల ఇన్పుట్ సబ్సిడీ భారీ వర్షాలకు 41,826 హెక్టార్లలో పంట నష్టం జేడీఏ మాధవి శ్రీలత నారాయణఖేడ్: రబీ సీజన్కు శాఖాపరంగా సన్నద్ధమైనట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంచాలకులు మాధవి శ్రీలత తెలిపారు. గురువారం ఆమె నారాయణఖేడ్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 88 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని, అవి త్వరలో రానున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల క్వింటాళ్ల శనగ, 8 వేల క్వింటాళ్ల మొక్కజొన్న, 25 వేల క్వింటాళ్ల మినుము, 1,100 క్వింటాళ్ల జొన్న, 2 వేల క్వింటాళ్ల పెసర, 25 వేల క్వింటాళ్ల వరి, 2 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ప్రతిపాదించినట్టు తెలిపారు. 30 శాతం సబ్సిడీపై విత్తనాలు ఈ విత్తనాలను 30శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తామని జేడీ తెలిపారు. రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. 1.39 లక్షల హెక్టార్ల మేర సాగు కావాల్సి ఉంగా మరో 40 వేల హెక్టార్లు అదనంగా సాగయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. రబీ సీజన్ ప్రారంభం కాగానే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుతామని, ప్రస్తుతం భూమిలో తేమ తగ్గాల్సి ఉందన్నారు. ఖరీఫ్లో పంటలకు దెబ్బ భారీ వర్షాల కారణంగా జిల్లాలో వివిధ రకాల పంటలు 41,826 హెక్టార్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జేడీ తెలిపారు. వరి 4,902 హెక్టార్లు, మొక్కజొన్న 1,539, జొన్న 377, పత్తి 16,827, చెరకు 251, కంది 2,587, పెసర 12, మినుము 742, సోయా 14,588 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు ఆమె పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా సోయా పంటకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. వరి పొలాల్లో ఇసుక మేటలతో దెబ్బతిందని, మొక్కజొన్న కంకులు కోశాక తడిసి మొలకలు వచ్చాయన్నారు. కందికి ఎక్కువగా నష్టం జరగలేదన్నారు. పంటనష్టాలపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నామని, నివేదిక రాగానే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. చిన్నశంకరంపేటలో అత్యధిక వర్షం జిల్లాలో అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో వర్షపాతం నమోదైందని జేడీ తెలిపారు. మండలంలో 779 మి.మీ సాధారణం కాగా 1,362 మి.మీ. కురిసిందన్నారు. జిల్లాలోని రైతులకు త్వరలో ఇన్పుట్ సబ్సిడీ రానుందన్నారు. రూ.197.97 కోట్లు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం సెప్టెంబర్లో నమోదైందని, ఆగస్టులో లోటు ఉందన్నారు. విలేకరుల సమావేశంలో అగ్రోస్ ఆర్ఎం వెంకన్న పాల్గొన్నారు. -
ఇప్పుడే అనుకూలం
→ సమగ్ర యాజమాన్య పద్ధతులపై దష్టి సారించాలి → డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్ అనంతపురం అగ్రికల్చర్ : రబీలో ప్రధాన lపంటగా పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెలంతా అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లు, నల్లరేగడి భూములున్న ఇతర ప్రాంతాల్లో కూడా పంట వేసుకోవచ్చన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. పప్పుశనగ సాగు గురించి : జిల్లాలో ఉన్న నల్లరేగడి నేలలు తక్కువ లోతు, నీటిని నిలుపుకునే శక్తి తక్కువగా ఉన్నాయి. మంచి పదునులో విత్తుకోవాలి. ఒక వేళ బెట్ట పరిస్థితులు ఏర్పడితే 30 నుంచి 35 రోజుల సమయంలోనూ, 55 నుంచి 60 రోజుల సమయంలో అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకుంటే పంట దిగుబడులకు ఢోకా ఉండదు. స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకోవాలి. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేస్తే చివరి దశలో బెట్ట ఏర్పడటం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. జేజీ–11, నంద్యాల శనగ–1, ఎన్బీఈజీ–47, 49 విత్తన రకాలు అనువైనవి. చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. యాజమాన్యం : ఎకరాకు గింజలు మధ్యస్థంగా ఉంటే 30 నుంచి 35 కిలోలు, లావుగా ఉంటే 45 నుంచి 50 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 1.5 గ్రాములు టిబుకొనజోల్తో తప్పనిసరిగా విత్తనశుద్ధి పాటించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 18 కిలోలు యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్పాస్ఫేట్ వేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. -
నేటి నుంచి రబీ సేద్యం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం నుంచి రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై రబీ ఆధారపడి ఉంది. ఖరీఫ్ దెబ్బతీయడంతో ‘అనంత’ రైతులు రబీపై ఆశలు పెట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ పరిగణలోకి తీసుకోగా ఈ మూడు నెలల కాలంలో 155.5 మి.మీ వర్షం పడాల్సి ఉంది. అందులో అక్టోబర్లోనే 110.7 మి.మీ, నవంబర్లో 34.7 మి.మీ, డిసెంబర్లో 9.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఒక్కోసారి నవంబర్లో సంభవించే తుఫాన్ల వల్ల అధిక వర్షం పడిన దాఖలాలు ఉన్నాయి. ఖరీఫ్లో సాగు చేసిన కంది, ఆముదం, పత్తి వంటి పంటలకు కూడా రబీలో కురిసే వర్షాలే ప్రధానం. మొత్తమ్మీద ఈ రబీలో 1,45,704 హెక్టార్లలో పంటలు సాగులోకి రానున్నాయని అధికారులు అంచనా వేశారు. అందులో వర్షాధారంగా 94,710 హెక్టార్లు, నీటి వసతి కింద 50,994 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. రబీ ప్రధానపంటగా పప్పుశనగ 77,567 హెక్టార్లలో సాగులోకి రావచ్చన్నారు. నీటి వసతి కింద వేరుశనగ పంట 19,330 హెక్టార్లుగా గుర్తించారు. వరి 10 వేల హెక్టార్లు, జొన్న 6,700 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,600 హెక్టార్లు, ఉలవ 3,800 హెక్టార్ల విస్తీర్ణంలో వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. 35 మండలాల్లో పప్పుశనగ : విడపనకల్లో 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో 10 వేల హెక్టార్ల చొప్పున విస్తీర్ణంలో పప్పుశనగ వేసే అవకాశం ఉందంటున్నారు. అధికారులు. బెళుగుప్ప, కనేకల్లు, బొమ్మనహాల్, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, పెద్దపప్పూరు, గుంతకల్లు, యాడికి, రొద్దం, డి.హీరేహాల్ మండలాల్లో పప్పుశనగ ఎక్కువగా సాగులోకి రావచ్చని అంచనా. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేస్తున్నట్లు అంచనా వేశారు. వేరుశనగ జిల్లా అంతటా వేసే అవకాశం ఉన్నా 20 మండలాల్లో ఎక్కువగా సాగు చేసే పరిస్థితి ఉంది. తాడిపత్రి, పుట్లూరు, యాడికి, యల్లనూరు, డి.హీరేహాల్, పెద్దపప్పూరు, బొమ్మనహాల్, ఎన్పీ కుంట, అమడగూరు మండలాల్లో పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా వేయవచ్చని పేర్కొన్నారు. రబీలో పంటల వారీగా సాధారణ సాగు విస్తీర్ణం ఇలా ఉంది. ––––––––––––––––––––––––––––––––––––––––––––– పంట సాధారణం (హెక్టార్లలో) పంట సాధారణం (హెక్టార్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పప్పుశనగ 77,564 వేరుశనగ 19,330 వరి 10,074 జొన్న 6,672 మొక్కజొన్న 5,926 పొద్దుతిరుగుడు 4,673 ఉలవ 3,855 రాగి 939 ఉల్లి 407 ప్రత్తి 392 పెసర 344 ఆముదం 341 పొగాకు 194 మినుములు 157 చెరకు 141 కుసుమ 126 -
ఖరీఫ్, రబీ రుణ లక్ష్యం రూ.30,435 కోట్లు
* దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.13,009 కోట్లు * రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కసరత్తు దాదాపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఈసారి ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాల మంజూరు లక్ష్యం రూ.30,435 కోట్లుగా ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తుది కసరత్తు చేస్తోంది. నాబార్డు ప్రతిపాదనల ప్రకారం ఈ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసినట్లు ఎస్ఎల్బీసీ వర్గాలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రుణ లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా... ఈసారి రూ.2,635 కోట్లు అదనంగా నిర్ణయించారు. ఇక దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, అనుబంధ రుణాల లక్ష్యాన్ని రూ.13,009 కోట్లుగా నిర్ధారించారు. గతేడాది దీర్ఘకాలిక రుణాల లక్ష్యం రూ.7,494.30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే ఈసారి దీర్ఘకాలిక రుణ లక్ష్యాన్ని పెంచుతున్నారని ఎస్ఎల్బీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే పంట రుణాలతో బ్యాంకులకు అనేక తలనొప్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ అంటూ ప్రభుత్వాలు అనేక పథ కాలు ప్రకటించడంతో తమకు ఆర్థికపరమైన చిక్కులు వస్తున్నాయనేది బ్యాంకర్ల ప్రధాన ఆరోపణ. అంతేకాదు పంట పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా రుణాలు పూర్తిగా వసూలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అందువల్లే పంట రుణాలను వీలైనంత తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బోర్లు, బావులు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం తీసుకొనే దీర్ఘకాలిక రుణాలకు ప్రభుత్వ పథకాలేవీ వర్తింప చేయడంలేదు. పైగా మధ్య స్థాయి, ధనిక రైతులే ఎక్కువగా దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటారు. కాబట్టి వారి నుంచి వసూలు చేసుకోవడం ఇబ్బందేమీ కాదని, అందుకే దీర్ఘకాలిక రుణాలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరువులో మొండిచెయ్యి.. రాష్ట్రంలో ఓవైపు కరువు విలయ తాండ వం చేస్తోంటే... మరోవైపు బ్యాంకులు రుణాల్వికుండా చేతులెత్తేశాయి. 2015-16లో తెలంగాణలో పంట రుణ లక్ష్యం రూ.27,800 కోట్లుకాగా.. ఇచ్చింది రూ.17,492 కోట్లే (62.92%)నని ఎస్ఎల్బీసీ నివేదికే తెలియజేసింది. అందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.18,092.68 కోట్లకుగాను రూ. 12,938.74 కోట్లు (71.51%)... రబీ లక్ష్యం రూ.9,707.48 కోట్లకుగాను రూ.4,553.56 కోట్లు (46.91శాతం) ఇచ్చారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు పెరగడం గమనార్హం. 2015-16లో దీర్ఘకాలిక రుణ లక్ష్యం రూ.7,494.30 కోట్లు కాగా... బ్యాంకులు రూ.5,541.67 కోట్లు (73.95%) ఇచ్చాయి. -
‘రబీలో రైతులకు రెయిన్ గన్స్ ఇస్తాం’
విజయవాడ: రబీ పంట వేసిన రైతులకు రెయిన్ గన్స్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులకు మాత్రమే రెయిన్ గన్స్ అందిస్తామని స్పష్టం చేశారు. తమ శాఖలో ఇప్పటికే 1500 గన్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమున్న రైతులు ఏఓ, ఎంపీఈఓల దగ్గర దరఖాస్తులు చేసుకోవాలని రైతులకు సూచించారు. 250 గన్స్లను ఇప్పటికే జిల్లాలోకి పంపించామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ అందిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. -
రబీ సాగుకు సెలవు
♦ తొమ్మిది జిల్లాల్లో సాగు 52 శాతం మాత్రమే ♦ రబీ సాగు లక్ష్యం 12,53,291 హెక్టార్లు ♦ ఇప్పటికి సాగయ్యింది 6,47,727 హెక్టార్లే ♦ ఎండిపోయిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం శ్రమించే అన్నదాతలు రబీ సాగుకు దూరమయ్యారు. ఖరీఫ్లో దెబ్బతిన్న పంటలు, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులు కాడిని దింపేసి, మేడిని వదిలేసి సాగుకు సెలవన్నారు. రబీ సాగు లక్ష్యం రాష్ట్రంలో 12,53,291 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, 6,47,727 హెక్టార్లలోనే సాగు చేశారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఖరీఫ్లో ప్రతికూల పరిస్థితుల మధ్య నష్టాల ఊబిలో చిక్కుకుని కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వం భరోసా ఇవ్వట్లేదు. రూ.792 కోట్ల పరిహారం ప్రకటించినా అది రైతుల దరికి చేరలేదు. విపరీతంగా పెరిగిన పెట్టుబడులు.. ఖరీఫ్ ఆశలపై నీళ్లుజల్లిన వాతావరణం.. గణనీయంగా పడిపోయిన దిగుబడి.. మొక్కుబడిగా గిట్టుబాటు ధర... వెరసి పంట విరామమే మేలంటున్నారు రబీ రైతులు. బయటపడని రైతాంగం రబీ సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుండగా ఇప్పటికే సాధారణ విస్తీర్ణంలో వ్యవసాయ పనులు ఊపందుకోవాల్సి ఉంది. అయితే ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కరెంట్ కోతల కారణంగా ఇప్పటికీ 52 శాతం దాటలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 12,53,291 హెక్టార్లలో రబీ సాగవవుతుందన్న వ్యవసాయశాఖ అంచనా తలకిందులైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం సాగు కాగా, అత్యల్పంగా మెదక్ జిల్లాలో 44 శాతంగా ఉంది. ప్రాజెక్టులన్నీ డెడ్స్టోరేజీకి చేరగా, అడుగంటిన భూగర్భజలాలతో రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిలా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయంలో 16.49 టీఎంసీల నీరు ఉంటే, ఇప్పుడు 5.99 టీఎంసీలకు పడిపోయింది. నిజాంసాగర్లో 1.54 టీఎంసీలుంటే ప్రస్తుతం 0.06 టీఎంసీలు అంటే పూర్తిగా అడుగంటిపోయింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గతేడాది 8.02 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 3.19 టీఎంసీలు ఉంది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టులో 9.12 టీఎంసీలు ఉండాల్సిన నీరు 0.74 టీఎంసీలకు పడిపోయింది. గణనీయంగా తగ్గిన వరిసాగు ఈ రబీలో 6,44,806 హెక్టార్లలో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,59,681 హెక్టార్లు, నల్లగొండలో 1,49,864 హెక్టార్లు, ఆ తర్వాత నిజామాబాద్ 88,931 హెక్టార్లని అంచనా వేశారు. అయితే మొత్తంగా 2,00,298 హెక్టార్లలో వరిసాగు చేశారు. కేవలం 31 శాతం మాత్రమే వరిసాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. పంటను కాపాడుకునేందుకు రైతులకు రాత్రి కరెంటే దిక్కవుతోంది. కాగా, ఇప్పటికే బియ్యం ధరలు చుక్కలు తాకుతుండగా.. గణనీయంగా తగ్గిన వరిసాగుతో బియ్యం ధరలు మరింత ఎగబాకనున్నాయి. ఫలితం దక్కేనా? ఈ రైతు పేరు నారాయణ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం. నాలుగు కరెంట్ బోరు బావులున్నాయని 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండు బోర్లల్లో నీళ్లు రావట్లేదు. మరో రెండు బోర్లలో అడుగంటాయి. ఆరు ఎకరాల్లో పొద్దుతిరుగుడు వేశాడు. నీళ్లు సరిపోవని మరో ఆరు ఎకరాలను పడావుగా ఉంచాడు. ఇప్పటి వరకు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే రాత్రి వేళ కరెంట్ సరఫరా చేస్తుండటంతో రాత్రి పూట పొలం దగ్గరే ఉండాల్సి వస్తోంది. పంటలు చేతికొచ్చి కష్టాలు తీరుతాయనే ఆశతో కష్టపడినా ఫలితం దక్కే పరిస్థితులు కనిపించట్లేదని వాపోతున్నాడు. రాత్రి కరెంటుతో పరేషాన్ మూడు షిఫ్టుల్లో కరెంటు ఇస్తున్నరు. ఒక షిఫ్టులో అర్ధరాత్రి కరెంటు అస్తున్నది. రాత్రి పూట కరెంటు అచ్చినపుడు పొలం కాడికి పోకుంటే మోటరు నడుస్తదో, నడువదో తెలువదు. వేసిన పంటకు నీళ్లు పారిచ్చేతందుకు నానా ఇబ్బంది పడాల్సి అస్తున్నది. ఎండలు ఎక్కువైపోయి నీళ్లు ఆగుతలేవు. అందుకే కరెంటు ఎప్పుడు అచ్చినా పొలం దగ్గరకు పోవలసి వస్తున్నది.. -నేతుల మల్లేశం, రైతు, దోమకొండ, నిజామాబాద్ జిల్లా -
రబీకి కరువు దెబ్బ
♦ రెండు శాతం కూడా మించని వరి నాట్లు ♦ నవంబర్లో 92% లోటు వర్షపాతం నమోదు ♦ వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోంది. పంటల సాగు విస్తీర్ణం ఎన్నడూ లేనంత భారీగా తగ్గిపోయింది. రబీ మొదలై రెండున్నర నెలలు దాటినా... వరి నాట్లు కనీసం రెండు శాతానికి మించి పడలేదు. మొత్తంగా రబీ సీజన్లో 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 8.67 లక్షల ఎకరాల (28%)కే పరిమితమైంది. ఇందులో ఆహార ధాన్యాలు 25.20 లక్షల ఎకరాల్లో సాగుకావాల్సి ఉండగా... 5.37 లక్షల ఎకరాల్లోనే వేశారు. ప్రధాన పంట అయిన వరి సాధారణ సాగు 16.12 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లోనే నాట్లు పడడం పడ్డాయి. అత్యంత దారుణంగా రెండు శాతానికి మించి నాట్లు పడకపోవడం రాష్ట్రంలోని దారుణ పరిస్థితికి కళ్లకు కడుతోంది. ఇక 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.05 లక్షల ఎకరాల్లో (88%) వేశారు. ఇది మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నూనె గింజల సాగు 51 శాతం జరిగింది. ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా ఉల్లి సాగు విస్తీర్ణం 34 శాతానికి మించకపోవడం గమనార్హం. దీంతో వచ్చే సీజన్లో ఆహార ధాన్యాలతోపాటు ఉల్లి కొరత కూడా రాష్ట్రాన్ని వేధించనుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గత నెల 92 శాతం లోటు ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రబీ ప్రారంభమైన అక్టోబర్ నెలలో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. కురిసింది 24.4 మిల్లీమీటర్లే. అంటే 75 శాతం లోటు నమోదైంది. నవంబర్లో సాధారణంగా 27.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... అత్యంత దారుణంగా 2.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఏకంగా 92 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. మొత్తంగా రబీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. నవంబర్ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.69 మీటర్ల అదనపు లోతులోకి వెళ్లిపోయాయి. దీంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మొత్తంగా రబీ పంటల సాగు పడిపోయిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
పాతాళానికి భూగర్భ జలాలు
రాష్ట్రంలో సగటున 2.69 మీ. లోతుకు పడిపోయిన జలాలు రాష్ట్రంలో కరువు పరిస్థితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి తాజా లెక్కలను వ్యవసాయశాఖ బుధవారం వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నెలలో తెలంగాణలో సగటున భూ ఉపరితలం నుంచి 9.70 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే... ఈ ఏడాది నవంబర్లో ఏకంగా 12.39 లోతుల్లోకి వెళ్లాయి. అంటే గతంతో పోలిస్తే 2.69 మీటర్ల లోతుల్లోకి దిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది నవంబర్లో 10.23 మీటర్ల లోతుల్లో జలాలు లభించగా... ఈ నవంబర్లో 16.96 మీటర్ల లోతుల్లోకి కూరుకుపోయాయి. ఏకంగా 6.73 మీటర్లు అదనపు లోతుల్లోకి వెళ్లాయి. మెదక్ జిల్లాలో గత ఏడాది 15.57 మీటర్ల లోతుల్లో జలాలు లభిస్తే... ఈ నవంబర్లో 21.53 మీటర్లకు పడిపోయాయి. ఏ ఒక్క జిల్లాలోనూ భూగర్భ జలాలు పైకి వచ్చిన దాఖలాలు లేవు. రబీలో 75 శాతం లోటు వర్షపాతం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగానే భూగర్భ జలాలు అడుగంటాయి. రబీ సీజన్లో తెలంగాణలో ఏకంగా 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రబీ సీజన్లో ఇప్పటివరకు సహజంగా 128 మిల్లీమీటర్ల (ఎం.ఎం.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 32 ఎం.ఎం.లే నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన 468.42 టీఎంసీల నీరు నిల్వ ఉండగా... ఈ బుధవారం నాటికి కేవలం 326.12 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ఒక్క శాతానికి పరిమితమైన వరి నాట్లు... తీవ్రమైన వర్షాభావం ఫలితంగా పంటల సాగు దారుణంగా పడిపోయింది. అన్ని పంటల సాగు కేవలం 26 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... కేవలం 8.22 లక్షల ఎకరాల్లో (26%) మాత్రమే సాగు జరిగింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... కేవలం 4.97 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి నాట్లు కేవలం ఒకే ఒక్క శాతానికే పరిమితమయ్యాయి. -
కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి రూ.1,525కు చేరుకుంది. నూనెగింజల మద్దతు ధరను క్వింటాకు రూ.250 పెంచారు. పెంపు తర్వాత కందిపప్పు మద్దతుధర రూ.3,325కు, శెనగల మద్దతుధర రూ.3,425కు చేరింది. వ్యవసాయ ఖర్చులు, ధరల సలహా మండలి కమిషన్(సీఏసీపీ) సూచించినట్లుగా ఆరు రబీ పంటలైన గోధుమలు, బార్లీ, శెనగలు, కందిపప్పు, ఆవాలు, కుసుమ నూనె గింజలకు మద్దతుధరను పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలుచేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27లక్షల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికి 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమల్లో ఉండగా.. మిగిలిన రాష్ట్రాలు సెప్టెంబర్ 2015 కల్లా. అమలు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలనుంచి స్పందన రాలేకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. మద్దతు ధర పెంపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హరియాణా సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. బెల్జియం, భారత్ మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకారం అందించుకోవటంతోపాటు.. పునరుత్పత్తి శక్తికి సంబంధించిన సాంకేతికత విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
పచ్చి మోసం..
కడప అగ్రికల్చర్ : ఎనిమిది రోజుల్లో రబీ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవడానికి ఉపక్రమించారు. ఈ రబీలో వర్షాలు ఆశాజనకంగా కురిస్తే 2.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. రెండేళ్లుగా జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో రబీ సీజన్లో ఇవ్వనున్న పప్పు శనగ విత్తన ధరలను ప్రభుత్వం క్వింటాలుపై ఈ ఏడాది రూ.884 పెంచడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులకు దోచిపెడుతోంది.. రబీ సీజన్కు గాను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్న శనగ విత్తనాలను ట్రేడర్లు, వ్యాపారుల వద్ద క్వింటా రూ.6,100 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. అవే విత్తనాలను క్వింటా రూ.6,450 చొప్పున విక్రయించడానికి విత్తన సేకరణ ఏజెన్సీలకు వీలు కల్పించింది. వాస్తవానికి చాలా మంది రైతుల వద్ద శనగ విత్తనాలు భారీ పరిమాణంలో నిల్వ ఉన్నాయి. వారి వద్ద నుంచే నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఉపయోగం ఉండేది. రైతులను కాదని, వ్యాపారుల వద్ద నుంచి గొనుగోలు చేయడం వారికి దోచిపెట్టడమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో పప్పు శనగలు క్వింటా ధర రూ.4,500 మించి లేదు. ప్రభుత్వం మాత్రం ధర రూ.6,450గా నిర్ణయించింది. ఇందులో రూ.2,150 (33.33 శాతం) సబ్సిడీ ఇస్తోంది. ఈ లెక్కన రైతులు తమ వాటాగా రూ.4,300 చెల్లించాలని విత్తన ఖరారు పత్రంలో ప్రభుత్వం పొందుపరిచింది. ఒక్కో రైతుకు రెండున్నర హెక్టార్లకుపైగా భూమి ఉన్నా 50 కిలోల వరకు (రెండు బ్యాగులు) పంపిణీ చేయాలని నిర్ణయించారు. 50 కిలోల బస్తాకు రూ.2,150, 25 కిలోల బస్తాకు రూ.1,075 చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది క్వింటాలు ధర రూ.3,800 కాగా, ఇందులో సబ్సిడీ రూ.1,266.50 ఉండేది. ఇది పోను రైతు రూ.2,533.50 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఉన్నట్లుండి ధర రెండింతలు పెంచడంపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ధర ప్రభుత్వ పెద్దలు, విత్తన ట్రేడర్లు, విత్తన సేకరణ సంస్థలకు వరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల పెంపు దారుణం అసలే కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం విత్తన ధరలు పెంచడం దారుణం. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇలా చేస్తారా? రైతును ఆదుకుంటామంటూనే నడ్డి విరుస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో సబ్సిడీ ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం మాదిరిగా ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా రైతును కుంగదీసిన దాఖలాలు గతంలో లేవు. -గంగిరెడ్డి,రైతు, చెన్నంరాజుపల్లె, పెండ్లిమర్రి మండలం విత్తన ధరలు తగ్గించాలి ప్రభుత్వం రైతులపై భారం మోపుతూ విత్తన ధరలు పెంచడం వల్ల పంటలెలా సాగు చేయాలో అర్థం కావడం లేదు. కరువుతో అల్లాడుతుంటే మళ్లీ విత్తన ధరలు పెంచడం దుర్మార్గం. రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తోంది. రైతులను ఆదుకుంటామంటూనే నట్టేట ముంచుతోంది. విత్తన ధరలు తగ్గించి ఆదుకోకపోతే పంటలను సాగు చేయలేం. -సుబ్బరాయుడు, రేపల్లె, పెండ్లిమర్రి మండలం ఆందోళన చేపడతాం రబీలో విత్తన ధరలు అమాంతం పెంచడం తగదు. రైతులు అసలే కరువులో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి రైతు పట్ల కనికరం లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి భారం మోపడం తగదు. రైతులందరినీ కలుపుకుని ఆందోళన చేపడతాం. -రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
జోరుగా రబీ లక్ష్యం
7 లక్షల మెట్రిక్ టన్నులకు దగ్గరగా ధాన్యం కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే 2.50 లక్షల మెట్రిక్టన్నులు ఎక్కువ హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్కు గాను పౌరసరఫరాల శాఖ ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లు భారీగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఈ ఏడాది రబీలో 7లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరగ్గా, మరో నెలన్నరలో 12లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటవచ్చని అంచనా.గత ఏడాది ఇదే సమయానికి జరిగిన కొనుగోళ్లతో చూస్తే సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం లెవీని 75శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ జూన్ నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలనుంచే ధాన్యం సేకరణను ప్రారంభించింది. ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో ఆన్లైన్ ద్వారా కనీస మద్దతు ధరను చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇలా ఇప్పటికే 1,426 కేంద్రాలను తెరిచి మొత్తంగా 6.88లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీనికి సంబంధించిన రూ.963.34కోట్లను ఆన్లైన్ ద్వారానే నేరుగా విక్రయదారుడి ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 4.31లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 2.57లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం ఉన్న దృష్ట్యా, ఈ కాలంలో 15లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం అనుకున్నా 12లక్షల మెట్రిక్టన్నులకు దాటుతుందని సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి వంద శాతం సేకరణ.. కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిగా లెవీని కేంద్రం ఎత్తివేయనున్న దృష్ట్యా పూర్తి ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. దీనికోసం ఇప్పటినుంచే పౌర సరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. ఇందుకు మౌలిక వసతుల కల్పన, అధికారుల మోహరింపు అన్ని రాష్ట్రాలకు పెనుభారంగా పరిణమించే పరిస్థితి తలెత్తుతుంది. కొన్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాముల సమస్య రాష్ట్రాలకు ఇబ్బంది కల్గించే అంశమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని అధిగమించి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతుల ఏర్పాటుకు ఆశాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
పంట పరిహారం 50% పెంపు
పరిహారానికి అర్హత ఇకపై 33% పంట నష్టమే రైతులకు తీపికబురు అందించిన ప్రధాని న్యూఢిల్లీ: ఆదుకుంటుందనుకున్న పంట అకాలవర్షాల వల్ల నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించారు. పంట నష్టం పరిహారం 50% పెంపు అందులో ఒకటైతే.. కనీసం 33% పంట నష్టం జరిగితే చాలు పరిహారానికి అర్హత లభిస్తుందనేది రెండో శుభవార్త. ఇంతకుముందు కనీసం 50% పంట నష్టం జరిగితేనే పరిహారానికి అర్హత లభించేది. దాన్ని 33 శాతానికి తగ్గించడం వల్ల ఎక్కువ మంది రైతులకు పరిహారం లభించనుంది. కేబినెట్ మంత్రులతో బుధవారం సమీక్షాసమావేశం అనంతరం మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రబీ సీజన్లో ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లోని రైతులు.. ముఖ్యంగా గోధుమ రైతులు అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ‘ప్రధానమంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం మోదీ ప్రసంగిస్తూ.. ‘పంట నష్టం పరిహారాన్ని 50% పెంచాలని నిర్ణయించాం. గతంలో రూ. 100 పరిహారం పొందే రైతు ఇకపై రూ. 150 పొందుతాడు. రూ. 1 లక్ష పొందే రైతు రూ. 1.5 లక్షలు పరిహారంగా అందుకుంటాడు. పరిహారం పెంపు, అర్హత నిబంధన తగ్గింపు వల్ల ఖజానాపై భారీగానే భారం పడుతుంది. అయినా ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడమే ముఖ్యమని మేం భావించాం’ అని వివరించారు. ప్రకృతి విపత్తులు రైతులను నాశనం చేస్తున్నాయని, గత సంవత్సరం అనావృష్టి కారణంగా, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బీమా క్లెయిమ్లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా కంపెనీలను.. పంట నష్టపోయిన రైతుల రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని బ్యాంకులను ఈ సందర్భంగా మోదీ ఆదేశించారు. రుణాల రీస్ట్రక్చర్పై ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలిచ్చామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాకు తెలిపారు. అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా 1.13 కోట్ల హెక్టార్లలో నష్టం జరిగిందని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. 16న చెరకు రైతుల సమస్యలపై సీఎంల భేటీ చెరకు రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 15న చెరకు రైతులు, 16న చెరకు ఉత్పిత్తి చేసే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. చెరకు ఉత్పత్తి రంగంపై నియంత్రణ కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన పాత్ర పెద్దగా ఏమీలేదని, అయినప్పటికీ చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. -
చి‘వరి’కి వర్రీయేనా?
కోయిల్సాగర్ ప్రాజెక్టు (కేఎస్పీ) కింద చివరి ఆయకట్టు భూములకు నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.. ఏటా రబీ సీజన్లో ఆరుతడి పంటలకు నీరు వదలడం చివరి ఆయకట్టు భూములకు నీరందకపోయినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. - దేవరకద్ర వాస్తవానికి రబీ సీజన్ ఆసాంతం విడతలవారీగా ఆరు తడులుగా సాగు నీటిని వదలుతారు. మధ్యలో ఐదు నుంచి వారం రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ నీటిని వదలడానికి అధికారులు షెడ్యుల్ ఖరారు చేస్తారు. అయితే నీటిని వదిలిన తర్వాత ఐదు రోజుల వరకు చివరి ఆయకట్టునకు నీరు చేరుకోని పరిస్థితులు నెలకొన్నాయి. తూములకు షెట్టర్లు లేకపోవడం వల్ల కాల్వకు దగ్గరలో ఉన్న భూములకే ఎక్కువ నీరు పారడం చివరి ఆయకట్టుకు నీరు చేరుకునే లోపే తడివదిలే సమయం అయిపోతోంది. ఇలా ప్రతిసారి వదిలే నీటితడి తమ పొలాలకు చేరడంలేదని రైతులు వాపోతున్నారు. దేవరకద్ర మండలంలోని ఎడమ కాల్వ కింద ఎక్కువగా వరి పంటలే సాగు చేశారు. కోయిల్సాగర్ నీరు తడులుగా విడుదల అయినప్పుడు నీటి వాడుకోవడం తూములు మూసిన విరామ సమయంలో బోరుబావుల ద్వార నీటిని పంటలకు పారిస్తూ వరి పంటలను పండిస్తున్నారు. ఈసారి రబీ సీజన్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మండలంలోని కోయిల్సాగర్, నాగన్నపల్లి, చిన్నరాజమూర్, పెద్దరాజమూర్, నాగారం, బస్వాపూర్, నార్లోనికుంట్ల, బల్సుపల్లి పరిధిలో పెద్ద ఎత్తున పంటలు వేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలా.. ఈ కాల్వ కింద ఐదు రోజుల పాటు నీటిని వదిలిన తర్వాత ఈనెల 12న తూములను మూసివేశారు. అయితే అప్పటివరకు నాగారం శివారు వరకు మాత్రమే నీరు విడుదలైంది. నార్లోనికుంట్ల, బస్వాపూర్, బల్సుపల్లి, గూరకొండ ప్రాంతాలకు నీరందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు విషయం తెలిపినా ఫలితంలేకపోయింది. చివరకు రైతులంతా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు పిలిచి మాట్లాడారు. కొత్తగా వచ్చిన అధికారులు కావడం వల్ల ఎన్ని రోజులకు ఏ తూము వరకు నీరు చేరుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. తూము నుంచి 28 ఇంచుల నీటిని వదలడం వల్ల చివరి ఆయకట్టుకు నీరందదని అలాగే కాల్వ మధ్యలో నాగారం, బస్వాపూర్ చెరువులు ఉన్నాయని అవి నిండితేనే చివరి ఆయకట్టుకు నీరందుతుందని నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు వివరించారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి 60 ఇంచుల పైకి తూమును తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే చివరి ఆయకట్టుకు నీరందడానికి రెండు రోజులు పట్టవచ్చని రైతులు తెలిపారు. చేపలు పట్టడానికేనా? ఇటీవల ఒకవైపు కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటిని కాల్వల ద్వారా వదులుతుండగా మరోవైపు జూరాల బ్యాక్వాటర్ కృష్ణానది నుంచి ఎత్తిపోతల ద్వాదా నీటిని పంపింగ్ చే స్తూ కేఎస్పీకి నీటిని అందిస్తూ వచ్చారు. నాలుగు రోజులుగా మత్స్యకారులు చేపలు పట్టడం ప్రారంభించడంతో కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలడం నిలిపి వేసినట్లు తెలిసింది. దీనివల్లే రైతులు ఆందోళన చెందడంతో తిరిగి నీటిని వదిలారు. అయితే జూరాల బ్యాక్వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటి పంపింగ్ను మాత్రం నిలిపివేశారు. -
వరుణుడిపైనే ఆశలు
రాజంపేట : ఖరీఫ్, రబీ సీజన్లో వరుణుడు కరుణించక పోవడంతో జిల్లాలో రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. రాజంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో చుక్క నీరు లేక చెరువులు, బావులు ఎండిపోయాయి. వాటి కింద ఉన్న భూములు బీడుగా మారాయి. బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోవడంతో నిమ్మ, అరటి చెట్లు వాడుబట్టాయి. నదీ పరీవాహక ప్రాంతంలో అయితే ఫిల్టర్ పాయింట్లు వేసుకొని సేద్యం చేసుకుంటున్నటప్పటికి బోర్లలో నీరు అడుగంటిపోతోంది. రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, అరటి, నిమ్మ, బొప్పాయి, మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ వేసవిలో తోటలను కాపాడుకునేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం కనిపించడం లేదు. ఒక్కో బోరుకు రూ.60 వేల నుంచి రూ లక్ష వరకు ఖర్చు వస్తోంది. బోర్లు వేసుకోవ డానికి అందినకాడల్లా అప్పులు చేస్తున్నారు. అరకొర నీళ్లు పడినా సగం తోటను కాపాడుకోవచ్చనే ఆశతో రైతులు సాహసం చేస్తున్నారు. రాజంపేటలో 10, నందలూరులో 8, పెనగలూరులో 10, ఒంటిమిట్టలో 7 చెరువులు ఎండిపోవడంతో ఆయక ట్టు భూముల్లో సాగు చేపట్టేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. దీనికి తోడు ఉచిత విద్యుత్ సరిగా సరఫరా కాక కొందరు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. బోర్లు వేయలేకపోతున్నాం సాగు నీటి కోసం బోర్లు వేయలేకపోతున్నాం. బోర్లు వేసినా నీరు పడుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. వరుణుడు కరుణించకపోతే ఏప్రిల్, మే నెలల్లో తోటలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. దిగుబడి తగ్గిపోయి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదేమోనని భయం వేస్తోంది. - వేణురెడ్డి, హస్తవరం, రాజంపేట 1200 అడుగులు వేసినా.. నాకున్న రెండు ఎకరాల అరటి తోటకు నీరు అందించడం భారంగా మారుతోంది. వరుసగా ఏడు బోర్లు 1200 అడుగులు వే శాను. నీళ్లు పడలేదు. ఎనిమిదవ బోరులో నీళ్లు పడ్డాయి. అవి కూడా అంతంత మాత్రమే. వచ్చే రెండు నెలల్లో ఎండలు మండిపోతే ఈ అరకొర నీరు కూడా ఇంకిపోతుంది. వర్షం వస్తేనే కాసింత ఊరట ఉంటుంది. -పచ్చ హనుమంతు నాయుడు, బావికాడిపల్లె, పుల్లంపేట -
రబీ.. ఢమాల్
వర్షాభావ పరిస్థితులు రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దానికి తోడు భూగర్బజలాలు అడుగంటుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రబీలో విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం మొదటి నుంచి రైతులను అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా సూచిస్తోంది. ఇలా పలు కారణాలతో ఈ ఏడాది రబీ సీజన్కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో రబీ సాధారణ సాగు 2.09 లక్షల హెక్టార్లు కాగా రైతులు గతేడాది 2.42లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఏడాది 1.28లక్షల హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. ప్రతి ఏటా రబీలో ప్రధానంగా వరి, వేరుశనగ, పప్పుశనగ పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 569.3మిల్లీ మీటర్లు కాగా గతేడాది 742.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా పడిపోయింది. ఇప్పటి వరకు 480.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సారి వర్షపాతం తగ్గడంతో చెరువులు, కుంటలు నిండలేదు. అంతేకాకుండా వర్షభావ పరిస్థితులతో రోజురోజుకు భూగర్బజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎరువుల వాడకం కూడా తక్కువే జిల్లాలో పంటల సాగు సరళి తగ్గడంతో ఎరువుల వాడకం కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో రబీ సీజన్ అన్ని రకాల ఎరువులప్రణాళిక లక్ష్యం91,737మెట్రిక్ టన్నులు. అందులో ఇప్పటివరకు కేవలం 32,500 మెట్రిక్ టన్నులు మాత్రమే అమ్మడుపోయాయి. అయితే, అక్కడక్కడాఎరువుల కొరత ఉన్నట్లు రైతులు చెబు తున్నారు. రబీలో 39,280 మెట్రిక్ టన్నుల యూ రియా అవసరం ఉండేది. కానీ, ఈ సీజన్లో ఇప్పటివరకు 19,319 మెట్రిక్టన్నులు మా6తమే రైతు లు కొన్నారు. ఇంకా 7,883 మెట్రిక్టన్నుల యూరియా మార్క్ఫెడ్, పీఏసీఎస్, ప్రైవేటుడీలర్ల వద్ద7,860మెట్రిక్ టన్నులు ఉన్నా కృతిమ కొరత సృష్టించి రైతులకు సకాలంలో అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రి మ కొరతతో రైతుల నుండి ఎక్కువ డబ్బులు వసులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఏజెన్సీ వద్ద ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. -
రబీ గయా..
గణనీయంగా తగ్గిన రబీ సాగు 81657 హెక్టార్ల భూములు బీళ్లు 9 మీటర్ల లోతులో భూగర్భజలం వెంటాడుతున్న కరెంట్ కష్టాలు ఆరుతడి పంటలకూ కష్టకాలం పెట్టుబడులు రాని గడ్డు పరిస్థితి జిల్లాలో రబీ రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటివనరులు వట్టిపోయి భూగర్భజాలు అడు గంటాయి. బావుల్లో నీళ్లున్నా.. కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు పంటల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వెరసి జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాదాపు 81,657 హెక్టార్ల సాగు భూములు బీడువోతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లక్ష హెక్టార్లు సాగు విస్తీర్ణం తగ్గడం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను కళ్లకు కడుతోంది. - కరీంనగర్ అగ్రికల్చర్ కరీంనగర్ అగ్రికల్చర్ : రబీ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. జిల్లాలో బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ఆధారంగా రబీ పంటలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ పలువురు రైతులు బోర్లు, బావులను నమ్ముకొని వరిసాగు చేపట్టారు. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరు అయిన ఎస్సారెస్పీ నుంచి పంటలకు నీరివ్వలేమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలోని దిగువ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు శనిగరం, బొగ్గులవాగు తదితర చిన్నతరహా జలాశాలు, చెరువులు, కుంటల్లో నీటిమట్టం అడుగంటింది. ఈ నేపథ్యంలో సాగునీరు, కరెంటు కొరతతో పంటల సాగు గణనీయంగా తగ్గింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2.38 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 1.64 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్లో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. వరి సాగును వేసుకోకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడిని ప్రోత్సహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఆరుతడి పంటల కోసం రూ.2.15 కోట్లతో 10,461 క్వింటాళ్ల ఆరుతడి విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై సరఫరా చేసినట్లు చెబుతున్నా మండలస్థాయిలో ఎక్కువ మొత్తంలో మిగిలిపోయాయి. సాధారణ విస్తీర్ణం 1.55 హెక్టార్లకు 78 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి తర్వాత రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. 56,004 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఇతర పంటల సాగు నామమాత్రమే. పాతాళంలో జలం గతేడాది 32శాతం అధిక వర్షపాతం ఉంటే.. ఈ ఏడాది 32 శాతం లోటు ఏర్పడడం అన్నదాతలకు శాపంగా మారింది. జిల్లాలోని 57 మండలాల్లో ఎనిమిది మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. బోయినపల్లి మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు గతేడాదికంటే సగటున 9మీటర్ల లోతుకు పడిపోయాయి. మెట్టప్రాంతమైన వేములవాడలో 18.17 మీటర్ల లోతుకు దిగజారాయి. బోయినపల్లిలో 14.07, ఎల్లారెడ్డిపేట 17.89, చిగురుమామిడి 15.79, గంగాధర 16.91, కొడిమ్యాల 14.65, మల్యాల 13.45, సైదాపూర్ 11.73, హుస్నాబాద్లో 11.71, తిమ్మాపూర్లో 11.46, చొప్పదండిలో 11.43, బెజ్జంకి11.01, కోనరావుపేటలో 12.97, గంభీరావుపేటలో 11.81, మహదేవపూర్లో 11.55 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. కరెంటు కట్కట.. కరెంటు కొరతకు తోడు అనధికార కోతలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ట్రాన్స్కో పరిధిలో 2.85 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటికి 795 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి రోజుకు 7గంటలు బదులు 6గంటల విద్యుత్ను విడతలవారీగా కాకుండా నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. నిరంతరంగా సరఫరా చేయడం వల్ల బావుల్లో ఊట తగ్గుతోంది. బావుల్లో 4గంటల విద్యుత్కు కూడా నీళ్లు సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం తగ్గడంతో కోటా కుదించి కరెంటు కోతలు విధిస్తున్నారు. వినియోగం పెరుగుతుండడంతో కోటా దాటుతోందనే కారణంతో అనధికారికంగా మరో రెండు గంటల పాటు కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో నెలవారీ కోటా 239.070 మిలియన్ యూనిట్లు కేటాయించారు. ప్రతిరోజు 7.969 మిలియన్ యూనిట్లకు ప్రస్తుతం 10 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుండడంతో కోటా దాటుతోందని విద్యుత్ అధికారులు కోతలకు దిగుతున్నారు. -
రబీ పంట చేతికందేనా ?
ఈ నెలాఖరు వరకే సాగునీరు అసలే పంటసాగులో ఆలస్యం అడుగంటిన భూగర్భజలాలు అయోమయంలో రైతులు జిల్లాలో ఈ రబీ సీజను పంట రైతుల చేతికందేనా ? అనే సందేహం కలుగుతోంది. తెలుగుగంగ ద్వారా పంటలకు సాగునీరు ఈ నెలాఖరు వరకు మాత్రమే అందే పరిస్థితులు ఉన్నాయి. అంతేగాక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారుు. చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రతి ఏటా రబీ సీజన్లో సాధార ణంగా 59,885 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లా వ్యాప్తంగా 934 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటికీ 531 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. ఇందులో అధిక శాతం తూర్పు మండలాల్లోనే నమోదవడం గమనార్హం. ఈ క్రమంలో రైతులు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజనుకుగాను 25,139 (42 శాతం) హెక్టార్లలో మాత్రమే పంటలు సాగుచేశారు. ప్రధాన పంటలైన వరి 36,338 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 16,416 హెక్టార్లలో, వేరుశెనగ 14,092 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 4,796 హెక్టార్లలో, కంది 61 హెక్టార్లకు గాను 3 హెక్టార్లలో, పెసర 255 హెక్టార్లకుగాను 59 హెక్టార్లలో, రాగి,సజ్జ మిగిలిన ఇతర పంటలు 760 హెక్టార్లకుగాను 11 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అందులో తూర్పు మండలాల్లోనే అధికంగా దాదాపు 70 శాతం పంటలను సాగుచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ రబీ సీజన్లో పంట సాగు గణనీయంగా తగ్గింది. సాగునీరు అంతంత మాత్రమే జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. తూర్పు మండలాలైన తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరులో సాగుచేస్తున్న 10,748 హెక్టార్ల పంటలకు తెలుగుగంగ నీటిని చెరువులకు మళ్లించి సాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువుల్లో కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే పంటలకు అందించేందుకు సరిపడా నీరు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి తెలుగుగంగ నీటని చెరువులకు మళ్లించే పరిస్థితులు లేవని చెబుతున్నారు. పంటలను వదులుకోవాల్సిందే జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రబీ పంటల సాగు కూడా ఆలస్యంగా మొదలయింది. దీంతో వరి, వేరుశెనగ పంటలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల చేతికి అందనున్నాయి. అయితే ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలకు నీటిని ఆశించిన మేరకు అందించలేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. తెలుగుగంగ ద్వారా తూర్పు మండలాల్లోని పంట పొలాలకు ఈ నెలాఖరు వరకు మాత్రమే నీరు అందించగలిగే పరిస్థితులు ఉన్నాయి. మరో రెండు నెలల పాటు నీరందితేనే పంటలు పండుతారుు. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అర్ధాంతరంగా వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. -
దాళ్వాపై వీడని సందిగ్ధం
45 వేల ఎకరాలకు నీరిస్తామని సూచనప్రాయంగా ప్రకటన వెదజల్లే పద్ధతిలో నాట్లు పూర్తిచేసిన రైతులు నీరందక రైతుల ఇక్కట్లు ఎండిపోతున్న వరిపైరు మచిలీపట్నం : జిల్లాలో రబీ సీజన్లో దాళ్వా సాగుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కాలువ శివారు ప్రాంతాల్లో 45వేల ఎకరాలకు దాళ్వా పంట సాగు చేసుకునేందుకు సాగునీరు విడుదల చేస్తామని సూచనప్రాయంగా పాలకులు ప్రకటించారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, బందరు, పెడన మండలాల్లో రైతులు దాళ్వా పంటను సాగు చేశారు. బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల్లో అధికశాతం రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. అయితే శివారు ప్రాంతాలకు సక్రమంగా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రధాన కాలువల్లో పొలాల్లోకి నీరు పారేంతగా నీటిమట్టం పెరగకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా కాలువల్లో ఉన్న నీటిని పొలాల్లోకి మళ్లిస్తున్నారు. అధికారులు తాగునీటి అవసరాలకే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని రైతులు సాగునీరు వస్తుందనే ఆశతో నాట్లు వేశారని చెప్పడం గమనార్హం. కాలువ ఎగువన ఉన్న భూముల రైతులు మినుము పంట సాగు చేయడంతో కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కాలువల ద్వారా కొసరి కొసరి నీటిని విడుదల చేస్తుండటంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఎండిపోతున్న వరి పైరు... బంటుమిల్లి మండలంలోని ముంజులూరు, బర్రిపాడు, మణిమేశ్వరం, కంచడం తదితర ప్రాంతాల్లో సుమారు 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. కృత్తివెన్ను మండలం మునిపెడ, దోమలగొంది, నీలిపూడి, కొమాళ్లపూడి తదితర ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారాా వరినాట్లు వేశారు. బందరు, పెడన మండలాల్లో మరో 15వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారానే వరినాట్లు వేశారు. విత్తనాలు చల్లి 10 నుంచి 15 రోజులయ్యింది. విత్తనాలు చల్లిన వారం రోజుల అనంతరం పైరుకు మొదటి తడుపు ఇవ్వాల్సి ఉంది. కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందకపోవడంతో శివారు భూములు ఉప్పు సాంధ్రత ఎక్కువగా ఉండడంతో మొక్కలు నీరు అందక చనిపోతున్నాయి. చేసేది లేక రైతులు ప్రధాన కాలువ వద్ద ఒక ఇంజన్ పెట్టి బ్రాంచి కాలువలను నింపి అక్కడి నుంచి పొలం వద్ద రెండో ఇంజన్ ద్వారా నీటిని తోడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రెండు ఇంజన్లు పెట్టి ఎకరం పొలాన్ని తడపాలంటే ఒక తడుపునకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. లక్ష్మీపురం లాకుల వద్ద 4.5 అడుగుల నీటిమట్టం ఉంటేనే శివారు ప్రాంతాల్లోని భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. శనివారం 3.5 అడుగులు మాత్రమే నీటిమట్టం ఈ లాకుల వద్ద ఉందని రైతులు చెబుతున్నారు. వెదజల్లే పద్ధతిలో వరినాట్లు పూర్తి చేయని పొలాల్లో నీరు పెట్టి దమ్ము చేశారు. సకాలంలో నీరు అందకపోవడంతో దమ్ము ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. వరినాట్లు పూర్తి చేసిన పొలంలో సకాలంలో సాగునీటిని పెట్టకుంటే కలుపు బెడద అధికమవుతుందని రైతులు అంటున్నారు. అధికారుల తీరుతో దాళ్వా పంట సాగు చేసిన రైతుల్లో ప్రారంభంలోనే అయోమయం నెలకొంది. పంట పూర్తయ్యే వరకు సాగునీటిని విడుదల చేస్తారా, ఇక్కట్ల పాలు చేస్తారా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వరినాట్లు పూర్తయిన పొలాలకైనా పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. -
తిండి గింజలకూ తిప్పలే!
రబీలో భారీగా పడిపోయిన వరి సాగు సాధారణ సాగులో 7 శాతానికే పరిమితం ఇతర తిండి గింజలదీ ఇదే దుస్థితి రానున్న రోజుల్లో బియ్యం ధరలు పెరిగే అవకాశం మొత్తం సాగు విస్తీర్ణంలోనూ భారీగా తగ్గుదల కర్నూలు : రానున్న రోజుల్లో తిండి గింజలకు తిప్పలొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సరైన వర్షాలు లేక ఖరీఫ్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. దీంతో రబీలో ప్రత్యేకంగా వరి పంటను సాగు చేసేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా రబీ సీజనులో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీంతో సాధారణ సాగులో కేవలం 10 శాతానికే ఈ పంట పరిమితమైంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చే ప్రమాదం నెలకొంది. మొత్తం మీద ప్రజలకు తిండి గింజలకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాగయింది 7 శాతమే...! జిల్లాలో మొత్తం కర్నూలు మండలాన్ని మినహాయిస్తే 53 మండలాల్లో వరి సాగు అవుతోంది. జిల్లాలో రబీ సీజనులో సాధారణంగా వరి పంట సగటున 28,213 హెక్టార్లల్లో సాగు అవుతుంది. అయితే, ఈ రబీ సీజనులో మాత్రం వరి పంట వేసేందుకు జిల్లాలోని రైతన్నలు విముఖత చూపుతున్నారు. ఈ సీజనులో వ్యవసాయశాఖ సేకరించిన లెక్కల ప్రకారం వాస్తవికంగా సాగు అయ్యింది మాత్రం 2121 హెక్టార్లలో మాత్రమే. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 7 శాతం మాత్రమే సాగయ్యిందన్నమాట. అంతేకాకుండా జొన్నల సాగు పడిపోయింది. సజ్జ సాగు ఆశాజనకంగా సాగడం లేదు. జిల్లాలో సాధారణంగా రబీలో సజ్జ 496 హెక్టార్లల్లో సాగు అవ్వాల్సి ఉండగా... 56 హెక్టార్లకే పరిమితమైపోయింది. అన్ని తిండి గింజలదీ ఇదే పరిస్థితి. రబీ సీజనులో మొత్తం అన్ని పంటల సాగు విస్తీర్ణం కూడా 4,12,380 హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా... 2,66,772 హెక్టార్లకే పరిమితమైపోయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే రానున్న రోజుల్లో తిండి గింజలకు తిప్పలు తప్పేలా లేవని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. కేసీ కెనాల్ నీళ్లు రాకపోవడమూ కారణమే...! భారీగా ఆశలు పెట్టుకుని ఖరీఫ్లో జిల్లాలోని రైతులు భారీగా సాగు చేశారు. వర్షాల రాక ఆలస్యం అయినప్పటికీ పంటల సాగు విస్తీర్ణం మాత్రం భారీగా పెరిగింది. ఉదాహరణకు వరి సాగును తీసుకుంటే ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం 88,645 హెక్టార్లు కాగా.. వాస్తవికంగా సాగయింది మాత్రం 91,568 హెక్టార్టు. అంటే సాధారణ సాగు కంటే పెరిగింది. అయితే, ఎంతో ఆశతో ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటకు దోమపోటు సోకింది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధర ఏ మాత్రమూ సరిపోవడం లేదని రైతన్నలు వాపోతున్నారు. అంతేకాకుండా కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నీళ్లు ఖరీఫ్ సీజనుకే సరిగా అందే పరిస్థితి లేదు. అంతేకాకుండా రబీ సీజనుకు నీళ్లు ఇవ్వలేమని ముందుగానే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో రబీలో పంటలను సాగు చేసేందుకు ధైర్యం చేయడంలేదు. మరోవైపు కేసీ కెనాల్ నీళ్లను అనంతపురం జిల్లాకు మళ్లించడం పట్ల జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
డెల్టా.. ఉల్టా
ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు పల్టీలు కొడుతూనే ఉన్నారుు. దశా దిశా లేకపోవడంతో 2009 నుంచి పనులు పట్టాలెక్కడం లేదు. ఈ విషయంలో టీడీపీ సర్కారు సైతం మన్నుతిన్న పాములానే వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ అరకొరగానే పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. రబీ సీజన్ ముగిశాక కాలువలు కట్టివేసే షార్ట్ క్లోజర్ పీరి యడ్లో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రూ.39 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈసారి ఎక్కువ రోజులు కాలువలు కట్టివేసి (లాంగ్ క్లోజర్ పాటించి) పెద్దఎత్తున పనులు చేయూలని నీటి పారుదల శాఖ అధికారులు భావించారు. రైతులు కూడా ఇదే ఆశతో ఉన్నారు. అరుుతే, సర్కారు ఇందుకు విరుద్ధంగా ముందుకు వెళుతోంది. డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్ట్లో భాగంగా ఇంకా రూ.800 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉండగా, కేవలం రూ.39 కోట్ల విలువైన పనులు మాత్రమే చేపట్టేందుకు నిర్ణరుుంచడాన్ని చూస్తే సర్కారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. షార్ట్ క్లోజర్లో చేపట్టే పనులివే.. అత్తిలి కెనాల్ పరిధిలో రూ.3 కోట్లు, గోస్తనీ-వేల్పూరు (జీ అండ్ వీ) కాలువ అభివృద్ధికి రూ.8.95 కోట్లు, కాకరపర్రు మెయిన్ కెనాల్ ఆదునికీకరణకు రూ.7 కోట్లు, ఉండి మెయిన్ కాలువ అభివృద్ధికి రూ.8.30 కోట్లు వెచ్చించాలని నిర్ణరుుంచారు. వీడబ్ల్యు కెనాల్ ఆదునికీకరణకు రూ.4 కోట్లు, నరసాపురం మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.2.50 కోట్లు, బ్యాంక్ కెనాల్ అభివృద్ధికి రూ.50 లక్షలు, కాకరపర్రు డ్రెయిన్ ఆధునికీకరణకు రూ.3.50 కోట్లు, యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.1.25 కోట్లు వెచ్చించేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాది చేపట్టిన రూ.150 కోట్ల విలువైన పనుల్లో పూర్తికాని వాటినే ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నట్టు సమాచారం. పనుల పూర్తిపై మీనమేషాలు జిల్లాలో ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్ చేపట్టిన రూ.130.30 కోట్ల విలువైన జీడబ్ల్యు, ఏలూరు, జంక్షన్ కాలువల ఆధునికీకరణ పనుల్లో 10 శాతం కూడా పూర్తి కాలేదు. రూ.134 కోట్లతో ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ చేపట్టిన నరసాపురం కాలువ పనుల్లో 25 శాతం, రూ.111.65 కోట్లతో చేపట్టిన యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో 30 శాతం మాత్రమే పూర్తయ్యూరుు. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద రూ.300 కోట్ల విలువైన పనులను రద్దు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. నిపుణుల కమిటీ నివేదికపై స్పందించని సర్కారు ఆధునికీకరణ పనుల్లో లోపాలను పరిశీలించి సల హాలు ఇచ్చేందుకు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ చెరుకూరు వీరయ్య ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ నిపుణుల బృందం కొద్దినెలల క్రితం డెల్టాలో పర్యటిం చింది. పనులను చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దాదాపు రూ.800 కోట్ల విలువైన పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 2009 నుంచి నానుతూ వస్తున్న డెల్టా ఆధునికీకరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి చేసేందుకు సర్కారు సమగ్ర ప్రణాళిక ప్రకటించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. -
ఇది దా‘రుణమే’!
మొత్తం రుణాల లక్ష్యం: రూ.272.5కోట్లు ఇప్పటికి ఇచ్చినట్టు చెబుతోంది: రూ.162.1 కోట్లు రైతుల చేతికిచ్చింది: రూ.12 కోట్లు రెన్యూవల్, రీషెడ్యూల్: 150.1 కోట్లు కొత్తగా రుణం పొందిన రైతులు: 5,156 మంది పైసా చేతికందని రైతులు: 54,691 మంది రైతు రుణమాఫీ ప్రక్రియ కొత్త రుణాల మంజూరుకు గుదిబండగా మారింది. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగోవంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకు తిరిగి పంటరుణాలు చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ బ్యాంకర్లు ఇందుకు సమ్మతిస్తూనే.. కొర్రీలు వేయడంతో కొత్త రుణాల లభ్యత రైతుకు కష్టంగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో రూ.272.5కోట్ల రుణాలు ఇచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 59,847 మంది రైతులకు రూ.162.1కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ ముగియడాకి మరో రెండు నెలల సమయం ఉండడంతో ఆలోపు పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇందులో కేవలం 5,156 మంది రైతులకు మాత్రమే.. అంటే 8 శాతం మంది రైతులకే కొత్తగా రూ.12 కోట్ల రూపాయలు రుణరూపంలో ఇచ్చారు. మిగతా రూ.150.1 కోట్ల రుణాలను రెన్యూవల్, రీషెడ్యూల్ చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో రూ.135 కోట్ల రుణాలను రెన్యూవల్ చేయగా, రూ.15కోట్లు రీషెడ్యుల్ చేశారు. ఇలా 54,691 మంది రైతులకు పైసా చేతికివ్వకుండానే రుణాలిచ్చినట్లు బ్యాంకులు లెక్కలు చూపడం గమనార్హం. కాగితాల్లోనే పురోగతి.. వరుసగా నష్టాల పాలవుతున్న రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సీజన్కు ముందు పంటరుణాల అందిస్తుంది. అలా తీసుకున్న రుణాన్ని పంటకు పెట్టుబడి పెట్టి రైతు సాగుపనులకు ఉపక్రమిస్తాడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తారుమారైంది. గత బకాయిలను చూపుతూ.. వాటినే కొత్త రుణాలుగా ఖాతా పుస్తకాల్లోకి మారుస్తూ రైతుకు పైసా ఇవ్వకుండానే రుణాల పురోగతిని సాధించినట్లు చూపుతున్నాయి. నాలుగోవంతే రుణం.. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు పావువంతు నిధులు మాత్రమే విడుదల చేసింది. ఈక్రమంలో బ్యాంకులు ఒక్కో రైతుకు అర్హతలో గరి ష్టంగా పావువంతు మాత్రమే రుణాలిస్తున్నాయి. అంటే గతంలో రూ.లక్ష తీసుకున్న రైతు ఖాతాల్లో మాఫీ కింద రూ.25వేల జమయ్యాయి. దీంతో ఆ రైతు చెల్లింపుల తీరును పరిగణనలోకి తీసుకొని గరి ష్టంగా రూ.25వేల రుణం మంజూరు చేస్తున్నారు. కొత్తగా ఐదు వేల మందికి రుణాలివ్వగా.. మిగతా వారిలో ఇలా కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తూ మిగతా మొత్తాన్ని కొత్త ఖాతాలోకి మారుస్తున్నారు. -
పంటలు ఎండుతున్నాయ్!
కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,పెసర పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు గనుక కురవకపోతే పంట దిగుబడులను మరిచిపోవాల్సిందేనని రైతులు మదన పడుతున్నారు. కేసీ చాపాడు, కుందూనది పరిధిలోని రైతులు ఆయిల్ ఇంజన్లు, ట్రాక్టర్ల పంపుల సహాయంతో ఎకరాకు రూ.1 నుంచి 3 వేల వరకు ఖర్చు చేసి నీటితుడులు అందించుకుంటున్నారు. పర్లపాడు, అర్కటవేముల, పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె, సోమాపురం, రాజుపాళెం తదితర గ్రామాల్లోని రైతులకు ఏనీరు రాక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల కిందట మైలవరం నీటిని వరిలామని అధికారులు చెబుతున్నా ఇంకా ఇంతవరకు మండలంలోని గ్రామాల పొలాలకు రాలేదని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఎండుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నామన్నారు. పెట్టుబడులన్నీ నేలపాలు కాక తప్పదని అంటున్నారు. -
కష్టాల రబీ
కర్నూలు (అగ్రికల్చర్) : రబీ సీజన్ ముందుకు సాగడం లేదు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా అంతంతమాత్రంగానే పంటలు సాగు అయ్యాయి. రైతుల్లో అసంతృప్తి, నిరుత్సాహం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రబీలో సాధారణ సాగు 4,12,490 హెక్టార్లు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 2,98,797 హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. ఈసారి మాత్రం కేవలం 1,84,451 హెక్టార్లకే సాగు పరిమితం అయింది. సాధారణ సాగులో 44.72 శాతం మాత్రమే పంటలు సాగు అయ్యాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాభావం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ అందని పండు చందం అయింది. జిల్లా యంత్రాంగం జిల్లాలో 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఖరీఫ్ కష్టాలు వెంటాడుతుండటం వల్లనే రబీ పంటల సాగు పట్ల రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ఆరంభం అయి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకులు ఒక్క రైతుకు కూడా పంటరుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 2013 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల బీమా పథకం కింద మంజూరు అయిన పరిహారాన్ని కూడా ప్రభుత్వమే జమ చేసుకోవడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఇంతవరకు రుణాలు మాఫీ చేయకపోగా రైతులపై వడ్డీ భారాన్ని మోపడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పంట రుణాలు ఇవ్వకపోగా గత ఏడాది తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించాలని రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీగా తగ్గిన శనగ సాగు... రాయలసీమ జిల్లాలోనే శనగ సాగులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. సాధారణ సాగు 2,15,493 హెక్టార్లు ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 2,06,258 హెక్టార్లు సాగు అయింది. ఈసారి మాత్రం 1,12,119 హెక్టార్లకే పరిమితం అయింది. ఖరీఫ్లో రికార్డు స్థాయిలో పత్తి సాగు అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 3 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. ఈ పంట జనవరి నెల వరకు ఉంటుంది. ప్రధానంగా పత్తి నల్లరేగడి భూముల్లో సాగు అవుతుంది. రబీ పంటలు కూడా నల్లరేగడి నేలల్లోనే సాగు అవుతాయి. ఖరీఫ్లో పత్తి సాగు భారీగా పెరగడం వల్లనే రబీ పంటల సాగు అంతంతమాత్రంగా ఉందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రబీ సీజన్కు సంబంధించి కాల్వల కింద పంటల సాగుకు ఇంతవరకు నీళ్లు వదలలేదు. రబీ సాగు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన ధనియాల సాగు... ఈ రబీలో ధనియాలు సాగు పెరిగింది. సాధారణ సాగు 3,924 హెక్టార్లు ఉండగా, 7,472 హెక్టార్లలో పంటలు వేయడం గమనార్హం. రబీలో శనగ తర్వాత అత్యధికంగా జొన్న సాగు చేస్తారు. ఈసారి జొన్న సాగు కూడా తగ్గిపోయింది. సాధారణ సాగు 60,119 హెక్టార్లు ఉండగా, ఈసారి కేవలం 35,868 హెక్టార్లలో(59.66 శాతం) మాత్రమే జొన్న సాగు అయింది. గత ఏడాది ఇదే సమయానికి 45,350 హెక్టార్లలో జొన్న వేయడం గమనార్హం. -
ఆ విత్తు మాకొద్దు!
తాండూరు: రబీ సీజన్ కోసం వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోటాను మండలాల వారీగా కేటాయించారు. బహిరంగ మార్కెట్లో వేరుశగన విత్తనం ధర కన్నా సబ్సిడీ విత్తనం ధర అధికంగా ఉండటంతో కొనుగోలుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు రైతులకు అవసరమైన సమయంలో విత్తనం అందుబాటులో లేకపోవడం ఇందుకు మరో కారణం. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇక్కడ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. భూమి తడిగా ఉండటంతో రైతులు వేరుశనగ పంట సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో డీసీఎంఎస్కు సబ్సిడీ విత్తనాలు ఇంకా రాలేదు. దాంతో రైతులు మహబూబ్నగర్తోపాటు కర్ణాటక తదితర బయట ప్రాంతాల నుంచి విత్తనాన్ని కొనుగోలు చేసి, పంట సాగు చేశారు. వ్యవసాయ శాఖ మాత్రం గత అక్టోబర్ 13వ తేదీ నుంచి డీసీఎంఎస్లో సబ్సిడీ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాండూరు ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. కోట్పల్లి, మంబాపూర్, యాలాల మండలాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తారు. అప్పటికే చాలా మంది రైతులు విత్తనాలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి పంట సాగు చేశారు. ఫలితంగా సబ్సిడీ విత్తనాలు వచ్చినా కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. సబ్సిడీ వేరుశనగ అసలు ధర క్వింటాలుకు రూ.6వేలు కాగా సబ్సిడీ రూ.2వేలు మినహాయించి రైతులు క్వింటాలుకు రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతులకు బయట మార్కెట్లో రూ.3500-రూ.3700లకే వేరుశనగ విత్తనాలు లభిస్తుండడంతో వారు అటు వైపు మొగ్గుచూపారు. సబ్సిడీ విత్తనం పాతది అయినందుకే కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదనే అభిప్రాయం పలువురు రైతుల్లో వ్యక్తమవుతోంది. నెల రోజులు అవుతున్నా వచ్చిన విత్తనాల కోటాలో అరకొరగానే అమ్మకాలు జరిగాయి. మిగితా నిల్వలు గోదాంకే పరిమితమయ్యాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటే విత్తనాలకు పురుగు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరి అధికారులు విత్తనాలను ఏం చేస్తారో చూడాలి. 273 క్వింటాళ్లే అమ్మకం.. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల,బషీరాబాద్,పెద్దేముల్ మండలాలకు మొత్తం 4,900 క్వింటాళ్ల విత్తనాల కోటాను వ్యవసాయ శాఖ కేటాయించిందని తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ షరీఫ్ చెప్పారు. ఇందులో 809 క్వింటాళ్ల కోటా ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో డీసీఎంఎస్ గోదాంకు వచ్చిందని వివరించారు. కోటా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ గ్రామాల చెందిన రైతులు 273 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. మిగితా విత్తనాలు గోదాంలో నిల్వ ఉన్నాయి. -
రబీ ‘సాగే'నా?
నెల్లూరు (అగ్రికల్చర్) : రబీ సీజన్ ప్రారంభమైనా సాగు సన్నాహాలు పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ఖరీఫ్ పంటకు మద్దతు ధర లేకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం, నీళ్లు లేక పంటలు ఎండిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర కష్ట, నష్టాలను చవి చూశారు. ఒక పక్క జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం, మరో పక్క రుణమాఫీ అమలు కాక అప్పుల భారం పెరగడంతో రైతుల్లో వ్యవసాయంపై నిర్లిప్తత నెలకొంది. మెట్టపైర్ల సాగు కూడా ఆశించిన స్థాయిలో ప్రారంభం కావడం లేదు. ఈ ఏడాది రబీ ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,50,247 హెక్టార్లు ఉంటే అనేక కారణలతో 1,46,961 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగయినట్లు అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ గత నెల నుంచే ప్రారంభమైనప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంత వరకు సన్నాహాలే ప్రారంభం కాలేదు. డెల్టా ప్రాం తంలో వరి నార్లు పోసుకున్నా, నాన్ డెల్టాలో వర్షం లేకపోవడంతో కనీసం నారుమడులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. మినుము, వాణిజ్య పంటల సాగు సైతం సానుకూలంగా సాగడం లేదు. పెసర మాత్రమే సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేస్తున్నారు. రుణమాఫీతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో కాలం వెళ్లదీస్తోంది. ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్కు, పంటల బీమాకు సైతం నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో రబీ పంటలు వేయడానికి రైతుల చేతుల్లో డబ్బులు లేక, అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అన్నదాతలు సాగుపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలో 2,76,425 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి 32,794 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పడిపోతున్న భూగర్భజలాలు జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో తక్కువ శాతం నమోదైంది. సోమశిల ప్రాజెక్టులో 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ 47.254 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్లో 67 టీఎంసీలకు గాను 25.302 టీఎంసీలు, సర్వేపల్లి రిజర్వాయర్లో 12 అడుగులకు 7.3 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. కనిగిరి రిజర్వాయర్లో 21.45 అడుగులకు 17.5, నెల్లూరు చెరువులో 16.30కు 12.6 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది. నాన్డెల్టా ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో క్రమంగా పడిపోతున్న భూగర్భజల మట్టాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, రాపూరు, తదితర మండలాల్లో భూగర్భజలం 10 మీటర్ల లోతుకు చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో ఖరీఫ్లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రబీసాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. రబీ సాగు విస్తీర్ణం : పంట సాధారణ విస్తీర్ణం {పస్తుత విస్తీర్ణం హెక్టార్లు 1.వరి 1,98,295 12029 2.జొన్న 961 30 3.సజ్జ 38 0 4.రాగి 81 0 5.మొక్కజొన్న 1056 42 6.కంది 202 56 7.పెసర 3686 4137 8.మినుము 27316 12,189 9.ఉలవ 94 0 10.వేరుశనగ 4910 0 11.నువ్వులు 891 16 12.పొద్దుతిరుగుడు 2257 33 13.పచ్చిశనగ 10070 0 14.అలసంద 106 30 15.పత్తి 1751 35 16.మిరప 1396 502 17.చెరకు 7106 0 18.ఆనియన్ 1 0 19.పొగాకు 11334 3026 20.కూరగాయలు 1921 618 21.ఇతర పంటలు 2953 56 మొత్తం 2,76,425 32,794 -
రబీకి సన్నద్ధం
గజ్వేల్: వర్షాభావం కారణంగా ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు ‘రబీ’లోనైనా కోలుకోవాలనే ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే భూగర్భజలాలు పడిపోయినందువల్ల ‘వరి’కి సాగుకు స్వస్తి పలికి ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయాశాఖ సూచిస్తున్నారు. ఈ తరుణంలో రైతుల ‘ఆరుతడి’ పంటల సాగుపై దృష్టి సారించారు. రెండురోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలతో రైతులు శనగ, ఇతర ఆరుతడి పంటల సాగును వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రబీకి ఊతమిచ్చిన వర్షం ఖరీఫ్లో నెలకొన్న వర్షాభావం రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. కళ్ల ముందే వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ కారణంగా చేలన్నీ న్లై బారాయి. రేగడి భూముల్లోనూ తేమ కరువైంది. మొక్కజొన్న పంట కోసిన తర్వాత అదే భూమిలో రబీలో శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర ఆరుతడి పంటలు వేసుకోవాలంటే తేమ తప్పనిసరి. ఎక్కడా కూడా తేమ లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్న తరుణంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు‘రబీ’సాగుకు ఊతమిచ్చాయి. అంచనా తప్పింది! గతేడాది రబీలో జిల్లాలో 1.49 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి 1.52 లక్షల హెక్టార్లలో శనగ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, ఆముదం, జొన్న, మినుములు, వరి, కూరగాయలు తదితర పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 626.1 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 399.8 మి.మీలు మాత్రమే నమోదైంది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం వల్ల కరెంట్ సరఫరా చేసినా నీరు పారే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ‘వరి’కి దూరంగా ఉండాలని రైతులకు సూచిస్తున్నారు. ఫలితంగా వరి సాగు గణనీయంగా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పడిపోనున్న వరి సాగు విస్తీర్ణం గజ్వేల్ సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లో గతేడాది శనగ పంట 2,083 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,700 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1,117 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 600 హెక్టార్లు, మొక్కజొన్న 233 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,000 హెక్టార్లు, ఇతర పంటలు 790 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 509 హెక్టార్లలో సాగయ్యాయి. ఇదిలావుంటే వరి మాత్రం 4,356 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 3,200 హెక్టార్లలో సాగైంది. ఈసారి వ్యవసాయశాఖ పంటలు ఇదే విధంగా సాగులోకి వస్తాయని భావించింది. ప్రధానంగా శనగ పంట 2,700 హెక్టార్లలో సాగులోకి వస్తుందని భావించి 2,000 క్వింటాళ్ల విత్తనం అవసరముంటుందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 400 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు రాగా, వ్యవసాయాధికారులు ఇప్పటివరకు అతికష్టం మీద 300 క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే పంపిణీ చేయగలిగారు. 100 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేసేవారు లేక వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఉండిపోయింది. వాస్తవానికి ఈపాటికి విత్తనాల పంపిణీ పూర్తయి, విత్తడం కూడా ముగింపు దశకు చేరుకోవాల్సి ఉండగా, అందుకుభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులుగా కురిసిన వర్షంతో శనగ సాగు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘వరి’కి దూరంగా ఉండాలి ఖరీఫ్లో ఏర్పడిన వర్షాభావం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. అందువల్ల ప్రస్తుత రబీలో వరి సాగు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి. సబ్సీడీ విత్తనాలు వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. -జేడీఏ హుక్యా నాయక్ -
తడులిస్తే మక్క మస్తు
ఖమ్మం వ్యవసాయం: రబీలో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించేందుకు సాగునీటిని సక్రమంగా పారించాలి. మొక్కలకు నీరు, సూర్యరశ్మిని పెరుగుదలకు అనుకూలంగా ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. తడుల మెలకువలను జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) చెబుతున్నారు. విత్తేముందు జాగ్రత్తలు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. విత్తనం నీటిని గ్రహించి దాదాపు రెండింతల బరువు పొందిన తరువాత మొలకెత్తుతుంది. మొక్కజొన్న అధికనీరు(నీటి ముంపు) లేక బెట్ట(నీటి ఎద్దడి) పరిస్థితులను తట్టుకోలేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది. పైరు లేత దశలో (విత్తిన తరువాత 30రోజుల వరకు) నేలలో నీరు నిలువ ఉంకుండా జాగ్రత్త పడాలి. నీటిముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి దిగుబడి పడిపోతుంది. నేలలో మురుగు నీరు పోయే విధంగా చూసుకోవాలి. లేదా బోదెసాళ్ల పద్ధతులను పాటించాలి. తేమ సున్నిత దశలు పంట మోకాలెత్తు దశ, పూతదశ, గింజపాలుపోసుకునే దశ, గింజనిండే దశ. విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందొచ్చు. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పుష్పించు దశలు ఆలస్యమవుతాయి. మొక్క 30-40 సెం.మీ ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువ. పూత దశలో (జల్లు, పీచు వేసి పరాగ సంపర్కం జరగటం) అత్యధికంగా అంటే రోజుకు 8-12 మి.మీ ఉంటుంది. ఈ దశలోని 15-20 రోజులు మొక్కకు అత్యంత కీలకం. పూతదశ కీలకం పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీడి ఎద్దడికి గురైతే 40-80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజకట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ గింజ గట్టి పడే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. నీటి ఎద్దడి వలన మగపూత దశలో 25 శాతం, ఆడపూత దశలో 50 శాతం పరాగ సంపర్కం తరువాత 21 శాతం గింజ దిగుబడి తగ్గుతుంది. పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టాలి. ఎన్నితడుల నీరు కట్టాలంటే... నీరు సమృద్ధిగా ఉంటే నల్లరేగడి నేలల్లో 5-6 తడులు, ఎర్రనేలల్లో 8 తడుల వరకు అవసరం. ఒకవేళ 6 తడులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక తడి మొలక దశ, ఒక తడి పంట మోకాలెత్తు దశ, ఒక తడి పూత దశ, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు, గింజ నిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ 5 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే పంట మొలక దశ ను తీసివేసి మిగతా దశల్లో ఇచ్చుకోవాలి. అదే విధంగా సాగు నీరు 4 తడులకే ఉంటే ఒక తడి మోకాలెత్తు దశలో, ఒక తడి పూత దశలో, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి. -
బెండంత అండ!
అనువైన నేలలు సారవంతమైన నీరు నిలిచే తేలికపాటి నేలలు, మురుగు నీరు నిల్వని నల్లరేగడి నేలలు అనుకూలం. సాగు భూమిని 2 నుంచి 4 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి. ఎకరాకు రబీ సీజన్లో 7 నుంచి 8 కిలోలు, ఖరీఫ్లో అయితే ఐదు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనీ క్రాంతి అనే రకం మొక్కలు కొమ్మలు వేయకుండా ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. అర్క అనామిక రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది. అర్క అభయ రకం విత్తనాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సంకర జాతికి చెందిన వర్ష, విజయ్, మహికో హైబ్రిడ్ నంబరు 10, 64, ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, సింజెంటా ఓహెచ్ 597, తులసి తదితర రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఈ రకాల విత్తనాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. విత్తనశుద్ధి, నాటే విధానం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేలను 4 నుంచి ఐదు సార్లు దున్నిన తర్వాత బోజెలు వేసుకోవాలి. వీటి మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి. విత్తనం విత్తిన వెంటనే నీటి తడి పెట్టాలి. అనంతరం నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఎరువుల యాజమాన్యం రబీలో సాగు కోసం ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అలాగే భాస్వరం వేసుకుంటే పంట బాగా ఎదుగుతుంది. ఎకరాకు 48 కిలోల నత్రజనిని రెండు విడతలుగా 30 నుంచి 45 రోజుల మధ్యలో వేయాలి. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలో నత్రజని ఎరువును వేసుకోవాలి. పంట పూత దశలో లీటరు నీటిలో 10 గ్రాముల యూ రియా కలిపి పిచికారీ చేయాలి. తద్వారా 25 శాతం వరకు నత్రజని ఆదాతోపాటు అధిక దిగుబడి పెరుగుతుంది. మొవ్వ, కాయ తొలుచు పురుగు విత్తిన 30 రోజుల నుంచి ఈ పురుగు మొక్కలను ఆశిస్తుంది. మొవ్వు, పూత, కాయలను తొలిచి వేయడం ద్వారా నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు మొవ్వు, పూత కాయలకు రంధ్రాలు చేసి లోనికి వెళతాయి. అక్కడి పదార్థాన్ని తినేయడం వల్ల కొమ్మలు వాలిపోవడం, కాయలు పుచ్చులుగా మారడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి. నివారణ చర్యలు... మొవ్వు పురుగుల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్ మందును కలిపి 10 రోజల వ్యవధిలో రెండు సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. శంకు లేదా పల్లాకు తెగులు బెండ పంటపై ఆశించే తెగుళ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనిని వైరస్ తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు గిడసిబారి తెల్లగా మారిపోతాయి. ఆకులు చిన్నవిగా ముడతపడి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నివారణ చర్యలు... తెగుళ్లను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను అరికట్టవచ్చు. మచ్చతెగులు ఇది సోకితే ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనినే మచ్చతెగులు అంటారు. ఈ తెగులు పెరినోస్లిరోపారా అనే శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎరిసావిటిల్లా అనే రెక్కల పురుగు ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ పురుగు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకులపై మచ్చలు వచ్చినట్లు గుర్తిస్తే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెల్లదోమ, బూడిద తెగులు తెల్లదోమ ఆశిస్తే బెండ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇవి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకితే ఆకుల పైభాగంలో, కింది భాగంలోను బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్, 2 మి.లీ. హెక్సాకోనజోల్ స్ప్రే చేయాలి. -
రబీకి పూర్తిగా నీరు
ఏలూరు :రానున్న రబీ సీజన్లో పంటలకు నూరుశాతం సాగునీరు అందించాలని జిల్లా నీటిపారుదల సలహామండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యాసాధ్యాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమగ్రంగా చర్చించి నీరందించడానికి ముందుకు వచ్చారు. జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఐఏబీ సమావేశం కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు కూలంకషంగా చర్చించాకే పూర్తి ఆయకట్టుకు 4.60 లక్షల ఎకరాలకు సాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చి తీరాలని తీర్మానించారు. ఇంకా పలు తీర్మానాలను కూడా సమావేశంలో ఆమోదించారు. అయితే జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావులు కొన్ని విషయాల్లో భిన్నంగా స్పందించినప్పటికీ చివరకు అందరికీ న్యాయం చేసే నిర్ణయాలనే ఆమోదించారు. చేపల చెరువుల రైతులకు ముందుగానే నీరందించాలని, డి సెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని, మార్చి నెలాఖరు నాటికి పంటలు పూర్తిస్థాయిలో చేతికొచ్చేలా రైతులకు అవగాహన కల్పించే దిశగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. మార్చి నెలాఖరు నుంచి కాల్వలు కట్టేసే కాలం నుంచి జూన్ 15లోగా డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. నీటి యాజమాన్య పద్ధతులను అవలంబించడానికి, నీటి సరఫరా పర్యవే క్షించడానికి తాత్కాలిక ప్రాతిపదికన నాలుగు నెలలకు లస్కర్లను నియమించాలని, అవసరమైన చోట్ల షట్టర్లకు మరమ్మతు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ కాటంనేని భాస్కర్ వివరిస్తూ రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, మత్స్యశాఖ, ఇరిగేషన్శాఖలు సంయుక్తంగా రబీ నీటి సరఫరాలో పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. లస్కర్లను స్థానికంగా ఉన్నవారినే నియమించేలాగా, కృష్ణా డెల్టాకు సాగునీటిని పూర్తిస్థాయిలో ఇచ్చేలా ఆ జిల్లాలో జరిగే సమావేశంలో తగు నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. సీజన్లో ప్రతి వారం నీటి సరఫరా, ఇతర సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటిబాబు, ఎమ్మెల్యేలు బడేటి కోటరామారావు (బుజ్జి), పులవర్తి అంజిబాబు, నిమ్మల రామానాయుడు, జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకర్రావు, ఇరిగేషన్ ఈఈలు జి. శ్రీనివాస్, ఎం.రామ్ప్రసాద్, ఆర్డీవోలు పాల్గొన్నారు. మాకు తెలియకుండా ప్రతిపాదనలా? చింతమనేని ఫైర్ జిల్లాలో 1406 చిన్నతరహా చెరువులను రూ.160కోట్లతో అభివృద్ధి చేయాలన్న అంశంపై ఎమ్మెల్యేలకు తెలియకుండా ప్రతిపాదనలను ఎలా పంపుతారని ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమలరావుపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. దీనిపై ఎస్ఈ వివరణ ఇస్తూ వారంలోగానే ప్రతిపాదనలను ఇవ్వాలని కోరడంతో దానికి అనుగుణంగా అంచనాలను వేసి పంపామని చెప్పారు. దీనిపై విప్ వాదన పెంచుతుండడంతో కల్పించుకున్న మంత్రి పీతల సుజాత వారిద్దరినీ వారించారు. పంపేముందే చెప్పలేని అధికారులు సమావేశం ముందు అయినా పరిస్థితిని వివరించి ఉంటే వాదన జరిగేది కాదని, ఇక ముందైనా ఎమ్మెల్యేలతో చర్చించాక పంపాలని ఆమె సూచించారు. సమస్యలపై ఎమ్మెల్యేలు ఏకరువు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గుండుగొలను- బాదంపూడిల మధ్య పాడైన షట్టర్లను యుద్దప్రాతిపదికన బాగు చేయాలన్నారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివ రామరాజు మాట్లాడుతూ నీటి సంఘాలకు ఎన్నికలు జరపాలని, నీటితీరువా వసూళ్లను స్థానికంగా ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టేలా తీర్మానాలు చేయాలన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే బి శేషారావు మాట్లాడుతూ ప్రతి చిన్నపనికి ఇరిగేషన్శాఖ సీఈ స్థాయిలోకి ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగడం లేదని, ఆపరేషన్, నిర్వహణ గ్రాంట్ మన దగ్గరే ఉండేలా చూడాలన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ తన నియోజకవర్గంలో కాల్వలు, డ్రెయిన్ల అబివృద్ధి విషయంలో చిన్నచూపు చూస్తున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్లు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 1.54 లక్షల ఎకరాలు నీరందిస్తున్న మాట వాస్తవం కాదంటూ అక్కడి ఎస్ఈ ఎన్వీ రమణను నిలదీశారు. దీనిపై గ్రామం, మండల వారీగా ఇస్తున్న నీటి వివరాలను తనకు సమర్పించాలని కలెక్టర్ ఎస్ఈని ఆదేశించారు. ఇరిగేషన్ ఛీప్ ఇంజనీర్ మాట్లాడుతూ లస్కర్లను తాత్కాలిక పద్ధతిలో తీసుకునేందుకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సమస్యలను మంత్రి దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాత్కాలికంగా వీరితో పనిచేయిస్తామని, శాశ్వత ప్రాతిపదికన అయితే సీఎంకు పంపాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమలరావు మాట్లాడుతూ నీటికొరత వల్ల ఎర్రకాల్వ కింద 16 వేల ఎకరాలు, తమ్మిలేరులో 4,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేమన్నారు. శ్రద్ధ వహిస్తే పూర్తి ఆయకట్టుకు నీరివ్వగలం మంత్రి మాణిక్యాలరావు జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న రోజుల్లోనే పూర్తిస్థాయిలో నీరిచ్చిన సందర్భాలున్నాయి. లస్కర్లను ఏర్పాటు చేసి షట్లర్లకు మరమ్మతులు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. నీటి పంపిణీ విధానంలో మార్పులు చేయాల్సి ఉంది. మెరక భూములకు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీరు తోడాలి. ఈ విషయలో నీటి సంఘాల మాజీ అధ్యక్షులు, సభ్యుల సలహాలను తీసుకోవాలి. నాట్లను డిసెంబర్ 31నాటికి పూర్తి చేసేలా రైతుల్లో విస్తృత ప్రచారం చేయాలి. చేపల చెరువుల రైతులకు నీరిచ్చేది లేనిదీ ముందుగానే తెలపాలి. ఈ విషయాలపై అందరు శ్రద్ధ తీసుకుంటే పూర్తి ఆయకట్టుకు సాగునీరందించడం కష్టం కాదు. రబీ పంటకు శివారు ప్రాంతాల్లో వంతులవారీ విధానం మంత్రి పీతల సుజాత జిల్లాలో రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమలు హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తితే వంతుల వారీ విధానంలో సరఫరా చేయాలి. పంటలు ఎండిపోయే పరిస్థితి రాకుండా సీలేరు జలాలను మళ్లించి రక్షించి తీరుతాము. తమ్మిలేరు, ఎర్ర కాల్వల కింద సాగుకు నీరివ్వాలి. మైనర్ ఇరిగేషన్ చె రువుల అభివృద్ధికి వాటర్ కన్జర్వేషన్ నిధులను సమీకరించాలి. ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు కాల్వలు నీరు కట్టేసేలోగానే అన్ని మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుకునేలా చర్యలు చేపట్టాలి. డె ల్టా ఆధునికీకరణ కింద చేపట్టే పనులను పూర్తిస్థాయిలో అందరి ప్రజాప్రతినిధులకు వివరాలను సమర్పించాలి. ధవళేశ్వరం ర్యాంపుల్లో పూడికతీతలను అక్కడి ఎస్ఈ పర్యవేక్షించాలి. -
రబీకి పూర్తిగా నీళ్లందేనా?
జిల్లాలో అన్నదాతలు ప్రతి ఏటా రబీకి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం నీరందించే స్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఆ తర్వాత కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. మళ్లీ రబీ సీజన్ ప్రారంభం కానుండడంతో రైతుల్లో నీటి కలవరం మొదలైంది. దీనికితోడు నత్తనడకన జరుగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వ అజమాయిషీ లోపించింది. దీంతో ఎన్ని రబీ సీజన్లు తాము పంటను కోల్పోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐఏబీ సమావేశంలో ఎటువంటి నిర్ణయూలు వెలువడతాయోనని ఎదురుచూస్తున్నారు. ఏలూరు : ఈ రబీ సీజన్కు పూర్తిస్థాయిలో టీడీపీ సర్కార్ నీరందిస్తుందా? ఇవ్వదా? అన్న ఆందోళన రైతన్నలను వేధిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన జిల్లాలో జరిగిన జన్మభూమి- మా ఊరు సభలో రెండో పంటకు నీరు ఇస్తున్నాం... ఈ విషయంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ తరుణంలో సాగునీరు అందించడం, డెల్టా ఆధునీకరణ పనులు తిరిగి ప్రారంభించడం తదితర అంశాలతో కూడిన ఎజెండాతో ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఇరిగేషన్ సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తమ్మిలేరు నుంచి రబీకి సాగునీటి సరఫరా అనుమతించడం, పంటకాలం తర్వాత కాల్వలు కట్టేసే సమయం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నీటి సంఘాలు మనుగడలో లేని కారణంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఇరిగేషన్ ఎస్ఈ, ఇతర సంఘాలకు కూడా అధికారులే పర్సన్ ఇన్చార్జులుగా మూడేళ్ల కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. 80 శాతం సాగునీటికే అవకాశం జిల్లాలో ప్రతి రబీ సీజన్లో 4.60 లక్షల ఎకరాల వరి పంట సాగవుతుంది. ఈ ఏడాది కూడా పశ్చిమ డెల్టా కింద సాగునీటి లభ్యత తక్కువగా ఉండడంతో నూరుశాతం సాగునీరు అందించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం రబీలో పూర్తిస్థాయిలో నీరిస్తే 42.58 టీఎంసీల నీటి నిల్వలు అవసరం. ప్రస్తుతం 34.42 టీఎంసీల లభ్యత ఉన్నట్టు అంచనా. సీలేరు నుంచి అదనంగా నీటిని గోదావరికి మళ్లించగలిగితే పంటల సాగు పూర్తి అయ్యే వీలుంది. అరుుతే సీలేరులో కూడా నీటిలభ్యత లేకపోవడంతో రబీలో 80 శాతం మాత్రం సాగుకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నూరుశాతం సాగుకు అనుమతించిన పక్షంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో గోదావరి నీటినిల్వలు పడిపోతే పంట సంక్షోభంలో పడుతుంది. నాట్లు త్వరగా వేసి మార్చి 31వ తేదీలోగా సాగు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే రబీ పంట గటెక్కే అవకాశాలున్నాయి. అరుుతే ఈ సందర్భంలో చేపల చెరువుల రైతులకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశాలపై టీడీపీ పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. డెల్టా ఆధునికీకరణపై చర్చ సాగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా కాల్వలు, డ్రెయిన్ల ప్రక్షాళన 50 శాతం కూడా పూర్తికాలేదు. 2007లో రూ.1464 కోట్లతో ఈ పనులు చేపట్టగా ఇప్పటికి రూ.475.13 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. కాకరపర్రు, నర్సాపురం, బ్యాంకు కెనాల్, అత్తిలి, ఉండి కాల్వలతో పాటు యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐవీఆర్సీ కంపెనీ లిమిటెడ్ రూ.300 కోట్ల పనులను పెండింగ్లో ఉంచాయి. ఈ కంపెనీలపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు లేవు. ప్రోగ్రెస్సివ్ కనస్ట్రక్షన్ కంపెనీ రూ.130 కోట్ల పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని, ఇది కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన కంపెనీ అని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసినా ప్రయోజన ం శూన్యమే. గత రబీలో చేపట్టిన రూ.170 కోట్ల పనులు సైతం మందగమనంలోనే ఉన్నాయి. ఇటీవలే డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో కొన్ని లోపాలున్నాయని, చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించి వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. అయితే ప్రభుత్వం కొత్త పనులు ప్రారంభానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. రబీ పంట కాలాల్లో రెండు లాంగ్ క్లోజర్లు అంటే 90 రోజులు కాలువలు మూసివేస్తే ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఇలా ఇస్తే రెండు సీజన్లలో రబీ పరంగా రూ.1600 కోట్ల పంట రైతులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
రబీకి గండమే!
తిమ్మాపూర్ : కరువు ఛాయల నేపథ్యంలో సాగుభూములు బీళ్లు గా మారనున్నాయి. గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు... ఒక్క పంటకు కూడా నీరందిం చలేని దుస్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడం తో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అం దించారు. ఈ రబీ సీజన్కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ ప్రకటించారు. ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలి పారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పో యింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావులు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
రబీలోనూ ఖరీఫ్ కష్టాలే..
గండేడ్: జిల్లాలో రబీ సీజన్లో అత్యధికంగా సాగయ్యే పంట వరి. వికారాబాద్ డివిజన్లో అత్యధికంగా పరిగి ప్రాంతంలోనే వరి సాగవుతోంది. గండేడ్ మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. అదేవిధంగా జిల్లాలో 8,100 హెక్టార్లలో వేరుశనగ పంట సాగవుతుండగా.. ఇందులో సగం మండల పరిధిలో సాగవుతోంది. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడి చినా ఇప్పటికీ చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవల హుధూద్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు చివరకి నిరాశే మిగిలింది. వర్షాల జాడలేకపోవడంతో డివిజన్ పరిధిలో అంతటా పొలాలన్నీ దుక్కులకే పరిమితమయ్యాయి. పాతాళగంగను తోడేదెలా.. రబీలో ప్రధానంగా సాగయ్యే వరిపంటకూ కష్టకాలం వచ్చింది. ప్రధాన ప్రాజెక్టులేవీ లేకపోవడంతో వరిసాగు భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో డివిజన్ పరిధిలోని రైతులంతా బోరుమోటర్లపైనే ఆధారపడి వరిసాగు చేస్తున్నారు. రబీలో సాధారణ విస్తీర్ణం 15,550 హెక్టార్లు. అధికంగా పరిగి, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో సాగవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వరిసాగకు కీలకమైన పాతాళగంగమ్మను పైకి తీసుకురావడం రైతులకు కష్టంగా మారింది. పొలాలకు కనీసం రెండు గంటలు సైతం కరెంటు అందకపోవడంతో బోరుమోటర్లు నడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వరి సాగు ముందుకు సాగనిపరిస్థితి నెలకొంది. -
ఆశల సాగు
కల్హేర్: అసలే సాగునీరు అంతంత మా త్రం...ఆపై అనావృష్టి..ఖరీఫ్లో వేసిన పంటలన్నీ నాశనమయ్యాయి. వ్యవసాయమే తప్ప మరొకటి తెలియని రైతన్నలు భూమాతనే నమ్ముకుని రబీకి సిద్ధమయ్యారు. కానీ ఈ సారి సొంత భూముల్లో కాకుండా శిఖం భూముల్లో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. సాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే కావడంతో ప్రత్యామ్నాయంగా తేమశాతం ఎక్కువగా ఉండే నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు దృష్టి మళ్లించారు. అనుమతులు లేకున్నప్పటికీ మరో దారిలేక శిఖం భూమిని దున్ని శనగ విత్తనాలు వేసుకుంటున్నాడు. సాగర్లో శనగసాగు జిల్లాలో విస్తరించిన నిజాంసాగర్ శిఖం భూములు వేల ఎకరాల వరకు ఉంటాయి. ఈసారి వర్షాలు అంతంతమాత్రమే కావడంతో నిజాంసాగర్ శిఖం భూముల్లో నీరు చేరలేదు. ప్రస్తుతం 10 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండడంతో అందులో శనగ పండించేందుకు సమీప ప్రాంతాల రైతులు సిద్ధమయ్యారు. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, బాచేపల్లి, ఖానాపూర్(బి), దామర్చెరువుతో పాటు నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన రైతులు ఒకరి చూసి మరొకరు శనగ విత్తనాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం వైపు పరుగు తీస్తున్నారు. వారం రోజులుగా సుమారు 500 మందికు పైగా రైతులు శిఖం భూముల్లో హద్దులు ఏర్పాటు చేసుకుని దుక్కి దున్నడంతో పాటు విత్తనం కూడా వేసేశారు. మరికొంత మంది ఇపుడిపుడే దుక్కికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ శిఖం భూముల్లో 200 వరకు నాగళ్లు, 20 వరకు ట్రాక్టర్లతో దుక్కి పనులు జరుగుతున్నాయి. దేవుడిపైభారం వేసి నిజాంసాగర్ శిఖం భూముల్లో సాగు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా రైతులు ఈ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేస్తున్నా, అధికారులు ఎప్పుడొచ్చి అడ్డుకుంటారోనన్న భయంతో హడావుడిగా పనులు కానిస్తున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకోకపోయినా, ప్రతి యేటా సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్కు వదిలే 3 టీఎంసీల నీరు వచ్చినా శిఖం భూములు మునిగిపోతాయి. అయినప్పటికీ వరుణుడు ఈ రబీలోనూ కరుణ చూపడన్న అంచనాలతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. శిఖం భూముల కోసం గొడవలు ఒకరిని చూసి మరొకరు ఇలా రైతులంతా నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధం కావడంతో శిఖం భూమి కోసం డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు రైతులు భూమి కోసం ఘర్షణకు దిగుతున్నారు. గొడవలకు దిగకుండా రైతులు సంయమనం పాటిస్తే కరువు కాలంలో కాసిన్ని శనగలైనా పండించుకుని బతికిపోవచ్చని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. -
రబీ సాగు అంచనా 1,86,025
వరంగల్ : రబీ సీజన్ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా... రైతులు 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ సీజన్కు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువుల అవసరాన్ని ప్రణాళికలో పొందుపరిచారు. ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఖరీఫ్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు ఆలస్యమైంది. ఈ పంటలు చేతికొచ్చే సరికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ... రబీలోనైనా కాలం కలిసివస్తుందేమోనని ఆశతో రైతులు ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సాగు చేయని రైతులు రబీ సాగుకు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఖరీఫ్లో వర్షాలు సానుకూలంగా కురవనందున వరి సాగు బాగా తగ్గింది. ఈ రబీలోనైనా వరి సాగు చేపట్టాలని మధ్య తరహా నీటి ప్రాజెక్ట్ల పరిధిలోని ఆయకట్టు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని పాకాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి నీరు చేరింది. ఈ కారణంగా రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఇక జిల్లాలో పూర్తిగా వర్షాధార వ్యవసాయమే అయినందున కాలం కలిసొస్తేనే రబీలో మెట్ట పంటల సాగు పెరిగే అవకాశం ఉంది. 49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరం జిల్లాలో రబీ సాగుకు 49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వేరుశనగ విత్తనాలు 26 వేల క్వింటాళ్లు, శనగలు 2,100 క్వింటాళ్లు, పెసర్లు 2,600 క్వింటాళ్లు, మినుములు 2,000 క్వింటాళ్లు, జొన్నలు 1,000 క్వింటాళ్లు, మొక్కజొన్నలు 10,000 క్వింటాళ్లు, 100 క్వింటాళ్ల చొప్పున పొద్దు తిరుగుడు, నువ్వులు, బొబ్బెర్లు, ఉలువలు 300 క్వింటాళ్లు, వరి విత్తనాలు 5 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. రబీలో కిలో మొక్కజొన్న విత్తనాలకు రూ.25, వరికి రూ. 50, ఉలువలకు రూ.32, మిగతా అన్ని రకాల విత్తనాలకు 33 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గత ఏడాది విత్తనాలపై సబ్సిడీ 50 శాతం ఉండగా... ఈ ఏడాది 33 శాతానికి తగ్గించారు. ఎరువుల ప్రణాళిక రబీ సీజన్లో 1,30,322 టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. యూరియా 67,396 టన్నులు, డీఏపీ 20,219 టన్నులు, కాంప్లెక్సు 26,959 టన్నులు, ఏంఓపీ 10,783 టన్నులు , ఎస్ఎస్పీ 4,964 టన్నులు అవసరమని అంచనా వేశారు. -
రబీకి సిద్ధమవుతున్న రైతన్న
బషీరాబాద్: రబీ సీజన్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూ ములను దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. చెరువులు నీటితో కళకళలాడుతుండటంతో వేరుశనగ పంట కోసం విత్తనాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా మారారు. అక్టోబర్ మొద టి వారం నుంచి రైతులు వేరుశనగ విత్తుకునేందుకు అనుకూలమని బషీరాబాద్ మండల వ్యవసాయాధికారి కృష్ణమోహన్ తెలిపా రు. నాలుగు నుంచి ఆరు నెలల క్రితం పండిన వేరుశనగ విత్తనాలను రైతులు విత్తుకోవాలని సూచించారు. ఏడాది క్రితం పండించిన విత్తనా లు వేస్తే దిగుబడి ఎక్కువగా రాదని తెలి పారు. నాణ్యత కలిగిన వేరుశనగను విత్తుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా అనుమానాలుం టే తమను సంప్రదించాలని ఆయన తెలిపారు. -
రబీలో పెసర సాగు.. బాగు
కొనకనమిట్ల :ఖరీఫ్లో మాదిరి రబీలోనూ పెసర పంట సాగు అన్ని విధాలా అనుకూలమని దర్శి ఏడీఏ మాలకొండారెడ్డి చెప్పారు. సాధారణంగా మెట్ట రైతులు ఖరీఫ్కు సంబంధించి జూన్ నెలలో పెసర సాగు చేస్తారు... రబీలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది... బోర్లు ఉన్న రైతులు వేసవిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ పెసర సాగు చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రశ్న : పెసర సాగుకు ఏయే నేలలు అనుకూలం? జవాబు : పెసర సాగుకు చౌడు, మురుగు నీరు నిలిచే భూములు కాకుండా మిగతా అన్ని భూములు అనుకూలమే. ప్రశ్న : విత్తనశుద్ధి ఎలా చేయాలి, ఏయే రకాలు అనుకూలం? జవాబు : ఎకరాకు 6 నుంచి 12 కేజీల విత్తనాలను 30 గ్రాముల కార్బోసల్ఫాన్, 5 గ్రాములు ఇమిడాక్లోఫ్రిడ్, 5 గ్రాములు ధమోమితాక్షిమ్తో కలిపి శుద్ధి చేయాలి. ఎల్ జి.జి-407, 460, 450, 410 రకం విత్తనాలు అనువైనవి. 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రశ్న : ఏయే ఎరువులు వాడాలి? జవాబు : పశువుల ఎరువు అయితే రెండు టన్నులు, నత్రజని 8 కేజీలు, భాస్వరం 20 కేజీలు చొప్పున వాడాలి. ప్రశ్న : పెసరలో అంతర పంటలు సాగు చేయవచ్చా? జవాబు : పెసర పంటలో పత్తి, కంది సాగు చేసుకుంటే మంచిది. ప్రశ్న : పైరులో వచ్చే తెల్లదోమ నివారణకు ఏమి చేయాలి? జవాబు : తెల్లదోమ నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 ఎంఎల్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా ట్త్రెజోపాస్ రెండు ఎంఎల్ను లీటరు నీటికి, లేదా ఎసిటామిఫ్రెడ్ను రెండు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రశ్న : లద్దె పురుగు నివారణకు ఏమి చర్యలు చేపట్టాలి? జవాబు : లద్దె పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ ఒక ఎంఎల్ లీటరు నీటికి, క్లోమోపైరీపాస్ రెండు ఎంఎల్ లీటరు నీటికి, నొవాల్యురాన్ ఒక ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రశ్న : ఏయే తెగుళ్లు వ్యాపిస్తాయి. నివారణ ఎలా? జవాబు : పెసరలో బూడిద తెగులు, ఆకు ముడత తెగులు, పల్లాకు తెగులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు కార్బెండైజమ్, మైక్రోబూటానిల్, డైఫిన్ కానోజోల్, ఎసిఫెట్, ప్రొఫినిల్, మోనోక్రోటోపాస్, ఎసిటామఫ్రైడ్, ఇమిడా క్లోఫైర్ మందులు వాడితే ఫలితం ఉంటుంది. -
చెప్పిందొకటి.. చేసిందొకటి
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెడార్థం తీస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్న ఆయన.. మూడు నెలల కాలయాపన తర్వాత కొర్రీలు వేస్తున్నారు. మెలికలు పెడుతూ రుణ మాఫీకి పలువురిని దూరం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న గడువును డిసెంబర్ 31, 2013 నాటికే పరిమితం చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2013-14 రబీ సీజన్కు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేలాది మంది రైతులు రుణాలు తీసుకున్నారు. బాబు తీరుతో జిల్లాలో దాదాపు 25వేల మందికి రైతులకు మాఫీ వర్తించని పరిస్థితి నెలకొంది. తెలంగాణ తరహాలోనే ఇక్కడా ఈ ఏడాది మార్చి 31లోపు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇదిలాఉంటే కుటుంబంలోని సభ్యులంతా అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఈనెల 14న జీవో నెంబర్ 174 జారీ చేసింది. ఈ మొత్తంతో రైతు కుటుంబాలకు చేకూరే ప్రయోజనం అంతంతమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రుణాల మాఫీ మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా లేవని రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇక మహిళల డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన చంద్రబాబు.. రుణాలను చెల్లించొద్దని కూడా నమ్మబలికారు. ఆయన మాటలతో గత ఏప్రిల్ నుంచి మహిళలు రుణాలను చెల్లించడం మానేశారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల మాఫీ లేదని.. సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ మాత్రమే ఇస్తామని ప్రకటించడం మహిళలను నిరాశకు గురిచేస్తోంది. ఈ లక్ష కూడా ఎప్పుడిస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ముఖ్యమంత్రి ప్రకటనే తరువాయి.. మహిళల నుంచి వడ్డీ, అసలు వసూలు చేయాలని సెర్ఫ్ ఆదేశించింది. ఇప్పటికే ఐకేపీ సిబ్బంది మహిళలపై ఒత్తిళ్లు తీసుకొస్తుండటం గమనార్హం. -
రుణ మాఫీకిచంద్ర గ్రహణం
రుణాలు చెల్లించని రైతులపై భారీ వడ్డన 12 నుంచి 13.5 శాతం ‘వడ్డిం’పు జిల్లా రైతాంగంపై రూ.102 కోట్ల భారం చంద్రబాబు తప్పుడు హామీల ప్రభావం మనవాడే మారాజా... అంటే మరి నాలుగు తన్నమన్నారట. రుణమాఫీ హామీతో చంద్రబాబు అందలమెక్కారు. అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రతి రైతుకు రూ.1.5 లక్షల రుణం రద్దు చేస్తామని ప్రకటించారు. విధి విధానాలు జారీలో నిర్లక్ష్యం చేశారు.బ్యాంకర్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. బకాయిలు కట్టని జిల్లా రైతులపై రూ.102 కోట్ల వడ్డీ భారం మోపారు. విశాఖ రూరల్ : చంద్రబాబు తప్పుడు హామీలను నమ్మి రైతులు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. పీఠాన్ని చేజిక్కించుకున్నాక మాటమార్చారు. రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. రుణాలు రద్దు చేయకపోగా.. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోడానికి కమిటీ వేసి తాత్సారం చేస్తున్నారు. ఇటీవలే ప్రతి రైతుకు రూ.1.5 లక్షల రుణం రద్దు చేస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రుణమాఫీ విధి విధానాలపై బ్యాంకులకు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవడంతో రైతన్నలపై గతేడాది తీసుకున్న రుణాలపై 12 నుంచి 13.5 శాతం మేర వడ్డీ పడనుంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్లో 1,32,375 మందికి రూ.640 కోట్లు, రబీ సీజన్లో 14,548 మందికి రూ.104 కోట్లు, 287 మంది కౌలు రైతులకు రూ.56.1 లక్షలు,పావలా వడ్డీ కింద 7505 మందికి రూ.2.65 కోట్ల పంట రుణాలు అందజేశారు. దీంతో పాటు రూ.లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చారు. జిల్లాలో 2013-14 సంవత్సరంలో బంగారం, వ్యవసాయేతర రుణాలు మినహా కేవలం పంట రుణాల కింద రూ.760 కోట్ల రుణాలున్నాయి. 2,10,881 మంది రైతులు బ్యాంకులకు బకాయి పడ్డారు. ఏడాది దాటితే రూ.13.5 శాతం వడ్డీ రైతులు గతేడాది జూలై 31లోపు రుణాలు పొందారు. ఆలోపు రుణం పొందిన వారికి బీమా వర్తిస్తుందనే కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఏడాదిలోపు రుణం చెల్లిస్తే 3 శాతం నాబార్డ్, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. రైతన్నలు ఏడాదిలోపు రుణాలు రెన్యువల్ చేసుకుంటే వారికి వడ్డీలేని రుణం దక్కేది. రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదు. రుణాలు రద్దవుతాయనే ఆలోచనలో ఉండటంతో ఈ ఖరీఫ్ సీజన్కు రుణాలు రెన్యువల్ కాలేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులను బట్టి 12 నుంచి 13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంటుంది. జూలై 31లోపు మఖ్యమంత్రి ప్రకటించిన రుణమాఫీ వర్తిస్తే ఎలాంటి సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో 2,10,881 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.760 కోట్లకు రూ.102 కోట్ల వడ్డీ భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. ఇన్స్పెక్షన్ చార్జీలు రూపేణా బ్యాంకు రుణం ఉన్న ప్రతి రైతు రూ.150 భరించాల్సి ఉంది. ఈ కారణంగా రూ.3.16 కోట్లు రైతులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణ పేరుతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఈ అదనపు వడ్డీ భారంపై మాత్రం నోరు మెదపడం లేదు. కొత్త రుణాలందక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు వేసుకుంటున్న రైతన్నలపై వడ్డీ భారం తప్పించని పక్షంలో వారు మరింత నష్టపోనున్నారు. -
‘వర్జీనియూ’ రైతుకు రుణమాఫీ లేనట్టేనా ?
జంగారెడ్డిగూడెం : రైతు రుణమాఫీ విషయంలో ఆర్బీఐ బుధవారం తీసుకున్న కొత్త నిర్ణయంతో పొగాకు రైతులకు రుణమాఫీ లేనట్లే అనిపిస్తోంది. ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయం ప్రకారం ఖరీఫ్కు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామని చెప్పడంతో రబీలో పొగాకు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక రుణమాఫీ లేనట్టేనని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో అత్యధికం ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలో అత్యధికంగా పొగాకు పంటను జిల్లాలో ఏజెన్సీ మెట్ట ప్రాంత రైతులు పండిస్తున్నారు. సాధారణంగా జిల్లాలో వర్జీనియా పంట ఎక్కువగా రబీ సీజన్లోనే వేస్తారు. బ్యాంకులు కూడా అత్యధికంగా వర్జీనియా రైతులకు బ్యారన్కు సుమారు రూ.6 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారుు. ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని వర్జీనియా పొగాకు నాణ్యమైనదిగా చెబుతారు. దీంతో ఇక్కడ వర్జీనియా పంటను రైతులు అధికంగా పండిస్తున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు పొగాకు బోర్డు ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తోంది. తాజాగా రిజర్వు బ్యాంకు అధికారులు ఖరీఫ్లో తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్కు అనుమతి ఇవ్వడంతో వర్జీనియా రైతుల రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఖరీఫ్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేస్తారు. వీటికి ఇచ్చే రుణాలు ఎకరాకు సుమారు రూ. 20 వేలు మాత్రమే ఉంటుంది. మొత్తంగా లక్ష రూపాయలకు మించి రుణ సదుపాయం లేదు. దీంతో ఆర్బీఐ బుధవారం తీసుకున్న నిర్ణయంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో వర్జీనియా పంటను నమ్ముకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 30 వేల హెక్టార్లలో సాగు జిల్లాలో మొత్తం 5 పొగాకు వేలం కేంద్రాల పరిధిలో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో సుమారు 30 వేల హెక్టార్లలో రైతులు వర్జీనియా పొగాకు పండిస్తున్నారు. వర్జీనియా పొగాకు పంట ద్వారా కేంద్రప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేస్తోంది. దీంతో కేవలం వర్జీనియా పండించే రైతుల వద్ద నుంచే కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో సుమారు 13 వేల మంది రైతులు 14 వేల లెసైన్సులు కలిగి ఉన్నారు. ఒక్కొక్క లెసైన్సుకు బ్యాంకులు సుమారు రూ.6 లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. అంటే మొత్తం 14 వేల లెసైన్సులకు రూ.840 కోట్లు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. ఇప్పటికే రుణాల రీషెడ్యూల్ చేయించుకున్న రైతులు ఇప్పటికే వర్జీనియా పొగాకు రైతులు గతంలో తీసుకున్న రుణాలకు రీషెడ్యూల్ చేయించుకున్నారు. ఈ రుణాలు తీర్చడానికే రైతులు సతమతమవుతున్నారు. రీషెడ్యూల్ భారం ప్రతి రైతుకు రుణం తీరే నాటికి సుమారు 24 శాతం వడ్డీ పడనున్నట్లు ఒక అంచనా. గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని పంటలు పండించిన రైతుకు ప్రస్తుతం గిట్టుబాటు ధరలేక వచ్చిన రేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. కొంతమంది రైతులు మంచి రేటు వస్తుందనే ఆశతో ఇంకా పంటను తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఇలా 40 శాతం వరకు పంట రైతుల వద్దే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటువంటి సమయంలో రైతులకు ఇస్తానన్న రుణమాఫీని, రీషెడ్యూల్ పేరిట మోసం చేయడమే కాక, కేవలం ఖరీఫ్కే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించడం రైతుల వెన్నుపై రుణాల గుదిబండను మోపడమే పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడు దేవరపల్లి, జంగారెడ్డిగూడెం బహిరంగ సభల్లో వర్జీనియా రైతులకు కూడా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో వర్జీనియా పొగాకును పండించే 13 వేల మంది రైతులతో పాటు, వర్జీనియా పంటపై ఆధారపడిన ఇతర వర్గాలవారు 40 వేల మంది జీవిస్తున్నారు. ప్రస్తుత నిర్ణయంతో రైతుతో పాటు వీరికి ఆర్థిక భద్రత లేకుండా పోతోందని పొగాకు రైతులు కరాటం రెడ్డినాయుడు, ఉద్దండం ఏసుబాబు, సయ్యద్బాజీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
సన్న బియ్యం..ధర భారం
కొత్తగూడెం: ఖరీఫ్ కలిసి వచ్చేలా లేదు..రబీ సీజన్లో రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా నిండుకున్నాయి. ఇక బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్కు రూ.200 మేరకు బియ్యం ధరలను వ్యాపారులు పెంచేశారు. ఖరీఫ్లో వర్షాలు సక్రమంగా కురవకపోతే ఈ రెండు నెలల్లో కిలో బియ్యం ధర రూ.70కి చేరవచ్చని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద స్టాక్ లేకపోవడం, నల్లగొండ జిల్లా నుంచే అధికంగా బియ్యం ఇక్కడకు సరఫరా అవుతుండటంతో అక్కడి బడా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బియ్యం మార్కెట్లోకి వచ్చాయి. అప్పటి వరకు సన్నబియ్యం మొదటిరకం రూ.40ల వరకు ఉన్న ధరను రూ.38కి తగ్గించి వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెల నుంచి బియ్యం ధరలు ఎగిసి పడుతున్నాయి. జిల్లాలోని మిల్లుల్లో స్టాక్ అయిపోవడం, గత ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం ఎక్కువగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడకు చెందిన వ్యాపారులు అధికంగా కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచే బియ్యం ఎక్కువగా జిల్లా మార్కెట్కు వస్తున్నాయి. అక్కడకు చెందిన బడా వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలను ఏకపక్షంగా పెంచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏడునెలల్లో రూ.12 పెంపు.. గత ఏడాది వర్షాలు సకాలంలో కురవడం, ఖరీఫ్లో సాంబమసూరి ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో డిసెంబర్లో రూ.38 ఉన్న కిలో బియ్యం ఇప్పుడు రూ.50కి చేరింది. రైతుల వద్ద ధాన్యం పూర్తిగా అయిపోవడం, వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యం సైతం చివరి దశకు చేరుకోవడంతో అమాంతం ధర పెరిగిపోయింది. బియ్యం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే తమ పరిస్థితి ఏమిటని పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నల్లగొండ జిల్లా నుంచి మాత్రమే బియ్యం దిగుమతి ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. అదే మన జిల్లాలో అందుబాటులో ఉంటే ఒకటి, రెండు రూపాయలైనా తక్కువగా ఉండేదని పలువురు అంటున్నారు. ఒకవేళ వర్షాలు వస్తే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి కాని ధాన్యం అందుబాటులోకి రాదు. లేనిపక్షంలో ఈ బియ్యం ధరలకు అడ్డూఅదుపు ఉండదని వాపోతున్నారు. రైస్మిల్లులకూ గడ్డుకాలం.. దళారులంతా నల్లగొండ జిల్లాలోని రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించారు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో స్టాక్ లేదు. మిల్లులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. జిల్లాలోని తల్లాడలో 12 పారా బాయిల్రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు ఇప్పటికే మూత పడ్డాయి. కొత్తగూడెంలో ఎనిమిది రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు, పాల్వంచలో రెండు మిల్లులు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు లేకపోలేదు. అధికారులు స్థానికంగా ఉన్న మిల్లులకు ధాన్యం తరలించేందుకు చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా దళారులు ఇష్టారాజ్యంగా ధాన్యం కొనుగోలు చేసినా అధికారులెవరూ పట్టించుకోకపోవడం మరో కారణంగా చెప్తున్నారు. గత ఏడాది బియ్యం ధరలు పెరగడంతో హడావిడిగా కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు రూ.30లకే సన్నబియ్యాన్ని అందించారు. బయట మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటం, కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు తగ్గించిన ధర ప్రకారం తమకు బియ్యం ఇవ్వకపోవడంతోనే నష్టపోవాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు కూడా సబ్సిడీ ఇస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన బియ్యం ధరలివే... బియ్యం ప్రస్తుతం కేజీ రూ.50 వరకు ఉంది. గత ఆరు నెలల కాలంలో రూ.22 వరకు బియ్యం ధర పెరగడం విశేషం. -
రుణ ప్రదక్షిణ
సాగుపెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూరైతుల ప్రదక్షిణలు కొత్తవి ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకంజ రుణమాఫీపై ప్రభుత్వం మెలిక కాలయాపన నేపథ్యంలో సందిగ్ధం ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీ ఒక కొలిక్కి రాకపోవడంతో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మదుపుల కోసం మహిళల పుస్తెలను కుదవ పెట్టేందుకు రైతులు వెనుకాడటం లేదు. నర్సీపట్నం : ఖరీఫ్ ప్రారంభంతో అన్నదాతలను పెట్టుబడుల కష్టాలు చుట్టుముట్టాయి. జిల్లాలో 4,56,445 మంది రైతులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది వ్యవసాయ మదుపుల కోసం ఏటా బ్యాంకులపైనే ఆధారపడుతుంటారు. జిల్లాలో సాగు సాధారణ విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. వీటిల్లో వ్యవసాయ పనులకు మదుపుగా 2,00,304 మంది రైతులకు సుమారు రూ.700 కోట్లు రుణాలిచ్చేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారుల లక్ష్యానికి.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఖరీఫ్వి మార్చి చివరిలోగా, రబీ బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించాలి. మళ్లీ ఈ ఏడాదికి రుణాలు తీసుకోవాలి. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీతో బకాయిలు పేరుకుపోయాయి. పెరిగిన పెట్టుబడులు ఎరువులు, పురుగు మందుల ధరలు బాగా పెరిగిపోయాయి. కూలీల మదుపులూ ఎక్కువయ్యాయి. జిల్లాలో ఎకరా చెరకు మొక్కతోట సాగుకు 67,190లు, అదే కార్శి తోట అయితే రూ.48,315లు ఖర్చవుతోంది. వరికి రూ.24,700లు, మొక్కజొన్నకు రూ.19,600లు, వేరుశనగకు రూ.13,600లు, పొద్దుతిరుగుడుకు రూ.9,900లు, చోడికి రూ.13,400లు, కందులుకు రూ.10,400లు, పెసలుకు రూ.5,350లు, మినుములుకు రూ.5,200లు ఖర్చవుతోంది. అందరికీ కాకపోయినా బ్యాంకులు కొందరికైనా గతంలో రుణాలిచ్చేవి. ప్రస్తుతం చంద్రబాబు హామీతో బ్యాంకర్లు వేచి చూసే ధోరణిని పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు రుణాల కోసం వెళితే ససేమిరా అంటూ తిరిగి పంపుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ అమలు చేసుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉన్న బంగారు వస్తువులను తాకట్టు పెడుతున్నారు. బంగారంపై కూడా కొన్ని బ్యాంకులు రుణాలివ్వడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రూపాయలు వడ్డీపై అప్పులు తెచ్చి నిండా మునిగిపోతున్నారు. -
కాకిలెక్కలతో ఇక్కట్లు..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ ఏడాది రబీ సీజన్లో ధాన్యం దిగుబడులపై సంబంధిత శాఖల అంచనాలు కాకి లెక్కలని తేలిపోయింది. అధికారులు రూపొందించిన పొంతనలేని అంచనాలతో ధాన్యం విక్రయించేం దుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. దీనికితోడు ధాన్యం కొనుగోళ్లలోనూ అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా పంట దిగుబడుల అంచనాలు రూపొందిస్తాయి. ఏటా వరి కోతల సీజన్లో క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్లు నిర్వహించి దిగుబడులు అంచనా వేస్తారు. ఆయా మండలాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రణాళిక శాఖకు సంబంధించి గణాంక అధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈసారి మార్కెట్కు వచ్చిన ధాన్యం.. అధికారులు రూపొందించిన అంచనాలను పరిశీలిస్తే ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగినట్లు స్పష్టమవుతోంది. వాస్తవాలకు దూరంగా అంచనాలు.. ఈ ఏడాది రబీ కొనుగోలు సీజన్లో సుమారు 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి కాస్త అటు.. ఇటుగా ఈ అంచనాలు ఉండాలి. కానీ.. మార్కెట్లోకి వచ్చిన ధాన్యం 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు పైనే. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఇప్పటి వరకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే వాస్తవానికి.. అధికారుల అంచనాలకు ఏ స్థాయిలో వ్యత్యాసం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లా అధికార యంత్రాంగం ఈ అంచనాల మేరకే ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సరిపడా గన్నీ బ్యాగులు, హమాలీ, ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ.. అంచనాలకు అందని స్థాయిలో ధాన్యం మార్కెట్ను ముంచెత్తడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అన్నదాతల ఇక్కట్లు.. అధికారుల వైఫల్యం కారణంగా ఈ రబీ కొనుగోలు సీజన్లో అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. అకాల వర్షాలతో కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఏకంగా రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చింది. ముగుస్తున్న కొనుగోళ్లు.. రబీ కొనుగోలు సీజన్ దాదాపు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 181 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి 1.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో సుమారు 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టం మిల్లింగ్ నిమిత్తం రైస్ మిల్లులకు తరలించారు. ఇంకా సుమారు 1.49 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రాన్స్పోర్టు బిల్లుల చెల్లింపుల్లో చేతివాటం కొనుగోలు కేంద్రాల నుంచి ైరె స్ మిల్లులకు తరలించిన లారీ యజమానులకు బిల్లుల చెల్లింపుల్లో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధాన్యం రవాణాకు లారీల కొరత ఉండటంతో రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ అధికారులు రహదారులపై వెళ్లే లారీలను బలవంతంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణాకు వినియోగించారు. అయితే.. ఈ లారీ యజమానులకు చెల్లించాల్సిన బిల్లులో సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. -
ఊరించి.. ఉసూరుమనిపించారు
మోర్తాడ్, న్యూస్లైన్ : ఊరించి ఉసూరుమనిపించినట్లు ఉంది ప్రభుత్వం తీరు. పంట రుణాల మాఫీలో కొన్ని మెలికలు పెడుతూ ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణ మాఫీ కొందరికే వ ర్తించే విధంగా ఉందని వారు పేర్కొంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ ఒకటి తర్వాత ఖరీఫ్, రబీ సీజనుల్లో లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించనుంది. దీంతో రెండు, మూడు ఏళ్లుగా అతివృష్టి, అనావృష్టిల కారణంగా పంట రుణాలు చెల్లించని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. 2013 జూన్ ఒకటో తేదీ తర్వాత పంట రుణాలు తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో 2,26,282 మంది రైతులకు సంబంధించి రూ. 1,863.65 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణాలను రెగ్యులర్గా రెన్యువల్ చేయించేవారికే రుణమాఫీ పథకం వర్తిస్తుందన్న మాట. జిల్లాలోని వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు స్వల్ప కాలిక రుణాలతోపాటు, దీర్ఘ కాలిక రుణాలు ఇచ్చాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పంపుసెట్లు, పైప్లైన్, వ్యవసాయ పరికరాల కోసం దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చేశాయి. లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ భూమి ఎంత ఉన్నా లక్ష రూపాయలలోపే రుణాలు తీసుకున్నారు. కొందరు రైతులు మాత్రమే లక్ష రూపాయలకు మించి పంట రుణం పొందారు. ఎలక్షన్ల సందర్భంగా పంట రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో చాలా మంది రైతులు రెండు మూడేళ్లుగా పంట రుణాలు చెల్లించడంలేదు. 2013 జూన్ ఒకటికి ముందుగా పంట రుణం తీసుకున్నవారు రుణం చెల్లిస్తే మాఫీ వర్తించదని భావించి రుణం చెల్లించలేదు. అలాంటి రైతులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే. కాగా ప్రభుత్వం బ్యాంకర్లతో సోమవారం మరో దఫా సమావేశం కానుండడం వారిలో ఆశలను సజీవంగా ఉంచుతుంది. రుణ మాఫీ విషయంలో మార్పు చేర్పులుండవచ్చని వారు భావిస్తున్నారు. రుణ మాఫీ విధి విధానాలు ఖరారైతే స్పష్టత వస్తుంది. ఏది ఏమైనా పంట రుణం మాఫీ విషయం లో ప్రభుత్వం చేసిన ప్రకటన కొందరు రైతులకు సంతోషం కలిగించగా మరి కొందరికి నిరాశను కలిగించింది. -
ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అతివృష్టి, అనావృష్టితో పంట నీటమునిగి నష్టాల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడం, దిగుబడి తగ్గడం, తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో సుమారు 3.26 లక్షల మంది రైతులు రూ.1,671 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తీసుకున్న రైతుల్లో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కాగా ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.. కొలువుదీరనున్న నూతన సర్కారు.. ఈ నేపథ్యంలో రుణమాఫీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. నష్టాల ఊబిలో అన్నదాతలు ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల లాడారు. ఖరీఫ్ ఆరంభంలో కురిసిన అధిక వర్షాలు, అతివృష్టి కారణంగా మొలక దశలోనే పంటలు నీట మునిగాయి. పలు మండలాల్లో పత్తి, సోయా పంటలను రెండు సార్లు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ఎరువుల, విత్తనాలు ధరలతో సాగు వ్యయం పెరిగింది. దిగుబడి మాత్రం ఆశించిన మేరకు రాలేదు. చేతికందిన పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తరలించగా, అక్కడ కూడా అకాల వర్షాలు అన్నదాతలను వదల లేదు. చాలా చోట్ల ధాన్యం తడిసి రంగు మారింది. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కారు చేతులెత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో మునిగిపోయారు. నాణ్యతా లోపం పేరుతో దళారులు, ప్రైవేటు వ్యాపారులు ధరలో భారీగా కోత విధించారు. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు పంట రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అన్నదాతలను ఊరిస్తోంది. ఇచ్చిన హామీపై కొత్తగా ఏర్పడనున్న సర్కారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. -
మాఫీ డేస్ వచ్చేనా...
2,10,881 మంది రైతుల ఎదురుతెన్నులు జిల్లాలో మాఫీ చేయాల్సింది రూ.1046 కోట్లు సాధ్యం కాదంటున్న బ్యాంకర్లు చెల్లించాలని రైతులపై ఒత్తిడి నోటీసులు జారీ చేస్తున్న అధికారులు అన్నదాతలకు నరకయాతన విశాఖ రూరల్, న్యూస్లైన్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ అయిన రుణ మాఫీ అమలవుతుందా? గద్దెనెక్కేశాం కదా అని హామీని గాలికొదిలేస్తుందా? ప్రస్తుత పరిస్థితుల్లో వేల కోట్ల రుణాలను రద్దు చేసే అవకాశముందా? రాష్ట్ర పరిస్థితి తెలుసుకోకుండానే చంద్రబాబు హామీ ఇచ్చేశారా? లేదా రైతులను మభ్య పెట్టి ఓట్లను రాబట్టుకోవడానికి తప్పుడు హామీలు గుప్పించారా? ఇలా అనేక సందేహాలు అన్నదాతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. మూడేళ్లుగా ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు రుణ మాఫీ హామీ కొండంత బలాన్నిచ్చింది. టీడీపీకి అధికారం కట్టబెట్టాక ఇప్పుడు దీనిపై రోజుకో ప్రకటనలు చేస్తుండడం పట్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణాలను రద్దు చేస్తారన్న ఆశతో రైతులు అప్పులు చెల్లించలేదు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో బ్యాంకర్లు మొత్తంగా రూ.1046 కోట్లను రైతులకు రుణంగా ఇచ్చాయి. ఈమేరకు రుణ మాఫీ సాధ్యం కాదని, ఇప్పటి వరకు దానిపై ఎటువంటి నిర్ణయం జరగలేదని,యథావిధిగా చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రుణ మాఫీ అవుతుందో లేదో తెలియక.. పంట నష్టాలతో పెట్టుబడులు రాక.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక రైతులు నరకయాతనకు గురవుతున్నారు రుణమాఫీతో 2,10,881 మందికి లబ్ధి : గత ఖరీఫ్లో జిల్లాలో రూ.600 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించారు. 1,32,375 మందికి లక్ష్యాన్ని మించి రూ.640 కోట్లు అందజేశారు. రబీ 2013-14 సీజన్కు రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,548 మందికి రూ.104 కోట్లు అప్పులిచ్చారు. జిల్లాలో గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలను మాత్రమే పంట రుణాల కింద ఇచ్చారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు రూ.11.73 కోట్లను వడ్డీ లేని రుణాలుగా బ్యాంకుల ద్వారా అందించారు. గతేడాది వరుసగా తుపాన్లు, అల్పపీడనం రావడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఫలితంగా 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేకపోయారు. రుణాలు చెల్లించకపోతే నోటీసులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికలకు మూడు నెలల ముందు చేపట్టిన పాదయాత్ర నాటి నుంచి రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఎన్నికల్లో విజయం సాధించాక తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనే చేస్తానని అనేకసార్లు ప్రకటించారు. అసలు ఆ హామీ ఆచరణయోగ్యమో? కాదో? అన్న విషయాన్ని పక్కనపెడితే ఆ ప్రకటన రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. కానీ ప్రస్తుతం చంద్రబాబు ఆ హామీపై భిన్నమైన ప్రకటనలు చేస్తుండడంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సకాలంలో రుణాలు చెల్లించని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీపై నిర్ణయం జరగలేదని, ఎటువంటి మార్గదర్శకాలు లేవని యథావిధిగా రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారో లేదో తేలిపోనుంది. కరువు, వరదలతో పెట్టుబడులు కూడా కోల్పోయిన తమను రుణమాఫీతో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వెంటనే అమలు చేయాలి రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయాలి. ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రస్తుతం బ్యాంక్లలో ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేస్తేనే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొని పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. - అప్పలస్వామి నాయుడు, రైతు, వెంకుపాలెం మాఫీ చేస్తేనే బతుకు నాది అచ్యుతాపురం మండలం పెదపాడు. సహకార బ్యాంకులో రూ. 5వేలు, ఇతర బ్యాంకుల్లో రూ.25 వేలు వ్యవసాయ రుణంగా తీసుకున్నాను. వడ్డీతో రూ. 70వేలు అయింది. రానున్న ఖరీఫ్కు పెట్టుబడి లేదు. అప్పు తీరిస్తేనే బ్యాంకర్లు మళ్లీ రుణం ఇస్తామంటున్నారు. టీడీపీ రుణమాఫీ హామీ అమలవుతుందోలేదో? పాత రుణాలు మాఫీ అయి కొత్తగా రుణాలు ఇస్తేనే బతుకు. లేదంటే కష్టమే. - బండి అప్పారావు -
50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కలెక్టరేట్, న్యూస్లైన్ : రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రైతుల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. మార్కెటింగ్, డీఆర్డీఏ, పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం జేసీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతేడాది రైతుల వద్ద నుంచి 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రోజూ ధాన్యం రైస్మిల్లులకు తరలించడానికి పౌర సరఫరాల శాఖ, ఐకేపీ ద్వారా 125 లారీలు, డీటీసీ ద్వారా 75 లారీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకోని మిల్లర్లపై రూల్ 6 ఏ ద్వారా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల సమాచారం కోసం డీఎస్వో కార్యాలయంలో కంట్రోల్ రూం(08732-226852) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలిఫోన్ కాల్స్ వివరాలు రిజిష్టర్లో నమోదు చేస్తామన్నారు. కంట్రోల్ రూంలో ఉద్యోగులు అందుబాటులో లేనట్లు ఫిర్యాదు వస్తే చర్య తీసుకోవాలని డీఎస్వోకు చెప్పారు.ఈ టోల్ఫ్రీ నంబర్ ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో మూడు లక్షల గోనే సంచులు అందుబాటులో ఉంచామని చెప్పారు. లక్సెట్టిపేట, మంచిర్యాల, భైంసా, నిర్మల్, ఖానాపూర్, సారంగాపూర్ మార్కెట్యార్డుల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీఎస్వో వసంత్రావు దేశ్పాండే, డీఎం ఆనంద్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్, డీఆర్డీఏ ఏపీఎం చరణ్దాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంతయ్య, అధికారులు పాల్గొన్నారు. -
620 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి, న్యూస్లైన్ : మూసీ రిజర్వాయర్లో నీటిమట్టం 620 అడుగులకు చేరుకుంది. గత రబీ సీజన్ మూసీ ప్రధాన కాల్వలకు నీటి విడుదల నిలిపివేసే సమయానికి (ఏప్రిల్11నాటికి) ప్రాజెక్టులో నీటిమట్టం 614 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత మూసీగేట్ల లీకేజీలు, సూర్యాపేట పట్టణ ప్రజలకు తాగునీటి విడుదలతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 612 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఈనేపథ్యంలో రెండు రోజులుగా ఎగువ మూసీ ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అకాల వర్షాలకు దిగువన గల మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. మూసీ ఎగువన ఉన్న చెరువులు, కుంటల్లో చేపలు పడుతుండటంతో కొత్తగా వచ్చే నీరుఆయా చెరువుల్లోకి చేరకుండా అడ్డుకట్టలు వేశారు. దీంతో వచ్చే వరద నీరంతా నేరుగా దిగువన గల మూసీ రిజర్వాయర్లోకి చేరుతుంది. దీంతో రిజర్వాయర్లో నీటిమట్టం 612 అడుగుల నుంచి ఒక్కో అడుగు పెరుగుతూ ఆదివారం సాయంత్రానికి 620 అడుగులకు చేరుకుంది -
ధాన్యం పుష్కలం.. కేంద్రాలు నిష్ఫలం
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: ప్రకృతి ప్రకోపానికి ప్రతిసారీ బలవుతున్న రైతన్న ఈ రబీలో గట్టెక్కాడు. అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడి ఇంటికి చేర్చాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు పెరగడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే ఈ కర్షకుడిని దైవం కరుణించినా...యంత్రాగం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. కొనుగోలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయడంతో వరికి మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. అదే అదునుగా దళారులు తమ దందా ప్రారంభించడంతో రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిచ్చింది పుచ్చుకుని...అపురూపంగా పండించిన పంటను అప్పగించి వెళ్లిపోతున్నాడు. కలలన్నీ కల్లలుగా మారడంతో కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆశలు రేపిన రబీ రబీ సీజన్ సిద్దిపేట ప్రాంత రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలను తట్టుకుని ఇంటికి చేరనున్న వరి ధాన్యాన్ని చూసి అన్నదాతలు తమ కష్టాన్ని మరచిపోతున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, తొగుట, కొండపాక మండలాల్లో సగటున మండలానికి 10 వేల ఎకరాల్లో వరి సాగైంది. సకాలంలో నాటు వేయడం, అవసరమైనంత నీరు అందించడంతో వరి దిగుబడి కూడా ఈసారి పెరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు కోతలు ప్రారంభించారు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఇప్పటికే 40 శాతం పంటను కోశారు. మిగిలిన పంటను మరో వారంరోజుల్లో ఇంటికి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన పలువురు రైతులు వరిధాన్యాన్ని సిద్దిపేట మార్కెట్కు తీసుకువస్తున్నారు. జాడలేని ఐకేపీ కేంద్రాలు పెరిగిన దిగుబడి చూసి ఆనందపడిన రైతులు...ఇక తమ కష్టాలన్నీ తీరాయనుకున్నారు. అయితే అన్నదాతలపై కరుణ చూపని సర్కారు కోతల సీజన్ ప్రారంభమై పక్షంరోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో సిద్దిపేటలోని మార్కెట్కు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ దళారులంతా ఏకం కావడంతో వరికి మద్దతు ధర దక్కడం లేదు. ఇంకొన్నిరోజులు ఆగే ఆర్థికబలం లేక కొందరు, వివాహాలు, చదువులు, ఇతర అత్యవసరాల కోసం మరికొందరు రైతులు దళారులు నిర్ణయించిన అడ్డగోలు ధరకే వరిని అమ్మేసుకుంటున్నాడు. వెల్లువలా ధాన్యం... సంసిద్ధం కాని యంత్రాగం ఇప్పటికే 40 శాతం వరికోతలు పూర్తికాగా, మిగిలిన పంట మరో వారం రోజుల్లో ఇంటికిచేరే అవకాశం ఉంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంట అంతా సిద్దిపేట మార్కెట్కు తరలివస్తోంది. మరో వారం రోజులు తర్వాత సిద్దిపేట వ్యవసాయ మార్కెట్కు వరి ధాన్యం వెల్లువలా రానుంది. సిద్దిపేట ప్రాంతంలోని ఐదు మండలాల్లోనే సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతో పాటు సిద్దిపేట సమీపంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం భారీగా రానుంది. అయికే వచ్చినధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం... ఇక్కడి వ్యాపారులు అంత ధాన్యాన్ని కొనుగోలు చేసే స్థితిలో లేకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ఆరుగాలం శ్రమించిపండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. -
పట్టణాలకు ఊరట పల్లెలకు తప్పని కోత
మోర్తాడ్, న్యూస్లైన్: రబీ సీజన్ వరి కోతలు మొదలు కావడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గింది. అయినా పల్లెలకు విద్యుత్ కోతల నుంచి విముక్తి తప్పడం లేదు. ఇందుకు ప్రత్యేక ఫీడర్లు లేకపోవడమే కారణం. కాగా నాలుగు రోజుల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, సబ్స్టేషన్లు ఉన్న గ్రామాలలో గృహావసరాలకు పగటి పూట ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. గతంలో పట్టణాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాలలో ఆరు గంటలు, సబ్స్టేషన్ కేంద్రాలలో ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేశారు. ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసేవారు. అంతేకాక అర్ధరాత్రి మరో రెండు గంటల పాటు విద్యుత్ కోతను విధించేవారు. విద్యుత్ కోతల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో పగటి పూట విద్యుత్ కోతల వల్ల వ్యాపారాలు సాగక అవస్థలు పడ్డారు. వర్షా కాలంలో భారీ వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. దీంతో బోరు బావుల కింద వరి సాగు విస్తీర్ణం రైతులు పెంచారు. వరి పంటకు సాగు నీరు రోజు అందించాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరగడం వల్ల గృహావసరాలకు కోతలు తప్పలేదు. ప్రస్తుతం పట్టణాలు, మండల కేంద్రాలు, సబ్స్టేషన్ కేంద్రాల్లో కోతలను అధికారులు ఎత్తివేయడంతో ప్రజలకు ఊరట లభించింది. అయితే ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో మాత్రం కోతలను అధికారులు ఇంకా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు గాను 250 గ్రామాలలో సబ్స్టేషన్లు ఉన్నాయి. 468 గ్రామాలకు ప్రత్యేక ఫీడర్లను సబ్స్టేషన్ల నుంచి ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధుల కేటాయింపు జరగలేదు. ఫలితంగా ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతోంది. ప్రత్యేక ఫీడరులు లేని కారణంగా కోతలు తప్పడం లేదు. అయితే రోజుకు 12 గంటలకు బదులు తాజాగా 9 గంటల పాటు కోతలు విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వేసవి కారణంగా ఉక్కపోత అధికంగా ఉండటంతో పల్లెలకు కూడా నిరంతరం విద్యుత్ను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రైతులను దోచుకుంటున్న మిల్లర్లు
వాకాడు, న్యూస్లైన్: మండలంలో రబీ సీజన్లో 14,247 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో బీపీటీ రకాన్ని 8,100 ఎకరాల్లో, 1010 రకాన్ని 6,147 ఎకరాల్లో సాగు చేశారు. 61 వేల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునే సమయంలో ధరలు పడిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధరలను శాసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటి వరకు 46.5 వేల టన్నుల ధాన్యాన్ని దళారులకు అమ్ముకొన్నామని రైతులు అంటున్నారు. మిగిలిన రైతులు ధరలు లేకపోవడంతో పెట్టుబడులకు వడ్డీ కూడా రాదనే ఉద్దేశంతో కొందరు ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఇదిలా ఉంటే ధాన్యం నిల్వ ఉంచుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాకాడు ఏఎంసీ గోడౌన్లో ధనవంతులకు ప్రాధాన్య ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ పేద రైతులకు అన్యాయం జరుగుతోందని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దళారుల దందా!
ఒంగోలు టూటౌన్, న్యూస్లైన్ : మార్కెట్ మాయాజాలంతో రైతన్న కుదేలయ్యాడు. పెట్టుబడులు కూడా రాకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అన్నదాత బలహీనతను పొలంలోనే సొమ్ము చేసుకుంటున్నారు. ఏతల నాడు ధరలు కోతల నాటికి కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు. జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన పలు రకాల పంటలకు నేడు గిట్టుబాటు ధరలు లేవు. వేరుశనగ.. రబీ సీజన్లో 3327 హెక్టార్లలో వేరుశనగా సాగు చేశారు. తీరప్రాంతంలో ఎక్కువగా సాగువుతోంది. విత్తనాలు, ఎరువులు, దుక్కి, కలుపు, కూలీ అన్నీ కలిపి ఎకరాకు రూ.25 వేలకుపైగా ఖర్చు పెట్టారు. క్వింటాకు 30 నుంచి 40 బస్తాలలోపే పండింది. విత్తన కొనుగోలు సమయంలో వేరుశనగ అధిక ధర పలికింది. పంట చేతికొచ్చే సమయానికి ఆ ధర లేక రైతులు దిగాలు పడ్డారు. బస్తా రూ. 900 నుంచి రూ.1200 వరకు మత్రామే పలుకుతోంది. రేటు పెరగకుండా దళారులు అడ్డుకుంటూ రైతును నట్టేట ముంచుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు పొలాల్లోనే ఎంతోకొంతకుపంట తెగనమ్ముకుంటున్నారు. కౌలు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు కౌలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాడు. మిర్చి.. 7694 హెక్టార్లలో మిర్చి వేశారు. ఈ పంట పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా సాగవుతోంది. కందుకూరు ప్రాంతంలో కొండమూరువారిపాలెంలో దాదాపు 250 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. క్వింటా రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.7,300లకు పడిపోయింది. ఎకరాకు రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు అవుతోంది. దళారుల మాయజాలంతో ధరలు తగ్గిపోయాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. పత్తి.. జిల్లావ్యాప్తంగా రబీలో 807 హెక్టార్లలో పత్తి సాగైంది. ఖరీఫ్లో 53,508 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు రూ.21,550 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు 15 వేలు చెల్లించారు. మొత్తం రూ.36,550 వరకు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం క్వింటాకు దాదాపు రూ.4వేల ధర నిర్ణయించింది. అంత వరకూ బాగానే ఉన్నా రంగుమారిందన్న సాకు చూపి మార్కెట్లో దళారులు రూ.3,200 కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. దీనికి తోడు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా తగ్గింది. తీసిన పత్తి కూలీలకే సరిపోలేదని రైతన్న వాపోతున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. గతేడాది అక్టోబర్లో కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ మొత్తం నేపథ్యంలో పత్తి సాగు చేయాలంటేనే రైతులు జంకుతున్నారు. ‘శనగ’ లేదు శీతల గిడ్డంగుల్లో 14.5 లక్షల క్వింటాళ్ల శనగలు మూడేళ్లుగా మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి వచ్చాయి. గత నెల ఒంగోలు వ్యవసాయ మార్కెట్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసి తొలిరోజు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో రూ.7,500 పలికిన ధర నేడు రూ.3,700 కూడా పలకని పరిస్థితి ఉంది. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మూడు వేల వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదీ అన్ని సక్రమంగా ఉంటేనే. లేకుంటే నిబంధనల పేరుతో కోత విధిస్తారు. అమ్మిన శనగలకు డబ్బుల కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రైతన్నల వర్రీ జిల్లాలో వరి 80289 హెక్టార్లలో సాగైంది. ధాన్యం చేలో ఉండగానే దళారులు రంగంలోకి దిగారు. బీపీటీలు, 1001, సన్నాల రకం వడ్లను దళారులు రూ.900 నుంచి రూ.1000 కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొత్తపట్నం ప్రాంతంలో అసలు ధర రూ.1200 వరకు ఉన్నా మిల్లర్లు దళారులను రంగంలోకి దించి కేవలం రూ.900 అడగటం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయకట్టు పరిధి దర్శి, త్రిపురాంతకం, కురిచేడు, ముండ్లమూరు ఏరియల్లో ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు అవుతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో దిక్కుతోచని రైతు.. పొలంలోనే పంట తెగనమ్ముతున్నాడు. కౌలు రైతుల శ్రమ వృథా అవుతోంది. అటు పెరిగిన ఖర్చులు, ఇటు మార్కెట్ దళారుల మాయజాలం దెబ్బకు రైతన్న కుదేలవుతున్నాడు. ఇవీ.. అంతే పొగాకు, ఉల్లి, టమోట పంటలకూ కూడ గిట్టుబా టు ధర రాకుండా దళారులు అడ్డుకుంటూ రైతన్న శ్రమను దోచుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని అన్నదాత వాపోతున్నాడు. -
సాగునీటి విడుదల బంద్!
మార్చి 31 రాత్రి 10 గంటలకు ‘డెడ్’లైన్ అన్నదాతల్లో ఆందోళన పొట్టదశలో వరి మచిలీపట్నం, న్యూస్లైన్ : ప్రస్తుతం వరి పైరు పొట్టదశలో ఉన్న సమయంలో 31వ తేదీ రాత్రి 10గంటల నుంచి కాలువలకు నీటి విడుదలను నిలిపివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 2.65 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. పొట్టదశలో ఉన్న పైరు ఈతకు వచ్చి గింజలు పాలుపోసుకోవాలంటే కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందని రైతులు పేర్కొంటున్నారు. 31వ తేదీ రాత్రి నుంచే కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తే ఒక్క ఎకరం కూడా కోతకు రాదనేది రైతుల వాదన. మార్చి 31వ తేదీనే సాగునీటి విడుదలను నిలిపివేయాలన్న ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని నీటి పారుదలశాఖాధికారులు చెబుతున్నారు. నీటి విడుదలను నిలిపివేస్తే రైతులు పంట చేతికి రాక కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాకుండా తీరంలోని మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతందని వారు భయపడుతున్నారు. ఖరీఫ్ ఆలస్యం వల్లే సమస్య .... ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు జూన్ 15వ తేదీన కాలువలకు సాగునీటి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది ఆగ స్టు 9వ తేదీన అధికారికంగా కాలువలకు నీటిని విడుదల చేశారు. నెలాపదిహేను రోజులు సాగునీటి విడుదల ఆలస్యం కావటంతో ఖరీఫ్లో వరినాట్లు ఆలస్యంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరి నెలలోనూ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి కోతలు పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో దాళ్వా పంటకు సాగునీరు విడుదల చేస్తారో, లేదో చెప్పకుండా జాప్యం చేశారు. దీంతో ఫిబ్రవరి నెలలో రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాల్లో ఆలస్యంగా వరిసాగు జరిగింది. ప్రస్తుతం వరి పైరు పొట్ట, పాలు పోసుకునే దశల్లో ఉంది. ఈ తరుణంలో వరికి కచ్చితంగా సాగునీరు అవసరం. ఎకరానికి రూ.20 వేలకు పైనే ఖర్చు,,, రబీలో దాళ్వా పంటకు ఎకరానికి రూ.20 వేలు చొప్పున రైతులు ఖర్చు చేశారు. గత రెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా, మూడేళ్లుగా కెఈబీ కాలువ కింద రబీకి నీరు విడుదల చేయలేదు. దీంతో దాళ్వా పంటను సాగు చేసేందుకు రైతులు అధికంగా ఎరువులు వినియోగించాల్సి వచ్చింది. ఎరువుల వినియోగం, పురుగు మందుల పిచికారీ, పైపాటుకు ఎకరానికి రూ.20 వేలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. ఈ రబీ సీజన్లో కాలువలకు నీటిని విడుదల చేయటంలో అధికారులు ఊగిసలాట ధోరణితో వ్యవహరించినా రైతులు అనేక కష్టాలు పడి పైరును కాపాడుకున్నారు. ఖరీఫ్లో కోలుకోలేని దెబ్బ... గత ఖరీఫ్ సీజన్లో నవంబరులో వారం రోజుల వ్యవధిలో హెలెన్, లెహర్ తుపానుల కారణంగా కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులతో పంట చేతికొచ్చే సమయంలో నేలవాలి దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్లో తుపానుల కారణంగా నష్టపోయామని, దాళ్వా అయినా సక్రమంగా పండితే కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు. ప్రతి ఎకరానికీ నీరు ఇవ్వాల్సిందే ఖరీఫ్ సీజన్లో సాగునీటి విడుదలలో జాప్యం జరగడంతో ఆ ప్రభావం రబీపై పడింది. మార్చి 31వ తేదీ నాటికే కాలువలకు సాగునీటి విడుదలను నిలిపివేస్తామని అధికారులు చెప్పటం జిల్లాలోని రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అఖరి ఎకరం కోత పూర్తయ్యే వరకు సాగునీటి విడుదల చేయాల్సిందే. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. పొట్ట, ఈతదశలో ఉన్న వరి పైరు ఒక్క ఎకరం ఎండి కోతకు పనికి రాకుండా పోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ -
రబీ.. అగమ్యగోచరం
మిర్యాలగూడ, న్యూస్లైన్: రబీ సీజన్లో జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగర్ ఎడమ కా లువకు రబీలో నీళ్లు విడుదల చేసినా చివరి భూములకు అందక ఎండిపోతున్నాయి. బోరుబావుల కింద సాగు చేసిన రైతులకు కరెంటు కోతలతో ఎండిపోతున్నాయి. రైతాంగానికి ఏడు గంట లపాటు విద్యుత్ సరఫరా ఉత్తమాటలుగానే మిగిలాయి. ఖరీఫ్లో దోమకాటుతోపాటు తుపాను కారణంగా పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రబీలోనైనా పంటలు పండుతాయని సాధారణ వరి సాగు కంటే అధికమొత్తంలో సాగు చేశారు. పంటలు ఎండిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులైనా వస్తా యో రావో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటలే కరెంటు.. ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తమాటే అయ్యింది. వ్యవసాయానికి రోజూ 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్నా మూడు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ల సబ్స్టేషన్ పరిధిలో మూడు రోజులుగా కేవలం రోజుకు మూడు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దాంతో జైకిసాన్ ఎత్తిపోతల పథకం కింది వరి పొలాలు ఎండిపోతున్నాయి. శుక్రవారం సబ్స్టేషన్ వద్దకు తడకమళ్ల, మొల్కపట్నం, సల్కునూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. వెంకటాద్రి పాలెం సబ్స్టేషన్ పరిధిలో రోజుకు కనీసం గంట పాటు కూడా విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల వాటర్ ట్యాంకుతండా, వెంకటాద్రిపాలెం సమీపంలో పొలాలు ఎండిపోతున్నాయి. వారబందీతో ఎండుతున్న పంటలు.. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రబీలో నీటి విడుదల వారబందీ పద్ధతిలో ఉండడం వల్ల చివరి భూములకు నీరందక ఎండిపోతున్నా యి. కిష్టాపురం మేజర్ కాలువ పరిధిలో చివరి భూములకు నీళ్లు అందడం లేవని గూడూరు వద్ద స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కాలువలో కూర్చొని నిరసన తెలిపారు. అదే విధంగా మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, ఊట్లపల్లి, శ్రీనివాస్నగర్, నందిపాడు క్యాంపు, రాఘవాపురం తండాలో పంట పొలా లు ఎండిపోతున్నాయి. దామరచర్ల మండలంలోని దామరచర్ల, రాజగట్టు, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి, బాల్నేపల్లి గ్రామాలలో నీళ్లందక వరి పంటలు ఎండిపోతున్నాయి. -
రైతుల విత్తనాలు బ్లాక్ మార్కెట్కు..!
దోమ, న్యూస్లైన్: ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అందజేసిన శనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఊట్పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటఉత్పత్తులను సాధించేందుకు వీలుగా ప్రభుత్వం రైతులకు వేరుశగన, శనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆయా పంటలను సాగు చేయడంలో సలహాలు, సూచనలు అందించడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కలిగించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రబీ సీజన్లో శనగ పంట సాగుకు అధికారులు మండల పరిధిలోని ఊట్పల్లి, బొంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 75 మంది చొప్పున రైతులను ఎంపిక చేశారు. వారికి పంపిణీ చేసేందుకు ఒక్కో గ్రామానికి 75 బస్తాల చొప్పున మొత్తం 150 బస్తాలను రెండు నెలల క్రితం చేరవేశారు. అయితే కొంతకాలం పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత అమ్ముకుంటే ఎవరికీ తెలియదని భావించారు ఆదర్శరైతులు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన శనగ విత్తనాలను గురువారం రాత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ లేనిది ఊళ్లోకి కార్లు, ఆటోలు హడావుడిగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి విషయం ఆరా తీశారు. ఓ గదిలో 32 శనగబస్తాలు దాచి ఉంచారని తెలిసింది. మొత్తం 75 బస్తాలకుగాను 32 మాత్రమే ఉండడంతో స్థానిక ఆదర్శరైతును నిలదీశారు. అతను తనకేం తెలి యదని బుకాయించాడు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ తదితరులు గదికి తాళం వేసి విషయాన్ని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పరిగి డివిజన్ వ్యవసాయాధికారి నాగేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి రేణుకా చక్రవర్తిని శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం పంపిణీ చే యాల్సిన విత్తనాలను రబీ సీజన్ ముగుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడీఏతో పాటు మండల వ్యవసాయాధికారి పొం తనలేని సమాధానాలు చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఆదర్శరైతులు కుమ్మక్కై విత్తనాలను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బొంపల్లి గ్రామంలోనూ విత్తనాలు పంపిణీ చేయకుండా బ్లాక్మార్కెట్కు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విద్యుత్ కోతలు
దోమ/ షాబాద్, న్యూస్లైన్: బోర్లలో, బావుల్లో సమృద్ధిగా నీరుంది. దీంతో రైతులు పెట్టుబడికి అప్పులు చేసి సాగు మొదలుపెట్టారు. కానీ అప్రకటిత విద్యుత్ కోతలు వారిని నిలువునా ముంచుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సరఫరా వేళలను తగ్గించారని, ఆరు గంటలు ఇస్తామని మూడు గంటలు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు రబీ సీజన్లో వరి, వేరుశనగ తదితర పంట లను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ముఖ్యంగా వరి నీరందక ఎండుముఖం పడుతోంది. పలు గ్రామాల్లో వేరుశనగ పంటకు కూడా చివరి విడత తడి పెట్టా ల్సి ఉంది. విద్యుత్ కోతల కారణంగా ఈ పంటలు ఎండే పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సరఫరా అధికారులు బోరుబావులకు ఇస్తున్న కొద్దిపాటి విద్యుత్ను కూడా రాత్రి వేళ ఇస్తున్నారు. దోమ సబ్స్టేషన్ కింద నాలుగు ఫీడర్లు ఉండగా ఊట్పల్లి, నాచారం ఫీడర్ల పరిధి గ్రామాలకు రాత్రి 9 - 12 గంటల మధ్య, తిరిగి ఉదయం 6 - 9గంటల మధ్య ఇస్తున్నారు. ఇక పాలేపల్లి, బాస్పల్లి ఫీడర్ల కింది పంట లకు తెల్లవారుజామున 3- 6 గంటల మధ్య, తిరిగి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దిర్సంపల్లి, గుండాల్ సబ్స్టేషన్ల పరిధిలో ఉన్న ఫీడర్ల కింది పంటలకూ ఇదే తరహా వేళలు. అయితే పేరుకు మాత్రమే ఆరు గంటలని చెబుతున్న అధికారులు పగలు, రాత్రి కలిపి మొత్తం మూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా నిరంతరంగా కాదు. విద్యార్థులకు, చిరువ్యాపారులకూ ఇబ్బందే విద్యుత్ కోతలతో రైతులే కాకుండా విద్యార్థులు, చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలు దగ్గరపడుతుండడం, విద్యుత్ కోతలు రోజురోజుకూ అధికమవుతుండడంతో పరీక్షల ప్రిపరేషన్కు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం వేళల్లో గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో జిరాక్స్ సెంటర్లు, సామిల్లులు, మెకానిక్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. లోఓల్టేజీతో కాలిపోతున్న మోటార్లు షాబాద్ మండలంలో లోఓల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది. తరచూ మోటార్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి కరెంట్తో రెండు మడులు తడుపుకుందామంటే లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయంటున్నారు. నెల రోజుల్లో రెం డు బోరుమోటార్లు కాలిపోయాయని, మరమ్మతు చేయించడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశానని షాబాద్ మండల కేంద్రానికి చెందిన రాములు చెప్పాడు. -
ప్రమాదకరంగా కాకతీయ కాలువ
బాల్కొండ,న్యూస్లైన్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ (కాకతీయ కాలువ) పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ కాలువ ద్వారా జిల్లా ప్రజలకు స్వల్పంగా ప్రయోజనం చేకూరినా, కాలువ అవసరం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి అధికారులు రబీ సీజన్లో ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేపడుతున్నారు. కాని నీటి ప్రవాహానికి కాలువ క్రమంగా కొన్ని చోట్ల కోతకు గురవుతోంది. ప్రాజెక్ట్ నుంచి 100 మీటర్ల దూరంలోనే కోతకు గురవడం గమనార్హం. మండలంలోని మెండోరా, రెంజర్ల శివారులో కాలువ ప్రమాదకరంగా మారింది. ఏక్షణాన గండిపడుతుందోనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు రెండు పక్కల చేసిన సిమెంట్ లైనింగ్ పూర్తిగా చెడిపోయింది. దీంతో గండి పడే ప్రమాదం పొంచిఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. దీంతో రోజురోజుకు సిమెంట్ లైనింగుకు పగుళ్లు వచ్చి లైనింగ్ పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. కాలువపై 9లక్షల 68 వేలఎకరాల ఆయకట్టు కాకతీయ కాలువ పై సుమారు 9లక్షల 68 వేల ఎకరాల ఆయకట్టు ఆధార పడిఉంది. ఇంత ఆయకట్టు ఆధారపడి ఉన్న కాలువ ప్రథమార్థంలోనే ప్రాజెక్ట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కాలువ పూర్తి గా కోతకు గురై గండి పడే ప్రమాదం ఏర్పడింది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. దీనిపై మరో ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉంది. 2006 లో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. కాని కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల సిమెంట్ పూర్తిగా పెచ్చులూడి పోయింది. కాలువ నిర్మాణ క్రమంలో లైనింగ్ కు సిమెంట్ బిల్లలు వేశారు. కాని ఈ బిల్లలను గుర్తుతెలియని దుండగులు కాలువ కట్ట నుంచి ప్రతి ఏడాది ఎత్తుకెళుతున్నారు. దీంతో నీరు ప్రవహించినప్పుడు కట్ట కోతకు గురవుతూ గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఏడువేల క్యూసెక్కుల కంటే దాటని పరిస్థితి కాకతీయ కాలువ పూర్తి నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. కాని కాలువ లైనింగ్ పనులు శిథిలావస్థకు చేరడంతో గత రెండేళ్లు గా ఏడు వేల క్యూసెక్కుల కు మించి నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నా ఎక్కడ గండి పడుతుందోనని ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి కి తీరని నష్టం వాటిల్లుతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఎస్సారెస్పీ కాలువల పనుల మరమ్మతులంటేనే ప్రభుత్వాలకు ఒకింత నిర్లక్ష్యం మనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కాలువ పనులకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
కోతలు మొదలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతకు కరెంటు సెగ తగిలింది. వరినాట్లు వేసిన క్షణంలోనే కరెంటు కోతలు మొదలు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టాల పాలైనప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో ఉత్సాహంగా సాగు పనులకు ఉపక్రమించారు. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో ఈ దఫా వరిసాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. అయితే నాట్లు పూర్తయిన సమయంలోనే కరెంటు కష్టాలు మొదలు కావడం రైతులకు కునుకులేకుండా చేస్తోంది. వాస్తవానికి ఈ సమయంలో నీటి అవసరం పెద్దగా ఉండదు. కానీ అవసరం మేరకు మడిని తడిపేందుకు సైతం కరెంటు సక్రమంగా అందకపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. జిల్లాలో 93వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మరో 20వేల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు ట్రాన్స్కో అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో వ్యవసాయరంగానికి సగటున 3.7మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. కాగా, ఉత్పత్తిలో నెలకొన్న సమస్యతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్కో వర్గాలు చెబుతున్నాయి. అయితే తక్కువ వినియోగం ఉన్న సమయంలోనే విద్యుత్ సమస్యలు తలెత్తడం రైతాంగానికి శాపంగా మారింది. మరో పక్షం రోజులు దాటితే ఎండల తీవ్రత మొదలుకానుంది. దీంతో విద్యుత్ వినియోగం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీగా సాగు.. గతేడాది జిల్లాలో భారీ వర్షాలే కురిశాయి. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడి భూగర్భజలాలు కూడా సంతృప్తికర స్థాయిలో వృద్ధి చెందాయి. దీంతో పంటల సాగుకు రైతుల్లో ధీమా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా పంటలు సాగయ్యాయి. మెట్ట పంటలతో పాటు వరిసాగు కూడా అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 15,255 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇప్పటివరకు 7,455 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 8,117 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఈ సమయంలో కేవలం 2,425 హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగైంది. సీజన్ చివరినాటికి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అబిప్రాయపడుతున్నారు. చేతులు కాలకముందే.. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే తీవ్రనష్టాల్లో మునిగిన రైతును ఆదుకునేందుకు యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరి సాగు విస్తీర్ణం తీరును అంచనా వేసి అవసరమైన మేర కరెంటు సరఫరా చేస్తే రైతులకు ఇబ్బందులు కలగవంటూ కలెక్టర్ బి.శ్రీధర్ ఇప్పటికే వ్యవసాయ, ట్రాన్స్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా శాఖలు ఏమేరకు చర్యలు తీసుకుంటాయో చూడాలి. -
మంజూరు ఇంతేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సీజన్లో నిర్దేశించిన పంట రుణ లక్ష్యం సాధనలో బ్యాంకర్లు వెనుకబడటంపై కలెక్టర్ బి.శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరుపై సమీక్షిస్తూ రబీ సీజన్లో రుణ లక్ష్యం రూ.268.55 కోట్లకు గాను ఇప్పటివరకు కేవలం రూ.161.99కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ వందశాతం రుణాలివ్వాలన్నారు. రుణ పురోగతిలో వెనుకబడిఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు, ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులను వివరణ కోరగా.. రికవరీ లేకపోవడంతో రుణ మంజూరులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో రికవరీ క మిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్, పరిగి, గండేడ్, దోమ మండలాల్లో రుణ మం జూరు అతి తక్కువగా ఉందన్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులతో వెంటనే ఖాతాలు తెరిపించి రుణాలు మంజూ రు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, జేడీఏ విజయ్కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా ముప్పు
రబీ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. అవసరం మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో లేవు. ప్రస్తుతానికి ఇబ్బంది తలెత్తకపోయినప్పటికీ, రానున్న రోజులలో యూరియా కొరత ఏర్పడే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఈసారి రబీ వరి సాగు ఆశాజనకంగా ఉంది. సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు కురియ డం, ప్రాజెక్టులు నిండుకుండలను తలపించడంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎ రువుల కొరతే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీ పంటలకు 1.29 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జనవరి నెలాఖరు వరకు 71,330 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తేల్చారు. కాగా ప్రస్తుతం 30,484 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటు లో ఉంది. అంటే, అవసరంలో సగం కూడా యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవన్నమాట. అవసరం మేరకు యూరియా అందుబాటులో లే కపోవడానికి జిల్లాలో స్థలం సమస్యే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గోదాములు ఖాళీ లేకపోవడంతో యూరియా అదనపు నిల్వ లు తెప్పించలేకపోతున్నామంటున్నారు. పీఏసీఎస్లలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభించనుంది. అయితే మరో రెండేళ్లకు గానీ ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా లేవు. ‘కాంప్లెక్స్’ఫుల్ : యూరియా పరిస్థితి ఇలా ఉం టే.. కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి ఇందుకు విరుద్ధం. వీటి నిల్వలు జిల్లాలో భారీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 40,769 మెట్రిక్ టన్నులున్నాయి. వీ టి ధరలు చుక్కలనంటుతుండటంతో రైతులెవ్వ రూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ సారి 3.25 లక్షల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, సిరికొండ తదితర మండలాలలో నాట్లు ఊపందుకున్నాయి. ఈ వరికే యూరి యా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతులు వరికి యూరియాను ఎకరానికి రెండు దఫాల్లో నాలుగు నుంచి ఐదు బస్తాలు వరకు వినియోగిస్తుంటారు. నాట్లు వేసుకున్నాక 25 రోజుల తర్వాత ఈ ఎరువును వేస్తారు. అందువల్ల ఇప్పుడిప్పుడే యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. ఎకరానికి రెండున్నర బస్తాలకు మించి యూరియా వాడవద్దని వ్యవసాయాశాఖా అధికారులు పేర్కొంటున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పం టలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ రబీ లో 1.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుం దని అంచనా. ఈ పంటకు కూడా రెండుసార్లు యూరియా అవసరం ఉంటుంది. పొద్దుతిరుగు డు పంట 50 వేల ఎకరాలలో సాగవుతుందని భావిస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు బస్తాలై నా యూరియా వేయాల్సి ఉంటుంది. -
యూరియా ముప్పు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఈసారి రబీ వరి సాగు ఆశాజనకంగా ఉంది. సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు కురియ డం, ప్రాజెక్టులు నిండుకుండలను తలపించడంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎ రువుల కొరతే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీ పంటలకు 1.29 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జనవరి నెలాఖరు వరకు 71,330 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తేల్చారు. కాగా ప్రస్తుతం 30,484 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటు లో ఉంది. అంటే, అవసరంలో సగం కూడా యూరి యా నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవన్నమాట. అవసరం మేరకు యూరియా అందుబాటులో లే కపోవడానికి జిల్లాలో స్థలం సమస్యే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గోదాములు ఖాళీ లేకపోవడంతో యూరియా అదనపు నిల్వ లు తెప్పించలేకపోతున్నామంటున్నారు. పీఏసీఎస్లలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభించనుంది. అయితే మరో రెండేళ్లకు గానీ ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా లేవు. ‘కాంప్లెక్స్’ఫుల్ : యూరియా పరిస్థితి ఇలా ఉం టే.. కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి ఇందుకు విరుద్ధం. వీటి నిల్వలు జిల్లాలో భారీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 40,769 మెట్రిక్ టన్నులున్నాయి. వీ టి ధరలు చుక్కలనంటుతుండటంతో రైతులెవ్వ రూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ సారి 3.25 లక్షల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, సిరికొండ తదితర మండలాలలో నాట్లు ఊపందుకున్నాయి. ఈ వరికే యూరి యా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతులు వరికి యూరియాను ఎకరానికి రెండు దఫాల్లో నాలుగు నుంచి ఐదు బస్తాలు వరకు వినియోగిస్తుంటారు. నాట్లు వేసుకున్నాక 25 రోజుల తర్వాత ఈ ఎరువును వేస్తారు. అందువల్ల ఇప్పుడిప్పుడే యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. ఎకరానికి రెండున్నర బస్తాలకు మించి యూరియా వాడవద్దని వ్యవసాయాశాఖా అధికారులు పేర్కొంటున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పం టలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ రబీ లో 1.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుం దని అంచనా. ఈ పంటకు కూడా రెండుసార్లు యూరియా అవసరం ఉంటుంది. పొద్దుతిరుగు డు పంట 50 వేల ఎకరాలలో సాగవుతుందని భావిస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు బస్తాలై నా యూరియా వేయాల్సి ఉంటుంది. -
రబీ.. వార‘బందీ’.. చి‘వరి’కి కష్టమే..!
సాక్షి, కొత్తగూడెం: నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఏటా కష్టాల సాగే. ఖరీఫ్లో వేసిన వరి అకాల వర్షాలతో రైతుల చేతికందకుండా పోయింది. అయితే రబీలో కూడా వరి పంట ముమ్మరంగా సాగు చేస్తున్నా.. వార బందీ విధానంతో ఈసారైనా చేతికి వచ్చేనా..? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడులకే సాగర్ నీరు ఇస్తుండడంతో జిల్లాలోని చి‘వరి’ ఆయకట్టుకు నీరందడం కష్టమేనని అంటున్నారు. రబీ సీజన్లో సాగర్ ఆయకట్టు పరిధిలో జిల్లాలో 70,394 ఎకరాల్లో వరి సాగవుతోంది. ముదిగొండ, ఖమ్మం రూరల్, రఘునాధపాలెం(ఖమ్మం అర్బన్), కొణిజర్ల, నేలకొండపల్లి, వైరా, బోనకల్లు, కూసుమంచి, పెనుబల్లి, కల్లూరు, చింతకాని మండలాల్లో జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. రబీలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సంబంధిత అధికారులు పలుమార్లు ప్రకటించినా.. సాగర్లో సరిపడా నీరు ఉండడంతో రైతులు వరి పంటకే మొగ్గు చూపారు. నాగార్జున సాగర్ ఆధునికీకరణ పేరుతో గత రెండేళ్లుగా రబీలో జిల్లా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదు. దీంతో రైతులు పంటలు కోల్పోయారు. ఖరీఫ్లో నీరు విడుదల చేసినా పంట చేతికి అందే సమయానికి వచ్చిన వర్షాలతో.. ధాన్యం కల్లాల్లోనే తడవడం, వరి పనలు పూర్తిగా నీటిలో మునగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ రబీపైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. అప్పుచేసి మరీ.. వరి నాట్లు వేస్తున్నారు. అయితే సాగర్ ఆయకట్టుకు ఆరుతడులకు మాత్రమే నీరు ఇస్తున్నట్లు ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో ఇప్పుడు వారిలో ఆందోళన మొదలైంది. రబీ వరికి అంతరాయం లేకుండా కనీసం మూడు నెలలకు పైగా నీరు విడుదల చేస్తేనే పంట చేతికి వస్తుంది. అయితే ఆరుతడుల ప్రకారం రెండు నెలలు మాత్రమే నీరు అందనుంది. వార బందీతో చిక్కులే.. నాట్లు మొదలుకొని చేతికి వచ్చే వరకు వరి పంటకు అంతరాయం లేకుండా నీరు ఉండాలి. ఆరుతడులతో కలుపు పెరగడమే కాకుండా పంట ఎదుగుదల ఉండదు. ప్రస్తుతం ఆరుతళ్ల ప్రకారం ఫిబ్రవరి 3 వరకు, మళ్లీ ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు, 24 నుంచి మార్చి 5 వరకు, 11 నుంచి 20 వరకు, 26 నుంచి ఏప్రిల్ 4 వరకు నీరు విడుదల చేస్తారు. మధ్య మధ్యలో ఐదు నుంచి వారం రోజుల వరకు విడుదలకు బ్రేక్ పడుతుంది. ఇలా నీరు విడుదల చేస్తే వరి పంట చేతికి రావడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వార బందీతో గతంలో బోనకల్, ఎర్రుపాలెం, మధిర, కల్లూరు, చింతకాని మండలాల్లో చివరి ఆయకట్టుకు నీరందక సాగు చేసిన వరి నిలువునా ఎండిపోయింది. దీంతో ఆ పంట పశువుల మేతకు మాత్రమే ఉపయోగపడింది. ఇలా నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి రానుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీతో ఎర్రుపాలెం మండలంలో నీటి కోసం రైతులు ఘర్షణ పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం... సాగర్లో రబీ సాగుకు సరిపడా నీరున్నా సంబంధిత అధికారులు మాత్రం వరి సాగుకు అంతరాయం లేకుండా విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. గత పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకే సిద ్ధమైనా నీటి విడుదలకు కొర్రీలు పెడుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరగడం లేదు. రబీ సాగు పూర్తయిన తర్వాతే ఈ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో ఆరు తడులు కాకుండా సరిపడా నీరు ఇస్తేనే వరి పంట చేతికి అందే అవకాశం ఉన్నా.. అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. వచ్చేనెల 15 వరకు వరినాట్లు జరగనున్నాయి. కానీ ఈ మధ్యలో మరో ఐదు రోజులు నీటి విడుదల నిలిపివేస్తుండడంతో వరి నాటు వేయడానికి కష్టమైతే, నాటు వేసిన పొలాలకు వెంటనే నీరందక తొలి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉంది. -
చివరికి కష్టమే!
మిర్యాలగూడ, న్యూస్లైన్: రబీ సీజన్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని వరి రైతులకు కష్టాలు తప్పేలాలేవు. గత నెల 20వ తేదీ నుంచి ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేసినా వరినార్లు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 16వ తేదీన మరోమారు నీటి విడుదలపై చర్చలో పాల్గొన్న రైతులు, నీటి సంఘాల మాజీ ప్రతినిధులు ఎన్ఎస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వరినాట్లు పూర్తయ్యే వరకు వారబందీ నిబంధనలు పెట్టవద్దని, ఫిబ్రవరి 10 వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. రైతుల విన్నపాలను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదల షెడ్యూల్ను జారీ చేస్తున్నామని చెప్పిన అధికారులు కేవలం ఫిబ్రవరి 3వ తేదీ వరకే నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కాలువ చివరి భూములకు సాగు నీరు అందడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. జోరుగా వరినాట్లు ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 శాతం అంటే కేవలం 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. కాగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎక్కువగా నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నీటిని ఫిబ్రవరి 3వ తేదీన మొదటి విడత నిలిపివేయడంతో రైతులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 4.31 లక్షల ఎకరాలకే రబీలో నీరు.. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని కేవలం 4,31, 325 ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో 10.28 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ సాగర్లో నీటి లభ్యత ఆధారంగా కేవలం రబీలో ఎడమ కాలువ కింద సాగుకు కేవలం 50 టీఎంసీల నీటినే కేటాయించారు. దీంతో సగం ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పవు.. సాగర్ ఎడమ కాలువకు ఐదు విడతలుగా నీటి ని విడుదల చేయనున్నారు. మొదటి విడతలో వరినాట్ల కోసం 19 రోజుల పాటు నీటిని విడుదల చేస్తుండగా మిగతా నాలుగు విడతల్లో కేవ లం పది రోజులు నీటిని విడుదల చేసి ఐదు రో జులు నీటిని నిలిపి వేయనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. రెండోవిడత ఫిబ్రవరి 9న, మూడోవిడత 24, నాలుగో విడత మార్చి 11న, ఐదో విడత మార్చి 26 నుం చి ఏప్రిల్ 4వరకు నీటి విడుదల ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు నీటిని నిలిపివేస్తే కాలువ చివరి భూముల్లో తిరిగి నీరందే వరకు మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉంది. దాంతో కాలువ చివరి భూములకు రబీలో నీరందడం కష్టంగానే ఉంది. దాంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులే సూచిస్తున్నారు. కాగా రైతులు కూడాముందుచూపుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టిసారిస్తున్నారు. -
కరెంటొత్తలేదు..
వరంగల్, న్యూస్లైన్: వ్యవసాయూనికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తిదేనని తేలిపోయింది. రబీలో వ్యవసాయానికి ఏడు గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని... ఫీడర్ల వారీగా ఉదయం 5 గంటలు, రాత్రి 2 గంటలు ఇస్తున్నామని.... రైతుల కోసం మిగిలిన వర్గాలకు కోతలు పెడుతున్నామని ప్రభుత్వం గుప్పిస్తున్న ప్రకటనలు ప్రగల్భాలేనని తేటతెల్లమైంది. ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం... ఇచ్చిన సమయంలోనూ లో ఓల్టేజీ, ట్రిప్ వంటి కారణాలతో వరి నాటు పడని పరిస్థితి నెలకొంది. ఆశ చూపి... ఖరీఫ్లో అధిక వర్షాలతో రైతులు నష్టపోయారని, ఈసారి రబీలో వారికి అండగా ఉంటామని, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రానీయమంటూ డిసెంబర్లో ఏర్పాటు చేసిన రైతు బాసట సదస్సులో కలెక్టర్ కిషన్ కూడా ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. దీంతో వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు ఆశతో వరినార్లు పోశారు. కానీ... విద్యుత్ కోతల కారణంగా వేసిన నార్లన్నీ వేసినట్టే ముదిరిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 2.74 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రతిరోజూ 4.60 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. జిల్లాకు మొత్తం అవసరాలకు పది మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. ప్రస్తుతం జిల్లాకు సరఫరా ఏడు మెగావాట్లే సరఫరావు అవుతోంది. దీంతో కోతలు అనివార్యమవుతున్నారుు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయడంతో కాల్వల కింద, బావులు, బోర్ల కింద సాగు ముమ్మరమైంది. వరితోపాటు కూరగాయలు, పప్పు దినుసులు కూడా వేశారు. ఇప్పటి వరకు 30 శాతం మేరకు పంటలు సాగు చేశారు. కానీ.. దీనిలో సగం మేరకు ఎండిపోయో పరిస్థితికి చేరుకున్నాయి. ఎక్కడ విన్నా ‘కరెంటొత్తలేదు’ అన్న మాటే.. వరంగల్ సర్కిల్ హెల్ప్లైన్లో ప్రధానంగా ‘కరెంటొత్తలేదు సారూ’ అనే ఫిర్యాదులే ఎక్కువున్నాయి. జనగామ డివిజన్లో వ్య వసాయ విద్యుత్ సరఫరాను శుక్రవారం పరిశీలిస్తే... మూడు గం టలే ఇచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. మొదటి ఫీడర్లో ఉద యం 8 గంటలకు వచ్చి 10 గంటలకు పోయింది. మళ్లీ గంట తర్వాత అరగంట పాటు వచ్చి పోరుుంది. 20 నిమిషాల తర్వాత మళ్లీ అర్ధగంట ఇచ్చారు. ఇక అంతే. మళ్లీ వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేదు. ఇక రాత్రిపూట ఇచ్చే రెండు గంటల కోసం రైతులు బావుల వద్దే ఉంటున్నారు. ఒక్కోరోజు విద్యుత్ రానే రావడం లేదని, కరెంటోళ్లకు ఫోన్ చేస్తే... వస్తంది... వచ్చినప్పుడే ఉంటది.. అంటూ సమాధానమిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారు మడి వద్ద కనబడుతున్న ఈ రైతు పేరు ముస్కు బుచ్చయ్య, దుగ్గొండి మండలం గిర్నిబావికి చెందిన ఈయన తనకున్న కొద్ది పాటి భూమితోపాటు మరో ఎకరంన్నర పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. రబీలో వరిసాగు కోసం నారు పోశాడు. నెల రోజులైంది... నాటు వేయడమే తరువారుు. అరుుతే వచ్చీరాని కరెంట్తో పొలం పారకపోవడంతో దమ్ము చేయడం కుదురుత లేదు. నాటేసే అదును దాటిపోతోంది. మరో నాలుగు రోజుల్లో నాటు పడకుంటే దండగే. దీంతో ఏం చేయాలో... ఎవరిని అడగాలో తెలియక తల్లడిల్లుతున్నాడు. ‘రోజులో పగటి పూట ఐదు గంటలిత్తమని అధికారులంటాండ్రు. మూడు గంటలు కూడా కచ్చితంగా ఉంటలేదు. రాత్రిపూట ఇచ్చే రెండు గంటల్లో కూడా నాలుగైదు సార్లు ట్రిప్పు అయితాంది. గిట్టయితే వరి పంట పండుద్దా’ అని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితి ఒక్క బుచ్చయ్యదే కాదు. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతులందరిదీ. నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో వారు దిగులు చెందుతున్నారు. -
కరెంట్ కోత.. రైతుల గోస
నల్లగొండ రూరల్/కలెక్టరేట్, న్యూస్లైన్: రబీ సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం రైతులకు కరెంట్ షాక్ ఇస్తోంది. వ్యవసాయ రంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రబీ సీజన్ గట్టెక్కేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ చివరిలో భారీ వర్షాలు పడడంతో వేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయి. సమృద్ధిగా నీరుండడంతో ఖరీఫ్ నష్టాన్ని, పెట్టుబడులను రబీ సీజన్లో వెళ్లదీసుకుందామని భావించిన రైతులు పత్తి చేలను తొలగించి వరిసాగుకు సన్నద్ధమయ్యారు. ముందుగా తుకాలు (వరినార్లు) పోసిన రైతులు వరినాట్లు వేస్తుండగా మరికొందరు పొలం మడులు దున్నుతున్నారు. జిల్లాకు సరఫరా అయ్యే విద్యుత్కంటే అధికంగా వాడుతుండడంతో అధికారులు కోతలు పెడుతున్నారు. కలవర పెడుతున్న లోఓల్టేజీ సమస్య... వచ్చే అరకొర కరెంట్కు తోడుగా రైతులను లోఓల్టేజీ సమస్య కలవరపెడుతోంది. మోటార్లు ఆగి ఆగి పోస్తుండడంతో పారిన మడే మళ్లీ పారుతోంది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాడుబడిన బావుల్లోనూ నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు ఉన్న పొలా న్ని పూర్తిగా సాగు చేస్తున్నారు. దీంతో కరెంట్ వినియోగం పెరగడంతో లోఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటికి మించి మోటార్లు నడుస్తుండడంతో తరచు చెడిపోయి రైతులకు మరింత ఆర్థిక భారంగా మారుతున్నాయి. లోఓల్టేజీ కారణంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రోజూ నల్లగొండ ఎస్పీఎం షెడ్కు 12 నుంచి 15 వరకు వస్తున్నాయి. వీటిని రీపేరు చేసేందుకు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుండడంతో పొలం మడుల్లో తడారిపోతుంది. కాగా, ఖరీఫ్ సీజన్లో నెలకు 20 ట్రాన్స్ఫార్మర్లు కూడా రిపేరు కోసం వచ్చేవి కావు. అదనపు లోడుతో కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు... జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ రబీలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దశాబ్దకాలంగా పడావుపడిన బావులు, బోరులు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో ట్రాన్స్కో అధికారుల లెక్కల ప్రకారం 3 లక్షల 25 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అనధికారికంగా మరో 50 వేల దాకా ఉన్నాయి. దీంతో మన జిల్లాకు కేటాయిస్తున్న కోటా కంటే అదనంగా ఎక్కువ విద్యుత్ వినియోగమవుతోంది. అనధికార మోటార్ల వల్ల ట్రాన్స్ఫార్మర్ల మీద అదనపు లోడ్ పడి అవి తరచు కాలిపోతున్నాయి. అధికారిక విద్యుత్ కోతలు ఇలా... జిల్లా కేంద్రం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మున్సిపాలిటీలు.. ఉదయం 8 నుంచి 10, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మండల కేంద్రాలు.. ఉదయం 10 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గ్రామాలు.. పగటి పూట వ్యవసాయానికి ఇచ్చే సమయంలో మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో కోతలు పొద్దస్తమానం అమలు చేస్తున్నారు. -
అమ్మో ‘కోతలు’!
ఖమ్మం రూరల్, న్యూస్లైన్: ఈ ఏడాది కరెంట్ ‘కోతల’కాలం ముందే వచ్చింది. ప్రతియేటా వేసవి ప్రారంభం అయితేనే కోతలు విధించే ప్రభుత్వం ఈ ఏడాది ముందే మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ట్రాన్స్కో అధికారులు గురువారం సాయంత్రం నుంచి అధికారిక విద్యుత్కోతలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రబీ పంటలను సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే సాగుచేసిన పంటలు ఏమవుతాయో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ను ఎప్పుడో ఏమార్చిన ప్రభుత్వం ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంట్ వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. అధికారిక కోతలతో ఆమాత్రం కరెంట్ కూడా అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. సమయపాలనలేని సరఫరా.. ప్రస్తుతం వ్యవసాయానికి సరఫరా అవుతున్న ఉచిత విద్యుత్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. వాస్తవంగా ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూడు గంటలు సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు కరెంట్పోయి ఎప్పుడు వస్తుందో తెలియనిస్థితిలో రైతులు వ్యవసాయ బావుల వద్దే రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొత్తంగా రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంట్ సరఫరా చేయడం లేదని రైతులంటున్నారు. సమయపాలన లేని సరఫరా రైతుల ప్రాణాలమీదకు తెస్తోంది. కూసుమంచి మండలం జుజ్జుల్రావుపేటలో గతేడాది డిసెంబర్ 16న బక్కతట్ల వీరస్వామి అనే రైతు నారుమడికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్తో మృతి చెందారు. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రైతు నందిగామ భిక్ష్మారెడ్డి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి అకస్మాత్తుగా కరెంట్ రావడంతో విద్యుదాఘాతంతో మృతిచెందారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియనిస్థితిలో రైతులు బావుల వద్ద పడిగాపులు కాస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎండుతున్న పటలు... వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో రబీలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో రబీలో వరి 20,660 ఎకరాలు, మిర్చి 24,565 ఎకరాలు, మొక్కజొన్న 46,668 ఎకరాలు, వేరుశనగ 17,130 ఎకరాల్లో సాగు చేశారు. విద్యుత్ కోతలతో పంటలకు సరైన సమయంలో నీరందక వీటిలో కొన్ని పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోనే అత్యధికంగా వ్యవసాయ పంప్సెట్ కనెక్షన్లున్న తిరుమలాయపాలెం, కూసుమంచి మండలం రైతుల కష్టాలు వర్ణనాతీతం. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో వేసిన మిర్చి, కూరగాయ పంటలు విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతుండటంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 90 వేల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా అందులో ఒక తిరుమలాయపాలెం మండలంలోనే 11 వేల విద్యుత్ మోటార్లు ఉండటం గమనార్హం. రైతులు వాటిపై ఆధార పడి వివిధ పంటలు పండిస్తున్నారు. తర్వాత కూసుమంచి మండలంలో దాదాపు ఆరు వేలు, నేలకొండపల్లిలో 5,600, ఖమ్మం రూరల్లో 5,200 విద్యుత్ మోటార్లు ఉన్నాయి. మొత్తంమీద ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 27 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికింద రబీ పంటలు సాగవుతున్నాయి. ఇలా ఎడాపెడా కోతలు విధిస్తే ఇవన్నీ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులంటున్నారు. సరిగా విద్యుత్ సరఫరా చేయలేని ట్రాన్స్కో అధికారులు సర్చార్జీల పేరుతో తమ వద్దనుంచి రూ.లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కూసుమంచి మండలం పోచారంలో సర్చార్జి బిల్లు చెల్లించనందుకు రెండు నెలల కిత్రం ఓరైతు విద్యుత్మోటార్ కనెక్షన్ తొలగించారు. జిల్లాలో అక్కడక్కడా ఇదే పరిస్థితి ఉంది. వరి పండటం కష్టమే ఉచిత్ విద్యుత్ అని ప్రభుత్వం చెప్పుడే తప్పా.. కరెంటు ఏనాడూ ఇచ్చింది లేదు. కరెంటు కోసం రేయింబవళ్ళు పొలం వద్దనే కాపు కాస్తున్నా ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలీయడం లేదు. కరెంటు వచ్చిందని మోటార్ పెట్టే సరికి మళ్లీ పోతుంది. నీళ్ళందక వరి నాటు పెట్టలేక పోతున్నాం. పరిస్థితి ఇలానే ఉంటే పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలీయడం లేదు. - యాతం పాపిరెడ్డి, రైతు, బంధంపల్లి, తిరుమలాయపాలెం మండలం రాత్రి కరెంట్తో ఇబ్బందులు పడుతున్నాం రాత్రి వేళల్లో కరెంట్ ఇవ్వడంతో మోటార్లు పెట్టేందుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నాం. పగటిపూట కేవలం రెండు గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వడం, రాత్రి పూట మూడు గంటలు ఇవ్వడంతో చీకట్లో పొలాలకు వెళ్లక తప్పడం లేదు. ఇచ్చే సరఫరాలోనూ అంతరాయం కలుగుతోంది. వారంలో రెండు సార్లు మోటార్ కాలిపోయింది. ఒక్కసారి మోటార్ రీవైండింగ్ చేయిస్తే రూ.2000 వరకు ఖర్చు వస్తోంది. -ఎడవల్లి పుల్లారెడ్డి, రైతు, పాలేరు -
‘భూ చేతన’తో రైతన్నకు లాభం
గుడ్లవల్లేరు, న్యూస్లైన్ : జిల్లాలోని వ్యవసాయ సాగు భూముల్లో సూక్ష్మ ధాతువుల లోపాల్ని భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ భూ చేతన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రబీ సీజన్నుంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో 20శాతం పంట దిగుబడుల్ని పెంపొందించేందుకు ఈ పథకం దోహదపడుతోందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. సూక్ష్మ ధాతువులు సాగు నేలల్లో లోపించటం వల్లనే పంట దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయని ఏటా వేసవిలో సాగు నేలల్లో వ్యవసాయాధికారులు సేకరిస్తున్న మట్టి నమూనాలు చెబుతున్నాయి. అధికారులు గ్రామాల వారీగా సేకరించిన మట్టి నమూనాల్ని ఎప్పటికపుడు హైదరాబాదు భూ పరీక్షా కేంద్రానికి పంపుతారు. అక్కడి పరీక్షల్లో జిల్లాలోని కొన్ని గ్రామాల సాగునేలల్లో సూక్ష్మ ధాతువులు పూర్తిగా లోపించాయని తేటతెల్లమైంది. సూక్ష్మ ధాతువుల లోపాల వలన పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు సాగు నేలలో బతికే పరిస్థితి కనబడటం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐదు గ్రామాల్లో అమలు... ఈ పథకాన్ని జిల్లాలోని బంటుమిల్లి మండలం కొర్లపాడు, కలిదిండి మండలం కొండంగి, గూడూరు మండలం గురిజేపల్లి, గుడ్లవల్లేరు మండలం గాదేపూడి, ముదినేపల్లి మండలం వైవాక గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో క్లస్టరు(250ఎకరాలు)గా తీసుకున్నారు. ఈ గ్రామాల్లో 1,250మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సూక్ష్మ ధాతువుల్ని నివారించేందుకు వీరికి 50శాతం సబ్సిడీతో జిప్సం- 50టన్నులు, జింక్- 12.5టన్నులు, అగ్రిబోర్- 250 కిలోలు సరఫరా చేస్తున్నారు. ప్రాంతాల్ని బట్టి ఒక్కో రైతుకు ఎకరాకు జిప్సం- 40కిలోలు, జింక్- 10కిలోలు, అగ్రిబోర్- 400గ్రాముల్ని అందజేస్తున్నారు. మళ్లీ రెండేళ్ల వరకూ ధాతు లోపాలుండవు... ఒకసారి ఒక గ్రామంలో భూ చేతన పథకాన్ని అమలు చేస్తే ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు ధాతు లోపాల్ని భర్తీ చేసే విధంగా ఆ సీజనంతా పని చేస్తాం. మళ్లీ రెండేళ్ల వరకూ ఆ నేలల్లో ఆ ధాతు లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల్ని ఎప్పటికపుడు నిర్ధారించుకునే విధంగా రైతులకు శిక్షణ ఇస్తాం. పంటసాగుకు మేలైన కొత్త రకాల వంగడాల్ని సిఫారసు చేస్తాం. -జి.ప్రశాంత్కుమార్, జిల్లా భూ చేతన కో-ఆర్డినేటర్ -
కోతలు షురూ
నిజామాబాద్ నాగారం, న్యూస్లైన్: కరెంటు కోతలకు అధికారిక ముద్ర పడింది. వాస్తవానికి రబీ ప్రారంభంతోనే అనధికారికంగా కరెంటు కోతలు షురూ అయ్యాయి. గురువారం నుంచి అధికారికంగా కోతలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాన్స్కో సీఎం డీ కార్తికేయ మిశ్రా నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. నగ రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సబ్స్టేషన్లవారీగా వీటిని అమ లు చేస్తారు. గ్రామాలలో ఇక కష్టాలు తప్పేలా లేవు. ట్రాన్స్కో ఎస్ఈ నగేష్కుమార్ బుధవారం వివరాలను పత్రికలకు విడుదల చేశారు. నిజామాబాద్ నగరంతోపాటు, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్లలో నాలుగు గంటలు కోతలు విధించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా ఉండదు. జిల్లాలోని 36 మండల కేంద్రాలలో ఆరు గంటల కోతలు ఉంటాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా నిలిపివేస్తారు. సబ్స్టేషన్ ఉన్న ప్రాంతాలలో ఎమిమిది గంటల కోతలు విధిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకుు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సరఫరా ఉండదు. గ్రామాలలో ఏకంగా పన్నెండు గంటలు కోతలు విధిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరంతరాయంగా సరఫరా ఉండదు. కోతలు విధించనున్నారు. -
రబీపైనే ఆశలు
వరంగల్ సిటీ, న్యూస్లైన్: ప్రస్తుత రబీ సీజన్లో వివిధ పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. ఖరీఫ్లో పంటలకు తీవ్ర నష్టం జరగడంతో రైతులు ఇప్పుడు రబీనే నమ్ముకున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నందున ఎక్కువగా వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది రైతులు మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీఫ్లో పంట చేతికొచ్చిన సమయంలో వరుసగా వచ్చిన తుపాన్లతో రైతులు విలవిలలాడారు. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రూ.686 కోట్ల మేరకు రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. లక్నవరం, రామప్ప, పాకాల, మల్లూరు, చలివాగు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి కూడా నీటి విడుదలతో రబీలో పంటల సాగుకు ఢోకాలేదని భావిస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 915.8 మిల్లీ మీటర్లు కాగా, ఈ సారి 1225.9 మిల్లీ మీటర్లుగా నమోదుకావడంతో భూగర్భజలాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఎరువుల కొరత లేనప్పటికీ, రుణ ప్రణాళిక అమలుకు అధికారులు చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బోర్లు, బావులపై ఆధారపడి నారు పోసిన వారు నాట్లు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా వేస్తున్నారు. వచ్చేనెల మొదటి వారం వరకు నాట్లు ఊపందుకోనున్నాయి. వరిసాగుకే ప్రాధాన్యత ఆరుతడి పంటలు సాగు చేయూలని వ్యవసాయూధికారులు చె బుతున్నప్పటికీ రైతులు మాత్రం వరి సాగుకే సిద్ధమవుతున్నా రు. గత ఏడాది రబీలో 70,651 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగరుుంది. ఈ సారి లక్ష హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం పెరుగుతుం దని అంచనా. ఇప్పటికే బోర్లు, బావుల కింద వెయ్యి హెక్టార్ల మేరకు వరి నాట్లు వే శారు. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీరు విడుదల కాగానే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరి తర్వాత రైతులు ఎక్కువగా మొక్కజొన్నకు ప్రాధాన్యమిస్తున్నారు. మెట్టపంటగా తక్కువ మోతాదు నీటితో రెండు మూడు తడులతో ఈ పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో ఇప్పటికే జిల్లాలో 13,600 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టారు. మొత్తం ఈ పంట 50వేల హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రబీలో 40,600 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. ఎరువులున్నాయి... రబీకి సంబంధించి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. రబీలో యూరియా కొరత లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎరువులు జిల్లాకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు యూరియా 52,692 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,862 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 26,606 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఇక పొటాష్ ఎరువులు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. రూ.540 కోట్లతో రబీ రుణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు రూ.110 కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. రబీలో సమస్యలు తలెత్తకుండా చర్యలు : జేడీఏ రామారావు రబీలో రైతాంగానికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు చెప్పారు. రుణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామన్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం..
టమోటా రైతుకు కష్టకాలమొచ్చింది. ఆదాయం సంగతి దేవుడెరుగు.. పెట్టుబడి కూడా వస్తుందన్న నమ్మకం కలగడం లేదు. కూళ్లు కూడా రావని అనేక చోట్ల తోటల్లోనే టమోటా కాయలను వదిలేస్తున్నారు. మైదుకూరు టౌన్ న్యూస్లైన్: ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో..! నిన్నామొన్నటి వరకు చుక్క ల్లో విహరించిన టమోటా ధరలు నేడు ఢమాల్ అంటూ నేలమీదపడ్డాయి. రైతులను ఒక్కసారిగా గు ల్ల చేశాయి. మండలంలో గతేడాది 2వేల ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ ఏడాది అంతకు రెట్టింపు సాగు చేశారు. గతంలో రూ. 70-80లు పలికిన కి లో టమోటాలు నేడు 20 పైసల నుంచి 30 వరకు పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడి కాదు క దా కోత కోసేందుకు కూలి డబ్బులు కూడా రావడం లేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు.అక్టోబర్లో 30నుంచి 35 కిలోల టమోట బాక్సు ధర రూ.700 నుంచి 800 వరకు పలకగా.. ప్రస్తుతం అదే బాక్సు రూ.20లకు అడుగుతున్నారు. ఫ్రీగా ఇస్తాం అన్నా... పంట కోయడానికి ఒక్కో కూలికి రూ. 150లు ఇవ్వాలి. ఇదంతా ఎందుకని రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు ఫ్రీగా తీసుకెళ్లండని దళారులకు చెబుతున్నారు. మరికొందరు రైతులు పశువులకు, మేకలకు ఉపయోగించుకోమని పశుకాపరులకు చెబుతున్నారు. చిన్నమండెంలో.. చిన్నమండెంలో ఈ రబీసీజన్లో దాదాపు 620 ఎకరాల్లో టమోటా ను సాగుచేశారు. నెల రోజుల క్రితం 30కిలోల బాక్సు 1200 రూపాలున్న ధర,ప్రస్తుతం 30 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు డీలాపడిపోయారు. ఒక వైపు ధరలు తగ్గిపోవడం..మరో వైపు పంటకు సోకిన తెగుళ్లతో అప్పుల్లో కూరుకుపోయారు. ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు రెడ్డెయ్య. చాకిబండ గ్రామం. ఈయన మూడున్నర ఎకరాల్లో టమోటాను సాగు చేశారు. సాగుకు రూ. 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. దిగుబడి సమయానికి ధరలు పడిపోవడంతో దిగాలుపడ్డారు. ఎక్కువగా పంటను సాగు చేయటంతో ఇద్దరిని పనిపెట్టుకున్నామని, కనీసం అమ్మిన టమోటాల్లో వారి ఖర్చులకు కూడా రాలేదని వాపోతున్నారు. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు వెంకటస్వామి. ఊరు రెడ్డివారిపల్లె. రెండు ఎకరాల్లో టమోటాను సాగు చేశారు. పెట్టుబడి కింద రెండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. దిగుబడి సమయానికి ధరలు పడిపోవడంతో పాటు అదే సమయంలో పంట కు తెగుళ్లు సోకడంతో పెట్టుబడంతా నష్టపోయారు. కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు రాకపోవడంతో తోటలోని టమోటాలను కోయకుండా అలాగే వదిలిపెట్టినట్లు తెలిపారు. అప్పు చేసి పంట సాగు చేస్తే.. ఎకరాకు 30 నుంచి 40 వేలు అప్పు చేసి ఐదెకరా ల్లో టమో టా సాగు చేశా. ఈ పంటలో లాభం వచ్చింటే పొలంకోసం తెచ్చుకు న్న అప్పును, బ్యాం కులు ఉన్న అప్పును తీర్చుదును. అసలు పంట వేసినప్పుడునుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడ కో యలేదు. ఇక అప్పులెలా తీర్చుకోవాలి. -వెంకటసుబ్బయ్య, రైతు, కృష్టాపురం. కూలికి పోయిన్నా.. కూలి చేసుకున్నా రోజూ. 150 రూ వచ్చేవి. ఈ టమో టా సాగుచేయ డం వల్ల 3నెలల నుంచి రాత్రి పగులు కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోయింది. అడిగేవారులేక తోటలోనే వదిలేసినా. రమేష్, రైతు,విశ్వనాథపురం రైతులకు న్యాయం చేయాలి కడప అగ్రికల్చర్,న్యూస్లైన్: ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రైతులు సుమారు పదివేల ఎకరాల్లో టమోట పంట సాగు చేశారు. చిన్నమండెం,గాలివీడు, లక్కిరెడ్డిపల్లె,సంబేపల్లె, రాయచోటి, మైదుకూరు, చింతకొమ్మదిన్నె మండలాల్లో అత్యధికంగాను, మిగిలిన మండలాల్లో ఓ మాదిరిగాను సాగు చేశారు.పంట చేతి కందే సమయంలో ధరలు మార్కెట్లో కుప్పకూలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా మొత్తానికి కలిపి రోజుకు ప్రజలందరూ వాడినా 5,6 టన్నులే. కానీ మార్కెట్కు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తోందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. మార్కెట్కు అధిక దిగుబడులు రావడం.. అటు ఖరీఫ్, ఇటు రబీకాకుండాను మధ్యస్థంగా పంట రావడంతో ధరల సమస్య మొదలైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ధరలు అధికంగా ఉన్నప్పుడు అతిగా స్పందించే మార్కెటింగ్శాఖ అధికారు లు ధరలు పతనమైనప్పుడు ఎందుకు పట్టించుకోరని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. -
పంటల బీమాకు మంగళం!
వేంపల్లె, న్యూస్లైన్ : జాతీయ పంటల బీమా పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు గతంలో బాగా లబ్ధి చేకూరగా.. కాలానుగుణంగా నిబంధనలు కఠినతరం చేస్తూ వచ్చారు. పొమ్మనకుండా పొగబెట్టినట్లుగా రైతులే స్వయంగా ఈ పథకానికి దూరంగా ఉండే విధంగా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రయివేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఏ నిబంధనలు లేకుండా వ్యవసాయదారులు వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లిస్తుండగా.. ఈ ఏడాది రబీ సీజన్లో బుడ్డ శనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి తదితర పంటలకు మీసేవ ద్వారా ప్రీమియం చెల్లించాలని నిబంధనలు పెట్టారు. ఇదిలా ఉండగా పంటల బీమాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హులైన రైతులకే అందేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నామని ఒక వైపు ప్రభుత్వం చెబుతున్నా పథకానికి మంగళం పాడేందుకు షరతులు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో ప్రీమియం గడువును డిసెంబర్ 24 నుంచి 31వ తేదీవరకు విధించారు. కానీ ఈ దరఖాస్తు ఫారంలో ప్రీమియం చెల్లించే నాటికి పంట కాలం నెల రోజులు ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇప్పటివరకు ప్రీమియం చెల్లించిన ఏ ఒక్క రైతు కూడా ఈ నిబంధనతో పంటల బీమాకు అర్హులయ్యే అవకాశంలేదు. జిల్లా వ్యాప్తంగా 45వేలమంది రైతులు ఉండగా.. కేవలం 27,730మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికి వారు పెట్టే నిబంధనలకు బీమా వచ్చే అవకాశాలు లేవు. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన : రబీ సీజన్లో ప్రీమియం చెల్లించిన రైతుల పొలాల వివరాలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించి నిజంగా పంట సాగు చేసిన రైతులను గుర్తించాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అందులో భాగంగానే శనివారం నుంచి ఆయా మండలాల్లో ఏవోలు, ఏఈవోలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పరిశీలన చేస్తున్నారు.