rabi season
-
నత్తనడకన ఈ–కేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: రబీ సీజన్కి సంబంధించి ఈ–కేవైసీ( E-KYC) నమోదు నత్తనడకన సాగుతోంది. నోటిఫై పంటలకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి కాకపోతే పంటల బీమా పరిహారం పొందడంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. రబీ సీజన్లో సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 14 లక్షల మంది రైతులు 38.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 30 లక్షల ఎకరాల్లో (77 శాతం) సాగవుతున్న పంటలను మాత్రమే ఈ – పంటలో నమోదు చేశారు.ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం అసలు ముందుకు సాగడం లేదు. వీఏఏలు 27.60 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 23.95 లక్షల ఎకరాలకు సంబంధించి అథెంటికేషన్ పూర్తి చేయగా, కేవలం 4 లక్షల మంది రైతులు 10.88 లక్షల ఎకరాలకు (30 శాతం) మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేయగలిగారు. నోటిఫై పంటలకు ఈ–కేవైసీ తప్పనిసరిప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ క్రాప్ నమోదులో కొన్ని మార్పులు చేశారు. అన్ని పంటలకు 50 మీటర్ల పరిధిలో జియో రెఫరెన్స్ తప్పనిసరి చేసారు. నాన్ నోటిఫైడ్ పంటలు, సామాజిక అడవులకు సంబం«ధించి ఈ–కేవైసీని రైతులు ఇష్టపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. పంటల బీమా కోసం నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. తొలుత రైతులు సాగు చేసే పంట వివరాలను రైతు సేవాకేంద్రం (ఆర్ఎస్కే)లోని ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఫొటోలను ఈ–పంట యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ (ఈ–కేవైసీ) పూర్తయిన తరువాత భౌతికంగా రసీదులిస్తారు. కౌలుగుర్తింపు కార్డు లేక పోయినా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేరిటే నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రబీ సీజన్లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటల విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా 9.93 లక్షల ఎకరాలకే రైతులు బీమా చేయించుకున్నారు. అయితే ఎవరు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో బీమా చేయించుకున్నారో తెలియని పరిస్థితి. నోటిఫైడ్ పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతి ఎకరాకు ఈ–కేవైసీ నమోదు చేయాల్సిందే. లేకుంటే ఆ మేరకు పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించిన రైతులు నష్టపోతారు.ఫిబ్రవరి 25లోగా నూరు శాతం ఈ–కేవైసీనిర్ధేశించిన గడువులోగా ఈ–పంట నమోదు పూర్తవుతుందో లేదో అనే ఆందోళన నెలకొంది. నోటిఫైడ్ పంటలకు సంబంధించి నూరుశాతం ఈ–కేవైసీ నమోదు చేయాలన్న నిబంధనతో ఆర్ఎస్కే సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో వలంటీర్ల సహకారంతో ఈ–పంట నమోదుతో పాటుగా ఈ–కేవైసీ కూడా వేగంగా పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సర్వే బాధ్యతలు కూడా ఆర్ఎస్కే సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు సందర్భంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ–పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ నమోదుకు ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువిచ్చారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు ఆర్ఎస్కేల్లో జాబితా ప్రదర్శిస్తారు. 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మార్చి 15న తుది జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. మరోవైపు ఈ–పంట నమోదు కాకపోతే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారాన్ని రైతులు కోల్పోతారు. చివరికి పంట అమ్ముకునే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. -
సర్వర్లు పనిచేయవు...వెబ్సైట్ ఓపెన్ కాదు!
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి వెబ్సైట్లోనే అప్డేట్కు అవకాశం తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్సైట్లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. -
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్పుట్సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
96 శాతం ఈ–క్రాప్ నమోదు
సాక్షి, అమరావతి: రబీసాగు చివరి దశకు చేరుకుంటోంది. ఈసారి సాగుతో పాటు ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తికాగా, ఈ–కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ–కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్ నుంచి ఈ–క్రాప్ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్ ద్వారా డిసెంబర్ 8వ తేదీన ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్ల్యాండ్ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాపింగ్ చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకుంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ‘ఈ–ఫిష్’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ–క్రాప్లో బ్లాక్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు కాగానే రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు, ఈ–కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
జోరుగా రబీ సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు. అనంతపురంలో 70 శాతం సాగు రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది. సమృద్ధిగా ఎరువుల నిల్వలు రబీ సీజన్కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
Andhra Pradesh: రైతన్నకు ‘మద్దతు’
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇన్పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది. సోషల్ ఆడిట్లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
నిండుకుండల్లా జలవనరులు.. రబీకి జలసిరులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్లతో పాటు మేకపాటి గౌతమ్రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు. కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. -
ఖరీఫ్ సాగు భళా..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండటం.. కేసీ కెనాల్కు నీరు రావడంతో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీ‹ఫ్ సీజన్కు సంబంధించి సాధారణం కంటే అధికశాతంలో పంటలు సాగయ్యాయి. కొన్ని పంటలు వందశాతం, మరికొన్ని రెండువందల శాతం, ఇంకొన్ని మూడువందలశాతంపైగా కూడా సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సోయాబీన్ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగై రికార్డు సృష్టించింది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 91991 హెక్టార్లు ఉండగా ఖరీఫ్ ముగిసే ఆక్టోబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 1,10,514 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు. సాధారం కంటే ఈ ఏడాది 18,523 హెక్టార్లలో అధికంగా పంటలు సాగై 120.14 శాతం నమోదైంది. దీంతోపాటు ఈ క్రాపు, ఈకేవైసీ నమోదులోనూ రాష్ట్రంలోనే వైఎస్సార్జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అత్యధికంగా సాగైన సోయాబీన్ ఈ ఏడాది జిల్లాలో సోయాబీన్ పంటను అత్యధికంగా సాగు చేశారు. పొద్దుటూరు, పులివెందుల, పెద్దముడియం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్పల్లెతో పాటుపలు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో సోయాబీన్ సాధారణ సాగు 63 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,753 హెక్టార్లలో సాగు చేశారు. గతంలో మెట్టప్రాంతంలో ఏ పంటను సాగు చేయకుండా ఏగిలి పెట్టుకుని రబీ ప్రారంభం కాగానే శనగ సాగు చేసుకునేవారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం, పంటదిగుబడి కాలం 70 నుంచి 80 రోజులు కావడంతో ఎక్కువ మంది సోయాబీన్ ఖరీఫ్లో సాగు చేసుకున్నారు. తగ్గిన వరి విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడాది వరి సాగు తగ్గింది. సాధారణం కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు 32,741 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 27,058 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్నా చాలా మంది ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపారు. వరి సాగుకు ఖర్చులు పెరగడం, తెగుళ్లు ఎక్కువగా ఉండటం, పంట దిగుబడి సమయానికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది రైతులు సాగు తగ్గించారు.కొందరు రెండోపంటగా వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పాలి. రెండో పంట దిగుబడి సమయానికి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బెడద తగ్గుతుంది.అందువల్ల రైతులు ఆ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తగ్గిన వేరుశనగ..పెరిగిన మినుము సాగు విస్తీర్ణం... జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాధారణ సాగు 7,454 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3,787 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గత ఖరీఫ్లో జిల్లాలో 22,503 హెక్టార్లలో సాగైంది. మినుముకు సంబంధించి 1268 హెక్టార్లో సాధారణ సాగు ఉండగా 3838 హెక్టార్లలో సాగైంది. ఇతర పంటల సాగు వివరాలు ఇలా... జిల్లాలో పత్తి 17,303 హెక్టార్లలోసాగు చేయాల్సి ఉండగా 46,263 హెక్టార్లలో సాగై 267.37 శాతంగా నమోదైంది కుసుమ పంట 4 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 11 ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు పంట 874 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1870 హెక్టార్లలో సాగై 206.75 శాతం, టమాటా 1246 హెక్టార్లకుగాను 2041 హెక్టార్లలోసాగై 136 శాతం, ఉల్లి 3603 హెక్టార్లకుగాను 3690 హెక్టార్లలో సాగై 109.91 శాతం, రాగి 4 ఎకరాలకుగాను 7 ఎకరాల్లో సాగై 175 శాతం, ఆముదం 534 హెక్టార్లకుగాను 1031 ఎకరాల్లోసాగై 193.07 శాతం సాగయ్యాయి. çసజ్జలు, మొక్కజొన్న, కందులు, మిరప పంటలు సాధారణం కంటే తక్కువ హెక్టార్లలో సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది ప్రాజక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్ సీజన్లో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. సాధారణం కంటే అధికంగా సాగైంది. ఈ ఏడాది ఈ క్రాపు, ఈకే వైసీని కూడా వందశానికి మించి చేసి రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిపాం. చాలా సంతోషంగా ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి -
గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్కు నీరిస్తాం
మద్దిపాడు: వచ్చే రబీ సీజన్కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్కు, వచ్చే రబీ సీజన్లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు. గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్ కాలువల ద్వారా రిజర్వాయర్ నింపుతామని తెలిపారు. మూడో నంబర్ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు. వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్ హౌస్లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్ పార్క్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. -
సాగులో ‘డ్రోన్స్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై డ్రోన్లు ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో ఉపయోగాలెన్నో.. ► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు ► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు ► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు ► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు ► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు. ► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు సాధ్యమైనంత త్వరగా సీహెచ్సీల ఏర్పాటు డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
పొలంబడి.. కొత్త ఒరవడి
కడప అగ్రిక్చలర్: సేద్యం లాభసాటి కావాలి. సాంకేతిక సలహాలు, సాగు అధ్యయన అంశాలపై రైతులకు అవగాహన పెరగాలి. వ్యవసాయ అధికారులు పొలం వద్దకే వెళ్లి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి శాస్త్రీయ సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలనే ఉద్దశంతోతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో ఒక పొలంబడిని నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లావ్యాçప్తంగా 387 పొలంబడులను ఎంపిక చేశారు. ఇందులో వరి, పత్తి, అపరాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి. రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ఆధ్యయన అంశాలను వివరించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తక్కువ òపెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా సాధించవచ్చు? ఇందుకు శాస్త్రయ సాగు విధానం ఎలా ఉపయోగపడుతుందో రైతులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఒకటి, రెండు చొప్పున మాత్రమే పొలంబడులను నిర్వహించేవారు. అది కూడా కొన్ని పంటలకు మాత్రమే పరిమితం చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అన్ని పంటలకూ పొలంబడి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం బేస్లైన్ సర్వేను నిర్వహిస్తున్నారు. త్వరలో సాగుకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,93, 000 ఎకరాలు. ఇందులో వరి 32,741 హెక్టార్లలో, వేరుశనగ 7,454 హెక్టార్లలో, పత్తిపంట 17,303 హెక్టార్లలో, కందిపంట 3,685 హెక్టార్లలో, జొన్న 2021 హెక్టార్లలో, సజ్జలు 1,091 హెక్టార్లలో, మిరప 1070 హెక్టార్లలో, పసుపు 3420 హెక్టార్లలో, ఉల్లి 3603 హెక్టార్లలో, మొక్కజొన్న 624 హెక్టార్లలో, మినుములు 1268 హెక్టార్లలో, పొద్దు తిరుగుడు 874 హెక్టార్లలో, పెసర 225 హెక్టార్లలో, అముదం 534 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఇందులో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలసాగు చేపట్టగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ∙తక్కువ పెట్టబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా చూడటం. ∙ఇందులో ఎంపిక చేసిన గ్రామాల్లో 10 హెక్టార్లను గుర్తించి 20 నుంచి 30 మంది రైతులను భాగస్వాములను చేసి సహజ సి ద్ధవనరులతో సాగు చేయించడం. ∙భూసార పరీక్ష ఫలితాల అధారంగా ఎరువుల వినియోగంపై చైతన్యం కల్పించడం. ∙వానపాములు, సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిచేలా చూడటం. ∙ విత్తన శుద్ధితో చీడపీడల నివారణ, అంతర మిశ్రమ పంటల ద్వారా మిత్ర పురుగు వృద్ధి, పక్షి స్థావరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలియజేయడం. ∙రైతులను సాగు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేయడం, స్వయం నిర్ణయం తీసుకునేలా.. సాధికారత సాధించేలా సమగ్రశిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కార్యక్రమం ఉద్దేశం. ప్రతి నెల మంగళవారం నుంచి శుక్రవారంలోపు పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ప్రతి గ్రా మంలో 14 వారాలపాటు 30 మంది రైతులతో స్థానికంగా సాగు చేస్తున్న పంటలపై శిక్షణ ఇస్తారు. శత్రు, మిత్ర పురుగుల ఉనికిని గుర్తించి మిత్ర పురుగుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. పంటలో చీడపీడల పరిశీలన, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను వివరిస్తారు. రైతు లతో ముఖాముఖి మాట్లాడి శాస్త్రీయ సాగు విధానంపై పూర్థిస్థాయిలో అవ గాహన కల్పిస్తారు. సాగులో ఎదురయ్యే ఆటుపోట్లును అధిగమించేలా సాంకేతిక సలహాలిస్తారు. సాగు పెట్టుబడి వ్య యం 15 శాతం తగ్గించడం, దిగుబడిలో 15 శాతం అధికంగా అందేలా ప్రణాళికలను రూపొందిస్తారు. గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులు నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలస్థాయిలో పర్యవేక్షిస్తారు. సబ్డివిజన్ స్థాయిలో ఏడీఏæ, జిల్లాస్థాయిలో జేడీఏ పర్యవేక్షిస్తారు. త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్కు 387 పొలంబడి కా ర్యక్రమాలు నిర్వహించనున్నాం. త్వరలో ప్రారంభంకానున్న సీజన్కు అను గుణంగా ఆయా పంటల సాగు నుంచే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ సారి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా విద్యార్థులను ఈ కార్యక్రమంలో మమేకం చేయనున్నాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
పల్నాడు ప్రవర్ధిని
పల్నాడు జిల్లా ధాన్యసిరులతో తుల తూగనుంది. రబీలో సాగు చేసిన వరి పొలాలు కోతకొచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 బస్తాల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పంట సేకరణకూ ప్రభుత్వం సిద్ధమైంది. 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీలో 72,731 ఎకరాల్లో వరి సాగైంది. ప్రధానంగామాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం పంట కోతదశకొచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడిని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికి మద్దతు ధర కూడా ప్రకటించింది. సూపర్ ఫైన్ రకం క్వింటాకు రూ.1960, దుడ్డురకం క్వింటాకు రూ.1940 చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఖరీఫ్ కంటే భేష్ గత ఖరీఫ్ సీజన్లో సేద్య ఖర్చులు పెరగడంతోపాటు ఎలుకల బెడదతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 సెంట్ల నుంచి 30 సెంట్లలోని పంటను ఎలుకలు పాడుచేశాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలే దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు రబీ సీజన్ ఆశాజనకంగా ఉందని, ఖరీఫ్ మిగిల్చిన స్వల్ప నష్టాలను రబీ భర్తీ చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో చీడపీడల బెడద లేదని చెప్పారు. ఎకరానికి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టులో నీటి లభ్యత గతేడాది కంటే అధికంగా ఉండడం కూడా కలిసొచ్చిందని, ఏప్రిల్ 15 వరకు సాగు జలాలు విడుదలయ్యాయని తెలిపారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు్ల చేశాం. సోమ వారం నుంచి ఎక్కడైతే ధాన్యం పండించారో అక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గన్నీ బ్యాగులు, తేమను కొలిచే పరికరాలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొంటాం. – ఎ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ‘రబీ’ బాగుంది నాకున్న నాలుగెకరాల పొలంలోని రెండెకరాల్లో ఖరీఫ్లో వరిసాగు చేశా. 65 బస్తాల దిగుబడి వచ్చింది. రబీలో మూడెకరాలు పంట వేశా. దిగుబడి బాగుంది. చీడపీడలు లేవు. ఎలుకల బాధ అంతగా లేదు, ఖర్చు తక్కువగా ఉంది. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి 120 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. మరో మూడు నాలుగు రోజుల్లో వరికోత కోస్తా. – షేక్.సైదాసాహెబ్, విప్పర్ల, రొంపిచర్ల మండలం దిగుబడి పెరిగింది ఖరీఫ్లో ఆరెకరాలు వరిసాగు చేయగా 175 బస్తాలు దిగుబడి వచ్చింది. రబీలో మళ్లీ ఆరెకరాలు సాగు చేశా. ఈసారి పంట చాలా బాగుంది. పెట్టుబడి వ్యయం తగ్గింది. ఆరెకరాల మీద 240 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. 75 కేజీల బస్తా రూ.1500 వరకు పలుకుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. – చిలకా ఆదేయ్య, మాచవరం, రొంపిచర్ల మండలం -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
ఊపందుకున్న రబీ.. సాగు లక్ష్యం 60 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలు, భారీ వరదలతో మొదలైన రబీ సీజన్ క్రమంగా ఊపందుకుంటోంది. మొత్తం సాగు లక్ష్యంలో ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతినడంతో ఇక్కడ రెండోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా.. 2018–19లో 53.04 లక్షలు, 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో సాగైంది. చదవండి: నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు గతేడాది రెండో పంటకు నీరివ్వడం, వాతావరణం కలిసి రావడంతో 62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం రబీలో 60 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 124.45 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటివరకు 21.82 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండో పంటకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడం, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గనుండగా అపరాలు, చిరు ధాన్యాల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరి లక్ష్యం 21.50 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా.. 2019–20లో 19.38 లక్షల ఎకరాలు, 2020–21లో 23.49 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 3.33 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 4.67లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది వర్షాలు, వరదలవల్ల నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. పెరగనున్న అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2.05 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 1.13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 87వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల సాగు లక్ష్యం ఈ ఏడాది 24.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 14.32 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 8.22 లక్షల ఎకరాల్లో కందులు, 4.77 లక్షల ఎకరాల్లో మినుములు, 60వేల ఎకరాల్లో పెసలు సాగయ్యాయి. నూనె గింజల సాగు లక్ష్యం 3.67 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.17లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ 95 వేల ఎకరాల్లో సాగైంది. పొగాకు సాగు లక్ష్యం 1.77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 72 వేల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు లక్ష్యం 75 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. రాయలసీమలో రికార్డు వర్షపాతం సీజన్ ఆరంభంలోనే ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో 24.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 294 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 365.9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో 235.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, 431.2 మి.మీ.ల వర్షపాతం (82.9 శాతం అధికం) కురిసింది. కోస్తాంధ్రలో 381.2 మి.మీ.ల వర్షపాతానికి 416.2 మి.మీ.ల వర్షపాతం (9.2 శాతం అధికం) కురవగా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 271.7 మి.మీ.ల వర్షపాతానికి 259.4 మి.మీ.ల వర్షపాతం (–4.5 శాతం తక్కువ) కురిసింది. మళ్లీ నారు పోశాం 20 ఎకరాల్లో నెల్లూరు జీలకర్ర సన్నాలు రకం వరి నారుమడి వరదలకు కొట్టుకుపోయింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతో మళ్లీ నారుమళ్లు పోసుకున్నా. నాట్లు వేయాలి ఇక. – పి.విశ్వనాథ్, నెల్లూరు జిల్లా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు అకాల వర్షాలు, వరదలతో రబీ సీజన్ మొదలైంది. నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పోసుకుంటున్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి అపరాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్ను భవిష్యత్లో ఎఫ్సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
ఏపీ లోని రైతులకు శుభవార్త
-
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
అన్నదాతకు 'ఆర్థిక దన్ను'
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉండటంతో వారికి మరింత చేయూత లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రైతులతోపాటు కౌలుదారులకు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సీజన్ ఆరంభం కాగానే పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతంగా ఉండేవి. చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా అదునుకు రుణాలందేవి కావు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చేది. వచ్చిన పంటను అప్పు ఇచ్చినవాళ్ల చేతిలో పెట్టగా మిగిలిందే రైతులకు దిక్కయ్యేది. ఒకవేళ పంట విపత్తు బారిన పడితే ఆ అప్పులు తీర్చేదారి కనిపించేదికాదు. రెండేళ్లుగా ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే చేతికందుతున్న వైఎస్సార్ రైతుభరోసాతో నారుమళ్లు పోసుకునేందుకు ఇబ్బందిలేకుండా ఉంది. 2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు ప్రభుత్వం రైతుకు దన్నుగా ఉండటంతో వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019–20 వ్యవసాయ సీజన్లో రూ.1.15 లక్షల కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా.. 94,47,103 మంది రైతులకు రూ.1,13,998 కోట్ల రుణాలిచ్చాయి. ఖరీఫ్లో పంట రుణాలు 48.60 లక్షల మందికి రూ.52,669 కోట్లు, టర్మ్ రుణాలు 6,36,266 మందికి రూ.12,908 కోట్లు ఇవ్వగా.. రబీలో పంటరుణాలు 34,48,181 మందికి రూ.36,604 కోట్లు, టర్మ్ రుణాలు 5,02,656 మందికి రూ.11,817 కోట్లు ఇచ్చాయి. 2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 2020–21 వ్యవసాయ సీజన్లో రూ.1,28,659 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులు జనవరి 20 నాటికి 69,87,298 మంది రైతులకు రూ.90,558 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. గడిచిన ఖరీఫ్లో రూ.75,237 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56,74,500 మంది రైతులకు రూ.74,155 కోట్లు (99శాతం) ఇచ్చాయి. దీన్లో 48,19,306 మంది రైతులకు రూ.57,575 కోట్ల పంటరుణాలు, 8,55,194 మందికి రూ.16,580 కోట్ల టర్మ్ రుణాలు ఉన్నాయి. 2019 ఖరీఫ్తో పోలిస్తే గడిచిన ఖరీఫ్లో పంటరుణాలు రూ.4,906 కోట్లు, టర్మ్రుణాలు రూ.3,672 కోట్లు అదనంగా ఇచ్చాయి. రబీలోను అదే జోరు ప్రస్తుత రబీ సీజన్లో రూ.53,422 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకులకు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 13,12,798 మంది రైతులకు రూ.16,403 కోట్లు ఇచ్చాయి. పంటరుణాలు రూ.36,407 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 11,33,185 మంది రైతులకు రూ.12,584 కోట్లు అందజేశాయి. టర్మ్రుణాలు రూ.17,015 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,79,613 మంది రైతులకు రూ.3819 కోట్లు ఇచ్చాయి. సీసీఆర్సీపై రూ.లక్ష రుణమిచ్చారు. నాకు సొంతంగా ఎకరం ఉంది. ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. దాళ్వాలో కంద, క్యాబేజీ, మినుము సాగుచేస్తున్నా. కౌలుకార్డు (సీసీఆర్సీ) ఇచ్చారు. ఆ కార్డుపైనే మా గ్రామంలో సహకార బ్యాంకులో అప్పు కోసం దరఖాస్తు చేశా. రూ.లక్ష మంజూరు చేశారు. గతంలో ఇలా కార్డుపై ఎప్పుడూ రుణం పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. – పావులూరి మురళీకృష్ణ, కౌలురైతు, పెద ఓగిరాల, కృష్ణాజిల్లా లక్ష్యానికి మించే రుణాలిస్తాం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించే రుణాలిస్తాం. ఖరీఫ్లో 99 శాతం రుణాలిచ్చాం. రబీలో ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలిచ్చాం. వచ్చే రెండు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలిస్తాం. – బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ కౌలురైతులకు విరివిగా రుణాలు 2020–21 వ్యవసాయ సీజన్లో బ్యాంకులు 1,81,102 మంది కౌలుదారులకు రూ.760 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 4,13,278 మంది సాగుదారులకు క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డు (సీసీఆర్సీ) జారీచేయగా, వారిలో 58,772 మందికి వ్యక్తిగతంగా రూ.318 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ కార్డుదారులతో ఏర్పాటైన 16,387 జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్జీ), రైతుమిత్ర గ్రూపు (ఆర్ఎంజీ)ల్లోని 1,22,330 మందికి రూ.442 కోట్ల రుణాలు మంజూరు చేశారు. -
రబీ.. రయ్ రయ్
సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తోంది. లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఇప్పటికే సాగులోకి వచ్చింది. రబీ అధికారికంగా అక్టోబర్ ఒకటిన మొదలైనా నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో పంటలు వేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి, పునాస పంట కోతలు ప్రారంభం కాగా.. రైతులు రెండో పంట వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఓ వైపు ఖరీఫ్ పంటల్ని ఒబ్బిడి చేసుకుంటూనే.. మరోవైపు రబీ పంటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా సాగయ్యే వాటిలో వరి, శనగ, మినుము తదితర పంటలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందజేసిన రైతు భరోసా సాయంతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందుబాటులోకి రావడంతో రైతులు కాడీ, మేడీ పట్టి ముందుకు సాగుతున్నారు. రబీలో సాగు విస్తీర్ణం 22.75 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సీజన్కు అవసరమైన 15 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై సరఫరా చేస్తోంది. 2,71,612 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేయగా.. ఇప్పటికే 69,389 మంది రైతులు ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలను అందుకున్నారు. రబీకి అవసరమైన యూరియా సహా అన్నిరకాల ఎరువుల్ని అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. సాగులోకి వచ్చిన పంటల వివరాలివీ.. రబీలో వరి సాగు విస్తీర్ణం 7.12 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 24 వేల హెక్టార్లలో వేశారు. 11 వేల హెక్టార్లలో నూనె గింజలు, 32వేల హెక్టార్లలో శనగ, 4 వేల హెక్టార్లలో అపరాలు, మిగతా విస్తీర్ణంలో ఇతర పంటల్ని ఇప్పటికే విత్తారు. ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. -
సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు
సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కన్నా 33 వేల హెక్టార్లు ఎక్కువ. రబీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రబీకి సంబంధించిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. మేలైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచే ఆర్డరు చేసుకునేలా వ్యవసాయ శాఖ పెద్దఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. రబీ సాగు ప్రణాళిక ఇలా.. రబీ సీజన్ అక్టోబర్ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్లో ప్రధానంగా పండించే పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలున్నాయి. 8.05 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయించడం ద్వారా 57.12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. 4.03 లక్షల హెక్టార్లలో శనగ, 3.85 లక్షల హెక్టార్లలో మినుము, 1.36 లక్షల హెక్టార్లలో పెసర, 70 వేల హెక్టార్లలో పొగాకు సాగు విస్తీర్ణంగా ఉంది. ఆర్బీకేల వద్ద సబ్సిడీ విత్తనాలు గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచే మేలైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటే భరోసా ఉంటుందని ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. ముందుగా పరీక్షించిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు సరఫరా చేస్తుంది. రబీలో రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాభివృద్ధి సంస్థ 4,08,151 క్వింటాళ్ల వివిధ రకాల వంగడాలను సిద్ధం చేసింది. ఇందులో చిరుధాన్యాలైన కొర్ర, ఊద, అరిక, సామ, ఆండ్రు కొర్రలు వంటివి కూడా ఉన్నాయి. ఎరువుల పరిస్థితి రబీ సీజన్కు కావాల్సిన మొత్తం ఎరువులు 25.04 లక్షల టన్నులు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏయే నెలలో ఎంతెంత అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు సిద్ధం చేసింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు 10 లక్షల టన్నుల యూరియా, 2.50 లక్షల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల మ్యూరేట్ పొటాషియం, 9 లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్షన్నర టన్నుల ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్పేట్), 4 టన్నులు ఇతర ఎరువులు కావాల్సి ఉంటాయని భావిస్తోంది. -
రబీ రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తోంది. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆగస్ట్ నెలాఖరు వరకు రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ.. నెల్లూరు వంటి జిల్లాల్లో ఆలస్యంగా కోతలు ప్రారంభించడం, ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో అక్కడక్కడా ధాన్యం తడిసిపోయింది. దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీజన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు ఉపశమనం కల్పిస్తోంది. సీజన్ ముగిసినా కొనుగోళ్లు ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1,442 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.6,088.51 కోట్లు విలువ చేసే 32.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ► ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని అక్టోబర్ 31వ తేదీ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ► గ్రామ స్థాయిలోనే ధాన్యం సేకరించడం వల్ల కొనుగోలు కేంద్రాలు లేదా మిల్లులకు తరలించేందుకు అయ్యే రవాణా చార్జీల భారం నుంచి రైతులు బయటపడ్డారు. ► లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, అండమాన్, నికోబార్ దీవులకు బియ్యం పంపించి మన రాష్ట్రం అక్కడి ప్రజల ఆహార కొరత తీర్చగలిగింది. ► ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశారు. -
31,53,524 మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. ► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎమ్మార్) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
రబీలో రికార్డు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2019–20 రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 31.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ ఏడాది 3.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అదనంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ► దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఇందులో మొదటి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. ► తెలంగాణ 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 31.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచాయి. ► లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో తొలుత ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ సారి రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో రైతులకు రవాణా కష్టాలు కూడా తగ్గాయి. ► గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ చర్యల వల్ల దళారుల మోసాల నుంచి రైతులకు మిముక్తి లభించింది. ► రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. కాగా, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయం. ► ఇప్పటి వరకు 31.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. ► గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,835, సాధారణ రకం ధాన్యానికి రూ.1,815లను మద్దతు ధరగా నిర్ణయించారు. ► ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రేపటి (జూన్ 20 శనివారం) వరకే కొనుగోలు చేస్తారు. ► మొత్తం 1,434 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ. -
'వరి'వడిగా..
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల కొరత లేదు, యంత్రాలూ సిద్ధంగా ఉండటంతో కోతలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందటంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇలా... ► ఖరీఫ్లో 48.10 లక్షల టన్నుల ధాన్యాన్ని 4,57,823 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ.8755 కోట్లు ఉంటుంది. 11 జిల్లాల్లో 1702 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రబీలో ఎలా జరుగుతోందంటే... ► ఇప్పటివరకు 1,295 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, అనంతపురంలో తెరవాల్సి ఉంది. ► 1.63 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.299.28 కోట్లు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోంది. వరి సాగు ఇలా... ► ఖరీఫ్లో 15,18,984 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా 14,67,069 హెక్టార్లు సాగు అయింది. రబీలో సాగు విస్తీర్ణ లక్ష్యం 6,98,398 హెక్టార్లు కాగా అంతకుమించి రికార్డు స్థాయిలో 8,06,803 హెక్టార్లలో సాగయింది. రబీలో 60,14,189 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ► ఖరీఫ్లో హెక్టార్కు దిగుబడి 5,248 కిలోలు కాగా రబీలో హెక్టార్కు రికార్డు స్థాయిలో 7,095 కిలోలు ఉండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో రబీలో హెక్టార్కు 5,928 కిలోలు దిగుబడి ఉంది. ► లాక్డౌన్తో రబీ కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ► అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరి కోత యంత్రాలను అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. ► రాష్ట్రంలో 2,985 కంబైన్డ్ హార్వెస్టర్లు, 1,746 వరి రీపర్లు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల అద్దె గంటకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంది. ఇంతకు మించి ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే సమీపంలోని వ్యవసాయాధికారికి లేదా 1902కి రైతులు ఫిర్యాదు చేయవచ్చు. రైతులకు వ్యవసాయ కమిషనర్ సూచనలు ఇవీ... ► లాక్డౌన్ వల్ల కూలీలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం హార్వెస్టర్లను తరలిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ► ఇతర జిల్లాల నుంచి కూడా హార్వెస్టర్లను తెప్పించి పాస్లు ఇచ్చాం. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ► ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.1815, ఏ గ్రేడ్ రకం రూ.1835కి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఈ ధర కన్నా ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దు. ► వరి కోతలు, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించండి. మాస్క్లు ధరించండి. 3 కిలోల అదనంపై సీఎంకు ఫిర్యాదు... ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు క్వింటాల్కు అదనంగా మూడు కిలోలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా తిరువూరు రైతులు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా 17 శాతం తేమను బట్టి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉండగా 21 శాతం తేమ ఉందంటూ తరుగు తీసుకుంటున్నారని, గోనె సంచులు రైతులే తెచ్చుకోవాలంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో రైతు సుమారు రూ.55 వరకు నష్టపోతుండటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించింది ‘మా జిల్లాలో 80 శాతం వరికోతలు యంత్రాల ద్వారానే సాగుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభంలో రూ.3,000 చొప్పున అద్దె వసూలుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంది’ – కె.చిరంజీవి, పెరవలి,పశ్చిమ గోదావరి జిల్లా -
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఈసారి ‘పంట’ పండింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలకూ అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్ (2019–20) సీజన్లో అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరిస్తే.. పుష్కలంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్థిక గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.68 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి అంచనా కన్నా ఇది ఎక్కువ. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి, పత్తి, వేరుశనగ, కంది దిగుబడులు కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. గణనీయంగా పెరిగిన దిగుబడులు.. ఏపీలోని ప్రధాన పంటల దిగుబడులన్నీ పెరిగాయి. గతంలో హెక్టార్కు 5,029 కిలోలుగా ఉన్న వరి ఈ ఖరీఫ్లో 5,166 కిలోలకు చేరింది. జొన్న, సజ్జ, చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్కు రెండు మూడింతలు పెరిగాయి. 2018–19లో హెక్టార్కు 130 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,013 నుంచి 2,322 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్కు గతేడాది ఖరీఫ్లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. వేరుశనగ దిగుబడి హెక్టార్కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది. ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఖరీఫ్లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఖరీఫ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. ఒక్క పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపకరించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ జలకళను సంతరించుకోవడంతో గరిష్టంగా అరకోటి ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి చేసిన, పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కిందే 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చే అవకాశముండగా, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిన సాగు జరగనుంది. సాగర్ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు.. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ప్రాజె క్టులో నీటి నిల్వలు 315 టీఎంసీల మేర ఉన్నాయి. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలున్నాయి. తాగునీటి అవసరాలకు మరో 25 టీఎంసీల వరకు అవసరముంటుంది. తాగునీటికి పక్కనపెట్టినా, మరో 50 టీఎంసీల మేర తెలంగాణకు వాటా దక్కే అవకాశం ఉన్నందున పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్వకుర్తి కింద కనిష్టంగా 3 లక్షల ఎకరాలు.. ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశముంది. కల్వకుర్తికి కనిష్టంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 25 టీఎంసీల మేర నీటి కేటాయింపులు చేయనున్నారు. జూరాలపై లక్ష ఎకరాలు, దానిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాల పరిధిలో చెరో రెండు లక్షల ఎకరాల మేర కలిపి 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 600లకు పైగా చెరువులు నింపారు. వీటికింద కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం ఉంది. 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వఉన్న 90 టీఎంసీలతో పాటు లోయర్మానేరు డ్యామ్ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చెరువులు నింపే కార్యక్రమం జరుగుతోంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా చెరువులు నింపుతూ నీరు వదులుతున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలు దేవాదుల కింద ఇప్పటికే 7 టీఎంసీల గోదావరి నీటితో 300 చెరువులకు నీరివ్వడంతో పాటు ఆయకట్టుకు నీరిస్తున్నారు. యాసంగిలోనూ మరో 12 నుంచి 13 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటే ఏఎంఆర్పీ, కాళేశ్వరం నదీ జలాలను ఎత్తిపోసే పరిమాణాన్ని బట్టి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి రానుంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. వీటిద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆస్కారముంది. చెరువుల కిందా జోరుగానే.. ఈ ఏడాది చెరువుల కింద గరిష్ట సాగుకు అవకాశముంది. ఇప్పటికే 43 వేలకు పైగా ఉన్న చెరువుల్లో 22 వేల చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మొత్తం చెరువుల్లో 17 వేల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 4,700 చెరువులు 75 శాతం వరకు నీటితో ఉన్నాయి. వీటితో పాటే సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని తరలించేలా 3 వేల తూముల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే వెయ్యికి పైగా పూర్తయ్యాయి. ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తి స్థాయిలో నింపే అవకాశముంది. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, 14 లక్షలకు తగ్గకుండా సాగు జరిగే అవకాశముంది. ఇక ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, ఇందులో ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. మొత్తంగా చిన్న నీటి వనరుల కిందే 16 లక్షల ఎకరాల మేర సాగుకు ఈ ఏడాది నీరు అందే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. 2.52 లక్షల ఎకరాల్లో రబీ సాగు సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సీజన్ సాగు లక్ష్యం, ఇప్పటివరకు ఎంత సాగైందన్న వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు నివేదించింది. దాని ప్రకారం రబీ సాధా రణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో (8%) సాగైంది. అందులో అత్యధికంగా వేరుశనగ సాగైంది. వేరుశనగ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1.67 లక్షల (51%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు లక్ష్యం 2.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52,500 ఎకరాల్లో (18%) సాగయ్యాయి. అందులో కేవలం శనగ పంట సాగైంది. ఇక రబీలో కీలకమైన వరి సాధారణ సాగు 17.07 లక్షల ఎకరాలు కాగా, నాట్లు మొదలు కావాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురవడం, రిజర్వాయర్లు, చెరువులు నిండిపోవడంతో లక్ష్యానికిమించి వరి నాట్లు పడతాయని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక మొక్కజొన్న రబీ సాధారణ సాగు లక్ష్యం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 ఎకరాల్లో (2%) మాత్రమే సాగైంది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నాగర్కర్నూలు జిల్లాలో 64% విస్తీర్ణంలో రబీ పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా లో 53% సాగయ్యాయి. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలోనూ పంటల సాగు మొదలుకాలేదని నివేదిక తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికం ఈ ఏడాది వర్షాలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి ఆలస్యంగా మొదలైనా, ఆగస్టు నుంచి పుంజుకోవడంతో ఇప్పటివరకు అధిక వర్షాలే కురుస్తున్నాయి. జూన్లో 33 శాతం లోటు కనపడింది. జూలైలో 12 శాతం లోటున్నా సాధారణ వర్షపాతంగానే రికార్డయింది. ఇక ఆగస్టులో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏకంగా 92 శాతం అధికంగా కురవడం విశేషం. ఆ తర్వాత రబీ మొదలైన అక్టోబర్ నెలలోనూ ఏకంగా 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం ఇక పంట రుణాలపై బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. గత ఖరీఫ్లో 102 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి ఏకంగా 131 శాతం సాగైంది. గత ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇచ్చింది రూ.16,820 కోట్లే. ఇక రబీ సీజన్ ప్రారంభమైనా రుణాలు అత్యంత తక్కువగానే ఇచ్చాయి. రబీ పంట రుణ లక్ష్యం రూ.17,950 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచి్చనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పెద్ద ఎత్తున వరి నాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఆదుకోకుంటే రైతులకు అప్పులు మాత్రమే మిగులుతాయని అంటున్నారు. -
అంచనాలకు మించి పంటల సాగు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ సీజన్ ఆశించిన దానికన్నా గొప్పగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ముమ్మరంగా వర్షాలు కురుస్తుండడం.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లన్నీ పొంగిపొర్లుతుండడం.. సాగర్ కుడికాల్వకు ఇప్పటికే నీళ్లు వదలడం వంటివన్నీ ఇందుకు శుభసూచనలేనని అటు రైతులు ఇటు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు మిగిల్చిన స్వల్ప లోటును ఈశాన్య రుతుపవనాలు అధిగమించడంతో పాటు ఇప్పటి వరకు 1.2% మిగులు వర్షాలు కురిసినట్లు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇదే పెద్ద రికార్డు. ఫలితంగా ఖరీఫ్లో సాగులోకి రాని విస్తీర్ణాన్ని ప్రస్తుత రబీ భర్తీచేస్తుందని అధికారులు భావిస్తున్నారు. నీటి సౌకర్యం బాగా ఉండడంతో ప్రత్యేకించి దాళ్వా వరిసాగు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 22.77లక్షల హెక్టార్లు కాగా.. ఈసారి లక్ష్యం 25.84 లక్షల హెక్టార్లు. ఇందులో 7.40 లక్షల హెక్టార్లలో వరి, 3.96 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, చిరుధాన్యాలు.. 11.53 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు, 1.63 లక్షల హెక్టార్లలో నూనె గింజలు, పొగాకు 91 వేల హెక్టార్లు, మిర్చి 23 వేల హెక్టార్లు, ఉల్లి 800 హెక్టార్లు, కొత్తిమీర 700 హెక్టార్లు, 300 హెక్టార్లలో పత్తి సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా, సాధారణంగా రబీ సీజన్లో వరి సాగు 6.98లక్షల హెక్టార్లకు మించదు. కానీ, ఈసారి 7.40లక్షల హెక్టార్లలలో సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది రిజర్వాయర్లనీ నిండుగా తొణికలాడుతుండడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు సాగర్ కుడికాల్వకు జలకళ నాలుగైదేళ్లుగా నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద నాట్లు పడలేదు. తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి. అందుకు భిన్నంగా ఈసారి సెప్టెంబర్ నుంచే కాలువకు నీళ్లు వదిలారు. ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ముందుగానే నార్లు పోసుకుని ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. అలాగే, గుండ్లకమ్మ రిజర్వాయర్ కింద కూడా ఈసారి వరి వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలలో నాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆయాచోట్ల 12వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలలో పునాస పంటగా పిలిచే ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత నాట్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ జిల్లాలలో వరి పొట్టదశ దాటి గింజ పోసుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి కోతలు మొదలవుతాయి. మరోవైపు.. ప్రస్తుత రబీకి 14,180 క్వింటాళ్ల వరి వంగడాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై పంపిణీ చేసింది. ఆశాజనకంగా ఖరీఫ్ వరి ఇదిలా ఉంటే.. ఖరీఫ్లో సాగవుతున్న వరి పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 15.19 లక్షల హెక్టార్లయితే 14.67 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, వరదలకు రాష్ట్రంలో అక్కడక్కడా కొంత ముంపునకు గురైనా ఇప్పుడు అంతా తేరుకుని పరిస్థితి సజావుగా ఉందని తెలిపారు. పలు ప్రాంతాలలో పంట గింజ పోసుకుంటోందని వివరించారు. కలిసొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతుభరోసా పథకం అన్నదాతలకు కలిసొచ్చింది. చిన్న, సన్నకారు, మధ్య తరహా, కౌలు రైతుల మొదలు పెద్ద రైతుల వరకు.. అందరికీ అమలవుతున్న ఈ పెట్టుబడి సాయం.. రైతులు బ్యాంకులను, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా చేసింది. రైతుల ఖాతాలకే నేరుగా నగదు జమ కావడం.. ఆ మొత్తాన్ని వేరే అప్పుల కోసం బ్యాంకులు సర్దుబాటు చేసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలివ్వడంతో రైతులు ఆ మొత్తాన్ని సాగుకు వినియోగించుకోగలుగుతున్నారు. -
రబీకి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రబీకి విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెల 1 నుంచి రబీ సీజన్ ప్రారంభం కావడంతో ప్రణాళిక పూర్తి చేసింది. ఈ రబీలో 5 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు చేసి, కొన్ని విత్తనాలను క్షేత్రస్థాయికి పంపింది. సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం రూ.87.09 కోట్లు కేటాయించింది. అందులో 75 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలకు సబ్సిడీ రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. రబీలో సాగు చేసే శనగ, వేరుశనగ విత్తనాలను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపారు. శనగలు 1.5 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 75 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచనున్నా రు. మొత్తం సరఫరా చేసే విత్తనాల్లో వరి 2.5 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 12 వేల క్వింటాళ్లు, పప్పుధాన్యాల విత్తనాలు 8,500 క్వింటాళ్లు రబీకి అందజేయనున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేస్తారు. జిల్లాల్లో 22,767 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచగా, అందులో 20,136 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. గడ్డకట్టిన యూరియా అంటగట్టేలా చర్యలు.. రబీకి కూడా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు పెంచాలని వ్యవసాయ శాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ రబీకి కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రాష్ట్రానికి కేటాయించింది.lవాస్తవానికి రాష్ట్ర అవసరాలకు 7.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించింది. యూరియాను ఎంఆర్పీ ధరకే విక్రయించాలని నిర్ణయించారు. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ ఫీజు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గడ్డకట్టిన పాత యూరియాను రైతులకు అంటగట్టాలని మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల గడ్డకట్టిన యూరియా ఉంది. అది 2013–14 నుంచి 2015–16 మధ్యకాలంలో గోదాముల్లో పేరుకుపోయి ఉంది. దాన్ని ఎలాగైనా రైతులకు, సహకార సొసైటీలకు అంటగట్టాలని భావిస్తోంది. కానీ రైతులు, సహకార సొసైటీలు దీన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. ధర తక్కువ ఉన్నా కూడా అవసరం లేదని రైతులు చెబుతున్నారు. కానీ ఎలాగైనా అంటగట్టాల్సిందేనని జిల్లాలకు మార్క్ఫెడ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూరియా 45 కిలోల బస్తాలతో ఉండగా, పాత యూరియా 50 కిలోల బస్తాలతో ఉన్నాయి. -
వరి పెరిగె... పప్పులు తగ్గె..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం సీజన్లో ఏకంగా 28.49 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.64 కోట్ల టన్నులకు చేరింది. అంటే అదనంగా 54 లక్షల టన్నులు పెరిగింది. ఇక కీలకమైన పత్తి దిగుబడి పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేల్స్ ఉత్పత్తి కాగా, 2018–19లో కేవలం 2.87 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 52 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిందన్నమాట. గులాబీ పురుగు కారణంగా దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయినట్లు కేంద్రం అంచనా వేసింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా కాస్త మందగించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల టన్నులకు పడిపోయింది. అంటే 5 లక్షల టన్నులు తగ్గింది. ఇక నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.22 కోట్ల టన్నులకు పెరగడం గమనార్హం. మొక్కజొన్న 2.72 కోట్ల టన్నులు, సోయాబీన్ 1.37 కోట్ల టన్నులు, వేరుశనగ 66 లక్షల టన్నులకు పెరిగింది. చెరుకు రికార్డు స్థాయిలో 40.01 కోట్ల టన్నులు ఉత్పత్తి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మూడో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 2018–19 సీజన్లో ఖరీఫ్, రబీ కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 91.93 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే 2018–19 సీజన్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2016–17లో 1.01 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండగా, 2017–18 సీజన్లో 96.20 లక్షలకు పడిపోయింది. ఈసారి ఇంకాస్త పడిపోవడం గమనార్హం. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014–15లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 72.18 లక్షల టన్నులు మాత్రమే. ఆ తర్వాత 2015–16లో ఇంకా తగ్గి 51.45 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే అప్పటినుంచి పెరుగుతూనే వస్తుంది. వర్షాలు, సీజన్లను బట్టి ఉత్పత్తి వత్యాసాలు ఉన్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
దిగుబడి లేదు.. ధరా లేదు
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఖరీఫ్ సీజన్లో వచ్చి తిత్లీ తుపానుతో నియోజకవర్గంలోని వరి పంట మొత్తం నాశనమైంది. రైతులకు ఖరీఫ్ వరి పంట పెట్టుబడి కూడా మిగల్లేదు. రబీ సీజన్లో అపరాల పంటలపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అపరాల విస్తీర్ణం పెరిగినప్పటకీ వరుణుడు కరుణించకపోవడం, చీడపీడలు అధికం అవ్వడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులకు అందని మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర మాత్రం అపరాల పంట పండించే రైతులకు అందడంలేదు. నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాల్లో రబీ సీజన్లో అపరాల పంటను సాగు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను కొనుగోలు చేసి పండించారు. పంట చేతికందక ముందు ధరలు విపరీతంగా పెంచి, పంట చేతికందే సమయానికి గిట్టు బాటు ధర లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు వేసిన నాటి నుంచి వర్షాలు లేవు. వాతావరణం అనుకూలించక పోవడంతో పంటకు చీడపీడలు ఆశించి దిగుబడులు కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే పరిమితమవుతోంది. మద్దతు ధరకు బయట మార్కెట్ ధరలకు పొంతన ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు ధర రైతులకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. బయట మార్కెట్లో 100 కిలోల పెసల ధర రూ.5 వేలు, మినుములు బస్తా రూ.3200లకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసలు వంద కిలోలకు రూ.7 వేలు, మినుములు వంద కిలోలకు రూ.5,600 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెసలు, మినుములు కొనుగోలు చేయడంలేదు. అపరాల పంటను ఎండ వేస్తున్న రైతు పెరిగిన పెట్టుబడి.. అపరాల పంట ఎకరాకు కనీసం 4 నుంచి 5 వందల కిలోల దిగుబడులు వస్తుండేవి. ఈ సంవత్సరం అందులో సగం కూడా రాని పరిస్థితి. పంటకు అనుకూలించక పోవడంతో రెండు నుంచి మూడు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. విత్తనాల పెట్టుబడి, పంట తీయడానికి, నూర్పుడిలు చేయడానికి ఎకరానికి సుమారు రూ.8 వేలవరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. కనీస దిగుబడులు కూడా రాకపోవడంతో మినుము, పెసర పంటను తీయకుండా ఆవులకు మేతగా చాలా చోట్ల విడిచిపెడుతున్నారు.ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గింది ఖరీఫ్ సీజన్లో వరి పంట పూర్తిగా నష్టపోయాం. అపరాల పంటపై ఆశలు పెట్టుకున్నాం. పంట దిగుబడి తగ్గడంతో కూలీలు ఖర్చు కూడా గిట్టు బాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – ఎం.సోమేశ్వరరరావు, రైతు, లక్కవరం -
అందని రబీ పెట్టుబడి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం జిల్లాలో కొంతమంది రైతులకే పరిమిత మవుతోందనే వాదన వినిపిస్తోంది. రబీ సీజన్ ప్రారంభమై జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో చెక్కుల అందజేసి బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రబీలోనూ చెక్కు లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా ముందస్తు ఎన్నికలతో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లాలో ఇంకా దాదాపు 23వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టుబడి పైసలు వస్తాయా రావా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ తోటివారికి డబ్బులు వచ్చి తమకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ రైతుబంధు రైతన్న దరికి చేరడం లేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే కొద్దిరోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. మరో నెల గడిస్తే రబీ ముగియనుంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు సాయం అందకపోవడంతో బ్యాంకుల, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరీక్షణ.. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి 23,113 మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదు. 20 మండలాల్లో భూమి కలిగిన రైతులు 1,36,718 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.120,74,92,810 పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,433 మంది రైతులకు రూ.90,29,26,930 డబ్బులు చెల్లించారు. మొత్తం 136718 రైతులకు గాను అధికారులు 1,21,268 మంది రైతుల వివరాలు సేకరించి అన్లైన్లో నమోదు చేశారు. పరిశీలన అనంతరం 1,18,918 మంది రైతులను గుర్తించారు. 15450 మంది రైతులు అందుబాటులో లేరని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు తప్పని ఎదురుచూపులు.. పెట్టుబడి సాయం అందని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, బ్యాంకుల్లో జమకానున్నాయని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే మీ ఫోన్కు మెస్సేజ్ వస్తుందని ఆ తర్వాతే రావాలని చెబుతున్నారు. పెట్టుబడి సొమ్ము వస్తుందని చాలా మంది రైతులు రబీలో అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అప్పుకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుకార్లతో ఆందోళన.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రైతుబంధుపై దుష్ప్రచారం నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతుబంధు తాత్కాలికమే అని వస్తున్న పుకార్లతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇవి కేవలం గాలి వార్తలే అని కొట్టిపారేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దశల వారీగా అందరి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాయం అందడంలేదు నాకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. వారసత్వంగా వచ్చింది. ఆభూమిని నా పేరుపై ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. నాకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో మెదటి విడత చెక్కులు అందలేదు. రెండో విడత కూడా వచ్చేలా లేదు. నాలాంటి వాళ్లు మండలంలో చాలమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాస్ పుస్తకాలు అందించాలి. – వామనరావు, రైతు, మహదేవ్పూర్ వారంలో సాయం అందిస్తాం.. వారంలో రైతులకు సాయం అందనుంది. ట్రెజరీకి వివరాలు పం పించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సబంధించి రైతుల నుంచి ఏఈఓలు వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల చివరలో కేంద్ర సాయం కూడా అందనుంది. – గౌస్ హైదర్, ఏడీఏ -
కరువు ప్రకటన కలేనా.!
కడప అగ్రికల్చర్ : రబీ సీజన్లో సాగు చేసిన పంటల నివేదికను పంపాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినా ఆ దిశగా మెజార్టీ ప్రభుత్వ శాఖలు నివేదికలు పంపలేదు. దీంతో కరువు ప్రకటన వెలువడలేదనే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 11 శాఖలు తమకు ఇచ్చిన అంశాలను పొందుపరుస్తూ ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ తగు నివేదికలు పంపాలని విపత్తులశాఖ జనవరి నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు గడచినా ఇంతవరకు కొన్ని శాఖలు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లోని విపత్తుల నిర్వహణ విభాగానికి వివరాలు పంపలేదని ఆ విభాగం అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా వర్షపాతం, వర్ష విరామం, వాతావరణ పరిస్థితులు, భూగర్భజలాల స్థితిగతులు, , తాగునీటి వనరులు, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పంటల సాగు, పంట దిగుబడులు, పంటకోత ప్రయోగాల వివరాలు, ఉపాధి హామీ, కూలీలకు కల్పిస్తున్న పనుల నివేదిక, పాడిపరిశ్రమ, పశుపోషణ, పశుగ్రాసం నిల్వలు, గ్రాసం కొరత, పశువుల, జీవాల వలసలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని 11 శాఖలు నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడచిపోయింది. ఈ విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తమ నివేదికను తయారు చేసి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. రెండు సీజన్లలోనూ నష్టమే.. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ సీజన్కుగాను పంటలు దెబ్బతినగా ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.15.58 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. మామూలుగా అయితే ఒక్క సీజన్ పంటలకే ఇన్పుట్ చెల్లించే విధంగా విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే 2018–19లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణను, మార్గదర్శకాలను సడలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీని ఆధారంగా ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జె.మురళీకృష్ణ రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించిన ప్రాథమిక అంచనాల నివేదికను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూ.71.36 కోట్లు అవసరమవుతుందని జిల్లా కలెక్టర్కు నివేదికను అందజేశారు. అయితే మారిన నిబంధనల ప్రకారం విపత్తుల విభాగం అధికారులు పలు అంశాలను జోడించి ఆయా అంశాల వారీగా నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ నెల రోజులు కావస్తున్నా ఆయా శాఖలు మాత్రం నివేదికలు ఇవ్వలేదు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, షెడ్యూల్ విడుదల చేస్తే కరువు ప్రకటన వెలువడే అవకాశం ఉండదని రైతు సంఘాలు అంటున్నాయి. రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. జిల్లా నుంచి నివేదికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు ఇంతవరకు పంపలేదు. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జోక్యం చేసుకుని వెంటనే నివేదికను పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆయా శాఖలలో చలనం లేకపోవడం గమనార్హం. రబీలో ఏర్పడిన కరువు, పంటల పరిస్థితి, దిగుబడులు, వర్షపాతం, భూగర్భజలాల స్థితి తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు పంపింది. ఇది ఇలా ఉండగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా పంటల సాగు, విస్తీర్ణం, ఆయా పంటల స్థితిగతులపై నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ రబీలో సాధారణ పంటల సాగు 1,72,929 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, ఉలవ, మొక్కజొన్న, మినుము పంటలున్నాయి. అయితే ఈ పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టం చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు కూడా తీరలేదని పంటకోత ప్రయోగాలు చెబుతున్నాయి. రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటిస్తే ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించే అవకాశం ఉందని అ«ధికారులు చెబుతున్నారు. -
రబీలో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: రబీలో వరి సాగు వద్దని, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కాలం కలసి రాకపోవడం, అనేక చోట్ల బోర్లు, బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో వరి వేస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా జిల్లా వ్యవసాయాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి వనరులున్నచోట మాత్రమే వరికి వెళ్లాలని, మిగిలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నట్లు రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో రబీలో అనుకున్న స్థాయిలో వరి నాట్లు పడలేదు. వరి నాట్లు పుంజుకోలేదు. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు కేవలం 10 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు లక్ష ఎకరాల లోపే నాట్లు పడ్డాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలుకాగా 2 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అలాగే మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పురుగు కారణంగా మొక్కజొన్న నాశనమై పోయింది. దీంతో పరిస్థితిని గమనించిన వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలే మేలు... వరికి ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సాహించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ, కలెక్టర్ ఇప్పటికే ‘రబీలో వరి వద్దు... ఆరుతడి పంటలే మేలంటూ’పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. సాగునీటి వనరులు లేకపోవడంతో వరి వైపు వెళ్లి నష్టపోకూడదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఎకరా వరి సాగయ్యే నీటితో కనీసం మూడెకరాల ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారానైతే ఐదారు ఎకరాలూ సాగు చేసుకోవచ్చు. పైగా పంటల మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి కూడా ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి కంటే కూడా పొద్దు తిరుగుడు, శనగ, నువ్వుల పంటకాలం కూడా తక్కువుంటుందని, పైగా ఆరుతడి పంటలకే మద్దతు ధర అధికంగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,770 అయితే, పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ. 5,388 ఉందని తెలిపింది. సాగు ఖర్చు కూడా తక్కువని పేర్కొంది. ప్రస్తుతం రబీ కోసం 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో జిల్లాల్లో ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 65 వేల క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. ఇక రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికకు వెళ్లాల్సి ఉన్నందున ఇతర విత్తనాలను కూడా ఆగమేఘాల మీద అందుబాటులో ఉంచాలని రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. -
రబీ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీలో నీరిచ్చే అవకాశాలు సజీవమయ్యాయి. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటిలభ్యత ఉండటంతో అక్కడ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, మిగతా నీటిని రబీ అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) నిర్ణయించింది. ఎస్సారెస్పీ, కడెం, నాగార్జున సాగర్ పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండగా, నిజాంసాగర్, సింగూరు, జూరాల ప్రాజెక్టు ల్లో నిల్వలు ఆశించినంత లేని కారణంగా కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం శివమ్ కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్కుమార్తోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింద తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యతిస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టు నుంచి నీటి విడుదల కోసం రైతుల నుంచి వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగింది. ఎస్సారెస్పీలో తాగునీటి కోసం పక్కన పెట్టగా కాకతీయ కెనాల్కు 15 టీఎంసీల నీటిని పంటలకు సప్లిమెంటేషన్ చేసేలా విడుదల చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నీటితో కనిష్ఠంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇక లక్ష్మి కెనాల్, సరస్వతి కెనాల్ కింద చెరో 1.6 టీఎంసీల నీటితో 40వేల ఎకరాలకు ఇవ్వవచ్చని వివరించారు. దీనికి శివమ్ కమిటీ ఓకే చెప్పింది. ఇక కడెం కింద సైతం 2 టీఎంసీలతో గూడెం లిఫ్ట్ ద్వారా 20వేల ఎకరాలకు నీరిచ్చేందుకు సమ్మతించింది. నాగార్జునసాగర్ కింద ప్రస్తుతం 23 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నందున దీనిద్వారా కనిష్టంగా 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అయితే ఎన్ని తడులకు ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇవ్వాలన్న దానిపై తుది నిర్ణయం ఇంకా చేయలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలు, గడ్డెన్నవాగు కింద మరో 2వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. -
ఊహలు.. ఆశలు
వర్షాలు పడడం లేదు. ఏం చేయలేం. ఈ ఏడాదికి ఇంతే.. సోమశిలలో నీరు తక్కువగా ఉంది. ఉన్న దాంట్లో సర్దుకోండి. ఇది పాలక పక్షం తీరు. నీటి కేటాయింపులు మొదలుకొని సాగు విస్తీర్ణం వరకు అన్నీ ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయాయి. లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన అధికార గణం తక్కువ ఎకరాలకు నీటి కేటాయింపులు ప్రకటించారు. అదేమని సభలో ప్రశ్నిస్తే జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం పడితే వాటితో ఈ ఏడాది గట్టెక్కేద్దామంటూ పాలకుల జవాబు. గురువారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం ఊహలు, ఆశలు, నామమాత్రపు కేటాయింపులతో ముగిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రబీ సీజన్ రైతుల ఆశలకు అధికారులు పాలకులు గేట్లు వేశారు. రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. వానలు లేవు.. సోమశిలలో ఉన్న నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న రైతాంగాన్ని ఉస్సూరుమనిపించారు. జిల్లాలో గతేడాది 50.02 టీఎంసీల నీటిని సోమశిల నుంచి విడుదల చేసి 4.98 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉంది. సోమశిలలో నీటి నిల్వ తక్కువగా ఉందని 31 టీఎంసీల నీటిని 3.21 లక్షల ఎకరాలకు ఇస్తామని ప్రకటించారు. 2015 నుంచి కరువు కోరల్లో జిల్లా కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది అయితే జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రైతులు అందరు సోమశిల సాగునీటిపైనే ఆశలు పెంచుకున్నారు. మరో వైపు 63 శాతం లోటు వర్షపాతం నమోదు కావటంతో సోమశిల నీరే ఆధారంగా జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. అయితే అధికారులు ముందు చూపు లేకపోవటం గతంలో సోమశిలకు వచ్చిన వరద నీటిని కండలేరుకు వదిలి అక్కడి నుంచి చెన్నై, చిత్తూరు జిల్లాలకు తాగునీటి అవసరాలకు తరలించడం వంటి పరిణామలతో ఈ ఏడాది సోమశిలలో నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రతి ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి, నీటి కేటాయింపులు ప్రకటించగానే దానికి అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేది. అక్టోబర్లో ముగించాల్సి ఉన్న సాగునీటి సమావేశాన్ని నవంబర్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. సోమశిల రిజర్వాయర్లో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 42 టీఎంసీల నీరు ఉంది. డెడ్ స్టోరేజ్ లెవల్, తాగునీటి అవసరాలకు పోనూ 31 టీఎంసీల నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో డెల్టాలో 1.91 లక్షల ఎకరాలకు ఉత్తర, దక్షిణ కనుపూరు, కావలి పరిధిలో ఉన్న ఆయకట్టులో 50 శాతం అయకట్టుకు మాత్రమే నీరిస్తామని ప్రకటించారు. కండలేరులో ఉన్న 13 టీఎంసీల నీటిని మనుబోలు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు తిరుపతి, చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. మోటార్లు కట్టడి చేస్తేనే నీరు అక్రమ మోటార్ల ద్వారా జిల్లాలో నీటిని తోడేస్తుంటారు. ముఖ్యంగా కావలి కెనాల్ పరిధిలో 48 వేల అనధికార మోటార్లు, కనుపూరు కెనాల్ కింద 32 వేల అనధికార మోటార్ల ద్వారా నీటిని కొందరు తోడేస్తున్నారు. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులకు ప్రతి మో టారుకు 10 వేల చొప్పున వసూలు చేసి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి భూముల రైతులకు నీరు అందని పరిస్థితి. రైతు సంఘ నాయకులకుఅవకాశం కల్పించాలి నెల్లూరు(పొగతోట): జిల్లా సాగు నీటి సలహా మండలి (ఐఏబీ)లో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్.అమర్నాథ్రెడ్డికి విష్ణువర్ధన్రెడ్డి, రైతు సంఘాల నాయకుడు బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించగలిగితే రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. సాగునీరు అందక చివరి భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వీలైనంత నీటిని అధిక ఎకరాలకు కేటాయించాలన్నారు. నీటిని విడుదల చేయని ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మంచి నీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందేలా చెరువులకు నీటిని విడుదల చేయాలని కోరారు. -
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
రెండో విడత రైతుబంధుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రైతుబంధు సొమ్ము పంపిణీకి సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలోగా పెట్టుబడి సొమ్ము పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఆ లోగానే పెట్టుబడి సాయం రైతులకు ఇస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ రైతుకూ పెట్టు బడి సొమ్ము ఇస్తారు. ఆయా రైతులు సాగు చేసి నా, చేయకపోయినా పెట్టుబడి సొమ్ము అందనుంది. ఖరీఫ్లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలై తే, రబీలో 31.92 లక్షల ఎకరాలే. పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్ లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్డులా? చెక్కులా? ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేలు అందజేసిన సంగతి తెలిసిం దే. ఆ ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే చెక్కులను గ్రామాలకు సరఫరా చేసింది. ఇప్పటివరకు 49 లక్షల చెక్కులను రైతులకు అందజేశారు. 9 లక్షలకు పైగా చెక్కులు మిగిలిపోయాయి. వాటి ల్లో దాదాపు లక్షన్నర చెక్కులకు చెందిన రైతులు చనిపోయారు. మరో లక్ష చెక్కులు ఎన్ఆర్ఐలకు సంబంధించినవి. మిగిలినవి ఇతరత్రా కారణాల తో తీసుకోలేదు. రెండో విడత రైతుబంధు సొమ్ము ను రైతులకు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డుల వంటి వాటిని ఇవ్వాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీపై సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. దీంతో బ్యాంకు కార్డులు ఇస్తే అంత ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. చెక్కులను ఇస్తేనే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో చెక్కులవైపే సర్కారు మొగ్గు చూపుతుందని అనుకుంటున్నారు. కాగా, జిల్లాల్లో మిగిలిపోయిన చెక్కులను వెనక్కు పంపా లని వ్యవసాయశాఖ ఆదేశించింది. అందుకు కారణాలు వివరిస్తూ నివేదిక పంపాలని పేర్కొంది. -
రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి!
సాక్షి, హైదరాబాద్ : రబీ సీజన్లోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు భావిస్తోంది. ఖరీఫ్లో రైతు బంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ రబీలోనూ అందజేయాలని యోచిస్తోంది. ఈ లెక్కన రబీలో రైతులు సాగు చేసినా, చేయకపోయినా ఆర్థిక సాయం అందనుంది. ఖరీఫ్లో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును అందజేయనున్నారు. అయితే రబీలో మాత్రం కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం గతంలో నిర్ణయించింది. పంటలు సాగు చేసిన రైతుల లెక్కలు తేల్చి.. వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని భావించారు. అయితే తాజాగా ఆ నిర్ణయానికి సవరణ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం’అని చెప్పారు. వాస్తవానికి ఖరీఫ్ కంటే రబీలో పంటల సాగు మూడో వంతుకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. రబీ విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రబీ నాటికి నీరందితే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగు కానుందని అంటున్నారు. రూ.12 వేల కోట్ల బడ్జెట్ ఉందిగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఖరీఫ్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించి, రబీలో కొందరికే ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైగా రబీలో ఎవరు సాగు చేశారు, ఎవరు చేయలేదన్నది తేల్చడం కష్టమైన వ్యవహారం. ఖరీఫ్లో విజయవంతంగా అమలు చేసి, రబీలో వివాదంగా మారితే అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్కారులో ఉంది. ఎలాగూ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించినందున రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తే వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చన్నది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు. రబీలోనూ అందరికీ పెట్టుబడి సొమ్ము ఇచ్చే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. -
చేతికి రాని పంట!
మోర్తాడ్(బాల్కొండ):సాధారణంగా రబీ సీజనులో ఈదురు గాలులు, అకాల వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాల పరిమితిలో చేతికి వచ్చే వరి రకాలను సాగు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసిన కేఎన్ఎం 118 రకం వరి వంగడాలను రుద్రూర్ పరిశోధన కేంద్రంలో సీడ్ ప్రాసెసింగ్ చేసి రైతులకు సరఫరా చేశారు. దాదాపు 900 సంచుల కేఎన్ఎం 118 రకం వరి విత్తనం ఉండటంతో ఈ విత్తనాలను రైతులకు ఈ రబీ సీజనుకు గాను పరిశోధన కేంద్రం ఉద్యోగులు విక్రయించారు. జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్పల్లి, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్ తదితర మండలాల్లోని రైతులు ఈ కొత్త రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో సాగు చేశారు. 125 రోజుల్లో వరి పంట చేతికి వస్తే అకాల వర్షాలు రాక ముందే పంట కోత దశకు చేరుకుంటుందని రైతులు ఆశించారు. సాధారణంగా రబీ పంటల సాగు డిసెంబర్లోనే మొదలు పెడుతున్నారు. డిసెంబర్లో నారు పోస్తే జనవరిలో పంటను నాటుతారు. ఈ లెక్కన ఏప్రిల్ రెండో వారంలో పంట కోత దశకు చేరుకుంటుంది. నెలలు, రోజుల ప్రకారం లెక్కలు వేసిన రైతులు కేఎన్ఎం 118 రకం వరిని సాగు చేశారు. శాస్త్రవేత్తలు ప్రకటించిన ప్రకారం 125 రోజుల్లో వరి పంట చేతికి రావాల్సి ఉంది. అయితే 145 రోజులు గడుస్తున్నా ఇంకా వరి పంట కోత దశకు చేరుకోలేదు. ఈ పంట చేతికి రావాలంటే మరో 10 రోజుల సమయం పడుతుంది. వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట ఇంకా కోత దశకు చేరుకోకపోవడంతో రైతులు తమ పంట పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేఎన్ఎం 118 రకం తక్కువ కాల పరిమితితో పాటు ఎకరానికి 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఈ రకం వరి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేశారు. దిగుబడి మాట ఎలా ఉన్నా పంట కోత దశకు చేరుకోకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఖరీఫ్లోనే తక్కువ సమయంలో చేతికి వస్తుంది కేఎన్ఎం 118 రకం ఖరీఫ్లోనే 125 రోజుల్లో కోతకు వస్తుంది. రబీలో 10 రోజుల కాల పరిమితి ఎక్కువ అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రకారం ఇంకా పది రోజుల సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఈ వంగడాన్ని మేము కేవలం ప్రాసెసింగ్ మాత్రమే చేశాం. ఉత్పత్తి చేసిన వారు కునారం వారు.– ప్రభాకర్రెడ్డి,శాస్త్రవేత్త, రుద్రూర్ పరిశోధన కేంద్రం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్కు చెందిన రైతు బద్దం ప్రసాద్ రబీలో అకాల వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే వరి రకాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇచ్చిన ఒక ప్రకటన చూసి కేఎన్ఎం 118 రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి పది ఎకరాల్లో వరిని సాగు చేశారు. కేఎన్ఎం 118 రకం సాగు చేస్తే 125 రోజుల్లో పంట కోతకు వస్తుందని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాని బద్దం ప్రసాద్ సాగు చేసిన వరి పంటకు 145 రోజులు గడచిపోయినా పంట ఇంకా కోత దశకు చేరుకోలేదు. ఈ పంట కోత దశకు చేరుకోవాలంటే మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఒక బద్దం ప్రసాద్కు సంబంధించిన సమస్యనే కాదు. జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. -
గట్టెక్కించిన సీలేరు
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది. నీటి ఎద్దడి ఉందన్నా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు. సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది. ఇప్పటికీ సీలేరు నుంచే.. డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ డ్రాప్ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది. -
‘కొనుగోలు’ ప్రణాళిక సిద్ధం చేయండి
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రబీ ధాన్యం కొనుగోళ్లపై గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మే నెలలో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోదాంలకు దగ్గరగా ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా తాడిపత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గన్నీ బ్యాగ్ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో 259 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 62 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. సీఎంఆర్ రికవరీ 99.5 శాతం పూర్తయిందని, ఇంకా రెండు మిల్లర్ల నుంచి ధాన్యం రావాల్సి ఉందన్నారు. డిఫాల్టర్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టామని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 2,739 దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినట్లు వెల్లడించారు. సివిల్ సప్లయి కార్పొరేషన్ డీఎం హరికృష్ణ, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్వో కృష్ణప్రసాద్, మార్కెటింగ్ ఏడీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారధాన్యాలు.. 27.74 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా భారీగా పెరిగింది. దేశంలో 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లో ఆహారధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతాయ ని కేంద్రం అంచనా వేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ రెండో అంచనా నివేదికను బుధవారం విడుదల చేసింది. 2016–17 సీజన్లో 27.51 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2017–18 సీజన్లో 27.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. గతేడాది కంటే 23 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి కానున్నాయి. అందులో వరి ఉత్పత్తి గతేడాది 10.97 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.10 కోట్ల టన్నులు దిగుబడి రానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి గతేడాది 2.31 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కానున్నాయి. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.98 కోట్ల టన్నులకు పడిపోనున్నాయి. పత్తి ఉత్పత్తి గతేడాది 3.25 కోట్ల బేళ్లు కాగా, ఈసారి 3.39 కోట్ల బేళ్లు ఉత్పత్తి కానుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నులకే పరిమితమైంది. వరి ఉత్పత్తి లక్షం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని వెల్లడించింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 2.94 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి గణనీయంగా 3.71 లక్షల టన్నులకు చేరింది. అందులో కంది ఉత్పత్తి లక్ష్యం 2.03 లక్షల టన్నులు కాగా, 2.84 లక్షలకు చేరింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 15.70 లక్షల టన్నులకు పడిపోయింది. పెసర 64 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, 59 వేల టన్నులకు పడిపోయింది. మినుముల ఉత్పత్తి లక్ష్యం 26 వేల టన్నులు కాగా, నూటికి నూరు శాతం ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో నిరాశపరిచిన ఆహారధాన్యాల ఉత్పత్తి, రబీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 44.72 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అందులో వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నులు అవుతుందని అంచనా వేసింది. -
రబీ కొనుగోళ్లకు 161 కేంద్రాలు
సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం 161 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీవో, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను మార్చి మూడో వారంలో ప్రారంభించాలని, అందుకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజే ట్యాబ్ల్లో నమోదు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీటివసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా, హమాలీల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పుటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్డీవో బి.రవీందర్, డీఎస్వో పద్మ, జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అనిల్కుమార్, మార్కెటింగ్శాఖ జిల్లా మేనేజర్ షాహబొద్దీన్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయాధికారి కె.తిరుపతి, ఐకేపీ ఏపీఎం పర్శరాం తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సాగు నీటి ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణను పకడ్బందీగా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. బుధవారం భారీ ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణ, సాధించిన ఆయకట్టు, మిషన్ భగీరథ అవసరాలపై సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో మంత్రి జలసౌధలో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీలో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలకు, ఎల్ఎండీ దిగువన 1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్ భగీరథ అవసరాలకు జలాశయాల్లో నీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలన్నారు. అక్రమంగా తూములు, కాల్వలు పగులగొట్టకుండా, గేట్లను ఎత్తివేయకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. 19 లక్షల ఎకరాలకు నీరు.. ప్రస్తుతం శ్రీరాంసాగర్లో 10 టీఎంసీల నీరు ఉందని చీఫ్ ఇంజనీర్ మంత్రికి తెలిపారు. మరో నాలుగు తడులకు 4 టీఎంసీల నీరు అవసరమని.. మిగతా 6 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ అవసరాలను వినియోగిద్దామని చీఫ్ ఇంజనీర్ అన్నారు. ఏప్రిల్ 16న ఎస్సారెస్పీ కాల్వ మూసివేయాలని, మార్చి 20న ఎల్ఎండీ కాలువ మూసివేయాలని హరీశ్ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టీఎంసీలు, సాగర్లో 30 టీఎంసీలు మొత్తం కలిపి 62 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. ఇప్పటికే 7 తడులకు నీటిని విడుదల చేశామని, మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసముందన్నారు. ఏప్రిల్ 5న సాగర్ ఎడమ కాలువ తూము మూసివేయాలని హరీశ్ సూచించారు. ఈ రబీలో శ్రీరాంసాగర్ కింద 6 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 5 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సీతారామ ఎత్తిపోతలపైనా మంత్రి హరీశ్ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. సీతారామ లిఫ్ట్ పథకం ఫేజ్ –1లో 3 పంప్హౌస్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్, తుమ్మల అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సీఎస్ జోషికి సన్మానం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జలసౌధకు వచ్చిన ఎస్కే జోషిని మంత్రి హరీశ్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా, ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షించిన జోషి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. తన 34 ఏళ్ల సర్వీస్లో ఎందరో మంత్రులను చూశానని, కానీ హరీశ్ వంటి మంత్రిని చూడలేదని జోషి అన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి మంత్రి పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు. -
10 జిల్లాల్లో మొదలుకాని రబీ సాగు
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ పంటల సాగు ఊపందుకోలేదు. పది జిల్లాల్లోనైతే అసలు ఒక్క ఎకరాలో కూడా పంటల సాగు మొదలు కాలేదు. మేడ్చల్, మెదక్, నల్లగొండ, యాదాద్రి, జయశంకర్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రబీ పంటల సాగు మొదలు కాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.67 లక్షల ఎకరాల్లో సాగు కావాలి. గతేడాది ఇదే సమయానికి 3.45 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు కేవలం 2.47 లక్షల ఎకరాలకే (8%) సాగు పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 23.7 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 87,500 ఎకరాల్లోనే (4%) సాగయ్యాయి. పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.15 లక్షల ఎకరాలు కాగా, 72,500 ఎకరాల్లో (23%) సాగయ్యాయి. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలైతే, 67,500 ఎకరాల్లోనే (29%) సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.47 లక్షల ఎకరాల్లో (39%) సాగుచేశారు. వరి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 15.1 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఇంకా నాట్లు మొదలు కాలేదు. పత్తిని ఇంకా గులాబీరంగు పురుగు పట్టిపీడిస్తోందని వ్యవసాయశాఖ వెల్లడిం చింది. వరంగల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నాగర్కర్నూలు, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గులాబీ కాయతొలుచు పురుగుతో పత్తి పరిస్థితి అధ్వానంగా ఉంది. -
కృష్ణమ్మ.. కరుణిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: గత నెల రోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు.. రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఖరీఫ్ పూర్తిగా డీలా పడ్డా..రబీ ఆశలు మాత్రం సజీవమవుతున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండేందుకు దగ్గరవడం, ఇక వచ్చే నీరంతా దిగువన సాగర్లోకి చేరనుండటం ఆయకట్టు రైతాంగాన్ని ఆనందంలో ముంచుతోంది. దీనికి తోడు వచ్చే జూలై వరకు రాష్ట్ర తాగు, సాగు అవసరాలను సిద్ధం చేసిన తెలంగాణ నీటి పారుదల శాఖ, సాగర్ పరిధిలో పూర్తిస్థాయి రబీ ఆయకట్టుకు నీరిచ్చేలా తమకు 54.5 టీఎంసీల మేర కేటాయింపులు చేయాలని కృష్ణాబోర్డును కోరడం, అందుకు తగ్గట్లే ప్రణాళిక రూపొందించడం ఆయకట్టు రైతుల్లో ఆశలు నింపుతోంది. నిండేందుకు సిద్ధంగా శ్రీశైలం.. నాగార్జునసాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేందుకు సిద్ధమైంది. గడచిన ఇరవై రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకొంది. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి 45 వేలు, నారాయణఫూర్ నుంచి 52వేల క్యూసెక్కుల పైచిలుకు నీరు దిగువకు వస్తోంది. దీంతో జూరాలవద్ద 30వేల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదుకాగా, ఈ ప్రాజెక్టు నుంచి 34,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి దిగువకు ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలానికి 52,375 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో ఉంది. ఇక్కడి నుంచి 9,625 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల నిల్వకు గానూ 203.43 టీఎంసీల లభ్యత ఉంది. మరో 12.38 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 52,375 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో పాటు మరింత నీరు చేరే అవకాశాలుండటంతో మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నిండిన పక్షంలో విడుదలచేసే నీరంతా దిగువ సాగర్కే రానుంది. ప్రస్తుతం సాగర్లో 147.46 టీఎంసీల నిల్వలున్నాయి. కాగా, మరో 164.59 టీఎంసీలు వస్తేనే ప్రాజెక్టు నిండుతుంది. అయితే శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో మున్ముందు నీటి నిల్వలు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. తాగు, సాగు అవసరాలకు 103 టీఎంసీలు జూన్ మొదలు ప్రస్తుత అక్టోబర్ వరకు ప్రవాహాలు లేని కారణంగా ఖరీఫ్ లో సాగర్ కింద ఒక్క ఎకరాకూ సాగు నీరందలేదు. అయితే ప్రస్తుతం ఎగువన ప్రాజెక్టులు నిండటం, దిగువకు ప్రవా హాలు వస్తున్న నేపథ్యంలో రబీపై ఆశలు పెరిగాయి. ప్రస్తుతం సాగర్లో ఉన్న నిల్వ, వస్తున్న ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ వచ్చే జూలై వరకు ప్రాజెక్టు కింద అవసరాలపై అంచనా లెక్కలను సిద్ధం చేసింది. వాటిని సోమవారం కృష్ణా బోర్డుకు అందించ నుంది. శ్రీశైలం, సాగర్ల నుంచి తెలం గాణకు సాగు, తాగు నీటికోసం 103 టీఎంసీల కేటాయింపులు కోరుతున్న రాష్ట్రం, అందులో కల్వకుర్తి కోసం 6 టీఎంసీలు మినహా, సాగర్కింది తాగు, సాగు అవసరాలకే 97 టీఎంసీలు అడు గుతోంది. ఇందులో నల్లగొండ జిల్లా పరిధిలోని కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్ల కింద 47వేల ఎకరాల రబీ అవసరాలకు 34.50 టీఎంసీలు కోరగా, ఖమ్మం జిల్లాలో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 20 టీఎంసీలు కేటాయించాలని కోరుతోంది. నిజానికి సాగర్ ఎడమ కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఇంతవరకు చుక్క నీటిని వినియోగించలేదు. ఈ నేపథ్యంలో రబీలో తప్పక కేటాయింపులు జరుగుతా యని రాష్ట్రం అంచనా వేస్తోంది. సాగర్ ఎడమకాల్వ కింది 6 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరిచ్చేలా ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
-
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
♦ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ♦ తొలుత ఒక జిల్లాలో అమలు ♦ క్రమంగా మిగతా జిల్లాలకు.. సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి.. తర్వాత మిగతా జిల్లాలకూ విస్తరించనుంది. రబీ సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్లోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ట్రాన్స్కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శరవేగంగా ఏర్పాట్లు.. గతంలో పంటలకు గరిష్టంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వచ్చే రబీ నుంచి విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచేందుకు ట్రాన్స్కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రూ.1,000 కోట్ల వ్యయంతో కొత్త లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీ డీసీఎల్ తొలుత తమ పరిధిలోని ఒక్కో పాత జిల్లా పరిధిలో ఆగస్టు 15 నుంచి పంటలకు 24 గంటల విద్యుత్ను సరఫరాను ప్రారంభించనున్నాయి. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా.. 24 గంటల సరఫరాతో విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. 24 గంటల సరఫ రాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు పెరుగుతుందని.. మొత్తంగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,000 మెగావా ట్లను మించనుందని డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ను సమీకరణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచితే డిస్కంలపై అదనంగా ఏటా రూ.1,000 కోట్ల భారం పడుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల రూపంలో ఈ భారాన్ని భరించనుంది. -
రబీకి ఫుల్ కరెంట్
► యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ►రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ ►సాగును లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం ►ఇందుకు 6 సూత్రాల ప్రణాళిక ►మాతాశిశువులకు ప్రభుత్వ ఆత్మీయ కానుకలు ►నేటి నుంచి కేసీఆర్ కిట్స్, రేపట్నుంచి ఒంటరి మహిళలకు జీవనభృతి ►డిసెంబర్లోగా అన్ని గ్రామాలకు నదీజలాలు ►ఈ నెలలోనే గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం హైదరాబాద్: వచ్చే యాసంగి (రబీ) నుంచే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రెండు పంటలకు కలిపి రూ.8 వేలు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ సురక్షిత తాగునీటిని అందజేస్తామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అతితక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచిందని.. పేద ప్రజల ఆత్మవిశ్వాసం పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గన్పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు దళాల వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెపుడో..’అన్న మహాకవి దాశరథి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ వాక్యాలు తన మదిలో నిరంతరం మెదులుతుంటాయని.. ఆ కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో, అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తానని కేసీఆర్ ప్రతినబూనారు. వేడుకల్లో కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లాభసాటి వ్యవసాయం కోసం ప్రణాళిక ‘‘వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. రైతులు, వ్యవసాయ నిపుణులతో చర్చలు జరిపి పటిష్టమైన కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టింది. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి సాగునీరు అందించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎకరానికి రూ. 8 వేల చొప్పున వ్యవసాయానికి పెట్టుబడిగా అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. ఇలా ఆరు అంశాలతో సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి. ఎవరు అడ్డుకున్నా ఆగదు కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దుష్ట ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయినా ఏటా రూ. 25 వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి మరీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వ ముమ్మరం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8 వేలను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తాం. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజిస్తాం. దాంతో రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్ల నిధిని సమకూరుస్తుంది. పంటల కొనుగోలుకు ఆ మూలధనాన్ని వినియోగించి.. కనీస మద్దతు ధర అందడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే సంక్షోభం సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. మిషన్ కాకతీయ ద్వారా గత రెండేళ్లలో 16 వేల చెరువులు పునరుద్ధరించుకున్నం. ఈ ఏడాది 5 వేలకుపైగా చెరువుల పనులు జరుగుతున్నాయి. ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నం. పాలిహౌస్, గ్రీన్హౌస్ సాగు, మైక్రో ఇరిగేషన్కు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నం. యాసంగి నుంచే 24 గంటల విద్యుత్ విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ విజయం సాధించింది. కొరతను అధిగమించి.. కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే స్థితికి వచ్చాం. ఈ ఏడాది యాసంగి పంటకాలం నుంచే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషి ఫలించి మూడు దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు అన్ని గ్రామాలకు నదీ జలాలు అందే అవకాశముంది. దాంతో తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమవుతుంది. అవతరణ ఆత్మీయ కానుకలు రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ప్రభుత్వం మరో రెండు మానవీయ నిర్ణయాలు తీసుకుంది. ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లింపు ఎల్లుండి (ఆదివారం) నుంచే అందుతుంది. మాతాశిశు సంరక్షణకు ఉద్దేశించిన రూ.15 వేల విలువైన ‘కేసీఆర్ కిట్’పథకం రేపట్నుంచే (శనివారం) అమల్లోకి వస్తుంది. గర్భిణులు కూలికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి, పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక. ఆదాయ వృద్ధిలో అగ్రస్థానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని ఉద్యమ సమయంలో నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యమైంది. వచ్చే నెలలో హరితహరం మూడోదశ పచ్చదనం పెంపొందించడం కోసం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’మూడోదశ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఉత్సాహంగా అందులో పాలుçపంచుకోవాలి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం నలుమూలలా రహదారులన్నీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం. పారిశ్రామిక ప్రగతికి ఉద్దేశించిన టీఎస్–ఐపాస్ చట్టం సత్ఫలితాలను సాధిస్తోంది..’’ ఈ నెల నుంచే గొర్రెల పంపిణీ గొల్లకుర్మలకు 75 శాతం భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను అందజేసే పథకం ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. తొలిదశలో రూ.5 వేల కోట్లతో 84 లక్షల గొర్రెలను అందిస్తాం. ఇక చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని భరించి.. లాభాలను బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందిస్తాం. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. నూలు, రసాయనాలను యాభై శాతం సబ్సిడీతో అందిస్తాం. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటు కోసం నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. రజకులకు బట్టలుతికే అధునాతన యంత్రాలు, విశ్వబ్రాహ్మణులకు వృత్తి పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపడతాం. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వృత్తులకు మారే వారికి కూడా తగిన ఆర్థిక తోడ్పాటు అందిస్తాం. అత్యంత వెనుకబడిన సంచార, ఆశ్రిత కులాలను, వర్గాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పలు పథకాలు రూపొందిస్తుంది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి. తెలంగాణ వేగంగా పురోగమించాలి: మోదీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేశారు. సంక్షేమానికే రూ.40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ప్రజా సంక్షేమానికే ఖర్చు పెడుతున్నాం. రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు కొత్తగా 512 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్లే... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికీ నెలకు ఆరుకిలోల బియ్యం, చదువుకునే పిల్లలకు సన్న బియ్యం అన్నం అందిస్తున్నాం. బడుగులు గౌరవంగా బతికేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. -
1.56 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సీజన్లో వేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బోరు బావుల కింద వేసిన పంటలే అధికంగా ఎండినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసిన ఆ శాఖ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ ప్రకారం మొత్తం 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాల్లో వరి ఎండింది. అలాగే 4,130 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. 17 జిల్లాలకు చెందిన 197 మండలాల్లో పంటలు ఎండిపోయినట్లు నివేదిక తెలిపింది. అత్యధికంగా మెదక్ జిల్లాలోని 20 మండలాల్లో 33,620 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 28,572 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 28 వేల ఎకరాల వరి పంట ఎండిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. బోరు బావుల కిందే 1.46 లక్షల ఎకరాలు...: జిల్లాల్లోని 197 మండలాల్లో 26.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 18.54 లక్షల ఎకరాల్లో బోరు బావుల కింద సాగయ్యాయి. మిగిలినవి చెరువులు, కాలువలు, ఎత్తిపోతల కింద సాగయ్యాయి.అన్ని పంటలు కలిపి 1.56 లక్షల ఎకరాల్లో ఎండిపోగా, అందులో 1.46 లక్షల ఎకరాలు బోరు బావుల కిందే ఎండిపోవడం గమనార్హం. బోరు బావుల్లో నీరు అడుగంటిపోవడమే కారణమని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. -
పంట బీమాపై రైతుల అనాసక్తి
⇒ ఈ రబీలో బీమా చేయించిన రైతులు లక్షన్నర మందే ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబాటులో ఉంది. 2016–17 రబీ సీజన్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధా రిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీ ఐఎస్) ద్వారా రాష్ట్రంలో కేవలం 1.56 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించు కున్నారు. అందులో బ్యాంకు రుణం తీసుకు నే రైతులు 1.46 లక్షల మంది కాగా.. రుణం తీసుకోని రైతులు 10 వేల మంది ఉన్నారు. వీరు రూ.34.26 కోట్లు ప్రీమియం చెల్లించా రని కేంద్ర వ్యవసాయ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 7.7లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఈసారి ప్రైవేటు కంపెనీలే బీమా చేయించడంతో రైతులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందున్న పక్క రాష్ట్రాలు.. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 36.26 లక్షల మంది రైతులు రబీలో పంటల బీమా చేయించారు. ఆ తర్వాత రాజస్థాన్లో 30.76 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 28.80 లక్షల మంది, బిహార్లో 11.54లక్షల మంది రైతులు పంటల బీమా చేయించారు. హరి యాణాలోనూ 5.75లక్షల మంది, అలాగే తమిళనాడులో 15.19 లక్షల మంది, కర్ణాటక లో 11.72 లక్షల మంది, మహారాష్ట్రలో 8.05 లక్షల మంది బీమా చేయించారు. ఏపీలోనూ 1.44 లక్షల మంది రైతులే పంట బీమా చేయించారు. నష్టపరిహారం సకాలంలో రాక పోవడంతో రైతులు ఆసక్తి చూపడంలేదని అధికారులు చెబుతున్నారు. -
రబీ ఆశలపై నీళ్లు
- కేవలం 35 శాతం విస్తీర్ణంతో ముగిసిన రబీ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ను కకావికలం చేసిన వరుణుడు రబీలోనూ కరుణించకపోవడంతో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు రాకపోవడంతో 7.62 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు నిలువునా ఎండిపోయాయి. అక్టోబర్లోనూ వరుణుడు ముఖం చాటేయడంతో ప్రస్తుత రబీ సీజనూ రైతన్నలను చావు దెబ్బ తీసింది. రెండు సీజన్లలోనూ వర్షాలు లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లా చరిత్రలో ఖరీఫ్, రబీలు దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. పడిపోయిన విస్తీర్ణం సీజన్ ముగుస్తున్నా రబీ పంటల విస్తీర్ణం 35 శాతానికి మించలేదు. ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1.31 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవ్వాల్సి ఉండగా, 44 వేల హెక్టార్లకే పరిమితమయ్యాయి. 77,564 హెక్టార్లలో సాగులోకి వస్తుందనుకున్న ప్రధానపంట పప్పుశనగ 23 వేల హెక్టార్లు, 20 వేల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 12,500 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 6.672 హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 2,500 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లకు గానూ 3 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 1,200 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకుగానూ కేవలం 180 హెక్టార్లకు పరిమితమయ్యాయి. వర్షాల్లేక భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. దీంతో వరి 10 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ప్రస్తుతానికి 1,400 హెక్టార్లలోనే సాగవుతోంది. సజ్జ, రాగి, మినుము, అలసంద, పెసర, కుసుమ, ధనియాలు, పత్తి తదితర అన్ని పంటల సాగు విస్తీర్ణమూ గణనీయంగా పడిపోయింది. వేసిన పప్పుశెనగ కూడా వర్షాలు లేక ఎండిపోవడంతో ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పెట్టుబడుల్లో సగం కూడా దక్కడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటాడిన వర్షాభావం వర్షాభావ పరిస్థితులు రబీని కూడా వెంటాడటంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. కీలకమైన అక్టోబర్, నవంబర్లో వర్షాలు పూర్తిగా మొహం చాటేయడంతో అరకొర తేమలో అక్కడక్కడ పంటలు సాగు చేశారు. సాగైన పంటలు కూడా దిగుబడులు లేక దయనీయంగా తయారయ్యాయి. అక్టోబర్లో 110.7 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 7.1 మి.మీ. వర్షమే పడింది. నవంబర్లోనూ 34.7 మి.మీ. గానూ కేవలం 1.7 మి.మీ. కురిసింది. రెండు మూడు తుఫాన్లు వచ్చినా జిల్లాపై కనీస ప్రభావం చూపలేకపోవడంతో రబీ ఆశలు గల్లంతయ్యాయి. మొత్తమ్మీద రబీలో 155.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 26.6 మి.మీ. కురిసింది. మొత్తమ్మీద ఈ సంవత్సరం ఇప్పటివరకు 495 మి.మీ.గానూ 283 మి.మీ. వర్షం కురిసింది. అంటే 43 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. కనీసం ఒక్క మండలంలోనూ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. గుమ్మగట్ట, రామగిరి, కగానపల్లి లాంటి కొన్ని మండలాల్లో 60 నుంచి 80 శాతం తక్కువగానూ, మరో 30 మండలాల్లో 40 నుంచి 60 శాతం తక్కువగానూ నమోదైంది. వరుసగా 45 రోజులు, 52 రోజుల పాటు వర్షం పడని విరామం (డ్రైస్పెల్స్) నమోదు కావడంతో భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పాతాళానికి పడిపోయాయి. బోర్లలో నీళ్లు రావడం గగనంగా మారింది. ప్రస్తుతం భూగర్భజలమట్టం 22.40 మీటర్లుగా ఉంది. -
సాగర్ ఆయకట్టుకు రబీ గండం!
-
సాగర్ ఆయకట్టుకు రబీ గండం!
6 లక్షల ఎకరాలకు నీటి కరువు ► ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో లభ్యత జలాలు 53 టీఎంసీలు ► గరిష్టంగా ఏపీకి దక్కే వాటా 35 టీఎంసీలు ► తెలంగాణకు దక్కే వాటా 1820 టీఎంసీలు ► ఆవిరి నష్టాలను తీసేస్తే ఇంకా తగ్గే అవకాశం ► ఇందులోనూ 10 టీఎంసీలు తాగు అవసరాలకే ► మిగతా 8 టీఎంసీలతో రబీ సాగు చేసేదెట్లా? ► మొదలైన పంటల సాగు.. ఆందోళనలో రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రబీ సాగుకు జల గండం పొంచి ఉంది. సాగర్ కింద ఆయకట్టు లక్ష్యాలు ఘనంగా ఉండటం.. నీటి లభ్యత తక్కువగా ఉండటం ఆయకట్టు రైతాంగాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే పంటల సాగు మొదలైన నేపథ్యంలో... రానున్న రోజుల్లో ఏమేరకు నీటి విడుదల ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోవడం, కృష్ణా బోర్డు తీరును బట్టి గరిష్టంగా 8 నుంచి 10 టీఎంసీలు మాత్రమే దక్కవచ్చన్న అంచనాలతో ఆందోళన నెలకొంది. ఇదే జరిగితే గతేడాది మాదిరే ఈసారి కూడా 6 లక్షల ఎకరాల రబీ సాగుకు నీటి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండో ఏడాదీ ఇక్కట్లే.. సాగర్ జలాలపై ఆధారపడి నల్లగొండ జిల్లా పరిధిలో కాలువల కింద 2.8 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2014–15 రబీలో) మాత్రమే ఈ ఆయకట్టుకు ఆశించిన స్థాయిలో నీరందింది. ఆ ఏడాది కృష్ణాలో మొత్తంగా 585 టీఎంసీల మేర లభ్యత జలాల్లో తెలంగాణకు 38 శాతం వాటా లెక్కన 216 టీఎంసీలు దక్కాయి. ఇందులో సాగర్ కింద ఖరీఫ్లో 104 టీఎంసీలతో 5.22 లక్షల ఎకరాలకు, రబీలో 35 టీఎంసీలతో 3.5 లక్షల ఎకరాలకు నీరందించారు. ఎస్ఎల్బీసీ కింద 2.22 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి గాను.. 13.5 టీఎంసీలతో 1.7 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. కానీ తర్వాత వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఒక్క ఎకరానికీ నీరందలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా వాడేయడం వల్లే! ఈసారి కృష్ణాబేసిన్లో ఆశించిన మేర నీరు వచ్చినా.. సాగర్ మాత్రం పూర్తి స్థాయిలో నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టు చేరిన జలాలను ఆంధ్రప్రదేశ్ ఇష్టారీతిన లాగేయడం, తెలంగాణ సైతం మహబూబ్నగర్ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయడమే దీనికి కారణం. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 515.4 అడుగుల మేర 141.02 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం (డెడ్ స్టోరేజ్) అయిన 510 అడుగులకు ఎగువన వినియోగించుకోగలిగిన నీటి నిల్వ గరిష్టంగా 10 టీఎంసీలు మాత్రమే. దీంతో రబీ కోసం పూర్తిగా శ్రీశైలంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను... ప్రస్తుతం 856 అడుగుల వరకు 95.59 టీఎంసీల నిల్వ ఉంది. ఇందులో కనీస మట్టమైన 834 అడుగులకుపైన లభ్యమయ్యేది 40 నుంచి 45 టీఎంసీలు మాత్రమే. అంటే సాగర్, శ్రీశైలం రెండు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం లభ్యత జలాలు 53.4 టీఎంసీలు మాత్రమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటినే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంది. గండి కొట్టిన ఏపీ, కృష్ణా బోర్డు వాస్తవానికి ఈ ఏడాది రబీలో నాగార్జున సాగర్ కింద 5.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 50 టీఎంసీలు కేటాయించాలని గత నవంబర్లోనే కోరింది. కానీ దీనికి ఏపీ అభ్యంతరం చెప్పడం, బోర్డు సైతం ఏపీకి వత్తాసు పలకడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఆయకట్టు లక్ష్యాన్ని 3.5 లక్షల (జోన్–1లో 2.3 లక్షలు, జోన్–2లో 1.2 లక్షల) ఎకరాలకు కుదించింది. అయినా ప్రస్తుత లభ్యత నీటితో ఈ ఆయకట్టుకు కూడా నీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 53.4 టీఎంసీల్లో... ఏపీకే 30 నుంచి 35 టీఎంసీల వరకు దక్కే అవకాశం ఉండగా, తెలంగాణకు 18 నుంచి 20 టీఎంసీలు అందవచ్చని అంచనా. ఈ నీటిలోనూ వచ్చే ఐదు నెలల పాటు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం నెలకు 2 టీఎంసీల చొప్పున 10 టీఎంసీలు అవసరం. మిగతా 8 టీఎంసీలతో రబీ కింద నిర్ణయించిన 3.5 లక్షల ఎకరాల సాగు సాధ్యమయ్యే అవకాశాల్లేవు. వీటిన్నింటికీ తోడు వేసవిలో 6 నుంచి 7 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి. అదే జరిగితే ఆయకట్టుకు చుక్క నీరూ అందే అవకాశం ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. -
రబీకి ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఆరు తడుల పంటలను ప్రోత్సహించండి సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచండి వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి నెల్లూరు రూరల్ : వర్షాభావ పరిస్థితుల్లో రబీ ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కె.ధనుంజయరెడ్డి ఆ శాఖ జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో గత రబీలో వర్షాలు ముంచెత్తగా ఈ రబీకి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాగు నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో వరి, కరువు ప్రాంతాల్లో అపరాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో నెల్లూరు జిల్లా కీలకమని, పంటల నిర్దేశించిన లక్ష్యం చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మండలంలో ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, విత్తన కొరత లేకుండా పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్డెంట్ పెట్టాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండి సాగు విస్తీర్ణం పెంచాలని, పొలంబడి, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా సూక్ష్మపోషకాల వాడకం, పురుగు మందులు తగ్గించడం, సరైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బయోప్రొడక్ట్ పేరుతో నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చాయని, రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్న నకిలీలపై దృష్టి సారించాలన్నారు. డీలర్ల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించాలని, నకిలీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లతో ఏఓకు కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటలను కాపుడుకునేందుకు రెయిన్గన్స్ ఉపయోగించాలన్నారు. రాష్ట్ర అపరాల స్పెషలిస్టు ఎన్డీఆర్కే శర్మ, జేడీఏ హేమమహేశ్వరారవు, ఆత్మ పీడీ దొరసాని, డీడీఏలు విజయభారతి, నాగజ్యోతి, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు. -
రైతులకు 21వేల కోట్ల రుణాలు
-
మొదలైన రబీ వరి నాట్లు
⇒ 12,500 ఎకరాల్లో నాట్లు... వ్యవసాయశాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్లో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో 13.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా... బుధవారం నాటికి 12,500 ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. రబీ సీజన్లో అన్ని రకాల పంటల సాగు 26.64 లక్షల ఎకరాలు కాగా...ఇప్పటివరకు 8.27 లక్షల ఎకరాల్లో (27%) సాగయ్యాయి. రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అక్టోబర్లో 30%, నవంబర్లో 96% వర్షపాతం కొరత ఉండటంతో వర్షాభావ పంటలపై ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు. -
రైతులకు 21వేల కోట్ల రుణాలు
- నాబార్డ్కు కేంద్రం అనుమతి - అరువుపై ఎరువులు అమ్మాలని కంపెనీలకు ఆదేశం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు ప్రకటించింది. రబీ సీజన్ నేపథ్యంలో రైతులు సులువుగా రుణం పొందేలా, నగదు లభ్యత కోసం సహకార సంఘాల ద్వారా రూ. 21 వేల కోట్లు రైతులకు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబారు)్డకు అనుమతినిచ్చింది. సహకార సంఘాల నుంచే 40 శాతంపైగా చిన్న రైతులు పంట రుణాలు పొందుతున్నారని, వారికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు. ఆన్లైన్ బుకింగ్పై రైల్వే ఇప్పటికే సర్వీసు చార్జీ రద్దు చేసిందని, డిసెంబర్ 31దాకా ఉచిత మొబైల్ బ్యాంక్ సేవలు వినియోగించుకునేందుకు టెలికం ఆపరేటర్లు అంగీకరించారన్నారు. అరువుపై ఎరువులు అమ్మండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు తగినంత నగదును అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ, బ్యాంకులకు సూచించామని, రబీ సీజన్లో పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని దాస్ పేర్కొన్నారు. నగదు లభ్యత, బ్యాంకు సేవలు లేని చోట్ల అరువుపై ఎరువులు అమ్మాలంటూ తయారీ కంపెనీలను కేంద్రం ఆదేశించిందన్నారు. రైతుల నుంచి చెక్కు, డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో సహకార సంఘాలు, డీలర్లు, ఇతర రిటైలర్లు కొనుగోళ్లు జరిపేందుకు కంపెనీలు సహకరించాలని కోరారు. ఎరువులకు క్రెడిట్, డెబిట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కుల ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ రిటైలర్లు, హోల్సేల్ వర్తకులు అనుమతించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్లకు కేంద్రం సూచించిందని శక్తికాంత దాస్ తెలిపారు. టోల్ వసూలుకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూలు) కేంద్రం కోరింది. కొత్తగా మార్కెట్లో విడుదల చేసే వాహనాలకు డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ(రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ ఏర్పాటు చేయాలని ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించామని శక్తికాంత్ చెప్పారు. దీనివల్ల టోల్ ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద నగదు రహిత చెల్లింపులకు వీలవుతుందని చెప్పారు. టోల్ ప్లాజాల గుండా వాహనాలు వెళ్లినప్పుడు దానంతట అదే ఆర్ఎఫ్ఐడీ కార్డు నుంచి టోల్ మొత్తం వసూలవుతుంది. ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు ‘తమ ఉద్యోగులకు ప్రీపెరుుడ్ కార్డులు ఇవ్వాలంటూ బ్యాంకులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కోరుతున్నారుు. ప్రైవేట్ రంగ కంపెనీలు ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు చేస్తారని భావిస్తున్నాం. కంపెనీల సీఎండీలతో భేటీలో అందుకు అంగీకరించారు’ అని దాస్ తెలిపారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి డిసెంబర్ 31 వరకు టెలికం ఆపరేటర్లు ఉచిత మొబైల్ సందేశాలు పంపుతున్నారన్నారు. అది మోదీ రక్తంలోనే లేదు: వెంకయ్య ఏదైనా నిర్ణయం వెనక్కి తీసుకోవడమనేది ప్రధాని మోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లను పోస్టాఫీసుల్లోని సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ చేయడానికి పాత నోట్లను అనుమతించబోమని ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. అరుుతే పోస్టాఫీసుల్లో మాత్రం సేవింగ్స డిపాజిట్లకు వెసులుబాటు కల్పించినట్లు మంత్రి చెప్పారు. డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ రద్దు డెబిట్ కార్డుల ద్వారా జరిగే అన్ని వ్యవహారాలపై డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీని కేంద్రం రద్దు చేసింది. ప్రభుత్వబ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, డెబిట్, క్రెడిట్ కార్డు సేవలు అందిస్తున్న సర్వీసు ప్రొవైడర్లు ఈ ఏడాది చివరి వరకూ సర్వీసు రుసుం వసూలు చేయవు. డెబిట్ కార్డుపై స్విచ్చింగ్ చార్జీల్ని ‘రూపే’ ఇప్పటికే రద్దు చేయగా...మాస్టర్ కార్డు, వీసా వంటి అంతర్జాతీయ సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయని దాస్ తెలిపారు. ‘డెబిట్ కార్డు వాడితే వసూలు చేసే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు, బ్యాంకు సర్వీస్ చార్జీలు, స్విచ్చింగ్ చార్జీలను పూర్తిగా ఎత్తివేశాం. డెబిట్ కార్డుల వినియోగంపై ఇక నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు’ అని వెల్లడించారు. కాగా, ఈ-వాలెట్ల ద్వారా నగదు చెల్లింపు పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. ఇక నుంచి రూ. 20 వేల వరకూ వాడుకోవచ్చు. డిజిటల్ నగదు చెల్లింపుల వాడకం ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఏం ఒరుగుతుంది ? డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీల రద్దుతో సామాన్యుడికి ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 53 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవన్నది అంచనా. దేశంలో 92 శాతం పల్లెలకు గ్రామీణ బ్యాంకుల సదుపాయమే లేదు. జన్ధన్ పథకంలోనే 25 కోట్ల డెబిట్ కార్డులిచ్చినా అందులో అధికశాతం వినియోగంలో లేవు. దేశం మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉంటే అందులో 10 శాతం కూడా గ్రామీణ ప్రాంతాల్లో లేవు. గ్రామాల్లో 75 శాతం పైగా వ్యవహారాలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ ఎత్తివేత ఎంతమందికి ఉపయోగమో ఆలోచించాలంటున్నారు. విద్యార్థి ఆత్మహత్య బండా(యూపీ): కాలేజీ ఫీజుకు కావాల్సిన నగదు డ్రా చేసేందుకు రోజుల తరబడి బ్యాంకు క్యూలో నిల్చొని నగదు దొరక్క 18 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని మవాయ్ బుజుర్గ్లో మంగళవారం జరిగింది. సురేశ్ బ్యాంకు క్యూలో నిల్చున్నా డబ్బు దొరక్కపోవడంతో ఇంటికొచ్చి తల్లి చీరతో ఉరేసుకున్నాడు. తిండ్వారీ పోలీసు స్టేషన్ పరిధిలో చికిత్స కోసం డబ్బు దొరక్కపోవడంతో బ్యాంకు ఆవరణలోనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. -
పాత నోట్లపై మళ్లీ మెలిక
► కేంద్రం ప్రకటించినా..పాత నోట్లు తీసుకోని విత్తన పంపిణీ కేంద్రాలు ►జీవో రాలేదని రైతులను తిప్పి పంపిన అధికారులు ►జరుగుమల్లి విత్తన కేంద్రం వద్ద ఆందోళన ►పట్టించుకోని జిల్లా అధికారులు ఒంగోలు టూటౌన్ : పాత నోట్లతో అటు పాలకులు.. ఇటు అధికారులు రైతులను అగచాట్లు పాలు చేస్తూనే ఉన్నారు. రబీ సీజన్లో అష్టకష్టాలు పడుతూనే సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు పాత నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నారుు. ఒక సారి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తా రు.. మరోసారి తీసుకోమని ఉత్తర్వులు ఇస్తారు. ఇలా అన్నదాతలను పాలకులు అడుకుంటున్నారు. ఇటీవల పాత నోట్లు తీసుకోవద్దని ఇచ్చిన ఆదేశాలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం దిగొచ్చింది. వెంటనే సోమవారం రైతుల వద్ద పాత నోట్లు రూ.500, రూ.1000 తీసుకోవాలని ప్రకటిం చింది. దీంతో ఊరట చెందిన రైతులు మంగళవారం విత్తన కేంద్రాల వద్దకు పాత నోట్లు తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు పాత నోట్లు తీసుకోకపోగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వలు గాని జీవోగాని రాలేదు. మేము తీసుకోమని ఖరాఖండిగా చెప్పడంతో రైతులు ఖంగు తిన్నారు. మండల కేంద్రాల్లో విత్తన కేంద్రాల వద్ద పాత నోట్లు తీసుకోకపోవడంతో ఒంగోలులోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి కొంతమంది రైతులు వచ్చారు. జిల్లా ఏపీ సీడ్స మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. పాత నోట్లు తీసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రైతులకు చెప్పడంతో చేసేదేం లేక వెనుదిరగాల్సి వచ్చిందని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుమల్లిలో.. జరుగుమల్లి మండలంలోని విత్తన కేంద్రం వద్ద పాత నోట్లతో నిరసనకు దిగారు. ప్రభుత్వ పాత నోట్లు తీసుకోమని ప్రకటించినా.. అధికారులు కనికరించడం లేదని ఆందోళన చేశారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వలేదన్న సామెతగా పాలకుల తీరు ఉందని ఆవేదన చెందారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించ లేదని రైతు సంఘ నేతలు తెలిపారు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల వద్ద పాత నోట్లు తీసుకోవాలని ప్రకటిస్తే.. అధికారులు ఉత్తర్వులు రాలేదని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అరుుతే విత్తనాలు లేకుం డా సేద్యం ఎలా చేయాలని రైతులు మండిపడుతున్నా రు. బుధవారం కూడా ఇదే పరిస్థితి రైతులకు ఎదురైతే జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు నిరసనకు దిగే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారించాలని రైతు సంఘాలు కోరుతున్నారుు. -
పాత నోట్లతో అన్నదాతల్లో అయోమయం
► రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దంటూ మళ్లీ ఆదేశాలు ► పాలకుల నిర్ణయాలపై రైతన్నల ఆగ్రహం ఒంగోలు టూటౌన్ : అన్నదాతకు పాత నోట్ల ఇక్కట్లు తప్పేలా లేవు. విత్తన కొనుగోలులో పాత నోట్లు తీసుకోవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం రాత్రే ఈ ఆదేశాలు వ్యవసాయశాఖకు అందారుు. ప్రస్తుతం రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేస్తోంది. శనగలతో పాటు ఇతర విత్తనాలు రాయితీపై ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల ర ద్దు నేపథ్యంలో వాటిని విత్తన సరఫరా కేంద్రాల వద్ద రైతుల నుంచి తీసుకోవడం లేదు. పది రోజులు దాటినా కొత్త నోట్లు, పాతనోట్ల కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలతో నానాకష్టాలు పడుతున్నారు. అసలే రబీ సీజన్ రబీ సీజన్ కావడంతో పురుగుమందులు, ఎరువులు, విత్తన కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత పెద్ద నోట్లు తీసుకునేది లేదని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా పాతనోట్లతో నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు పాతనోట్లను తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే ప్రకటనను వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ కూడా పత్రికలకు విడుదల చేశారు. మళ్లీ అంతలోనే పాత నోట్లు తీసుకోవద్దంటూ శుక్రవారం రాత్రే ఉత్తర్వులు వచ్చాయని జేడీ తెలిపారు. అటు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా మనీ కోసం పడిగాపులు కాస్తున్న వారితో పాటు అక్షర జ్ఞానం లేని ఎంతో మంది రైతులు ఉన్న పాత నోట్లు మార్చుకునే విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో పాతనోట్లు ఎప్పుడు మార్చుకోవాలి? విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేదెట్ల?.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కొత్త నోట్లు వచ్చినా.. చిల్లర సమస్యతో సతమతమవ్వాల్సి రావడం ఖాయం. కొత్త రూ.2 వేల నోట్లకు చిల్లర దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్ణయాలపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. -
కరువు కోరల్లో రబీ
– దెబ్బ మీద దెబ్బ... – 11 వేల హెక్టార్లకు పరిమితమైన పంటలు – 9 వేల హెక్టార్లతో ఆగిపోయిన పప్పుశనగ – వందేళ్ల 'అనంత' చరిత్రలో ఇదే తొలిసారి ఖరీఫ్ పంటలను అత్యంత దారుణంగా దెబ్బతీసిన వరుణుడు రబీని కూడా వదలలేదు. మరింత కసిగా కరువు కోరల్లోకి నెట్టేశాడు. అది కూడా అనంతపురం జిల్లా వందేళ్ల చరిత్రలో ఎపుడూ లేనంతగా శాసించాడు. ఫలితంగా ఖరీఫ్ కష్టాల నుంచి ఇంకా తేరుకోని రైతులకు రబీ ఆశలు కూడా గల్లంతయ్యాయి. దెబ్బ మీద దెబ్బ పడటంతో రైతులు కోలుకోవడం కష్టంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో అన్ని పంటలూ కలిపి 1,30,965 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సి ఉండగా ప్రస్తుతానికి 11 వేల హెక్టార్లకు పరిమితమైపోయింది. అందులో ప్రధానపంట పప్పుశెనగ 77,564 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేయగా 9 వేల హెక్టార్లకు పరిమితమైంది. పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెల సరైన సమయం కాగా నవంబర్ 15 వరకు వేసుకున్నా ఫరవాలేదని శాస్త్రవేత్తలు, అధికారులు భరోసా ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేయాల్సి ఉండగా ఐదారు మండలాల్లో మాత్రమే అరకొర తేమలో పంట వేశారు. వేసిన ప్రాంతాల్లో పంట దిగుబడులు రావడం కష్టమంటున్నారు. అక్టోబర్, నవంబర్లో కూడా వర్షం జాడ కనిపించకపోవడంతో రబీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగు అనుకూలమని చెబుతున్నారు. 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని అంచనా వేయగా.. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అది కూడా అరకొరగా సాగయ్యే పరిస్థితి నెలకొంది. ఇక 10 వేల హెక్టార్ల అంచనాతో ఉన్న వరి సాగు మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతానికి జొన్న 1100 హెక్టార్లలో వేశారు. మొక్కజొన్న, ఉలవ, పొద్దు తిరుగుడు, రాగి, కుసుమ, పత్తి తదితర పంటలు కూడా వందలోపు హెక్టార్లకే పరిమితమయ్యాయి. దెబ్బతీసిన వర్షాలు అక్టోబర్లో 110.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా నెలంతా కలిపి కేవలం 7.1 మి.మీ నమోదైంది. అంటే ఏకంగా 94 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో రబీ ముందుకు సాగలేదు. నవంబర్లో కూడా 34.7 మి.మీ సగటు నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 1 మి.మీ మాత్రమే నమోదైంది. జూన్, జూలై మినహా ఆగస్టు నుంచి నవంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు 462.8 మి.మీ గానూ 265.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తం మీద 43 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గతంలో ఎపుడూ ఇంత దయనీయమైన పరిస్థితిని చూడలేదని అధికారులు, రైతులు చెబుతున్నారు. పాలకులు చిన్నచూపు ప్రకృతి కరుణించినా పాలకులు సహకరించకపోవడంతో ఈ ఏడాది 'అనంత' వ్యవసాయం పెనుసంక్షోభంలో కూరుకుపోయింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట సర్వనాశనం కావడంతో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో సాగైన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతినడంతో రూ.వేలాది కోట్లు మట్టిలో కలిసిపోయాయి. ఇక గతేడాది ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నయాపైసా విడుదల కాకపోవడం, రూ.105 కోట్ల ప్రీమియం చెల్లించినా కేవలం 24 మండలాల రైతులకు నామమాత్రంగా రూ.109 కోట్లు వాతావరణ బీమా పరిహారం మంజూరు కావడంతో రైతు ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో 29 వేల హెక్టార్లలో మల్బరీ, 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలు కూడా చాలా వరకు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. రక్షకతడుల పేరిట హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 'అనంత'మైన కష్టాలకు ఇపుడు భరోసా కల్పించే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల దుస్థితి దయనీయంగా మారింది. -
రైతుకు దూరంగా ‘వ్యవసాయ బీమా’
రాష్ట్రంలో మొదటిసారిరైతు పంటల బీమాపై ఏఐసీ విముఖత రబీలో రెండు ప్రైవేటు కంపెనీలకు 10 పంటల బీమా అప్పగింత ఖరీఫ్లో 6.55 లక్షల మంది రైతుల ప్రీమియం.. ఇందులో ఏఐసీ వాటానే అధికం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యూబీసీఐఎస్)లను రబీ సీజన్లో అమలు చేసే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) వైదొలగింది. రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్వహించిన బిడ్లలో కేవలం మూడు ప్రైవేటు కంపెనీలే పాల్గొన్నాయి. ఏఐసీ పాల్గొనలేదు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్బీవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలకు దారులు తెరిచింది. ఖరీఫ్లో పీఎంఎఫ్బీవై పథకాన్ని ఏఐసీ సహా బజాజ్ అలియంజ్ జీఏసీ లిమిటెడ్ అమలు చేశాయి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్లు అమలు చేశాయి. పీఎంఎఫ్బీవై పథకం అమలు కోసం రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అన్ని కంపెనీలు కలసి ఈ ఏడాది ఖరీఫ్లో 6.55 లక్షల మంది రైతుల నుంచి రూ.85 కోట్లు ప్రీమియం వసూలు చేశాయి. అందులో ఏఐసీ వాటానే అధికంగా ఉండటం గమనార్హం. ఏళ్లుగా ఏఐసీ ఒక్కటే రైతు పంటల బీమాను అమలు చేస్తోంది. కానీ, ఈ రబీలో వైదొలగడంపై మాత్రం వ్యవసాయశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బీమా కంపెనీ పోటీ నుంచి లేకపోతే ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. రబీలో 2 కంపెనీలకు... పది పంటలు ఈ రబీలో బజాజ్ అలియంజ్, చోల ఎంఎస్ బీమా ప్రైవేటు కంపెనీలకు 10 పంటలకు బీమా అప్పగిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు పీఎంఎఫ్బీవై పథకం కింద బీమా వర్తింపచేస్తారు. డబ్ల్యూబీసీఐఎస్ పథకంలో మామిడికి అవకాశం కల్పించారు. మొక్కజొన్న, శనగ పంటలకు డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి రైతులకు గడువు ఖరారు చేశారు. మిగిలిన పంటలన్నింటికీ ఆ నెలాఖరు వరకు గడవు ఇచ్చారు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులకు, తీసుకోనివారికీ ఇవే గడువులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. మామిడికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. మిగిలిన పంటలన్నింటికీ ఆయా జిల్లాల్లో ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. రాష్ట్రంలోని జిల్లాలను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్ను ఒక్కో బీమా కంపెనీకి అప్పగిస్తారు. -
మూగ రోదన
– కరుణ చూపని వరుణుడు – పిడికెడు మేత కోసం కాపరుల పాట్లు లేపాక్షి : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా వరుణుడు కరుణ చూపకపోవడంతో జిల్లాలో వర్షాలు పడక గడ్డిపోచ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిడికెడు మేత కోసం కాపరులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలు పండుతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు వివిధ రకాల పంటలను పెట్టుకున్నారు. దుక్కిలు చేసుకోవడానికి, విత్తనాలు విత్తుకోడానికి, కలుపులు తీసే సమయానికి సకాలంలో వర్షాలు అనుకూలించాయి. అయితే విత్తన ఉత్పత్తి దశలో పూర్తిగా వర్షాలు రాకపోవడంతో పంటలు చేతికి అందకుండా పోయాయి. కనీసం పశుగ్రాసం కూడా దొరక్కపోవడంతో పశువులు, గొర్రెలు, మేకల కాపరులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చాలామంది పాడి ఆవులు, వ్యవసాయం చేసే పశువులను సంతల్లో చౌక బేరానికే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం కొరత అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుని కాపరులు, రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విత్తుకు విత్తమేది?
► రైతన్నకు నయా పైసా అందని రబీ రుణం ► కాలం కలిసొచ్చినా కరుణించని బ్యాంకులు ► రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది శూన్యం ► ప్రభుత్వం ముందు సై.. రైతుల ముందు నై ► పుష్కలంగా నీళ్లున్నా సొమ్ము లేక అన్నదాత విలవిల ► పెట్టుబడుల కోసం అప్పులు.. తప్పని ‘ప్రైవేటు’ తిప్పలు ► బ్యాంకులపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలం సాక్షి, హైదరాబాద్: కాలం కలిసొచ్చింది.. వర్షాలు దండిగా కురిశాయి.. చెరువులు, బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గింజ వేస్తే చాలు చేలన్నీ పైర్లతో కళకళలాడుతాయి... కానీ రైతన్న చేతిలో చిల్లిగవ్వ లేదు.. విత్తుకు విత్తం(సొమ్ము) లేదు.. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. రబీ సీజన్ మొదలై నెల కావస్తున్నా పంట రుణం కింద నయా పైసా ఇవ్వలేదు. రైతులు గత్యంతరం లేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మళ్లీ చేయి చాచాల్సి వస్తోంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ. 29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్ లక్ష్యంలో బ్యాంకులు కేవలం రూ. 11,546 కోట్లే ఇచ్చాయి. రబీలో రైతులకు విరివిగా రుణాలిస్తామని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకర్లు హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నందున మాఫీకి సంబంధించిన సొమ్ముపై రైతులను బలవంతం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఆర్థిక మంత్రి ఈటల బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. అయినా బ్యాంక్లు తమ వైఖరి మార్చుకోలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రబీ సీజన్ మొదలైనా ఇప్పటివరకు రైతులకు ఒక్కపైసా పంట రుణాలు ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. మాఫీ బూచీ చూపి.. రుణమాఫీ సొమ్ము పూర్తిగా చెల్లించకపోవడం వల్లే పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామంటూ బ్యాంకులు చేస్తున్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. వడ్డీ సహా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చినా బ్యాంకర్లు దాన్నే బూచీగా చూపడం సరికాదని కాదని మంత్రి పోచారం అన్నారు. మూడో విడత రుణమాఫీలో సగమే (రూ.2,020 కోట్లు) విడుదల చేశారని.. మిగతా రూ.2,020 కోట్ల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన సగంతో పాటు వచ్చే ఏడాది చెల్లించాల్సిన బకాయిలను కూడా ముందుగానే చెల్లిస్తామని బ్యాంకర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సాగు లక్ష్యం 30 లక్షల ఎకరాలు.. ఈ సెప్టెంబర్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ నెలలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా... 361.5 మి.మీ. కురిసింది. ఏకంగా 180 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలో 30 వేల చెరువులు నిండాయి. నాగార్జునసాగర్ మినహా గోదావరి, కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో భూగర్భ జలాలు 11.74 మీటర్ల లోతులో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్లో 8.98 మీటర ్లలోనే అందుబాటులో ఉన్నాయి. అంటే 2.76 మీటర్లు పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రబీలో 31 లక్షల ఎకరాలకు పక్కాగా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద మరో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించింది. వాస్తవంగా రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి 17.33 లక్షల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 3.70 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. అలాగే ఈ సీజన్లో 42.85 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించాలని లక్ష్యంగా ప్రకటించారు. అందులో ధాన్యం ఒక్కటే 31.4 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక పప్పుధాన్యాలు 1.73 లక్షల టన్నులు పండించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు వరకు మొత్తంగా అన్ని రకాల పంటలు కలిపి 2.27 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. రబీ లక్ష్యాల మేరకు ఏర్పాట్లు చేయడంలో బ్యాంకులు, వ్యవసాయశాఖ విఫలమయ్యాయి. వ్యవసాయశాఖ ఇప్పటికీ శనగ విత్తనాలను కూడా అందించలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత జిల్లాల వారీగా 2016–17 రబీ రుణాల లక్ష్యం (రూ.కోట్లలో..) జిల్లా లక్ష్యం ఆదిలాబాద్ 1,174.99 కరీంనగర్ 1,724.24 వరంగల్ 1,286.55 ఖమ్మం 1,100.93 నల్లగొండ 1,289.86 మహబూబ్నగర్ 1,874.41 రంగారెడ్డి 836.69 మెదక్ 1,123.64 నిజామాబాద్ 1,229.24 –––––––––––––––– మొత్తం 11,640.55 –––––––––––––––– -
ముందుకు "సాగే"నా..!
– గత 30 ఏళ్లలో తొలిసారిగా పడిపోయిన విస్తీర్ణం – కయాంక్ తుఫాను ఆశలు పెట్టుకున్న అనంత రైతులు అనంతపురం అగ్రికల్చర్ : ప్రకతి కన్నెర చేయడం, పాలకుల చిన్నచూపు కారణంగా ఖరీఫ్ పంట సంక్షోభంలో కూరుకుపోగా... రబీ కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే గత 30 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా రబీ వ్యవసాయం పూర్తీగా పడకేసింది. నైరుతీ దారుణంగా దెబ్బకొట్టగా కనీసం ఈశాన్యమైనా కొంతలో కొంత గట్టెక్కిస్తుందనే ఆశతో రంగంలోకి దిగిన రైతులను రబీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ పాటికి కనీసం లక్ష హెక్టార్లలో పప్పుశెనగ, ఇతర పంటలు సాగులోకి రావాల్సివుండగా కేవలం 5 వేల హెక్టార్లలోపే పరిమితం కావడం విశేషం. అది కూడా ఈనెల 11న కురిసిన తేలికపాటి వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, ఉరవకొండ డివిజన్లలో అరకొర తేమలోనే పంటలు వేయడంతో చాలా వరకు మొలకెత్తకపోవడం గమనార్హం. పప్పుశెనగ సాగుకు ఇక గరిష్టంగా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటి వారం తర్వాత పప్పుశెనగ వేసుకున్నా ఫలితం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దెబ్బతీసిన వర్షాలు: పగలు ఎండలు, రాత్రి చలితో కూడిన విచిత్ర వాతావరణం నెలకొని ఉండటంతో మామూలుగా వర్షం పడే సూచనలు లేవంటున్నారు. రబీ సీజన్లో సాధారణ వర్షపాతం 155 మి.మీ కాగా అందులో అక్టోబర్ వర్షాలే కీలకం. అక్టోబర్లోనే 110.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నవంబర్లో 38 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ మాత్రమే సాధారణ వర్షపాతం. అక్టోబర్ నెల చివరి వారంలో అడుగిడినా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది. కయాంక్ తుఫానుపై ఆశలు దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంగా జిల్లా రైతులు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంక్ తుఫానుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈనెల 28 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు కయాంక్ తుఫాను ప్రభావం చూపనుందని చెబుతుండటంతో జిల్లాలో కనీస వర్షపాతం నమోదైనా రబీలో కొంత కదలిక వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. లేదంటే పప్పుశెనగ సాగు ప్రశ్నార్థకమవుతుండగా నీటి వసతి కింద వేయనున్న వరి, వేరుశనగ, మొక్కజొన్న లాంటి పంటలు, వర్షాధారంగా వేయనున్న జొన్న, ఉలవ, పొద్దుతిరుగుడు లాంటి పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఏడాది ఖరీఫ్, రబీ జిల్లా రైతులకు భారీ నష్టాలు మిగిలిస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రబీ విస్తీర్ణం దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. -
నేల రాలని చినుకు..
– ముదిరిన ఎండలు, పెరిగిన చలి, పత్తాలేని వరుణుడు – పప్పుశనగ, ఇతర రబీ పంటలు సాగు ప్రశ్నార్థకం – క్షీణిస్తున్న భూగర్భజలాలు, పట్టు, పండ్లతోటలకూ నష్టం నైరుతీ నైరాశ్యం మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా జిల్లా రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీవిని ఎరుగని రీతిలో ఆగస్టులో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు 7.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలను అతలాకుతలం చేయగా... ఇపుడు అక్టోబర్లో నెలకొన్న అనావష్టి 1.50 లక్షల హెక్టార్ల రబీ ఆశలను తుంచేసే పరిస్థితి నెలకొంది. వాన చినుకు కరువైపోవడంతో ‘అనంత’ వ్యవసాయం పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెట్ట వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న లక్షలాది ‘అనంత’ రైతుల బతుకులు దుర్భరంగా మారాయి. ప్రశ్నార్థకంగా పప్పుశనగ ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రబీ ప్రధాన పంట పప్పుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్ మాదిరిగానే అక్టోబర్లో కూడా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో వరుణుడి జాడ కరువైపోంది. ఎక్కడా పంట సాగుకు అనువుగా వర్షం పడలేదు. ఈ నెలలో 110.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ నమోదైంది. నల్లరేగడి భూములు కలిగిన 35 మండలాల్లో 80 నుంచి 90 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పప్పుశనగ సాగు చేయాల్సివుంది. అందులోనూ 10 మండలాల్లో 8 నుంచి 10 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంట వేస్తున్నారు. అయితే ఈ నెల 11న కురిసిన వర్షానికి అరకొర తేమలోనే అక్కడక్కడ 6 నుంచి 8 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేయడం విశేషం. పప్పుశనగ సాగుకు సరైన సమయం అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే. అయితే ప్రస్తుత పరిస్థితులను దష్టిలో ఉంచుకుని నవంబర్ 15వ తేదీ వరకు వేసుకున్నా ఫరవాలేదంటూ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. వర్ష సూచనలేవీ? నవంబర్ 15వ తేదీ వరకు పప్పుశనగ విత్తుకోవచ్చు అంటున్నా... ఇపుడు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వర్షం వచ్చే సూచనలు లేవంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డి్రగ్రీలు పెరగడంతో ఎండలు ముదిరాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతులు కూడా సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో శీతల వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మామూలుగా వర్షం పడటం కష్టమని చెబుతున్నారు. అల్పపీడనాలు, తుఫాన్లు సంభవిస్తే తప్ప వర్షం కురవడం కష్టమంటున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన ఆగస్టు, సెప్టెంబర్లోనే వరుణుడు మొహం చాటేయడంతో వర్షం వస్తుందనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లింది. ఆగస్టులో 88.7 మి.మీ గానూ ఏకంగా 80 శాతం తక్కువగా కేవలం 18.1 మి.మీ, అలాగే సెప్టెంబర్లో 118.4 మి.మీ గానూ 65 శాతం తక్కువగా కేవలం 41.9 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ కకావికలమైంది. అందులోనూ 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట నిలువునా ఎండిపోవడంతో అంతులేని నష్టం వాటిల్లింది. ఇతర రబీ పంటలు కూడా వర్షం జాడ లేకపోవడంతో పప్పుశనగతో పాటు నీటి వసతి కింద సాగు చేసే వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర ఇతర రబీ పంటల సాగు కూడా కష్టంగా మారింది. వచ్చే ఖరీఫ్లో విత్తన కొరత ఏర్పడకుండా ఉండాలంటే రబీలో పండే వేరుశనగే కీలకం. వర్షాలు లేక భూగర్భజలాలు రోజురోజుకూ క్షీణించిపోతుండటంతో బోరుబావులు కూడా కట్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 వేల బోర్లలో నీళ్లు రావడం లేదని అధికారిక నివేదికలు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగగర్భజలమట్టం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వర్షం రాకుంటే నీళ్లు రాని బోర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రబీ పంటలతో పాటు వచ్చే వేసవిలో 28 వేల ఎకరాల్లో ఉన్న పట్టు, 1.70 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచివుండటంతో రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. -
ఇంకెప్పుడిస్తారో?
– స్ప్రేయర్లు లేవు, టార్పాలిన్లు ఇవ్వలేదు – రూ.1.25 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయని వైనం – రబీ వచ్చినా అందకపోవడంతో ఇబ్బందులు అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ప్రారంభమైనా రైతులకు స్ప్రేయర్లు లేవు.. టార్పాలిన్లు ఇవ్వలేదు. యాంత్రీకరణ పథకం కింద రూ.20 కోట్ల బడ్జెట్తో మినీట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రోపకరణాలు ఇస్తున్నామని అధికారులు గొప్పగా చెబుతున్నా అత్యవసరమైన వివిధ రకాల స్ప్రేయర్లు, చిన్నపాటి టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. రైతుకు పెద్ద పీట వేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం అమలులో మాత్రం విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా పాలకుల దారిలో నడుస్తూ సకాలంలో పథకాలు సక్రమంగా అమలు చేయలేక చతికిల పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 8 నుంచి 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వర్షాధారంగా ఖరీఫ్ పంటలు వేస్తారు. మెట్ట వ్యవసాయానికి చిరునామాగా ఉన్న ‘అనంత’ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏటా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్ప్రేయర్లు అత్యవసరం : ట్రాక్టర్లు ఇతరత్రా పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నా లేకున్నా జిల్లాలో పంట కాలంలో రైతు ఇంట స్ప్రేయర్లు, పంట తొలగింపు, నూర్పిడి సమయంలో టార్పాలిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది, పెసర లాంటి పంటలకు తరచూ పురుగు మందులు పిచికారీ చేస్తే కానీ పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి. తెగుళ్లు అధికం : ‘అనంత’లో వాతావరణానికి చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువే. ఈ క్రమంలో రైతు ఇంట ఏదీ లేకున్నా ఫరవాలేదు కానీ స్ప్రేయర్లు మాత్రం ఉంటాయి. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా స్ప్రేయరు, టార్పాలిన్ మంజూరు చేయలేదు. రెండు పథకాల కింద అక్షరాలా రూ.1.25 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా అందులో పైసా కూడా వెచ్చించలేదు. 7.65 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ ఇప్పటికే ముగిసింది. ఇపుడు రబీలో అడుగుపెట్టారు. ఇప్పటికీ కూడా వాటిని రైతులకు పంపిణీ చేస్తామనే ఆలోచన చేయకపోవడం గమనార్హం. అధికారులు ఏమంటున్నారంటే.. : స్ప్రేయర్లకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీలు తమకు అందలేదంటూ చేతులెత్తేస్తున్నారు. టార్పాలిన్లకు సంబంధించి గతేడాది బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఆలస్యమవుతోందని చెబుతున్నారు. వాటి కోసం వేలాది మంది రైతులు కళ్లకు కాయలు కట్టేలా ఎదురుచూస్తూ విసిగిపోతున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు. -
రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) ఎల్.జయశంకర్ వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. కాగా.. సెప్టెంబర్ 30తో ముగిసిన 2016 ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు తెలిపారు. 5.95 లక్షల మంది రైతులకు రూ.4,434 కోట్ల పంట రుణాలు, 82 వేల మందికి రూ.550 కోట్ల బంగారు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాల పంపిణీ కొనసాగుతోందన్నారు. -
రబీలోనూ..అదే గోడు
– మొహం చాటేసిన వరుణుడు – మేఘాలు ఊరిస్తున్నా.. నేల రాని చినుకు – పంటల సాగుకు ఆటంకం ఖరీఫ్ను కల్లోలం చేసిన వరుణుడు రబీని కూడా వెంటాడుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రధాన పంట పప్పుశనగ సాగుకు ఈ నెలంతా మంచి అనుకూలం. అయితే.. ఇప్పటి వరకు వాన చినుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన సమయంలో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. గత పది రోజులుగా ఇదే పరిస్థితి. అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో ప్రధానంగా నల్లరేగడి భూములు కల్గిన మండలాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. 80 వేల నుంచి 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే..వర్షాభావం వల్ల ఇప్పటివరకు ఎక్కడా పంట విత్తుకోలేదు. అలాగే వేరుశనగ 20 వేల హెక్టార్లు, వరి పది వేల హెక్టార్లు, జొన్న, మొక్కజొన్న, ఉలవ తదితర‡ పంటలు మరో 30 వేల హెక్టార్లలో వేయనున్నారు. మొత్తమ్మీద రబీలో అన్ని పంటలు కలిపి 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సివుంది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చేవి. ఈ సారి ఇప్పటికీ నల్లరేగళ్లు కలిగిన దాదాపు 30 మండలాల్లో పదును వర్షం కాదు కదా.. కనీసం తుంపర్లు కురవలేదు. అక్టోబర్లో సాధారణ వర్షపాతం 110.7 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. ఇప్పటివరకు కేవలం 2.3 మి.మీ నమోదైంది. అంటే వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్లో కురిసే వర్షాలే రబీ పంటలకు ప్రాణం. తర్వాత నవంబర్లో 35 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు రబీ సాగుకు కీలకమైన అక్టోబర్లో వర్షాలకు బదులు ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో 32 నుంచి 34 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు.. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, రాయదుర్గం, పెనుకొండ వ్యవసాయ డివిజన్ల పరిధిలో నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పప్పుశనగ, నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు వేస్తారు. వర్షం పడకపోవడంతో పంటల సాగులో ఇప్పటికీ కదలిక లేదు. భారీ వర్షాలు లేదా జడివాన పడితే కానీ నల్లరేగడి భూముల్లో విత్తుకు సరిపడా పదును అయ్యే పరిస్థితి లేదు. వర్షం లేక ఖరీఫ్లో వేసిన కంది, ఆముదం, పత్తి లాంటి పంటలకు కూడా ఇబ్బంది తలెత్తుతోంది.