rajaiah
-
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
-
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
BRS: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
సాక్షి,గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కేసీఆర్ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్కుమార్కు కేటాయించారు. అయినా స్టేషన్ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్లోకి వెళ్లడంతో స్టేషన్ఘన్పూర్ ఇంఛార్జ్ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ -
బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే డా.టి.రాజయ్య.?
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య కారెక్కెందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనంటున్నాయి ఆయన అనుచర వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్లోనే ఉన్న రాజయ్య.. ఆ ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసిన ఆయన ఇటు బీఆర్ఎస్లో కొనసాగకుండా.. అటు కాంగ్రెస్లో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన రాజయ్య.. తన పేరిట ‘నేను మళ్లీ వస్తున్నాను.. ఎవరూ పార్టీని వీడకండి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతుండటంతో ఆయన చేరిక ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దలతో పూర్తయిన చర్చలు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో రాజుకున్న అసంతృప్తి ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బట్టబయలైంది. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, రైతుబంధు సమితి మాజీ చైర్మన్ డాక్టర్ తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్లతో మొదలైన రాజీనామాల పరంపర ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరకు కొనసాగింది. తన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యలు బీఆర్ఎస్ను వీడటం రాజయ్యను కాంగ్రెస్లో చేరడమా? బీఆర్ఎస్లో కొనసాగడమా? అన్న సందిగ్ధంలో పడేసింది. ఇదే సమయంలో ఆయన రాజీనామా ఇంకా ఆమోదం కాకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ రాజయ్య విషయంలో పునరాలోచనలో పడింది. ఈ మేరకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగి రాజయ్యతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. వారంలో రెండు పర్యాయాలు రాజయ్యతో మంతనాలు జరిపిన పల్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులతో కూడా మాట్లాడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న రాజయ్య.. పార్టీ అధినేత కేసీఆర్ సమయం తీసుకుని పెద్ద సంఖ్యలో కేడర్తో కలిసి కారెక్కుతారన్న చర్చ ఆయన అనుచరవర్గంలో సాగుతోంది. ‘సారు నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. కారెక్కుతాం’ అంటున్నారు. ‘స్టేషన్’ ఇక డా.రాజయ్యదే... హైకమాండ్ సూచన మేరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న డా.టి.రాజయ్య.. చర్చల సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తాను తెలంగాణ రాష్ట్రసాధన కోసం పార్టీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరానని, కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా.. టికెట్ రాకుండా చూడటం కోసం దుష్ప్రచారాలు చేయించినా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి పని చేశానన్న ఆయన ఇకనుంచైనా భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్తో పా టు పార్టీలో కీలకంగా కొనసాగేలా అవకాశం కల్పించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తాను మళ్లీ పార్టీలోకి వస్తున్నానని, ఎవరూ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వెళ్లవద్దని కోరుతూ వాట్సాప్ గ్రూపుల ద్వారా కేడర్కు సందేశాలు పంపినట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటించి కేడర్తో కలిసి డా.రాజయ్య బీఆర్ఎస్లో చేరుతారని సమాచారం. -
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరింది వీరే -
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
మాట కలిపి.. కారం చల్లి.. కత్తితో దాడిచేసి.. ఆపై దారుణం!
కరీంనగర్: అతనో పశువుల వ్యాపారి. గురువారం అంగడి ఉండడంతో పశువులు కొనేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. దారిమధ్యలో ఆకలివేయడంతో టిఫిన్ కోసం ఆగాడు. టిఫిన్ తిని బిల్లు చెల్లిస్తుండగా.. అతనివద్ద డబ్బులు చూసిన ఓ మాయగాడు ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. తనవద్ద ఓ గేదె ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక పశువుల వ్యాపారి కళ్లలో కారంకొట్టి.. కత్తితో బెదిరించి.. రూ.82వేలు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంశాబాద్ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు అంకతి రాజయ్య, ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన అంకతి రాజయ్య(63) పశువుల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి అంగడికి ద్విచక్ర వాహనంపై ఉదయాన్నే బయల్దేరాడు. మార్గంమధ్యలో ఆకలివేయడంతో తాడికల్ గ్రామశివారులో ఓ హోటల్ వద్ద ఆగాడు. టిఫిన్ తిన్నాడు. తనజేబులో నుంచి డబ్బులు తీసి బిల్లు చెల్లిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి గమనించాడు. రాజయ్య వద్ద పెద్దమొత్తంలో నగదు ఉందని గమనించి, ఎలాగైనా కాజేయాలని పథకం పన్నాడు. రాజయ్య వద్దకు వచ్చి మాటామాట కలిపాడు. తనవద్ద ఓ గేదె ఉందని, అమ్ముతానని చెప్పడంతో రాజయ అతనితో కలిసి వెళ్లాడు. మానకొండూర్ మండలం శంశాబాద్ శివారులోని కాలువ ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి రాజయ్య దగ్గర ఉన్న డబ్బు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో కళ్లలో కారం చల్లాడు. కత్తితో చేతిపై దాడి చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.82వేలు తీసుకుని పారిపోయాడు. కాసేపటికి తేరుకున్న రాజయ్య వెంటనే మానకొండూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
TS Elections 2023: చర్చనీయాంశంగా మారిన.. రాజయ్య రాజకీయ వ్యూహం..!
వరంగల్: స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య తాజా రాజకీయ వ్యూహం ఏమిటనేది పొలిటికల్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆగస్టు 21న సీఎం కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత రాజయ్య వ్యూహం మార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్, పార్టీ నేతల పట్ల లాయల్గానే ఉంటున్నా.. కడియం శ్రీహరిని ప్రత్యర్థిగా చూస్తున్న తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. టికెట్ ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి నిర్వహించిన భారీ ర్యాలీకి దూరంగా ఉన్న రాజయ్య... రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నేతలను కలవకుండా తిరిగారు. మాదిగ దండోరా అండతో రాజకీయంగా చక్రం తిప్పుతున్న రాజయ్య, సోమవారం కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మాదిగ చామర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎంసీఐఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్లానని, ఇందులో అన్ని పార్టీలకు చెందిన మాదిగలతోపాటు తాను కూడా హాజరైనట్లు సమర్థించుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్.. మంగళవారం రాజయ్య ఇంటికి వెళ్లి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్య మాత్రం భేటీల వెనుక రహస్యం ఏమీ లేదన్న గంటన్నరకే స్టేషన్ఘన్పూర్లో తనను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడుతూ ఏ రాజకీయపార్టీలో ఉన్నా.. మాదిగలు ఐక్యంగా ఉండాలన్నారు. ఓ వైపు అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో స్టేషన్ ఘన్పూర్ వివాదం చల్లారకపోగా రోజుకో తీరుగా మారుతోంది. ఈ క్రమంలో కారు దిగి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్ వ్యూహం ఏమిటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
కడియం వద్దు.. రాజయ్యే ముద్దు
మడికొండ: స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధి 46వ డివిజన్ రాంపూర్లో అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘కడియం వద్దు.. రాజయ్యే ముద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి కడి యం ఏమీ చేయలేదని, రాజయ్య వచ్చాకే అభివృద్ధి జరిగింది అన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించలేదని పేర్కొన్నారు. రాజయ్య పై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్ తెచ్చుకున్న ఆయన మాదిగలను కాదని ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని, టికెట్ కెటాయిస్తే భారీ మోజార్టీతో గెలిపిచుకుంటా మని చెప్పారు. అంతకు ముందు రాంపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టా రు. కార్యక్రమంలో మునిగాల వెంకటయ్య, డేని యల్, తప్పెట సారయ్య, కడారి దేవయ్య, మాదా సి రమేష్, యాదగిరి, నర్సింగం, కమలేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పట్ల మహేష్, ఎర్ర సంపత్, నాగేష్, వెంకటస్వామి, మీసాల ఎల్లేష్, సాగర్, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరి గుంటనక్క లాంటివాడు
స్టేషన్ఘన్పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్లో, ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు. -
కేసీఆర్ గీసిన గీత దాటను
స్టేషన్ఘన్పూర్: బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్పూర్ టికెట్ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు. -
భావోద్వేగంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి
సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్లోలో చేరినప్పటి నుండి కేసీఆర్కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు. కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరాం. బీఆర్ఎస్లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
స్టేషన్ ఘన్పూర్లో ఉద్రిక్తత
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్పూర్లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్.. గులాబీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ వార్నింగ్
గులాబీ తోటలో స్టేషన్ ఘన్పూర్ పంచాయతీకి తెర పడిందా? కొన్నాళ్లుగా మాటల యుద్ధం చేసుకుంటున్న కడియం, రాజయ్యలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా? లేక ఇద్దరి మధ్యా రాజీ కుదిరిందా? సీటు విషయంలో ఎవరిది పై చేయి అయింది? ఇంకొకరికి ఎటువంటి హామీ లభించింది? ఇకముందు ఇద్దరూ సైలెంట్గా ఉంటారా? మరోసారి రెచ్చిపోతారా?.. తెలంగాణలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల సీటు వివాదం కొత్తమలుపు తిరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సాగుతున్న డైలాగ్వార్కు పార్టీ నాయకత్వం చెక్ పెట్టింది. ఇద్దరినీ హైదరాబాద్కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సున్నితంగా మందలించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అటు కేసీఆర్ను ఇటు కేటీఆర్తోనూ సమావేశమయ్యారు. కేటీఆర్ను కలిసిన రాజయ్య రాజయ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాత్రమే కలిసారు. తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులైన కడియం, రాజయ్యలు బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అదే పోకడ కొనసాగించారు. డిప్యూటీ సీఎంలుగా ముందు రాజయ్యకు, తర్వాత కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా పోరు తీవ్రంగా సాగుతోంది. ఇంకా ముదిరితే పార్టీకే నష్టమని పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ అధిగమించవద్దని ఇద్దరినీ సున్నితంగా మందలించి పంపింది. రాజయ్య అవినీతిపై కడియం వివరణ.. హైదరాబాద్ నుంచి పిలుపు రాగానే హడావుడిగా వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతకు రెండు రోజుల ముందు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని, కేటీఆర్ను కలిసారు. తాను కడియంపై కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదని, గతం నుంచి ఆయన మీద ఉన్నవేనని రాజయ్య.. కేటీఆర్కు వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా రాజయ్య అవినీతి గురించి కడియం పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చి.. ఎవరి భవిష్యత్ అయినా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే స్టేషన్ఘన్పూర్ సీటు విషయంలో ఈసారి కడియం శ్రీహరి పోటీ చేయడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. స్పీడ్ పెంచిన శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం తన నియోజకవర్గంగా స్టేషన్ ఘన్ఫూర్ ఎంపిక చేసకుని.. మరింత దూకుడుగా వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యకు బదులుగా ఈసారి కడియం శ్రీహరి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న కడియం నియోజకవర్గంలో తన ఫ్లెక్సీల కోసం మండలానికి 10 లక్షలు చొప్పున పంపిణీ చేశారన్న టాక్ నడుస్తోంది. కడియం, రాజయ్య మధ్య వివాదం తీవ్రం కావడంతో జనగామకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నియోజకవర్గానికి చెందిన సీఎం ముఖ్య అనుచరుడు ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ ఎంట్రీ.. ఘన్పూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుగొనే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమయిందట. అసలు విషయం తేల్చకుండా ఇంతకాలం కలిసి పనిచేసుకోండని చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. ఇద్దరి మధ్య మరో ఎమ్మెల్సీ ఎంట్రీ కారణంగానే ఘన్పూర్ అడ్డా అధికార పార్టీలో రాజకీయ దుమారం చెలరేగిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. టిక్కెట్ విషయంలో వెంటనే స్పష్టత ఇచ్చి..పార్టీ ఐక్యత దెబ్బతినకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఘన్పూర్ గులాబీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: చంద్రబాబు వారసుడు రేవంత్ -
కారు.. వీధిపోరు! 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బహుళ’ తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారత్ రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నేతలు చివరకు వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతూ వీధికెక్కుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత అనే రీతిలో నియోజకవర్గ స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు పరస్పర విమర్శలు, దూషణలు తెరమీదకు వస్తున్నాయి. సిట్టింగ్లు తమను కలుపు కొని వెళ్లకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు క్రమంగా స్వరం పెంచుతు న్నారు. పార్టీ అధినేతపై విశ్వాసం, విధేయత ప్రకటిస్తూనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా బహిరంగ ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ల చైర్మన్లు, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో టికెట్లు ఆశిస్తూ పార్టీలో చేరినవారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తు న్నారు. టికెట్ల పోటీలో పర స్పరం సిగపట్లకు దిగుతు న్నారు. కార్యకర్తలు, అను యాయుల సమక్షంలో సొంత పార్టీకి చెందిన రాజ కీయ ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ నేతలు లక్ష్మణరేఖ దాటుతున్నా.. అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రతిస్పందించక పోవడంతో వివాదాలు మరింత ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నాయకత్వంతో పొసగని నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయినప్పటికీ అధినేత మౌనం వెనుక ఆంతర్యం పార్టీ కేడర్కు అంతుపట్టడం లేదు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల పరస్పర ఆరోపణలకు సంబంధించిన వివాదంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ తరహా పరిణామాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ బహుళ నాయకత్వం సమస్యను ఎదుర్కొంటోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు లాబీయింగ్కు దిగుతున్నారు. టికెట్ దక్కదనే అంచనాకు వచ్చిన కూచాడి శ్రీహరిరావు (నిర్మల్)తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడారు. ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేయగా, వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్ ఆశిస్తున్న మెదక్, రాజేంద్రనగర్, కొత్తగూడెం, ఉప్పల్, హుజూరాబాద్, తాండూరు, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, జనగామ, ఖానాపూర్, వరంగల్ పశ్చిమ, నాగార్జునసాగర్, కల్వకుర్తి, జహీరాబాద్, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎక్కడికక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా కట్టుతప్పుతున్న నేతలపై చర్యలు లేకుంటే.. పరిస్థితి ఇతర పార్టీలకు అనుకూలంగా మారుతుందనే ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. అయితే టికెట్ ఆశిస్తున్న నేతలంతా పార్టీ అధినేతకు విధేయులుగానే ఉంటున్నారని, ఎన్నికల నాటికి అంతా సద్దుమణుగుతుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. నేతల పనితీరుపై కేసీఆర్కు పూర్తి స్పష్టత ఉన్నందున అందరికీ ఏదో ఒకరకంగా గుర్తింపు లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
నేను నోరు విప్పితే అంతే.. ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: ఎమ్మెల్యే రాజయ్య నా కుటుంబం గురించి, నా తల్లి, నా బిడ్డ గురించి సభ్యత, సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడారు.. నేను నోరు విప్పితే ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లి అనేది సత్యం.. తండ్రి అనేది అపోహ అంటూ నా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉన్న ప్రతి తల్లిని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఇందుకు రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ’’అవును నాతల్లి బీసీ, తండ్రి ఎస్సీ, సుప్రీంకోర్టు తీర్పు, చట్టం ప్రకారం నేను ఎస్సీ, నా బిడ్డ ఎస్సీ. నాబిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రి మతం, కులం వర్తిస్తుంది’ అని చెప్పారు. 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా... తనను ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా అని కడియం ప్రశ్నించారు. అధిక ఎన్కౌంటర్లు 2004–14 మధ్యలో జరిగాయని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2004 నుంచి 2012 వరకు రాజయ్య కాంగ్రెస్లో ఉన్నాడని, ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే దళితులకు రాసిస్తా.. రాజయ్య ఆరోపిస్తున్న విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని నియోజకవర్గ దళితులకు రాసిస్తా అని కడియం అన్నారు. నియోజకవర్గంలో పనులు ఇస్తానని, పదవులు ఇస్తానని ఏ ఒక్కరివద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఘన్పూర్ నియోజకవర్గాన్ని వదిలేసి పోటీనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలు పుస్తెలు, ఇండ్లు, వ్యవసాయ భూములు కుదువపెట్టి డబ్బులు ఇచ్చారని, సమయం వస్తే బాధితులతో కలిసి ప్రెస్మీట్ పెట్టి రాజయ్య బండారం బయటపెడతాని హెచ్చరించారు. నీ చేష్టలు, మాటలు అన్నీ పార్టీ అధిష్టానం చూస్తోందని.. త్వరలోనే శిశుపాలుడి వధ జరుగుతుందని కడియం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
-
రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
-
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
నవ్య ఆరోపణలు సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్
-
ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు: నవ్య
-
ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..!
వరంగల్: మహిళా సర్పంచ్పై లైగింక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే సార్ను ఓ ఆటా ఆడేసుకుంటున్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎమ్మెల్యే.. మహిళలకు సంబంధించి తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైగింకంగా వేధిస్తున్నాడని హనుమకొండ/జనగామ జిల్లా పరిధి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఆరోపించడంతో మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీతో సహా అన్ని వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబికడంతో నిరసన సెగ ప్రగతిభన్ను తాకింది. పార్టీ వర్గాలు ఓపైపు ఆరా తీస్తుండగానే.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..! గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు సంబంధించిన ఏదో ఒక వివాదంలో తెరపైన కనిపిసూ్తనే ఉన్నాడు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను కేబినెట్ నుంచి ఏకంగా బర్తరఫ్ చేయడం అప్పట్లో హాట్టాఫిక్గా మారింది. దానిపై అనేక ముచ్చట్లు సైతం వినిపించాయి. ఇదిలా ఉంటే.. గతంలో వేలేరు మండలంలోని ఓ ఊరికి చెందిన మహిళతో ఫోన్లో అసభ్యకరంగా.. శవ్వ, శవ్వ అంటూ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలుగా.. ఆడియో రికార్డు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశం కాగా.. అది తన వాయిస్ కాదని రాజయ్య కొట్టిపారేశారు. ఆ తర్వాత లింగాలఘణపురంలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లాలో లక్ష మందికి పైగా పిల్లలు తన వల్లనే పు ట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. అలాగే లింగాలఘణపురం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ అందరికీ భర్త లాంటి వాడని నోరుజారీ.. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి మొట్టికాయలు వేసే వరకు దారి తీసింది. మహిళా కమిషన్ ఆదేశం..పోలీసుల విచారణ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్çపర్సన్ సునీత స్పందించారు. కేసును సుమోటోగా తీసుకుని.. విచారణకు డీజీపీని ఆదేశించారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మెల్యే.. పార్టీ పెద్దల సూచనలు పాటిస్తూ.. ఆదివారం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. ప్రొటోకాల్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే.. మహిళా లోకం తనను క్షమించాలని కోరగా.. నవ్య పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూనే.. ఎమ్మెల్యేకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సర్పంచ్ ఇంటికి వెళ్లడంతో నాలుగు రోజుల వివాదానికి తెరపడగా.. మహిళా కమిషన్ విచారణకు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్పంచ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటలిజన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంతోపాటు మంత్రి కేటీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. -
ఒకే వేదికపైకి రాజయ్య, నవ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు సంబంధించి.. ఆమెతోపాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి వెళ్లిన రాజయ్య.. సర్పంచ్ కురుసవల్లి నవ్య, ఆమె భర్త ప్రవీణ్లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ కలిగితే క్షమాపణలు చెప్తున్నా: రాజయ్య మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ‘‘నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. నాకు నలుగురు చెల్లెళ్లు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. తెలిసీ తెలియక తప్పులు జరిగితే ఒప్పుకోక తప్పదు. జానకీపురం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నా. సర్పంచ్ నవ్య, ప్రవీణ్లను అన్నిరకాలుగా కాపాడుకుంటాను. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..’’అని పేర్కొన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో.. సర్పంచ్ కె.నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే.. రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లినట్టు తెలిసింది. రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసు సర్పంచ్ నవ్య ఆరోపణల అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా వచ్చిన అభ్యర్థనపై మహిళా కమిషన్ ఆదివారం స్పందించింది. రాజయ్యకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్కు కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాసినట్టు తెలిపింది. మహిళల పట్ల పిచ్చి వేషాలు వేయొద్దు: నవ్య ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ‘‘చెడును కచ్చితంగా ఖండిస్తాను. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యాను. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టడానికైనా వెనుకాడను. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకుని మహిళలను గౌరవించాలి. ఇక మీదట తప్పులు చేయకూడదు. గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నేను చేసిన ఆరోపణలు నిజం. సమాజంలో మహిళలు కొన్ని విషయాల్లో కొందరి చేత మోసపోతున్నారు. అలాంటి వారు బయటికి వచ్చి నిలదీయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారిపక్షాన నేను ముందుండి కొట్లాడుతా..’’అని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని.. ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్): అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ ఎం.రాజయ్య డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ..వీఆర్ఏలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారమేనని, తమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వీఆర్ఏలు అన్ని జిల్లా కేంద్రాల్లో పే స్కేల్ జాతర (ధూం ధాం), భారీ ప్రదర్శనలు, ర్యాలీలు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 22న మండల కేంద్రాల్లో ఉద్యోగ సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి మానవహారాలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు వై.వెంకటేశ్ యాదవ్, వంగూరి రాములు, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, ఎస్కె.రఫీ, ఎన్.గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరి - రాజయ్య మధ్య మాటల యుద్ధం
-
ఎమ్మెల్యే రాజయ్య పై కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
-
కారులో కోల్డ్వార్
సాక్షి, జనగామ: అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు నాయకులను బహిష్కరించడం కలకలం రేపుతోంది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారే కారణంతో సొంత పార్టీ నాయకులపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మండల అధ్యక్షుడు, మండల ఇన్చార్జిలను బహిష్కరించడంతో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇద్దరిపై బహిష్కరణ వేటు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా ఎమ్మెల్యే రాజయ్యపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు నాయకులపై ఆదివారం బహిష్కరణ వేటు వేశారు. ఏడాది క్రితం చిల్పూర్ మండల అధ్యక్షుడిగా కేసిరెడ్డి మనోజ్రెడ్డి, టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు ఎడవెల్లి విజయను మండల ఇన్చార్జిగా నియమించారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యే రాజయ్యకు మండల అధ్యక్షుడు మనోజ్రెడ్డి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకపోవడమే కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దగ్గర అవుతున్నారు. దీంతో మనోజ్రెడ్డిని మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీంతో మనోజ్రెడ్డి, మండల ఇన్చార్జి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇటీవల వైరల్గా మారాయి. దీంతో ఆదివారం సాయంత్రం చిల్పూర్ మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే రాజయ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించి కేసిరెడ్డి మనోజ్రెడ్డి, ఎడవెల్లి విజయను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి తెరపైకి ఆధిపత్య పోరు.. ఇద్దరు నాయకులను పార్టీ నుంచి బహిష్కరించడంతో స్టేషన్ఘన్పూర్లో మరోసారి ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఎ మ్మెల్సీ కడియం శ్రీహరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగానే నాయకులపై వేటు వేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వేర్వేరు పార్టీల్లోనూ, ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కడియం, రాజయ్య వర్గాలుగా విడిపోయింది. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో కేటీఆర్ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కలిసి పనిచేశారు. ఆ తరువాత మళ్లీ ఆధిపత్య పోరు యాధావిధిగానే కొనసాగుతూ వస్తుంది. పార్టీ సంస్థాగత కమి టీల్లోనూ ఎక్కడా కడియం వర్గీయులకు చోటు కల్పించకుండా రాజయ్య జాగ్రత్తగా వ్యవహరించారు. గ్రామ పంచా యతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ కడియం అనుచరులకు ఎక్కడా టికెట్లు ఇవ్వలేదు. 2019 సెప్టెంబర్లో ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వేర్వేరుగా కాళేశ్వరం సందర్శన యాత్రను చేపట్టడం రెండు వర్గాల మధ్య మరింతగా చిచ్చుపెట్టింది. దేవాదుల నీటితో నియోజకవర్గంలోని చెరువులను నింపడానికి ఇద్దరు నేతలు పోటీపడడంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ ఆవిర్బావ వేడుకల్లో కడియంపై రాజయ్య పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పైకి మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని పేర్కొంటున్నప్పటికీ పరోక్షంగా మాత్రం కడియం వర్గీయులుగా మారడంతోనే వేటువేశారని చర్చించుకుంటున్నారు. ఈ చర్యతో మరోసారి పార్టీలో ఆధిపత్యపోరు బహిర్గతం అయ్యింది. -
ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న డెంగీ
మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్కు చెందిన గుడిమల్ల రాజయ్య కుటుంబాన్ని డెంగీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డెంగీ వల్ల రాజయ్య కొడుకు గుడిమల్ల రాజగట్టు, కోడలు సోనీ, మనవరాలు శ్రీవర్షిణి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజయ్య రక్తాన్ని వైద్య సిబ్బంది సేకరించి పరీక్షించగా డెంగీ పాజిటివ్గా రిపోర్టు రావడంతో వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం తనకు డెంగీ సోకిన విషయం కూడా తెలియని రాజయ్య.. తన నాలుగు రోజుల మనవడితోపాటు పెద్ద మనవడు శ్రీవికాస్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే ఆందోళనలో ఉన్న గుడిమల్ల కుటుంబ సభ్యులు.. శ్రీవికాస్కు శుక్రవారం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారికి తగ్గిన ప్లేట్లెట్స్ సోనీ డెంగీతో చనిపోవడానికి ఒక్కరోజు ముందు జన్మించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పుట్టినరోజు నుంచే ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల ఆ చిన్నారిని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా శుక్రవారం ఆ చిన్నారికి సైతం ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో వెంటనే ప్లేట్లెట్స్ను ఎక్కించాలని వైద్యులు సూచించారు. దీంతో వారు దాతల సహకారం కోరగా, రామకృష్ణాపూర్కు చెందిన సురేశ్ ప్లేట్లెట్స్ అందించడానికి ముందుకొచ్చాడు. రెడ్క్రాస్ సొసైటీ వారు సైతం సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 12 వేల విలువైన ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీలను ఉచితంగా అందించి, ఆ చిన్నారికి ఆసరాగా నిలిచారు. -
ప్రియుడి సాయంతో మాజీ ప్రియుడిని..
సాక్షి, గుంటూరు : తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద దారుణం వెలుగు చూసింది. ప్రియుడిని ఓ మహిళ మరో ప్రియుడి సాయంతో చంపేసి సెప్టిక్ ట్యాంక్లో శవాన్ని పడేసింది. కరకట్ట ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ విజయవాడ చెందిన రాజయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. వారిమధ్య విభేదాలు తలెత్తటంతో సుధాకర్ అనే మరో యువకుడితో కలిసి రాజయ్యను ఇంట్లోనే చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేసింది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని వెలికి తీయించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజయ్యకు తిరిగి డిప్యూటీ సీఎం ఇస్తారా?
కరీంనగర్: టీఆర్ఎస్ సర్వే ఓ పెద్ద జోక్ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేయించుకున్న తన సర్వేలోనే 4వ ర్యాంక్ పొందిన మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు తిరిగి ఆ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానంటున్నారని, అలా జరిగితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తాను రాజ్యసభకు పోటీ చేస్తానంటూ రానున్న ప్రభుత్వం తమదేనని ఆయన చెప్పారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
కాటారం: అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శనివారం జరిగింది. మండల కేంద్రంలోని గారెపల్లికి చెందిన పసుల రాజయ్య(55) అనే రైతు తనకున్న మూడెకరాలతోపాటు మరో పదెకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇందుకు రెండేళ్లలో 6 లక్షల రూపాయల అప్పు అయింది. అప్పు తీర్చే మార్గం కానరాక శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాటారం ఎస్సై కిరణ్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజయ్యను బర్తరఫ్ చేయించిన కడియం
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ సాక్షి, హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి బర్తరఫ్ చేరుుంచింది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వద్దని కేసీఆర్కు సలహా ఇచ్చింది తనేనని కడియం ప్రకటించడం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి దళితుల అభివృద్ధిలో రాజయ్య క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఎంఆర్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
పెళ్లింట పరేషానీ
చేతిలో చిన్ననోట్లు లేవు.. పెద్దనోట్లు చెల్లవు పెళ్లి సామాన్లు కొనలేక జనం నానా అవస్థలు ఈ నెల 24 వరకు మంచి ముహూర్తాలు తెలుగు రాష్ట్రాల్లో 10 వేల పెళ్లిళ్లు సాక్షి, హైదరాబాద్ : రాజయ్య... ఈయనది గద్వాల సమీపంలోని ఓ కుగ్రామం..ఈ నెల 11న కూతురి పెళ్లి.. ఇందుకు తెలిసినవారివద్ద అప్పు చేసి డబ్బు సమకూర్చుకున్నాడు రాజయ్య.. గురువారం బంగారం కొనేందుకు కర్నూలు వెళ్లాడు.. అక్కడ డబ్బు చెల్లించే సమయంలో పెద్ద నోట్లు తీసుకోబోమని నగల షాపు యజ మాని చెప్పటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు! బ్యాం కులో చిల్లిగవ్వ లేనందున ఆన్లైన్ చెల్లింపు వెసులుబాటూ లేదు. దీంతో బంగారం కొనకుండానే వెనుదిరిగాడు! బంగా రం లేకుండా పెళ్లి ఎలా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది! మెహిదీపట్నంలో నివసించే సుధీర్ కుటుంబంలో ఈ నెల 10న పెళ్లి. వంటకు కూరగాయలు లేవు. చేతిలో చిన్న నోట్లు లేవు. ఉన్న పెద్ద నోట్లు చెల్లవు. ఎంత గాలించినా వంద నోట్లు చిక్కలేదు. ఇప్పుడేం చేయాలా? అని ఆ కుటుంబం తల పట్టుకుంది!! ...ఇవి ఒక్కరిద్దరి సమస్యలు కాదు.. రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో ఇప్పుడు ఇలాంటి చిక్కులే వచ్చిపడ్డాయి. పెద్ద నోట్ల రద్దు పెళ్లిళ్లకు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. కార్తీకమాసం మంచి ముహూర్తాలుండటంతో తెలంగాణ, ఏపీలో విసృ్తతంగా పెళ్లిళ్లు జరగబోతున్నారుు. ముహూర్తాలు దగ్గరపడటంతో అంతా షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఆహ్వాన పత్రికలు ఇస్తూనే బంగా రం, వస్త్రాలు, ఇతర సామగ్రి కొనే పనిలో పడిపోయారు. కానీ వారికి ఊహించని ఉపద్రవం ఎదురైంది. బంగారం మొదలు కూ రగాయల వరకు ఎక్కడా ఏదీ కొనలేని పరిస్థితి. చేతిలో కావల్సినంత డబ్బు ఉన్నా వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొనడంతో పెళ్లింట అయోమయం నెలకొంది. కొందరు ఆ డబ్బును బ్యాం కులో డిపాజిట్ చేయొచ్చులే అనుకుని ప్లాస్టిక్ కరెన్సీతో పని కాని చ్చేందుకు సిద్ధపడ్డారు. వీరికి పెద్దగా ఇబ్బంది లేకున్నా... అప్పుసొప్పు చేసి చేతిలో డబ్బు ఉంచుకున్న పేదల పరిస్థితే గందరగోళంగా మారింది. బ్యాంకు నిల్వ లేకపోవటంతో కార్డుల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయలేక తలలు పట్టుకున్నారు. దాదాపు 10 వేల పెళ్లిళ్లు..: ఇటీవలే ఆషాఢం, మూఢాలు... ముహూర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా పడ్డ ఇళ్లల్లో కార్తీకమాస వేళ బాజాలు మోగుతున్నాయి. 10, 11, 12, 13, 16, 17, 23, 24 ఇలా వరసగా మంచి ముహూర్తాలుండటంతో మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. కృష్ణా పుష్కరాల వేళ శుభకార్యాలు వద్దనుకున్నవారు కూడా ఇప్పుడు వివాహాలకు సిద్ధమయ్యారు. ఇలా తెలంగాణ, ఏపీలో 10 వేల పెళ్లిళ్లున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లిళ్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా షాపింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతినిండా డబ్బున్నవారు చిన్న నోట్లు అందుబాటులో లేకున్నా ఆన్లైన్తో పనికానిచ్చేస్తున్నా.. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నాయి. పోనీ చేతిలో సొమ్మును బ్యాంకులో వేసి తర్వాత తీసుకుందామంటే... రోజుకు రూ.పది వేలు, వారానికి గరిష్టంగా రూ. 20 వేలకు మించి విత్డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవటంతో అయోమయంలో పడిపోయారు. ఉన్న డబ్బు ఖర్చు చేయలేక, చేబదులుగా చిన్న నోట్లు తెచ్చుకోలేక, ఆన్లైన్ చెల్లింపులు జరిపే వెసులుబాటు లేక విలవిల్లాడుతున్నారు. ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, బ్యాండ్మేళాలు.. ఇలా అన్నింటికీ స్పాట్ పేమెంట్ ఇవ్వాలి. పెద్దనోట్లు వారు తీసుకోరు. దాంతో పెళ్లింట పెద్ద చిక్కే వచ్చిపడింది. ‘పెళ్లి’ల్లో పెద్దనోట్ల కష్టాలకు బంగారం కూడా తోడైంది. బుధవారం ఒక్కసారిగా 10 గ్రాముల బంగారానికి రూ.4 వేల మేర పెరగడంతో పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు తలలు పట్టుకున్నాయి. -
ఇద్దరు రైతుల మృతి
కోహెడ: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం జ్యోతిరాం తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(49) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేను ఎండిపోవడంతో మనస్తాపం చెంది పంట చేను వద్దే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంటు షాక్తో మరో రైతు మందమర్రి : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో కరెంటు షాక్ తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి ఇందిన శనికాల రాజయ్య(38) అనే రైతు శుక్రవారం పొలంలో యూరియా చల్లటానికి వెళ్లాడు. యూరియా సంచిని నెత్తిమీద పెట్టుకుని వెళ్తుండగా కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగలు కిందకు వేలాడి ఉండటం గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రాజయ్య మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అస్వస్థత
భద్రాచలం : భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అస్వస్థులయ్యారు. మూడు రోజులుగా దగ్గు, జలుబుతో; శుక్రవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్న ఆయన శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూనే మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలల్లో పర్యటించారు. దీంతో జ్వరం సోకి అస్వస్థులయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో శనివారం హైదరాబాద్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ఆయనను సీపీఎం నాయకులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. -
గుండెపోటుతో హోమ్గార్డు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైఎస్సాస్ సెంటర్ వద్ద విధిలు నిర్వహిస్తున్న హోమ్గార్డు రాజయ్య(52) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. మృతుడు రాచర్ల పోలీస్ స్టేషన్లో హోమ్గార్డుగా పనిచేస్తున్నాడు. జెపి చెరువుకు చెందిన రాజయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
మాజీ ఎంపీ రాజయ్య కుటుంబానికి బెయిల్
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్కుమార్లకు గురువారం నాల్గవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి రఘునాథ్రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గతేడాది నవంబర్ 4న రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు సజీవదహనం అయిన ఘటనలో రాజయ్య, అనిల్కుమార్, మాధవి, అనిల్ రెండో భార్య సనా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నిందితులు పలుమార్లు మున్సిఫ్ కోర్టు, జిల్లా కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్నా పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జ్యుడీషియల్ కస్టడీలో ఉండి 90 రోజులు గడిచినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేసుకోగా షరతులతో కూడిన బెరుుల్ను కోర్టు మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలలోపు సుబేదారి పోలీసుస్టేషన్లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే, ఈనెల 15 వరకు ముగ్గురు నిందితులకు ఎలాంటి పాసుపోర్టులు ఉన్నా కోర్టుకు అందజేయాలని షరతు విధించింది. నాల్గవ నిందితురాలు అయిన సనా ఇప్పటి వరకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోలేదు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
భిమిని: అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా భిమిని మండలం తాళ్లరెడ్డెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(36)కు వ్యవసాయంలో దిగుబడి సరిగాలేదు. ఈ నేపధ్యంలో గత రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక పోవడంతో.. అప్పులు పెరిగిపోయాయి. దీంతో వాటిని తీర్చే దారికానరాక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజయ్య బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హన్మకొండ: రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ రాజయ్యకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కోడలు సారిక ముగ్గురు మనవళ్ల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో నవంబర్ 4 నుంచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జిల్లా కోర్టు.. బెయిల్ తిరస్కరించింది. ఇప్పటి వరకు రాజయ్య, అయన భార్య మాధవి మూడు సార్లు , అనిల్ రెండు సార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది. -
రాజయ్య కోడలికి మీరేం న్యాయం చేశారు?
న్యూఢిల్లీ: దళితులపై హింసను అడ్డుకునే పేరుతో కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని బీజీపీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ముగ్గురు పిల్లలు సహా సారిక ఆత్మహత్యకు పాల్పడితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏ న్యాయం చేసిందని విరుచుకుపడ్డారు. దళితులపై కపట ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ ఇంట్లో జరిగిన ఘోరంపై ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లల సజీవ దహన ఘటనపై .. దళితులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని సోనియాని ఈ సందర్భంగా నరసింహారావు ప్రశ్నించారు. గత నవంబర్ 4న జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో సహా ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రీయోన్లు సజీవ దహనమయ్యారు. కొద్దిరోజులుగా రాజయ్యకు ఆయన కోడలు సారికకు మధ్య విభేదాల నేపథ్యంలో కోడలు సారిక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
సారిక కేసులో సనా అరెస్టు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు సాక్షి, హన్మకొండ: మాజీ ఎంపీ రాజయ్య కోడ లు, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో నాలుగో నిందితురాలు సనను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. ఈ కేసులో సారిక భర్త అనిల్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలు నిందితులుగా ఉన్నారు. అనిల్ రెండో భార్య సనా ఏ-4 నిందితురాలు. ఘటన జరిగిన రోజు నుంచి ఆమె పరారీలో ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మధ్యవర్తి ద్వారా చంటిపిల్లాడితో సన(26) లొంగిపోయినట్లు హన్మకొండ ఏసీపీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయంత్రం ఆమెను వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సనకు 14 రోజుల రిమాండ్ను విధించింది. అంతకుముందు సనకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సన మధ్యవర్తి ద్వారా లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. 7న ఖమ్మం జిల్లాలోని ఏ న్కూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీ సుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి శుక్రవారం కోర్టులో హాజరుపరిచేవరకు కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ నివాస సముదాయాల్లో ఆమెను విచారించినట్లు తెలుస్తోంది. మిస్డ్ కాల్తో పరిచయం కాజీపేటలోని ఫాతిమానగర్లో సన బ్యాంగిల్స్టోర్ను నిర్వహించేది. మిస్డ్కాల్ ద్వారా ఆమె కు అనిల్తో పరిచయమైంది. దీంతో అనిల్ సనను రెండో వివాహం చేసుకుని హైదరాబాద్లో కాపురం పెట్టాడు. తొలిసారి కాన్పు అయ్యే వరకు అనిల్ మాజీ ఎంపీ రాజయ్య కొడుకని, అతనికి అప్పటికే సారికతో వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయం సనకు తెలి యదు. నిజం తెలిసినప్పటి నుంచి అనిల్, సన ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఖరికి అనిల్తో విడిపోయేందుకు సనకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు రాజయ్య కుటుంబం అంగీ కరించింది. సన తరఫున బంధువు చనిపోవడంతో ఈ చెల్లింపులో జాప్యం జరిగింది. ఇం తలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. అనిల్ను కస్టడీకి ఇవ్వండి కోర్టులో పోలీసుల పిటిషన్ వరంగల్ లీగల్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనువళ్లు సజీవ దహనమైన కేసులో ప్రధాన నిందితుడైన సారిక భర్త సిరిసిల్ల అనిల్కుమార్ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సుబేదారి పోలీసులు కోరారు. నగరంలోని నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈమేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన అనిల్కుమార్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలను అరెస్టు చేయగా, జైలులో ఉన్నారని, నాలుగో ముద్దాయి సనను శుక్రవారం అరె స్టు చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు ముద్దాయిలు మాట్లాడిన మాటలను మృతురాలి సెల్ఫోన్లో రికార్డు అయి ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, మరింత సమాచారం సేకరించడానికి అనిల్కుమార్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. నిందితుడి నుంచి మరిన్ని దస్తావేజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, విస్త్రృత ప్రజాప్రయోజన దృష్ట్యా కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. -
సారిక డైరీ
-
అర్ధరాత్రి దాకా ఆస్తి గొడవ!
-
అర్ధరాత్రి దాకా ఆస్తి గొడవ!
♦ ఆ తర్వాత కొద్ది గంటలకే రాజయ్య ఇంట్లో ఘోరం ♦ ఎన్నికల ఖర్చుల కోసం భూమి అమ్మాలని రాజయ్య నిర్ణయం ♦ తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా అమ్మొద్దన్న కోడలు సారిక ♦ రాత్రి ఒంటిగంట దాకా గొడవ జరిగిందంటున్న ఇరుగుపొరుగు ♦ అంతకుముందు రోజు భృతిపై కోర్టులోనూ వాదులాట సాక్షి, హన్మకొండ: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి కొన్ని గంటల ముందు రాజయ్య కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు రాత్రి ఇంట్లో రాజయ్య, మాధవి, అనిల్, సారికతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి వరంగల్ ఉప ఎన్నికల్లో ఖర్చుల కోసం రఘునాథ్పల్లి మండలంలో ఉన్న వ్యవసాయ భూమి అమ్మాలని రాజయ్య నిర్ణయించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే తనకు, తన పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వ్యవసాయ భూమిని అమ్మడం సరికాదని సారిక అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘రెవెన్యూ కాలనీలో ఉన్న ఇంటిని నీకు కేటాయిస్తాం. వ్యవసాయ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దు’ అని సారికకు రాజయ్య చెప్పారు. ఇంతలో ఎలాంటి ఆస్తి ఇచ్చేది లేదంటూ ఇతర కుటుంబ సభ్యులు సారికతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై గంటల తరబడి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు రాజయ్య ఇంటి నుంచి కేకలు వినిపించినట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. కేకలు సద్దుమణిగిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిన అగ్నిప్రమాదంలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. కోర్టులోనూ గొడవే.. భర్త అనిల్ నుంచి జీవనభృతి ఇప్పించాలంటూ గృహహింస చట్టం ప్రకారం కిందటేడాది జూన్లో వరంగల్ నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సారిక కేసు దాఖలు చేసింది. జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6,000, ఆమె ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.15,000 భర ణం చెల్లించాలని 2015 జనవరిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయినా జనవరి నుంచి జూలై వరకు భృతి చెల్లించకపోవడంతో జూలైలో సారిక మరోసారి కోర్టుకెక్కింది. దీంతో ఏడు నెలలకు కలిపి అనిల్ రూ.1.05 లక్షల బకాయికిగాను రూ.45 వేలు చెల్లించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 2న (సోమవారం) సారిక, అనిల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. ఇది జరిగిన మరుసటి రోజు అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో సారిక , ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. కాల్డేటా వివరాల సేకరణ జీవనభృతి కేసు విచారణ, ఆస్తుల పంపకం విషయంలో గొడవ నేపథ్యంలో సారిక మరణించడంతో హత్య కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గొడవ జరిగిన తర్వాత అనిల్తో పాటు రాజయ్య, మాధవి ఫోన్కాల్ డేటా వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఎవరికైనా ఫోన్ చేశారా? చేస్తే ఎవరికి చేశారనే అంశంపై లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. జీవనభృతి, ఆస్తుల పంపకంపై అనిల్, సారిక మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో అనిల్ రెండో భార్య, ఆమె తరఫున వ్యక్తులెవరికైనా ఈ దుర్ఘటనతో సంబంధం ఉందా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. -
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
-
టీఆర్ఎస్ సమావేశంలో రగడ
-
టీఆర్ఎస్ సమావేశంలో రగడ
వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ సమావేశంలో రగడ జరిగింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కడియం శ్రీహరి వల్లే రాజయ్య మంత్రి పదవి పోయిందని ఆయన వర్గీయులు ఆరోపించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన ఒక రైతు అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టు రాజయ్య(38) అనే రైతు 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి పంటపెట్టాడు. అయితే నీళ్లు లేక పంట ఎండిపోవడం, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆవేదనకు గురైన రాజయ్య ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య మారెక్క, నలుగురు పిల్లలు ఉన్నారు. -
'కేసీఆర్కు తప్ప ఎవరికీ తెలియదు'
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్కు తప్ప మరోనేతకు తెలియదని మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అన్నారు. ఆయన మంగళవారమిక్కడ అసెంబ్లీ లాబీలో విలేకర్లతో మాట్లాడుతూ అయితే స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలనే వాదన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉందన్నారు. డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవడంతో తనపై రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్, బీజేపీ నుంచి వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతాననే ప్రచారం జరుగుతోందని అన్నారు. అయితే తాను మాత్రం టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. కాగా వామపక్షాల తరఫున గాలి వినోద్ కుమార్ ...వరంగల్ ఎంపీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
రాజయ్య.. కేసీఆర్ బినామీ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పర్వతగిరి : సీఎం కేసీఆర్ బినామీగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పనిచేసి.. వేల కోట్లు దోచిపెట్టారని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడ్డ రాజయ్య... కేసీఆర్ బినామీగా పనిచేసి అల్లుడు హరీష్రావు, కుమారుడు కేటీఆర్, కుతూరు కవితకు వేల కోట్ల రుపాయలను అప్పగించారని ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓటేసిన విద్యార్థులు, ఉద్యమకారుల నమ్మకాన్ని సర్కారు వమ్ము చేసిందని పేర్కొన్నారు. పేదల గొంతుక కాంగ్రెస్ స్టేషన్ఘన్పూర్ టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేదల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. గురువారం వర్ధన్నపేటలో పార్టీ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్కు వెళ్తూ మండలకేంద్రంలో కాసేపు ఆగారు. పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ ైజైహింద్రాజ్, గోనెల ఉపేందర్, యువజన సంఘం నాయకుడు అంబటి కిషన్రాజ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం భట్టి విలేక రులతో మాట్లాడారు. రోజుకో హామీతో మభ్యపెడుతున్న సీఎం కే సీఆర్కు ప్రజా సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యాన్ని వీడాలని, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై స్పందించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నేనా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీనా..?
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తరఫున వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తారనే వార్తలపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, జీవితాంతం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం రాజయ్య విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వరంగల్ లోక్సభా నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని ఆయన అన్నారు. వరంగల్ ఎంపీ స్థానంలో ఆయన కానీ, ఆయన భార్య కానీ కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ను విడిచి పెట్టడం లేదని, బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. తనను కావాలనే కొందరు వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని డాక్టర్ రాజయ్య వివరించారు. -
కడియం దారెటు ?
ఏమాత్రం ఊహించనైనా ఊహించకుండా అందివచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిలో కడియం శ్రీహరి ఎన్నాళ్లు కొనసాగుతారు? అసలు ఆయన దారి లోక్సభ వైపా, లేక శాసన మండలి వైపా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు ఇవి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న డాక్టర్ రాజయ్యను ఆ పదవి నుంచి తప్పించాల్సి రావడంతో సీఎం కేసీఆర్ కుల, వర్గ సమీకరణలు బేరీజు వేసుకుని, కడియం శ్రీహరిని ఆ పీఠం పైకి ఎక్కించారు. ఇది బాగానే ఉన్నా, ఆయన ఇప్పటి దాకా ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. రాష్ట్ర కేబినెట్లో చేరిన ఆరునెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఎందులోనో ఒక దాన్లో సభ్యుడు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆయనను శాసన మండలికి పంపుతారని అంతా ఊహించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి షెడ్యూలు కూడా విడుదలైంది. ఇంతలోనే కడియం ఎంపీగానే కొనసాగుతారని, డిప్యూటీగా తప్పుకుంటారనే ప్రచారం గుప్పుమంటోంది. ఆయన రాజీనామా చేయక పోవడమూ బలం చేకూరుస్తోంది. కడియం ఖాళీ చేస్తే వరంగల్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడం, గెలవడం అన్నీ తలనొప్పులే అన్న భావన టీఆర్ఎస్ హైకమాండ్లో ఉందంటున్నారు. ఈ రిస్కు కంటే కడియంను ఎంపీగా కొనసాగించడమే మంచిదని భావిస్తున్నట్టున్నారు. అంటే ఆయన ‘ఉప ’పోస్టును వదులుకోవాల్సిందేనా? తిరిగి ఆయన హస్తిన బాట పట్టాల్సిందేనా? -
వైద్య బదిలీల్లో అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్ ఆరో జోన్ పరిధిలోని 6 జిల్లాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ లోకాయుక్తకు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్నేత పున్న కైలాశ్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని కీలక అధికారి, ఆయనకు సహకరించిన మరికొందరు సీనియర్ ఉద్యోగులపై విచారణ చేపట్టాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి రాజయ్య హయాంలో జరిగిన ఈ అక్రమాల్లో రూ. కోట్లు చేతులు మారాయని అందులో పేర్కొన్నారు. ఉద్యోగుల సరెండర్ పేరుతో డబ్బులు పుచ్చుకొని ఇష్టమైన చోటుకు డిప్యుటేషన్లపై బదిలీ చేశారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఫిర్యాదుతో పాటు జతచేశారు. -
'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా'
వరంగల్: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. తాను భోళాశంకరుడని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని రాజయ్య తెలిపారు. గత మూడు రోజుల క్రితం కూడా రాజయ్య ఇవే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశాని సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
పురుషుడికి వితంతు పింఛన్
వరంగల్: పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది. వరంగల్ నగరంలోని 53వ డివిజన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో 11-29-197 ఇంటినంబర్లో నివాసం ఉంటున్న రాజయ్య వికలాంగ పింఛన్ కోసం 5 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. 89 శాతం వికలాంగత్వ సరిఫికెట్నూ దరఖాస్తుతో పొందుపరిచాడు. అధికారులు అతనికి వితంతు పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. పింఛన్పైనే ఆధారపడి బతుకున్న రాజయ్య పరిస్థితి అర్థం చేసుకొని పింఛన్ సరిచేయాలని బంధువులు కోరుతున్నారు. -
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే... జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య.. అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు. మరోవైపు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు. -
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రెస్మీట్ రద్దు చేసుకున్న రాజయ్య
-
ప్రెస్మీట్ రద్దు చేసుకున్న రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తన ప్రెస్మీట్ను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాజయ్య రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రెస్మీట్ రద్దు అయినట్లు రాజయ్య సన్నిహితులు ధ్రువీకరించారు. కాగా ప్రెస్మీట్ రద్దుకు గల కారణాలు తెలియరాలేదు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజయ్య సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు. తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు. -
సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. వరంగల్ టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డితో కలసి రాజయ్య సీఎం నివాసానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు. తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం. కాగా, తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు. -
'పారదర్శకత కోసమే నన్ను తొలగించారు'
హైదరాబాద్: ప్రభుత్వ పారదర్శకత కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తనని కేబినెట్ నుంచి తొలగించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. సోమవారం కేసీఆర్తో జరిగిన భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తనని గుర్తించి అడగకుండానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని రాజయ్య తెలిపారు. పార్టీలో తనకి సహకరించిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరగబోయే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తనని కేసీఆర్ ఆహ్వానించారని, ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్లు రాజయ్య చెప్పారు. -
కేసీఆర్ను కలిసిన రాజయ్య
-
కేసీఆర్ను కలిసిన రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. మంత్రవర్గం నుంచి బర్తరఫ్ తర్వాత రాజయ్య తొలిసారిగా కేసీఆర్ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. కాగా ఆ తర్వాత రాజయ్య...సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించలేదు. సీఎంతో భేటీ వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటెలిజెన్స్ గుబులు...
‘తూర్పు’ నేతల భూ దందాలపై ప్రభుత్వానికి నివేదికలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు అప్పుడే ప్రజాప్రతినిధులకు అపవాదులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించడం అవినీతికి తెరలేపిన అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకింత వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై బర్తరఫ్ వేటు పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధుల ‘వ్యవహారాల’పై కూడా ఇంటెలిజెన్స్ విభాగం దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపుతోందని వస్తున్న వార్తలు సదరు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పదవులు పొందిన ఆరు నెలల్లోనే కొందరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తూర్పు జిల్లాలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏకంగా రియల్టర్లతో చేతులు కలిపి భూ దందాకు తెరలేపారనే విమర్శలున్నాయి. మంచిర్యాల మండలం నస్పూర్, వేంపల్లి, మంచిర్యాల, సీతారాంపల్లితోపాటు, పరిసర గ్రామ పంచాయతీల పరిధిలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ (సీలింగ్, అసైన్డ్) భూములు బినామీ పేర్లతో కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు ఈ నేతల చెప్పుచేతుల్లో ఉండటంతో రియల్టర్లు కూడా ఆ ప్రజాప్రతినిధులను తమ వ్యాపారాల్లో వాటాదారులుగా చేసుకున్నారు. జిల్లాలో పలు మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో వాటాల వ్యవహారం కూడా నెల రోజుల క్రితం రచ్చకెక్కింది. రూ.కోట్లు విలువ చేసే ఇసుకను కొల్లగొట్టిన ఇసుకాసురుని వద్ద పెద్ద మొత్తంలోనే పిండుకుని సదరు అక్రమార్కునికి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కండువా కప్పడం స్థానికంగా ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తులకు దారితీసింది. స్వతహాగా రియల్టర్ అయిన ఓ ప్రజాప్రతినిధి ఇప్పటికీ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ నియోజకవర్గంలో ఏ అక్రమ వెంచర్ వెలిసినా ఈ నేతకు వాటా ఇవ్వాల్సిందేననే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాణహిత-చేవెళ్ల పనులను ఇటీవల అడ్డుకోవడంతో ఆ కాంట్రాక్టర్ పార్టీ పెద్దలకు మొర పెట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ స్థానికంగా సాగుతోంది. నేతల ఈ భూ దందాపై ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నివేదికలు వెళ్లినట్లు సమచారం. కేంద్రం నుంచి రూ.కోట్లలో నిధులు వచ్చే కీలక శాఖల బాధ్యతలను అప్పగించడం.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు కట్టబెట్టేలా ఒత్తిళ్లు తేవడం కూడా అప్పట్లో ఆ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా’ తయారైంది.. రాజకీయ కేంద్రమైన నిర్మల్ నేతల అవినీతి బాగోతం. కీలక ప్రజాప్రతినిధి అనుచరుడిగా ముద్ర వేసుకుని పలు శాఖ డిప్యూటీ ఇంజినీర్లను, ఏఈలను అక్రమంగా బదిలీలు చేయించి రూ.లక్షలు దండుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కూడా గడవక ముందే ఓ నేత అక్రమ ‘పనుల’కు తెరలేపారు. సంబంధిత శాఖలు అంచనాలు రూపొందించకుండానే.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకుండానే.. టెండర్లు పిలవకుండానే జిల్లా కేంద్రంలో తన నివాస ప్రాంతంలో రహదారి నిర్మించుకున్నారు. ఈ అక్రమ రోడ్డును సక్రమం చేసేందుకు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండటం వంటి వ్యవహారాలపై నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. ద్వితీయశ్రేణి ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. ముఖ్య నేతలకు దీటుగా మున్సిపాలిటీల్లో, మేజర్ గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సర్కారు, చెరువు భూముల ఆక్రమణల్లో ఆరితేరిన ఈ నేతల వ్యవహారాలపై నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తుండటం ఇప్పుడు వారిని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. -
ఎవరొచ్చినా చేర్చుకుందాం..!
టీడీపీ తెలంగాణ నేతల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి ముఖేశ్గౌడ్,, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వంటివారు ఎవరు వచ్చినా చేర్చుకుని తెలంగాణలో పార్టీ బలం గా ఉందన్న సంకేతాలు పంపాలని టీటీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలోని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కార్యాలయంలో గురువారం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ ఉపనేత ఎ.రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, సీనియర్ నేతలు ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు, సి. కృష్ణాయాదవ్, ఇ.పెద్దిరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్యాదవ్, కడియం శ్రీహరిల రాజీనామాలతో ఖాళీ అయ్యే సనత్నగర్ అసెంబ్లీ, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పోటీకి దిగాలనే యోచనలో ముఖేశ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టీడీపీలోకి రావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. అయితే, సనత్నగర్లో కూన వెంకటేశ్ గౌడ్ ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారని, ఇప్పుడు ముఖేశ్ను తీసుకొచ్చి టిక్కెట్టు ఇస్తే పార్టీ మీద విశ్వాసం పోతుందని నగర నేత ఒకరు వ్యాఖ్యానించగా, అది చంద్రబాబు నిర్ణయమని ఇతర నాయకులు చెప్పినట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్న నేపథ్యంలో ‘ఎవరి ఒత్తిళ్లు వారివి. పోవాలని నిర్ణయించుకున్న వారిని ఆపలేం.’ అని ఓ నాయకుడు వ్యాఖ్యానించినట్లు తెలి సింది. కార్యకర్తల్లో విశ్వాసం పెంచేం దుకు జిల్లాల్లో చంద్రబాబు పర్యటి స్తారని ఎర్రబెల్లి పేర్కొన్నట్లు తెలి సింది. బహిరంగసభలు లేకుండా కార్యకర్తలతోనే సమావేశం ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
'రాజయ్యను అవమానకరంగా తొలగించారు'
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... మాదిగలకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజయ్యకు జరిగిన అవమానంపై శుక్రవారం వరంగల్లో నిర్వహించే సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటిస్తామన్నారు. కనీసం రాజయ్య వివరణ తీసుకోకుండా ఆయనపై చర్యలు తీసుకోవటం సరికాదని మందకృష్ణ అన్నారు. -
అవినీతి జరిగిందని రాజయ్యే ఒప్పుకున్నారు!
-
మళ్ళీ ఆస్పత్రిలో చేరిన రాజయ్య
-
మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య
హైదరాబాద్ : మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరోసారి అపోలో ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయనను కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను మంగళవారం సాయంత్రం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. అనంతరం రాజయ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాల్సిందిగా గతరాత్రి వైద్యులు సూచించారు. దాంతో డాక్టర్ల సూచన మేరకు రాజయ్య ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అపోలో ఆస్పత్రి నుంచి మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను ఈ సాయంత్రం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన మనస్థాపం చెందినట్లు అనుచరులు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజయ్య మాట్లాడుతూ బర్తరఫ్ మాటవిని ఆవేదన చెందానని చెప్పారు. తన పొరపాటు ఉంటే విచారణ జరిపించాలని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు అన్ని పరీక్షలు చేశారని చెప్పారు. వైద్యుల సహకారంతో ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతానన్నారు. రేపు మళ్లీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. -
మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు
⇒ హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలింపు ⇒ ఐసీయూలో వైద్య పరీక్షలు ⇒ మంత్రి చందూలాల్ సహా పలువురు నేతల పరామర్శ ⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడంతో ఆవేదన చెందుతున్న ఆయన మూడు రోజులుగా బీపీ, షుగర్ మందులు వేసుకోవట్లేదు. దీంతో రక్తపోటు, షుగర్ లెవల్స్ బాగా పెరిగాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, మిత్రులతో మాట్లాడుతూ రాజయ్య ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదర్గూడలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజయ్యను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. ఆయనకు ఈసీజీ, 2డీ ఎకో, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ స్థాయిలు పెరగడం వల్లే ఛాతీ నొప్పి వచ్చినట్లు ‘హెల్త్ బులిటెన్’లో పేర్కొన్నారు. అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అంతకుముందు రాజయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధిశాఖ మంత్రి చందూలాల్, మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు. మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఆస్పత్రికి చేరుకొని రాజయ్యను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, రాజయ్యపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న తీరును తప్పుబడుతూ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ (మంద కృష్ణమాదిగ వర్గం) నాయకులు ఆస్పత్రి వద్ద కాసేపు రాస్తారోకో చేపట్టారు. తప్పు చేసి ఉంటే ... విచారణ జరపండి: రాజయ్య ‘బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా. నా పొరపాటు ఉంటే విచారణ జరపండి. వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి. సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. మూడు రోజులుగా నిద్ర లేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. మంత్రి వర్గం నుంచి తప్పించిన తీరు కలచి వేసింది. ఇప్పటికీ చెబుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ అంశంపై విచారణ జరిపించాలి..’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం రాజయ్య మీడియాతో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, మినిస్టర్స్ క్వార్టర్స్లో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. -
దోషమంతా రాజయ్యదేనా?!
డేట్లైన్ హైదరాబాద్ మొదటి నుండీ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి తీరు కొంత అభ్యంతరకరమే. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ఆయనను అవమానించడం మరచిపోలేం. వరంగల్లో వైద్య విశ్వవిద్యాలయం ఎట్లా సాధ్యం? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని రాజయ్యను ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుండి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్ఫ్లూను ఎదుర్కొనలేకపోయిన తీరును జోడించి రాజయ్యకు ఉద్వాసన పలికారు. రాష్ర్ట గవర్నర్లు శాసనసభల్లో ప్రసంగించినా, రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనంలో మాట్లాడినా ‘నా ప్రభుత్వం’ అంటూ తమ ఉపన్యాసాలు మొదలు పెడతారు. మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు మాత్రం ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ మాట్లాడే అవ కాశం లభించింది. జనవరి 26 ఉదయం ఆయన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొని, వెంటనే హైదరాబాద్ చేరుకొని అక్కడా తెలంగాణ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా ఆయనకు ఆ అరుదయిన అవకాశం లభించింది. శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగాలను రాష్ర్ట ప్రభుత్వమే తయారుచేసి మంత్రివర్గం ఆమోదం తీసుకుని మరీ ఖరారు చేస్తుంది. గవర్నర్ అదే ప్రసంగాన్ని శాసనసభలో చదువుతారు. రిపబ్లిక్ దినోత్సవం నాటి గవర్నర్ ప్రసంగాన్ని అట్లా ప్రభుత్వమే తయారు చేయక పోయినా, అది పంపిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాల ఆధారం గానే రాజభవన్లో రిపబ్లిక్ డే ప్రసంగం తయారవుతుంది. సాధారణంగా అది కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించేదిగానే ఉంటుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ తన ప్రభుత్వం అవినీతి రహిత బంగారు తెలంగాణను అందిస్తుందని చెప్పారు. అవినీతి అంశంపైనే ఉప ముఖ్య మంత్రి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన మరునాడే గవర్నర్ రాజకీయ అవినీతి నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని చెప్పడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ అది తెలంగాణ సమాజంలోకి కొన్ని సంకేతాలు వెళ్లడానికి దోహదపడిందనే చెప్పాలి. రాజకీయ అవినీతిని కచ్చితంగా పట్టిపల్లార్చవలసిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. పూర్తి అవినీతి రహిత పాలన నెలకొన్నప్పుడే దాన్ని సమర్థవంతమైన పాలనగా గుర్తించాల్సి ఉంటుంది. సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వరా? రాజకీయ అవినీతి రాజయ్యతోనే ఆరంభం అయిందా? ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడంతోనే అంతమైపోబోతున్నదా? దేశంలో, రాష్ర్టం లో ఎంతో కాలంగా రాజకీయ అవినీతివేళ్లూనుకుని ఉన్నది కాబట్టి రాజయ్య వంటి నాయకులు అవినీతికి పాల్పడితే క్షమించెయ్యాలని ఎవరూ అనరు. కాకపోతే ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుండానే, కనీసం వాటికి సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఒక ఉపముఖ్యమంత్రిని హఠాత్తుగా బర్తరఫ్ చేశారు. కాబట్టే ఈ ప్రశ్నలు అడగవలసి వస్తున్నది. మంత్రివర్గంలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని తొలగించాలి అన్న విష యంలో ముఖ్యమంత్రికి ఉన్న పూర్తి అధికారాన్ని ఎవరూ ప్రశ్నించడానికి లేదు. అయితే మంత్రివర్గంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఉన్నవాళ్లే. కాబట్టి వారిపై తీసుకునే చర్యల గురించి చర్చించే హక్కు ప్రజలకు ఉంటుంది. రాజయ్యను తొలగించడం నిర్దాక్షిణ్యమని ఎందుకు అనాల్సివ స్తోందంటే మంత్రి వాదన వినడానికి సమయం కూడా ఇవ్వకుండా ముఖ్య మంత్రి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధిని, ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, వారి తరఫున అడిగే హక్కు ప్రతిపక్షాల వారికీ ఉంది. అలా అని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు లాగా ప్రతిపక్షాల వారు తలాతోకా లేని విమర్శలు చెయ్య కూడదు. 1999లో చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణల కారణంగానే కే చంద్రశేఖరరావును మంత్రి పదవి నుంచి తొలగించారనడం దయాకర్రావు రాజకీయ అనుభవానికి తగ్గ మాట కాదు. ఒక వేళ కేసీఆర్ నాడు ఆ కారణం గానే మంత్రి పదవిని కోల్పోయి ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ఎవరు అవినీతికి పాల్పడినా చూస్తూ ఊరుకోవాలని ఆయన చెప్పదల్చుకున్నారా? అదలా ఉంచితే, దయాకర్రావు మాటలు నిజమైతే అదే అవినీతిపరుడిని చంద్రబాబు తన ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్గా ఎలా ఉంచుకున్నారు? 1999లో జరిగిందేమిటో అందరికీ తెలుసు. కేసీఆర్ సామా జిక వర్గానికే చెందిన ఐపీఎస్ అధికారి, ిసీబీఐ మాజీ ైడెరైక్టర్ విజయ రామారావును మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగు తుందనేది నాటి చంద్రబాబు ఆలోచన. క్లిష్ట సమయంలో తన వెంట ఉన్న నాయకులను కాదని చంద్రబాబు ఆ రోజుల్లో తటస్థులను తెచ్చి అందలం ఎక్కించారన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు వ్యవహార శైలి దయాకర్రావుకు తెలియదనుకోవాలా? రాజయ్య రాజకీయ భవిత ప్రశ్నార్థకమే ఇంతకూ రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్యకు పిల్లల ైవైద్యుడిగా మంచి పేరు ఉండేది. రాజయ్య స్థానంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిని ఓడించి గెలుపొందారు. తరువాత టీఆర్ఎస్లో చేరి పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో కూడా శ్రీహరిపై గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన 2014లో మూడోసారి గెలుపొందారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడం కాదుగదా, కనీసం ఆయన వాదనైనా వినకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి, నిన్నటి దాకా ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడినే ఆ స్థానంలో నియమించడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ్ధకంగా మారడం నిజం కాదా? అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన రాజయ్యకు 2019లో తెలంగాణ రాష్ర్ట సమితి అసెంబ్లీ టికెట్ ఇస్తుందా? లేక అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన శ్రీహరికి టికెట్ ఇస్తుందా? ఇదేమీ లక్ష కోట్ల డాలర్ల ప్రశ్న కాదు. రాజీనామాలు, ఉప ఎన్నికలు అచ్చి వచ్చాయా? కడియం శ్రీహరి పరిపాలన అనుభవం ఉన్న నాయకుడే. ఆయన, ముఖ్య మంత్రి కేసీఆర్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా కలసి పనిచేసిన వారే. విద్య, భారీ నీటి పారుదల వంటి శాఖలను నిర్వహించిన అనుభవం శ్రీహరికి ఉంది. పైగా డాక్టర్ రాజయ్య సామాజిక వర్గానికే చెందిన దళిత నాయకుడు కూడా. కాబట్టి శ్రీహరిని తన మంత్రివర్గంలో ప్రధాన స్థానంలో చేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నిర్ణయాన్ని ఆక్షేపించవల సిన అవసరం లేదు . కాకపోతే ఇప్పుడు శ్రీహరికి శాసన మండలి సభ్యునిగా స్థానం కల్పించాలి. ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో బాటు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా మండలి సభ్యులుగానే మంత్రి వర్గంలో ఉన్నారు. తెలుగుదేశం నుండి తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవిలో కూర్చోపెట్టిన తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే శాసనమండలి సభ్య త్వం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు శ్రీహరి కూడా ఆ వరుసలో నిలబడాలి. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంటు స్థానానికి అనవసరపు ఖర్చుతో కూడుకున్న ఉప ఎన్నిక ఇప్పుడు అవసరమా? రాజీనామాలు, ఉప ఎన్నికలు మాకు కొత్తేమీ కావు, పైగా అచ్చివొచ్చా యని టీఆర్ఎస్ నేతలు వాదించవచ్చు. కానీ వీటన్నిటికీ కారణమయిన డాక్టర్ రాజయ్య ఉద్వాసన తీరు మాత్రం సమర్థనీయంగా లేదు. ఆయన వాదనా వినలేదు. ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టి తప్పు చేశాడని నిర్ధారించనూ లేదు. మొదటి నుండీ డాక్టర్ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కొంత అభ్యంతరకరంగానే కొనసాగింది. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ముఖ్యమంత్రి రాజయ్యను అవమానిం చిన సంఘటన మరచిపోలేం. వరంగల్లో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎట్లా సాధ్యం? అది అయ్యే పనేనా? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని డాక్టర్ రాజయ్యను ఆయన ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్ఫ్లూను సకాలంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన తీరును జోడించి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పదవిని ఊడగొట్టారు. ఈ ఉద్వాసనతో ముఖ్యమంత్రి అవినీతిని సహించని చండశాసనుడని కొద్ది రోజులు చెప్పుకోవచ్చు. కానీ బీరువాలో ఇంకెన్ని కంకాళాలు ఉన్నాయో! అవి బయటపడిన నాడు కింకర్తవ్యమ్. ఈ లోగా ఒక నాయకుడి రాజకీయ భవితవ్యాన్ని అగాధంలోకి నెట్టినట్టే కదా! datelinehyderabad@gmail.com -
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండెపోటు
-
రాజయ్యకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
-
రాజయ్యకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు మంగళవారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. రాజయ్యను వెంటనే హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్ రేటు పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఆయనను 24 గంటల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచనున్నారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను పదవి నుంచి తొలగించిన వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మనస్థాపం చెందినట్టు అనుచరులు చెబుతున్నారు. రాజయ్య ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. -
అధికార పార్టీలోఆందోళన!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తాటికొండ రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశం జిల్లా అధికార పార్టీలో హాట్టాపిక్గా మారింది. రాజయ్య వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొద్దినెలలుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ ఉన్నఫళంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తారని నేతలెవరూ ఊహించలేదు. చాలా మంది నేతలకు ఇది మింగుడు పడని అంశమే అయినా కేసీఆర్ జెట్స్పీడ్తో నిర్ణయాలు తీసుకుంటారని ఎవరూ భావించలేదు. రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావుకు సన్నిహితుడిగా ముద్రపడిన రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ప్రధానంగా హరీష్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజయ్యను మంత్రి పదవిలో కొనసాగించేందుకు హరీష్ రావు చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన హరీష్రావు వెన్నంటి జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులున్నారు. హరీష్ ఉండగా తమకు ఢోకాలేదని భావించిన నేతలంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఈ పరిస్థితి వచ్చిందంటే తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిలో మొదలైంది. దీంతోపాటు పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ రాజయ్య సొంత జిల్లా వరంగల్లో పర్యటించి వచ్చిన 24 గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీలో, ప్రభుత్వంలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలను పంపేందుకే కేసీఆర్ రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించారని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుండగా, ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుందనే ఆందోళనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈటెల, కేటీఆర్లకు బేఫికర్! మంత్రుల విషయానికొస్తే ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు జిల్లాలో నిజాయతీపరుడనే పేరుండటం, అందుకు తగినట్లుగానే నిరంతరం సభలు, సమీక్షల్లో అవినీతి అంశాన్ని, కేసీఆర్ ఆలోచనలను ప్రస్తావిస్తున్నారు. ‘ప్రజల సొమ్ముకు జవాబుదారీలేకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించినా, ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా చర్యలు జైలుకు పంపుతాం’ అనే సంకేతాలను ఇటు అధికారులకు, అటు నాయకులకు పంపుతున్నారు. ఇక కేటీఆర్ విషయానికొస్తే ‘అయితే తన నియోజకవర్గం... లేదంటే హైదరాబాద్కే పరిమితమవుతున్నారే తప్ప జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన జిల్లా కేంద్రానికి కూడా రావడం లేదు. ఇద్దరు మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్కు ఎలాంటి అసంతృప్తి లేదు. పైగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో వీరిద్దరిని కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలుస్తోంది. మా పరిస్థితి ఏంది? జిల్లా ప్రజాప్రతినిధుల విషయానికొస్తే కొందరిపై కేసీఆర్ నజర్ పెట్టినట్లు సమాచారం. నవంబర్లో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ అవినీతికి అలవాటుపడిన ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే జైలుకు పంపేందుకూ వెనుకాడననే సంకేతాలను పంపారు. జిల్లాలో ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. పోలీసులు, అధికారుల బదిలీల్లో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యేలను పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అధికారుల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేస్తే, కొందరు నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. ‘తెలంగాణ వస్తే బాగుపడతామనే భావనతోనే ప్రజలు మనకు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక మీ బాగోగులే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు. మీరే అవినీతికి పాల్పడితే అధికారులపై ఇక అజమాయిషీ ఎట్లా ఉంటుంది. తీరు మార్చుకోకపోతే జైలుకు పంపేందుకూ వెనుకాడను’ అని హెచ్చరించారనే ప్రచారమూ జరిగింది. కేసీఆర్తో భేటీ అనంతరం సదరు ఎమ్మెల్యేల్లో మార్పు కన్పిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో జిల్లాలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక, కలప దందాలు ఎక్కువయ్యాయని దీనివెనుక కొందరు ఎమ్మెల్యేలున్నారనే చర్చ అధికార పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా సీఎం దృష్టికి వెళ్లడంతో దందాలను ప్రోత్సహిస్తున్న సదరు ఎమ్మెల్యేల్లో తాజాగా రాజయ్య ఎపిసోడ్తో టెన్షన్ మొదలైంది. జాగ్రత్తగా ఉండకపోతే తమకూ ఇబ్బందులు తప్పవేమోననే భావనతో ఉన్నారు. అక్రమ దందాలకు అలవాటుపడిన సదరు ఎమ్మెల్యేల వర్గీయులు మాత్రం తాము చేస్తున్న పనులను సమర్థించుకోవడం గమనార్హం. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేం ఎన్నో కష్టాలు పడ్డాం. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. ఇన్నాళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో కొన్ని డబ్బులు వెనుకేసుకునే పనులు చేస్తే తప్పేముంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద మంత్రివర్గం నుంచి రాజయ్య బర్తరఫ్ ఎపిసోడ్ జిల్లా అధికార పార్టీ నేతల్లో ప్రధాన చర్చనీయాంశం కావడం గమనార్హం. -
కేసీఆర్ నాకు దైవంతో సమానం: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తనకు దైవంతో సమానమని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. పదవి పోయిన తరువాత రాజయ్య ఆదివారం రాత్రి 10 గంటలకు తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తనను తండ్రిలాగా ప్రోత్సహించారని చెప్పారు. ఊహించని విధంగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. ప్రభుత్వ అధికారులలో అవినీతి పెరిగిపోవడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన తప్పులను కేసీఆర్ పసిగట్టారు. మరో పెద్ద తప్పు జరుగకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసినట్లు రుజువైతే, ఏ శిక్షకైనా తాను సిద్ధమన్నారు. ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిని అవుతానన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. ఒక కూలీగా పని చేస్తానన్నారు. వైద్యశాఖ ప్రక్షాళన కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. తెలంగాణలో వైద్య రంగానికి సంబంధించి తాను చేసిన పనుల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయన్నారు. కేసీఆర్ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ అన్నారు. ఏసు ప్రభువుని నమ్మిన బిడ్డగా తను ఎటువంటి తప్పు చేయలేదని రాజయ్య చెప్పారు. త్వరలోనే తాను కేసీఆర్ను కలుస్తానన్నారు.