remunaration
-
రెమ్యునరేషన్ మోడల్ను మార్చేసిన ఫస్ట్ హీరో 'మహేష్బాబు'
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ, సినిమా హిట్ అయితే నిర్మాతకు భారీగానే లాభాలు వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునరేషన్లు చిత్ర పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారుతోందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అధిక నష్టాల ఎఫెక్ట్ వల్ల కొత్తగా నిర్మాతలు ఎవరూ కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. రీసెంట్గా తీరని నష్టాల వల్ల లైకా ప్రొడక్షన్స్ సంస్థను షట్డౌన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం సినిమా బడ్జెట్ పెరగడమే అని చెప్పవచ్చు. అందులో అధిక భాగం హీరో రెమ్యునరేషన్ అనే ఎక్కువమంది చెబుతున్న మాట. అయితే, ఈ రెమ్యూనరేషన్ మోడల్ మొత్తంగా మహేష్బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, అది నిర్మాతలకు భారీ ఊరటను కల్పించేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ బాబును అభినందిస్తున్నారు.నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో (పుష్ప2) టాప్లో ఉన్నారు. అయితే, పుష్ప2 మూవీకి భారీ లాభాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిజల్ట్లో తేడా వచ్చింటే ఎవరూ ఊహించలేని నష్టాలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు మహేష్బాబు- రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం మహేష్బాబు తన రెమ్యునరేషన్గా సినిమాకు ఫైనల్గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35 శాతం వరకు ఉండోచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతుంది. సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యనరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట.. ఇదే ప్లాన్ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారట. అసలు రెమ్యూనరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్లో ఇదే దారిలో చాలామంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. -
రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఒక సినిమా కోసం రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అందరికీ తెలుసు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కోసం ఆయన అందుకున్నారు. అప్పటికే అమితాబ్ బచ్చన్ బాలీవుడ్లో స్టార్ హీరో అయినప్పటికీ ఆ సమయంలో ఆయన రెమ్యునరేషన్ రూ.70 లక్షల లోపే ఉండేది. అయితే, చిరు తర్వాత ఈ మార్క్ను అందుకున్న భారతీయ తొలి హీరోయిన్ ఎవరు..? టాలీవుడ్లో కోటి రూపాయలు అందుకున్న తొలి నటి ఎవరో తెలుసుకుందాం.తెలుగులో కోటీ అందుకున్న ఫస్ట్ హీరోయిన్తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ముంబై బ్యూటీ ఇలియానా.. దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరితో స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో ముంబై హీరోయన్ అంటూ టాలీవుడ్లో డిమాండ్ గట్టిగానే ఉండటంతో ఇలియానా కోసం పోటీ మొదలైంది. పోకిరి తరువాత ఇలియానా చేసిన సినిమా ఖతర్నాక్ (2006). రవితేజతో ఆమె జోడీగా ఆమె చేసిన గ్లామర్కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో ఒక హీరోయిన్కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.ఇండియాలో రూ. కోటి మ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కోటిరూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోనయిన్ శ్రీదేవి. 1993లో విడుదలైన 'రూప్ కి రాణి చోరోన్ కా రాజా' అనే హిందీ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పట్లో అత్యధిక బడ్జెట్తో తీసిన హిందీ సినిమా ఇదే కావడం విశేషం. శ్రీదేవి, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా స్టార్గా శ్రీదేవికి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీలను దశాబ్దం కాలం పాటు శ్రీదేవి ఏలారు. కానీ, అనూహ్యంగా తన 33 ఏళ్ల వయసులోనే (1997) సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయానికి ఆమె బోనీ కపూర్తో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 2015లో పులి, 2017లో మామ్ చిత్రాలతో మళ్లీ తెరపై ఆమె కనిపించారు. -
బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?
బిగ్బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్లో కన్నడ బ్యాచ్లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?
'దేవర' థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే 'దేవర'కి బడ్జెట్ ఎంత? రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా 'దేవర'. గతంలో తారక్తో 'జనతా గ్యారేజ్' తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.పారితోషికాల విషయానికొస్తే 'దేవర'లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన జాన్వీ రూ.5 కోట్లు, విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
మూడు వారాలకే బ్యాగు సర్దిన అభయ్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఆటతో లేదా మాటతో మెప్పించాలి. అప్పుడే బిగ్బాస్ షోలో రాణించగలరు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా హౌస్ నుంచి బయటకు రావడం ఖాయం! అభయ్ నవీన్ రెండింటి మీదా పట్టు కోల్పోయాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఏదో అదృష్టం కలిసొచ్చి అభయ్ చీఫ్ అయ్యాడంతే! అచ్చిరాని చీఫ్ పోస్ట్కంటెస్టెంట్లు తనను నమ్మి చీఫ్ పదవి కట్టబెట్టారు. ఏ ముహూర్తాన చీఫ్ అయ్యాడో కానీ తనలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రస్ఫుటంగా కనిపించాయి. పైగా సెల్ఫ్ నామినేట్ అవడంతో అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్టే బయటపడింది. గుడ్ల టాస్క్లో తన టీమ్ గెలుపు కోసం వెంపర్లాడుతుంటే చీఫ్ పోస్టులో ఉన్న అభయ్ మాత్రం పిచ్చ లైట్ తీసుకున్నాడు. అంతేనా, టీమ్ సభ్యులను కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.ఎలిమినేషన్కు ప్రధాన కారణమిదేపైగా తన టీమ్పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్బాస్ మీద తన ప్రతాపం చూపించాడు. బిగ్బాస్.. బయాస్డ్ అంటూ నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్బాస్ మీదకు తోసేశాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు, తనను బయటకు పంపించడమే బెస్ట్ అనుకున్నారు.నాగార్జున దయ చూపినా..ఏదో అద్భుతంగా ఆడి బిగ్బాస్ను నిలదీసుంటే మెచ్చుకునేవారేమో కానీ, ఇలా చేతగానివాడిలా ఓ మూలన కూర్చుని సెటైర్లు వేయడం ఎవ్వరికీ మింగుడుపడలేదు, అందుకే నాగార్జున రెడ్ కార్డు చూపించినప్పటికీ దయ తలిచి హౌస్లో ఉండనిచ్చినా ప్రేక్షకులు అందుకు ఒప్పుకోలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇక ఈ మూడువారాలకుగానూ దాదాపు రూ.6 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 8లో రెండో వారం గడిచిపోయింది. ఊహించని విధంగా చాలా వారాలు ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్బాస్ తీసుకొచ్చిన తలతిక్క ట్విస్ట్ వల్ల ఇతడికి చాలా అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. అయితే ఉన్నది కొద్దిరోజులే అయినా గానీ రెమ్యునరేషన్ బాగానే వెనకేసుకున్నాడు. ఇంతకీ చెందే మొత్తం ఎంత? శేఖర్ భాషా ఎలిమినేషన్కి కారణం ఏమై ఉండొచ్చు.శేఖర్ భాషా ఎలిమినేట్బిగ్బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలానే ఏ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది కూడా చెప్పలేం. అలా తొలివారం బేబక్క ఎలిమినేట్ అయి బయటకొచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శేఖర్ భాషా ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఆర్జేగా ఒకప్పుడు పాపులర్. షోలోకి రాకముందు రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎంటరై కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే హౌసులోనూ కామెడీ చేసే బాధ్యతలు తీసుకున్నాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)అదే శాపమైందా?కానీ బిగ్బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ భాషాకు శాపమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఓటింగ్ పరంగా చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ భాషఆ నిలిచారు. అయితే హౌసులో ఎవరు ఉండాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియెన్స్ కాకుండా మిగిలిన హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సీత తప్పితే అందరూ శేఖర్ భాషా హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించేశారు.ఎన్ని లక్షలు వచ్చాయి?ఎంటర్టైన్ చేస్తూ రోజురోజుకీ శేఖర్ భాషా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఈ విషయం బహుశా మిగిలిన హౌస్మేట్స్కి అనిపించడం వల్లనో ఏమో గానీ ఎలిమినేట్ చేసి పంపిశారు. అయితే వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని ఇతడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్గానే ఇతడి భార్యకి కొడుకు పుట్టాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత) -
బిగ్బాస్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
సూపర్ హిట్ మూవీ.. ఎవరి పారితోషికం ఎంతంటే?
స్త్రీ .. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రాజ్కుమార్ రావు- శ్రద్దాకపూర్ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. భయపెడుతూనే నవ్వించే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సీక్వెల్గా స్త్రీ 2 తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల పైచిలుకు సాధించింది. ఈ క్రమంలో ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం..హీరో రాజ్కుమార్ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకోగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. అతిథి పాత్రలో కనిపించిన వరుణ్ ధావన్.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.135 కోట్లు వసూలు చేసింది.చదవండి: బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది? -
కౌన్ బనేగా కరోడ్పతి.. ఒక్క ఎపిసోడ్కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-16కు హౌస్ట్గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్పాట్!
కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?
హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు. బయట కావొచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహ నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్.. నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రూ.100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' చేసినందుకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్' కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'రాజాసాబ్' సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్.. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్, 'రాజాసాబ్' కోసం కేవలం రూ.100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ 'రాజా సాబ్'. ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2.. వరసగా రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?
ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ) 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
'ఆ నిర్మాత పారితోషికం ఇవ్వలేదు'.. టాలీవుడ్ హీరోయిన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ భామ మాల్వీ మల్హోత్రా. ఆ తర్వాత హిందీలో హోటల్ మిలాన్ చిత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వీ పలు వీడియో ఆల్బమ్స్లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మాల్వీ మల్హోత్రా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేశారని ఆరోపించారు. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో పనిచేశానని తెలిపారు. ఈ పాటకు ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆల్బమ్లో నటించినందుకు విక్రమ్ తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మాల్వీ మల్హోత్రా ఆరోపించింది. పారితోషికం కోసం విక్రమ్కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. మాల్వీ మాట్లాడుతూ.. 'నేను విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా ఆల్బమ్ సాంగ్ కోసం పనిచేశా. అప్పడే నేను దక్షిణాదిలో సినిమా షూట్లతో బిజీగా ఉన్నా. అయినప్పటికీ విక్రమ్ భట్ ఆయన నిర్మాణంలో ఒక పాట చేయమని నన్ను సంప్రదించారు. నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కేటాయించా. ఎందుకంటే వారిని నేను పూర్తిగా విశ్వసించా. కానీ ఆ తర్వాత నాకు పెండింగ్లో డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా మరే ఇతర ఆర్టిస్ట్ కూడా ఇలా మోసపోకూడదని దీన్ని షేర్ చేస్తున్నా" అని వెల్లడించింది. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందించింది. ఆ డబ్బులు విషయం గురించి తనకు తెలియదని.. అందుకే దానిపై నేను ఏం మాట్లాడదలచుకోలేదని చెప్పింది. -
రాజమౌళి సినిమాకి..మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదా ?
-
గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేశ్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?) -
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్గా పనిచేశారు. రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. సీరియల్స్లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్ ద్వారానే దాదాపు రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు. ఓవరాల్గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి డాక్టర్బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్బాస్ ఆర్గనైజర్స్కి నచ్చలేదు. గౌతమ్ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
సౌత్లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్కు సరైన హిట్ దక్కలేదు. -
50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర నటులందరితోనూ నటించిన నయన్ తాజాగా షారుక్ ఖాన్ జవాన్లో మెప్పించింది. ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నయన్ చాలారోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన్ కొద్దిరోజుల క్రితం తన పిల్లల ఫోటోలు చూపుతూ ఇన్స్టాగ్రామ్లో అడుగు పెట్టింది. నిమిషాల్లోనే ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేశారు. ప్రస్తుతం ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నయనతార గత కొన్నేళ్లుగా కొత్త స్కిన్ కేర్ కంపెనీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తరచుగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్లాన్లో ఉంది. ఇలా ఆమె వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టడం విశేషం. తన వ్యాపార ఉత్పత్తులు షేర్ చేసేందుకే ఇన్స్టాగ్రామ్లోకి నయన్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రకటనకు కోట్లలో రెమ్యునరేషన్: ఈ సందర్భంలో నటి నయనతార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేవలం 50 సెకన్ల ప్రకటనలకే నయనతార దాదాపు రూ. 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రకటనల సమయం అంతకు మించి పెరిగితే తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా.. కొత్త మార్గాల్లో సంపాదిస్తూ.. ఏడాదికేడాది ఆస్తుల విలువను పెంచుకుంటుంది నయన్. (ఇదీ చదవండి: గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ) -
'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?
'జవాన్' సినిమా పేరు చెప్పగానే అందరికీ వందల కోట్ల కలెక్షన్సే గుర్తొస్తాయి. ఎందుకంటే గత వారం రిలీజైన ఈ చిత్రం.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో షారుక్తోపాటు బోలెడంత మంది స్టార్స్ నటించారు. అయితే మిగతా వాళ్లు కోట్లకు కోట్లు తీసుకున్నారు. కానీ ఇందులో యాక్ట్ చేసిన దీపికా పదుకొణె మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకో తెలుసా? తనకు జరిగిన అన్యాయంపై ఓ జవాన్.. తన కొడుకుతో కలిసి విలన్పై ఎలా పగతీర్చుకున్నాడు? అనే కాన్సెప్ట్తో తీసిన 'జవాన్' సినిమాని ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఇకపోతే ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో షారుక్కి జోడీగా దీపికా పదుకొణె యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) సాధారణంగా ఒక్కో సినిమాకు దీపికా పదుకొణె.. రూ.12-15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటదని టాక్. అలాంటిది 'జవాన్'లో ఉచితంగా నటించినట్లు స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటంతో ఇంకేం ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈమె కెరీర్కి బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఓం శాంతి ఓం'. ఈ చిత్రం నుంచి షారుక్, నిర్మాణ సంస్థతో దీపికకు మంచి బాండింగ్ ఉంది. బహుశా ఈ కారణంతోనే ఫ్రీగా యాక్ట్ చేసి ఉండొచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ K' అలియాస్ 'కల్కి'లో హీరోయిన్గా చేస్తోంది దీపికనే. అయితే గతంలో తన భర్త రణ్వీర్ సింగ్ 83, సర్కస్ సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేసిన దీపికా.. అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు 'జవాన్'కి మాత్రం ఫ్రీగా చేసింది. మరి ఇది విశేషమేగా! (ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!) -
ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తోంది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి అగ్ర నటుల చిత్రాల వరకు ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి లిస్ట్లో చాలా సినిమాలే ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో శ్రీలీల నటిస్తోన్న ఆరు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. (ఇదీ చదవండి; తండ్రితో హీరోయిన్ లిప్లాక్.. 33 ఏళ్ల తర్వాత రియాక్షన్) మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ ధమాకా సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. త్వారలో విడుదలన కానున్న రామ్ స్కంద సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్గా తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలకు ఏకంగా ఒక సినిమా కోసం రూ. 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆమె ఒప్పుకునే సినిమాలకు సుమారు రూ. 8 కోట్లు వరకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. సినిమాలతో పాటు శ్రీలీల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళ్తుంటుంది. అందుకోసం ఆమె సుమారు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ షాపింగ్ మాల్ కార్యక్రమంలో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటారట. ఆ లెక్కనా ఒక నిమిషానికి రూ. 10 లక్షల రెమ్యునరేషన్ అవుతుంది. వీటితో పాటు ఆమెకు అయ్యే ఫ్లైట్ ఖర్చులతో పాటు హోటల్ రూమ్స్ అన్నీ షాపింగ్ మాల్ నిర్వాహుకులే ఏర్పాటు చేయడం సహజం. ఈ విషయంపై ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్ రూ. 10 లక్షలా అంటూ పలువురు నోరెళ్ల బెడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. తన మొదటి రెమ్యునరేషన్ కేవలం రూ. 5 లక్షలే కదా అంటూ.. తను కూడా ఇండస్ట్రీలో కష్టపడి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టే వాళ్లందరూ అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. -
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కోసం వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్లో ఎవరంటే?
-
'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!
భారతీయ సినిమా ట్రెండ్ సెట్టర్గా పేరుగాంచిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు విడుదలైతే ఆ తేదీకి తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం పరిపాటి. తెలుగులో కూడా స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని క్రేజ్.. తన సినిమాల కలెక్షన్ల రికార్డులను ఆయన మాత్రమే తిరిగి కొట్టగలడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాలు పర్వాలేదనిపించడంతో ఆయనపై రకరకాల విమర్శలు చుట్టుముట్టాయి. ఈ దశలోనే నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజనీ నటించనున్నట్లు ప్రకటించారు. దీంతో కోలీవుడ్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంతకుముందే నెల్సన్- విజయ్ కాంబోలో వచ్చిన బీస్ట్ చిత్రం డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో రజనీపై ఆ ప్రెజర్ పడింది. కానీ రజనీ మాత్రం నెల్సన్ను నమ్మి జైలర్ అవకాశం ఇచ్చాడు.ఈ చిత్రంలో తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా ప్లస్ అయ్యారు. ఆగస్ట్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదలై విశేష స్పందనను అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ వర్షం కురిసింది. దీంతో రజనీకాంత్ కూడా చాలా సంతోషించారు. ఈ మెగా హిట్ విమర్శకులందరికీ సమాధానంగా నిలిచింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరి ప్రత్యేక సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. గత ఏడాది విడుదలై తమిళ చిత్రసీమలో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. దీంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగ (ఆగస్టు 31) రజనీకాంత్ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజనీకాంత్కి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. రజనీకాంత్కు ఇచ్చిన చెక్కును కవర్పై 'ది రియల్ రికార్డ్ మేకర్' అని రాసి ఉండటం గమనార్హం. రజనీకాంత్కు గిఫ్ట్గా రెండు కార్లు తీసుకెళ్తే.. ఈ చెక్తో పాటు ఆయనకు బీఎండబ్ల్యూ కారును కూడా కళానిధి మారన్ గిఫ్ట్గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కారులను ఆయన రజనీ వద్దకు తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్7 మోడల్ కారును రజనీ సెలెక్ట్ చేసుకున్నారు. దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు అని సమాచారం. అందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ వారు షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్గా రూ. 110 కోట్లు రజనీకాంత్ తీసుకున్నారని టాక్.. సినిమాకు భారీగా లాభాలు రావడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరో రూ.100 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా మెత్తంగా జైలర్ కోసం రజనీకాంత్ అందుకున్న పారితోషకం రూ . 210 కోట్లకు చేరింది. ఇదీ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డ్గా నిలవనుంది. ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో జైలర్ మానీయా నడుస్తూనే ఉంది. #JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor — Sun Pictures (@sunpictures) September 1, 2023 Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi — Sun Pictures (@sunpictures) August 31, 2023 -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్లోని పారిస్లో ఈఫిట్ టవర్ను వన్డే వరల్డ్ కప్ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. టాలీవుడ్లో టాప్ బన్నీనే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప 2' విడుదలకు ముందే ఆయన ఖాతలో మరో రికార్డు వచ్చి చేరినట్లు సమచారం. పుష్ప సనిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న బన్నీని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ అవార్డు రావడంతో టాలీవుడ్లో ఆయన మరో మెట్టు ఎక్కారు. గత రెండు రోజుల నుంచి పుష్ప 2కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్గా మారింది. (ఇదీ చదవండి: పెళ్లి కబురుతో ఫోటో షేర్ చేసిన విజయ్ దేవరకొండ) 'పుష్ప 2' సినిమా ద్వారా టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో అల్లు అర్జున్ అని వైరల్ అవుతుంది. ఇప్పటికే మొదటి భాగంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడం... మరోవైపు జాతీయ అవార్డు దక్కడం ఇలా ఆయనకు ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. పుష్ప 2 కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్కడి రైట్స్ రూ. 125 కోట్లని సమాచారం. (ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్) దీంతో పుష్ప 2 రెమ్యునరేషన్కు బదులుగా నార్త్ ఇండియా రైట్స్ను బన్నీ తీసుకున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాకు గాను ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ. 125 కోట్లు అవుతుంది. దీనిని బట్టి టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా బన్నీ రికార్డులకు ఎక్కినట్లు. ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రమే రూ. 100 కోట్లతో టాప్లో ఉన్నారని టాక్. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. టాలీవుడ్ కింగ్ అల్లు అర్జునే అని వారు కామెంటు చేస్తున్నారు. -
షాపింగ్ మాల్ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
సినిమా అవకాశాలు అంతగా లేకున్నా ఇప్పటికీ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్ల లిస్ట్లో పూజాహెగ్డే ఉంది. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. వీటి సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ ఫిట్గా ఉంటూ తన అందంతో వారిని మెస్మరైజ్ చేస్తుంటుంది అ బ్యూటీ. కానీ ఇక్కడ ఒక మంచి కథ ఉన్న సినిమాతో మళ్లీ తెరపైన పూజాహెగ్డే కనిపిస్తే తప్పకుండా పూర్వవైభవం దక్కించుకుంటుంది. (ఇదీ చదవండి: ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) ప్రస్తుతం తన చేతిలో అంతగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే పలు షాపింగ్ మాల్స్ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగానే ఉంది. తాజాగ కడపలోని ఓ షాపింగ్ మాల్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇంతకీ ఆ షాపు ఓపెనింగ్ కోసం వచ్చిన పూజ హెగ్డే తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఆమె ఉన్నందుకు గాను అక్షరాలా రూ. 40 లక్షలు తీసుకున్నారని టాక్. (ఇదీ చదవండి: Pooja Hegde : కడపలో సందడి చేసిన బుట్టబొమ్మ (ఫొటోలు) కడప మాత్రమే కాదు మరెక్కడైన గానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్య క్రమంలో పూజ వచ్చి రిబ్బన్ కట్ చేయాలంటే రూ. 40 లక్షలు పైగా తీసుకుంటుందని టాక్. దీంతో టాలీవుడ్లో ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. కడపలో షాపింగ్ మాల్ ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత తను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసింది. దీంతో అక్కడికి వచ్చిన యువకులు కూడా డ్యాన్స్లు చేశారు. -
అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అక్షయ్ కుమార్ కీలక పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై గాడ్ 2' ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్దేవ్ కీలక పాత్రలు పోషించారు. అయితే దీని కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే స్పందించారు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్ త్రిపాఠి నటించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?) అక్షయ్ రెమ్యునరేషన్పై 'ఓమైగాడ్2' నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే ఇలా స్పందించారు 'ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి అక్షయ్ రెమ్యునరేషన్పై వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకు బడ్జెట్ విషయంలో లోటుపాట్లు ఉంటే ఆయనే ఆర్థికంగా సాయం చేశారు. మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'ఓ మైగాడ్' మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం.' అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. కాబట్టి సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రమే ఆయనకు షేర్ ఉంటుందని చెప్పారు. -
రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' విడుదలైన మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ, సాంగ్స్, సీన్స్.. ఇలా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఘోరంగా వచ్చాయి. ఒకరకంగా నిర్మాత నుంచి బయర్స్ వరకు నష్టం వచ్చినట్లేనని టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని గ్రహించిన చిరంజీవి తన రెమ్యునరేషన్ నుంచి కొంతమొత్తాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి- అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవలు వచ్చాయని ఈ మధ్య బాగా వైరల్ అయింది. దీంతో అనిల్ రంగంలోకి దిగి ఇందులో నిజం లేదని ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్బాస్లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో 'భోళా శంకర్' కు ఆయన రూ. 60 కోట్లు తీసుకున్నాడని టాక్ నడిచింది. ఇందుకు సంబంధించిన రెమ్యునరేషన్ను సినిమా నిర్మాతలు షూటింగ్ సమయంలోనే చిరుకు రూ. 50 కోట్లు ఇచ్చేశారట. మిగతా రూ. 10 కోట్లు మెగస్టార్కు చెక్ రూపంలో ఇచ్చారట. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) కానీ ఆ చెక్ను సినిమా విడుదల తర్వాత బ్యాంక్కు పంపాలని చిరంజీవి భావించారట. భోళా శంకర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా రిజల్ట్ తెలుసుకున్న మెగాస్టార్.. ఆ చెక్ను డిపాజిట్ చేయకుండా అలానే ఉంచారట. తనను నమ్ముకుని సినిమా తీసిన నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆ చెక్ను అనిల్ సుంకరకు రీసెంట్గా తిరిగి ఇచ్చేశారని తెలుస్తోంది. గతంలో కూడా తన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలకు చిరంజీవి ఏదో రూపంలో సాయం చేశారని పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని చెబుతున్నారు. చిరంజీవి తమకు ఎప్పుడూ అండగానే ఉన్నారని నిన్ననే నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
'చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారా?'.. వైరలవుతోన్న భోళాశంకర్ నిర్మాత వాట్సాప్ చాట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో.. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తొలిరోజు వసూళ్లు బాగానే రాబట్టినా.. ఆ తర్వాత భారీగా పడిపోయాయి.అదే సమయంలో రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి హిట్ టాక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (ఇది చదవండి: స్కూల్ ఫ్రెండ్స్తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్) ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తన రెమ్యునరేషన్ కోసం నిర్మాతను మెగాస్టార్ ఇబ్బంది పెడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుకు పారితోషికం చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను తాకట్టు పెడుతున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఇప్పటికే బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ఆయనకు ఇంటికి వెళ్లగా.. దగ్గరుండి మరీ బాగా చూసుకున్నారని ట్వీట్ చేశారు. అయితే తాజాగా భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సార్ రెమ్యునరేషన్ విషయంలో మీపై వస్తున్న వార్తలు నిజమేనా అంటూ ఓ మెగా అభిమాని నిర్మాతకు అనిల్కు మేసెజ్ చేశారు. ఇది చూసిన అనిల్ సుంకర.. 'అలాంటిదేం లేదు.. నేనే ఫ్లైట్లో యూఎస్ వెళ్తున్నా అంటు బదులిచ్చారు. ఇది ఒకసారి చూడండి సార్ అడగ్గా.. దానికి బదులిస్తూ.. 'మీరు అలాంటివేమీ మీరు పట్టించుకోవద్దు.. నేను మెగాస్టార్తో మరో సినిమా తీయబోతున్నా. చిరంజీవి చాలా మంచివ్యక్తి. వారి ప్రశ్నలన్నింటికీ సినిమాతోనే సమాధానం చెబుదాం. అంటూ అతనికి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ సుంకర వాట్సాప్ చాట్ తెగ వైరలవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చాట్ చూస్తే చిరంజీవికి, నిర్మాతకు మధ్య గ్యాప్ పెరిదిందన్న వార్తలు రూమర్స్ అని అర్థమవుతోంది. (ఇది చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్ ) -
'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!
'జైలర్' హవా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సూపర్స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు. మరి 'జైలర్'కి మరో హీరో అయిన అనిరుధ్కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ. రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణమైన సీన్స్ని కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అనిరుధ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'జైలర్' హీరోగా నటించిన రజినీకాంత్కు రూ.110 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇక మిగిలిన వారిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్కే ఎక్కువట. ఏకంగా రూ.10 కోట్ల వరకు ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. 'జైలర్'తో ఏఆర్ రెహమాన్(రూ.8 కోట్లు)నే దాటేశాడు. అలానే ఇతడు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తం, చాలామంది యంగ్ హీరోలకు ఇచ్చేదాని కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా మనోడి వెంట పడుతున్నారు. రూ.10 కోట్లు కంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు పవన్ 'అజ్ఞాతవాసి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. నాని 'జెర్సీ'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తీస్తున్న 'దేవర' కోసం పనిచేస్తున్నాడు. ఏదేమైనా సరే ఓ సంగీత దర్శకుడు గురించి ఇంతలా మాట్లాడుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!) -
50 కోట్ల 'బేబీ' యాక్టర్స్ కి అంత తక్కువ రెమ్యునరేషనా...?
-
బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఆమె నటనకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ అశ్విన్ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఇందులో లీడ్ రోల్ చేసిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్ గుండెలపై బలంగా తన మార్క్ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్గా ఇచ్చారని టాక్. విరాజ్ అశ్విన్కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా ప్రమోషన్స్ టైమ్లో చెప్పాడు. దీంతో సినిమా బజ్ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్లో కూడా ఓ సినిమా ఛాన్స్ రానున్నదని టాక్. -
పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో! ) అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) -
చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ పారితోషికం ఎంతో తెలుసా?
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం తాత్కాలిక సెలెక్టర్ శివ్సుందర్ దాస్ నేతృత్వంలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ప్యానెల్ అగార్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విటర్లో పేర్కొంది. కాగా టీమిండియా తరపున 1998లో అరంగేట్రం చేసిన అగార్కర్ 2007 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 9 ఏళ్ల కెరీర్లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్లు ఆడాడు. 2007 టి20 వరల్డ్కప్ను గెలిచిన టీమిండియా జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్గా విధులు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటరీ ప్రొఫెషన్లోనూ అగార్కర్ తనదైన ముద్ర వేశాడు మరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన అజిత్ అగార్కర్ పారితోషికం ఎంత ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఇప్పటికైతే బీసీసీఐ చీఫ్ సెలక్టర్కు రూ. కోటి పారితోషికం చెల్లిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాకుండా మిగతా వారికి రూ.90 లక్షల చొప్పున ఏడాదికి చెల్లిస్తారు. అయితే అజిత్ అగార్కర్కు మాత్రం చీఫ్ సెలెక్టర్ పదవి చేపేట్టేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశం ఉంది. బీసీసీఐ కూడా చీఫ్ సెలెక్టర్ పదవికి పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అగార్కర్కు రూ. కోటి నుంచి మూడు కోట్ల వరకు చెల్లించే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక టీమిండియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటికి అజిత్ అగార్కర్ పేరిటే ఉంది. 2000వ సంవత్సరంలో జింబాబ్వేతో వన్డేలో అగార్కర్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అంతేకాదు అతి తక్కువ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గానూ అగార్కర్ నిలిచాడు. కేవలం 23 మ్యాచ్ల్లోనే అగార్కర్ ఈ ఫీట్ను సాధించాడు. కాగా అగార్కర్ రికార్డు దశాబ్దం పాటు చెక్కుచెదరకుండా ఉంది. చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా Dhoni-Sakshi: 'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?' -
Lust stories 2: ఈ సీన్ల కోసం తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే..
స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్లో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లతో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఆ సిరీస్లో కూడా బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్2'లో కూడా అవే సీన్లతో మరింత డోస్ పెంచింది. బాలీవుడ్లో అవకాశాల కోసమే మిల్కీబ్యూటీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందానని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె సినీ కెరియర్లో ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో బోల్డ్గా నటించలేదు. అంతే కాకుండా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ సీరిస్లో వారిద్దరూ ఏకంగా లిప్ కిస్ సీన్స్తో పాటు బెడ్ రూం సీన్స్లో కూడా రెచ్చిపోయారు. (ఇదీ చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) ఈ సిరీస్ కోసం తమన్నాకు భారీ స్థాయిలోనే రెమ్యూనేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఒక సినిమా కోసం తమన్నా సుమారు రూ. ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ 'లస్ట్ స్టోరీస్2' కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇందులో కూడా తను కేవలం 30 నిమిషాల నిడివి లోపే తన క్యారెక్టర్ ఉంటుంది. రొమాన్స్ సీన్లు చేసేందుకు ఎలాంటి అడ్డు చెప్పనందుకే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చారని తెలుస్తోంది. టాలీవుడ్లో భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!) -
రవితేజ రెమ్యూనరేషన్ అంతా
-
ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్కు అన్ని కోట్లా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన తారక్.. రాజమౌళి తీసిన ఈ సినిమా దెబ్బకు గ్లోబల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్ లో కూడా తన గురించి మాట్లాడుకునేలా యాక్టింగ్ తో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. దీంతో సినిమాలు, యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. రీసెంట్ గా జస్ట్ ఓ యాడ్ లో నటించినందుకు ఏకంగా కొన్ని కోట్లు అందుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడం ఏమో గానీ అందులో హీరోలుగా చేసిన చరణ్, ఎన్టీఆర్ మాత్రం వేరే లెవల్లో ఫేమస్ అయిపోయారు. బడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్న ఎన్టీఆర్.. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గానూ ఉన్నాడు. ఈ మధ్య ప్రముఖ సంస్థ మెక్ డొనాల్డ్స్ యాడ్ లో నటించిన తారక్.. దీని ఒక్కదాని కోసమే ఏకంగా రూ.6-8 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఎన్టీఆర్ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తెలిసిన ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. రోజురోజుకి తమ అభిమాన హీరో సినిమాలతో పాటు మిగతా విషయాల్లోనూ అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం 'దేవర' చేస్తున్న ఎన్టీఆర్.. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి వర్క్ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: స్టార్ హీరోయిన్ కామెంట్స్
నటి శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తనకు అనిపించింది బయటకు చెప్పే బోల్డ్ అండ్ బ్యూటీ ఈమె. స్వయంకృషితో ఎదిగిన నటి శ్రుతిహాసన్. నిజ జీవితంలోనూ ఆమె ఒక సంచలనమే. ప్రముఖ నటుడు కమల్హాసన్ వారసురాలైనా.. ఆయన పేరు ఏ విధంగానూ వాడుకోవడానికి ఇష్టపడని నటి. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అయితే తన తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తను మాత్రం వారి నుంచి ఎలాంటి ఆర్థికసాయాన్ని ఇప్పటి వరకు కోరలేదని బహిరంగంగానే చెప్పింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రుతిహాసన్.. ఇటీవల తెలుగులో నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ఇకపోతే హీరో హీరోయిన్ల పారితోషికం విషయంలో సమానత్వం కోసం కొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు తామేమి తక్కువ కాదని చిత్ర విజయాల విషయంలో తమ భాగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నటి శ్రుతిహాసన్ కూడా పేర్కొనడం విశేషం. (ఇది చదవండి: నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..) ఆ మధ్య ప్రియాంక చోప్రా తన కెరీర్లో 20 ఏళ్ల తర్వాత హీరోకు సమానంగా తమ పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన నటి శ్రుతిహాసన్ హీరోయిన్లకు హీరోలకు సమానంగా ఇవ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లో హీరోకు సమానంగా అందుకున్నారని.. ఇక్కడ కూడా ఆ రోజు రావాలని తాను ఎదురుచూస్తున్నానని పేర్కొంది. -
కస్టడీ డైరెక్టర్తో విజయ్.. రెమ్యునరేషన్ ఏకంగా రూ.200 కోట్లా!
దళపతి విజయ్ సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా కోలీవుడ్లో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఇంక ఆయనతో సినిమా తీసేందుకు డైరెక్టర్లు సైతం క్యూ కడతారు. అయితే ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మిస్కిన్, ప్రియా ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: కస్టడీ డైరెక్టర్తో విజయ్ నెక్స్ట్ మూవీ?) అయితే ఈ సినిమా తర్వాత విజయ్.. కస్టడీ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభుతో జతకట్టనున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం కోసం ఆయనతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం కోసం విజయ్ దాదాపు రూ.200 కోట్లు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం రానుందని సమాచారం. అదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే తొలి భారతీయ నటుడిగా విజయ్ నిలుస్తాడు. అయితే గతంలో మాస్టర్ మూవీ కోసం విజయ్ రూ. 80 కోట్లు వసూలు చేశాడు. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) -
ఏజెంట్ కోసం అఖిల్ కష్టాలు.. తెలిస్తే షాక్ అవుతారు ...
-
ఊహించని స్థాయిలో ప్రభాస్ రెమ్యూనరేషన్!
-
రెమ్యూనరేషన్ లో ప్రభాస్ ని దాటేసిన హీరో ఎన్టీఆర్,రామ్ చరణ్ కూడా వెనుకే..
-
వార్-2లో జూనియర్ ఎన్టీఆర్.. ఎంట్రీతోనే రికార్డ్ రెమ్యునరేషన్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంతో యంగ్ టైగర్ గ్లోబర్ స్టార్గా గుర్తింపు పొందాడు. దీంతో ఎన్టీఆర్ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ -2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అటూ బి-టౌన్లోనూ.. ఇటూ టాలీవుడ్లోనూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వార్- 2కు తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.40 నుంచి రూ.50 వరకు కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్ వార్- 2 కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు రూ.100 కోట్ల క్లబ్లో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోలు ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగానే ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం వార్- 2 మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. -
రానా నాయుడు వెబ్ సిరీస్.. వెంకటేశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్లో వెంకటేశ్ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు. అబ్బాయి రానాకు తండ్రిగా నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్పై ఫ్యాన్స్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సిరీస్లో నటించేందుకు వెంకటేశ్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్లో నటించేందుకు వెంకటేశ్ దాదాపు రూ.12 తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ప్రభాస్ను పక్కకు నెట్టిన బన్నీ.. ఏ విషయంలోనో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రంపైనే దృష్టి సారించారు. ఇటీవలే రాజస్థాన్ వేకేషన్కు వెళ్లిన బన్నీ అక్కడి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. అయితే తాజాగా బన్నీకి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. రెమ్యూనరేషన్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ను దాటేశారని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తొలి హిందీ మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ప్రభాస్ను వెనక్కినెట్టి అత్యధిక రెమ్యూనరేషన్గా అందుకున్న టాలీవుడ్ హీరోగా నిలుస్తారు. టీ సిరీస్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.125 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్లతో అల్లు అర్జున్ పనిచేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్రెడ్డితో కలిసి సూపర్ హిట్ సినిమా అందిస్తామని అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు. Been looking forward for this combination for quite some time now . @imvangasandeep garu’s magic is something that personally touches me . Hopefully we give a memorable film that will be remembered for a long long time . pic.twitter.com/i24uOyoFkI — Allu Arjun (@alluarjun) March 4, 2023 -
హ్యాట్రిక్ హిట్.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సార్’ మేడం?
సంయుక్తి మీనన్... ప్రస్తుతం టాలీవుడ్ బాగా వినిపిస్తున్న పేరు. భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత బింబిసార చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్గా సార్ మూవీతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టిన భామగా మంచి క్రేజ్ను సొంతంగా చేసుకుంది. దాంతో తెలుగు దర్శక-నిర్మాత దృష్టి ఇప్పుడు ఈ అమ్మడుపై పడింది. చదవండి: జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ అంతేకాదు స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలకు ఆమె పేరునే సిఫారసు చేస్తున్నారని టాక్. దీంతో ఆమెకు టాలీవుడ్లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో సంయుక్త రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో ఉందట. ‘భీమ్లానాయక్’లో ఆమె సెకండ్ హీరోయిన్గా చేసినప్పటికి నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బింబిసారలో హీరోయిన్గా చేసినప్పటికీ ఆమె పాత్ర నిడివి పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ ఆమెకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ దాంతో ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకి అట్లూరి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం సార్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులే కాదు దర్శక-నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. కాగా అటూ తమిళం, ఇటూ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న సంయుక్త రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సంయుక్త మీనన్ తమిళంలో బుమారంగ్ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో సితార బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఇందులో ఓ స్టార్ హీరోతో ఆమె జతకట్టబోతుందట. -
వరుస ఫ్లాప్లు.. అలా చేస్తేనే పూజాకు ఆఫర్స్ ఇస్తామంటున్నారట?
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. అంతేకాదు రెమ్యునరేషన్లో కూడా మిగతా హీరోయిన్ల కంటే ముందే ఉంది. ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం. అలా వరుస ఆఫర్స్తో దూసుకుపోతున్న పూజాకు 2022తో బ్రేక్ పడిందా? అనిపిస్తోంది. చెప్పాలంటే 2022 ఆమెకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. గతేడాది విడుదలైన ఆమె చిత్రాలు రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా పరాజయం పొందాయి. చదవండి: శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్! అప్పటి వరకు లక్కీ లెగ్గా దర్శక-నిర్మాతల ఆదరణ పొందిన ఆమెకు వరుస ప్లాప్లు షాకిచ్చాయి. దీంతో ఈ బుట్టబొమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు. మహేశ్ SSMB28 తప్పా ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. అయితే తెలుగులో అలా వైకుంఠపురం చిత్రం వరకు పూజా కెరీర్ తిరుగులేదు అన్నట్లు సాగింది. అందుకే ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంతా వెనకాడకుండా దర్శక-నిర్మాతలు పారితోషికం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమె కథ అంతా మారిపోయింది. ఈ తాజా బజ్ ప్రకారం పూజా కెరీయర్ ఉన్నట్టుండి తలకిందులైనట్లు తెలుస్తోంది. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఆఫర్ కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందేనంటూ నిర్మాతలు షాకిస్తున్నారట. తను అడిగినంత ఇచ్చేందుకు రెడీగా లేమంటూ చేతులెత్తేస్తున్నారని ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఆఫర్ కావాలంటే రూ. 50 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అంటున్నారట. దీంతో పూజా తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాంటే బుట్టబొమ్మ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బీస్ట్ మూవీ సమయంలో తన స్టాఫ్ హోటల్, మెయింటెనెన్స్ బిల్లులపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లులు తనే కట్టుకోవాలని మూవీ నిర్మాతలు చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. -
ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ సినిమాకు నో రెమ్యూనరేషన్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వైరలవుతోంది. ప్రభాస్ ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. ప్రభాస్ వరసగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సాలార్ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ల్లో నటించనున్నారు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్లో కనిపించనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. కొన్ని కథనాల ప్రకారం సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిమిత బడ్జెట్తో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ప్రభాస్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సాలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా నటించనున్నారు. నటుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా ప్రకటించారు. -
అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్, లిప్ లాక్ సీన్స్ సాధారణం అయిపోయాయి. కానీ 80, 90లో మాత్రం ఇలాంటి సన్నివేశం అంటే సంచలనం. హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉంటే చాలు దానిపై విపరీతమైన చర్చ జరిగేది. ఎక్కడికి వెళ్లిన ఆ నటీనటులకు దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉండేవి. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసిన దీనిపైనే రచ్చ. అలా ఇప్పటికీ తాను చేసిన లిప్లాక్ సీన్పై ప్రశ్నలకు ఎదుర్కొంటూనే ఉంటుంది అలనాటి బ్యూటీ క్వీన్, సీనియర్ హీరోయిన్ మాధురీ ధీక్షిత్. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్, కానీ అవసరం లేకున్నా ఓ సినిమాలో హీరోతో డీప్ లిప్లాక్ సీన్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అప్పుట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగిందట. అసలు మాధురీ ఆ సన్నివేశం ఎందుకు చేసింది? తనకు అంత అవసరం ఏమొచ్చిందని అంతా చర్చించుకున్నారట. అయితే ఈ సీన్ కోసం మాధురీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న అంశం అప్పట్లో బచర్చనీయాంశమైంది. అంతేకాదు అంత్యంత విలువైన ముద్దు ఏదంటే మాధురిది అనేంతగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. డబ్బు కోసం ఇంత దిగజారాలా! అని ఫ్యాన్స్ సైతం ఆమెను విమర్శించారట. ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ డైరెక్షన్లో 1988లో విడుదలైన ‘దయావన్’ చిత్రంలో వినోద్ ఖన్నా-మాధురీ దీక్షిత్లు హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: లవ్టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ ఇందులో అవసరం లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్తో పాటు లిప్కిస్ పెట్టారట. అయితే మొదట మాధురీ చేయనని చెప్పడంతో దర్శక-నిర్మాతలు ఆమెకు కోటీ రూపాయలు ఆఫర్ చేశారట. దీంతో ఆమె అయిష్టంగానే ఒకే చేప్పిందని సమాచారం. ఇక రీసెంట్గా ఓ మూవీ ఈవెంట్లో మీడియా నుంచి మాధురీకి ఈ లిప్కిస్పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చింది. దీంతో 35 ఏళ్ల నాటి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. -
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్కుమార్లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో జాన్వీ.. రెమ్యూనరేషన్ వింటే షాక్..!
జాన్వీ కపూర్ అంటే బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. తాజాగా జాన్వీ కపూర్పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సౌత్ సినిమాల్లో నటించేందుకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్చరణ్కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి) సౌత్ సినిమాల్లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు జాన్వీ కపూర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఎంత డిమాండ్ చేసిందన్నా విషయం ఇప్పటివరకు ఎవరూ వెల్లడించలేదు. ఆమె డిమాండ్కు చిత్ర నిర్మాతలు అంగీకరిస్తే సౌత్ సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించనుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బావాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తున్నారు. -
భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా?
తమిళసినిమా: కోలీవుడ్లో తాజాగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పారితోషికం విషయంలో ఇప్పటివరకు సూపర్ స్టార్ రజినీకాంత్దే పైచేయి అంటారు. ఆయన రూ.130 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఆ తరువాత వరుసలో దళపతి విజయ్ ఉన్నారు. ఈయన రూ.110 నుంచి 125 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారనేది సినీవర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. విజయ్ గత చిత్రం బీస్ట్ నిరాశ పరిచింది. అయినా ఆయన పారితోషికం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పెరుగుతూ పోతోందని సమాచారం. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఆయన నటిస్తున్న వారీసు చిత్రానికి గతం కంటే ఎక్కువే రెమ్యునరేషన్ పుచ్చుకున్నారని టాక్. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి భారీ తెలుగు చిత్రాలకు పోటీగా బరిలోకి దిగుతోంది. తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్ సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు మాస్టర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. విజయ్ 67వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్పైకి వెళ్లనుంది. అయితే ఆ తదుపరి చిత్రం గురించి కూడా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషం. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే! విజయ్ 68వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇది రూ.400 కోట్ల బడ్జెట్తో రూపొందనున్నట్లు టాక్. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి విజయ్కి రూ.150 కోట్లు పారితోషికం అని, దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో ఇంతకు ముందు తెరి, మెర్సల్, బిగిల్ వంటి హ్యాట్రిక్ చిత్రాలు వచ్చాయి. కాగా దర్శకుడు అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న హిందీ చిత్రం జవాన్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీన్ని 2023 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్కు సుమ యాంకర్గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
బిగ్ బాస్ సీజన్-6 రన్నరప్.. శ్రీహాన్ వారానికి ఎంత తీసుకున్నాడంటే..!
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్-6 విన్నర్గా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నర్గా శ్రీహాన్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఈ షోలో పాల్గొన్నవారికి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అదే విషయంపై చర్చ మొదలైంది. ఈ సీజన్ రన్నరప్ శ్రీహాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లుక్కేద్దాం. ఈ సీజన్లో శ్రీహాన్ ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు. ఈ 15 వారాల జర్నీతో తన మనసును సంతోషంతో నింపుకున్నారు. తోటి ఇంటిసభ్యులకోసం శ్రీహాన్ నిలబడ్డ తీరును బిగ్ బాస్ ప్రశంసించారు. బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో పాల్గొనడానికి వారానికి రూ.1.75 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో 15 వారాలకు దాదాపు రూ.26 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకోగా.. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కానీ ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. బిగ్బాస్ హౌస్లో స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్గా నిలిచి రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ మొత్తంలో రూ.71 లక్షలు ఆర్జించాడు శ్రీహాన్ గ్రాండ్గా గ్రాండ్ ఫినాలే: దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ఆది రెడ్డి, రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. చివరికి రేవంత్ బిగ్బాస్ విన్నర్గా నిలిచారు. ప్రస్తుత సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. నిఖిల్, రవితేజ, రాధ, శ్రీలీల వంటి తారల రాకతో మరింత జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. కింగ్ నాగార్జున మరోసారి తన హోస్ట్తో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం ఈ సీజన్ అందరినీ బాగా అలరించింది. -
బిగ్బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బుల్లితెరపై తెలుగు బిగ్బాస్ 6 సీజన్ సందడికి ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో రేవంత్ విజేత నిలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా.. శ్రీహాన్ రన్నర్గా నిలిచాడు. ఇక టాప్ 3 కంటెస్టెంట్గా కీర్తి నిలిచింది. మొదటి నుంచి కీర్తి హౌజ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ సింపతి గేన్ చేస్తుందంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా తడబడకుండా ఆమె ముందుకు సాగుతూనే ఉంది. ఆటలో సైతం తన మార్క్ చూపిస్తూ వచ్చింది. చేతి వేలు దెబ్బతిన్నా ఆటలో.. ఎక్కడ తగ్గేదేలే అంటూ ముందకు సాగింది. గాయపడినప్పటికీ మిగతా కంటెస్టెంట్స్కి గట్టి పోటినిచ్చింది. తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న కీర్తి టాప్ 3లో నిలిచింది. ఫినాలేలో బిగ్బాస్ ఇచ్చిన ఆఫర్ను వద్దనుకుని రూ. 30 లక్షల ప్రైజ్మనీని చేజార్చుకుంది. ఎవరూ చెప్పిన వినకుండా విన్నర్ అవుతాననే కాన్ఫిడెంట్తో రూ. 30 లక్షల బ్రీఫ్కేస్ను తిరస్కరించింది. దీంతో కొందరు ఆమెది ఓవర్ కాన్ఫీడెన్స్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఆడియన్స్ మాత్రం ఆమె కాన్ఫిడెన్స్కి ఫిదా అవుతున్నారు. మరికొందరు ఆ బ్రీఫ్కేస్ తీసుకుని ఉంటే తన శ్రమ తగిన ఫలితం ఉండేదంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి 15 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఆసక్తిగా మారింది. పలు టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొంది బిగ్బాస్ హౌజ్లో అడుగుపెట్టిన కీర్తి ఒక్కొ వారానికి గానూ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలు తీసుకుందని వినికిడి. ఈ బజ్ ప్రకారం.. 15 వారాలపాటు హౌజ్లో కొనసాగిన కీర్తి మొత్తం రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల పైనే తీసుకుందని వినికిడి. దీనిప్రకారం హౌజ్లో లేడీ కంటెస్టెంట్స్తో పోలిస్తే అందరి కంటే కీర్తి రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది. చదవండి: మొత్తం బిగ్బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? ‘కాంతార’ భూత కోల వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్ -
మొత్తం బిగ్బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్బాస్ 6 తెలుగు సీజన్కు ఎండ్ కార్డ్ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. దీంతో యాభై లక్షల ప్రైజ్ మనీలో విజేత రేవంత్కి దక్కింది పది లక్షలే. అయినప్పటికీ విన్నర్గా నిలిచిన రేవంత్ గెలుచుకున్న ప్రైజ్మనీ దాదాపు రూ. 50 లక్షల పైనే అయ్యింది. బిగ్బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు అతను పది లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. వీటితో పాటు ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్, పది లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రేవంత్కు యాభై లక్షలు అందుకున్నాడు. ఇకపోతే బిగ్బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్మనీ విషయం పక్కన పెడితే.. అతడి 15 వారాల పారితోషికం హాట్టాపిక్గా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం.. రేవంత్ ఒక్కో వారానికి రూ. 2 లక్షల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్ 15 వారాలకు గానూ నుంచి దాదాపు రూ. 30 లక్షల పైనే అందుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీతో పాటు పారితోషికం కలిపి రూ. 80 లక్షలపైనే సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్గా రేవంత్ నిలవడం విశేషం. చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరోయిన్ల రెమ్యునరేషన్పై మృణాల్ షాకింగ్ కామెంట్స్
మృణాల్ ఠాకుర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన మృణాల్ పలు సినిమాల్లో హీరోయిన్గానూ నటించింది. అయితే సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఆమె ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మరాఠి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె పిప్పా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన మృణాల్ హీరోయిన్ల రెమ్యునరేషన్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్ హీరోయిన్లు పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని.. డిమాండ్ చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల్లో నటీనటులకు ఉన్న గుర్తింపు, పాపులారిటిని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న రెమ్యునరేషన్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరే,న్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. చదవండి: సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ -
ఇదేందయ్యా.. నా నరాలు కట్ అయిపోయాయి.. అడివి శేష్ అభిమాని షాక్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకులను పలకరించింది.నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (ఇది చదవండి: HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ) అయితే తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అడివి శేష్ రెమ్యునరేషన్పై నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యారు. గూగుల్లో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేస్తే 450 మిలియన్ డాలర్లు చూపిస్తోందని నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి హీరో అడివి శేష్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూద్దాం. నెటిజన్ ట్వీట్ చేస్తూ..' అన్నా ఎందన్నా ఇది? గూగుల్లో తప్పుడు సమాచారం వస్తోందని నాకు తెలుసు. అయినా ఉత్సాహంతో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేశా. అందులో 450 మిలియన్ డాలర్లు అని వచ్చింది. ఒక్కసారిగా నా నరాలు కట్ అయిపోయాయి అన్నా.' అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్ అభిమానికి రిప్లై ఇచ్చారు. మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.' అంటూ ట్వీట్ చేశారు. Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. 🐶 https://t.co/27YvTzR1yx — Adivi Sesh (@AdiviSesh) December 7, 2022 -
బిగ్బాస్ 6: హాట్టాపిక్గా ఫైమా రెమ్యునరేషన్! 13 వారాలకు ఎంతంటే?
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్లో భాగంగా ఫైమా హౌజ్ను వీడింది. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్లో కాస్తా సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. 13వ వారం మొదటి నుంచి కీర్తి ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయలు వ్యక్తం అవగా అనూహ్యంగా ఫైమా బిగ్బాస్ను వీడింది. ఇది ఆమె ఫాలోవర్స్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆమె చేసిన కొన్ని పొరపాటు వల్ల నెగిటివిటి రావడంతో చివరికి ఫైమా బయటకు వచ్చేసింది. రోహిత్ను ఫైమా తిట్టడం వల్లే ఆమెకు నెగిటివిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఫైమా ఎలిమినేట్ అవ్వడం పలువురిని షాక్కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే 13 వారాలకు గానూ ఫైమా తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. జబర్దస్త్ లేడీ కమెడియన్గా మంచి ఆదరన పొందిన ఫైమాకు ఎంత రెమ్యునరేషన్ అందిందనేది ఆసక్తిని సంతరించుకుంది. దీంతో తను తీసుకున్న మొత్తం ఎంత అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫైమా రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం బిగ్బాస్ నుంచి ఫైమాకు భారీగానే పారితోషికం అందినట్లు తెలుస్తోంది. కాగా ఒక్కొక్కొ వారానికి గానూ ఫైమాకు బిగ్బాస్ రూ. 25వేల నుంచి 30 వేలు ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం చూస్తే 13 వారాల పాటు బిగ్బాస్ హౌస్లో ఫైమా కొనసాగింది. కాబట్టి మొత్తంగా ఆమెకు 3 లక్షల 25 వేలు ఆ పైచిలుకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే ఇది ఆమెకు మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రియాలిటీ షోలు చేసినప్పుడు ఆమెకు ఎప్పుడు కూడా ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ వచ్చింది లేదు. ఇక ఇప్పుడు కెరీర్ మొత్తంలో ఆమెకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ రావడంతో ఫైమా ఫుల్ ఖుషిలో ఉన్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. మరి బిగ్బాస్తో వచ్చిన క్రేజ్తో ఫైమా తదుపరి కెరీర్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇకపై ఫైమా జబర్దస్త్లో కనిపిస్తుందా? లేదా? అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. చదవండి: నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు నిర్మాతపై దుష్పచారం, నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు -
భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నటి ప్రియాంక మోహన్కు అతికినట్లు సరిపోతుంది. ఈమె చేసిన చిత్రాలు తక్కువే అయినా పారితోషికం విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కన్నడ భామ 2019లో మాతృభాషలో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ పిలిచింది. అక్కడ నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాలను చకచక చేసేసింది. అవి అంత హిట్టు సాధించకపోయినా కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడే ఈ బ్యూటీకి లక్కు కలిసివచ్చింది. శివ కార్తికేయన్తో జతకట్టిన డాక్టర్ చిత్రం సక్సెస్ అయింది. ఆ వెంటనే సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక మోహన్ కెరీర్కి ఎలాంటి ఎఫెక్ట్ కాకపోవడం విశేషం. ఆ వెంటనే మరోసారి శివ కార్తికేయన్ జంటగా డాన్ చిత్రంలో నటించి మరో విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ ఈమెకు అన్ని విధాలా మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. నటిగా వయసు మూడేళ్లే. మూడు భాషల్లో ఇప్పటికి చేసిన చిత్రాలు కేవలం అరడజనే.. పారితోషికం మాత్రం భారీ మొత్తంలో పుచ్చుకుంటోందని తాజా సమాచారం. రెండు శతాబ్దాలుగా పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న త్రిష లాంటి వారు కూడా మొన్నటి వరకు కోటి రూపాయల కంటే తక్కువే పారితోషికాన్ని తీసుకున్నారు. అలాంటిది నటి ప్రియాంక మోహన్ క్రేజీ హీరోయిన్లకు సమానంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ జాణ ధనుశ్కు జంటగా కెప్టెన్ మిల్లర్, జయం రవి సరసన దర్శకుడు ఎం.రాజేష్ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. -
హాట్టాపిక్గా సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రెమ్యునరేషన్!
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. తాజాగా సుధీర్ నటించిన సినిమా గాలోడు. ఈ మూవీ నిన్న(నవంబర్ 18న) థియేటర్లో విడుదలైంది. విడుదలై తొలి షో నుంచి ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో గాలోడు చిత్రం సక్సెస్ వైపు దూసుకుపోతోంది. చదవండి: బేబీ బంప్తో నిత్యా మీనన్! ఫొటోలు వైరల్ ఈ క్రమంలో ఈ మూవీకి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా పరిచమైన సుధీర్.. ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించాడు. తాజాగా గాలోడు మూవీతో హీరోగా మరోసారి ఫ్యాన్స్ని అలరించాడు. అయితే ఈ సినిమాకు సుధీర్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సుమారు రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మూడో సినిమాకే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో హాట్టాపిక్గా మారింది. ఓ అప్కమ్మింగ్ హీరోకు ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ మూడో సినిమాకే ఈ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్న సుధీర్కు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుందంటున్నారు నెటిజన్లు. సుధీర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ పారితోషికం ఇచ్చేందుకు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక గాలోడు సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల చేసినట్లు టాక్. ఇటీవల కామెడీ షో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుదీర్ ఇప్పుడు మళ్లీ ఆ షోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు రీసెంట్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు!
తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన ఇందులో హీరోయిన్గా చేసిన శ్రీలీల మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెరపై శ్రీలీల అందం, అభినయంకు తెలుగు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. దీంతో టాలీవుడ్లో ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రవితేజ చిత్రం ధమకాలో హీరోయిన్గా చేస్తోంది. వీటితో పాటు రామ్ పోతినేని-బోయపాటి, బాలకృష్ణ-అని రావిపూడి కాంబినేషన్లో రాబోయో చిత్రాల్లో హీరోయిన్గా ఖరారైనట్లు సమాచారం. ఇవి రెండు భారీ చిత్రాలు కావడంతో శ్రీలీల తన రెమ్యునరేషన్ను భారీ పెంచేసిందట. మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. లేటెస్ట్గా రామ్ సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఇక ఆఫర్ కోసం తన దగ్గరకు వచ్చే దర్శక-నిర్మాతలకు కోటి పైనే పారితోషికం డిమాండ్ చేస్తోందని ఫిలిం దూనియాలో వినికిడి. ఇంకా ఒక్క హిట్ పడకుండానే ఆమె ఈ రెంజ్లో డిమాండ్ చేయడంపై దర్శక-నిర్మాతలు షాకవతున్నారట. ఇక ఈ అమ్మడి దూకుడు చూస్తుంటే తగ్గేదే లే అన్నట్లు ఉందంటున్నారు ఆమె ఫ్యాన్స్. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్ -
బిగ్బాస్ 6: 9 వారాలకు గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్బాస్ 6 సీజన్లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు గీతూ రాయల్. మొదటి నుంచి హౌజ్లో అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె అనూహ్యా ఎలిమినేషన్ మాత్రం అందరికి షాకిచ్చింది. కేవలం ప్రేక్షకులే కాదు హౌజ్మేట్స్ కూడా గీతూ ఎలిమినేషన్ను జీర్ణించుకోలేకోపోతున్నారు. ఇక హౌజ్ని వీడేముందు గీతూ ‘నన్ను పంపించొద్దు బిగ్బాస్’ అంటూ వేడుకున్న తీరు ప్రతిఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టాంగానే ఆమె హౌజ్ను వీడింది. అయితే సోషల్ మీడియాలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ పాపులర్ అయ్యింది గీతూ. సోషల్ మీడియా ఇన్ఫులేన్సర్గా గుర్తింపు తెచ్చుకుని బిగ్బాస్ 6వ సీజన్ ఆఫర్ కొట్టేసింది. అలా హౌజ్లో అడుగు పెట్టిన ఆమె తనదైన ఆట తీరుతో 9 వారాల పాటు ఎంటర్టైన్ చేసింది. ఈ నేపథ్యంలో గీతూ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఆమె పారితోషికంగా ఎంత అనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గీతూ రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం... గీతూకి వారానికి రూ. 25వేల చొప్పున పారితోషికం అందిందని తెలుస్తోంది. అలా 9 వారాలకు రూ. 2.5 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే అందరి కంటే బాగా ఆడిన గీతూకి ఇంత తక్కువ పారితోషికం ఏంటని ఆమె ఫాలోవర్స్ అభిప్రాయ పడుతున్నారు. కాగా హౌజ్లో రేవంత్, బాలాదిత్య, నేహా చౌదరి, శ్రీసత్య, కీర్తి, వాసంతి, ఇనయ సుల్తానా, రోహిత్, మెరినా, సూర్యల కంటే గీతూ రెమ్యునరేషన్యే తక్కువనే చర్చ కూడా జరుగుతోంది. గీతూ కొంపముంచింది అదేనా? అయితే గీతూ ఆహం ఎక్కువ అనే విషయం తెలిసిందే. అన్ని తనకే తెలుసు అన్నట్టుగా హౌజ్లో టాస్క్లో ఆమె వ్యవహరించేది. అంతేకాదు టాస్క్ల్లో తన బుద్దిబలంతో పాటు తన అతి తెలివి వాడి రూల్స్ మార్చేది. ఇలా ఓసారి హోస్ట్ నాగార్జున చేతిలో చీవాట్లు కూడా తింది. ఇక ఆమె అతి వల్లే గీతూకి నెగిటివిటీ వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు హౌజ్ పనుల విషయంలో బద్ధకంగా చూపించడం.. తనకు కెటాయించిన పనిని కూడా సరిగ చేయకుండ పక్కవారితో చేయించేది. ఏం చెప్పిన తనకు ఓసీడీ అంటూ తప్పించుకునేది. శ్రీహాన్ కెప్టెన్సీలో గీతూ చేసిన తప్పిదం వల్లే అతడు ఈ వారం కంటెండర్గా అనర్హుడయ్యాడు. ఇది పక్కన పెడితే శ్రీహాన్ గీతూతో సింగిల్గా వాష్రూమ్ క్లీనింగ్ చెపిస్తానంటూ హోస్ట్కు మాటిచ్చాడు. కనీసం అది కూడా దృష్టిలో పెట్టుకొకుండా గీతూ తన పని చేయకుండ ఆదిరెడ్డితో చేయించింది. దీంతో శ్రీహాన్ ఈవారం కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అనర్హుడు అయ్యాడు. అతడి ఫ్యాన్స్ నుంచి కూడా గీతూకి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: స్టార్ హీరో విక్రమ్కు గోల్డెన్ వీసా.. నటి పూర్ణ భర్తకు సంబంధం ఏంటీ? పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్ పోస్ట్ -
‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్టాక్తో దూసుకుపోతోంది. ఇందులో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ను తెలుగులో వెంకటేశ్ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమాకు హైలెట్గా నిలిచారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ అయితే ఈ సినిమా కోసం వెంకి భారీగానే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించింది 15 నిమిషాలే యంగ్ హీరో రెమ్యునరరేషన్ స్థాయిలో ఆయనకు మేకర్స్ భారీ మొత్తం చెల్లించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓరి దేవుడా సినిమాలో వెంకి తన పాత్ర కోసం 5 రోజుల కాల్షీట్ ఇచ్చారట. ఈ 5 రోజుల షూటింగ్, 15 నిమిషాల నిడివికి ఆయన దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చదవండి: Mega 154 Title: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్ -
ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు..: ‘ఇస్మార్ట్’ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ చైతన్య ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్. ఆ తర్వాత రామ్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించి తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. మరోవైపు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా పుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్తో ముచ్చటించిన ఆమె ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే ఈ సందర్భంగా నిధి పరిశ్రమలో హీరోయిన్లను కేవలం గ్లామర్ షో కోసమే అన్నట్టు చూస్తారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. అందం కూడా ఉండాలి. కేవలం టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు హీరోయిన్ అందంగా ఉందా? లేదా? అనేదే చూస్తారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పని గ్లామర్ షో చేయడమే. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ ప్రేక్షకులు చూసేది కూడా అదే. అందుకే నేను గ్లామర్ షో చేసేందుకు వెనుకాడను. డైరెక్టర్లు అడిగితే కాదని కూడా చెప్పను. ఇక పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే అసలు వదులుకోను. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎలాంటి డిమాండ్ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. కాకపోతే నా మినిమం పారితోషికం ఇంత అని మాత్రం చెప్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు తప్పకుండా వస్తాయని నేను నమ్ముతాను’ అని అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. -
‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా?
గంగవ్వ.. సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ‘మై విలేజ్ షో’తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్తో బిగ్బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌజ్లో తనదైన తీరు, మాటలతో ఆకట్టుకున్న ఆమె అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్బాస్ హౌజ్ని వీడింది. ఇక బయటకు వచ్చాక గంగవ్వ పలు చిత్రాల్లో నటించే ఆఫర్ అందుకుంది. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో సైతం నటించింది. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే! వెండితెరపై అలరిస్తూనే మరోవైపు తన యూట్యూబ్ చానల్లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది గంగవ్వ. యూట్యూబ్తో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న గంగవ్వ సంపాదన ఎంతనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆరా తీయగా యూట్యూబ్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒక రోజు సినిమా షూటింగ్కు గంగవ్వ రూ. 10వేల వరకు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి. ఏదేమైన ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఇలా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటేవ్వా -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి వంటి అగ్ర నటులతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 30న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని భారీ అంచల మధ్య నేడు విడుదలైన మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల పారితోషికం హాట్టాపిక్గా మారింది. ఇందులో దాదాపు అందరు అగ్ర నటీనటులే ఉన్నారు. దీంతో ఎవరి పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలు తమిళ వెబ్సైట్లు పొన్నియన్ సెల్వన్ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. వాటి ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నాడట. చదవండి: వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్ అలాగే ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు అందుకుందని సమాచారం. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. -
బిగ్బాస్ 16కు రూ. 1000 కోట్ల పారితోషికం! సల్మాన్ ఖాన్ క్లారిటీ
ప్రముఖ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ, టీవీ సెలబ్రెటీలను మూడు నెలల పాటు ఒకే గూటిలో లాక్ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది. తెలుగులో ప్రస్తుతం 6వ సీజన్ను జరుపుకుంటున్న ఈ షో, హిందీలో 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్కు రెడీ అవుతోంది. అయితే ఈ షోకు హోస్ట్ వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ సీజన్కు గానూ రూ. 1000 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఒంటిపై చేయి వేశాడని అభిమాని చెంపచెళ్లుమనిపించిన హీరోయిన్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సల్మాన్కు రూ. 1000 కోట్ల రెమ్యురేషన్పై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి అతడు స్పందిస్తూ.. ‘ఈ వార్తల్లో నిజం లేదు. నేనే అంత రెమ్యునరేషన్ తీసుకుంటే ఇక జీవితంలో నేను పని చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇది ఎప్పటికైన నిజం కావాలని కోరుకుంటున్నా. అయినా నేను వెయ్యి కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే అది నా లాయర్ల ఫీజులు వంటి ఇతర అవసరాలకే సరిపోతుందేమో. ఎందుకంటే నా లాయర్లు నాకంటే తక్కువేం కాదు(నవ్వుతూ). నా సంపాదన ఇందులో పావు వంతు కూడా ఉండదు. ఈ వార్తలను ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వాళ్లు కూడా చదువుతున్నారు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార ఆ తర్వాత బిగ్బాస్ షోను హోస్ట్ చేయాలని లేదని, కానీ తప్పడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ షోలో నాకు చిరాకు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను షోను హోస్ట్ చేయనని బిగ్బాస్ నిర్వహకులు చెప్పాను. కానీ వాళ్లకు మరో చాయిస్ లేదు కాబట్టి నా వద్దకు తిరిగి వచ్చారు. వాళ్లకు చాయిస్ ఉండి ఉంటే నన్ను వారు ఎప్పుడో తీసేసి ఉండేవారు. నా స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు ఉన్నప్పటికీ, చానల్ వాళ్లు ఎప్పటికీ ఆ పని చేయరు’ అని నవ్వుతూ అన్నాడు. ఇక ఈ షోలో తాను తరచూ సహనం కోల్పోవడంపై స్పందిస్తూ.. . పోటీదారులు అతి చేయడం వల్ల తాను కొన్నిసార్లు పరిమితిని దాటవలసి వస్తుందన్నాడు. -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్పై వస్తున్న వార్తలపై రణ్బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
హాట్టాపిక్గా బిగ్బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్!, ఎవరెవరికి ఎంతంటే..
బుల్లితెరపై బిగ్బాస్ సందడి మొదలైంది. ఆడయన్స్కి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈసారి 21 మందిని రంగంలోకి దింపాడు బిగ్బాస్. ఆదివారం(సెప్టెంబర్ 4న) అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్బాస్ 6వ సీజన్. మూడు నెలల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు నటి కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డిలు వరుసగా హౌజ్లో అడుగు పెట్టారు. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ వీరిలో టీవీ, సినీ నటీనటులు, యాంకర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కామనర్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తొలి రోజు పరిచయాలు, ఓదార్పులతో మొదలవుతుందనుకున్న ఈ షోలో అప్పడే గొడవలు, ఇగోలు మొదలయ్యాయి. చూస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య అండర్స్టాండింగ్ కంటే మనస్పర్థలే ఎక్కువ వచ్చేలా ఉన్నాయంటున్నారు తొలి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు. ఇక ఏదేమైన హౌజ్ అంతా ఫుల్ సందడి చేస్తున్నా ఈ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో 21 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి రెమ్యునరేషన్ బయటకు వచ్చిది. ఈ తాజా బజ్ ప్రకారం.. నటి కీర్తి భట్ రూ. 35 వేలు తీసుకుంటుందట. చైల్డ్ ఆర్టిస్ట్గా ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీతో ఫేం సంపాదించుకున్న పంకీ అలియాస్ సుదీపా రూ. 20 వేలు అందుకుంటుందట. మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ సిరీ బాయ్ఫ్రెండ్గా గుర్తింపు పొందిన నటుడు శ్రీహాన్, కమెడియన్ చలాకి చంటిలు రూ. 50 వేలు చొప్పున తీసుకుంటున్నారని వినికిడి. యాంకర్ నేహా చౌదరి రూ. 20వేలు, లేడీ కమెడియన్ ఫైమా సీరియల్ యాక్ట్రస్ వాసంతిలకు రూ. 25 వేలు చొప్పున ఇస్తున్నారట. క్యాటరిగ్ బాయ్ నుంచి మోడల్గా ఎదిగిన రాజశేఖర్ రూ. 20 వేలు చొప్పున అందుకుంటున్నారట. ఇక మెడియన్ చలాకి చంటి రూ. 50 వేలు ఇస్తున్నారట బిగ్బాస్. టీవీ నటులు, రియల్ కపుల్ మరినా అబ్రహం రూ. 35వేలు, ఆమె భర్త రోహిత్ రూ. 45వేలు అందుకున్నారట. ఇక యాంకర్ ఇనయా సుల్తాన, యాంకర్ అరోహి రావ్ అలియాస్ అంజలిలు రూ. 15వేలు చొప్పున తీసుకుంటున్నారని తెలుస్తోంది. చదవండి: లలిత్ మోదీతో సుస్మితా బ్రేకప్? అసలేం జరిగింది! అలాగే సినీ, టీవీ నటుడిగా, బాల నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య రూ. 45 వేలు తీసుకుంటున్నాడని సమాచారం. నితిన్ ‘సై’ మూవీలో తన కామెడి, ఆటతో అలరించిన షానీ సాల్మోన్కు రూ. 30వేలు కాగా, ఆర్జే సూర్య రూ. 40 అందుకుంటున్నాడని సమాచారం. టిక్టాక్ స్టార్ నుంచిమోడల్, టీవీ నటిగా మారిన శ్రీసత్యకు రూ. 30వేలు కాగా, ఆర్యలో ఆ అంటే అమలాపురం అంటూ కుర్రకారును అలరించిన అభినయకు రూ. 20 వేలు ఇస్తున్నారట. చిత్తూరు చిరుత అలియాస్ గీతూ రాయల్కు రూ. 25 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ర్ ఆదిరెడ్డికి రూ. 30వేల కాగా.. ఇండియన్ ఐడల్ విజేత, సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువ రూ. 60 వేలు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇది రోజుకా, వారం రోజులకా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. -
‘లైగర్’ ఫ్లాప్తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్సాఫీస్ లెక్కలన్ని తలకిందులయ్యాయి. విడుదలకు ముందు ఈ మూవీ రూ. 200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్కి బాక్సాఫీసు ఫలితాలు షాకిచ్చాయి. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్బాస్ బ్యూటీ! దీంతో రౌడీ హీరో ఆశలన్ని అడియాసలయ్యాయి. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో లైగర్ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున్న నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లైగర్ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాకి విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీనితో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్లో విజయ్కి కూడా వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ. 6 కోట్లను విజయ్ వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసి విజయ్ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్ అభిమానులు కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా విజయ్ తన తదుపరి చిత్రం జన గణ మన కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. ఈ మూవీకి కూడా పూరీ దర్శకత్వం వహిస్తుండగా.. చార్మీతో కలిసి నిర్మించనున్నాడు. -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. రిలీజ్కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. అయితే ఈ లైగర్ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్తో పాటు లైగర్లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు దీంతో మృణాల్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మృణాల్ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
అప్పట్లోనే బిగ్బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్గా కవర్ ఫొటో
మెగాస్టార్ చిరంజీవి నిన్నటితో (ఆగస్ట్ 22న) 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. ఇక అభిమానులు, సెలబ్రెటిల నుంచి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఆయన బర్త్డే సందర్భంగా చిరుకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగిన చిరు తన కాలంలో తెలుగు సినీ పరిశ్రమను ఓ స్థాయిలో నిలబెట్టారు. అప్పట్లోనే ఓ భారతీయ సినిమా హాలీవుడ్ వెండితెరపై ప్రదర్శితమవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి ఘనత ఒక్క చిరంజీవికే దక్కింది. ఆయన నటించిన కొదమసింహాం హాలీవుడ్లో ‘హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్’ పేరుతో డబ్ అయ్యింది. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు అంతగా తెలుగు పరిశ్రమకు గుర్తింపు తెచ్చిపెట్టిన ఆయన మొదట ఓ సాధారణ నటుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత 1980 వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని తిరుగులేని స్టార్డడమ్ సంపాదించుకున్నారు. అలా 1990లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఆయన ముందువరుసలో ఉన్నారు. అంతేకాదు ఒకానోక సమయంలో భారత చలనచిత్ర పరిశ్రమలోని నటుల కంటే కూడా ఆయనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నారు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ కంటే కూడా చిరునే అధిక పారితోషికం అందుకున్నారు. అప్పట్లో ఇది దేశమంతట చర్చనీయాంశమైంది. ఓ నేషనల్ మ్యాగజైన్ అయితే దీన్ని కథనంగా ప్రచురితం చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాగజైన్ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. 1992లోనే చిరు ఓ సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఇదే విషయాన్ని 1992 సెప్టెంబర్ 13న ది వీక్ మ్యాగజైన్ తన సంచికలో చిరు ఒక సినిమాకు రూ. 1.25 కోట్లు భారీ పారితోషికం తీసుకున్నారని వెలువరించింది. దీని మెయిన్ పేజీలో బచ్చన్ కంటే పెద్ద స్టార్ అంటూ పెద్ద అక్షరాలతో ట్యాగ్ లైన్ ఇచ్చింది. కాగా 1990లో చిరు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సెన్సెషన్ సృష్టించాడు. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, అపద్భాంధవుడు, ముఠామేస్త్రీ వంటి చిత్రాలు చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. అప్పట్లో తెలుగు సినిమా అన్న, తెలుగు హీరోలన్న ఉత్తారాదిలో కాస్తా చిన్న చూపు ఉండేదనే విషయం తెలిసిందే. అదే సమయంలో చిరు ఈ ఘనత సాధించడమంటే నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం ఇది. CHIRANJEEVI born on this day pic.twitter.com/TQUcIbgfk1 — Film History Pics (@FilmHistoryPic) August 22, 2022 -
తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ప్రస్తుతం పరిశ్రమలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. 2012 ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రముఖ దర్శక-నిర్మాత మహేష్ భట్ తనయగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నటిగా తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన ప్రియుడు, స్టార్ హీరో రణ్బీర్ కపూర్ను పెళ్లాడిన ఆలియా త్వరలోనే తల్లి కాబోతోంది. చదవండి: కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు ఇక రణ్బీర్-ఆలియా తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్రం మూవీ సెప్టెంబర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమె తన తొలి మూవీ రెమ్మునరేషన్ ఎంతో బయటపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లో వచ్చిన ఆలియా తన తొలి చిత్రానికి తీసుకున్న పారితోషికం చాలా తక్కువని చెప్పింది. ఫస్ట్ మూవీకి గానూ రూ. 15 లక్షల పారితోషికం అందుకున్నానని, ఆ చెక్ను నేరుగా తన తల్లి సోని రజ్దాన్ ఇచ్చినట్లు చెప్పింది. అప్పుడు ఇది చాలా తక్కువ అని, తన తొలి సంపాదనతో కారు కొన్నట్లు పేర్కొంది. చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు అయితే ఇప్పటికీ తన ఆర్థిక లావాదేవీలన్ని తన తల్లే చూసుకుంటుందని ఆలియా తెలిపింది. ‘నా బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందనేది నేనెప్పుడు చూసుకోలేదు. నా ఖాతాలో డబ్బు బాగానే ఉందని తెలుసు. నేనే నా ఆర్థిక స్థితిని చేసుకోవాలని నా టీం ఎప్పుడూ సూచిస్తుంది. ఇక కొద్దిరోజుల్లోనే మాకు బిడ్డ రాబోతున్నాడు. ఇప్పుడైన నా ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. 19 సంవత్సరాలకే సినీరంగ ప్రవేశం చేసిన నేను, నా ఫస్ట్ రెమ్యునరేషన్తో ఓ కారును తీసుకున్నానను. 22 సంవత్సరాల వయసులోనే ఓ ఇంటిని కొనుగోలు చేశాను’ అని చెప్పుకొచ్చింది. -
హాట్టాపిక్గా ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే అన్ని కోట్లా!
సినీ సెలబ్రెటీల రెమ్యునరేషన్పై తరచూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ హీరోహీరోయిన్ పారితోషికం ఇంత అంత పెంచారంటూ నెట్టింట చర్చించుకుంటారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. ఇండియన్ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుశ్ ఒకరనే విషయం తెలిసిందే. చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు ‘ది గ్రే మ్యాన్’ మూవీతో ఇటివలె హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ భారీగా పారితోషికం పెంచాడనే వార్తలు గుప్పుమన్నాయి. దంతో ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రాల పారితోషికంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ధనుష్ నటించిన తిరుచిత్రాంబళం(తెలుగులో తిరు) మూవీకి ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్పై చర్చనీయాంశమైంది. రేపు ఆగస్ట్ 18న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ధనుష్ రూ. 15 నుంచి రూ. 17 కోట్లు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ సరసన రాశీ ఖన్నా, ప్రియ భవానీ శంకర్ నటించగా.. నిత్యా మీనన్ కీలక పాత్ర పోషించింది. కాగా గత కోంతకాలంగా ధనుశ్కు పెద్దగా హిట్స్ లేవనే విషయం తెలిసిందే. కర్ణన్తో మంచి విజయం అందుకున్న ధనుష్ ఆ తర్వాత నటించిన జగమేతందిరం, పటాస్, ది గ్రే మ్యాన్ వరుసగా పరాజయం పొందాయి. దీంతో ధనుష్ ఆశలన్ని తిరుచిత్రాంబళంపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సార్ మూవీతో ధనుష్ నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ను జరుపుకుంటోంది. -
ఆ సినిమాకు నాగ చైతన్య అన్ని కోట్లు తీసుకున్నాడా?
Naga Chaitanya Charged Rs 5 Crores For Laal Singh Chaddha: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చై సినీ కెరీల్లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చైతూ, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ చైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో బాలా పాత్రకు చైతూ సుమారు 5 కోట్లు అందుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రం, అందులో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి ఎంతో లాభదాయకంగా ఉంటుదన్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని, దీంతో అతని మార్కెట్ పెరగనున్నట్లు వివరించాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అలాగే 'డీజే టిల్లుట సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. -
షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ
టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్ వ్యయం, హీరోల రెమ్యునరేషన్ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. చదవండి: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే! దీంతో షూటింగ్ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్ గిల్డ్ తెలిపింది. షూటింగ్ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది. ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. చదవండి: ఫ్యాన్స్కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్బాస్’ జోడీ -
బిగ్బాస్ క్రేజ్.. రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో?
ప్రముఖ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ, టీవీ సెలబ్రెటీలను మూడు నెలల పాటు ఒకే గూటిలో లాక్ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది ఈ షో. ఇక వారి మధ్య జరిగే గొడవలు, మనస్పర్థలు, మాటల యుద్దం, ప్రేమ వంటి ఆసక్తికర సంఘటనలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగులో బిగ్బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో హిందీలో ఏకంగా 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్కు రెడీ అవుతోంది. చదవండి: వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్ ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్బాస్ 16వ సీజన్కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా హిందీ బిగ్బాస్కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన స్టైల్, మ్యానరీజం, వాక్చతర్యంతో సల్మాన్ బిగ్బాస్ షోను సక్సెస్ ఫుల్గా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వహకులు సైతం నో చెప్పడం లేదు. గత సీజన్ ఒక్కో ఎపిసోడ్కు రూ. 15 కోట్ల చొప్పున అందుకున్న భాయిజాన్ 16వ సీజన్కు షాకింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఇక ఆయన ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న షో నిర్వహకులు సల్మాన్ డిమాండ్ విన్నాక ఒక్కసారిగా అవాక్కయ్యారట. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి ఇంతకి ఆయన అడిగిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీకు కూడా కళ్లు చెదరడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 16వ సీజన్ మొత్తానికి ప్యాకేజీ కింద సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేశాడట. ఇక ఆయన ఫ్యాన్సీ రెమ్యునరేషన్ చూసి అంతా కంగుతిన్నారట. ఇక సల్మాన్కు ఉన్న క్రేజ్ బట్టి ఆయన అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే బిగ్బాస్ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా బిగ్బాస్ 16న సీజన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. -
సుక్కు-చిరు కమర్షియల్ యాడ్, మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Chiranjeevi Remuneration For Latest Commercial Ad: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు. ఇప్పటికే ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ సిమాలను సెట్స్పైకి తీసుకువచ్చాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకి మరో పక్క కమర్షియల్ యాడ్స్లో సైతం నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా ఓ కమర్షియల్ యాడ్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ఈ యాడ్కు చిరు తీసుకున్న పారితోషికం హాట్టాపిక్గా మారింది. చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ఈ యాడ్లో చిరుతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్, ఖుష్బు సుందర్లు నటించారు. ఇందులో నటించిన వారంత పెద్ద స్టార్స్ కావడంతో ఈ యాడ్కు వారు తీసుకున్న రెమ్యునరేషన్పై ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితొషికం గురించి ఆరా తీయగా చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్గా, అటూ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్డమ్ బట్టి రెమ్మునరేషన్ ఇచ్చారట. -
అలా చేస్తే ‘గాడ్ ఫాదర్’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్ కండిషన్!
On That Condition Salman Doing Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నారు. ఆచార్య షూటింగ్ను పూర్తి చేసుకున్న ఆయన ఇటీవల గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించున్నాడు. ఇక సల్మాన్తో షూటింగ్ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి, గాడ్ ఫాదర్ టీం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి-సల్మాన్లపై యాక్షన్ సీన్సోతో పాటు పాటన చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం సల్మాన్, చిరుకు ఓ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Mohan Babu: ఎన్నో రకాలుగా మోసపోయాను, వారెవరు నాకు ఉపయోగపడలేదు.. ఈ మూవీలో సల్మాన్ పాత్రపై చర్చలు జరుగుతున్న సమయంలో చిరు-భాయిజాన్ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే గాడ్ ఫాదర్ కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారని సల్మాన్ను దర్శక-నిర్మాతలు అడగ్గా.. ఒక్క పైసా వద్దని చెప్పాడట. ఇదే విషయాన్ని మేకర్స్ చిరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా దీంతో సల్మాన్ను అడిగారట. దీనికి అతడు అసలు తనకు ఎలాంటి పారితోషకం వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడట. అయినా తీసుకోవాలని చిరు పట్టుబట్టడంతో.. ఈ విషయంలో తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడట. అలా సల్మాన్ ఖాన్ ఒక్కపైసా తీసుకోకుండానే గాడ్ ఫాదర్కు వర్క్ చేస్తున్నాడట. చదవండి: ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం అంతేగాక ఈ షూటింగ్ షెడ్యూల్ అయిపోయే వరకు సల్మాన్ ముంబైలోని తన ఫాం హౌజ్లో చిరు, గాడ్ ఫాదర్ టీం అతిథ్యం ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. కాగా సల్మాన్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారనే విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన వారి కోసం సల్మాన్ ఏమైనా చెస్తాడు. అంతేకాదు సాయం చేయడంలో కూడా ఆయన ముందుంటాడు. ఇక బీ-టౌన్లో సల్మాన్, షారుక్ ఖాన్ మధ్య మంచి సన్నిహితం ఉంది. అందుకే షారుక్ పఠాన్ సినిమాలో కూడా కామియో రోల్ చేసిన సల్మాన్ నయా పైసా తీసుకోలేదట. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు భాయిజాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
బిగ్బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ నాన్స్టాప్ నుంచి తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ అయిన ముమైత్కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్బాస్ హౌజ్ను వీడాల్సి వచ్చింది. అయితే ఆమె ముందునుంచి భయపడ్డట్టే జరిగింది. హౌజ్లో అడుగుపెట్టిన మరు క్షణం నుంచి ముమైత్ తీరు గమనిస్తే ఆమె ఆట మీద కంటే.. నామినేషన్స్ ఎలిమినేషన్ మీదే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ప్రతి ఒక్కరి దగ్గర సింపతి గేన్ చేసే పనిమీదే ధ్యాస ఉంచినట్లు కనిపించింది. ఇలా బయటికి వచ్చిన ముమైత్.. తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదంటూ స్టేజ్పైనే ఎమోషనల్ అయ్యింది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇదిలా ఉంటే బిగ్బాస్లో ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్టాపిక్ మారింది. దీంతో బిగ్బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్బాస్ నిర్వాహకులు పారితోషికం ఎంత ఇచ్చారా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్క వారానికి రూ. 80 వేలు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దిన్ని బట్టి చూస్తే ఆమె రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉండవచ్చని సమాచారం. ఇక షో నుంచి బయటకు వచ్చేముందు హౌజ్లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు(వేస్ట్) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని హోస్ట్ నాగార్జున అడగ్గా.. అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ -
అమితాబ్ పెద్ద మనసు, రెమ్యునరేషన్ తగ్గింపు..
Amitabh Bachchan And Team Remunaration: బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం ‘జుండ్’. ఇందులో బిగ్బి ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతల పట్ల అమితాబ్ పెద్ద మనసు చాటుకోవడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ క్రమంలో నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు అమితాబ్ దృష్టికి వెళ్లిందట. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే దీంతో ఆయన ఈ మూవీకి పారితోషికాన్ని తగ్గించమని మేకర్స్తో చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్యయంగా నిర్మాత సందీప్ సింగ్ ఓ ఇంటర్య్వూలో చెప్పడం విశేషం. ‘‘నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై వెచ్చించండి’’ అని అమితాబ్ తనతో అన్నట్లు సందీప్ సింగ్ తెలిపాడు. ఇది తెలిసి అమితాబ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్బి తన పారితోషికాన్ని తగ్గించడంతో మిగతా క్రూడ్, సిబ్బంది కూడా తమకు తమకు తక్కువ మొత్తం చెల్లిస్తే చాలని చెప్పడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారట. చదవండి: హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు -
భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ప్రియమణి, ఒక్క రోజుకే ఎంతంటే..!
నటి ప్రియమని తాజా నటించిన చిత్రం భామకలాపం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. గతేడాది ఆమె నటించిన నారప్ప మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇలా వరస హిట్లు అందుకున్న ప్రియమణి తాజా వెబ్ సిరీస్ సక్సెస్తో ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. ఈ వెబ్ సిరీస్కు గాను ప్రియమణి రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం ప్రియమణి.. రానా తాజా చిత్రం విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. -
రష్మిక ఇక 'తగ్గేదే లే'.. రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీవల్లి !
Rashmika Mandanna Increased Remuneration After Pushpa: తెలుగులో 'ఛలో' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాతి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక ప్రతి ఈవెంట్లో తన అల్లరి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారు గుండెల్లో నేషనల్ క్రష్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందులో శ్రీవల్లిగా రష్మిక ఫ్యాన్స్తోపాటు ఆడియెన్స్ను ఆకట్టుకుంది. అయితే వరుస విజయాలతో జోరు మీద ఉన్న అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప 5 భాషల్లో రిలీజ్ కావడంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. అంతేకాకుండా హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్నిపెంచేసిందన్న వార్త ఫిల్మ్ దునియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రూ. 1.75 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్న రెమ్యునరేషన్ను రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్. రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వానంద్కు జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు', పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట -
‘శ్యామ్ సింగరాయ్’ రెమ్యునరేషన్ను నాని తిరిగి ఇచ్చేశాడా?
నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నాని గతంలో నటించిన వీ, టక్ జగదీశ్లు కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నిరాశలో ఉన్న నాని శ్యామ్ సింగరాయ్ని థియేటర్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూశాడు. చదవండి: హీరోయిన్తో ప్రేమలో మునిగితేలుతున్న యంగ్ క్రికెటర్!, ఇదిగో ఫ్రూఫ్ అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లోనే విడుదలయ్యేలా కృషి చేశాడు. నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మాత అయినప్పటికి నానినే వెనకుండి అంతా నడిపించినట్టు ప్రచారం జరిగింది. అంతేగాక శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం స్పెషల్ కేర్ తీసుకున్నాడట. నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేశాడని టాక్. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా వసూళు చేసినట్లు సమాచారం. ఇదంతా బాగానే ఉన్న ఏపీలో మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది. అక్కడ టికెట్ రేట్స్తో పాటు ఇంకా చాలా సమస్యలు నాని సినిమాపై ప్రభావం చూపాయి. చదవండి: న్యూ ఇయర్ను భావోద్వేగంతో స్వాగతించిన సామ్, ఇలా సాగాలంటూ పోస్ట్ దానికి తోడు మూవీ విడుదలకు ముందు నాని చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో నాని కామెంట్స్, ఏపీ టికెట్స్ రేట్స్ తక్కువగా ఉండటం శ్యామ్ సింగరాయ్ మూవీని కలెక్షన్స్ పరంగా దెబ్బతీశాయి. అందుకే ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్లో 60 శాతం పారితోషికాన్ని నాని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్కి నాని 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా అందులో రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు నాని కానీ, మూవీ టీం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Rashmi Gautam Remuneration Goes Hot Topic In Chiranjeevi Bhola Shankar Movie Special Song: బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తొలుత వెండితెరపై సహానటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ ప్రముఖ కామెడీ షోతో తనకంటూ నేమ్, ఫేమ్ని సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్ సాంగ్ చేయడమంటే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్ ఆఫర్ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి -
ఆర్ఆర్ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Alia Bhatt Remuneration in RRR Movie For 15 Min Goes Viral: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుథిరం). యంగ్ టైగర ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ వదులుతూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలై ఫస్ట్లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆర్ఆర్ఆర్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. చదవండి: సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్కు బ్రేక్.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీలో అలియా భట్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు అలియా మొత్తం 10 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె నిడివి దాదాపు 15 నిమిషాలు ఉంటుందట. దీనికే ఆమె సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలంటే ఆలియా భట్ ఉండాల్సిందేనని జక్కన్న కోరడంతో నిర్మాతలు ఒకే అన్నారంట. ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. దీంతో ఆమె రెమ్యునరేషన్ ఎంతో తెలిసి నెటిజన్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? అలియాకు అంత పారితోషికం ఇవ్వడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరూ అలియా భట్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలంటూ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో అలియా ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల తీసుకుంటుదట. రెండు మూడు నెలల కాల్షిట్స్కు 10 కోట్లు తీసుకునే ఆమె కేవలం 10 రోజులకు 5 కోట్లు వసూలు చేయడం సరికాదంటున్నారు. హిందీ సినిమా కంటే ఆర్ఆర్ఆర్ మూవీకే ఆమె ఎక్కువ పారితోషికం అందుకుందంటున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. -
నాన్న పెద్ద నటుడు.. నా తొలి సంపాదన రూ. 35 మాత్రమే: స్టార్ దర్శకుడు
Rohit Shetty Real Life Story In Telugu: Unknown Facts About Him: రోహిత్ శెట్టి.. బాలీవుడ్ కమర్షియల్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచారు. తాజాగా థియేటర్లలో విడుదలైన రోహిత్ శెట్టి సినిమా.. సూర్యవంశీ... వసూళ్లలో దూసుకుపోతుంది. లాక్డౌన్ అనంతరం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సూపర్హిట్గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్హిట్ చిత్రాల దర్శకుడిగా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోహిత్శెట్టి తొలి సంపాదన ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. బాలీవుడ్లో పని చేస్తున్న తొలి రోజుల్లో అతడి సంపాదన కేవలం 35 రూపాయలు మాత్రమేనట. సామాన్యులకయితే అనుకోవచ్చు.. కానీ అప్పటికే రోహిత్ శెట్టి తండ్రి పెద్ద నటుడు, స్టంట్మ్యాన్, కొరియోగ్రాఫర్ కూడా. అలాంటి రోహిత్శెట్టి కేవలం 35 రూపాయల వేతనం పొందడం ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి తన బాలీవుడ్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!) రోహిత్ శెట్టి తండ్రి ఎంబీ శెట్టి ప్రముఖ నటుడు, కొరియాగ్రాఫర్, స్టంట్మ్యాన్ కూడా. అప్పటికే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక తన 16వ ఏట నుంచి పని చేయడం ప్రారంభించానన్నాడు రోహిత్శెట్టి. కర్లీ టేల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ 16 ఏట నుంచే పని చేయడం ప్రారంభించాను. చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసేవాడిని. అప్పటికే మా నాన్న గారు బాలీవుడ్లో ప్రముఖ నటుడు. అయినప్పటికి కూడా నా ప్రయాణం అంత సజావుగా సాగలేదు’’ అని తెలిపాడు. ‘‘బాలీవుడ్లో నా తొలి సంపాదన 35 రూపాయలు. ప్రతిరోజు రెండు గంటలపాటు నడిచి.. సినిమా సెట్కు చేరుకునేవాడిని. ఒక్కోసారి చేతిలో చాలా తక్కువ మొత్తం ఉండేది. ఆ డబ్బు ఖర్చు పెట్టి.. భోజనం చేస్తే.. ఇంటికి వెళ్లడానికి చార్జీలకు డబ్బులుండేవి కాదు. చార్జీలకు దాచుకుంటే.. తినడానికి ఉండేది కాదు. ఇక ముంబైలో ఉన్న రోడ్లన్ని నాకు కొట్టిన పిండి. షార్ట్కట్స్ అని నాకు తెలుసు. ప్రస్తుతం కారులో వెళ్తున్నప్పుడు షార్ట్కట్ గురించి చెప్తే నా డ్రైవర్ నావైపు ఈయన గతంలో దొంగతనాలు చేసేవాడా ఏంటి అన్నట్లు అనుమానంగా చూస్తాడు’’ అని తెలిపాడు. మా నాన్నగారి స్టార్డం నాకు ఏవిధంగాను ఉపయోగపడలేదు. నా సొంతంగా ఎదిగి.. ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు. (చదవండి: 100 కోట్ల మార్క్ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..?) ప్రస్తుతం రోహిత్ శెట్టి రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రోహిత్ శెట్టి సర్కస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే రోహిత్ శెట్టి తనకు మాత్రమే ప్రత్యేకమైన పోలీసు చిత్రంలో మహిళ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఫీమేల్ పోలీస్ ఆఫిసర్ లీడ్లో రోహిత్ శెట్టి చిత్రం.. -
బాలయ్య సినిమా కోసం శ్రుతీహాసన్కి భారీ రెమ్యునరేషన్.. ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం శ్రుతీహాసన్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ కోసం శ్రుతీ.. రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రుతీహాసన్ డిమాండ్కు ఓకే చెప్పారట. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య.. మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. -
హాట్ టాపిక్గా శివకార్తికేయన్ రెమ్యునరేషన్, తక్కువ టైంలో అంత మొత్తమా!
Young Hero Sivakarthikeyan Remuneration Goes Viral: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తూ అటూ కోలీవుడ్, ఇటూ టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో శివకార్తికేయన్ సినిమాలకు మార్కెట్ కూడా పెరిగిపోయింది. చదవండి: నాగ్ సినిమా మేకర్స్కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్! ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో అతడి రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కార్తికేయన్ తన ఒక్కో సినిమాకు రూ. 27 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నాడని టాక్. తక్కువ టైంలోనే అంత భారీ మొత్తంలో పారితోషికం అందుకోవడం చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఆయన డిమాండ్కు ఒకే చెబుతున్నారట. కాగా ప్రస్తుతం శివ కార్తీకేయన్ అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్పైనే ఏడ్చిన హీరో శింబు వీటిలో అయలాన్ షూటింగ్ పూర్తి కాగా.. డాన్ చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు శివకార్తికేయన్. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయలాన్ షూటింగ్ పూర్తవగా..డాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్పై మెరిసిన శివకార్తికేయన్.. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. -
రెమ్యునరేషన్ భారీగా పెంచిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతంటే..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడు పెంచింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సమంత అక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లోనూ నటించేందుకు సామ్ మొగ్గు చూపుతోందని టాక్. అయితే ఇప్పుడు సమంత రెమ్యునరేషన్ విషయంతో మరో సారి వారల్లో నిలిచింది. విడాకుల తర్వాత సమంత తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి తాను చేయబోయే సినిమాలకు రూ.3 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. మాములుగా అయితే సమంత ఒక్కో సినిమాకు రూ.3కోట్ల కంటే తక్కువే తీసుకునేదట. కానీ ప్రస్తుతం మాత్రం జీఎస్టీ కాకుండా రూ.3 కోట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టిదట. జోరు మీద ఉన్న పూజా హెగ్డే, రష్మిక కూడా రూ. 2.5 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్నారు. సమంత మాత్రం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేయడం నిర్మాతలకు కాస్త భారమైనప్పటికీ.. ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా అంతమొత్తం పారితోషికంగా ఇవ్వడానికి వెనుకాడడంలేదట. ఇన్నాళ్లు బాలీవుడ్ భామలే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు..ఇప్పుడు దక్షిణాది బ్యూటీలు కూడా రెమ్యునరేషన్ విషయంలో పోటీ పడటం గమనార్హం. -
ఆహా ‘అన్స్టాపబుల్’ టాక్ షో: బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
తొలి తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రంగంలో టాక్ షోలను తీసుకొచ్చిన సంస్థగా ఆహా ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే సమంతతో సామ్ జామ్ అనే షోను నిర్వహించిన ఆహా.. ఈసారి ఏకంగా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్. బాలకృష్ణ హోస్ట్గా అన్స్టాపబుల్ టాక్ షోను త్వరలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్తో అదరగొట్టే బాలయ్య బుల్లితెరపై తొలిసారిగా యాంకర్గా వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారు, తొలి గెస్ట్ ఎవరా అని ప్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చదవండి: Unstoppable With NBK: మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా.. ఈ టాక్ షోకు బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది. ‘అన్స్టాపబుల్’ పేరుతో వస్తోన్న ఈ టాక్ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట. బాలయ్య రేంజ్, క్రేజ్ దృష్ట్యా అల్లు అరవింద్ అండ్ ఆహా టీం ఆయనకు భారీగానే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కో ఎపిసోడ్కు బాలయ్య ఏకంగా 40 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. దీంతో 12 ఎపిసోడ్లకు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! ఇటీవల ఈ షో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ను బండోడు అనే వారని గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ గొప్ప మనిషి.. కేవలం సినిమాలోనే నటిస్తాడు.. బయట నటించడం రాదు. కోపం వచ్చినా సంతోషం వచ్చినా నటించకుండా రియల్ ఎమోషన్స్ చూపించే మనిషి. అలాంటి వ్యక్తి హోస్ట్గా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
బిగ్బాస్ 5: స్పెషల్ ఎపిసోడ్లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యునరేషన్!
ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైబర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో ఆది బుల్లితెరపై నవ్విస్తుంటాడు. బయట జరిగిన కొన్ని సంఘటనలను, కాన్టెంపరరీ ఇష్యూస్ తీసుకుని అదిరిపోయే కామెడీ చేయడంలో హైపర్ ఆది సిద్ధహస్తుడు. అలా అతడు స్టేజ్పై ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్బాస్ 5కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: బిగ్బాస్ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్పాట్ నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్బాస్ స్పెషల్ ఎపిసోడ్ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు ఈషోకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్ అఖిల్, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్ పర్ఫామెన్స్తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్ ఇచ్చేందుకు బిగ్బాస్ నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు. పోలీసు ఆఫీసర్గా బిగ్బాస్ స్టేజ్పైకి వచ్చిన ఆది అందరిని ఓ రెంజ్లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్గా వచ్చి బిగ్బాస్ హౌజ్మెట్స్పై ఇన్వెస్టిగేషన్ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు. చదవండి: బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ హౌజ్లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్మేట్స్పై పంచ్లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్బాస్ ప్రేక్షకులంతా కూడా ఫుల్గా నవ్వేసుకున్నారు. అంతలా వినోదం పంచిన ఆది భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్బాస్ 4 సీజన్కు సమంత హోస్ట్గా రాగా అదే ఎపిసోడ్కు ఆది గెస్ట్గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. -
RC 15: శంకర్ మూవీ కోసం చెర్రీ భారీ రెమ్యునరేషన్, ఎంతంటే..?
సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ మూవీ టేకింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా ఏదైనా భారీతనం ఉట్టిపడాల్సిందే. తాజాగా రామ్ చరణ్ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించబోతున్నాడట. దిల్ రాజు బ్యానర్లో రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమం సెప్టెంబర్లో అట్టహాసంగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని ఈ వార్త సారాంశం. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్ చరణ్ రూ. 80 కోట్ల వరకు పారితోషకంగా అందుకోబోతున్నాడట. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో చెర్రీకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. శ్రీకాంత్, సునీల్ అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్పై పోసాని సంచలన వ్యాఖ్యలు
Posani Krishna Murali comments On Pawan Kalyan Remuneration: జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్పై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్పై పోసాని స్పందించారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ రెమ్యునరేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని ఆయన ఆరోపించారు. చదవండి: సీఎం వైఎస్ జగన్తో పవన్కు పోలికే లేదు : పోసాని ఈ మేరకు ఆయన ‘పవన్ నీ రెమ్యునరేషన్ 10 కోట్లా.. 50 కోట్లా అని ప్రశ్నించారు. పవన్ సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. అదే నేను ఒక్క సినిమా రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా? ఆయన చేసే సినిమాలోని హీరోయిన్ను, లోకేషన్, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడు. తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. చదవండి: మహేశ్ కామెంట్స్పై స్పందించిన సాయి పల్లవి అలాగే పవన్ కల్యాణ్ సినిమా అంటే టిక్కెట్కు రూ. 500, 1000 వసూళ్లు చేయడమంటే ఏంటని, అది మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అన్నారు. హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు తెరమీదే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోలని పేర్కొన్నారు. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్ నేర్చుకోవాలన్నారు. ఆనాడు చిరంజీవి ఇంట్లోని అడపడిచులను అసాసినెట్ చేస్తే పవన్ ఎక్కడ ప్రస్నించారన్నారు. దానిపై తాను ప్రశ్నించానని, అందుకే అప్పుడు వాళ్లు తనని చంపుతామని బెదిరించినట్లు పోసాని తెలిపారు. -
హీరో ధనుష్ రెమ్యునరేషన్ ఎంత? ఎన్నికోట్ల ఆస్తి ఉంది?
సినిమాల్లో హీరోగా రాణించాలంటే కలర్, పర్సనాలిటీ మాత్రమే కాదని, కష్టం, క్రమశిక్షణ ఉంటే కూడా రాణించొచ్చని నిరూపించాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. చూడగానే ఆకట్టుకునే రంగు అతనికి లేదు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయినప్పటికీ తనదైన నటనతో కోట్లాది ప్రేక్షకులను సంపాదించి, స్టార్ హీరోగా ఎదిగాడు. వాస్తవానికి ధనుష్కి నటనపై ఇష్టమే లేదట. తన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా కోరిక మేరకు బలవంతంగా సినిమాల్లో నటించాడు. అలా అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోలివుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ధనుష్ రెమ్యునరేషన్, ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ధనుష్ ఒక్కో సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడట. ఈ మధ్యే శేఖర్ కమ్ములతో ఓ సినిమాకు కమిటయ్యాడు ధనుష్. దీనికోసం ఏషియన్ సినిమాస్ ధనుష్కు 50 కోట్లకు పైగానే పారితోషికం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ధనుష్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కో కారు విలువల దాదాపుగా రూ.4 కోట్లకు పైనే ఉంటుందట. మొత్తంగా హీరో ధనుష్కు రూ.180 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘అత్రాంగి రే’,‘ది గ్రే మ్యాన్’తోపాటు ఓ తమిళ మూవీలో నటిస్తున్నాడు. హీరో ధనుష్ గురించి క్లుప్తంగా 1983 జులై 28న మద్రాసులో జననం ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా కోలీవుడ్ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా రెండో కొడుకే ధనుష్ ‘7జీ బృందావన కాలనీ’డైరెక్టర్ సెల్వ రాఘవన్ ధనుష్కి సోదరుడు సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి ఎంట్రీ ‘తుల్లువదో ఇలమై(2002)’తో కోలీవుడ్ ఎంట్రీ ‘రఘువరన్ బీటెక్’తొ తెలుగువారికి దగ్గరయ్యాడు ‘రంజనా’చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ‘ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ధనుష్ నటించిన తొలి ఆంగ్ల చిత్రం ధనుష్ రాసి, పాడిన‘వై దిస్ కొలవెరి’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 2004లో ప్రేమ వివాహం ఇద్దరు కుమారులు, యాత్రరాజా, లింగారాజా ప్రస్తుతం ‘అత్రాంగి రే’,‘ది గ్రే మ్యాన్’తోపాటు ఓ తమిళ మూవీలో నటిస్తున్నాడు -
RC 15: రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కియారా, ఎంతో తెలుసా!
‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్స్తో దూసుకుపోతూనే ఇటూ తెలుగులోనూ ఆఫర్లు కొట్టేస్తుంది ఈ భామ. తెలుగులో తన రెండవ చిత్రం రామ్ చరణ్ సరసన నటించిన కియారా మరోసారి చెర్రితో జతకడుతున్న సంగతి తెలిసిందే. శంకర్-రామ్చరణ్ కాంబినేషన్లో ఆర్సీ 15 మూవీలో కియారా హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె సాధారణంగా తీసుకునే రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ కంటే మరో కోటి పెంచి 5 కోట్లు డిమాండ్ చేసినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె అడిగినంత కాకుండా 4.50 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చిత్రబృందం ఆమెను ఒప్పించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రస్తుతం కియారా రెమ్యూనరేషన్ హాట్ టాపిక్గా మారింది. రామ్చరణ్ 15వ చిత్రంగా శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో చెర్రీ విభిన్నమైన లుక్లో కనిపించనున్నాడు. ఈ మూవీకి తమన్ స్వరాలు అందించనున్నాడు. అయితే ఇందులో మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. -
రాజ్కుంద్రా కేసు: శిల్పాశెట్టి ఇమేజ్కు పెద్ద దెబ్బ.. రూ.2 కోట్ల నష్టం
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజ్కుంద్రా అరెస్ట్తో నెటిజన్లు శిల్పాశెట్టి ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె కోట్లలో నష్టపోతుంది. ముంబై పోలీసులు ఎప్పుడైతే రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారో.. అప్పటి నుంచి శిల్పా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఆమె పాల్గొనాల్సిన పలు షోల షూటింగ్స్ని కూడా రద్దు చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోకి శిల్పా జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్కి శిల్పా రూ.18 నుంచి 22 లక్షల వరకు పారితోషికంగా పుచ్చుకుంటుందట. అయితే భర్త అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె ఈ షో షూటింగ్కి వెళ్లడం లేదు. దీంతో ఇప్పటి వరకు శిల్పాశెట్టి దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు షో షూటింగ్కి శిల్పా డుమ్మా కొట్టడంతో ఆమె స్థానంలో ఒక ఎపిసోడ్కి కరిష్మా కపూర్ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు. ఇలా గెస్ట్లతో ఈ షోని ఎక్కువ రోజులు నడిపించలేరు. మరోవైపు ఇప్పట్లో రాజ్కుంద్రా కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో ఈ డ్యాన్స్ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. -
అలా అడగడంలో తప్పులేదు.. కరీనాకు పూజా హెగ్డే మద్దతు
హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వరనేది పచ్చి నిజం. ఇటీవల కాలంలో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తుండడంతో, వారి పారితోషికం కూడా కొంచెం పెరిగిందనే చెప్పాలి. అయినప్పటికీ హీరోలతో పోలిస్తే.. వారు పుచ్చుకునేది తక్కువేనని చాలా మంది వాదిస్తుంటారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఇక ఓ స్టార్ హీరోయిన్ కొంచెం రెమ్యునరేషన్ పెంచిందంటే చాలు.. అది హాట్ టాపిక్ అయిపోతుంది. తాజాగా కరీనా కపూర్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలో రానున్న ఓ పాన్ ఇండియా మైథలాజికల్ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు రూ.12 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనాను ఆ సినిమా నుంచి తొలగించాలంటూ.. ‘బాయ్కాట్ బెబో’అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనాకు మద్దతుగా నిలిచారు. రెమ్యునరేషన్ పెంచడం, తగ్గించడం ఆమె వ్యక్తిగత విషయమని, దానికి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ..ప్రియమణి, తాప్సీ ఇప్పటికే కరీనాకు మద్దతు ప్రకటించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఆ లిస్ట్లో చేరింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. కరీనాకు ఎంత మార్కెట్ ఉంటే అంతే అడిగిందని, అలా అడగడంలో తప్పులేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడేవారు, హీరోలు పెద్ద మొత్తం డిమాండ్ చేస్తే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించింది. రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం నటుల హక్కు అని, ఎంత ఇవ్వాలనేది నిర్మాత ఇష్టంపై ఆధారపడి ఉటుందని చెప్పుకొచ్చింది. బుట్టబొమ్మ చెప్పింది కూడా నిజమే మరి. -
సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. కేవలం సినిమాలే కాకుండా.. ప్రకటనల్లోనూ నటించేందుకు సిద్దమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజీని దృష్ట్యా పలు సంస్థలు తమ ప్రాడక్ట్స్ ప్రకటనల కోసం నటించమని కోరుతున్నాయట. ఇక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ జీతెలుగు అయితే బేబమ్మ క్రేజీని సీరియల్స్ ప్రమోషన్ కోసం వాడేసింది. జీతెలుగులో ప్రసారమయ్యే ఓ కొత్త సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి పాల్గొంది. ఈ ప్రకటన కోసం కృతి ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకే ఒక్క సినిమాలో నటించి, ప్రకటనకు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కృతి రికార్డుల్లోకి ఎక్కినట్లే. -
సినిమాల్లోకి రాకముందు పూజా హెగ్డే ఏం చేసేదో తెలుసా?
-
హాట్టాపిక్గా రామ్ పారితోషికం, ఒక్కసారిగా అంత పెంచేశాడా!
ఎనర్జీటిక్ స్టార్, యంగ్ హీరో రామ్ పోతినేని రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తు వస్తున్న రామ్, తన యాక్టింగ్తో పాటు స్టయిల్ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్ పుట్టిస్తున్నాడు. హిట్, ప్లాప్లు అని చూడకుండా అదే జోష్తో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న రామ్ ఇప్పటి వరకు 18 సినిమాలు పూర్తి చేశాడు. తాజాడా లింగుస్వామితో తన 19వ సినిమాను పట్టాలెక్కించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ సోమవారం(జూలై 12) సెట్స్పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ పారితోషికం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఈ మూవీ నుంచి రామ్ తన రెమ్యునరేషన్ పెంచాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ముందు ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తీసుకునే రామ్ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు పెంచాడట. లింగుస్వామితో చేస్తున్న ఈ మూవీకి రామ్ రూ. 13 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇది ద్విభాష చిత్రం కావడంతో రామ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా ఈ కుర్ర హీరో ఒక్కసారిగా అంత పెంచేశాడా? అంటూ పరిశ్రమకు చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారట. కాగా ఈ మూవీలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. లింగుస్వామి రామ్తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’.. పారితోషికం వేలల్లో, వసూళ్లు కోట్లలో
Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, ప్లాప్లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సింది. ఉషా కిరణ్ మూవీస్లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్ కిరణ్ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో తేజ ఉదయ్ కిరణ్ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్ను అనుకోలేదట. హీరో మాధవన్తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్ కిరణ్ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. -
మెగా హీరోకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్, ఎంతంటే!
స్టార్ హీరో నాగార్జున్ అక్కినేని మెగా హీరోకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ముట్టజెపుతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా నాగార్జున ఇండస్ట్రీలో హీరోగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్లో పలు సినిమాలు, సీరియల్స్, షోలో నిర్వహిస్తుంటాడు. తన బ్యానర్లో నటించే నటీనటులకు పారితోషికంలో ఎలాంటి బేరాలు ఉండవు. ఆ షో, సినిమాను బట్టి నటుల డిమాండ్ను చూసి పారితోషికం అందిస్తాడు నాగ్. ఈ క్రమంతో తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్కు కూడా ఏకంగా 5 కోట్ల రూపాలయ పారితోషికం ఇస్తున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా తొలి సినిమా ‘ఉప్పెన’తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించాడు. దీంతో దర్శక-నిర్మాతలు క్యూ కడుతూ వైష్ణవ్కు అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సైతం వైష్ణవ్తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కాగా వైష్ణవ్, క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రవితేజ, ఎంతంటే!
మాస్ మహారాజా రవితేజ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో టాలీవుడ్లో సక్సెఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టుగా కొత్త కథలను ఎంచుకుంటూ తన మూవీల్లో కామెడీ ఎలిమెంట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మాస్ మాహారాజా. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఖిలాడీ’ మూవీలో నటిస్తున్న రవితేజ ఆ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్పైకి రానుంది. ఇదిలా ఉండగా రవి తేజ ఈ మూవీ నుంచి తన రెమ్యూనరేషన్ను పెంచినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా వరకు 11 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ ఇప్పుడు ఏకంగా 17 కోట్ల రూపాయలకు రెమ్యునరేషన్ను పెంచాడట. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ చిత్రానికి రూ. 17 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: వైరల్ ఫొటో: మాస్ మహారాజా కొడుకును చూశారా? -
శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. ఎవరు ఊహించని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ మూవీ కోసం ధనుష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోతున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ధనుష్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ధనుష్ బాలీవుడ్లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్లో ‘ది గ్రే మ్యాన్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చదవండి: శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ' -
‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్కు అంత రెమ్యునరేషనా?!
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత హీరో సిద్దార్థ్ ‘మహా సముద్రం’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ శర్వానంద్తో కలిసి నటిస్తున్నాడు. కాగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దు 2005లో విడుదలైన ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా..’ మూవీతో తెలుగులో స్టార్ హీరోగా మారాడు. ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇక ‘బొమ్మరిల్లు’ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న సిద్దుకు ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేవు. చివరగా ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో అభిమానులను అలరించిన అతడు తెలుగు తెరకు దూరమై 9 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత మహా సముంద్రంతో మళ్లీ ప్రేక్షలకును అలరించడానికి వస్తున్నాడు సిద్దు. ఇదిలా ఉండగా ఈ మూవీలో సిద్దార్థ్ రెమ్యూనరేషన్ హాట్టాపిక్గా మారింది. పూర్తిగా తెలుగులో పేడ్ అవుట్ అయిన హీరోగా పేరు తెచ్చకున్న సిద్దు మహాసముద్రం మూవీకి 3 కోట్ల రూపాయల పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న చాలా మంది షాక్ అవుతున్నారు. ఇప్పుడున్న తెలుగు కుర్ర హీరోలలో ఎవరికి ఇంతటి పారితోషికం లేదని, తొమ్మిదేళ్ల తర్వాత కూడా సిద్దార్థ్ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యం అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఆదితి రావు హైదరిలు కథానాయికలుగా నట్తిసున్నారు. త్వరలోనే మహాసముద్రం మూవీ విడుదల కానుంది. చదవండి: ‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్లుక్ విడుదల Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్లుక్ వైరల్ -
తన తొలి సంపాదన ఎంతో బయట పెట్టిన విద్యాబాలన్..
ఎవరికైన తొలి సంపాదన చాల ప్రత్యేకమైనది. ప్రస్తుతం స్టార్ నటిగా కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా తన తొలి సంపాదన ఎంతో బయటపెట్టారు. ఆమె ప్రస్తుతం ‘షేర్నీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తన తొలి రెమ్యునరేషన్ ఎంతో చెబుతూ అది ఎలా సంపాదించారో వివరించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఓ టూరిస్టు క్యాంపైన్ కోసం మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చాను. నా స్నేహితులు, కజిన్స్తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్ ఫొటోషూట్లో పాల్గొన్నాను. ఈ ఫొటోషూట్లో మేమంతా ఓ చెట్టు పక్కన నిలుచుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్ ఇవ్వాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు మాకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారు. అదే నా తొలి సంపాదన’ అంటూ విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. కాగా విద్యాబాలన్ ‘హమ్ పాంచ్’ సీరియల్తో నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘హమ్ పాంచ్ సీరియల్ కోసం తొలి అడిషన్ ఇచ్చాను. అప్పుడు మా అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్కు వెళ్లాను. సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్కి వచ్చారు. అంతమందిని అక్కడ చూసి ఇక నాకు అవకాశం రాదని ఫిక్స్ అయిపోయాను. అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ నాకు వచ్చింది’ అని ఆమె చెప్పారు. ఇకలేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విద్యా బాలన్ కేరాఫ్ అడ్రస్గా మారారు. అప్పటి వరకు హీరోయిన్గా కాస్తా అవకాశాలు తగ్గిన విద్యాబాలన్కు ‘డర్టీ పిక్చర్’ మూవీతో మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ఆమె వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. -
రెమ్యునరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు ఎంతంటే..
బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయి అమాంతం పెరిగింది. మన సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఆల్ ఇండియా బాక్సాఫీస్ని కొల్లగొడుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ రీమేకై.. భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్థాయి పెరగడంతో హీరోల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో ప్రభాస్, మహేశ్బాబు, పవన్ కల్యాణ్ ముగ్గురూ టాప్ రెమ్యునరేషన్ లెవల్లో ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఆయన సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారట. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్కి రూ.65కోట్లకు పైగా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. రాబోయే సినిమాలకు కూడా అంతే మొత్తంలో తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. వీటితో పాటు లాభాల్లోనూ వాటాలు తీసుకుంటారట. గతంలో పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు మాత్రం 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టు భోగట్టా. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే .. అరవింద సమేత సినిమా టైమ్లో ఆయన రెమ్యునరేషన్ పాతిక కోట్లకు కాస్త అటు ఇటుగానే ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ కు మాత్రం దాదాపు 40 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రూ.40 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకున్నాడట. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసినవి రెండూ స్వంత సినిమాలే. ఆచార్య సినిమాకు దాదాపు 40 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా విడుదల తరువాత ఆ ఫిగర్ అటు ఇటు మారుతుందేమో చూడాలి. ఇప్పటి వరకు రూ 35 కోట్ల వరకు తీసుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. పుష్ప పార్ట్ 2 కు బన్నీ రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ మొన్నటి వరకు అయిదారు కోట్ల రేంజ్ లోనే వున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా తమ రేటును పెంచేశారు. బాలయ్య ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు తీసుకుంటుండగా, నాగార్జున 7 కోట్లు, వెంకటేశ్8 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుటున్నారట. వీరితో పాటు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నాని ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయిదారు కోట్ల రేంజ్ లో శర్వానంద్, నితిన్, గోపీచంద్ ఉన్నారు. (నోట్: ఒక్కో సినిమాకు హీరోలు ఎంత తీసుకుంటారనేది అఫిషియల్గా ఎక్కడ ప్రకటించరు. కానీ సినిమా స్థాయి, బడ్జెట్, పాత్ర పరిధిని బట్టి హీరోలు ఈ మాత్రమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా) -
Adipurush: ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్!
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రశాంత్ నీల్తో సలార్, ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్తో ఆదిపురుష్ చిత్రం షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ నాగ అశ్విన్తో ఓ సినిమా సెట్స్పైకి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ ఆదిపురుష్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ కోసం టీ-సిరీస్ ఫిల్మ్స్ ప్రభాస్కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించనుంది. ఇక లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ అలరించనున్నాడు. కాగా గతంలో దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ భారతీయ ఇతిహాసం రామాయణం అనుకరణ. ఈ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ఓ కార్యక్రమంలో ప్రభాస్ను చూశాను. ఆదిపురుష్కు అతను అయితే కరెక్ట్గా సరిపోతాడని నాకు గట్టిగా అనిపించింది. ఎందుకంటే అతడి ఆకర్షణీయమైన కళ్లు, వైఖరి, అతని వ్యక్తిత్వం. చెప్పాలంటే ప్రభాస్లో ఆదిపురుష్ను చూడగలిగాను. ప్రభాస్తో తప్ప ఇంకేవరితో ఈ సినిమా చేయలేను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. భారీ బడ్జేట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. చదవండి: రా ఏజెంట్గా ప్రభాస్..హాలీవుడ్ స్టయిల్లో ఉంటుందట! Prabhas Movie: పారితోషికమే రూ.200 కోట్లా?! -
ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రూపొందించే పనిలో బిజీగా ఉంది. అయితే సెకండాఫ్ మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్న ఊహాగానాల నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సెకండ్ లెగ్ మ్యాచ్లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటి వరకు వారు ఆడిన మ్యాచ్లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్ కాబోయే మ్యాచ్లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని పేర్కొన్నారు. కాగా, విదేశీ ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీ యాజమాన్యలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం ఆగదని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్ల నేపంతో ఐపీఎల్ ఆడబోమని ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ముంబై కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం.. -
NTR 31: ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలో ఫుల్ బిజీ అయ్యాడు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ పూర్తవకముందే.. రెండు సినిమాలో ప్రకటించాడు. అందులో ఒకటి కొరటాల శివ ప్రాజెక్ట్ కాగా, రెండోది కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ది. ఇప్పటికే ప్రభాస్తో ‘సలార్’మూవీని పట్టాలెక్కిస్తున్న ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాని ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ భారీగానే తీసుకుంటున్నాడట. అయితే రాజమౌళి, సుకుమార్తో పోలిస్తే అంత ఎక్కువేం కాదట. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ రూ.10 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడని టాక్. కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సలార్ కూడా ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదట ప్రశాంత్ నీల్. దీంతో ఎన్టీఆర్ సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్ పట్ల ప్రశాంత్ నీల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్ సినిమాకి రూ. 20 కోట్లు తీసుకునే చాన్స్ ఉన్నప్పటికీ అతను ఎక్కువగా ఆశ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్-2, సలార్ చిత్రాలు విడుదల అనంతరం ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి ఉంటే ప్రశాంత్ నీల్కు ఎక్కువే రెమ్యునరేషన్ అందేదనేది ఫిల్మ్ వర్గాల మాట. మరి ఆ చిత్రాలు విడుదలై హిట్టయితే ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ పెరుగుతుందో లేదో చూడాలి. చవండి: ఏ సాంగ్స్ చేయడం లేదు: పాయల్ రాజ్పుత్ మహేశ్ 'పార్థు' మూవీ! ఫారిన్లో షూట్? -
మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి!
Sai Pallavi: సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది సాయి పల్లవి. పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా తన క్యారెక్టర్ ముఖ్యమైందా లేదా అని చూసుకొని కథలను ఒప్పుకుంటుంది. పెద్ద హీరో సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. అలా గత మూడేళ్లలో సాయిపల్లవి రూ.5 కోట్లు నష్టపోయిందట. అదెలా అంటారా?.. సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ఫిదా సూపర్ హిట్ కావడంతో ఈ మలయాళ కుట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకోకుండా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించిందట. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్ను వదులుకుందట ఈ మలయాళ భామ. ఆ తర్వాత మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్గా అనుకున్నారట. కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట. అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఇవన్నీ భారీ సినిమాలు కాబట్టి ఆమెకు కోటి పైనే పారితోషికం ఇస్తాము అని నిర్మాతలు ఆఫర్ ఇచ్చారట. కానీ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అని భావించి ఆమె రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్ యాడ్స్ని కూడా ఒప్పుకోలేదట. వీటీ విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం లవ్స్టోరీ, విరాటపర్వం చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. -
Pushpa Movie కోసం బన్నీ షాకింగ్ రెమ్యునరేషన్
Allu Arjun: క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఫిల్మ్లో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి భాగం అక్టోబర్లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం బన్నీ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. వాస్తవానికి ‘పుష్ప'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ముందుగా భావించలేదు. కానీ, సినిమాలో చెప్పాల్సిన కంటెంట్ రెండింటికి సరిపోయేంతగా ఉండడంతో ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఒకే భాగమని చెప్పడంతో బన్నీ రూ.25 కోట్లకు ఒప్పుకున్నాడట. దీనితో పాటు సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా అడిగాడని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు నిర్మాతలు మనసు మార్చుకొని రెండు పార్టులుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బన్నీ కూడా పారితోషికాన్ని పెంచేశాడట. రెండో భాగానికి ఏకంగా రూ. 50 తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్ట పడుతున్నాడు. అతని కష్టానికి తగ్గట్లే రెమ్యునరేషన్ అడిగాడని, దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది..
ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) ఈ రోజు(మే 10) కరోనాతో కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన ఆయన పలు సినిమాల్లో కూడా నటించి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. టీఎన్ఆర్ అనగానే మొదట గుర్తొచ్చేది ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో’. ఈ షో ద్వారా తనదైన శైలిలో సెలబ్రేటిలను ఇంటర్వ్యూ చేసి పాపులరిటీ తెచ్చుకున్న ఆయన ఎంతోమంది యూత్ ఫాలోవర్స్ను కూడా సంపాదించుకున్నారు. గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ యాంకర్గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో అంటే తెలియని వారులేరు అనేంతగా ఈ షోను పాపులర్ చేశారు ఆయన. అంతేకాదు ఎంతసేపు చూసిన ఈ షో అసలు బోర్ కొట్టదు అనే పేరును కూడా తెచ్చుకుంది. అలా ప్రస్తుత డిజిటల్ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఆయన కూడా ఒకరయ్యారు. రామ్ గోపాల్ వర్మ, తేజ వంటి స్టార్ డైరెక్టర్లను ఇంటర్య్వూ చేసి సెన్సేషనల్ అయ్యారు. అలాగే టాలెంట్ ఉన్నవారిని కూడా ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి టీఎన్ఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను చాటుకున్న టీఎన్ఆర్ ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో తెలుసా. షో నిడివిని బట్టి ఒక్కొక్క ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే పారితోషికం తీసుకునేవారని సమాచారం. కాగా పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన ఆయన ఆలీ నటించిన పిట్టల దొర సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్ వైపు వచ్చారు. మొదట్లో జర్నలిజం బ్యాగ్రౌండ్తో పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేసిన ఆయన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టి జార్జిరెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు వంటి సినిమాల్లో కూడా నటించారు. టీఎన్ఆర్ హఠాన్మరణంతో మీడియా రంగంలో, టాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ -
బర్త్డే: సైడ్ ఆర్టిస్ట్గా త్రిష తొలి సంపాదన ఎంతో తెలుసా!
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష నేటితో 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. మంగళవారం(మే 4) త్రిష బర్త్డే సందర్భంగా నటీనటులు, సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. అయితే ఒక్కప్పుడు టాలీవుడ్లో అగ్రనటిగా రాణించిన త్రిష ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలు తగ్గించింది. ఈ మధ్యలో ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం చేసుకుని రద్దు చేసుకున్న ఆమె ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దక్షిణాన సెటిలైయిపోయింది. అయితే మూడు పదుల వయసులో కూడా నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇస్తూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న త్రిష కెరీర్ ప్రారంభంలో హీరోయిన్లకు స్నేహితురాలి పాత్రలు చేస్తూ సైడు క్యారెక్టర్లలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో త్రిష ఒక్క సినిమాకు 500 వందల రూపాయలు తీసుకునేదట. ఇప్పటి రోజుల్లో ఆ డబ్బు అసలు లెక్కలోకే రాదు.. కానీ అప్పట్లో 500 వందలు అంటే మాములు విషయం కాదు. చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి తన తొలి రెండు చిత్రాలు ఎలాంటి డబ్బు తీసుకొకుండానే చేశారట. మూడవ చిత్రం నుంచే ఆయన డబ్బు తీసుకుంటున్నారట. అప్పుడు ఆయన తొలి సంపాదన రూ. 1118 అట. ఈ లెక్కన చూస్తే మెగాస్టార్ కంటే త్రిష తొలి చిత్రం రెమ్యూనరేషన్ ఎక్కువని చెప్పుకొవచ్చు. చదవండి: ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత త్వరలోనే త్రిష పెళ్లి.. వరుడు ఎవరంటే! -
రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఊపు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోంది. రొటీన్గా కాకుండా ఢిపరెంట్ స్టైల్లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్సాబ్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో ‘వకీల్సాబ్’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేస్తూ.. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్కు సరైన పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ ‘అఖండ’, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్, నాని ‘టక్ జగదీశ్’ అఖిల్ ‘ఏజెంట్’, శంకర్- రామ్చరణ్ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్.. తాజాగా తన రెమ్యునరేషన్ని కూడా పెంచేశాడట. ‘అల వైకుంఠపురములో’ వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునే తమన్.. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్సాబ్ కూడా సూపర్ హిట్ కావడంతో మరో 50 లక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడట. కొన్ని సినిమాలకు బడ్జెట్ని బట్టి తీసుకుంటాడని టాక్. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని తమన్కు పేరుంది. ఇక రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. చదవండి : త్రివిక్రమ్ సినిమా : మరోసారి మహేశ్కు జోడిగా ఆ హీరోయిన్ బెడ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా -
షాకింగ్ రెమ్యూనరేషన్.. రోజుకు రూ.2కోట్లు
సినిమా తారల సంపాదన గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తే. ఓ సగటు మనిషి తన జీవిత కాలం అంతా కష్టపడినా సంపాదించని మొత్తం వారు ఒక్క సినిమాతో సంపాదిస్తారు. కొందరు నటులు ఒక్క రోజులో కోట్లు సంపాదిస్తారంటే అతిశయోక్తి కాదు. మన దగ్గర స్టార్ హీరోలు ఒక్క సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ నటి తీసుకున్న పారితోషికం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె రెమ్యూనరేషన్ తెలిసి జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. వివరాలు చైనా నటి జెంగ్ ఓ షో కోసం రోజుకు 3,20,000 డాలర్ల(రూ.2,36,76,816) చొప్పున 77 రోజులకు కలిపి 25 మిలియన్ డాలర్ల(1,84,97,88,750 కోట్ల రూపాయలు) రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని 2019లో ఓ కాస్ట్యూమ్ డ్రామాలో నటించేందుకు 77 రోజులు కేటాయించిన నటి.. రోజుకు 3,20,000 డాలర్లు తీసుకుందని మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ప్రచురితమైంది. ఈ క్రమంలో అధిక వేతనం అందుకున్న జెంగ్.. పన్ను ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలతో షాంఘై, బీజింగ్లోని అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరించింది. ఈ వార్తలపై స్పందించిన సదరు నటి తాను ఇన్వెస్టిగేషన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా ఈ విషయాన్ని జెంగ్ ఎక్స్ పార్ట్నర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ జాంగ్ హెంగ్ బయటపెట్టాడు. తన షో కోసమే నటి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు తెలిపాడు. చదవండి: టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య -
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ నెల సంపాదన ఎంతో తెలుసా..?
షన్నూ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. యూట్యూబ్లో అతడు సృష్టించే రికార్డ్స్ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్ ఒక్క వీడియో పోస్ట్ చేశాడంటే.. అది ట్రెండింగ్లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్. మొదట్లో కామెడీ, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ .. ఒకే ఒక వెబ్ సిరీస్తో ఫేమస్ అయిపోయాడు. అదే ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’. ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్లో పది ఎపిసోడ్స్కు 80 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ది సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొన్ని వెబ్ సిరీస్లలో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూపర్ సిరీస్తో షణ్ముఖ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ సంపాదించగలిగాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత షణ్ముఖ్ షేర్ చేస్తున్న ప్రతి వీడియో 10 మిలియన్స్ పైగా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘సూర్య’ అనే వెబ్ సిరీస్కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల చేసిన 6 ఎపిసోడ్స్ ట్రెండింగ్లో నిలిచాయి. యూట్యూబ్లో షన్నూకు వచ్చిన క్రేజీతో ఇప్పుడు బిగ్బాస్ ఐదో సీజన్కి కూడా సెలెక్ట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూట్యూబ్లో ఇంతలా దూసుకెళ్తున్న షణ్ముఖ్ ఆదాయానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షణ్ముఖ్ యూట్యూబ్ చానల్కు ప్రస్తుతం 3.32 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఆ లెక్కన ఈయనకు నెలకు రూ.7లక్షల వరకు ఆదాయం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే షన్నూ చేసే వెబ్ సిరీస్కి ఎపిసోడ్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటాడట. వాటిని కూడా కలిపితే.. ఈ యూట్యూబ్ స్టార్ నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వామ్మో.. సురేఖ వాణి, సుప్రిత రచ్చ మాములుగా లేదుగా, అర్థరాత్రి వేళ.. -
టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో మన హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 70 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు సైతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పుచ్చకుంటున్నారు. కానీ సీనియర్లు హీరోలలో ఒక్క చిరంజీవి తప్ప మిగతావారంతా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేశ్లు సినిమాను బట్టి రూ.5 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటున్నటు సమాచారం. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పుచ్చుకుంటున్నారట. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’కు కూడా బాలయ్య రూ.7 కోట్లు తీసుకుంటానని మొదట ఒప్పుకున్నాడట. కానీ ఇటీవల విడుదలైన టీజర్కు భారీ స్పందన రావడంలో తన రెమ్యునరేషన్ని పెంచాడట ఈ నందమూరి నటసింహం. యూట్యూబ్లో అఖండ టీజర్ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్ని రాబట్టి రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఈ టీజర్ సూపర్ హిట్ కావడంతో బాలయ్య తన పారితోషికాన్ని మరో మూడు కోట్లు పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే అఖండ కోసం బాలయ్య మొత్తంగా రూ.10 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. రూ.70 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. అందుకే బోయపాటి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా విడుదల తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ ప్రాఫిట్ బట్టి దర్శకుడికి షేర్స్ ఇస్తారని సమాచారం. -
ఇప్పుడు 5 కోట్లు తీసుకునే పూజా హెగ్డే.. తొలి సంపాదన ఎంతో తెలుసా?
పూజా హెగ్డే.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్లలో ఒకరు. ‘ అల వైకుంఠపురములో’ తర్వాత ఈ బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో పాటు అఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో పాటు చిరంజీవి ‘ఆచార్య’లో రామ్చరణ్ సరసన నటిస్తోంది. అలాగే ప్రభాస్తో పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’లోనూ ఈమే హీరోయిన్. వీటితో పాటు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో నటిస్తోంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా దూసుకెళ్తున్న ఈ బుట్టబొమ్మ.. రెమ్యునరేషన్న్ని కూడా అంతే వేగంగా పెంచేసింది. ‘అల వైకుంఠపురము’కు రూ.1.4 కోట్లు తీసుకున్న పూజ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోందట. ప్రస్తుతం సౌత్లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతున్న ఈ భామ.. తొలి సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు. ఈ బ్యూటీ తొలిసారిగా జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాలో హీరోయిన్గా నటించింది. అంతకు ముందు మోడల్గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎమ్డబ్లూ్య5 (BMW5) సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట. ఇక తనకు వచ్చిన డబ్బులను దుబారాగా ఖర్చు చేయకుండా వెంటనే తీసుకెళ్లి వాళ్ల అమ్మ చేతిలో పెట్టేస్తుందట. ఆ డబ్బుతో ఏం చేయాలనే నిర్ణయం వాళ్ల అమ్మదేనని ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే చెప్పింది. -
‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?
‘జాతిరత్నలు’ సినిమాతో హీరో నవీన్ పొలిశెట్టి జాతకమే మారిపోయింది. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే ఆకట్టుకున్న ఈ ‘జాతిరత్నం’, రెండో సినిమాతో స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకా, నవీన్కు ఎనలేని క్రేజీని తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ అంతా తన వైపు తిరిగేలా చేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారట. నవీన్ యాక్టింగ్లో కొత్తదనం చూసి ముచ్చటపడిన ఓ బడా నిర్మాత.. అతనికి భారీ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. నవీన్ మూడో చిత్రం తమ బ్యానర్లో తీస్తే.. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే నవీన్ పొలిశెట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. నచ్చిన కథ దొరికితేనే సినిమా చేద్దామని వేచిచూస్తున్నాడట. త్వరలో తన మూడో సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా! ‘బిగ్బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్ -
ఈ టాప్ విలన్స్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోతోపాటు విలన్స్ కూడా క్రేజ్ పెరిగిపోతుంది. హీరో ఎంత బలంగా ఉంటాడో… అతని ప్రత్యర్థి కూడా అంతే బలమైన నాయకుడే అయి ఉండాలి. అప్పుడే హీరోయిజం అంతగా పవర్ఫుల్ అవుతుంది. అప్పుడే సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ సూత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, బోయపాటి శ్రీను, కృష్ణవంశి లాంటి దర్శకులు పక్కాగా ఫాలో అవుతారు. తమ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్కు కూడా అంతే ఉండేలా జాగ్రత్తపడతారు. హీరోకి తగిన విలన్ క్యారెక్టర్ని సృష్టిస్తారు. అందుకే టాలీవుడ్లో ప్రస్తుతం విలన్కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒకప్పటి స్టార్ హీరోలు సైతం నెగెటివ్ పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. టాలీవుడ్లో టాప్ విలన్స్ రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం. మంచి తండ్రి, చెడ్డ మొగుడు, రౌడీ పోలీసు, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయే ఏకైక నటుడు ప్రకాశ్ రాజ్.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో తన నటనతో ప్రకాష్ రాజ్ విలన్ గా ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. అప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఆయన విలన్ పాత్రకు అయితే దాదాపు కోటిన్నర వరకు తీసుకుంటారని సమాచారం. అదే సపోర్టింగ్ క్యారెక్టర్కు అయితే దాదాపు 10 లక్షల రూపాయలను రెమ్యునరేషన్గా పుచ్చుకుంటాడట. ఒకప్పుడు ప్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబుని విలన్గా మార్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్గా కొనసాగుతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న సాయికుమార్..రామ్చరణ్ ‘ఎవడు’సినిమాతో విలన్గా మారాడు. ఆ సినిమాలో సాయికుమార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయికుమార్ ఒక్కో సినిమాకు రూ.50లక్షలు తీసుకుంటున్నాడట. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో టాప్ విలన్ లిస్ట్లో చేరాడు సోనూసూద్. విలన్గా భయపెడుతూనే అప్పుడప్పుడు నవ్విస్తాడు కూడా. ఈ యంగ్ విలన్ ఒక్కో సినిమాకు రూ.80లక్షల నుంచి కోటి వరకు పుచ్చుకుంటాడట. రాజమౌళి ‘ఈగ’సినిమాతో విలన్గా మారాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఈ సినిమాతో టాలీవుడ్లో సుదీప్కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన నటించిన కన్నడ సినిమాలు కూడా ఇక్కడ విడుదలయ్యాయి. అలాగే దబాంగ్-3లో కూడా విలన్గా నటించాడు. ఈ స్టైలీష్ విలన్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు తీసుకంటాడని టాక్. రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినేయ విధేయ రామలో పవర్పుల్ విలన్ పాత్ర చేశాడు వివేక్ ఒబేరాయ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా.. వివేవ్కి మంచి పేరుతెచ్చింది. ఆయన ఒక్కో సినిమాకు రూ.3 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకుంటాడట. కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు సంపత్ రాజ్. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లోలో విలన్గా నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.60లక్షల నుంచి 70లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు రవి కిషన్. తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’లో కూడా మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 50 లక్షలు తీసుకుంటాడని సమాచారం. వీరితో పాటు ఒకవైపు హీరోగా రాణిస్తూనే విలన్ రోల్స్ చేస్తున్న ఆది పినిశెట్టి రూ.కోటి, కోలీవుడ్ సినిమాల్లో విలన్గా రాణిస్తున్న హరీష్ రూ.50లక్షలుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. చదవండి : రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బాహుబలి తర్వాత తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. బాక్సాఫీస్ స్టామినా పెరిగింది. మన సినిమాలు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అవుతున్నాయ. ఆల్ ఇండియా బాక్సాఫీస్ను కొల్లగొట్టేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ రీమేకై.. భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్థాయి పెరగడంతో హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు తమ తాజా సినిమాలకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో చూద్దాం.. సినిమా మాదిరే రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్న దర్శకధీరుడు ఈరోజు ప్రపంచ మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుంది అంటే అది రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా వల్లనే. ఈ సినిమా రికార్డులను చూసి భారతీయ సినిమా ఇండస్ట్రీలన్నీ ఖంగుతిన్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. ప్రస్తుతం వారి లక్ష్యం 'బాహుబలి' రికార్డులను అధిగమించడం. అంత పెద్ద ట్రెండ్ సెట్ చేశారు మన జక్కన్న. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీసే సత్తా ఉన్న ఈ దర్శకధీరుడు.. రెమ్యునరేషన్ కూడా రికార్డు స్థాయిలో తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట. సినిమా స్థాయిని బట్టి ఆయన పారితోషికం మారుతుంది. రేటు పెంచిన సుకుమార్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులను కొత్త అనుభూతినిస్తాయి. బాక్సాఫీస్ను కొల్లగొడుతాయి. ఇక రంగస్థలం తర్వాత సుకుమార్ రేంజ్ పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు ఆయన రూ.20 కోట్లతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్తో ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపు రూ.23 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మాటల మాంత్రికుడు@20 కోట్లు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడతారు. మరోవైపు త్రివిక్రమ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఇక ఈయన ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు పారితోషికంగా తీసుకోవడంతో పాటు.. లాభాల్లో వాటాను కూడా తీసుకుంటాడు. ఇక అల వైకుంఠపురములో తర్వాత ఈ మాటల మాంత్రికుడి రేంజ్ మరింత పెరిగింది. రెంజ్ పెరగడంతో రేటు పెంచిన కొరటాల కొరటాల శివ ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు పైనే తీసుకుంటాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి ఆయన ఈ ఒక్క సినిమాపైనే ఉన్నాడు. అందుకే ‘ఆచార్య’కు తన తన రెమ్యునరేషన్ని మరింత పెంచినట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అయినా వెనక్కి తగ్గని బోయపాటి బోయపాటి గత చిత్రం వినయ విదేయ రామ భారీ డిజాస్టర్ అయినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఒక్కో సినిమాకు ఆయన రూ.10 కోట్లకు పైనే తీసుకుంటారట. గతంలో బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ అందించిన బోయపాటి.. మరోసారి ఆయనతో మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా.. ఒకే రేటు అంటున్న పూరి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఏ హీరో వర్క్ చేసినా కూడా జనాల్లో ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటారు. సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు పూరి హీరోలలో ఉన్న అసలైన ఎనర్జీని బయటకు తెప్పిస్తాడు. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతో వర్క్ చేశారు. సినిమాను బట్టి ఆయన రెమ్యునరేషన్లో తేడా ఉంటుందట. మొత్తనికి ఆయన ఒక్కో సినిమాకు రూ.7 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటాడట. పూరి ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ని అంచనా వేయడం కష్టం. అనిల్కు అన్ని కోట్లు ఇవ్వాల్సిందే వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ తర్వాత అనిల్ తన రేటు పెంచాడని టాక్. ఆయన ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లకు పైనే తీసుకుంటాడట. వీరితో పాటు శేఖర్ కమ్ముల రూ.5 కోట్లు, నాగ్ అశ్విన్ రూ.8 కోట్లు, పరుశురామ్ రూ.8 కోట్లు, క్రిష్ రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. -
పుష్ప: హీరోకు ధీటుగా విలన్కు పారితోషికం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పారితోషకం అధికంగా ఇచ్చేది టాలీవుడ్లోనే. అందుకే ఇతర భాషల్లో హీరోలుగా చేసే నటులు సైతం మన దగ్గర విలన్.. కీలక క్యారెక్టర్లు చేసేందుకు అంగీకరిస్తారు. ఆయా పాత్రలకు గాను వారు భారీ పారితోషికం తీసుకుంటారు. కథలో పాత్ర డిమాండ్ను బట్టి మన దర్శక, నిర్మాతలు కూడా భారీ పారితోషికాలకు సై అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో ఓ క్యారెక్టర్కి భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఫాజిల్కు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు(జీఎస్టీ అదనం) పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మన దగ్గర చిన్న హీరోలు సైతం ఈ రేంజ్లో పారితోషికం డిమాండ్ చేయడం లేదు. అలాంటిది విలన్ పాత్ర చేసే ఫాజిల్కు ఇన్ని కోట్లు ఇవ్వడం టూమచ్ అని కొందరు అంటుండగా.. మరి కొందరు మాత్రం అతడి రేంజ్కు ఇది తక్కువే అనడం కొసమెరుపు. గతంలో ఫాజిల్ పలు అవార్డులు దక్కించుకున్నాడు. మళయాలంలో అతడికి ఎంతో క్రేజ్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పుష్ప మేకర్స్ ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. చదవండి: పుష్పరాజ్ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు -
రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే!
‘క్రాక్’తో కిరాక్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన కిక్తో వరుస సినిమాలకు ఓకే చెబుతూ.. అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’తో బిజీగా ఉన్న ఈ మాస్ హీరో.. తాజాగా తన 68వ చిత్రాన్ని ఫైనల్ చేశాడు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే రవితేజ తన 68వ సినిమాకు రెమ్యునరేషన్ని భారీగా పెంచారని ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు కొత్త సిసిమాలకు రవితేజ రూ.16 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారట. ‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అంతేకాదు, రవితేజకు ఈ సినిమా పూర్వ వైభవం తీసుకొచ్చింది. అందుకే, ఈ సినిమా తరవాత రవితేజ తన రెమ్యునరేషన్ని పెంచిట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే పేరు ఎలాగో ఉంది.దానికి తోడు ఇటీవల విడుదలైన క్రాక్ కలెక్షన్ల వర్షం కురిపించడంతో నిర్మాతలు కూడా రవితేజ డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట. ‘ఖిలాడీ’ సినిమా పూర్తి అయిన వెంటనే రవితేజ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. చదవండి : ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు ‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ -
ఆ వార్తలు నిజమైతే బాగుండు.. అదే నా కల: రష్మిక
అతి తక్కువ సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది రష్మిక మందన్న. కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్నిస్తే, ఆ తరువాత విజయ్దేవరకొండతో రొమాన్స్ చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. తర్వాత ఇక ఈ అమ్మడు వెనక్కితిరిగి చూసుకోలేదు. వరుస సక్సెస్లతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఇలా తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్లోకి కూడా ప్రవేశించింది. ఇదిలా ఉంటే ఈ కన్నడ బ్యూటికి సంబధించిన ఒక వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు నటించే బాలీవుడ్ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని ఆ వార్త సారాంశం. ఈ వార్తలపై తాజాగా రష్మిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాననే వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే బాగుండేది. ఆ వార్తల్లో వస్తున్నట్లు అంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవాలనేదే నా కల’ అంటూ ఆ వార్తలు ఒట్టి పుకార్లేనని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్లో అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాతో పాటు హిందీ రెండు సినిమాల్లో నటిస్తోంది. -
యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలుసా?
బుల్లితెరపై హోస్ట్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన పంచ్లు, యాంకరింగ్తో సుమ కనకాల తరువాత టాలీవుడ్లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్ ఒక్కడే. ఇటీవలే ఈయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 29 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కాగా టెలివిజన్లో అత్తా కోడళ్ళు షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రదీప్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో వంద రూపాయల కోసం కూడా ఎంతో కష్టపడినట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం పలు చానల్స్ లో అనేక షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రదీప్.. స్టార్ యాంకర్ కొనసాగుతున్నాడు. ఇతనికి యూత్, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే టీవీ షోలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రదీప్ నెలకు దాదాపు రూ. 40 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే టాక్ ఫిలీం వర్గాల్లో వినిపిస్తోంది. చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్ రెండేళ్ల క్రితం ప్రదీప్ టీవీ షోలలో ఒక్కో ఎపిసోడ్కు రూ 75 వేల వరకు తీసుకునేవాడట. అయితే ఇప్పుడు అదే షోకు ప్రదీప్ అక్షరాలా లక్షన్నరకు పైగా తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి పాతిక లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ స్టార్ యాంకర్ దాదాపు ఏడాదికి ఆరు కోట్లకు పైగా సంపాదిస్తున్నడన్న మాట. ఈ మొత్తం టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఇంత భారీ మొత్తంలో సంపాదించడం లేదని టాక్. చదవండి: ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. చదవండి: ఐస్క్రీమ్ తింటున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
స్పెషల్ సాంగ్..మోనాల్కు అంత రెమ్యునరేషనా?
బిగ్బాస్ సీజన్-4 అనంతరం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అప్పటివరకు ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్బాస్తో సొంతం చేసుకుంది. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్తో క్లోజ్గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్కి హైలెట్గా నిలిచాయి. బిగ్బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ఇది మోనాల్కు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. (ఇల్లు కొనబోతున్న మోనాల్?!) ఇటీవలె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మరింత పబ్లిసిటీని తెచ్చుకుంది ఈ గుజరాతీ భామ. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ 50 లక్షల రూపాయల భారీ రెమ్యునరేషన్ అందుకుందట. ప్రస్తుతం ఆమెకున్న ఫేమ్ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు కూడా మోనాల్ అడిగినంత మొత్తంలో ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏదైనా షాపు ఓపెనింగ్కి సైతం 10 లక్షలు ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుంటే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) -
ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!
బాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేయ్యడమే గగనంగా భావిస్తుంటే.. అక్షయ్ మాత్రం మూడు, నాలుగు సినిమాలు సునాయసంగా చేస్తారు. పైగా ఆయన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. అక్షయ్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ సినిమాలు అనే భావన దర్శక నిర్మాతల్లో ఉంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అక్షయ్ టాప్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 117 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అక్షయ్ మరోసారి తన రెమ్యూనరేషన్ని పెంచనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2022లో చేయబోయే చిత్రాల కోసం అక్షయ్ ఏకంగా 135 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం) దీని గురించి ఓ సినీ విశ్లేషకుడు మాట్లాడుతూ.. ‘అక్షయ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం 80-90 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రొడక్షన్ బడ్జెట్ వచ్చి 35-45 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ప్రింట్, పబ్లిసిటీ కోసం మరో 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక రెమ్యూనరేషన్ కాకుండా అక్షయ్ సినిమా ఒవర్ ఆల్ బడ్జెట్ చూసుకుంటే 185-200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీగా నిలుస్తూ.. సుమారు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. దాంతో తన రెమ్యూనరేషన్ని భారీగా పెంచారు. ఇక అక్షయ్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తున్నారు’ అన్నారు. ఇక ప్రస్తుతం అక్షయ్ చేతిలో సూర్యవంశి, అత్రాంగి రే, బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు వంటి సినిమాలు ఉన్నాయి. -
పారితోషికం తీసుకోవడంలేదు
మణిరత్నం నిర్మాణంలో ‘నవరస’ అనే వెబ్ యాంథాలజీ రూపొందనుందనే విషయం తెలిసిందే. అందులో క్రేజీ స్టార్స్ నటిస్తారని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీలో తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది కథలను చూపించనున్నారు. దర్శకులు మణిరత్నం, జయేంద్ర ఈ యాంథాలజీను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్కి పని చేసే నటులు, సాంకేతిక నిపుణులు ఎవ్వరూ పారితోషికం తీసుకోవడం లేదు. ఈ యాంథాలజీ నుంచి వచ్చిన లాభాలన్నీ కూడా కోవిడ్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న సౌతిండియా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు అందించనున్నారు. ఈ యాంథాలజీకు మణిరత్నం కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నారు. ఈ ‘నవరస’ ద్వారా తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు సూర్య, రేవతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, పార్వతి... మరికొందరు. ఒక కథను తెరకెక్కిస్తూ, అరవింద్ స్వామి తొలిసారి దర్శకుడిగా మారారు. ఈ 9 కథలకు కెమెరామేన్లుగా సంతోష్ శివన్, బాలసుబ్రహ్మణ్యం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయస్ కృష్ణ, హర్ష్వీర్ ఒబెరాయ్, సుజిత్ సారంగ్, వి. బాబు, విరాజ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్, ఇమ్మాన్, జిబ్రాన్, అరుళ్ దేవ్, కార్తీక్, రోన్ ఎథన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్లు సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే పట్టుకోటై్ట ప్రభాకర్, సెల్వ, మదన్ కార్కీ, సోమీథరన్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. దర్శకులు కేవీ ఆనంద్ గౌతమ్ మీనన్ బీజోయ్ నంబియార్ కార్తీక్ సుబ్బరాజ్ పొన్రామ్ హలీత షహీమ్ కార్తీక్ నరేన్ రతీంద్రన్ ఆర్. ప్రసాద్ అరవింద్ స్వామి నటీనటులు రేవతి నిత్యామీనన్ పార్వతీ తిరువోత్తు ఐశ్వర్యా రాజేష్ పూర్ణ రిత్విక అరవింద్ స్వామి సూర్య సిద్ధార్థ్ విజయ్ సేతుపతి ప్రకాష్ రాజ్ శరవణన్ ప్రసన్న గౌతమ్ కార్తీక్ -
అబ్బే... ఆ ఉద్దేశం లేదు
‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం. మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. -
రెమ్యునరేషన్లపై స్పందించిన కల్యాణ్
సాక్షి, హైదరాబాద్ : నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం తగ్గింపుపై ప్రముఖ సినీ ప్రొడ్యూసర్, నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ స్పందించారు. రెమ్యునరేషన్ను20 శాతం తగ్గించమని అడగడంలోనే నిర్మాతల అసమర్ధత వెల్లడవుతోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘నిర్మాతలు పని కల్పించేవాళ్లు.. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది వాళ్లే.. కాకపోతే 20 శాతం తగ్గించమని అందరినీ అడగడంలోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోంది. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని అభాసుపాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. కూర్చుని మాట్లాడుకోవాలి. నిర్మాతల్లో యూనిటీ లేకపోతే కష్టం. నిర్మాతల్లోనే కొందరు దొంగల్లాగా మారి, అవతలివారిని ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదు’అని కల్యాణ్ అభిప్రాయపడ్డారు. (చదవండి : పారితోషికం కట్) కాగా, రోజుకు 20 వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్టులకు 20 శాతం.. సినిమాకు ఐదు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు 20 శాతం చొప్పున తగ్గించాలని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ బ్యాటీ దీపిక పదుకొణే ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. నటనలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దీపిక.. రెమ్యూనరేషన్ విషయంలోనూ ట్రెండ్ సెట్చేస్తోంది. బీ టౌన్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్లో టాప్లో ఉన్న బ్యూటీ.. ఆ రేసులో తనకు సాటిలేదని నిరూపిస్తోంది. తాజాగా ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. (రాజుకు తగ్గ రాణి) ఈ విషయం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లోనూ హాట్టాపిక్గా మారింది. ప్రభాస్తో చిత్రానికి దీపిక తీసుకోబోయే రెమ్యూనరేషన్పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తొలిసారి టాలీవుడ్లో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ మొదటి చిత్రానికి దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీపిక పారితోషకం సోషల్ మీడియా, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. అయితే సాధారణంగా తన సినిమాకు 13-15కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దీపికా పదుకొనే… ప్రభాస్ తో సినిమాకు మాత్రం ఏకంగా 20కోట్లుకు పైనే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి నిర్మాత సానుకూలంగానే స్పందించటంతో దీపికా సినిమాకు అంగీకరించినట్లు ఫిలింనగర్ లో ప్రచారం సాగుతోంది. ఈ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇప్పటివరకు మన దేశంలోనే ఏ హీరోయిన్కు ఇవ్వలేదని సమాచారం. మొదటి చిత్రానికి 20 కోట్లు, రెండో చిత్రానికి 50 కోట్లు చొప్పున బడ్జెట్తో సినిమాలను తెరకెచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపు 400 కోట్లతో ప్రభాస్ సినిమాను తెరకెక్కించేందుకు స్ర్కిప్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బాహుబలి హిట్స్తో తన క్రేజ్ను అమాంతం పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అంతేకాకుండా ప్రభాస్తో సినిమా అనగానే దర్శక నిర్మాతలకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తోందని, బడ్జెట్ ఎంత పెట్టడానికైనా వెనకడటంలేదని టాప్ వినిపిస్తోంది. కాగా ప్రభాస్-దీపిక చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. -
అర్హత ఉంటేనే అడగాలి
‘‘ఏ ఆర్టిస్ట్ పారితోషికం అయినా వాళ్ల మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ మేం ఎంత అడిగితే అంత నిర్మాతలు ఇవ్వరు’’ అంటున్నారు తమన్నా. అడిగినంత పారితోషికం ఇవ్వని కారణంగా ఇటీవల ఆమె ఓ సినిమా వదులుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఈ వార్తలో నిజం లేదన్నారు ఈ మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగా పారితోషికం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒక నిర్మాత నాకు పారితోషికం ఇస్తున్నారంటే నేను అంత అడిగానని ఇవ్వడంలేదు. నా మార్కెట్ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. నా గత చిత్రాల బాక్సాఫీసు హిట్స్ను అంచనా వేసి, పారితోషికం ఇస్తారు. అంతేకానీ నేనేదో నాకు తోచినంత అడిగి, కచ్చితంగా అంత ఇవ్వాలని ఎదురు చూడకూడదు. అంత తీసుకునే అర్హత ఉంటేనే అడగాలి. నేను అడిగే పారితోషికం సరైనదని నాకు అనిపిస్తేనే అడుగుతాను’’ అన్నారు. -
బిగ్బాస్: ఒక్క వారానికి రూ.16 కోట్లు?
బిగ్బాస్ షోకు దేశ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సల్మాన్ ఖాన్ లేని హింది బిగ్బాస్ షోను అస్సలు ఊహించుకోలేము. 2010 నుంచి దాదాపు 10 సీజన్లుగా సల్మాన్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హిందీ బిగ్బాస్ షో ఇంత విజయవంతం కావడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్బాస్ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి బిగ్బాస్ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది బిగ్బాస్ షో కోసం సల్మాన్ భారీ రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ 14వ సీజన్కి గాను సల్మాన్ ఒక్క వారానికే రూ. 16 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.(పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. అందుకే..) సీజన్ 4 నుంచి 6 వరకు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్కి సుమారు 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ని తీసుకున్నారు. అయితే సీజన్ 7కు వచ్చేసరికి దాన్ని రెట్టింపు చేసి ఒక్కో ఎపిసోడ్కు రూ. 5కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సీజన్లతో పాటు సల్మాన్ రెమ్యూనరేషన్ని కూడా భారీగానే పెంచుతూ పోయాడు. అలా సీజన్ 9 కోసం 7-8 కోట్ల రూపాయలు, సీజన్ 12లో ఎపిసోడ్కు రూ. 12 నుంచి 14 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సీజన్ 13 నాటికి మొత్తం సుమారు 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకునన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు ఈ ఏడాది బిగ్బాస్ షోను 5 వారాల పాటు పొడిగించినట్లు సమాచారం. దాంతో సల్మాన్ తన రెమ్యూనరేషన్ని కూడా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బిగ్బాస్ సీజన్ 14 నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాలు, సీరియల్స్ షూటింగ్లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బిగ్బాస్ సీజన్ 14ను తెరమీదకు తీసుకువచ్చేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తోన్నారు. సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్హౌస్లోనే ఈ బిగ్బాస్ సీజన్ 14 షూటింగ్ని నిర్వహించనున్నట్లు సమాచారం. బిగ్బాస్ 14 కోసం ఇప్పటికే ‘హమారి బహు సిల్క్’కు చెందిన జాన్ ఖాన్, ‘భబీజీ ఘర్ పర్ హై’కు చెందిన శుభంగి అత్రే, ‘తుజ్ సే హై రాబ్తా’ నటుడు షాగున్ పాండేలను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రటకన వెలువడలేదు. (బిగ్బాస్ 4 సీజన్లో సమంత?) -
పారితోషికం తగ్గించుకోవాలి
కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెద్ద స్థాయి హీరోలు, సాంకేతిక నిపుణులు వారి పారితోషికాన్ని తగ్గించుకునే ఆలోచన చేయాలని కోరుతున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇటీవల ఓ వెబి నార్లో పాల్గొన్న మణిరత్నం ఈ విషయంపై స్పందిస్తూ –‘‘థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. ఇక తన డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ గురించి మణిరత్నం మాట్లాడుతూ – ‘‘పదో శతాబ్దం నేపథ్యంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఆ కాలంనాటి సినిమా కాబట్టి పెద్ద సైన్యాలతో కూడిన యుద్ధ సన్నివేశాలు తప్పక ఉండాలి. కానీ కరోనా వల్ల ఆ సన్నివేశాల చిత్రీకరణ కుదిరేలా లేదు. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఆ వార్ సీక్వెన్స్లు ప్లాన్ చేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ముఖ్య తారాగణంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
పారితోషికంకాదు.. పార్టనర్షిప్!
‘నరసింహా, ముత్తు, దశావతారం, జై సింహా’ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్బీ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల వరకూ ఉంటుంది. విశేషమేంటంటే... ఈ సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ పారితోషికం తీసుకోవడంలేదట. ఈ సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాత వాటా తీసుకుంటారట. ఈ సినిమా చిత్రీకరణను 30 రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్ అని తెలిసింది. ఇందులో తమిళ నటులు విజయ్ సేతుపతి, పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. షూటింగ్లకు అనుమతి ఇవ్వగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ ఇప్పటికే పార్టనర్షిప్ మీదే సినిమాలు చేస్తున్నారు. కరోనా తర్వాత చిన్న సినిమాలు కూడా పారితోషికాలు కాకుండా పార్టనర్షిప్ ప్లాన్తో రూపొందుతాయా? యాక్టర్స్, డైరెక్టర్స్ పారితోషికం బదులు భాగస్వామ్యం తీసుకుంటారా? వేచి చూడాలి. -
నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బే
సంచలన హీరోయిన్ నయనతారపై వ్యతిరేకత ఎక్కువ అవుతోందా? ఆమెపై చర్యలకు నిర్మాతల సంఘం సిద్ధం అవుతోందా? అసలు ఇంతకీ నయనతార ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏమిటి? ఈ విషయాలు చర్చించే ముందు నయనతార స్థాయి ఏమిటో చూద్దాం. అయ్యా చిత్రంతో కోలీవుడ్కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ నయనతార.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లామరస్ ఇమేజ్ నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నటి స్థాయికి ఎదిగింది. అంతే కాదు దక్షిణాదిలోనే నంబర్వన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలా తన ఇమేజ్తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూపోయింది. అది ఎంత అంటే నిర్మాతలకు తడిసి మోపెడు అయ్యేంతగా. నయనతార ప్రస్తుతం రూ.6 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్ ఇది కూడా పర్వాలేదు. ఎందుకంటే నిర్మాతలు అందుకు అంగీకరించే అంత భారీ పారితోషికాన్ని ముట్టజెపుతున్నారు. అయితే దానితో పాటు ఆమె ఇతర అవసరాల ఖర్చులే భారంగా మారాయంటున్నారు. నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్ వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్మన్, హెయిర్డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్ వారందరికీ నిర్మాతనే వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి మాత్రమే రోజుకు రూ. 60 నుంచి 70 వేలు అవుతుంది. ఇవికాక నయనతార సొంత ఖర్చులకు కూడా నిర్మాతలపై మోపుతున్నట్లు, చివరికి తన వెంట వచ్చే ఆమె ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే భరించాల్సివస్తోందనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో చర్చ జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్ ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు. దీంతో ఇకపై నయనతార వంటి స్టార్ హీరోయిన్లకు కేరవాన్ల వసతి, ఇతర ఖర్చులను వారి పారితోషికాల నుంచే పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయని, కొత్త అవకాశాలు లేకపోవడంతో నిజంగా ఆమెపై వస్తున్న ఆరోపణలపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్ ఇంకా దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట. మరి దీని గురించి నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఎవరేమనుకుంటే నాకేంటి!
ఆ విషయంలో ఎవరేమనుకున్నా డోంట్కేర్ అని తెగేసిచెబుతోంది నటి రకుల్ప్రీత్సింగ్. నటిగా తక్కువ కాలంలోనే చాలా డబ్బు సంపాదించేసుకుంది. నటిగానే కాకుండా సొంతంగా జిమ్ల నిర్వహణ, వాణిజ్య ప్రకటనలు, షాపుల ప్రారంభోత్సవాలు అంటూ వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఎడాపెడా చేసేసి డబ్బు కూడపెట్టేస్తోంది. దీంతోనే అర్థం అవడంలా? ఈ అమ్మడు పక్కా కమర్శియల్ అని. తెలుగులో ఆ మధ్య క్రేజీ హీరోయిన్గా రాణించినా, ఇప్పుడు తగ్గిపోయింది. వరుస ఫ్లాప్లే అందుకు కారణం. ఇక కోలీవుడ్లో సక్సెస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఆదిలో అవకాశాల కోసం పడిగాపులు కాసిన రకుల్ప్రీత్సింగ్ను కోలీవుడ్ అసలు పట్టించుకోలేదు. తెలుగులో పేరు తెచ్చుకోవడంతో తమిళసినిమా ఆమెపై దృష్టి మరల్చింది. అయితే ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం మినహా ఇక్కడ సక్సెస్లు అందుకోలేకపోయింది. అలాంటిది తాజాగా మరో జాక్పాట్ కొట్టేసింది. అదే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్తో జతకట్టే అవకాశం.అయితే ఈ సినిమాలో నటి కాజల్అగర్వాల్ కూడా నటిస్తోంది. రకుల్ప్రీత్సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే నా హద్దు. ఇంత వరకే నేను చేయగలను అన్న నిర్ణయానికి రావడం నాకు నచ్చదు. నిత్యం కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలని కోరుకుంటాను. నిన్నలానే నేడూ జరిగితే అందులో విశేషం ఏముంటుంది. ప్రతి నిత్యం కొత్తగా ఏదో ఒకటి చేస్తాను. అదే సినిమాలో నన్ను ఇంత కాలం కొనసాగేలా చేసింది. ఆరోగ్యానికి, వ్యాయామానికి ప్రాముఖ్యతనిస్తాను. నేను భోజనప్రియురాలిని. ఎంత తింటానో, అంతగా కసరత్తులు చేస్తాను. ఇకపోతే పారితోషికం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానని చాలా మంది చెప్పుకుంటున్నారు. నాకిచ్చిన పాత్ర కోసం ఎంతగా శ్రమించాలో అంతగా శ్రమించడానికి రెడీ, ఇక పారితోషికం విషయానికి వస్తే ఎంత ఇవ్వగలరన్నది ముందుగానే చెప్పాలి. అంగీకరించిన పారితోషికాన్ని చెల్లించకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. అది నాకు నచ్చదు. పారితోషికం విషయంలో రకుల్ప్రీత్సింగ్ ఖరాఖండీగా ఉంటుంది అని చేసే విమర్శలను కేర్ చేయను అంటోంది ఈ బ్యూటీ. -
మరో వివాదంలో స్టార్ హీరో
ఇటీవల కాలంగా హీరోలు, నిర్మాతల మధ్య మాటల యుద్ధం తరుచూ జరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్లో ఈ తరహా వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. ‘నిర్మాతల నుంచి పారితోషికం వసూళు చేసుకోవటం ఎంతో కష్టంగా మారింది. కేవలం రెమ్యూనరేషన్ వసూళు చేసుకునేందుకు ఇతర పనులు వదులుకోవాల్సి వస్తుంద’న్నాడు ధనుష్. ఈ వ్యాఖ్యలపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లు కూడా ఇలాంటి ఆరోపణలు చేయటం లేదంటున్నారు. ధనుష్ నిర్మాతలకు పూర్తి స్థాయిలో సహకరించకపోవటం కారణంగానే నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు ధనుష్ సినిమాలతో నిర్మాతలకు లాభాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువన్నారు. మరి ఈ ఆరోపణలపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!
సాహో సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్, పారితోషికాలకు సంబంధించిన వార్తలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నటించిన జాక్వలిన్ ఫెర్నాండెజ్కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక్క పాటలో నటించినందుకు ఈ భామకు రూ. 2 కోట్ల పారితోషికంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఉత్తరాది నటులనే తీసుకున్న సాహో టీం, సినిమా మీద అంచనాలు మరింత పెంచేందుకు జాక్వలిన్తో స్పెషల్ సాంగ్ చేయించారు. అందుకే భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, వెన్నెల కిశోర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.