Sanga reddy
-
దేశరక్షణకు దన్ను
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కార్గిల్ యుద్ధం జరుగుతున్న రోజులవి.. కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు 1999లో సైనికులు భీకర పోరు సాగిస్తున్నారు.. రక్షణ దళాలకు అకస్మాత్తుగా ఆయుధ కొరత తలెత్తింది.. బోఫోర్స్ వంటి ఆయుధాలు అత్యవసరంగా కావలసి వచ్చింది.. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ దళాలకు ఆయుధ సంపత్తిని ఆగమేఘాల మీద అందించి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన ఘన చరిత్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఉంది. దేశ రక్షణ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఈ ఆయుధ కర్మాగారంప్రస్తానంపై.. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయుధ సంపత్తి ఇలా.. తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బీఎంపీృ2 (సారథి) వంటి ఇన్ఫ్యాంట్రీ కాంబాట్ యుద్ధ ట్యాంకులను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి బీఎంపీ యుద్ధ ట్యాంకులను సుమారు మూడు వేల వరకు ఉత్పత్తి చేసి దేశ రక్షణ రంగానికి అందించారు. భూమిమీద, నీటిలోనూ తేలియాడేలా ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ యుద్ధ ట్యాంకులతో ఏటా సమీపంలోని చెరువులో ట్రయల్రన్ నిర్వహిస్తుంటారు. కేవలం ఆర్మీకే కాదు, నౌకా దళానికి అవసరమైన సీఆర్ఎన్ృ91 వంటి నావెల్గన్లు కూడా ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంటాయి. షిప్లపై అమర్చే ఈ గన్లను సుమారు వంద వరకు ఉత్పత్తి చేశారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్స్ కోసం అవసరమైన దళాలను తరలించేందుకు అవసరమైన ప్రత్యేక వాహనాలు, మందు పాతర్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన మైన్స్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ను కూడా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్అండ్డీ విభాగం అభివృద్ధి చేసింది. సుమారు వెయ్యికి పైగా ఇలాంటి మైన్స్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ను తయారు చేసింది. 1987 నుంచి ఉత్పత్తి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనే ఇలాంటి ఆయుధ కర్మాగారాలు పనిచేశాయి. ఆ తర్వాత దేశ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ తయారీకి ఆర్డినెన్స్ కర్మాగారాలను నెలకొల్పారు. అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో 1984లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1987 నుంచి ఈ కర్మాగారంలో యుద్ధట్యాంకుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో.. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఇక్కడ సుమారు మూడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యుద్ధట్యాంకుల ట్రయల్ రన్.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన బీఎంపీృ2, బీఎంపీృ2 ఓవర్హాల్ట్ వంటి యుద్ధట్యాంకులకు 2024 డిసెంబర్ 13న కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ట్రయల్రన్ నిర్వహించారు. భూమిపైనా నీటిలోనూ నడిచే యుద్ధట్యాంకర్ల నుంచి మిసైల్ లాంచర్ సదుపాయం కూడా వీటికి ఉంటుందని ఓడీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. స్మోక్గ్రనేడ్ లాంచర్, ఆర్మర్స్టీల్తో ఆల్రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలున్న ఈ ట్యాంకుల ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. వాటిని రక్షణ శాఖకు అప్పగిస్తారు. -
‘అందుకే ఓడిపోయా’
సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. -
అమీన్పూర్లో హైడ్రా.. పలు భవనాలు కూల్చివేత
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్పూర్పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది. -
నియోజకవర్గానికో సమీకృత గురుకులం
నారాయణఖేడ్: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పేద విద్యార్థులకోసం నియోజకవర్గానికో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఖేడ్లోని గిరిజన బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో కలసి ఆయన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ 40% డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. విద్యారంగంలో జిల్లాలో నారాయణఖేడ్ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, నెహ్రూనాయక్ పాల్గొన్నారు. -
రీల్స్తో.. రప్ఫాడిస్తున్న శివరాంసాయి
సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన 12 ఏళ్ల శివరాంసాయి. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. గతేడాదిన్నరగా సోషల్ మీడియాలో సిద్దిపేట చిచ్చా పేరిట శివరాంసాయి తన రీల్స్ ద్వారా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఇన్స్టాలో సిద్దిపేట చినోళ్లు పేజీ పేరిట చేస్తున్న రీల్స్కు 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లోను ఆదరణ ఉంది. సిద్దిపేట పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా రీల్స్ చేస్తున్నాడు. హోటల్స్, బిర్యానీ పాయింట్లు, షాపింగ్ మాల్స్, వివిధ రకాల దుకాణాలకు తన రిల్స్ ద్వారా ప్రకటనలు చేస్తున్నాడు. -
పంచ్ పడితే పతకమే
హత్నూర(సంగారెడ్డి): జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్, ఉషు విభాగంలో హత్నూర మండలం సిరిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి మద్దూరి హరిప్రసాద్, ఎనిమిదో తరగతి విద్యార్థిని కాలే నాగేశ్వరి ఎంపికయ్యారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 4 వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఫైటింగ్ విభాగంలో హరిప్రసాద్ బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లా హస్తినాపూర్లో జరిగిన ఉషు అండర్–14 విభాగం రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో నాగేశ్వరి విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఇదే నెలలో పంజాబ్లో జరిగే పోటీలో కాలే నాగేశ్వరి, డిసెంబర్లో ఢిల్లీలో జరిగే పోటీల్లో హరి పాల్గొననున్నారు. -
నేనూ వస్తా బిడ్డో.. సర్కారు దవాఖానకు
సంగారెడ్డి: బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మలాంటిదంటారు. గర్భిణులకు అటువంటి బాధ లేకుండా అందరితో భేష్ అనిపించుకునే రీతిలో ప్రసూతి వైద్య సేవల్ని అందిస్తోంది సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి. ప్రసూతి సేవలతోపాటు ఇతర వైద్య సేవల్లోనూ రోగులకు కొండంత అండగా నిలుస్తూ అటు ప్రజలనుంచి ఇటు ప్రభుత్వం నుంచి ప్రశంసల్ని పొందుతోంది ఈ ఆస్పత్రి. అందుకే జిల్లా కేంద్రంలోని ఈ ఆసుపత్రికి ఇతర జిల్లాలనుంచి కూడా రోగులు, గర్భిణులు వచ్చి ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రిలో ఎంతో అనుభవం కలిగిన జనరల్ ఫిజీషియన్లు, సర్జన్లు, గైనకాలజిస్టులు రోగులకు వైద్య సేవల్ని అందిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న కీలకమైన విభాగం మాతా శిశు కేంద్రంలో నిత్యం ఎంతోమందికి కాన్పులు చేస్తారు. కాన్పుల్లో సాధారణ ప్రసవాలు కొన్ని అయితే తప్పని పరిస్థితుల్లో చేసే సిజేరియన్ ్కాన్పులు కూడా ఉంటున్నాయి.ప్రసూతి సేవలకోసం ఇతర జిల్లాల నుంచి..మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రసూతి సేవల కోసం గర్భిణులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు. అనుభవం కలిగిన గైనకాలజిస్టులు, అనస్తీషియా, చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉండటంతో అతిక్లిష్టమైన కేసుల్ని కూడా ప్రసవాలు చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నారు.సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి, ఇతర వైద్యసేవలు భేష్ప్రోత్సాహంతో మరిన్ని మెరుగైన సేవలుప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆదేశాలు, ప్రోత్సాహంతోనే ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆస్పత్రిలోని డాక్టర్లు, సిబ్బంది సమిష్టి కృషితో మెరుగైన సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కృషి చేస్తాం.– డాక్టర్ అనిల్ కుమార్, సూపరింటెండెంట్పేదలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యంపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు విద్య ,వైద్యం అందినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో మరెన్నో వైద్య సేవల్ని ప్రజలకు ఉచితంగా అందిస్తాము.– దామోదర రాజనర్సింహ .. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిఈ ఏడాది జిల్లా ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలు..నెల - సాధారణప్రసవాలు - సిజేరియన్లు - మొత్తంజనవరి - 421 - 284 - 705ఫిబ్రవరి - 331 - 273 - 604మార్చ్ - 345 - 328 - 673ఏప్రిల్ - 413 - 346 - 759మే - 401 - 381 - 782జూన్ - 300 - 345 - 645జూలై - 371 - 335 - 706ఆగస్టు - 418 - 381 - 779సెప్టెంబర్ - 358 - 354 - 712అక్టోబర్ - 459 - 377 - 836 -
గింజ కొంటే ఒట్టు..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. హత్నూర మండలం దేవులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. ఈ కేంద్రాన్ని ప్రారంభించి పక్షం రోజులు దాటుతున్నప్పటికీ ఇంకా తూకాలు ప్రారంభించలేదు. దీంతో ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన సుమారు 60 మంది రైతులు ఎప్పుడెప్పుడు కాంటాలు షురూ చేస్తారా..? అని ఎదురు చూస్తున్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం సేకరణ పట్టాలెక్కడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కాంటాలు ప్రారంభ ం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పక్షం రోజుల క్రితం ఎంతో ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించారు. కానీ వివిధ కారణాలతో తూకాలు వేయడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవానాకాలం కొనుగోలు సీజన్లో జిల్లాలో సుమారు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కనీసం 30 కేంద్రాల్లో కూడా కాంటాలు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు కేవలం 250 మెట్రిక్ టన్నులలోపే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.తేమ పేరుతో జాప్యం..ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యాన్ని తూకం వేయడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో తేమ శాతం ఎక్కువ చూపుతోంది. దీంతో గత నాలుగు రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల ధాన్యాన్ని కూడా తూకం వేయడం లేదు. మాయిశ్చర్ మీటర్తో చూస్తే తేమ 19 నుంచి 21 శాతం వరకు వస్తోందని కేంద్రం నిర్వాహకులు సాకులు చెబుతున్నారు. -
పదింతల ప్రణాళిక
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పదో తరగతిలో శతశాతమే లక్ష్యంగా విద్యాశాఖ కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఇదే కాకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.జిల్లాలో 281 పాఠశాలలుజిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 281 ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి రోజు సాయంత్రం 4:15 గంటల నుంచి 5:15 వరకు (గంట పాటు) ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు బోధించేలా నెల రోజుల పాటు నిర్వహించే తరగతుల ప్రణాళిక తయారుచేశారు. ప్రతి రోజు ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు హోం వర్క్ ఇస్తూనే, నోట్లను సరిదిద్దుతున్నారు.వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధవెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 71 శాతం నుంచి 100 శాతం మార్కులు ఉన్న విద్యార్థులు ఏ గ్రూపులో, 36 నుంచి 70 శాతం మార్కులుంటే బీ, 35 శాతం కంటే తక్కువ మార్కులు ఉన్న విద్యార్థులకు సీ గ్రూపు కేటాయించనున్నారు. వీటిలో ప్రధానంగా బీ, సీ గ్రూపులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బాలికలు, బాలురుకు వేర్వేరుగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో ప్రతి విద్యార్థి పనితీరును పర్యవేక్షించడమే కాకుండా, వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరుచుగా మాట్లాడి బోధన మెరుగయ్యేలా చొరవచూపనున్నారు. ఇదే కాకుండా పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లను సందర్శించి, విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకొని పాఠశాలకు వచ్చేలా తగుచర్యలు తీసుకోనున్నారు.వందశాతం ఫలితాలే లక్ష్యంపదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఈనెల 2వ తేదీ నుంచి సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణత చేయడమే ప్రత్యేక తరగతుల లక్ష్యం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాదించేలా కృషి చేస్తాం.– వెంకటేశ్వర్లు, డీఈఓ -
అభ్యర్ధి కోసం అన్వేషణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలో ప్రభావితం చేయగల అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ఉండటంతో అన్ని జిల్లాలను ప్రభావితం చేయగల సమర్థవంతమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తోంది. విద్యావంతులు, ఆర్థికంగా.. రెండు రకాలుగా బలమైన నేతలను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నలుగురి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పటాన్చెరుకు చెందిన పారిశ్రామికవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సీహెచ్. అంజరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విద్యావంతుడు కావడంతో పాటు, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈ నేత పేరు పార్టీ అధినాయకత్వం పరిశీనలో ఉంది. అలాగే నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నేత సత్యనారాయణగౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.రాజకీయాల్లో సీనియర్ నేత అయిన సత్యనారాయణగౌడ్ వివాద రహితుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను కమలం పార్టీ కై వసం చేసుకున్న నేపథ్యంలో ఈ టికెట్ను ఇదే ప్రాంతానికి చెందిన నేతలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్రావు పేర్లు కూడా పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.ఓటరు నమోదుపై నజర్ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న పట్టభద్రుల ఓటరు నమోదు కొనసాగుతోంది. ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా తమకు అనుకూలంగా ఉండే పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన పట్టణాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైతే మరింత విస్తృతంగా ఓటరు నమోదుపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. అయితే బీజేపీలో ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే ఈ అభ్యర్థిత్వంపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.విస్తృతమైన పరిధి..ఈ నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు ఎంపీ నియోజకవర్గాలు, 43 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో ప్రభావితం చూపగల నాయకుడిని అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే చివరకు ఈ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ ఇటు కమలం పార్టీలో నెలకొంది. -
సుడాకు సర్కార్ సై
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు మున్సిపాలిటీలు, 466 గ్రామ పంచాయతీలను ఈ సంస్థ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ది శాఖ నుంచి జీఓ నం.186ను జారీ చేసింది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలతో పాటు, 20 మండలాల పరిధిలో ఉన్న 466 గ్రామ పంచాయతీలను ఈ సుడా పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతానికి చైర్మన్గా కలెక్టర్సుడాకు ప్రస్తుతానికి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్గా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, సభ్యులుగా మున్సిపల్శాఖ, టౌన్ అండ్ కంట్రి ప్లానింగ్ డైరెక్టర్లు, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వ్యవహరిస్తారు. రానున్న రోజుల్లో ఈ సుడాకు చైర్మన్గా రాజకీయ నేతలను ప్రభుత్వం నియమించనుంది. ఈ పాలక వర్గం నియామకం అయ్యే వరకు కలెక్టర్ చైర్మన్గా ఉంటారు.సుడా పరిధి ఇలా..అమీన్పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలతో పాటు, 180 గ్రామ పంచాయతీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాలు ఏడు మండలాల పరిధిలో ఉంటాయి. ఈ గ్రామాలు, మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన జిల్లా అంతా కూడా ఈ సుడా పరిధిలోకి వచ్చింది.ప్రణాళిక బద్దంగా పట్టణీకరణపారిశ్రామికంగా వేగంగా ప్రగతి సాధిస్తున్న సంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ ఓ ప్రణాళిక బద్దంగా జరిగేలా సుడాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకపై ఈ ప్రాంతంలో ఎలాంటి పట్టణాభివృద్ది పనులు చేపట్టాలన్నా ఈ సుడా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అలాగే లేఅవుట్ల అనుమతులు, ఇతర భారీ నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక టెక్నికల్ మంజూరు ఇలా అన్నీ కూడా సుడా నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు అంశాన్ని ‘సాక్షి’ముందే చెప్పింది. ఈ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఈనెల 6వ తేదీన సమగ్ర కథనం ప్రచురితమైన విషయం విదితమే. అనుకున్నట్లుగా ప్రభుత్వం ఈ మేరకు జీఓ నం.186ను జారీ చేసింది. -
ఈడీ.. ఇటు చూస్తే..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో భూకుంభకోణాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి పెద్ద మొత్తంలో దండుకున్న అక్రమారుల్లో ఆందోళన షురువైందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపుల విషయంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఓ అధికారికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యేందుకు సహకరించిన కీలక ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములకు అన్యాక్రాంతం అయ్యేందుకు ఎన్ఓసీలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల్లో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు పరాధీనం కావడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ అధికారులు కూడా రూ.కోట్లకు పడగలెత్తారు. బినామీ పేర్లతో విల్లాలు, భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.● కంది మండలంలోని 11 గ్రామాల పరిధిలోనే 518 ఎకరాల అసైన్డ్ భూమిని ధరణిలో పట్టాభూములుగా రికార్డులను మార్చేశారు. ఈ భూదందాను ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. వెంటనే తేరుకున్న అధికారులు ధరణి రికార్డులను సరిచేసి అసైన్డ్ భూములుగా రికార్డులను సరిచేశారు. హైదరాబాద్ ఐఐటీ, ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఉన్న ఈ మండలంలో ఎకరం కనీసం రూ.ఐదు కోట్లు పలుకుతోంది. పట్టాభూములుగా మార్చడంలో వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అక్రమార్కులు కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారాన్ని జిల్లాలో పనిచేసిన వెళ్లిన కీలక ఉన్నతాధికారులు వెనకుండి నడిపించారనేది బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పుడు ఇలాంటి భూకుంభకోణాలపై ఈడీ దృష్టి సారించిందనే చర్చ జరుగుతోంది.● పట్టా భూములను నయానోభయానో కొనుగోలు చేయడం.. ఆ పట్టా భూముల సర్వే నంబర్లతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అమీన్పూర్, పటాన్చెరు, సంగారెడ్డి, జిన్నారం, కంది తదితర మండలాల్లో పరిపాటైపోయింది. పట్టాభూముల పేరుతో వెంచర్లకు, భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టి కోట్లు గడించడం పరిపాటైపోయింది. ఇలా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నప్పటికీ కళ్లు మూసుకున్నందుకు ఈ కీలక ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిసింది. జిన్నారం మండలంలో వారసులు లేని భూములను సైతం చాకచక్యంగా ధారాదత్తం చేశారు. బోగస్ వారసులను, వారికి బోగస్ ఆధార్కార్డులను సృష్టించి పట్టాలు మార్పిడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనూ ఈ అక్రమార్కులు అందిన కాడికి వెనుకేసుకున్నారు. మరోవైపు చెరువులు మింగేయడంలోనూ ఈ అక్రమార్కులు కబ్జాదారులకు వత్తాసు పలికారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఇలా రూ.వేల కోట్లు విలువ చేసే భూదందాలను వెనకుండి నడిపించిన ఈ కీలక ఉన్నతాఽధికారుల్లో భయాందోళనలు షురువయ్యాయనే ఆసక్తికరమైన చర్చ రెవెన్యూ, ఇతర అధికార వర్గాల్లో జరుగుతోంది.రామచంద్రాపురం మండలం కొల్లూరులో ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు ఎన్ఓసీలు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉస్మాన్నగర్లో ఖరీజ్ ఖాతా భూములను అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ గ్రామాలు కోకాపేట్కు అతి సమీపంలో ఉంటాయి. ఓఆర్ఆర్ పక్కనే ఉన్నాయి. ఐటీ కంపెనీలుండే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ గ్రామాల్లో పదుల ఎకరాలను బడాబాబులకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమాయలో అప్పటి అధికారులు భారీగా వెనుకేసుకున్నారనే చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విద్యార్థినులకు గాయాలు
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో నలుగురు విద్యార్థినులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (ఎంజేపీ) బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో మంగళవారం ఉదయం విద్యార్థినులు రజిత, గాయత్రీ, వసంత, తనుష్క క్రీడా జెండాలను పాతుతున్నారు.పైన 11 కేవీ విద్యుత్ వైర్లను గమనించపోవడంతో ఇనుప రాడ్ తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో విద్యార్థినులు చెల్లా చెదురుగా పడిపోయారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థినులు హుటాహుటినా మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీవో రమాదేవితోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి విద్యార్థినులను ఆస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థినులతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆర్డీవో కళాశాల ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆస్తి వివాదం.. ఆగిన అంత్యక్రియలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకుడు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
ప్రాణత్యాగాలు మరవలేం
మెదక్ మున్సిపాలిటీ : నేటి నుంచి జిల్లాలో పోలీసు అమరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్డే) దిన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలో పోలీస్ అమరుల ప్రాణత్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరుల సంస్మరణ దిన ‘పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.● ఆన్లైన్లో పోటీలువిద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషాల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నాం. ఇంటర్ విద్యార్థులకు విచక్షణతో కూడిన మొబైల్ వాడకం, డిగ్రీ, పీజీ విద్యార్థులకు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశాలపై ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి బహుమతుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం.● పోలీసులకు సైతంకానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి అధికారి వరకు సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర, ఎస్.ఐ స్థాయి, పై స్థాయి అధికారులకు దృఢమైన శరీరంలో దృఢమైన మనసు అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాం. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుంది.● రక్తదాన శిబిరాలుసైకిల్ ర్యాలీతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాం. యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అమరులను స్మరిస్తూ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తారు.● కళాబృందాల ప్రదర్శనలునేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని పలు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందంతో పాటలు పాడే కార్యక్రమాలు ఉంటాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ అమరుల బ్యానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
మూడు తరాల ఊపిరాగింది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: మద్యం మత్తు, అతివేగం.. మూడు తరాలను చిత్తు చేసింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొంది. శుభకార్యం జరిగిన కొద్ది గంటల్లోనే వారంతా అనంతలోకాల్లో కలిసిపోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఏకంగా మూడు తరాలకు చెందిన వారు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.శివ్వంపేట మండలం తాళ్లపల్లితండాకు చెందిన దనవాత్ శివరాం (55) దుర్గమ్మ(50) దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులతో పాటు పెద్దకూతురు శాంతి (35), మూడో కూతురు అనిత (30) మృతిచెందారు. వీరి కూతుళ్లు మమత(14), శ్రావణి (9), ఇందు (7) మృత్యువాతపడ్డారు.వేడుక కోసం వెళ్లి... కానరానిలోకాలకు..శివరాం, దుర్గమ్మ దంపతుల రెండో కూతురు ప్రమీల సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లితండాలో నివాసముంటున్నారు. ఎల్లమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరి గమ్యస్థానానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. ఇందులో మృత్యువాత పడిన ఇందు ఎనిమిదో తరగతి, శ్రావణి ఐదో తరగతి చదువుతోంది.అతివేగమే ప్రాణాలు తీసిందా..కారు అతివేగంగా నడపడంతోనే అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి అక్కడే ఉన్న బ్రిడ్జి మీద నుంచి కాలువలో పడింది. ఈ ఘటన జరిగినప్పుడు కారు వెనుక నుంచి శివరాం కుమారుడు మరో కారులో వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు వాగులో పడిన విషయాన్ని గమనించి వారు అటువైపు వెళ్తున్న వాహనదారుల సహాయంతో కారులో ఉన్న నామ్సింగ్ను బయటకు లాగారు. మిగతా వారిని కూడా లాగేందుకు ప్రయత్నించగా డోర్లు ఓపెన్ కాలేదు. జేసీబీని తీసుకు వచ్చి కారును బయటకు తీయగా అప్పటికే ఏడుగురు విగత జీవులయ్యారు.మిన్నంటిన రోదనలుమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్త బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
దొంగలు బీభత్సం
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడ, కమాన్, నిజాంపేట గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దసరా సెలవుల సందర్భంగా తాళం వేశారు. సోమవారం పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడానికి రాగా గది తాళం పగులగొట్టి ఉంది. టీవీ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఆరుట్ల అరుణకు తెలిపారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అలాగే, చల్మెడ కమాన్ వద్ద గల ఓ దాబాలో గది తాళాలు పగులగొట్టి రూ.10వేలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని క్లూస్టీం సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించారు.తాళం వేసిన ఇంట్లోసిద్దిపేటరూరల్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన ఘటన మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాచాపూర్ గ్రామానికి చెందిన కోరె దేవయ్య శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఆదివారం తిరిగి ఇంటికొచ్చాడు. తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించి లోపకి వెళ్లి చూడగా బీరువా తెరిచి బట్టలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉన్న 2 తులాల నెక్లెస్, మరో 3 తులాల బంగారు అభరణాలు, 100 తులాల వరకు వెండి అభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.బట్టల షాపులో చోరీకౌడిపల్లి(నర్సాపూర్): తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ ఘటన మండల కేంద్రమైన చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం మేరకు.. కౌడిపల్లి గ్రామానికి చెందిన దేవిచంద్ బట్టల షాపు ఉండగా పైఅంతస్తులో కుటుంబ సభ్యులు ఉంటారు. ఆదివారం షాపు బంద్ చేసి గేట్కు తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ వెళ్లాడు. రాత్రి చూడగా ఇంట్లో ల్యాప్టాప్, మైబెల్ ట్యాబ్ కనిపించలేదు. ఇంటి పక్కన బల్డింగ్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యాసంగి ప్రణాళికలు సిద్ధం
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా యాసంగి పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2,05,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. గతేడాది కంటే సుమారు 10 నుంచి 15 వేల ఎకరాల సాగు పెరగనుంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు కురువకపోవడం, చివర్లో అధికంగా పడడంతో పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. దీంతో యాసంగి సాగు, దిగుబడులపై రైతులు ఎంతో ఆశగా ఉన్నారు.పెరగనున్న పంటల సాగు..ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో యాసంగి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అన్నింటికంటే వరి, శనగ పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వరితో పాటు జొన్న, మొక్కజొన్న, గోదుమ, చెరుకు, తెల్లకుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ తదితర పంటలు గతేడాది కంటే అధికంగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, చెక్డ్యాంలు, బావులు నీటితో నిండిపోయాయి. భూగర్భజలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో అన్నిరకాల పంటలు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది యాసంగిలో జిల్లాలో 1,91,639 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,05,000 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. అయితే వర్షాలు అధికంగా పడడంతో రానున్న పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు.ఎరువుల అంచనా..జిల్లాలో పంటల సాగు అంచనాతో పాటు సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికలు సైతం అధికారులు సిద్ధం చేశారు. అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు అవసరం అయ్యే ఎరువుల వివరాలను అంచనా వేశారు. యూరియా 18,413 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,308 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 4,343, కాంప్లెక్స్ 14,300, ఎస్ఎస్పీ 3,660 మెట్రిక్ టన్నులు అవసరం అని భావిస్తున్నారు. అక్డోబర్లో యూరియా 9,542 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,901, ఎంఓపీ 612, కాంప్లెక్స్ 4,407, ఎస్ఎస్పీ 433 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.ప్రణాళికలు సిద్ధం చేశాంజిల్లాలో యాసంగి సీజన్లో భాగంగా పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేశాం. గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరగే అవకాశాలు ఉన్నాయి. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు కూడా అంచనా వేశాం. రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు పొందాలి.– శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ
దుబ్బాక: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంతి పూల తోట ఉయ్యాలో.. ఇద్దరక్కజెళ్లెల్లు ఉయ్యాలో.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రకృతి సహజసిద్ధంగా లభించే గడ్డిపూలను దైవంగా కొలిచే సంస్కృతి ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించదు. పెత్తర అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణలో అతి పెద్ద పండుగ. ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల, ముద్దప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో పండుగా ముగుస్తుంది.● సద్దుల బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ పండుగ చివరగా తొమ్మిదో రోజున సద్దులు (పెద్ద బతుకమ్మ)కు ఈ పండుగలో ప్రత్యేకత. మహిళలంతా నేడు ఘనంగా జరుపుకోనున్నారు. గునుగు పూలు, తంగేడు, బంతి, చిట్టి చామంతి, గడ్డిపూలతోపాటు వివిధ రకాల పూలతో అందంగా పోటాపోటీగా పెద్ద బతుకమ్మను పేర్చి, తోడుగా చిన్న బతుకమ్మ, పక్కనే గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ పండుగకు ఎంత దూరంలో ఉన్న వారైనా తప్పకుండా సొంత గ్రామాలకు వచ్చి పండుగలో పాలుపంచుకుంటారు.● ఖండాంతరాలు దాటితెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ నేడు దేశ ఎల్లలు, ఖండాంతరాలు దాటి జరుపుకుంటున్నారు. విదేశాల్లో ఏళ్ల నుంచి స్థిరపడ్డ ప్రజలు బతుకమ్మ పండుగలను ఆయా దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. అమెరికా, ఇంగ్లాండ్, గల్ఫ్ దేశాల్లో, సింగపూర్తోపాటు చాలా దేశాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటుండటం విశేషం.79 ఏళ్లయినా ఆడుతున్నా..బతుకమ్మ చాలా గొప్ప పండుగ. ఆడపడుచుల ఆరాధ్య దైవం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లలు చాలా సంబురపడుతారు. నేను ఇప్పుడు 79 ఏళ్లకు వచ్చిన, ప్రతీయేటా తప్పకుండా బతుకమ్మను పేర్చుతా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పిన. నేను మా తల్లి గారిల్లు మిరుదొడ్డిలో పుట్టి పెరిగా, 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా.– బిల్ల సరోజన, దుబ్బాకఘనంగా జరుపుకుంటాంసద్దుల బతుకమ్మ పండుగను ప్రతీయేటా ఘనంగా జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇండ్లన్నీ ఆడబిడ్డలు, పిల్లలతో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతీ సంవత్సరం చాలా సంతోషాన్ని నింపుతుంది.– ఎర్రగుంట సుజాత, కవయిత్రీ లచ్చపేటపెద్దగా పేర్చేటోళ్లంమేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను చాలా పెద్దగా పేర్చేటోళ్లం. బతుకమ్మ పండుగకు ఒక రోజు ముందుగానే అడవికి పోయి మోపులకొద్ది గునుగ పువ్వు కోసుకొచ్చెటోళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు.అ ప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.– స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్–బీదర్ రహదారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించిందిఈ ప్రమాదంలో మరణించిన వారిని తండ్రి, కుమార్తె, అల్లుడు, మనువడిగా గుర్తించారు. వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
Ameenpur: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు.అమీన్పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్న చాకలి అరుణ్కుమార్, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్చెరులోని బీడీఎల్ కంపెనీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. సీఐఎస్ఎఫ్ఎస్ యూనిట్ లైన్ బ్యారెక్లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్గా గుర్తించారు. కాగా వెంకటేష్ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్ వచ్చి సీఐఎస్ఎఫ్ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అధికారంలోకి వచ్చాక, మంచినీళ్ల కష్టం వచ్చిందని విమర్శించారు. ఎక్కడ పోతే ఎక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం లేదని దుయ్యట్టారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా అని ప్రశ్నించారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలోఎమ్మెల్యే హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒకరేమో దేవుని చూపించి ఓట్లు అడుగుతున్నారు..ఇంకొకరమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహాంకారంతో ఉన్నారని, వారిని భూమి మీదకు దించాలని పేర్కొన్నారు. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు.. తెలంగాణ భవిష్యత్కు జరుగుతున్న ఎన్నికలు ఇవని అననారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సంగారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయన్నారు. సభా స్థలికి ఐదుకిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన విధించనున్నారు. మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని పోలీసులు పేర్కొన్నారు. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’ ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన వివరాలు 10 గంటలకు పటాన్చెరు చేరుకోనున్న ప్రధాని మోదీ. 10:40కి పటేల్గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11:20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. పటాన్ చెరులో ప్రధాని పర్యటనకు చకచక సాగుతున్న ఏర్పాట్లు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ. సంగారెడ్డి వేదికగా రూ. 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్గా చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా రూ. 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన. మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన. -
సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
Updates: గంజి మైదాన్లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు. ►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు. ►ఆ తర్వాత రోజే మాట మార్చాడు. ►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్ను గెలిపించింది. ►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది ►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. ►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం. ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం. ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం. ►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం. ►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు. ►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా. ►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి. ►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా? ►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి. ►సంగారెడ్డిలోని గంజి మైదాన్లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది. -
సంగారెడ్డిలో కలకలం.. విష్ణువర్ధన్ అనుమానాస్పద మృతి!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డిలో అదనపు కలెక్టర్ వద్ద పనిచేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. ఇక, విష్ణువర్ధన్కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇది కూడా చదవండి: భార్య దారుణ హత్య, కోమాలో భర్త.. ప్రేమ వ్యవహారమే కారణం! -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత జూలై 26న క్యాంపస్కు వచ్చినట్లు చెబుతున్నారు. ఒరియా భాషలో రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు విషయంలో ఒత్తిడికి గురి కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివాహితకు కూల్డ్రింక్లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి... -
సాఫ్ట్వేర్ ఉద్యోగికి కుచ్చుటోపి.. ఏకంగా 46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
సాక్షి, సంగారెడ్డి: కమీషన్ పేరిట ఆశ చూపి సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీంతో భారీ నగదు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీపూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి జూన్ 28న పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్కు స్పందించాడు. అందులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో సైట్ నిర్వాహకుడు అతడికి ఒక వాలెట్ ఐడీ ఇచ్చారు. అందులో ఉద్యోగి ముందుగా రూ.2 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేస్తున్నాడు. కాగా తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు తనకిచ్చిన వాలెటఖలె చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పు చేసి, జాబ్లోను ద్వారా మొత్తంగా 35 దఫాలుగా రూ.46 లక్షలు చెల్లించాడు. సైబర్ నేరగాళ్లు ఉద్యోగితో నగదు పెట్టిస్తూ తనకు ఇచ్చిన వాలెట్లో నగదుతోపాటు కమీషన్ నగదు చూపించారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమిషన్ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్లకు అమ్మేసిన బ్రోకర్ -
మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, సంగారెడ్డి జిల్లా: 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని తెలిపారు. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. గురువారం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినట్లు చెప్పారు. పటాన్చెరులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడస్తున్నాయన్నారు. పటాన్చెరుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని, మూడు మున్సిపాల్టీలకు రూ. 30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో తీసుకొచ్చాం. 15 రోజుల్లోనే అనుమితచ్చేలా చర్యలు చేపట్టాం. అధికారుల టేబుల్పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1000 ఫైన్ వేస్తున్నాం. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉండటం తెలంగాణకు గర్వకారణం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే.. -
పెళ్లిళ్లలో ఇప్పుడిదే ట్రెండ్ భయ్యా.. హాలులోకి ప్రవేశించే ప్రదేశంలో
వివాహ వేడుకల్లో హంగు, ఆర్భాటాలు ప్రదర్శించడం చూస్తుంటాం.. కానీ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల వివాహ వేడుకల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి మండపంలో మహనీయుల పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంబేడ్కర్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే, భగత్సింగ్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రముఖుల సాహిత్య రచనలకు సంబంధించిన పుస్తకాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యే బంధుమిత్రులు ఈ పుస్తక ప్రదర్శనను వీక్షించి, తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుంటున్నారు. కొందరు ఈ పుస్తకాలను వధూవరులకు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. ఫంక్షన్హాలులోకి ప్రవేశించే ప్రదేశంలో ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా పుస్తకాలను వీక్షిస్తున్నారు. సాక్షి, సంగారెడ్డి: అందోల్ పట్టణానికి చెందిన తలారి లక్ష్మణ్ రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తన కూతురు వివాహాన్ని బౌద్ధమత ఆచారం ప్రకారం ఘనంగా నిర్వహించిన లక్ష్మణ్, ఈ వివాహ వేడుకలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సమతా సైనిక్ సేవాదళ్లో పనిచేస్తున్న జహీరాబాద్కు చెందిన ఎర్రోళ్ల విష్ణు తన వివాహ వేడుకలో కూడా ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాడు. అందోల్కు చెందిన ఆది తక్షక్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా కూడా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయించారు. ఆసక్తి పెరిగేలా.. సోషల్ మీడియా ప్రభావంతో చాలా మందిలో పుస్తక పఠనాసక్తి తగ్గిపోతోంది. పుస్తక ప్రదర్శనలకు గానీ, బుక్ స్టాల్కు గానీ వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆదర్శభావాలు ఉన్న వారు వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా పుస్తకాలపై మళ్లీ ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. వివాహ వేడుకలకు వందలు, కొన్ని చోట్ల వేలల్లో హజరవుతుంటారు. ఈ ప్రదర్శనలతో కొందరిలోనైనా పుస్తకాల పట్ల ఆసక్తి కలిగేలా చేసినా చాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పుస్తకం ఆయుధం లాంటిది పుస్తకం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఒక ఆయుధం లాంటిది. వివాహ వేడుకలకు బంధుమిత్రులు, సన్నిహితులు.. అందరూ హాజరవుతారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా వారిలో మహనీయుల పుస్తకాలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. అందుకే నా కూతురు వివాహంలో ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను. – తలారి లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అందోల్, సంగారెడ్డి జిల్లా నా మ్యారేజీ నుంచే మార్పురావాలని సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత పుస్తకాలు చదవడం మానేశారు. మహనీయుల పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. సన్మార్గంలో నడిచేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటి పుస్తక ప్రదర్శన కల్చర్ పెరగాలని కోరుకుంటున్నాను. నా మ్యారేజీ నుంచే ఈ మార్పు రావాలని భావించి పెళ్లిలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను. – ఎర్రోళ్ల విష్ణు, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా ఫోన్ చేస్తే వెళ్లి స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం బుక్స్టాల్ ఏర్పాటు చేయాలని ఎవరైనా 9848397857 నంబర్కు ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి ఏర్పాటు చేస్తున్నాము. మహనీయుల జీవిత చరిత్రలు, సాహిత్య రచనలు.. ఇలా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతాము. వివాహాలతోపాటు, ఇతర శుభకార్యాలకు చెప్పినా వెళ్లి పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం. – నగేశ్, పుస్తక ప్రదర్శన నిర్వాహకులు, సంగారెడ్డి -
ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్నగర్కు చెందిన ప్రణయ్కుమార్రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది. -
ఇంటి అవసరాలకు.. ఆపై గ్రిడ్కు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల గృహాలకు సౌరవిద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్లో తమ గృహావసరాలకు పోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా వీరు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందేలా చూడొచ్చని, అలాగే, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించవచ్చని భావిస్తోంది. ఈ సౌర విద్యుత్ ఫలకలను బిగించుకునేందుకు డాబా ఇళ్లు ఉన్న ఎస్హెచ్జీ మహిళలను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోంది. ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆయా మహిళలకు స్త్రీ నిధి ద్వారా రుణాలను ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు కిలోవాట్ల యూనిట్లను మంజూరు చేయనుంది. దీనికి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి (టీఎస్రెడ్కో) నుంచి సబ్సిడీ వస్తుంది. మండలానికి 35 యూనిట్లు మొదట ఒక్కో మండలానికి 35 సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నారు. స్వయం సహాయక కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించే వారిని, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సభ్యులను వీటికి ఎంపిక చేస్తున్నారు. నెలకు 200–300 యూనిట్ల విద్యుత్ వాడుకునే వారు ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్ యూనిట్లకు నెట్ మీటర్లు బిగించి పవర్ గ్రిడ్కు అనుసంధానిస్తారు. సొంత అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్కు నిర్ణీత ధర చొప్పున గ్రిడ్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. విద్యుత్ను విక్రయించగా వచ్చే ఆదాయంతో సభ్యులు ఐదేళ్లలో రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 ఏళ్ల వరకు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయని, ఐదేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాం. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాన్ని స్త్రీనిధి ద్వారా అందించనున్నాం. సభ్యులు ఈ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అలాగే, వాడుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా నెలవారీ ఈఎంఐలు సులువుగా కట్టవచ్చు. –సీహెచ్ శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
తెలంగాణ.. తొలి శాసనం.. 600 ఏళ్ల క్రితమే ‘తెలంగాణ పురం’ ప్రస్తావన
సాక్షి, సంగారెడ్డి: ప్రతీ ఊరుకూ.. ప్రతీ పేరుకూ ఓ చరిత్ర ఉంటుంది. దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలనే తపనా ఉంటుంది. తెలంగాణ పేరు, పుట్టుక వెనుక ఉన్న చరిత్రపై అనేక అధ్యయనాలు జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణ అన్న పేరు వెనుక ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. దాదాపు ఆరువందల ఏళ్ల క్రితం నాటి ఓ శిలాశాసనంలో తెలంగాణపురం ప్రస్తావన బయల్పడింది. శాసనాల సేకరణలో భాగంగా రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తిరుగుతూ ఆర్కియాలజీ అధికారులు వివరాలు సేకరించేవారు. అందులో భాగంగానే 1986లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో పురావస్తు శాఖకు చెందిన ముఖ్య అధికారి ముకుందరావు ఓ శిలాశాసనాన్ని గుర్తించారు. ఇందులో తెలంగాణపురం ప్రస్తావన ఉంది. అయితే దాని గురించి లోతైన అధ్యయనం జరగలేదు. కేవలం ఆ శాసనంలో ఉన్న వివరాలను ఆర్కియాలజీ విభాగంలో నోట్ చేశారు. 1999 తర్వాత చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, జితేంద్రబాబు, బ్రహ్మచారి తదితరులు ఈ శిలాశాసన చరిత్రను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పున:ప్రతిష్ఠ శిలా శాసనంలో తెలంగాణ పురం ప్రస్తావన వెలుగుచూసిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2008 సంవత్సరంలో ఈమని శివనాగిరెడ్డి, జితేంద్రబాబులతో కలిసి తెల్లాపూర్ను సందర్శించారు. అప్పటికే దిగుడుబావి పూర్తిగా పూడుకుపోయింది. కొన్ని మెట్లు మాత్రమే కనిపించాయి. రాతి స్తంభాలు కూడా పడిపోయే దశకు చేరాయి. దిగుడుబావి చుట్టూ అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఒక విధంగా ఆ పరిసరాలన్నీ నిరాదరణకు గురయ్యాయి. దీనికి చలించిపోయిన కవిత తన సొంత డబ్బు ఖర్చు చేసి పొడవాటి స్తంభాల మధ్యలో శిలాశాసనం ఉండేలా పునరుద్ధరణ పనులు చేయించింది. మహబూబ్నగర్ జిల్లా జటప్రోలుకు చెందిన శంకర్రెడ్డి శిల్పుల బృందం ఈ మరమ్మతు పనులు చేశారు. వనం చెరువు ఇదే.. లోతైన పరిశోధనలు జరగాలి స్వరాష్ట్రంలోనైనా తెలంగాణ చరిత్రపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. శాసనం వెలుగుచూసిన 15 సంవత్సరాల వరకూ పునరుద్ధరణ చర్యలేవీ చేపట్టలేదు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తెల్లాపూర్ పరిసరాల్లో చారిత్రక ఆధారాల సేకరణకు ప్రయత్నాలు జరగాలి. దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా గ్రామపంచాయతీగా ఉన్న తెల్లాపూర్లో 2018 లో కొల్లూరు, ఉస్మాన్నగర్, ఈదులనాగుపల్లి, వెలిమల గ్రామపంచాయతీలను కలుపుకొని మున్సిపాలిటీగా అవతరించింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డులు ఉన్నాయి. ఐటీ హబ్ దగ్గరలో ఉన్న తెల్లాపూర్ దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లతో నగరీకరణను సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో తెల్లాపూర్ ఉంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేరు మార్చాలి తెలంగాణ రాష్ట్రంలోనైనా తెలంగాణ పదం తొలిసారి వెలుగుచూసిన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. తెల్లాపూర్ పేరును తెలంగాణ పురంగా మార్చేందుకు మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ కాపీని ప్రభుత్వానికి పంపాలని చరిత్రకారులు కోరుతున్నారు. 2012లో మల్లేపల్లి సోమిరెడ్డి తెల్లాపూర్తెల్లాపూర్ సర్పంచ్గా కొనసాగిన కాలంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంతో తెల్లాపూర్ గ్రామపంచాయతీ పేరును తెలంగాణపురంగా మార్చాలని తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపారు. అప్పటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణపురం పేరు మార్పుపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గ్రామపంచాయతీ కాస్త మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. అప్పుడు తెల్లాపూర్ సర్పంచ్గా సోమిరెడ్డి ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన సతీమణి లలిత ఉన్నారు. ఈమె హయాంలోనైనా పేరు మార్పుకు మున్సిపల్ తీర్మానం చేస్తారా చూడాలి. పురం అంటే.... పురం అంటే...పట్టణం కంటే పెద్దది. శాసనంలో ప్రస్తావించినట్టు తెలంగాణపురం నాటి కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండవచ్చు. హైదరాబాద్ మహానగరం కంటే ముందే ఈ ప్రాంతం విరాజిల్లినట్టు భావిస్తున్నారు. దిగుడు బావి, ఏతం పదాలు నాటి వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఏర్పాటు చేసుకున్నారని అర్థం చేసుకోవచ్చు. శాసనంలో ఏముందంటే... శక సంవత్సరం 1340లో శ్రీ హేవళాంబి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం రోజున ప్రతిష్టించిన శిలాశాసనం.. మన కాలమాన లెక్కల ప్రకారం చూస్తే 1417–18గా చెప్పవచ్చు. విశ్వకర్మలలో ముఖ్యుడైన రుద్రోజు సిరిగిరోజు దీనిని రాయించినట్టు ఆ శాసనంలో ఉంది. ఆ రోజుల్లో పాలనా వ్యవహారాల్లో ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ బాధ్యతలు విశ్వకర్మలే చూసేవారు. దిగుడుబావి..సమీపంలో మామిడితోపు, ఏతం అమరికకు ఏర్పాటు చేసి రాతి స్తంభాలు తదితర వివరాలతో పాటు.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్షా తన సురతాణి(భార్య)తో కలిసి పానగల్లు కోటకు వెలుతున్న క్రమంలో మార్గమధ్యలో తెలంగాణపురం (నేటి తెల్లాపూర్ మున్సిపాలిటీ)లోని మామిడితోటలో విడిది చేశారని, ఆ సమయంలోనే విశ్వకర్మ శిల్పులు ఫిరోజ్షా భార్యకు బంగారు ఆభరణాలు బహుమతిగా అందజేసినట్టు ఆ శాసనంలో పొందుపరిచి ఉంది. దీనిని తెలంగాణపురం ప్రస్తావన ఉన్న తొలి శాసనంగా చరిత్రకారులు ప్రామాణికం చేశారు. ఇంకా తెలంగాణ గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే...కాకతీయ రాజు ప్రతాపరుద్ర గణపతి క్రీస్తుశకం 1510 వేయించిన వెలిచెర్ల శాసనంలోనూ ‘తెలంగాణ’ మాట ఉంది. దీనిని రెండో చారిత్రక ఆధారంగా పేర్కొనవచ్చు. ఈ ఆధారాలు సరిపోవా ? తెల్లాపూర్ నాటి తెలంగాణపురం అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణపురం పేరు ఉన్న శాసనం తెల్లాపూర్లోనే వెలుగుచూసింది. ఆ శాసనంలో లిఖించబడిన కాలం, రాజు పేరు ఆనాటి బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్షా కాలానికి సరిపోతున్నాయి. శాసనంలో పేర్కొన్న విధంగా వనం చెరువు కూడా తెల్లాపూర్లోనే ఉంది. చరిత్రను ముందుతరాలకు అందించాలి తెలంగాణ శాసనమున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షిత కట్టడంగా ప్రకటించాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయాలి. మన చరిత్రను ముందుతరాలకు అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. – ఈమని శివనాగిరెడ్డి, చరిత్ర పరిశోధకుడు -
హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సును హైదరాబాద్ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్వీవైఆర్ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఐఐటీలో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్రాఘవన్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్ మూర్తి, ఎస్వీవైఆర్ఐ సంస్థ ప్రతినిధులు -
పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోతరాజు అవతారం ఎత్తారు. ఆయన తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోతురాలు రాహుల్ను కలిశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్కు వివరించారు. ఈ క్రమంలో పోతరాజుల నుంచి కొరడా అందుకున్న రాహుల్ దానితో కొట్టుకున్నారు. రాహుల్ చేసిన విన్యాసానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. మరోవైపు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతోంది.. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారురు. ఏఐసీసీ, రాష్ట్ర అగ్రనేతలు ఆయన వెంట నడుస్తున్నారురు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించగా.. బీహెచ్ఈఎల్ లింగంపల్లి వద్ద కాంగ్రెస్ ముఖ్యనేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, పటాన్చెరు మీదుగా ముత్తంగి వరకు సుమారు 11 కి.మీ పాదయాత్ర కొనసాగింది. చదవండి: రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులు -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్స్టేషన్కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు : జగ్గారెడ్డి
-
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్గౌడ్, అస్లంఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్పల్లి అని, మరోసారి బాలానగర్ అని చెబుతోందన్నారు. జహీరాబాద్కు ఎలా వచ్చింది.. ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. చదవండి: అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్ -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. -
పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు
సాక్షి, హైదరాబాద్: పింఛన్ కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధురాలికి వింత అనుభవం ఎదురైంది. పింఛన్ మంజూరైందో, లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తే ఆన్లైన్లో ఆమె చనిపోయినట్లుగా ఉందన్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన బుడిగె వెంకటనర్సమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో ఆ జాబితాలో తన పేరు ఉందో లేదో తెలు సుకునేందుకు కుమారుడు నరేష్తో కలిసి వెంకటనర్సమ్మ శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. వెంకటనర్సమ్మ ఆధార్ కార్డు నంబర్ను కార్యదర్శి సౌమ్య ఆన్లైన్లో ఎంటర్ చేయగా ఆమె చనిపోయినట్లుగా చూపించింది. అనంతరం మీసేవ, మండల పరిషత్ కార్యాలయాల్లో విచారిస్తే.. అక్కడెక్కడా ఆ ధ్రువీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆన్లైన్లో మాత్రం మరణించినట్లుగా నమోదై ఉండడంతో వెంకటనర్సమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను బతికే ఉన్నానని, పింఛన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటోంది. చదవండి: Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
మీకు తమాషాగా ఉందా.. మంత్రి హరీశ్రావు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: ‘కార్పొరేట్ ఆస్పత్రిలో మాదిరిగా అన్ని సౌకర్యాలున్నాయి. 55 మంది డాక్టర్లు.. 56 మంది నర్సులు పనిచేస్తున్నారు. కానీ, బెడ్ ఆక్యుపెన్సీ రేషియో మాత్రం 25 శాతమా? జనవరిలో 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్లో 49 శాతం.. డాక్టర్లు ఫుల్.. పేషెంట్లు నిల్’అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.20.50 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రి భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం వైద్యుల పనితీరుపై హరీశ్రావు సమీక్షించారు. ఆయా వైద్య విభాగాల అధిపతులతో ముఖాముఖి నిర్వహించి వైద్యుల పనితీరు తక్షణం మెరుగుపరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ముగ్గురు గైనకాలజిస్టులు నెల మొత్తానికి చేసిన డెలివరీలు కేవలం మూడు. ఎంబీబీఎస్లు పనిచేసే పీహెచ్సీల్లో రోజుకు నాలుగైదు డెలివరీలు అవుతున్నాయి. నలుగురు వైద్యులు నాలుగేళ్లుగా విధులకు హాజరుకావడం లేదు. అయినా ఎందుకు పేరోల్ (వేతనాల జాబితా)లో ఉంచారు’అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించేందుకు శంషాబాద్లో మరో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వైద్యులతో ముఖాముఖి సాగిందిలా.. మంత్రి: నమస్కారం డాక్టర్ పద్మజగారూ.. గైనకాలజీ విభాగంలో ఎంతమంది ఉన్నారు.. జూలైలో ఎన్ని డెలివరీలు చేశారు. డాక్టర్ పద్మజ: ముగ్గురు డాక్టర్లం ఉన్నాం సర్, మూడు ఆపరేషన్లు చేశాం. మంత్రి: నీ వేతనం ఎంత చెప్పమ్మా.. నాకు నెలకు రూ.రెండు లక్షలు.. మీకు ఎంత? డాక్టర్ పద్మజ: రూ.1.90 లక్షలు సర్. మంత్రి: ముగ్గురు గైనకాలజిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలున్నా పనిచేయకపోతే మిమ్మల్ని ఏమనాలి? డాక్టర్ పద్మజ: గతంలో ఇక్కడ బాగా పనిచేశాం సర్. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లడ్ నిల్వలు లేవు. మంత్రి: నార్మల్ డెలివరీ చేయడానికి బ్లడ్ ఎందుకమ్మా? అవసరం పడితే పక్కనే ఉన్న పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో భారీగా రక్తం నిల్వలున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నెలకు 700 డెలివరీలు చేస్తున్నారు. అనస్తీషియా డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ ఉన్నారు. గైనకాలజిస్టులున్నారు. కానీ, ఒక్క డెలివరీ చేయకపోతే అందరూ ఎందుకమ్మా? డాక్టర్ పద్మజ: ఇకపై బాగా పనిచేస్తాం సర్, డెలివరీలు చేయడం ప్రారంభిస్తాం. మానవత్వం ఉండాలి మంత్రి: ఆర్థోపెడిక్ విభాగంలో ఎంతమంది ఉన్నారు? జూలైలో ఎన్ని ఆపరేషన్లు చేశారు. డాక్టర్ నీరజ: ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు సర్. మంత్రి : అల్ట్రాసౌండ్ ఉంది. డిజిటల్ ఎక్స్రే ఉంది. రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. కానీ, జూలైలో ఒక్క ఆపరేషనూ చేయలేదు. ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ రోజుకు ఎన్ని ఆపరేషన్లు అవుతున్నాయో చూద్దాం. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల కోసం కనీసం పనిచేయరా? మానవత్వం ఉండాలమ్మా.. డాక్టర్ నీరజ : ఇకపై చేస్తాం సర్.. ఇది కూడా చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్! -
పుంజుకుంటున్న బీజేపీ.. ఆ సమస్య మాత్రం తీరడం లేదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న బీజేపీ ఉమ్మడి జిల్లాలో బలమైన నేతల చేరికలపై దృష్టి సారించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ తయారైంది. ఆ కేడర్ను నడిపించగలిగే సత్తా ఉన్న నేతల కోసం అన్వేషణ మొదలైంది. ► జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్లో బీజేపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. ► ఆయా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండడంతో ఆనియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం అయిన దాఖలాలు లేవు. ► జీహెచ్ఎంసీలో పట్టు సాధించిన బీజేపీ పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం ఒకరిద్దరు బలమైన నాయకులు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఘాటైన విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టగలిగే సత్తా ఉన్న నేతలు లేరు. ► అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ.. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోనూ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. ► కొన్నినెలల క్రితం ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈపాదయాత్రలో నాయకత్వ లోపం స్పష్టంగా బహిర్గతమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. క్షేత్రస్థాయిలో ‘శక్తి’ కేంద్రాలు.. ► జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న కమలదళం క్షేత్రస్థాయిలో మాత్రం బాగా బలపడింది. ► శక్తి కేంద్రాల నుంచి మొదలుకుని మండలస్థాయి వరకు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ► బూత్స్థాయిలో కనీసం ఐదు నుంచి 15 మంది వరకు క్షేత్రస్థాయి కార్యకర్తలతో పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ► ఇందులో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జాతీయ అధినాయకత్వం సైతం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బూత్, గ్రామస్థాయి కమిటీల నియామకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చింది. అంతర్గత కుమ్ములాటలు.. ► కాస్త బలమైన నాయకత్వం ఉన్న ఒకటీ, రెండు నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు బీజేపీ అగ్ర నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ► పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్గౌడ్, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గోదావరి అంజిరెడ్డి మధ్య సఖ్యత లోపించింది. ► ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీ కేడర్లో ఉన్న గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. గురువారం జరిగిన ఆందోల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ జెడ్పీ చైర్మన్ బాలయ్య వర్గాలు బాహాబాహీకి దిగాయి. ► ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి గోవింద్ ఎదుటే రెండు వర్గాల నాయకులు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడం గందరగోళానికి దారితీసింది. -
జహీరాబాద్ రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీ ఒకరు సజీవ దహనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఉదగిర్ వెళ్తున్న టాటా ఏస్ ట్రక్ను, ఆ వైపుగా ముంబయి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదవశాత్తు ట్రక్కు, బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ సజీవ దహనం కాగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పెను పెను ప్రమాదం తప్పింది. -
వివాహిత అదృశ్యం.. ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి..
సంగారెడ్డి అర్బన్: వివాహిత అదృశ్యమైన సంఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని దంపతులు పట్టణ పరిధిలోని భవానీనగర్లో నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 10 తేదీన ఆంజనేయులు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. చదవండి: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు: కీలక విషయాలు వెలుగులోకి.. తిరిగి ఇంటి వచ్చేసరికి ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి నందిని వెళ్లిపోయింది. బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 94906 17010, 0845527633 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. ప్రజలు ఆ పార్టీపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ నేతలది నరుకుడు ఎక్కువ.. పని తక్కువ. వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తేసి సిలిండర్ ధరను రూ. వెయ్యికి పెంచారు. ఎన్నికలప్పుడు పెట్రో ధరలను తగ్గించి ఆ తర్వాత లీటరుకు రూ. వంద దాటించారు. పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు’ అని మంత్రి హరీశ్రావు బీజేపీపై మండిపడ్డారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్తోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలపై తెలంగాణ బీజేపీ నేతలు బదులివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దళితబంధు లబ్ధిదారులకు ఆయన యూనిట్లను పంపిణీ చేశారు. వైన్ షాపుల గల్లాపెట్టెపై దళితులు.. దళితుల సంక్షేమం కోసం దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తోందని హరీశ్రావు చెప్పారు. ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టులు, మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులతోపాటు మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, దీంతో దళితులు వైన్ షాపుల గల్లాపెట్టె మీద కూర్చొనే అవకాశం కలిగిందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో దళితబంధుకు రూ. 17,800 కోట్లు కేటాయించామని, ఈ పథకం ద్వారా ఈ ఏడాది 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మండలి మాజీ ప్రొటెంౖ చెర్మన్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డికి జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని అన్నారు. అయితే రేవంత్రెడ్డికి దమ్ముంటే తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని చాలెంజ్ చేశారు. తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే.. సమాధానం చేబుతానని అన్నారు. తనను సస్పెండ్ చేస్తే.. రోజుకో బండారం బయటపెడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి పార్టీ లైన్లో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానని అన్నారు. -
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్హౌజ్లో 17 ఏళ్ల యువకుడు గన్తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్హౌజ్లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
సంగారెడ్డిలో ఎయిర్ గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్లో ఎయిర్ గన్ పేలింది. పిల్లలు గన్తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప గాయపడింది. దీంతో బాలికను హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! అయితే చికిత్స పొందుతూ తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు పఠాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తి ఫామ్ హౌజ్లో సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
వివాహేతర సంబంధం.. ఇద్దరిని ఓకే ఇంట్లో చూడటంతో..
సాక్షి, పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది. ఈ ఘటనలో భార్య పద్మతో పాటు మరో ఇద్దరిని రిమాండ్కు తరలించారు. పటాన్చెరు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలసి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భీంరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చక్రపురి కాలనీలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో తీవ్రగాయాలతో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో అమీన్పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య భర్త కనిపించడం లేదని చందానగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడాన్ని అమీన్పూర్ పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా భాసీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్ప(39) కూలి పని చేసుకుంటూ చందానగర్లో భార్య పద్మతో నివాసం ఉంటున్నాడు. బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద అడ్డపై కూలి పనికి వెంకటప్ప వెళ్తుండగా, భార్య ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే సెంట్రింగ్ పని చేసుకునే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడు వెంకటప్పను రహమాన్ తనతో పనికి తీసుకెళ్లేవాడు. చదవండి: ప్రేమ పేరుతో కూతురు పరువు తీస్తోందని... ప్రియుడితో కలిసి తల్లి.. పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఒక రోజు ఇంట్లో పద్మ, రహమాన్ ఇద్దరిని చూసిన వెంకటప్ప భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో పద్మ భర్త అడ్డు తొలగించాలని రెహమాన్కు తెలపింది. దీంతో రెహమాన్ అతడితో పనిచేసే సుభాష్తో కలసి వెంకటప్ప అడ్డు తొలగించుకునేందుకు ప్లాస్ వేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 8వ తేదీన వెంకటప్పను కొల్లూరు దగ్గర పని ఉందని చెప్పి రెహమాన్, సుభాష్లు వెంకటప్పను స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లాక పని ఈ రోజు లేదని చెప్పి మద్యం సేవించడానికి ఆలూర్ వెళ్లి బాగా తాగారు. తిరిగి అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి అక్కడ వెంకటప్పకు మరో సారి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటప్పను అమీన్పూర్ పరిధిలోని చక్రపూరి కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్దబండ రాయితో వెంకటప్ప తల, మొఖంపై కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు మృతుడి భార్య పద్మ, అబ్దుల్ రెహమాన్, సుభాష్లను రిమాండ్కు తరలించారు. వారు వాడిన స్కూటీని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐ సోమేశ్వరి, అమీన్పూర్ కానిస్టేబుళ్లు రాములు, మహేందర్ను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్ -
వేరే వర్గానికి చెందిన యువకుడితో కూతురు ప్రేమ.. ప్రియుడితో కలిసి తల్లి..
సాక్షి, జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో జరిగిన ఈ సంఘటనను పోలీసులు సవాలుగా తీసుకుని రెండు రోజుల్లోనే ఛేదించారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందన్న కోపంతో కన్నతల్లే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుగ్గెల్లికి చెందిన గడ్డం బుజ్జమ్మకు కూతురు మౌనిక (16), కొడుకు సురేశ్(22) ఉన్నారు. కూతురు జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె తమ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లి, అన్నకు తెలియడంతో ఆమెను మందలించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం వల్ల పరువు పోతుందని ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆ బాలిక ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దాంతో పరువు పోతుందని భావించిన బుజ్జమ్మ కూతురిని హతమార్చాలనుకుంది. చదవండి: 10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య అంతా పథకం ప్రకారమే..: ఈ నేపథ్యంలో బుజ్జమ్మ కాశీంపూర్కు చెందిన తన ప్రియుడు నరసింహులుతో చర్చించి ఇద్దరూ కలసి కూతురిని హత్య చేయడానికి పథకం రచించారు. ప్రియుడితో పెళ్లి జరిపిస్తామని తల్లి బుజ్జమ్మ, నరసింహులు మౌనికకు చెప్పి ఆదివారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత అనుకున్న పథకం ప్రకారం.. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా నరసింహులు బాలిక మెడకు చున్నీ బిగించి ప్రాణం తీశాడు. అనంతరం గ్రామస్తులను నమ్మించేందుకు కూతురు తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. తర్వాత మౌనిక మృతి విషయం వెలుగులోకి రావడంతో తన కూతురును ప్రేమించిన యువకుడే హత్య చేశాడని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తల్లే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహులు, బుజమ్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రవిగౌడ్ను డీఎస్పీ అభినందించారు. చదవండి: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా? -
ఇక్రిశాట్లో ఆసక్తికర ఘటన.. శనగకాయలు తిన్న ప్రధాని మోదీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి, రామచంద్రాపురం: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇక్రిశాట్ పరిశోధనల పురోగతిని వారు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శనగ, వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాలను పరిశీలించారు. అక్కడ సాగవుతున్న శనగ పంటను చూసి కాయలను కోసుకొని రుచి చూశారు. స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. చదవండి: 20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర రూ.100 మాత్రమే! -
ఐఐటీ హైదరాబాద్లో కోవిడ్ కలకలం.. 123 పాజిటివ్ కేసులు
సాక్షి, సంగారెడ్డి/ఆదిలాబాద్/ఖమ్మం: సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాబారిన పడినవారిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి కరోనా సోకింది. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా, ఏడుగురు ఫ్యాకల్టీలు, ఆరుగురు ఇతర ఉద్యోగులున్నారు. ఈ నెల తొలి వారం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీకి వచ్చారు. ఐదో తేదీన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప లక్షణాలుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో రెండుడోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉన్నవారినే క్యాంపస్లోకి అనుమతించారు. అయినా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు, వారి కుటుంబీకులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన శాఖలో 8 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. పోలీసుశాఖలో ఇద్దరు సీఐలకు కరోనా వచ్చింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు సహా 15 మంది సిబ్బం ది కరోనా బారినపడ్డారు. మంచిర్యాల పోలీసు స్టేషన్లో బుధవారం 97 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా, ట్రాఫిక్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చింది. ఖమ్మం వన్టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం సీఐ సహా పదిమంది కరోనా బారిన పడ్డారు. -
చర్చిని దర్శించుకొని వస్తుండగా..
సాక్షి,కౌడిపల్లి(సంగారెడ్డి): క్రిస్మస్ పండగ సందర్భంగా దైవ దర్శనం కోసం మెదక్ చర్చికి వెళ్లి స్కూటీపై తిరిగి వస్తున్న ముగ్గురు యువకులను కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం 765డి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై శివప్రసాద్రెడ్డి వివరాల ప్రకారం నర్సాపూర్ మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన అరిగె కిష్టయ్య, మంజుల కుమారుడు రంజిత్(19) జక్కపల్లి మోడల్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వరసకు బావమరిది అయిన షాపూర్నగర్కు చెందిన పవన్, వరసకు తమ్ముడయిన ఆనంద్తో కలిసి శుక్రవారం ఇంట్లో చెప్పకుండా స్కూటీపై మెదక్ సీఎస్ఐ చర్చిని సందర్శించేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కౌడిపల్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన ఆనంద్, పవన్ను చిక్తిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సకాలంలో రాని 108 వాహనం ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న పీర్లతండా సర్పంచ్ భర్త గణేష్ బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన గంట వరకు వాహనం రాలేదని, సకాలంలో వచ్చి ఉంటే రంజిత్ బతికేవాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 108 సిబ్బందిని సంప్రదించగా, డీజిల్ అయిపోవడంతో రావడం ఆలస్యమైందని తెలిపారు. చదవండి: ‘నేనేం పాపం చేశానమ్మా’.. ముళ్లపొదల్లో నెలలు నిండని శిశువు మృతదేహం -
‘నన్ను క్షమించు... మిస్ యూ సో మచ్ లవ్ యూ..’
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): పెళ్లయిన ఆరునెలల నుంచే భర్త అనుమానంతో వేధించడంతో ఓ వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిత్యం అనుమానిస్తుండడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ గూడూరి సంతోష్ కుమార్ వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(22)ని పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రమేష్(24)తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. తర్వాత రోజూ భర్త అనుమానిస్తుండడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు చెప్పుకునేది. భర్త నుంచి వేధింపులు ఎక్కవ కావడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పెద్దాపూర్కు చేరుకొని బోరున విలపించారు. చదవండి: క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి సూసైడ్ లెటర్ కలకలం... ‘‘అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించండి. నా భర్త రమేష్... నాపై అనుమానంతో రోజు నరకం చూపుతున్నాడు. తట్టుకోలేక చనిపోతున్నా. రోజు నా ఫోన్ చెక్ చేయడం చేస్తున్నాడు. అందుకే చనిపోతున్న. అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించు. మిస్ యూ సో మచ్ లవ్ యూ. మీ బుజ్జీ’’. అంటూ లెటర్ ముగించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: ఆస్తి కోసం పేగు బంధాన్ని మరిచిన కూతురు.. కన్న తల్లిని కిరాతకంగా చంపి.. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణాలు ఇవేనా?
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్ కాలనీలో అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రకాంత్రావు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా భార్యాపిల్లలు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విదితమే.. అనేక సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రకాంత్రావు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. చంద్రకాంత్రావు దుండిగల్లోని ఇంజనీరింగ్ కళాశాలలో 2004 – 08లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. చదవండి: కాపురానికి రానందని కాటికి.. అప్పు తీర్చడానికి మరిన్ని అప్పులు గతంలో పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. 3, 4 ఏళ్ల క్రితం అమెరికాకు పోయేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాని కోసం క్రెడిట్ కార్డులను వాడి సకాలంలో కట్టకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి మనోవేదనకు గురయ్యాడు. వాటిని తీర్చే క్రమంలో మరిన్ని అప్పులు చేయడం, సిబిల్ స్కోర్ దెబ్బతినడంతో మరింత ఆవేదనకు గురయ్యాడు. అదే సమయంలో రుణాలు తీసుకొని స్థానికంగా ఓ ఇంటిని నిర్మించాడు. కోవిడ్ కారణంగా అద్దెకు ఎవరూ రాకపోవడంతో ఆర్థికంగా మరింత దెబ్బతిన్నాడు. అతడి భార్య తండ్రి సైతం ఆర్థిక సహాయాన్ని అందించాడు. సమస్యలు చుట్టుముట్టడంతో చంద్రకాంత్రావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నాలుగు నెలల క్రితం ఈ సమస్యలు ఎక్కువగా ఉండేవని, అప్పుడున్నంత ఒత్తిడి ఇప్పుడు లేదని, భార్యాపిల్లలతో చంద్రకాంతరావు ఎంతో ఆనందంగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అతడికి లేదని, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని, ఆపదలో ఉన్నప్పుడు తోచిన సహాయం చేశామని అంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఏం జరిగిందో తెలియదని, తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన లావణ్య, పిల్లలు జోగిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి వీరి మృతదేహాలను విద్యుత్నగర్ కాలనీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలను రామచంద్రాపురంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. కాగా శనివారం రాత్రి మృతురాలు లావణ్య తండ్రి పోలీసులకు తన కూతురి మరణానికి అత్తామామలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇలా ఏ కుటుంబంలో జరగవద్దు: చంద్రకాంతరావు స్నేహితుడు చంద్రకాంతరావు అందరితో స్నేహంగా ఉండేవాడు. నాలుగైదు నెలల క్రితం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాడు. స్నేహితులం సహాయ సహకారాలు అందించాం. ఈ మధ్యకాలంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కూడా చెప్పాడు. చెప్పిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం బాధాకరం. ఇలా చేసుకునే ముందు భార్యాపిల్లలు, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండు. -
‘పనికిరాని వారంతా తొడలు కొడుతున్నారు’
సాక్షి,జహీరాబాద్( హైదరాబాద్): టీఆర్ఎస్ పార్టీలో పనికి రాని వారంతా తొడలు కొడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు వారి తొడలు వంచే సమయం రాబోతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం జహీరాబాద్లో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జె.గీతారెడ్డికి నిర్వహించిన సన్మాన సభలో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతల తొడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంటూ వస్తోందన్నారు. కాంగ్రెస్తో లబ్ధి పొందిన వారే బయటకు వెళ్లి కాంగ్రెస్ను ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకుని కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ పాద యాత్ర ఎందుకు నిర్వహిస్తున్నాడో, ఎవరి కోసం నిర్వహిస్తున్నాడో చెప్పాలన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు భయడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అప్పుడు వేధిస్తున్న పోలీసుల గురించి ఆలోచిద్దాం అన్నారు. ఎన్నికలు వచ్చాక మంత్రి హరీశ్రావు గురించి ఆలోచిద్దామన్నారు. చదవండి: మీ ఓటు రూపాయి బొట్టు బిళ్లకా? ఆసరా పెన్షన్కా? -
విహారయాత్రలో విషాదం
సాక్షి, కోహీర్(జహీరాబాద్): విహారయాత్రలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన మండలంలోని చింతల్ఘాట్ చౌరస్తా వద్ద 65 నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై చల్లా రాజశేఖర్ అందించిన సమాచారం ప్రకారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష(26) అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె స్నేహితులు శైలు, దివిజ, శివ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం, చిన్న గడవెల్లి గ్రామ నివాసి పినిశెట్టి సత్యనారాయణ కూతురు అనూష హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. ఆమె తన మిత్రులు శైలు, దివిజ, శివతో కలిసి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో దుర్ఘటన జరిగింది. మరో గంటలో గమ్యాన్ని చేరుతారనగా చింతల్ఘాట్ గ్రామ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న అనూష తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారు వెనకసీట్లో కూర్చున్న శైలు, దివిజ కారు నడుపుతున్న శివ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడం, లారీని రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని మృతురాలి తండ్రి సత్యానారాయణ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చదవండి:Viral Video: ఫ్యాన్ మీద పడింది.. బుడ్డోడు బచాయించాడు -
బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు
సాక్షి, సంగారెడ్డి: బార్షాప్ల లైసెన్స్లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ మూడో వేవ్ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా భయం వెంటాడుతోంది ► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. ► డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్ను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్ మూడో వేవ్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ► బార్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్శాఖ కమిషనరేట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ► జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. ► జీహెచ్ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్ను దక్కించుకొని ఎక్సైజ్ ట్యాక్ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్లలో ఒక్కో బార్ మంజూరైంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్పూర్ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్లు మంజూరు చేసింది. ► జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. ► మెదక్ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్కు మంజూరైన బార్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’ -
డీజే సౌండ్ డబ్బుల చెల్లింపు గొడవ.. అందుకే
సాక్షి, హత్నూర(సంగారెడ్డి): డీజే సౌండ్ డబ్బుల చెల్లింపు విషయంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చందాపూర్కు చెందిన కర్రె నగేష్ కుమారుడు కర్రె మధు కుమార్(21) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న బోనాల పండుగ సందర్భంగా అద్దెకు తీసుకున్న డీజే సౌండ్ సిస్టం విషయంలో డీజే యజమాని పల్పనూరి మధుతో మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన మధుకుమార్ శనివారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి తండ్రి కర్రె నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. -
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పుల్కల మండంలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వారి వివరాలు.. 1) హోసన్న గోని దీవెన భర్త లూకా (41), గ్రామము రంగంపేట కొల్చారం మండలం. 2) లూకా తండ్రి నారాయణ (44), గ్రామము రంగంపేట కొల్చారం మండలం.3) బుర్ర అంబదాస్ తండ్రి శాకయ్య (33), గ్రామం సంగాయి పేట్ కొల్చారం మండలం. 4) బుర్ర వివేక్, (6) తండ్రి అంబదాస్ సంగాయి పేట్ కొల్చారం మండలం. 5) డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తాగుడుకు బానిసైన భర్త.. సహనం కోల్పోయి ముగ్గురు పిల్లలతో కలిసి..
సాక్షి, నారాయణఖేడ్( సంగారెడ్డి): తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక నాగల్గిద్ద మండలంలోని మోర్గి గ్రామానికి చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు నాగల్గిద్ద ఎస్ఐ విజయరావు బుధవారం తెలిపారు. మనూరు మండలం డోవూరు గ్రామానికి చెందిన వినోదకు నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన సంజీవ్కుమార్తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు అంకిత (8), అర్చన (6), అరుణ్ (5). వినోద జూలై 28న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని అత్తతో చెప్పి వెళ్లింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారిన విచారించినా తల్లీపిల్లల ఆచూకీ లభించలేదు. వినోద తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళతో అసభ్యకర ప్రవర్తన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఇండికేటర్ వేసినా ఫలితం లేదు.. వీళ్లు మారరా?
రోడ్డుపై అతి వేగం ప్రమాదకరం అని, నెమ్మదిగా వెళ్లాలని తెలిసినా కొంత మంది మారడం లేదు. రద్దీ రోడ్లపై, కూడళ్లలో ఇండికేటర్లు వేసినా పట్టించుకోకుండా వెనుక నుంచి ఓవర్ టేక్ చేసుకుంటూ ఓవర్ స్పీడ్లో వెళ్లిపోతున్నారు. సంగారెడ్డిలో ఈ ఓవర్ స్పీడ్ వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరు గాయాలపాలవుతూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి నుంచి బైక్పై వెళ్తున్నారు. కొత్త బస్టాండ్ దగ్గర ఇండికేటర్ వేసి టర్నింగ్ తీసుకుంటుండగా, వెనుక నుంచి ఇద్దరు స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టారు. అసలే ఒకరికి కాలు విరిగి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా.. వేరొకరి అతివేగం వల్ల ఆ వ్యక్తి మళ్లీ గాయాలపాలయ్యాడు. -శివప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
ఆలయాల అభివృద్ధికి కృషి: మంత్రి హరీశ్రావు
సాక్షి, సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక శాఖమంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. ఉదయం జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండలం కేతకీ సంగమేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయానికి నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో దేవాలయాల నిధులు.. ప్రభుత్వాలు వాడుకున్నాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులు ఆలయాలకు ఇస్తున్నామన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదవండి: తెలంగాణకు రూ.1,336 కోట్లు.. ఏపీకి రూ.1,810 కోట్లు దేవాలయాల్లో పని చేసే అర్చకులకు ఏడాదకి రూ.110 కోట్లు జీతాలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్కి నీళ్లు ఇమ్మని త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. వైశ్యులకు ముఖ్యమంత్రి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు. గోవులను కాపాడాలి, నిత్యం పూజించాలి మంత్రి పిలుపునిచ్చారు. సీఎం వైశ్యులు కి సముచిత స్థానం కల్పిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు. గోవులను కాపాడాలని, నిత్యం పూజించాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యే -
అయ్యో.. అనసూజ
సాక్షి, సంగారెడ్డి : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడి తీరనిశోక సంద్రంలో ఉండగానే చికిత్స పొందుతున్న మరొకరు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో చోటుచేసుకుంది. జొన్న రొట్టె తిని మరణించిన విషాద ఘటనలో అనుసూజ మృతి చెందడంతో మృతులసంఖ్య ఐదుకు చేరింది. పల్వట్ల గ్రామంలో మఠం శంకరమ్మ అంత్యక్రియలకు వచ్చిన కొడుకులు, కోడళ్లు ఈ నెల 21న జొన్న రొట్టెలు చేసుకొని తిన్న ఐదుగురిలో చంద్రమౌళి, శ్రీశైలం, సుశీల ముగ్గురు మృతి చెందిన విసయం తెలిసిందే. (చదవండి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి) చికిత్స తీసుకుంటున్న ఇద్దరిలో బీబీఆర్ ఆస్పత్రిలో ఉన్న అనుసూజ(48) గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటంబం మరింత శోకసంద్రంలో మునిపోయింది. సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని, ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దినకార్యం ముగియకముందే.. ఇటీవల మృతి చెందిన ముగ్గురి దినకార్యం కూడా పూర్తి కాకముందే మరో చావు కబురు వినడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటువంటి గోస పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. -
మంజీరలో ఏఓ గల్లంతు?
మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డిలోని రైతు శిక్షణకేంద్రంలో అరుణ(34) ఏఓగా పనిచేస్తోంది. గురువారం సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్కు వస్తున్న క్రమంలో మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరలోకి దూకి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు నారాయణఖేడ్ మండలం పైడిపల్లిలోని వరుసకు తమ్ముడైన పవన్కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనవద్ద ఉన్న టీఎస్15 ఈడీ0403 కారులో యువతి హ్యండ్బ్యాగు, చెప్పులు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున ఎస్ఐ నరేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారితో విచారించారు. ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో తమ్ముడు శేరి శివకుమార్ ఫిర్యాదుమేరకు గల్లంతు కేసుగా నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి ఖేడ్ సీఐ రవీందర్రెడ్డి, రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు చేరుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు. అలుముకున్న విషాదఛాయలు అరుణ గల్లంతుతో ఖేడ్లో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈమె గతంలో మనూరు, నారాయణఖేడ్, కల్హేర్ ఏఓగా పనిచేసింది. 2016లో మోర్గికి చెందిన శివశంకర్తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు రుద్రవీర్, 11 నెలల విరాట్ ఉన్నారు. -
పరువు హత్య
-
కలకలం రేపిన పరువు హత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రణయ్ పరువు హత్యకేసు ఇంకా మరువకముందే.. జిల్లాలో మరో పరువు హత్య సంచలనం కలిగించింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని గురువారం రాత్రి యువతి తరపు కుటుంబీకులు, బంధువులు అతి కిరాతకంగా హత్యచేసి ఈ జిల్లాలో పడేయడం సంచలనం రేపింది. నగరానికి శివారులో ఉండడంతో.. హైదరాబాద్ నగరానికి జిల్లా శివారులో ఉండడంతో హత్యలు చేయడానికి, హత్యలు నగరంలో చేసి మృతదేహాలు ఇక్కడ పడేయడానికి నిందితులు ఇక్కడ స్థలాన్ని ఎంచుకుంటున్నారు. చందానగర్కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి తరపు కుటుంబీకులు, బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు, కుటుంబీకులు అదను చూసి గురువారం మధ్యాహ్నం అవంతిని, హేమంత్ను కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారు. (ప్రేమే నేరమా..!) ఈ క్రమంలో మార్గమధ్యలో అవంతి కారులోనుంచి తప్పించుకుంది. హేమంత్ను మాత్రం సంగారెడ్డి సమీపంలోని హైదరాబాద్–బీదర్ జాతీయ రహదారి మార్గంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొండాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కిష్టయ్యగూడెం ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హేమంత్ను నగరంలోనే హత్య చేసి ఇక్కడికి తెచ్చి పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా..? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ.. పరువు హత్యలే కాకుండా పాత కక్షలతో జిల్లాలో హత్య చేయడమో..ఇతర ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాలను పడేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఐదు నెలల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తిని అతని బంధువులే పటాన్చెరు సమీపంలోగల రుద్రారం పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై నరికి చంపారు. -
సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
-
బట్టలు ఉతకడానికి వెళ్లి.. ఇద్దరు యువతుల మృతి
సాక్షి, సంగారెడ్డి : బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు మృతి చెందారు. ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలపూర్ చిన్న తండాలో కూలీలుగా నివాసముంటున్న నలుగురు యువతులు బట్టలుతకడానికి వెళ్లారు. ఉతకడం పూర్తి అయ్యాక చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని రక్షించాలని ప్రయత్నించి చెరువులో పడిపోయిన మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. మృతులు మహబూబ్ నగర్కు చెందిన వలస కూలీలు చిట్టి(20) అలియాస్ అశ్విని, వరలక్ష్మి (19)గా గుర్తించారు. వీరితో వెళ్లిన మరో ఇద్దరు శిల్ప, జ్యోతిల అరుపులు విని చెరువు పక్కన ఉన్న పరిశ్రమల్లో పనిచేసి కార్మికులు వచ్చి రక్షించారు. విషయం తెలుసుకున్న అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరువు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు. ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం రసాయన పరిశ్రమలు వ్యర్ధ జలాలను ఒక్క చుక్క కూడా బయటకు వదలకూడదు. ఇందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు అంగీకార పత్రాన్ని కాలుష్యం నియంత్రణ మండలికి ఇస్తాయి. అయినా తప్పు జరిగితే జరిమానాలు కడితే సరిపోతుంది కదా అన్న ధోరణితో పరిశ్రమలు కాలుష్య జలాలు విడుదల చేస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల అవినీతి సమస్యను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య జలాల కారణంగా చేపలు సరిగా ఎదగని పరిస్థితితో పాటు చేపలు ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ విభాగాలు కొన్ని కాలుష్యం కారకులకే వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాలుష్యం బారిన పడే చెరువులకు చేప పిల్లలు ఇవ్వమని చెబుతున్న మత్స్యశాఖ తీరును గతంలో మత్స్యకారులు ఎండగట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని చెరువుల వివరాలు వెల్లడించిందని అందులో పేర్లు లేకుంటేనే చేప పిల్లలు ఇస్తామన్న రీతిలో మత్స్యశాఖ వ్యవహరించింది. నిజానికి ఇక్కడ తప్పు చేస్తున్నది రసాయన పరిశ్రమలు, కాలుష్యాన్ని నియంత్రించకుంటే సంబంధిత పరిశ్రమలను మూసివేయాలి కానీ ఇక్కడ తప్పు చేస్తున్న పరిశ్రమలను వదిలేసి చెరువులకు చేపలు ఇవ్వటం మానేస్తున్నారని మత్సకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలు, అధికారుల తీరు మారాలని మత్సకారులు కోరుతున్నారు. కాలుష్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ సమయాల్లో సంబంధిత అధికారులు విచారణ, తనిఖీలు అంటూ హడావిడి చేసి అనంతరం సమస్యను మరుగున పడవేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల చిత్తశుద్ధితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. -
ఏ మాత్రం అర్థం లేదు: మంత్రి హరీశ్రావు
-
కొత్త విధానానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు
-
వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు
సాక్షి, సంగారెడ్డి : లాక్డౌన్ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, పోలీస్టేషన్ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్లో భూపాల్రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్కు అనుమతి) మరోవైపు భూపాల్రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని ఆ పత్రిక పేర్కొంది. ఇక తాజా వివాదంపై నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ , రక్త దానం చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. -
మున్సిపాలిటీలు దేశానికి ఆదర్శం కావాలి
సాక్షి, సంగారెడ్డి : తెలంగాణలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలని దీని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ‘పట్టణ ప్రగతి సమ్మేళనం’ (అవగాహన, సన్నాహక సమావేశం) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీలో 60 మంది సభ్యులుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు. ప్రతినెలా మున్సిపాలిటీలకు నిధు లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చేయడమే మీముందున్న సవాలన్నారు. లంచం లేకుండా పనులు జరగాలి.. ఒక్క రూపాయి లంచం లేకుండానే ప్రజలకు పనిచేసి పెట్టాలని హరీశ్ సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం పకడ్బందీగా ఉందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చివరకు తానైనా పనిచేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. పేదలు 75 గజాలలోపు ఇళ్లు కట్టుకుంటే ఎలాంటి అనుమతి, ఫీజు అవస రం లేదన్నారు. చెత్త సేకరణ పద్ధతులు, తది తర అంశాలపై ఎన్జీవో ప్రతి నిధి శాంతి, సా హస్ సంస్థ ప్రతినిధి మహేశ్ తడి–పొడి చెత్త సేకరణ పద్ధతులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్లు పాల్గొన్నారు. -
ఫలించిన హరీష్ వ్యూహాలు.. కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే మధిర, కొత్తగూడెం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కారు పార్టీ.. తాజాగా వెలువడిన ఫలితాల్లో మరిన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. రెండు మున్సిపాలిటిల్లోనూ జగ్గారెడ్డికి ఓట్లర్లు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ విజయ దుందుబీ మోగించింది. మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. నారాయన్ఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఫలితాలపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ చాణక్యం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డిలో ఇప్పటి వరకు టీఆర్ఎస్కు మంచి ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. అయినా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ బరిలోకి దిగింది. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి, సదాశివపేట బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీష్ మొదటి నుంచీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనికి తగట్టుగానే హస్తం అభ్యర్థులను మట్టికరిపిస్తూ సంగారెడ్డిపై గులాబీ జెండా ఎగరేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు. — Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ -
కేటీఆర్కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యంతరకరంగా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్ స్థాయికి, కేటీఆర్ స్థాయికి పోలిక ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రధాని పదవిని వద్దని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, కేటీఆర్ను ఆయనతో పోల్చడం సరికాదని అన్నారు. కేటీఆర్ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు అని హితవుపలికారు. మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు మానుకోవాలని లేకపోతే, తాము కూడా అదే తరహలో ప్రతి విమర్శలు చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. గాంధీభవన్లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన విమర్శించారు. డబ్బు, పోలీస్, ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ విరివిగా వాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుంటే వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ చేయలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు నోటీఫికేషన్కు కనీసం వారం పది రోజులు వ్యవధి ఉండాలి. ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్కు అమ్ముడు పోయారు. ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ సర్కార్ చెప్పగలదా. సంగారెడ్డికి మంచి నీటి ఇబ్బందులకు మంత్రి హరీష్ రావు ప్రధాన కారణం. మా నియోజకవర్గ ప్రజల మంచినీటి కష్టాల గురించి మాట్లాడని హరీష్.. స్కూల్స్ లో పిల్లలను లెక్కలు అడుగుతున్నారు. సర్కార్ బడుల్లో పిల్లల చదువులు అద్వాన్నంగా ఉన్నాయని చెప్పే పనిలో హరీష్ ఉన్నారు. ప్రవేటు స్కూల్స్ తరుపున హరీష్ పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.