science
-
సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్లోని దానాపూర్కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు
మానవజాతి ఉనికికి, పురోగమనానికి మహిళ పాత్ర కీలకం. ఆ మాటకొస్తే ఏ జాతి ప్రగతికైనా స్త్రీ పురుషుల భాగ స్వామ్యం తప్పనిసరి. కానీ అనాదిగా స్త్రీ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. ఇది ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. అందుకు సైన్సు కూడా మినహాయింపు కాదు. అవధులు లేని అభివృద్ధిని సాధించామనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా మహిళ వివక్షను, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఉంది. విజయాలందుకొంటూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిలో తనదైన ముద్రను కనబరుస్తూనే ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేని సమాజాన్నెలా ఊహించుకోలేమో, ఆమె చేయూత లేని సైన్సు అభివృద్ధి కూడా ఊహాతీతం. నూరేళ్ల చరిత్ర కలిగిన నోబెల్ బహుమతులకు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేయటంలో కూడా ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్నేళ్లయినా సైన్సులో నోబెల్ బహు మతి వచ్చిన మహిళలు రెండు పదులకు మించి లేరు. రెండు సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి సైతం ఈ ప్రతికూలతను ఎదుర్కొంది. 1903లో తొలుత పియరీ క్యూరీ, హెన్రీ బెక్రెల్ల పేర్లే ఎంపికయినాయి. పియరీ దాన్ని తిరస్కరించటంతో ఆ తర్వాత మేరీతో కలసి వారు నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేటి శాస్త్ర రంగాన్ని అత్యంత గణనీయంగా ప్రభావితం చేసినది వాట్సన్, క్రిక్ల డీఎన్ఏ నిర్మాణ డిస్కవరీ. ఇంత గొప్ప ఆవిష్కరణలో కీలక పరిశోధన లు అందించిన మహిళ రోజాలిండ్ ఫ్రాంక్లిన్కు నోబెల్ బహుమతి దక్కలేదు. డీఎన్ఏ నిర్మాణాన్ని కళ్లకు కట్టి చూపిన ఆమె ఎక్స్రే ఫొటో (ఫొటో నం. 51)నే ఆధారమన్న సంగతి మరచి పోలేని నిష్ఠుర సత్యం.ఈ డిస్క వరీ అనేకానేక విజ్ఞాన శాస్త్ర రంగా లకు ప్రాణం పోసింది. నేడది డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చటమే కాకుండా, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన శిలాజాల నుండి సంగ్రహించిన డీఎన్ఏ నమూనాలతో సరి కొత్త శిలాజ జీనోమిక్ శాస్త్ర విజ్ఞా నానికి నాంది పలికింది. ఆ పరిశో ధనలు చేసిన స్వాంటే పేబో వంటి శాస్త్ర జ్ఞులకు నోబెల్ బహుమతిని అందించింది కూడా.క్రోమోజోమ్లపై జన్యువులు ఒక స్థానం నుండి మరొక స్థానానికి దూకుతాయన్న ‘దూకుడు జన్యువుల’ డిస్కవరీ జన్యు శాస్త్రాన్ని గొప్ప మలుపు తిప్పింది. జెనెటిక్ ఇంజనీరింగ్లో కొత్త ప్రక్రియలకు పునాది వేసింది. దీనిని కనిపెట్టింది కూడా బార్బరా మెక్లింటాక్ అనే గొప్ప మహిళా శాస్త్రవేత్త. ఈ డిస్కవరీకి తానొక్కతే నోబెల్ బహుమతి మొత్తాన్ని గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమె. ఏ జన్యువు ఎప్పుడు పని చేయాలో, ఎక్కడ ఆగిపోవాలో అనేది పరిణామంలో ఒక పజిల్. ఈ డిస్కవరీలో పరిణామ జీవ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. విద్యాధికులూ, శాస్త్రవేత్తలూ మాత్రమే గొప్ప ఆవిష్కరణలు చేస్తారని సాధా రణంగా అనుకుంటాం. ఇందుకు భిన్నంగా ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి చదువు కూడా పెద్దగా లేని మహిళ మేరీ యానింగ్ శిలాజ విజ్ఞాన శాస్త్ర వేత్తగా ఎదిగి జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది. బ్రిటన్ లైమ్రెజిస్ ప్రాంతపు సముద్ర తీరంలో పర్యాటకులకు గవ్వలమ్ముకుని జీవించే సాదా సీదా అమ్మాయి యానింగ్. పన్నెండేళ్ల వయసులోనే ఇక్తియోసార్ పుర్రెను వెలికి తీయటంలోతండ్రికి తోడ్పడింది. ఒకప్పుడు నీళ్లలో నివసించిన సరీసృపాల జాతికి చెందిన శిలాజానికిది నిదర్శనం. ఆమె కృషి పట్టుదలతో వెలికి తీసిన అనేక శిలాజాలు జీవులు పరిణామం చెందు తాయన్న ఆలోచనలకు బలం చేకూర్చాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఆమె కనిపెట్టిన శిలాజాలు పరిపుష్టం చేశాయి. అందుకే ఆమె ప్రపంచంలో తొలి మహిళా శిలాజ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించింది. బ్రిటన్లో శాస్త్రవేత్తలకిచ్చే అత్యున్నత పురస్కారా లను సైతం ఈ సామాన్య యువతి అందుకుంది. అవాంతరాలు, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా మహిళ సాధించలేనిది లేదని చెప్ప డానికివి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలే. సైన్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే పురుషులతో సమా నంగా మహిళల భాగస్వామ్యాన్ని సాధించాలి.శాస్త్ర రంగంలో భారతదేశపు పరిస్థితి, మహిళల ప్రాతి నిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 2005లోనే సైన్స్రంగంలో మహిళలపై భారత ప్రభుత్వ (డీఎస్టీ) నియమించిన నిపుణుల కమిటీ కూడా మహిళలు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని తేల్చింది. డాక్టరేట్లు చేసిన మహిళలు శాస్త్ర సంస్థలు, యూనివర్సిటీ సిబ్బందిలో అతి తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విధాన నిర్ణ యాలు చేసే స్థాయిలో, సంస్థల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్లు, ఇతర పాలనాపరమైన ముఖ్య స్థానాల్లో పరిమితంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?మహిళలకు సైన్సులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనీ, ఉద్యోగ నియామకా లను క్రమబద్ధంగా జరపాలనీ ఆ కమిటీ సూచించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. శాస్త్ర రంగంలో మహిళలు ముందడుగు వేయటానికి నిపుణుల సూచనలు అమలు చేయటం ఒక అవసరమైతే, ప్రభుత్వాల దృష్టి కోణంలో మార్పు రావటం అత్యవసరం. -వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షులు-ప్రొ‘‘ కట్టాసత్యప్రసాద్ -
National Science Day: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్
మన దేశంలో ‘నేషనల్ సైన్స్ డే’ (ఎన్ఎస్డీ) 1987 ఫిబ్రవరి 28 నుంచి ప్రతి ఏడాదీ నిర్వహించుకుంటున్నాం. అదే రోజు మన భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన పరిశోధనల్ని ‘రామన్ ఎఫెక్ట్’ పేరుతో 28 ఫిబ్రవరి 1928న ప్రతిపాదించారు. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఇది భారత్కే కాదు మొత్తం ఆసియా ఖండానికే దక్కిన మొదటి నోబెల్ బహుమతి. సైన్స్ డే సందర్భంగా నిర్వహించు కోవాల్సిన కార్యక్రమాలు: 1. నిత్య జీవితంలో సైన్సు ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించు కోవాలి. 2. మానవాభ్యు దయానికి ఉపయోగపడే వైజ్ఞా నిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి. 3. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడా నికి కృషి చేసిన, చేస్తున్నవారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి.సైన్స్ డే పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాల యాలకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనంగా జరుపు కోవాలి. దేశ పౌరుల్లో ముఖ్యంగా బాల బాలికల్లో సైన్సుపట్ల ఆసక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించాలి. సైన్స్ డే సందర్భంగా ఉప న్యాసాలు, ఊరేగింపులు, వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ సంబంధిత పోటీలు నిర్వహించి జనంలో అవగాహనపెంచాలి.మన విద్యా విధానంలో ఉన్న ప్రధాన లోపమేమంటే, క్లాస్ రూంలో సైన్స్ సూత్రాలు మాత్రమే చెబుతారు. అంతేగానీ, ఒక శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పరిశోధ నలు చేయగలిగాడన్నది మాత్రం సంక్షిప్తంగా నైనా చెప్పరు. ఈ ధోరణి మారాలి.ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు మన ప్రభుత్వ పెద్దలు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశాన్ని మూడు వేల ఏళ్ళ నాటి అనాగరిక సమాజంలోకి లాక్కుపోతున్నారు. ఆ ప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్సును ఒక వెన్నెముకగా చేసుకుని ప్రగతి పథంలోకి నడవాలి.మూఢత్వాన్ని వదిలి, చేతనత్వం లోకి రావాలంటే – మనం మన రాజ్యాంగంలో రాసుకున్న 51ఏ (హెచ్) స్ఫూర్తిని నిలుపు కోవాలంటే, ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో పని చేయక తప్పదు. ఇప్పటి దేశ కాల పరిస్థితులను చూస్తుంటే, ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఆచరించాల్సిన అవ సరం వచ్చిందని అనిపిస్తోంది.ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం – ప్రశ్న! ప్రశ్నలోంచి ఎదు గుతూ వచ్చిందే సైన్సు!! ఈ సైన్సు అంత ముఖ్యమైందిగా ఎందుకయ్యిందీ? అంటే చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా కాబట్టి. అనాగరికతనూ, మూర్ఖత్వాన్నీ వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మాన వులుగా నిల బడాలంటే సైన్సు తప్ప మరో మార్గం లేదు. అన్యాయాల్ని, అబద్ధాల్ని, దుర్మా ర్గాల్ని ఛేదించాలంటే తీసుకోక తప్పదు సైన్సు సహాయం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా, మనకున్నది ఒక్కటే పదునైన ఆయుధం – అదే సైన్స్!– డా.దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్కు డాక్టర్ రష్ణ భండారి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్కు హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD) స్టాఫ్ సైంటిస్ట్, ల్యాబ్ ఆఫ్ సెల్ సిగ్నలింగ్ హెడ్ డాక్టర్. రష్ణ భండారి ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఇక, సైన్స్కు విశేషమైన కృషి చేసిన మరియు పరిశోధనలో నిరంతరం నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ ఇవ్వబడుతుంది. కాగా, సెల్యులార్ సిగ్నలింగ్ మార్గాల అధ్యయనంలో డాక్టర్ భండారీ చేసిన కృషి, వ్యాధి విధానాలలో వాటి పాత్ర, సెల్యులార్ ప్రక్రియల అవగాహనను మరియు చికిత్సా అనువర్తనాలను అభివృద్ధి చేశారు. ఈ గుర్తింపు భారతదేశంలోని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు లభించే అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. -
సైన్స్ వర్క్ ఫోర్స్ పెరిగేదెలా?
సాక్షి, అమరావతి : భారతదేశంలో సైన్స్ వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నట్టు తేలింది. లింగ వివక్ష, భౌగోళిక పరిమితులు, చేసిన కోర్సుకు సరిపోయే పని లేకపోవడం వంటి కారణాలతో దేశ సైంటిఫిక్ టాలెంట్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి కొరత ఉండటంతో ఆయా ఖాళీలు అలాగే ఉన్నాయని గుర్తించారు. ఇటీవల ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నైపుణ్యం గలవారి సరఫరా, ఉద్యోగ డిమాండ్ల మధ్య అసమతుల్యత, లింగ బేధం మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో మహిళలు చాలా మంది తాము ఇష్టపడి ఎంచుకున్న రంగాల్లోనూ పూర్తి కాలం పని చేయకుండానే వెనుదిరుగుతున్నట్టు తేలింది.కెరీర్ వదిలేసిన తర్వాత రీ–ఎంట్రీపై సరైన అవగాహన లేకపోవడంతో గ్యాప్ ఉత్పన్నమవుతోందని నివేదిక పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేసి, శిక్షణ పొందిన చాలా మంది తమ నైపుణ్యానికి సరిపడే ఉద్యోగాలు చేయడం లేదని ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో 52 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారని, అయితే పనిచేసే చోట వయసు ఆధారిత పక్షపాతం చూపడంతో 40 సంవత్సరాలకే 80 శాతం మంది కెరీర్ను వదులుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. దేశంలో పరిశోధన– అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో సరఫరా డిమాండ్ మధ్య కూడా ఇదే వ్యత్యాసం కనిపిస్తోందని, నిపుణులు పెరుగుతున్నప్పటికీ అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఐఐటీ రోపాపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేహా సర్దానా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. స్కిల్ ఉన్నా రీ ఎంట్రీపై అవగాహన లేమి సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేవని, భౌగోళికంగా అసమానతలు ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది చాలా మంది నిపుణుల ఎంపికలను పరిమితం చేస్తోందని, ఆర్థిక లేదా కుటుంబ కారణాలతో మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని గుర్తించారు. దీంతో నైపుణ్యం గల సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల సేవలను పెద్ద మొత్తంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. కెరీర్లో విరామం తీసుకున్న నిపుణులకు అందుబాటులో ఉన్న రీ–ఎంట్రీ స్కీమ్లు, సపోర్ట్ ప్రోగ్రామ్లపై కూడా అవగాహన లేదని తేల్చారు.ఐఐటీ–బొంబాయిలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మాజీ సీఈవో పోయిని భట్ మాట్లాడుతూ.. వర్క్ఫోర్స్లోకి తిరిగి ప్రవేశించే మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పని చేయించుకుంటున్న సంస్థలు లేదా కంపెనీలు మహిళలకు చైల్డ్ కేర్ సపోర్ట్ ఇవ్వాలని, పనిలో ఫ్లెక్సిబుల్ అవర్స్ని కల్పించాలన్నారు. ఇది నైపుణ్యం గల మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ కెరీర్ను కొనసాగించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మహిళా శాస్త్రవేత్తల రీ ఎంట్రీకి ‘వైజ్ కిరణ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా, దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదని సర్వే వెల్లడించింది. ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ ⇒ భారతదేశంలో పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగంలో పనిచేసే వర్క్ఫోర్స్ ప్రపంచ సగటు కంటే చాల తక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ రంగంలో ప్రపంచ సగటు ప్రతి పది లక్షల మందిలో 1,198 మంది పని చేస్తుండగా, భారత్లో మాత్రం 255 మందే ఉన్నట్టు ప్రకటించింది. ⇒ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 2024 నివేదిక ప్రకారం భారత్లో జెండర్ గ్యాప్ గతేడాది కంటే పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో 146 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం 2023లో ప్రపంచంలో భారత్ 127 స్థానంలో ఉండగా, గతేడాది ఈ ర్యాంకు 129కి చేరింది. ⇒ ర్యాంకింగ్లో మాల్దీవులు, పాకిస్థాన్ కంటే భారత్ కాస్త ముందుంది. ఈ గ్యాప్ తగ్గించాలంటే సౌకర్యవంతమైన పని ప్రదేశం, పార్ట్–టైమ్ అవకాశాలు, రిమోట్ విధానంలో పని చేసే అవకాశం కల్పించాలని శివ్ నాడార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ రూపమంజరి ఘోష్ తెలిపారు. ఈ విధానం ద్వారా మరింత మంది మహిళలు సైన్స్ వర్క్ ఫోర్స్లోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. వర్క్ఫోర్స్ నుంచి విరామం తీసుకుని, తిరిగి పనిలోకి వచ్చే మహిళలపై చిన్నచూపు ఉందని, ఇది తొలగి పోవాలన్నారు. ⇒ విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం.. నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచవచ్చని ఘోష్ చెప్పారు. అలాగే, ఉద్యోగాల పదోన్నతుల్లో ‘బయోలాజికల్ ఏజ్’ కంటే ‘విద్యా వయస్సు’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నైపుణ్యం గల సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోని పరిణామ సత్యం
ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్ డార్విన్ 1859 నవంబర్ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్స్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి. చదవండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.– ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు(నవంబర్ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం) -
పరిశోధనల సులభతరం ఇలాగా!
ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు ఇటీవల ఓ నోటీసు వచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో పరిశోధనల కోసం అందుకున్న నిధులపై జీఎస్టీ ఎందుకు చెల్లించలేదని అందులో ప్రశ్నించారు. జీఎస్టీ సకాలంలో చెల్లించనందుకు జరిమానా, వడ్డీ కలిపి రూ.120 కోట్లు కట్టమని కూడా ఆదేశించారు. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. ప్రతిష్ఠాత్మక సైన్సు అవార్డులను కూడా నగదు బహుమతి లేకుండానే అందిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు వచ్చిన జీఎస్టీ చెల్లింపుల నోటీసుపై శాస్త్రవేత్తలు స్పందించలేదు కానీ, ‘ఇన్ఫోసిస్’ మాజీ సీఎఫ్వో, ఇన్వెస్టర్ టీవీ మోహన్ దాస్ పై మాత్రం దీన్ని ‘అతి నీచమైన పన్ను తీవ్రవాదం’ అని వ్యాఖ్యానించారు.నెల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిశోధనల కోసం ఉపయోగించే రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 150 శాతానికి పెంచడం... అకస్మాత్తుగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చులతో శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు బెంబేలెత్తడం తెలిసిన విష యమే. పరిశోధనలకు అవసరమైన ఎంజైములు, రీజెంట్లు చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. కస్టమ్స్ డ్యూటీ పెంచ డమంటే వాటిని దాదాపుగా అడ్డుకోవడమే. శాస్త్రవేత్తల నిరసనల నేప థ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. సృజనాత్మక ఆలోచనలు వృద్ధిచెందాలంటే, ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’(ఆర్ అండ్ డీ)కి మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉండగా... కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.జీఎస్టీ నోటీసులు, కస్టమ్స్ డ్యూటీ పెంపులు ఏవో చెదురు ముదురు సంఘటనలు కావచ్చునని అనుకునేందుకూ అవకాశం లేదు. ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచడం, తాజాగా నిధు లపై జీఎస్టీ నోటీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల పరికరాలను సమకూర్చుకోవడం, పరిశోధనల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయంపై ఆందో ళనతోనే కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర అంశాల్లో సలహా ఇచ్చే విభాగంకేంద్రానికి ఒక నోట్ను పంపింది. జీఎస్టీ వసూళ్లు, పన్నుల పెంపుల ప్రభావం నుంచి ప్రైవేట్ సంస్థలు సర్దుకోవచ్చుననీ, ప్రభుత్వ సంస్థల్లో ఇందుకు అవకాశాలు తక్కువనీ ఈ నోట్లో స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోట్పై స్పందిస్తూ, సంస్థలకు కేటాయించే నిధు లను ఎక్కువ చేస్తున్నాము కాబట్టి జీఎస్టీతో నష్టమేమీ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితిని సరిచేసేందుకుచేసింది మాత్రం శూన్యం. పరిశోధనలకు ఊతం ఇలా కాదు...ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకునే వాతావరణం ఉన్నప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. తగినన్ని నిధులు సమకూర్చడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.... పన్నులు, నిబంధనల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈ అన్ని అంశాలు భారత్లో ఇప్పుడు కొరవడ్డాయనే చెప్పాలి. నిధుల విషయాన్ని చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువ. అన్ని రకాల ప్రాజెక్టులకు ఒకే ఛత్రం కింద నిధులిస్తామని ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ (ఏఎన్ ఆర్ఎఫ్) ఒకటి ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు సా...గుతూనే ఉన్నాయి. మరోవైపు పరిశోధనలకు తాము నిధులు ఎక్కువ చేశామని ప్రభుత్వం బాకా ఊదుతూనే ఉంది. ఐదేళ్ల కాలంలో కొత్త సంస్థ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తామని పదే పదే సంకల్పం చెప్పుకుంటోంది. ఈ మొత్తం కూడా వట్టి మాటే. తామిచ్చేది 30 శాతమనీ, మిగిలిన 70 శాతాన్ని ఆయా సంస్థలు ప్రైవేట్ రంగంలో సేకరించుకోవాలనీ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏడాదికి రూ.30,000 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రస్తుత కేటాయింపుల కంటే చాలా తక్కువ. 2024–25లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.16,628 కోట్లు కేటాయించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏఎన్ ఆర్ఎఫ్ ఏర్పాటు ఆలోచన వెనుక ‘ఆర్ అండ్ డీ’ బరువును తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. అదెలా చేయాలో మాత్ర స్పష్టత కనిపించడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. నిధులు పొందేందుకు, పంపిణీ, స్కాలర్షిప్, ఫెలోషిప్ల నిర్ధారణ వంటి అనేక అంశాల్లో అధికారుల జోక్యం ఉంటోంది. మేకిన్ ఇండియా వంటి వాటికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన ఇంకో సమస్య. వీటన్నింటి మధ్య తాము పరిశోధనలపై దృష్టి ఎలాకేంద్రీకరించగలమని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త ఒకరు ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశోధనలకు అడ్డంపడే ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయి. అంతర్జా తీయ ప్రయాణాలకు అందించే నిధులపై నియంత్రణ వాటిల్లో ఒకటి. కీలకమైన శాస్త్ర అంశాల్లో పలు దేశాలు కలిసి పని చేయడం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాన్ఫరెన్సులకు వెళ్లేందుకు ఇలాంటి వంకలు పెట్టడం గమనార్హం.సైన్ ్స వ్యవహారాల్లో సౌలభ్యమెంత?గత ఏడాది ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ (ఫాస్ట్) ఒక సర్వే చేసింది. టాప్–10 పరిశోధన సంస్థల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశ్నించి దేశంలో పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం ఎలా ఉందో అంచనా కట్టింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాదిరిగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్ ్స’ అన్నమాట. 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే ఈ పదాన్ని పరిచయం చేశారు. ‘ఫాస్ట్’ చేసిన సర్వేలో స్థూలంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ బాగుందని ఆరు శాతం మంది కితాబిచ్చారు. నిధులు పొందే విషయంలో మాత్రం యావరేజ్ కంటే తక్కువని తేల్చారు. నిధులిచ్చే సంస్థలు గ్రాంట్లు ఇచ్చేందుకు తీసుకునే సమయం, నిధుల మొత్తం, ప్రాజెక్టు ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా పనిచేస్తున్నాయని వీరు చెప్పారు. ఇకఅందించిన నిధులను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉందా? విదే శాల్లో జరిగే సదస్సులకు వెళ్లగలుగుతున్నారా? పరిశోధనలకు అవస రమైన వనరులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న ప్రశ్న లకు శాస్త్రవేత్తల సమాధానం ‘అధ్వాన్నం’ అని!ప్రతిభను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించడం, ‘ఆర్ అండ్ డీ’ వాతావరణం బాగుందని అనేందుకు ఇంకో గుర్తు. కానీ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఇస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ‘విజ్ఞాన్ పురస్కార్’ పేరిట నగదు బహుమతి లేకుండానే అందిస్తు న్నారు. 2022లో సైన్ ్స అవార్డులను నిలిపివేసిన ప్రభుత్వం నోబెల్ స్థాయిలో ‘విజ్ఞాన రత్న’ అవార్డు ఒకదాన్ని అందిస్తామని చెప్పింది. గత నెలలో ఈ అవార్డును ప్రకటించారు కూడా. ఇందులోనూ నగదు ప్రస్తావన లేదు. ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు అందించే రాష్ట్ర స్థాయి అవార్డులైన ‘విజ్ఞాన్ గౌరవ్’, ‘విజ్ఞాన్ రత్న’ (జాతీయ అవార్డుకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర స్థాయి అవార్డు)లకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు!ఒకవైపు భారత్లో సైన్సును సులభతరం చేయడం తగ్గిపోతూండగా, చైనా మున్ముందుకు దూసుకెళుతోంది. భారత్ తన జీడీపీలో 0.66 శాతం పరిశోధనలకు వెచ్చిస్తూండగా, చైనా 2.4 శాతం ఖర్చు పెడుతోంది. చైనాలోని పెకింగ్, ట్సింగ్హువా యూనివర్సిటీల పరి శోధన బడ్జెట్ మనం విద్యకు పెడుతున్న దాని కంటే ఎక్కువ ఉండటం చెప్పుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్ రావు ఇటీవలే ఒక సమావేశంలో తెలిపారు. పరిశోధనల నిధుల విషయంలో యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలను పస్తు పెట్టడం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చేది ఎంతమాత్రం కాదన్నది గుర్తించాలి.- రచయిత సైన్ ్స అంశాల వ్యాఖ్యాత- (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) దినేశ్ సి. శర్మ -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్లోని రెడ్ హిల్లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్తోపాటు అమెరికా, యూరప్లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్పై ఆధారపడుతూంటాయి. పీహెచ్డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందా? మార్కెట్లో దొరకడం లేదట!?
బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సందేహంలేదు. ఈ దుంపకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీన్ని ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బీట్రూట్ తింటే మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో (బీటూరియా) వస్తుంది. కానీ ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. బీట్రూట్ వల్లన పెద్దగా దుష్ప్రభావాలు పెద్దగా ఏమీలేవు. అయితే ఇటీవల ఒక న్యూస్ వైరల్గా మారింది. స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుందనే వార్త వైరల్ అయింది. వయాగ్రాలా పనిచేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియన్ సూపర్ మార్కెట్ బీట్రూట్ కొరత ఏర్పడింది. ఒక సమయంలో, ఆన్లైన్ ప్లాట్ఫాం ఈబేలో ఎక్కువ ధరకు అమ్ముడైందిట. అయితే దీనిపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ స్పందించారు.ఇది వయాగ్రాలా పనిచేస్తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కాని ఇది సహజ సిద్ధంగా లభించే సూపర్ ఫుడ్ అని ముఖ్యంగా విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అయితే రోమన్లు బీట్రూట్ , దాని రసాన్ని కామోద్దీపనగా ఉపయోగించారని చెబుతారు.బీట్రూట్ తిన్నప్పుడు, బ్యాక్టరియా ఎంజైమ్లతో కూడిన రసాయన ప్రతిచర్యలు బీట్రూట్లోని నైట్రేట్ను నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. పలు అధయనాల ప్రకారం ఫుడ్ ఆధారిత నైట్రిక్ ఆక్సైడ్ పురుషులలో లైంగిక జీవితానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్కు సపోర్ట్ చేస్తుందని అంచనా బీట్రూట్లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే సామర్థ్యం గుండె, రక్తనాళాల ప్రసరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీన్ని జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్రూట్ అందిస్తుంది. -
‘నేను సైన్స్ టాపర్ని.. కోవిడ్ వైరస్కే వణుకు పుట్టించాను’
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్లోని పూర్నియా లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
Sia Godika: 'సామాజిక సేవ నుంచి సైన్స్ వరకు'..
'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'. సైన్స్, మ్యాథమెటిక్స్కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్కు ఇచ్చే ప్రైజ్ ఇది. సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. ‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్లోని నార్త్వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
‘పాపులరైజింగ్ సైన్స్’.. గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ కానుక
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది. 2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, వెస్ట్బెంగాల్లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎమ్)లలో కెరీర్ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వుతామో తెలుసా!
కితకితలు పెడుతున్నారనంగానే నవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా చిన్నిపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడూ కితకితలు పెడుతుంటా. జస్ట్ అలా పెట్టేందుకు యత్నించంగానే నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆపుకోవడం కష్టం కూడా. అయితే మనంతట మనం పెట్టుకుంటే నవ్వు రాదు. అవతలివాళ్లు పెడితేనే నవ్వు వస్తుంది. ఎందుకిలా? అస్సలు కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వు వస్తుంది?. తదితర ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం! ఇలా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వడానికి వెనుకున్న సైన్స్ ఉందంట. సాక్షాత్తు ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులే చక్కిలగింతలు పెడితే కచ్చితంగా నవ్వుతామని, దాని వెనుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. అయితే కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు. నవ్వు ఎలా వస్తుంది? మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్. ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మనకు మనం పెటుకుంటే నవ్వు ఎందుకు రాదంటే.. మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి. చక్కిలిగింతల రకాలు 1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
హైదరాబాద్ మహిళకు ఇన్ఫోసిస్ అవార్డ్.. భారీ ప్రైజ్ మనీ
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ 'కరుణ మంతెన' (Karuna Mantena)కు టెక్ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్ అవార్డు అందించింది. సైన్స్లో ఈమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ వంటి పలు రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి అవార్డులు అందించడం జరిగింది. ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్ మనీ ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. హైదరాబాద్ మహిళ కరుణ మంతెన మాత్రమే కాకుండా.. ఈ అవార్డు గ్రహీతల్లో ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్లు సచ్చిదా నంద్ త్రిపాఠి, అరుణ్ కుమార్ శుక్లా, సైన్స్ గ్యాలరీ బెంగళూరు డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీ, అడ్వాన్స్డ్ స్టడీ ఇన్స్టిట్యూట్లో ఫెర్న్హోల్జ్ జాయింట్ ప్రొఫెసర్ భార్గవ్ భట్ మొదలైనవారు ఉన్నారు. #InfosysPrize2023 in Social Sciences is awarded to @KMantena, @Columbia, for her research on the theory of imperial rule, and the claim that this late imperial ideology became one of the important factors in the emergence of modern social theory. pic.twitter.com/fKYBXhr2eC — Infosys Prize (@InfosysPrize) November 15, 2023 -
సంక్రాంతి వెనుక సైన్స్
సాక్షి, అమరావతి: సూర్యుడు జ్ఞానానికి.. జీవిత శ్రేయస్సుకు ప్రతీక. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం.. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి మారతాడు. సూర్యుని ఖగోళ ప్రయాణంతో ముడిపడి ఉన్న మకర సంక్రాంతితో శీతాకాలం ముగుస్తుంది. ఎండ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుని పథం మారుతున్న రుతువులపై ప్రభావం చూపిస్తుంది. ఈ కాలం సాంస్కృతిక, వ్యవసాయ ప్రాముఖ్యతకు ప్రతీక. శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. మకర సంక్రాంతి నాడు కీలకమైన మార్పు వస్తుంది. సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖను దాటి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. వసంత కాలం మొదలవుతుంది. సూర్యుడు హారిజోన్పైన ఎక్కువ సమయం గడపడం వల్ల పగటి వేళలు క్రమంగా పెరుగుతాయి. పెరిగిన సూర్యరశ్మి భూమిని వేడెక్కిస్తుంది. మంచు తగ్గుతుంది. ఫలితంగా పంటలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వస్తాయి. పండుగ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కీడు ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొడుకులున్న తల్లులు పరిహారం చేయాలని, ముఖ్యంగా ఒక్కడే కొడుకు ఉన్నవారు గాజులు వేసుకోవాలని కొత్త ఆచారం పుట్టుకొచ్చింది. ఒకే అల్లుడు ఉన్న అత్త, అల్లుడిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు, తులం బంగారం పెట్టాలని.. కొత్త అల్లుడైతే కాళ్లను పాలతో కడగాలంటూ వింత నియమం చక్కర్లు కొడుతోంది. అయితే.. ఎవరి గాజులు వారే కొనుక్కుని వేసుకోకూడదు. వేరే వాళ్ల నుంచి తీసుకోవాలి. దీనిని నమ్మి గ్రామాల్లో ఎక్కువగా మహిళలు ఒకరికొకరు గాజులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా లేదా అని అన్వేషిస్తే.. ఈ సంక్రాంతి కీడు వెనుక సైన్స్ ఉందని తేలింది. అల్లుళ్లకు కాళ్లు కడగడం, కానుకలివ్వడం అనేది కేవలం పుకారు మాత్రమేనని పండితులు కొట్టిపడేశారు. కానీ గాజులు ధరించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. దేవతల చేతులకూ గాజులు ఆలయాల్లో దేవతా శిల్పాల ముంజేతికి ఆభరణాలు ఉంటాయి. వాస్తవానికి ముంజేతి మణికట్టు భాగంలో వినాళ వ్యవస్థకు అనుసంధానం చేసే నాడులు ఉంటాయి. ఈ భాగంలో చిన్నగా ఒత్తిడి కలిగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు బాగుంటుందని సైన్స్ చెబుతోంది. ఇలా మనం ధరించే ఆభరణాల వెనుక ఇలాంటి శాస్త్రీయ కోణం ఉంది. శాస్త్రంతో నిండిన పండుగ రోజులు ప్రతికూలతలను దహనం చేయడానికి ప్రతీకగా వేసే భోగి మంటలు సూర్యుని వెచ్చదనాన్ని స్వాగతిస్తాయి. ఈ మంటల్లో మట్టి పాత్ర వేసి వండే పాయసంలో అనేక పోషకాలుంటాయి. నువ్వులు, బెల్లం వంటి నైవేద్యాలు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఎగురుతున్న గాలిపటాలు సూర్యుని ఆరోహణను అనుకరిస్తాయి. సాంస్కృతిక వేడుకలతో నూతనోత్సాహం వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత గూటికి చేరడంతో సంతోషం వెల్లివిరుస్తుంది. -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
చిత్రకారుల్లో ఇతడు వేరయా..! సైన్సుకే చిత్ర రూపం ఇచ్చి..
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది. అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్. బొమ్మల చదువు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్. వైవిధ్యత ఆకట్టుకుంది! సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను. అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను. సైన్స్ పాఠాల బోధన! నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ. నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్. ‘చిత్ర’ ప్రమాదాలు చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు. ఇక మూడవది హైదరాబాద్లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు. – అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా?
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం. చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. మూడు పద్ధతుల్లో నీటి జాడను.. తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్ బాటిల్ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు. అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు. తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి. శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం.. కొబ్బరి వేపపుల్ల, వాటర్ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు. కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం.. భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ.. భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్లు సైంటిఫిక్ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ అనుభవం కీలకం... చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్ప్యాడ్పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం. ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది. దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉన్న రోజున తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! -
ప్రెగ్నెంట్గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మూడు కొత్త కోర్సులు
బంజారాహిల్స్: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో బుధవారం న్యూ అకడమిక్ కేలెండర్, యాంటీ ర్యాగింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. సైఫాబాద్ కాలేజ్ 2023–24 అకడమిక్ ఇయర్లో కొత్త కోర్సులు రావడం, అదే విధంగా పీజీ లేడీస్ హాస్టల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జె. లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చొరవతో ఈ కాలేజీలో కొత్తగా మూడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టారన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామయ్య, డాక్టర్ వెంకటేష్ , రమణ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా. -
11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే..
ఏ యువకునికైనా తండ్రిగా మారడమనేది కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతి అతని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడు? ఈ ప్రశ్న విజ్ఞానశాస్త్రానికే సవాల్గా నిలిచింది. అయితే ఇటీవల బ్రిటన్కు చెందిన షాన్ స్టీవర్ట్ కేవలం 11 ఏళ్ల వయసులోనే తండ్రి అయ్యాడు. ఈ ఉదంతం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడనే దానిపై పలు వాదోపవాదనలు జరుగుతున్న నేపధ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతున్నదంటే.. సైన్స్ చెబుతున్న వివరాల ప్రకారం 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మగ పిల్లవాడు తండ్రి అయ్యేందుకు అర్హుడవుతాడు. 11 ఏళ్లు వచ్చేసరికి మగపిల్లలలో స్మెర్మ్ ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ మగపిల్లవాడు ఏ మహిళను అయినా గర్భవతిని చేయగలుగుతాడు. అయితే ఇది ప్రతిసారీ సాధ్యంకాదు. ఇది ఆ మహిళ బయోలాజికల్ క్లాక్పై ఆధారపడివుంటుంది. చాలా సందర్భాలలో 14 ఏళ్ల తరువాతనే మగపిల్లవాడు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు. అమ్మాయిలు ఏ వయసులో తల్లి అవుతారంటే.. విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే అమ్మాయిలు 13 ఏళ్ల వయసులో తల్లి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే తల్లిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మెడిసిన్ నెట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ మెలిసా మాట్లాడుతూ చాలా సందర్భాలలో తల్లితండ్రులయ్యే సామర్థ్యం మగపిల్లవారికన్నా ముందుగా ఆడపిల్లలకు వస్తుంది. మగపిల్లలు 11 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో తండ్రి అయ్యేందుకు అవకాశం ఉండగా, అమ్మాయిలు 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో తల్లి అయ్యే సామర్థ్యాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలంటే ఆడపిల్లలకు కనీసం 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. చట్ట ప్రకారం కూడా 18 ఏళ్లు దాటడమే తల్లి అయ్యేందుకు తగిన వయసుగా గుర్తించారు. అయితే వివిధ దేశాల్లో ఈ విషయంలో పలు రకాల చట్టాలు అమలులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: ‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్కు వచ్చి.. -
ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్!
వాసన అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పదార్థాలను వాసన చూసి, అదేమిటో గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి వాసనను పసిగట్టి ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఇంటిలోని విద్యుత్ వైర్ ఏదైనా ఓవర్హీట్ అయినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. దానిని వెంటనే పసిగడితే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొన్ని వాసననలు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఉదాహరణకు తొలకరి చినుకులు పడుతున్నప్పడు మట్టి నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు. పెట్రోల్ వాసన, కొత్త పుస్తకాల వాసనను ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. కొందరు అయోడెక్స్, నెయిల్ పాలిష్ వాసనలను ఇష్టపడుతుంటారు. అయితే కొందరికి ఏ వాసనలు నచ్చుతాయో అవే మరికొందరికి అస్సలు నచ్చవు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసనల వెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు గ్రహిద్దాం. సువాసన, దుర్వాసనల వెనుక.. ప్రముఖ శాస్త్రవేత్త రేచల్ ఎస్ హర్జ్ రాసిన The Scent of Desire పుస్తకంలో ఏ వాసన అయినా బాగుందని, బాగోలేదని విభజించలేమన్నారు.అయితే మనం వాసన పీల్చుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్ ప్రకారం అది బాగుందని, లేదా బాగోలేదని చెబుతుంటామన్నారు. మనం మానసిక భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఏదైనా స్మెల్ బాగుందనో లేదా బాగోలేదనో చెబుతుంటాం. దీనిప్రకారం చేస్తూ మనం ఎమోషన్స్కు దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన అయినా మనకు సాధరణంగానే అనిపిస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం మనకు పాజిటివ్ ఫీల్ కలిగించిన వాసనలను మనం ఇష్టపడుతుంటాం. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు మొదలైన వాటి వాసన ఈ కోవలోకే వస్తుంది. కొందరు విచిత్రమైన వాసనలను ఇష్టపడుతుంటారు. అంతమాత్రాన వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతీవాసనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీకరిస్తారు. అందుకే కొందరికి సువాసన అనిపించేది మరికొందరికి నచ్చదు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
పక్షవాత బాధితునికి ఏఐ సాయం... అతనిలో వచ్చిన వినూత్న మార్పు ఇదే..
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇంతకాలం అసాధ్యాలనుకున్నవన్నీ ఏఐ సాయంతో సుసాధ్యాలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అటువంటి మరో ఉదంతం ఇప్పుడు అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.స్విట్టర్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పక్షవాతానికిగురైన ఒక వ్యక్తికి అత్యుత్తమ చికిత్సనందించారు. బాధితుని శరీరంలోని కిందిభాగం పక్షవాతానికి గురికాగా, శాస్త్రవేత్తలు ఆ భాగం బాధితుని నియంత్రణలోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే 2011లో పక్షవాతానికి గురైన గర్ట్-జైన్ ఓస్కమ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏఐ సాయంతో తిరిగి నడవగలుగుతున్నాడు. తనకు చికిత్స అందించిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. 40 ఏళ్ల ఓస్కమ్ తన ఆలోచనల ద్వారా ఇప్పుడు తన శరీరభాగాలను నియత్రించగలుగుతున్నాడు. రెండు ఇంప్లాట్స్ కారణంగా ఇది సంభవమయ్యింది. బాధితుని మెదడు- వెన్నెముకకు మధ్య తిరిగి కనెక్షన్ ఏర్పరచడం ద్వారా బాధితుని శరీర భాగాలు అతని అదుపులోకి వచ్చాయి. ఓస్కమ్ మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి నడుస్తానని ఎప్పుడూ అనుకోలేదని,శాస్త్రవేత్తలు తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకుల బృందం ఓస్కామ్ మెదడుకు, వెన్నెముకకు మధ్య ఒక డిజిటల్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది.ఈ బ్రిడ్జి బాధితుడు అన్ని ఆటంకాలు అధిగమించి నడించేందుకు సహకరిస్తుంది. 2011లో జరిగిన ఒక ప్రమాదం అనంతరం ఓస్కమ్ పక్షవాతానికి గురయ్యాడు. ఆ తరువాత నుంచి వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏఐ సాయం, శాస్త్రవేత్తల కృషితో బాధితుడు తిరిగి నడవగలుగుతున్నాడు. -
గుడ్ స్కూల్ యాప్ను ప్రారంభించిన అడివి శేషు
సైన్స్ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో గుడ్ స్కూల్ యాప్ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు. ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్వేర్–యాప్స్ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు. మండల స్థాయికి ఐదు చొప్పున.. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మకతకు పెంచేలా.. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు -
టెన్త్లో సైన్స్కు ఒకే పేపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్సు పరీక్ష ఇకనుంచి ఒకే పేపర్గా జరుగుతుంది. సైన్సులో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రాలను రెండు వేర్వేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంతో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు విభాగాలుగా.. ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్లో 6 పేపర్ల విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. 2016–17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో తరువాత టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది. తెలుగు, ఇంగ్లిష్,, హిందీ, మేథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను 50 మార్కుల చొప్పున రెండురోజుల పాటు నిర్వహించారు. 2022 టెన్త్ పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా, సీసీఈ విధానంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతరం మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఈఆర్టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపించింది. పరిశీలించిన ప్రభుత్వం 2022–23 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో–136ను ఆగస్టు 22న విడుదల చేసింది. గత ఏడాది ఏడు పేపర్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్సును ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లుగా వేర్వేరుగా నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం పేపర్లను ఆరింటికే కుదించినందున సైన్సును రెండు పేపర్లుగా కాకుండా ఒకే పేపర్గా 100 మార్కుల ప్రశ్నపత్రంతో ఒకేరోజు నిర్వహించనున్నారు. పరీక్ష ఒకటే.. సమాధాన పత్రాలు రెండు ఇకనుంచి సైన్సు ఒకే పేపర్గా 33 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలను, బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేర్వేరు బుక్లెట్లలో రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు సమాధానాలను వేర్వేరు టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా రెండు సమాధానాల బుక్లెట్లను ఇవ్వనున్నారు. 25 నుంచి ఫీజుల చెల్లింపు మార్చి–2023లో నిర్వహించే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. -
మూలాలన్నీ ఆదిమ సమాజంలోనే!
ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఈ స్థితికి చేరడానికి కారణం తరతరాల పూర్వీకులు కూడబెట్టిన జ్ఞాన సంపదే. ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మాత్రమే జ్ఞానం కాదు. ఇప్పటికీ లిపి లేని ఎందరో ఆదిమ జాతుల వారు జీవనం సాగిస్తున్నారు. వారిది మౌఖిక విజ్ఞానం. ప్రకృతితో మమేకమవ్వటం, దాని పరిరక్షణ, దానిని ఉపయోగించుకోవడంలో వారు అగ్రగణ్యులు. సోకాల్డ్ ఆధునిక సమాజాలవారు ఈ జ్ఞానాన్ని గ్రహించి మరింతగా పురోగమించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్కృతి బహు ముఖంగా విస్తరిస్తోంది. ఈ విద్యా సంస్కృతీ వికాసానికి మూలమైన తాత్త్వికులు లిఖిత విద్యనే ప్రమాణంగా తీసుకోలేదు. భారతదేశంలో గిరిజనులు మౌఖిక జ్ఞాన సంపన్నులు. దేశీయ భాషల్లో జీవం ఉంటుంది. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, చెట్టూ, పుట్టా అన్నింటి విలువలు వీరి జ్ఞానంలో ఒదిగి ఉన్నాయి. అయితే వారి నుండి మనం పూర్తి జ్ఞానాన్ని పొంద లేదు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని సుసంపన్నం చేయాలంటే మౌఖిక జ్ఞాన సంపద లోతుల్లోకి మనం వెళ్ళాలి. ప్రపంచ విజ్ఞానమంతా ప్రకృతిలో దాగి ఉంది. వృక్ష, జంతు, భూగర్భ శాస్త్రముల వంటి వన్నీ విస్తృతి చెందాలంటే మానవ సమాజ జీవన వ్యవస్థల లోతుల్లోకి ఇంకా పరిశోధనలు వెళ్ళాలి. మనం మన కళ్ళముందు ఉన్నదాన్ని గ్రహించ లేక మన జీవన వ్యవస్థల్లో భాగంగా ఉన్న భాష మీద ఆధిపత్యం లేక ఉపరితల అంశాల మీదే దృష్టి పెడు తున్నాం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? సమస్త జ్ఞానం ఇంద్రి యానుభవం ద్వారానే సిద్ధిస్తుందా? ఈ తాత్త్విక, భౌతిక దృష్టి లోపించి ప్రయోజనవాద దృష్టి పెరిగింది. ఇది మానవులకు ఉప యుక్తం కాదు. మనిషి తప్పక వాస్త వాన్ని అంగీకరించే ధోరణి లోకి రావాలి. వాస్తవం ప్రకృతిలోనూ, ప్రాకృతిక జీవుల్లోనూ ఎక్కువ ఉంటుంది. తాత్త్విక దృక్పథం లేని వాళ్ళే భూమి పొరలను చీల్చి భూగర్భ ఖనిజాలను అమ్ముకుంటున్నారు. ప్రపంచం అంతా ఈ రోజు అస్తవ్యస్తం కావ డానికి ప్రపంచం మీద, దేశం మీదా అవగాహన లేని అవిద్యాపరుల భావనలే. మనిషి స్వార్థపరుడు కావడానికి కారణం జ్ఞాన శూన్యతే. ప్లేటో చెప్పినట్టు వృక్షత్వం భావన నుంచి చెట్టు మూలం తెలుస్తుంది. చెట్టు మూలం తెలియని వాడు దాని వేర్లు నరుకుతాడు. చెట్టు మూలం తెలియని వాడు చెట్టు పెంచడు. కాగా, చెట్టు మూలం తెలిసిన వాడు దాని ఆకులోని ఔషధ గుణాన్ని స్వీకరిస్తాడు. చెట్టుకి మానవ సమా జానికి ఉన్న అంత స్సంబంధం తెలియని వాడు జ్ఞాని కాదు. నిజమైన జ్ఞానం వస్తువుకు మనకు ఉండే అంతస్సంబంధం నుండే జనిస్తుంది. చాలామంది తన చుట్టూ ఉన్న పరిసరాల మీద అవగాహనను పెంచు కోలేదు. తాము చూడని, కనని, వినని అజ్ఞాత దైవాల మీద, తమకు అనుభవం కాని కులం మీద, తాము అనుభవించని సంపద మీదా ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మూఢ విశ్వాసు లుగా మారతారు. జ్ఞానానికి వారు అవరోధులు. మౌఖిక జాతుల జీవన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మనం భారతదేశాన్ని సుసంపన్నం చేయగలం. అనేక జాతులలో నిక్షిప్తమైయున్న జ్ఞానాన్నీ, విద్యనీ, సంస్కృతినీ మనం అర్థం చేసుకొనే క్రమం నుండే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ఎంతో విలువైన ఖనిజ సంపద వుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి. గిరిజనులు ఈ ప్రకృతి సంపద పట్ల ఎంతో అవగాహన కలిగి సంరక్షించుకుంటూ ఉంటారు. ఈనాడు భారతదేశం సంక్షోభంలో వుండటానికి కారణం గిరిజనుల జ్ఞాన సంపదను అర్థం చేసుకోలేకపోవడమే. గిరిజనులు రక్షిస్తున్న అటవీ సంపదను బట్టి వారి నీతినీ, నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ, రక్షణ స్వభావాన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. గిరిజనులే నిజమైన మాన వులు. వారు ప్రతి ఆకునూ ప్రేమిస్తారు. ప్రతి జంతువు స్వభావాన్నీ అధ్యయనం చేస్తారు. మాతృస్వామిక స్వభావం గలవారు. అందుకే శాస్త్రవేత్తలు లిఖిత భాషలోనే కాదు, అలిఖిత జాతులలో కూడా జ్ఞానం వుందని చెబుతున్నారు. అరిస్టాటిల్ ప్రకృతి గురించి చెప్తూ... శుద్ధద్రవ్యం మొదటగా నాలుగు మూల పదార్థాలు – మట్టి, నీరు, గాలి, అగ్నిగా మారుతుం దన్నాడు. ఇంతవరకు అరిస్టాటిల్కు పూర్వులైన గ్రీకులు కనిపెట్టినవే. కాని, అతడు అయిదవ మూల పదార్థం ఈథర్ కూడా ఉంటుందని ఊహించాడు. భారతీయ భౌతికవాదులు సాంఖ్యులు భూమి, నీరు గాలి, అగ్ని, శూన్యాలను కనిపెట్టారు. ఈ శూన్యంలో కూడా ఈథర్ అనే పదార్థం ఉంటుందని నేటి భౌతికవాదులు చెప్తున్నారు. అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. అన్ని వస్తువులు పంచ భూతాల నుండే ఏర్పడతాయి. పదార్థ జ్ఞానాన్ని ఆదిమ వాసులు విస్తృతంగా అర్థం చేసుకొన్నారు. దేన్నైనా జీవితావసరం మేర మాత్రమే వాడుకుంటారు. కాని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ స్వభావం వున్న వాళ్ళే వాటిని వ్యాపార దృక్పథంతో స్వార్థం కోసం ఉపయోగించు కొంటారు. భౌతిక తత్వశాస్త్రం మొత్తం ఆదిమ జాతుల నుండే వచ్చింది. సాంఖ్య దర్శన రూపకర్త కపిలుడు దళితుడే. దళితజాతులు ఆదిమ జాతులకి దగ్గరగా వుంటాయి. గిరిజనుల్లో చాలాకాలం ప్రజలకు లిపి తెలియదు కాని, వారికి మనకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా వుండేది. వారు పాతకాలపు అద్భుత గాథలను చెప్పేవారు. వారు పోయినా ఆ గాథలు మాత్రం పోలేదు. ఆనోటా ఆనోటా ఆ గాథలు మారుతూ వుంటాయి. వాటిలో కొత్త సంగతులు చేరుతుంటాయి. నీరు పారి పారి రాళ్ళు నునుపు దేరినట్టు ఆ గాథలు రాను రాను నయం గానూ, నాజూకు గానూ అవుతూ ఉంటాయి. పరాక్రమ వంతుడైన ఒకానొక కులపెద్ద కథ కాలక్రమాన నీటికీ, నిప్పుకూ, బాణానికీ, బళ్లేనికీ భయపడని వాడూ; సింహంలాగా అడవంతా పెత్తనం చెలాయించి డేగలాగ ఆకాశంలో ఎగిరిపోయేవాడూ అయిన ఏమాయా మానవుని వీరగాథ గానో మారుతుంది. గిరిజనులు, దళితులు ఇంకా ఇతర మౌఖిక ఉత్పత్తికారులు మన సంస్కృతీ వికాసానికి, తత్వానికీ మూల ప్రకృతులు. మన కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలే కాక, మన విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు, జ్ఞానులు, విద్యావంతులు మన మూల ప్రకృతులైన ఆదిమవాసులు, దళితులను అధ్యయనం చేయాలి. ఈ నేల పుత్రుల జీవన గాథలనూ, సాంస్కృతిక వికాసాన్నీ పునర్నిర్మించుకోవడానికి దళిత గిరిజన విశ్వ విద్యాలయాలను నిర్మించుకోవలసి వుంది. లిఖితేతర సమాజం వైపు నడపడమే నిజమైన శాస్త్ర దృష్టికి మూలం. ఆ వైపు నడుద్దాం. డా.కత్తి పద్మారావు, వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు ‘ 9849741695 -
Scientific Literature: శాస్త్ర సాహిత్యం
మనకు శాస్త్ర సాహిత్యం కొత్తదేమీ కాదు. కాకుంటే, శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా మనకు ఆశించిన స్థాయిలో శాస్త్ర సాహిత్యం రాకపోవడమే శోచనీయం. క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సామాన్యులకు తేలికగా అర్థమయ్యేలా సాహిత్య రూపంలో అందించిన కవులు, రచయితలు తెలుగువాళ్లలో చాలామందే ఉన్నారు. తెలుగులో తొలి శాస్త్ర కావ్యం గణిత శాస్త్రానికి సంబంధించినది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన కవి పండితుడు పావులూరి మల్లన్న ‘గణితశాస్త్ర సంగ్రహం’ రాశాడు. మహావీరాచార్యుడు సంస్కృతంలో రాసిన గణిత గ్రంథాన్ని మల్లన్న పద్యాల్లో అనువదించాడు. ఆయన కృషికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నవఖండవాడ అనే అగ్రహారాన్ని బహూకరించాడట. ప్రజల్లో విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రం 1906లోనే మునగాల రాజా నాయని వేంకట రంగారావు పోషణలో విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని అందించారు. విజ్ఞాన చంద్రికా మండలి చరిత్ర, శాస్త్ర విషయాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. ఆచంట లక్ష్మీపతి రాసిన ‘జీవశాస్త్రము’, ‘జంతుశాస్త్రము’, ‘కలరా’, ‘చలిజ్వరము’; మంత్రిప్రగడ సాంబశివరావు రాసిన ‘పదార్థ విజ్ఞానశాస్త్రము’, వేమూరి విశ్వనాథశర్మ రాసిన ‘రసాయన శాస్త్రము’ వంటి గ్రంథాలను విజ్ఞాన చంద్రికా మండలి అప్పట్లోనే వెలుగులోకి తెచ్చింది. ఇంచుమించు అదేకాలంలో కృష్ణా జిల్లా వ్యవసాయ సంఘం గోపిశెట్టి నారాయణస్వామి నాయుడు సంపాదకత్వంలో ‘వ్యవసాయము’ మాస పత్రికను ప్రారంభించింది. తెలుగులో అదే తొలి వ్యవసాయశాస్త్ర పత్రిక. తర్వాత కొంతకాలానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసే కాళీపట్నం కొండయ్య 1935లో ‘విజ్ఞానం’ మాసపత్రికను ప్రారంభించి, దాదాపు ఐదేళ్లు నడిపారు. అంతేకాదు, జేమ్స్ జీన్స్ రాసిన ‘యూనివర్స్ అరౌండ్ అజ్’ను తెలుగులో ‘విశ్వరూపం’ పేరిట తెలుగులోకి అనువదించారు. శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్ర విద్యార్థులు కాకుండా, సాధారణ పాఠకులకు అర్థమయ్యే శాస్త్రీయ అంశాలను వివరిస్తూ వెలువడే ఇలాంటి గ్రంథాలు జనరంజక శాస్త్ర గ్రంథాలుగా పేరుపొందాయి. శాస్త్ర సాంకేతిక అంశాలను సామాన్యులకు చేరవేయడాన్నే పనిగా పెట్టుకుని ఒక ఉద్యమంలా రచనలు సాగించిన రచయితలు మనకు ఉన్నారు. వీరిలో సాహిత్యరంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వసంతరావు వెంకటరావు ఒకరు. ఆయన 1949లో ‘ఆధునిక విజ్ఞానం’ రాశారు. శాస్త్ర విషయాలను పద్యాలు, పాటల రూపంలో పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో విరివిగా రాసి, ‘భౌతికశాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి’గా ప్రసిద్ధుడయ్యారు. విస్సా అప్పారావు ‘విజ్ఞానం–విశేషాలు’ పుస్తకం రాశారు. అలాగే ఆయన పిల్లల కోసం నక్షత్రాల గురించి పుస్తకం రాశారు. లండన్లో డాక్టరేట్ చేసిన శ్రీపాద కృష్ణమూర్తి ‘విజ్ఞాన సాధన’, ‘విజ్ఞాన వీధులు, ‘ఇంటింటా విజ్ఞాన సర్వస్వము’, ‘రాకెట్లు–ఆకాశయానము’, ‘వైజ్ఞానిక గాథాశతి’ వంటి పుస్తకాలను రాశారు. ఖగోళ శాస్త్రంపై ఏవీఎస్ రామారావు ‘వినువీధి’ పుస్తకం రాశారు. తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?’ వంటి శాస్త్ర పరిశోధన పుస్తకాలను రాశారు. డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’, ‘జంతుశాస్త్రం’ వంటి శాస్త్ర గ్రంథాలను రష్యన్ నుంచి తెలుగులోకి అనువదించారు. శాస్త్రీయ దృక్పథం గల తెలుగు రచయితల్లో ఒకరైన కొడవటిగంటి కుటుంబరావు ‘బుద్ధికొలత వాదాన్ని’ ప్రతిపాదించారు. మహీధర రామమోహనరావు ‘సైన్స్ ప్రపంచం’ పత్రికను నడిపారు. ఆయన కుమారుడు మహీధర నళినీమోహన్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో శాస్త్ర సాంకేతిక విషయాలపై ‘నిప్పు కథ’, ‘టెలిగ్రాఫు కథ’, ‘టెలిఫోను కథ’, ‘విద్యుత్తు కథ’, ‘ఆలోచించే యంత్రాలు’, ‘ఇతర లోకాల్లో ప్రాణులు’ వంటి అనేక పుస్తకాలు రాశారు. పాత్రికేయ రచయిత నండూరి రామమోహనరావు ఖగోళ, మానవ పరిణామ శాస్త్ర అంశాలపై ‘విశ్వరూపం’, ‘నరావతారం’ వంటి పుస్తకాలు రాశారు. పాల్ డి క్రూఫ్ రాసిన ‘మైక్రోబ్ హంటర్స్’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనిని జమ్మి కోనేటిరావు తెలుగులో ‘క్రిమి అన్వేషకులు’ పేరిట అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ పిల్లల కోసం‘ప్లాస్టిక్ ప్రపంచం’ వంటి పుస్తకాలు రాశారు. వృత్తిరీత్యా వైద్యులైన డాక్టర్ గాలి బాలసుందరరావు, డాక్టర్ జి.సమరం, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు వైద్య, ఆరోగ్యశాస్త్ర అంశాలపై విరివిగా పుస్తకాలు రాశారు. ఇదివరకు ‘భారతి’, ‘పుస్తక ప్రపంచం’ వంటి సాహిత్య పత్రికలు సైతం శాస్త్ర సాంకేతిక వ్యాసాలను విరివిగా ప్రచురించేవి. పూర్తిగా శాస్త్ర సాంకేతిక అంశాల కోసం తెలుగులో ‘సైన్స్వాణి’, ‘సైన్స్ ప్రపంచం’ వంటి పత్రికలు వెలువడేవి. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికాలంలో ప్రధాన స్రవంతి సాహిత్యంలో గుర్తింపు పొందిన రచయితలెవరూ శాస్త్ర సాంకేతిక అంశాలపై రచనలు సాగించడం లేదు. చక్కని శైలి గల రచయితలు శాస్త్ర సాంకేతిక అంశాల రచనలు చేస్తే పాఠకులు ఆదరించకుండా ఉండరు. ఈ అంశాలపై ఇదివరకటి పుస్తకాలను ఎన్నిసార్లు పునర్ముద్రణ చేసినా పాఠకులు ఇంకా వాటిని కొంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. తెలుగులో శాస్త్ర సాంకేతిక రచనలు ఇంకా విరివిగా రావాల్సిన అవసరం ఉంది. దీనిని సాహిత్య అకాడమీలు, ప్రచురణకర్తలు, రచయితలే గుర్తించాల్సి ఉంది. -
శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి
భారతదేశంలో శాస్త్రీయ భావ జాలాలపై హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తోంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తు న్నారు. దానివల్ల భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ సంక్షోభంలో పడు తున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావనలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనం లోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనలకు పురిగొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదనీ, అది తర్క బద్ధమైనదనీ ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతు బద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. దీనిపై పరిశోధన చేసిన ‘కీత్’ ‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’ అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండలపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటంవల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతోంది కానీ అది మేధస్సుకు పదును పెట్టలేక పోతోంది. అందుకే ఇప్పుడు దేవాల యాల యాత్రలకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పదార్థవాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడలేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ద్వైదీ భావజాలం పరిఢవిల్లుతోంది. అందువల్లే అక్కడ రూపొందే విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణల్లో వెనుక బడిపోతున్నారు. ఫలితంగా మన విశ్వ విద్యాలయాల కోసం చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వ్యర్థమైపోతోంది. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతోంది. శాస్త్ర సాంకేతిక జ్ఞానం వల్ల చైనా, జపాన్, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనదగ్గర అది కనిపించకపోవడానికి శాస్త్ర జ్ఞాన లోపమే కారణం. నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, రాజకీయ పాఠశాలల్లో విస్తృ తంగా బోధించకపోవడం వల్ల నైతిక శక్తి సైతం తగ్గిపోతూ వస్తోంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకుని ఇతర దేశాల్లో దాచుకునేవారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞాన శూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం సహజమైపోయింది. రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడం వల్ల పేరుకు 140 కోట్లు మంది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు 20 కోట్ల మంది కంటే తక్కువే ఉన్నారని అర్థ మవుతుంది. శ్రామికుడిని హీనంగా చూస్తూ విగ్రహా లను ఆధారం చేసుకుని బతికే వారిని పండితులుగా, భూదేవతలుగా కొనియాడటం జరుగుతోంది. రాగ ద్వేషాలను, కుల మత వైరుధ్యాలను పెంచే సంఘర్షణోన్మాద, యుద్ధోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిరత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి... నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి లాంటివాడని, అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధ బోధనలు చెబుతున్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకారం పుట్టుకలో గానీ, మరణంలోగానీ మానవులందరూ ఒకే రకంగా ఉన్నారు. ఒకే కులంలోని వ్యక్తులు కూడా అనేక వృత్తులు చేపడుతున్నారు. కానీ మనసుల్లో వర్ణభేదాలు, కుల భేదాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించుకోలేక పోతున్నారు. గొప్ప జీవశాస్త్ర జ్ఞానమున్న వాళ్ళు కూడా మంత్ర గాళ్లకు, జ్యోతిష్యులకు లొంగిపోతున్నారు. వ్యవసాయ దారులు, వర్తకులు, విద్యావంతులు కూడా వీరికి బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్ర జ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవుని హుండీల్లో వేస్తున్నారు. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తన వల్ల రుజువు కావాలి కానీ దేవుడికి ఇచ్చే కానుకల వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పు చేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు. కనీసం ఇప్పటికైనా మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ కలుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య, సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. (క్లిక్: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కత్తి పద్మారావు కవి, దళితోద్యమ నాయకుడు -
సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్
సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! తెలుగు సైన్స్ ఫిక్షన్కు కూడా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కారణమయ్యిందా? ఇలాంటి ప్రశ్న ఎదురైతే, ఆశ్చర్యపడేవారు ఎందరో ఉన్నారు! కానీ నిజం, ఈ చరిత్ర తెలుసుకుంటే! సైన్స్ మూలసూత్రాలను ఆకళింపు చేసుకుని, ఆ పునాదులపై కల్పనలను పేనుకుని సాహిత్య సృజన చేస్తే అదే ‘సైన్స్ ఫిక్షను’ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1926ను సైన్స్ ఫిక్షను అనే ప్రక్రియను నిర్వచించి, దానికి ప్రాధాన్యత ఇచ్చిన సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే తెలుగు సైన్స్ ఫిక్షను కథ వెలుగు చూడటం మనకు గర్వకారణం. ‘పరమాణువులో మేజువాణి’ అప్పటికి స్వాతంత్య్ర జ్వాలలు వ్యాపించడం మొదలై పుష్కరమైంది. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం, జలియన్ వాలాబాగ్ దురంతం, విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలతో మన దేశం అట్టుడికిపోతోంది. అలాంటి 1927, 1928 సంవత్సరాలలో రూపం పోసుకున్న సైన్స్ ఫిక్షను సందర్భం.. ఖచ్చితంగా ఆ నేపథ్యాన్ని తిరస్కరించే అవకాశమే లేదు! తెలుగు తొలి సైన్స్ ఫిక్షన్ కథ ‘పరమాణువులో మేజువాణి’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు. రెండో కథ ‘అదృశ్యవ్యక్తి’ని ఒద్దిరాజు సీతారామచంద్రరావు అదే పత్రికలో 1928 అక్టోబరు సంచికలో రాశారు. కేవలం పదినెలల వ్యవధిలో ఈ రెండు కథలు హైదరాబాదు నుంచి వెలుగు చూడటం గర్వకారణం. మొదటి కథను రాసిన కథకుడి నేపథ్యం ఉద్యమ పోరాటం కాగా, రెండో కథ ఉద్యమ పోరాటంతో ముగుస్తుంది. గాంధీజీ ప్రస్తావన ‘‘... భోగము వాండ్రకు వృత్తి మాన్పించి, మేజువాణీలను మారు మూలలకు ద్రోసివైచి యప్పుడే పాతిక సంవత్సరములు దాటినవి. అక్కడక్కడ నలుసులు మిగిలినా మహాత్ముని మొన్న మొన్నటి చీవాట్ల ముందర నదృశ్యములాయెనని చెప్పవచ్చును..’’ అని తొలి పేరాలోనే గాంధీజీ ప్రస్తావన ‘పరమాణువులో మేజువాని’ కథలో కనబడుతుంది. అలాగే రచయితకుండే సంఘసంస్కరణ దృష్టి కూడా ద్యోతకమవుతుంది. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లినట్టు, ఇక్కడ కథకుడు పరమాణువులోనికి వెళ్లిరావడం వస్తువు. అయితే,ఈ కథకుడి జీవితం మరింత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం! హైదరాబాదులో బి.ఎస్సీ చదివిన సిరిగూరి జయరావు పరిశోధన చేయాలని సర్ సి.వి.రామన్ వద్ద కలకత్తాలో చేరారు. అక్కడ ఉండగానే 1927లో ఐ.సి.ఎస్ (ఇప్పటి ఐ.ఏ.ఎస్.) పరీక్ష ఉత్తీర్ణుౖలై మధ్యప్రదేశ్ ప్రాంతంలో కలెక్టరుగా చేరారు. సంఘసంస్కరణ, స్వాతంత్య్రోద్యమం ప్రాముఖ్యత తెలిసిన జయరావు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని తలంచారు. అలాంటి నేపథ్యంతో అప్పటికే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్.హెచ్.వి. కామత్ను కలిసి, చర్చించి నిర్ణయం తీసుకోవాలని జయరావు తలంచారు. కామత్ను కలవాలని కారులో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో 33 సంవత్సరాల వయస్సున్న జయరావు కన్ను మూయడం కడు విషాదం! జయరావు జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిని రగుల్చుతాయి. అదృశ్య వ్యక్తి తెలంగాణ గ్రామసీమల్లో సైన్స్ పరికరాలు తొలుత పరిచయం చేసిన వారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు రాఘవ రంగారావు, సీతారామచంద్రరావు సోదరులు ఉర్దూ, పార్శీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలను అదనంగా నేర్చుకుని సంగీతం, చరిత్ర, విజ్ఞానం, వైద్యం వంటి విషయాలను అధ్యయనం చేశారు. పిండిమర, టార్చిలైటు, ఇంకుపెన్ను, నీరు తోడే యంత్రం వంటి ఎన్నో వాటిని ఈ ప్రాంతానికి పరిచయం చేసింది వీరే. తమ్ముడు సీతారామచంద్రరావు రాచకొండ, కోహినూరు, ఇనుగుర్తి వంటి చరిత్ర విషయాల గురించి అధ్యయనం చేశారు. ఎన్నో రచనలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘నౌకా భంగం’ నవలను కూడా అనువదించారు. సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! ప్రయోగశాలలో దృశ్యం, అదృశ్యం అనే దృగ్విషయంపై పరిశోధించే యువ శాస్త్రవేత్త నళినీకాంతుని కథ ఇది. ప్రయోగంలో జరిగిన పొరపాటు వల్ల కథానాయకుడు అదృశ్యమౌతాడు. ‘నా యిచ్ఛ కొలది వచ్చితిని’ ఈ కథ చివరలో బ్రిటిషు సార్జెంటు కథానాయకుడితో ఇలా అంటారు, ‘‘... నీ నిర్మాణం, నీ బలము తుచ్ఛమైపోయినవి. ఏలయన నిన్ను మేము పట్టుకొంటిమి. మమ్ము పట్టుకొనువాడెవరు కాన్పించడే!’’. దీనికి జవాబుగా ‘‘అబద్ధం. సర్వదా అబద్ధము. నేను నా యిచ్ఛ కొలది వచ్చితిని’’ అని అంటాడు కథానాయకుడు నళినీకాంతుడు. అంతేకాదు ఈ వాక్యము ముగిసేలోపు సార్జెంటు ముఖం పై బలమైన దెబ్బ తగులుతుంది. పడిపోయిన సార్జెంటు లేచి పిస్తోలు తీసి రెండుసార్లు కాల్చగా కేవలం గోడకు దెబ్బ తగిలిందని కథ ముగుస్తుంది. తెలుగు సైన్స్ ఫిక్షన్ కథలు అధ్యయనం చేస్తున్నప్పుడు తొలుతే ఈ స్ఫూర్తికరమైన విషయాలు తారసపడిన ఎంతో ఉత్సాహం కల్పిస్తాయి! – డా. నాగసూరి వేణుగోపాల్ ప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
రాకాసి బిలం.. సెకనులో భూమినే మింగేసేంత పవర్ఫుల్
ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఉంది.. ఒక్క బ్లాక్హోల్(కృష్ణ బిలం)కే. స్పేస్టైమ్ ప్రాంతంగా పేరున్న బ్లాక్ హోల్ నుంచి.. ఏ కణమూ, చివరికి కాంతి లాంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏవీ తప్పించుకోలేవు. అలాంటిది భూమి లాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి ఉంటే.. ?.. ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్హోల్ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు. పైగా సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్నదిగా భావిస్తున్న ఆ బ్లాక్హోల్ సైజు కూడా జెట్ స్పీడ్తో పెరుగుతోంది. అది ఎంతలా అంటే.. సెకనులోనే భూమి సైజు ఉన్నంత పరిణామాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్ హోల్స్తో ఈ భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు!. ► స్కై మ్యాపర్ అనే టెలిస్కోప్ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్’ను గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్ హోల్ను కనిపెట్టారు. ► పాలపుంత కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్ హోల్ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్ క్రిస్టోఫర్ ఆన్కెన్. ► శక్తివంతంగా.. ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్ హోల్ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్ ఈ బ్లాక్హోల్లోకి ప్రవేశించి సైజును పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. ► యాభై ఏళ్లకొకసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ.. ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్హోల్ను గుర్తించడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. ► మూడు బిలియన్ల సూర్యులు కలిస్తే ఎంత సైజు ఉంటుందో ఈ బ్లాక్ హోల్ సైజు అంతగా ఉందట!. పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. ఆర్ఎక్స్ఐవీ డేటాబేస్లో ఈ పరిశోధనను పొందుపరచగా.. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ కథనం పబ్లిష్ చేశారు. ► 14.5 విజువల్ మాగ్నిట్యూడ్ ఉన్న టెలిస్కోప్తో ఈ భారీ బ్లాక్ హోల్ను ఎవరైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్.. ఇది రెండోసారి -
తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!
సాక్షి, హైదరాబాద్: భూమ్మీద క్షీరదాల (పాలిచ్చి పెంచే జీవుల) ఉనికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అవి తొలుత ఎక్కడ పుట్టాయి? ఎక్కడెక్కడ తిరిగాయి? అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అలా ఇప్పటివరకు ఎక్కడో అర్జెంటీనాలో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు దొరకగా.. ఆ తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలోనే వాటి గుట్టు బయటపడింది. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో పరిగి మండలం పరిధిలోని నష్కల్లో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు లభించాయి. అమెరికా కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ పేలియోజియోగ్రఫీ, పేలియోక్లైమటాలజీ, పేలియోఎకాలజీ (పేలియో3) ఈ వివరాలను తమ ఆన్లైన్ జర్నల్స్లో ప్రచురించింది. ఏప్రిల్లో ముద్రణగా దీన్ని ప్రచురించనుంది. తొలినాళ్ల క్షీరదాలేమిటి..? కోట్ల ఏళ్ల కింద భూమిపై రాక్షస బల్లులు, ఇతర సరీసృపాలదే రాజ్యం. ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం అవి అంతరించిపోయాయి. ఆ సమయంలోనే క్షీరదాల (పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు) ఉనికి మొదలైంది. చిన్నగా ఎలుకల పరిమాణంలో ఉండే క్షీరదాలు కలుగుల్లో, చెట్ల పొదల్లో మనుగడ సాగించాయి. డైనోసార్లు అంతమయ్యాక వాటికి శత్రువులు తగ్గి.. పరిణామం చెందాయి. ఇప్పుడున్న చాలా రకాల జంతువులుగా మారాయి. నాటి తొలితరం క్షీరదాల ఆధారాలు మొదట్లో అర్జెంటీనా దేశంలో వెలుగు చూశాయి. చాలా ఏళ్లపాటు ప్రపంచానికి ఆ వివరా లే దిక్కయ్యాయి. తర్వాత మన నష్కల్ ప్రాంతంలో ఆధారాలు బయటపడ్డాయి. స్వాతంత్య్రానికి పూ ర్వం 1930 దశాబ్దంలో ప్రఖ్యాత జియాలజిస్టు శర్మ.. ఈ ప్రాంతంలో రాక్షస బల్లుల శిలాజాలతోపాటు ఇతర జీవుల జాడలు గుర్తించారు. చదవండి: (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) తర్వాత 1970ల్లో ఎన్వీబీఎస్ దత్త మరికొన్నింటిని గుర్తించారు. ఇలా నష్కల్, దానికి చేరువలో ఉన్న బసిరెడ్డిపల్లి, రంగాపూర్ మధ్య జీవ మహాయుగం (మోసోజోయిక్ పీరియడ్) నాటి జీవ పరిణామానికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ క్రమంలో 1980ల్లో సహానీ, జీవీఆర్ ప్రసాద్ల బృందం తొలిసారి పురాతన క్షీరదాల ఆధారాలు సేకరించింది. ఆ వివరాలు ఇప్పటికే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. ఇక 1990 దశకంలో ప్రఖ్యాత జి యాలజిస్టు అనంతరామన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. నష్కల్ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధన చేసి.. పురాతన సూక్ష్మ క్షీరదాలకు చెందిన దంత శిలాజాలను సేకరించింది. వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి.. అవి డైనోసార్లు అంతరించే కాలానికి చెందిన, తొలితరం క్షీరదాలని తేల్చింది. ఈ వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ పేలియో3లో ప్రచురితం అవుతున్నాయి. ఎంతో తృప్తినిచ్చింది తొలితరం క్షీరదం జాడకు సంబంధించి నష్కల్ ప్రాంతంలో ఆధారాలు దొరికాయి. ఇక్కడ చేసిన పరిశోధన ఎంతో తృప్తినిచ్చింది. మరింత పరిశోధన చేస్తే ఎన్నో రహస్యాలకు సమాధానం చెప్పే ఆధారాలు దొరకవచ్చు. – అనంతరామన్, పరిశోధన బృందం సభ్యుడు గొప్ప పరిశోధనకు గొప్ప గుర్తింపు నష్కల్ ప్రాంతం ఎన్నో జియోలాజికల్ రహస్యాలను ఛేదించే ఆధారాలకు కేంద్రం. క్షీరదాల పుట్టుక ఆధారాలు మొదట్లో అర్జెంటీనాలోనే వెలుగుచూశాయి. మన దేశంలో తొలి సారి నష్కల్లోనే బయటపడ్డాయి. ఇక్కడ తొలితరం క్షీరదాల దవడ శిలాజాలు సేకరిం చాం. వాటిపై అనంతరామన్ బృందం విస్తృత పరిశోధన చేసింది. ఈ వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమవడం సంతోషం. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
శాస్త్రవేత్తల కృషితోనే కరోనాపై విజయం
లాలాపేట (హైదరాబాద్): మన శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్ కారణంగానే కరోనాపై భారత్ విజయం సాధించగలిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తల కృషి ఎంతో గొప్పదని, అధికారులు, ప్రజల సహకారం కూడా దీనికి తోడైందని పేర్కొన్నారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సైన్స్ వారోత్సవాల కార్యక్రమంలో శనివారం కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోసం 150 దేశాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో 170 కోట్ల డోస్ల వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేసినట్లు వివరించారు. కరోనా కాలంలో దేశంలో పదివేల స్టార్టప్ కంపెనీలు ప్రారంభమైనట్లు తెలిపారు. శాస్త్రజ్ఞులు, మేధావుల కృషివల్ల నేడు మనదేశం వ్యాక్సిన్, పీపీఈ కిట్లను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. కాగా, ఉక్రెయిన్లో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. దేశంలో పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఎన్ఐఎన్ చేస్తున్న పరిశోధనలను వివరించారు. తర్వాత కిషన్రెడ్డి ఎన్ఐఎన్లో సైన్స్ ప్రదర్శనను తిలకించారు. -
నిట్లో సైన్స్ వారోత్సవాలు ప్రారంభం
కాజీపేట అర్బన్: హనుమకొండ కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సైన్స్ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ ప్రసార్ సౌజ న్యంతో స్కోప్ ప్రాజెక్ట్ ద్వారా మంగళవారం నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ స్థాయి సైన్స్ వారోత్సవాలను న్యూఢిల్లీ కేం ద్రంగా ఆన్లైన్లో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, జితేందర్సింగ్ ప్రారంభించారు. అదే సమ యంలో నిట్ క్యాంపస్లో సెంట్రల్ యూని వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ జేజే రావు ప్రారంభించారు. అటవీశాఖ ప్రదర్శన, శాస్త్ర వేత్తల ఛాయాచిత్రాల ప్రదర్శన, సైన్స్ ఎగ్జి బిట్స్, పుస్తకప్రదర్శనతో కూడిన సైన్స్ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యా ప్తంగా 75 కేంద్రాల్లో సైన్స్ వారోత్సవాలను ఆయా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండగా, ఏపీ, తెలంగాణల్లో సైన్స్ అండ్ టెక్నాల జీని తెలుగులో అందజేసేందుకు వేదికగా నిట్ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
మానవ గమనంలో ఒక మజిలీ
తుపాకి గుండు చేసిన కన్నాల ఆధారంగా నేరం ఎలా జరిగిందో ఊహించి, అన్వేషించి నిర్ధారణ చేయడం వంటిది – సైంటిఫిక్ మెథడ్! తొలిసారి సైన్స్ మెథడ్ను ప్రతిపాదించింది ఫ్రాన్సిస్ బేకన్! వైజ్ఞానిక పరిశోధనకు, అప రాధ పరిశోధనకూ సామ్యముంది. శాస్త్రవేత్త ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ లాంటి వాడే కానీ, అపరాధ పరిశోధక కథారచయిత వంటివాడు కాదు. కథా రచయిత ముందుగానే తన కథా పరిణామాన్ని మనస్సులో ఉంచుకుని, తదనుకూలంగా ఆధారాలనూ, సన్నివేశాలనూ సృష్టించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ‘ఫ్రాన్సిస్ బేకన్’ పూర్వపు విజ్ఞానవేత్తలందరూ ఈ తరగతికి చెందినవారు. ఒక భావాన్ని ముందుగానే సిద్ధాంతీకరించుకుని తన దృక్పథంలోకి వచ్చిన అంశాలను తదనుగుణంగా సమర్థించుకోవడం వారి పద్ధతి. ఆ విధంగా పొందు కుదరనివి అసహజమనీ, అసంబద్ధాలనీ తోసిపుచ్చడం వారి ఆచారం– ఇదీ 1955లో ‘సైన్స్ ఇన్ అవర్ లైవ్స్’ అనే పుస్తకంలో సైన్స్ రచయిత రిచ్చీ కాల్డర్ అభిప్రాయం! కనుకనే మానవ గమనంలోనే ఫ్రాన్సిస్ సైన్స్ పద్ధతి ఒక మజిలీగా మలుపు తిప్పింది. ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించే దృష్టి మారిపోయింది ఆయన కారణంగానే. ఆధునిక విజ్ఞాన పద్ధతికి ఆద్యుడుగా ఫ్రాన్సిస్ను పరిగణి స్తారు. బేకన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. లాయర్ చదువు తర్వాత రాజకీయాలలో రాటుదేలి జీవిత చరమాంకంలో ‘నేచురల్ ఫిలాసఫీ’ మీద దృష్టి పెట్టి చిరస్మరణీయమైన కృషి చేశారు. (చదవండి: అణచివేతను ధిక్కరించిన అరుణపతాక) 1561 జనవరి 22న లండన్లో జన్మించిన ఫ్రాన్సిస్ బేకన్ మతం, న్యాయం, రాజకీయాలలోనే కాకుండా సైన్స్ విషయాలలో కూడా నిష్ణాతులు. తండ్రి పొందిన ఛాన్స్లర్ పదవి సాధించినవాడు ఫ్రాన్సిస్. ఆయన తల్లి గ్రీకు, లాటిన్, ఇటలీ, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులు. 1581లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై, తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్లో కూడా సభ్యుడై మొత్తంమీద 37 ఏళ్లు పార్లమెంటు మెంబ ర్గా కొనసాగారు. రాజకీయంగా ఎత్తు పల్లాలు బాగా ఎరి గిన ఫ్రాన్సిస్ బేకన్ ఆర్థికంగా కూడా సమస్యలు ఎదు ర్కొన్నారు. అటార్నీ జనరల్ (1613–17)గా, లార్డ్ ఛాన్సలర్ (1617–21)గానూ ఆయన వ్యవహరించారు. ఆలోచనా ధోరణిలో, పరిశీలనా పద్ధతిలో అంతకు ముందున్న ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారిని బేకన్ విభేదించి తన మార్గంలో ముందుకు పోయారు. చాలా రకాలుగా కృషి చేసిన ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించిన ‘కో ఆపరేటివ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్’ భావన తర్వాత కాలంలో రాయల్ సంస్థ ఏర్పడటానికి దోహదపడింది. చివరి దశలో ప్రయోగాలు చేస్తూ న్యూమోనియా సోకి 1626 ఏప్రిల్ 9న కన్ను మూశాడు. వారు ప్రతిపాదించిన సైన్స్ పద్ధతి తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
సైన్స్ సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
వింత జీవి: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!
Interesting Facts In Telugu About Octopuses: మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్ను గ్రహాంతర జీవిగా చెప్పుకోవడం వినేవుంటారు. అందుకు కారణం దాని శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. సహజంగా జపాన్, అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్లు అధికంగా కనిపిస్తాయి. ఆక్టోపస్ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు చొప్పున ఉంటుంది. కంట్రోల్ మూవ్మెంట్ మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్షంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆక్టోపస్కు ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్లో కాపర్ అధికంగా ఉండే హిమోసైనిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఈ ఆక్టోపస్లో క్రొమటోఫోర్స్ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు. ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఆక్టోపస్ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి... గమనించారా? ఐతే ఆడ ఆక్టోపస్లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడ ఆక్టోపస్లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! -
జాత్యాహంకారాన్ని రూపు మాపే సరికొత్త సైన్స్ సిద్ధాంతం
అమెరికాలో జాత్యాహంకారం ఎంతలా కోరలు చాచుకుందో మనకు తెలిసిందే. అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు ఈ జాత్యాహంకార కోరల్లో చిక్కుకుని నిరాదారణకు గురైనవారు కోకొల్లలు. నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ నుంచి నేటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు అందరూ ఈ సమస్యతో పోరాడినవారే. అయినప్పటికీ ఇంకా అమెరికాలో అక్కడక్కడ నిగురుగప్పిన నిప్పులా జాత్యాహంకారం రగులుతూనే ఉంది. కానీ వీటన్నింటిని కూకటివేళ్లతో సహా పెకలించేసేలా ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త బిల్ నై తన సరికొత్త సైన్స్ సిద్ధాంతాలను వివరించారు. (చదవండి: సీఎస్కే జెర్సీ వేసుకుంటానంటే నా భార్య ఊరుకోలేదు..!) ఈ భూమి మీద నివశించే మనుషుల రంగు అందరిదీ ఒకేలా ఎందుకు ఉండదో ప్రపంచ పటం సాయంతో చాలా చక్కగా వివరించారు. అంతేకాదు సూర్యుని ఉష్ణోగ్రత భూమధ్య రేఖ వద్ద అధికమని , ధృవాల వద్ద ఉష్ణోగ్రత తక్కువుగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మనుషులంతా ఆఫ్రికన్ సంతతే అని అన్నారు. మానవ సంచారం కారణంగానే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నామని, పైగా అక్కడ ఉన్న కొత్త వాతావరణానికి తగ్గట్టుగా మన శరీర రంగు మారిందని వెల్లడించారు. అందువల్లే మనుషుల అందరీ రంగు ఒకేలా లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచ పటంలోని ఆయా దేశాల రంగుల ద్వారా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కొన్ని ప్రదేశాలపై ఎంతగా ప్రసరిస్తాయో కూడా వివరించారు. అయితే అతినీలోహిత కిరణాల మార్పును బట్టే చర్మం రంగు కూడా మారుతుంటుందని చెప్పారు. దీనికీ తగిన విధంగా శరీరం విటమిన్ డి , ఫోల్లేట్ విటమిన్లు విచ్ఛిన్నం కాకుండా సమతుల్యం చేసుకుంటుందని చెప్పారు. మనందరం ఒకటేనని కానీ మనం శరీరం రంగుతో మనల్ని మనమే వేరుచేసుకుంటూ... సమస్యలు సృష్టించుకుంటున్నాం అని ఒక సరికొత్త సైన్స్ సిద్ధాంతాన్ని వివరించారు. ఈ మేరకు అమెరికన్ ప్రముఖ బాస్కెట్బాల్ ప్రొఫెషనల్ రెక్స్ చాప్మన్ ఈ వీడియో తోపాటు "బిల్ నైల్ సరికొత్త సిద్ధాంతంతో జాత్యాహంకారాన్ని పూర్తిగా తుడిచి పెట్టేశారు" అనే ట్యాగ్ లైన్తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఒకరేమో భూమిపై ఉన్న "ప్రతి ఒక్క వ్యక్తి హోమోసేపియన్స్( అందరూ ఒకే జాతి). " అని మరొకరేమో జన్యుపరంగా మనమంతా ఒకటే అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు మిలియన్స్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: వాషింగ్టన్ రహస్య భూగర్భ రైలు మార్గం) -
యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అద్వాయ్ మిశ్రా రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచంతో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకరిగా నిలిచాడు. నేషనల్ సైన్స్ బీ అనేది బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రనామీ, మ్యాథమెటిక్స్, తదితర శాస్త్ర రంగాలకి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నల బజర్ ఆధారిత సైన్స్ పోటీ. (చదవండి: క్యాన్సర్పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు) ఈ బజర్ ఆధారిత ప్రాంతీయ, నేషనల్ చాంపియన్ షిప్ పోటికి విద్యార్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అద్యాయ్ మిశ్రా వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న ఇంటర్నేషనల్ జాగ్రఫీ బీ వరల్డ్ చాంపియన్షిప్ పై దృష్టి సారించనున్నాడు. వృత్తి రీత్యా తల్లిదండ్రులు అమెరికాలో ఉండటంతో వారితో 2018 వరకు అమెరికాలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిశ్రా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ టాలెంటడ్ యూత్ (సీటీవై)లో కూడా ప్రవేశం పొందాడు. ఈ యూనివర్సిటీలో మార్క్ జూకర్ బర్గ్ , గూగుల్ వ్యవస్థాపకులు రోడ్స్ స్కాలర్, మార్క్ ఆర్థర్ ఫెలోస్ తదితర ప్రముఖులు పూర్వ విద్యార్థలు కావడం విశేషం. (చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. బస్సు ఒక్క అడుగు ముందుకు కదిలినా..) -
వాటర్తో గోల్డ్! వాట్ ఏ టైమింగ్
నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నీటి విషయంలో.. నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. సిరంజీ సాయంతో.. పిరియాడిక్ టేబుల్లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. రిస్క్ ఉంది అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్’ జర్నల్లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. -
వయసు 18.. శరీరం 144 ఏళ్లు! పోరాడి ఓడిన అమ్మాయి
పుట్టిన ప్రతీ ప్రాణికి ఏదో ఒకరోజు చావు తప్పదు. కానీ, ఆమె మాత్రం తన మరణం గురించి ముందే తెలుసుకుంది. అరుదైన జబ్బుతో బాధపడుతున్నా.. దుఖాన్ని దిగమింగుకుంది. సంతోషంగా ఉంటూ.. కన్నవాళ్లనూ, తోబుట్టువును నవ్వించేందుకు ప్రయత్నించింది. చివరికి బతుకు పోరాటంలో మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. యూకేకు చెందిన అశాంతి స్మిత్(18)గాథ ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది. యూకే వెస్ట్ సస్సెక్స్కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి Ashanti Smith.. జులై 17న కన్నుమూసింది. ఆమె ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రోగేరియా’ అనే అరుదైన సిండ్రోమ్తో బాధపడుతూ వచ్చింది. ఇదొక జెనెటిక్ డిసీజ్. ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్లకు చిన్నవయసులో వయసు మళ్లిన లక్షణాలు వస్తాయి. స్మిత్ ఎనిమిదవ ఏట నుంచి ఈ సిండ్రోమ్ తీవ్ర ప్రభావం చూపెడుతూ వస్తోంది. అప్పటి నుంచి ఏడాదికి.. ఎనిమిది రేట్ల వయసు పెరుగుతూ వస్తోంది. చివరికి.. పద్దెనిమిదేళ్ల వయసులో ‘పండు ముసలి’ లక్షణాలతో నరకం అనుభవిస్తూ ఆమె తుది శ్వాస విడిచింది. నవ్వుతూ బతకమంది అశాంటి స్మిత్.. బతికినంత కాలం ఆత్మస్థైర్యంతో బతికిందని ఆమె తల్లి లూయిస్ స్మిత్ గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతోంది.‘తనకు ఉన్న జబ్బు గురించి అశాంటికి తెలుసు. ఎక్కువ కాలం జీవించదని కూడా తెలుసు. అయినా సంతోషంగా ఉండాలనుకుంది. అవతలి వాళ్లు తన గురించి ఏమనుకున్నా, జాలి పడినా.. అందరినీ నవ్విస్తూ బతికింది. మా కన్నీళ్లు తుడుస్తూ నవ్వుతూ ఉండాలని కోరేది. ఆమెకు బీటీఎస్ సంగీతం అంటే ఇష్టం. ఆమె అంత్యక్రియలు ఆ సంగీతంతోనే ముగిస్తాం. ఇక నుంచి ప్రొగెరియా సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల చేయూత కోసం పని చేస్తాన’ని చెబుతోంది లూయిస్. ప్రొగేరియా అంటే.. డీఎన్ఏ సంబంధింత జబ్బు. రెండు కోట్ల మందిలో ఒకరు ఈ సిండ్రోమ్తో పుట్టే ఛాన్స్ ఉంది. 1886లో జోనాథన్ హట్చిన్సన్ అనే సైంటిస్టు ఈ సిండ్రోమ్ను గుర్తించాడు. ఆపై గిల్ఫోర్డ్ అనే సైంటిస్ట్ పూర్తి స్థాయి అధ్యయనం చేయడంతో.. ‘హట్చిసన్-గిల్ఫోర్డ్ ప్రొగేరియా’ అనే పేరు వచ్చింది. ఈ జబ్బుకు పూర్తిస్థాయి చికిత్స లేదు. వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకుంది. అందుకే విరాళాల సేకరణతో పిల్లల్ని బతికించుకునే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. 2020 సెప్టెంబర్ నాటికి 53 దేశాల్లో.. 179 కేసులు రికార్డు అయినట్లు ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్ చెబుతోంది. చాలామంది ఈ వ్యాధితో చనిపోగా.. కొన్ని కేసులు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి కూడా. లక్షణాలు ప్రొగేరియా ఒక జెనెటిక్ డిసీజ్.. డీఎన్ఏ విపరీతమైన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ఈ డిసీజ్ వల్ల చర్మం మారుతుంది.. ముడుతలు పడుతుంది. జుట్టు ఊడిపోతుంది. వయసుకు సంబంధించిన ప్రతికూల లక్షణాలు శరీరంలో ఏర్పడతాయి. లక్షణాలు ఏడాది వయసు నుంచి కనిపించొచ్చు. లేదంటే ఆలస్యంగా బయటపడొచ్చు. జెనెటిక్ పరీక్షల ద్వారా మాత్రమే దీనిని నిర్ధారించుకోవచ్చు. ఈ డిసీజ్ గుండె జబ్బులకు దారితీస్తుంది, ఒక్కోసారి కదల్లేని స్టేజ్కు చేరుకుంటారు. పేషెంట్లలో 90 శాతం స్ట్రోక్స్తో చనిపోతుంటారు. బ్రాడ్ పిట్ నటించిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’(2008) ఇలాంటి సబ్జెక్ట్తో తీసిన కథే. అందుకే బెంజమిన్ బటన్ డిసీజ్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మూవీకి ఇన్స్పిరేషన్.. అమెరికన్ శాన్ బెర్న్ జీవితం. 1996లో పుట్టిన శాన్బెర్న్.. ప్రొగేరియా పేషెంట్. అందుకే ఆ డిసీజ్ అవగాహన కోసం కృషి చేశాడు. చివరికి పద్దెనిమిదేళ్ల వయసులో యువ ఉద్యమవేత్తగా కన్నుమూశాడు. మరణానంతరం శాన్బెర్న్ పేరెంట్స్ ‘ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్’ స్థాపించి.. ఆ వ్యాధి పట్ల అవగాహన కోసం కృషి చేస్తున్నారు. -సాక్షి, వెబ్డెస్క్ -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
40 ఏళ్ల తర్వాత కంటిచూపు.. అవుంటేనే చూడగలడు!
లండన్ : కొత్త పుంతలు తొక్కుతున్న సైన్స్ పరిజ్ఞానంతో అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలు సుసాధ్యాలుగా మారాయి. మారుతూనే ఉన్నాయి. మనిషి ధీర్ఘకాలిక శారీరక లోపాలకు సైతం సైన్స్ చక్కటి పరిష్కారాలను అందిస్తోంది. సైన్సు పుణ్యమా అని తాజాగా ఓ 58 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల తర్వాత లోకాన్ని చూడగలుగుతున్నాడు. వివరాలు.. ఇంగ్లాండ్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దాదాపు నలభై ఏళ్లుగా ‘రెటినిటిస్ పిగ్మంటోస’ అనే కంటి సంబంధ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కంటి వెనకాల ఉండే రెటీనా దెబ్బతినటంతో రెండు కళ్లూ కనిపించటం లేదు. కొద్దిరోజుల క్రితం పరిశోధకులు అతడికి ‘జెనరిక్ ఇంజనీరింగ్ అండ్ లైట్ యాక్టివేటెడ్ థెరపీ’ నిర్వహించారు. దీంతో కొన్ని నెలల వైద్యం తర్వాత ఓ కన్ను పాక్షికంగా కనిపించటం మొదలైంది. ఇప్పుడు ‘లైట్ స్టిములేటింగ్’ కంటి అద్దాల సహాయంతో వస్తువులను చూస్తున్నాడు.. వాటిని ముట్టుకోగలుగుతున్నాడు. అతడికి కంటి చూపు రప్పించటానికి పరిశోధకుల బృందం తీవ్రంగా శ్రమించింది. ‘ఆప్తోజెనిటిక్స్’ అనే పక్రియను వారు ఉపయోగించారు. జెన్యుపరంగా రెటీనాలోని కణాల్లో మార్పులు చేసి, లైట్ సెన్సిటివ్ ప్రొటీన్స్ను ఉత్పత్తి చేశారు. ఈ ప్రయోగం ఫలితాన్నిచ్చి ఓ కంటిలో మార్పు చోటుచేసుకుంది. అనంతరం, ఓ ప్రత్యేకమైన కంటి అద్దాలను తయారుచేశారు. ఈ అద్దాలు అన్నింటినీ ఫొటో తీసి రెటీనాకు చేరవేస్తాయి. దీంతో ఆ వస్తువులు కనపడతాయి. జన్యుపరంగా మార్పులు చేయబడిన కణాలు మామూలు స్థితికి రావటానికి సదరు వ్యక్తికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చారు. కొన్ని నెలల శిక్షణ తర్వాత పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. చదవండి : ఒక్కసారిగా మీదకు దూకిన శివంగి.. పరుగులు తీసిన జనం -
సైన్స్లో సోనాలి కామర్స్లో సుగంధ ఆర్ట్స్లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్లో, ఔరంగాబాద్కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్ఫోన్ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు
మన భారతీయ ప్రాచీన ఆరోగ్య విద్య యోగా ద్వారా కరోనాను అల్లంత దూరంలో ఉంచడం సాధ్యమే అంటున్నారు సాధకులు! అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజు (జూన్ 21, ఆదివారం)న ఒక్కసారి.. ఆధునిక సైన్స్ కూడా నిర్ధారించిన యోగాసన ప్రయోజనాలు ఏమిటో?.. కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో చూద్దామా? జూన్ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజిది. దేశదేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం. అయితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. (కోటి మంది యోగా చేస్తారు) ‘‘ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్తో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది. ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్ చానల్లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్దేవ్ ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. హ్యూస్టన్లోని భారతీయ కౌన్సిల్ జనరల్ ఉదయం పది గంటలకు రెండు గంటల లైవ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్సాస్లోని సాన్ఆంటోనియోలో రోజంతా యోగథాన్ జరగనుంది. నెదర్లాండ్స్ పోలీస్ విభాగం కూడా ఆన్లైన్ మాధ్యమంలో యోగాసనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం. సైన్స్ చెప్పే యోగా లాభాలు... మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిసోల్ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు జరిపిన ఒక కార్యక్రమంలో సుదర్శన క్రియ యోగాను అభ్యాసం చేయించినప్పుడు వారిలో మనో వ్యాకులతకు సంబంధించిన లక్షణాలు బాగా తగ్గిపోయాయి. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగాభ్యాసం చేసే వారి రక్తపోటు, పల్స్ రేట్ ఇతరుల కంటే తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేయగా గుండెజబ్బులు ముదరకుండా కూడా యోగా రక్షణ కల్పిస్తుందని ఇంకో పరిశోధన ద్వారా తెలుస్తోంది. నిస్సత్తువ, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు యోగా మేలైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయి. 135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది. సుఖనిద్రకు కారణమైన మెలటొనిన్ హార్మోన్ అధికోత్పత్తికి యోగా కారణమవుతుందని అంచనా. రోగ నిరోధక శక్తికి ఆరు ‘యోగాలు’ ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సలంబ భుజంగాసనం సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి. పరివృత్త ఉత్కటాసనం పరివృత్త ఉత్కటాసనం సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి. అనువిత్తాసనం అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం. -
అందులో భారత్కు మూడో స్థానం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి అత్యధిక ఆర్టికల్స్ ప్రచురించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2008లో సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి మొత్తం 17.5 లక్షల ఆర్టికల్స్ ప్రచురితమవ్వగా.. 2018 నాటికి ఆ సంఖ్య 25.5 లక్షలకు పెరిగిందని తెలిపింది. ఎన్ఎస్ఎఫ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం... అత్యధిక ఆర్టికల్స్ ప్రచురించిన దేశాలుగా చైనా, అమెరికా, భారత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్లో 2008లో 48,998 ఆర్టికల్స్ ప్రచురితమవ్వగా.. 10.73 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆ సంఖ్య 2018 నాటికి 1.35 లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఆర్టికల్స్లో చైనా 20.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 7.81 శాతంగా నమోదైంది. సైన్స్ ఆర్టికల్స్లో అమెరికా ఏడాదికి 0.71 శాతం వృద్ధి సాధించింది. సైన్స్ ఆర్టికల్స్లో టాప్-10 దేశాలు 1. చైనా (5,28,263) 2. అమెరికా (4,22,808) 3. భారత్ (1,35,788) 4. జర్మనీ (1,04,396) 5. జపాన్ (98,793) 6. యూకే (97,681) 7. రష్యా (81,579) 8. ఇటలీ (71,240) 9. దక్షిణ కొరియా (66,376) 10. ఫ్రాన్స్ (66,352) -
ఏది ప్రేమ? ఏది మోహం?..
ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వులాంటిది.. అందులోని మకరందమే ప్రేమ. ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో... ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు. ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవటానికి నెట్టింట సెర్చ్ చేస్తే దొరికే నిర్వచనాలు బోలేడన్ని. తమ అనుభవాలను, పాండిత్యాలను అంతా కలబోసి ఒక్కో మనిషి ఒకలా ప్రేమను నిర్వచిస్తాడు. కానీ, ‘‘ప్రేమ’’కు సైన్స్ ఇచ్చే నిర్వచనం వేరేలా ఉంటుంది. శరీరంలో చోటుచేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ. ఓ వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండలేకపోవటం.. ఎంత చూసినా, ఎంత మాట్లాడినా తనివి తీరకపోవటం.. పదేపదే ఆ వ్యక్తి గురించి ఆలోచించటం.. చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్ ప్రభావం ఉంటుంది. ప్రేమలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి. మొదటిది వ్యామోహం, కామం(లస్ట్).. రెండవది ఆకర్షణ(అట్రాక్సన్).. మూడవది అనుబంధం(అటాచ్మెంట్). ఈ మూడు దశలకు కొన్ని హార్మోన్లలో కలిగే మార్పులే కారణం. 1) వ్యామోహం(లస్ట్) దీన్నే మనకు అర్ధమమ్యే భాషలో కామం అని అనొచ్చు. ఇది తమ శారీరక వాంఛలు తీర్చుకునేవరకు మాత్రమే ‘‘ప్రేమ’’ను నడిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సెక్స్ హార్మోన్స్. మగవారిలో టెస్టోసిరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్ ఎదుటి వారి పట్ల సెక్స్ కోర్కెలను కలిగేలా చేస్తాయి. ఈ హార్మోన్లలో కలిగే మార్పులను బట్టి కోర్కెలలో మార్పులు సంభవిస్తాయి. 2) ఆకర్షణ( అట్రాక్షన్) అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి కండలు తిరిగి, ఆరడుగుల ఎత్తు ఉన్నాడనో ప్రేమించటమన్నది ఒకరకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. ఈ దశలో ప్రేమలు ఎక్కువ రోజులు మనలేవు. కొన్ని నెలలు.. కొన్ని సంవత్సరాలు.. ఎదుటి వ్యక్తి మనికిచ్చే ప్రాధాన్యతపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆకర్షణకు ప్రధాన కారణం డోపమైన్, నోరెపినోఫ్రిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు. ఈ హార్మోన్లు మన శరీరంపై చూపే ప్రభావం కారణంగానే ఎదుటి వ్యక్తి మీద మనకున్నది విపరీతమైన ప్రేమ అనే భావన కలుగుతుంది. ఇదే కొన్ని సందర్భాల్లో అనుబంధానికి దారితీయోచ్చు. 3) అనుబంధం(అటాచ్మెంట్) మూడవది, అతిముఖ్యమైనది ఈ దశ. ఇందులోనే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువకాలం నిలుస్తుంది. అనుబంధానికి ముఖ్యకారణం ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ అనే హార్మోన్లు. శృంగారం సమయంలో, తల్లులు తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్నపుడు, కాన్పు సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇందుకారణంగానే బంధాలు గట్టిపడతాయి. వాసోప్రెస్సిన్ హార్మోన్ కూడా బంధాలు ఎక్కువకాలం కొనసాగేలా చేస్తుంది. -
గుర్తుపట్టండి చూద్దాం!
లండన్: అర్థమైతే ఆర్టు.. అర్థం కాకపోతే మోడ్రన్ ఆర్టు అన్నాడు వెనకటికొకడు.. అయితే, ఇది ఆర్టు కాదు.. మోడ్రన్ ఆర్టు అంతకన్నా కాదు.. ఇది బీకాం ఫిజిక్స్ టైపు.. ఆర్ట్లో సైన్సన్నమాట. చూడ్డానికి ప్రముఖ చిత్రకారుడి బ్రష్ స్ట్రోక్స్లాగ ఉన్నాయి కానీ.. నిజానికిది ఎలుకలోని రక్త కణాలను చుట్టుముట్టి ఉన్న మృదువైన కండర కణజాలం. ‘రిఫ్లెక్షన్స్ ఆఫ్ రీసెర్చ్’ పేరిట బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఏటా ఈ సైన్స్ ఇమేజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఎంఆర్ఐ స్కాన్స్, మైక్రో స్కోప్లు వంటి వైద్య ఉపకరణాలను ఉపయోగించి తీసిన చిత్రాలివి. ఈ పోటీలో ‘కణసాగరం’ పేరిట కేంబ్రిడ్జి వర్సిటీలోని పీహెచ్డీ విద్యార్థి లోనా కత్బర్ట్సన్ సమర్పించిన ఈ ఎంట్రీ ఓవరాల్ విన్నర్గా నిలిచింది. అభివృద్ధి చెందుతున్న ఎలుక పిండంలో గుండె ఇమేజ్ రన్నరప్గా నిలిచింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి డాక్టర్ రిచర్డ్ టైసర్ ఈ ఫొటో తీశారు. ఆరంభ దశలో గుండె కణాలు ఎరుపు రంగులో ఉన్నాయి. గుండె అర్ధచంద్రాకారంలో ఉంచి కొట్టుకోవడం మొదలుపెట్టింది. -
తొక్కిసలాటలకు చెక్
కొన్ని ఉత్సవాలకు జనం లక్షల్లో వస్తుంటారు. ముందుకు అడుగేయలేనంత దట్టంగా గుమిగూడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఏమైనా తొక్కిసలాటలు జరగవచ్చు. ఊహించని విషాదాలు చోటు చేసుకోవచ్చు. మరి వాటిని నివారించడమెలా? దీనికి సైన్స్ ఏమైనా పరిష్కారం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు. ఇందుకు సాయపడే అల్గారిథమ్ను వారు తయారు చేశారు. గుంపులో తలెత్తిన అల్లర్లు, తొక్కిసలాట వంటివి నివారించే దిశగా పోలీసులకు ఎక్కడ మోహరించాలనే∙విషయాన్ని ఈ పద్దతి ద్వారా గ్రహించవచ్చని, తద్వారా గందరగోళాన్ని ఆదిలోనే నివారించవచ్చని వారు చెబుతున్నారు. ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో ప్రచురితమైన సంబంధిత పరిశోధనాంశం ప్రకారం – కంప్యూటర్ సిమిలేషన్ను ఉపయోగించి సురక్షిత తరలింపు విధానాలు రూపకల్పన చేసుకునేందుకు సైతం ఇది దోహదపడుతుంది. కుంభమేళాకి కోట్లాది మంది జనం తరలివస్తుంటారు. ఒక్కోరోజు రెండు కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. ఇలాంటి చోట ఏవైనా దుర్ఘటనలు సంభవిస్తే నష్టం భారీగానే వుంటుంది. ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకునే లక్ష్యంతో, అతి జనసమ్మర్థాన్ని మెరుగైన పద్ధతుల్లో నియంత్రించే ఉద్దేశంతో తాము ఈ అల్గారిథమ్ను రూపొందించామంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. అసలు ఇలాంటి తొక్కిసలాటలు ఎలా మొదలవుతాయో గమనించగలిగితే వాటిని నివారించగల మార్గాలను కూడా మనం గుర్తించవచ్చునని చెబుతున్నారు మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ మహేశ్ పంచాగ్నుల. తొక్కిసలాటల తాలూకూ తొలి సంకేతాలను అర్థం చేసుకుని, ఎక్కడ పోలీసు బలగాలు వుంచాలనేది గ్రహించడం చాలా ముఖ్యమంటున్నారు ఈయన. జనసమూహాలను క్రమబద్ధీకరించేందుకు కొన్ని చోట్ల ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేయడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదంటున్న ఈ శాస్త్రవేత్తలు.. బయటకు వేగంగా పోవడానికి వీల్లేని ప్రదేశాల్లో జనం దట్టంగా కూడినపుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోగలవో విశ్లేషించారు. ద్రవ పదార్థాలు ప్రవహించే తీరును విశ్లేషించే ఫ్లూయిడ్ డైనమిక్స్ను ఆపాదిస్తూ జనసమూహం పద్ధతి ప్రకారం ముందుకు సాగేలా చూడాలని బృందంలో భాగంగా వున్న సుమేష్ పి తంపి, అజింక్యా కులకర్ణి చెబుతున్నారు. -
ఒక విప్లవకారుడు
విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన అద్భుత జీవితం ఆయనది. ‘వీవీఎస్’ – ఈ పేరుతో టెలిగ్రామ్ వచ్చింది, ఓడలోకి. అదే పేరున్న వ్యక్తి ఆచూకీ కోసం నిఘా వేసిన స్కాట్ల్యాండ్ యార్డ్ గూఢచారి జాగరూకుడయ్యాడు. టెలిగ్రామ్ అందుకున్న వ్యక్తి సూట్కేసు మీద కూడా వీవీఎస్ అనే ఉంది. ఇక అనుమానం లేదనుకుని అడిగాడా గూఢచారి, ‘మీ పూర్తి పేరు ఏమిటి?’ సమాధానం వచ్చింది, స్థిరంగా ‘వీర్ విక్రమ్ సింగ్’ అని. మరొకసారి ఆమ్స్టర్డ్యామ్ వెళుతున్న ఓడలో రోజుకు ఐదుసార్లు నమాజు చేసే ఒక ముస్లింను కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఆయన విజిటింగ్ కార్డు తీసి ఇచ్చి తాను కలకత్తాకు చెందిన వ్యాపారవేత్తనని చెప్పారు. ఇంగ్లండ్ పోలీసులు, బ్రిటిష్ ఇండియా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి వీవీఎస్ అయ్యర్. నిజానికి సిక్కు వీర్విక్రమ్ సింగ్, కలకత్తా ముస్లిం వ్యాపారవేత్త కూడా నిజం కాదు. ఆ వేషాలలో ఉన్న వ్యక్తి వీవీఎస్ అయ్యరే. విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన అద్భుత జీవితం ఆయనది. కానీ, చెప్పుకోవడానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా, చరిత్రపుటలలో చోటు దగ్గర అన్యాయానికి గురైన వారు అయ్యర్. వరాహనేరి వేంకటేశ సుబ్రహ్మణ్య అయ్యర్ (ఏప్రిల్ 2, 1881–జూన్ 1, 1925) తిరుచురాపల్లి సమీపంలోని వరాహనేరి అనే గ్రామంలో పుట్టారు. తండ్రి వేంకటేశ అయ్యర్. శోత్రియ కుటుంబంలో పుట్టినా, ఆ రోజుల్లోనే ఎఫ్ఏ చదివారు. ఇంగ్లిష్ చదివినా ఆయన సంప్రదాయవాదిగానే ఉన్నారు. కొడుకును కూడా ఇంగ్లిష్ చదివించారు. వీవీఎస్ అయ్యర్ పద్దెనిమిదేళ్లకే బీయ్యే పూర్తి చేశారు. చరిత్ర, సాహిత్యం, లాటిన్ ఆయన ఐచ్ఛికాంశాలు. వర్జిల్, హోమర్, షేక్స్పియర్, స్పెన్సర్, హాక్స్లీ, షోపెనార్, ఎమర్సన్ వంటివారిని క్షుణ్ణంగా చదివారాయన. అయితే మాతృభాష తమిళమంటే మాత్రం మహా గౌరవం. కంబ రామాయణం కరతలామలకం. అలాగే సంస్కృతం కూడా. కాళిదాసును లోతుగా చదివారు. ఎమర్సన్ కవిత్వం మీద ఉన్న అభిమానంతో ఆయన రచనలను తమిళంలోకి అనువదించారు. చదువు అయిన తరువాత అయ్యర్ మొదట తపాలాశాఖలో చేరారు. ఆ ఉద్యోగం వదిలేసి, తిరుచ్చికి సమీపంలోనే ఉన్న వడవూర్లో బ్యాంకింగ్ వ్యాపారం ఆరంభించారు. ఇందులో రాణించారు కూడా. మళ్లీ అది కూడా వదిలేసి న్యాయశాస్త్రం చదివి, తిరుచిరాపల్లి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు. దీనితో ఆయనకి కావలసినంత డబ్బు, వెసులుబాటు దొరికాయి. మళ్లీ సాహిత్యం చదవడం ఆరంభించారు. ఎంతో ఇష్టమైన చదరంగం ఆడుకునేవారు. ఆ దశలోనే తన సమీప బంధువు పశుపతి అయ్యర్ బర్మా (మైన్మార్) నుంచి వచ్చారు. అక్కడ పెద్ద బట్టల వ్యాపారి. రంగూన్ వచ్చి ప్రాక్టీస్ పెట్టవలసిందని అయ్యర్కి ఆయనే సలహా ఇచ్చారు. అలా రంగూన్ వెళ్లిన అయ్యర్ జీవితం పెద్ద మలుపు అంచుకి ప్రవేశించింది. రంగూన్లో ఒక ఆంగ్ల బారిస్టర్ దగ్గర సహాయకునిగా చేరారు అయ్యర్. అప్పుడే ఇంగ్లండ్ వెళ్లి బారెట్లా చదవాలన్న ఆకాంక్ష కలిగింది. లండన్ వెళ్లి లింకన్ ఇన్ అనే సంస్థలో చేరారు. ఇంగ్లండ్ చేరిన తరువాత ఆయన పాశ్చాత్య సంగీతం, బాల్రూం డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అచ్చంగా ఒక పాశ్చాత్యుడిలా వేషధారణ ఉండేది. ఆయన పాశ్చాత్యుడు కాదని ఆయన దగ్గర ఉండే పెట్టి తెరిస్తే తప్ప తెలిసేది కాదు. అందులో తమిళ కావ్యాలు, సంస్కృత కావ్యాలు ఉండేవి. వేషధారణ ఎలా ఉన్నా కూడా ఆయన సంప్రదాయం వీడలేదు. ఆ సమయంలోనే శాకాహార భోజనం కోసం అన్వేషిస్తూంటే ఒక సమాచారం తెలిసింది. ఉత్తర లండన్లో హైగేట్ అనే చోట భారతీయ విద్యార్థులకు ఉద్దేశించిన ఒక వసతిగృహం ఉంది. అందులో శాకాహార భోజనం దొరుకుతుంది. గుజరాత్కు చెందిన పండితుడు, బారిస్టర్గా లండన్లో స్థిరపడిన శ్యామ్జీ కృష్ణవర్మ దానిని నెలకొల్పారు. మాతృదేశ విముక్తిని కోరుకుంటున్న కృష్ణవర్మ హోమ్రూల్ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారతదేశం ఇంగ్లండ్ పాలన నుంచి విముక్తం కావాలన్న ఆశయం ఉన్న యువకులను సమీకరించేవారు. అందులో భాగంగానే ఆ వసతిగృహం ఏర్పాటు చేశారు. దాని పేరు ‘ఇండియా హౌస్’. అది విద్యార్థి వసతి గృహమే కానీ, వాస్తవానికి భారతీయ విప్లవకారులకు కేరాఫ్ అడ్రస్. ఈ హౌస్కు రాజపోషకురాలు మేడమ్ భికాజీ కామా. 1906లో అయ్యర్ ఇండియా హౌస్లో చేరారు. ఆ సంవత్సరమే ‘హౌస్’కి చేరుకున్నారు– వినాయక్ దామోదర్ సావర్కర్. ఎందుకో మరి కొద్దికాలం తరువాత అంటే, 1907లోనే మొదటిసారి ఆ ఇద్దరు కలుసుకున్నారు. అయ్యర్ కంటే సావర్కర్ రెండేళ్లు చిన్న. కానీ సావర్కర్ అంటే అయ్యర్కు గొప్ప గురి. అయ్యర్ అన్నా కూడా సావర్కర్కి చాలా అభిమానం. సావర్కర్ హౌస్లోని విద్యార్థులకు విప్లవం గురించి చెబుతూ ఉండేవారు. భారత్ నుంచి ఇంగ్లండ్ వలస పాలకులను తరిమి కొట్టాలంటే హింసామార్గం తప్ప మరొకటి లేదని ప్రవచించేవారు. ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి గురించి చర్చించేవారు. సావర్కర్ రాసిన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ఏర్పడిన భారతీయ యువకుల బృందానికి నాయకుడు అయ్యరే. మిగిలిన ఆ యువకులంతా ఐసీఎస్ చదవడానికి లండన్ వచ్చినవారే. అయ్యర్ గారిబాల్డి జీవిత చరిత్రను తమిళంలో రాసి, పుదుచ్చేరి నుంచి వెలువడుతున్న ‘ఇండియా’ పత్రికకు పంపారు. విప్లవభావాలకు వేదికగా ఉపయోగపడిన ఆ పత్రిక సంపాదకుడు సి. సుబ్రహ్మణ్య భారతి. ఇంగ్లండ్లో భారతీయుల, వారి రాజకీయ, సామాజిక కార్యకలాపాల గురించి ‘లండన్ లెటర్’ పేరుతో అయ్యర్ ‘ఇండియా’ పత్రికలోనే ఒక శీర్షిక నిర్వహించారు కూడా. అప్పుడే కృష్ణవర్మ, మేడమ్ కామా పోలీసు నిఘా కారణంగా ఇండియా హౌస్ బాధ్యతను సావర్కర్కు అప్పగించి పారిస్ ప్రవాసం వెళ్లిపోయారు. అప్పుడే సావర్కర్ అభినవ్ భారత్ శాఖను ఆరంభించారు. దానికి అధ్యక్షుడు సావర్కర్. ఉపాధ్యక్షుడు అయ్యర్. అలా అయ్యర్ విప్లవపథానికి మళ్లారు. ఒకసారి దసరా ఉత్సవాలు జరిపినప్పుడు దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ ఇండియా హౌస్ను సందర్శించారు. అహింసా సిద్ధాంతం గొప్పదనం గురించే అక్కడి యువకులకు చెప్పారు. అందరిలాగే అయ్యర్ కూడా గాంధీ వాదనను ‘చాదస్తం’గా కొట్టి పారేశారు. ఇంతలో సావర్కర్ మీద కూడా నిర్బంధం పెరిగింది. ఆయన కూడా పారిస్ వెళ్లిపోయారు. అంతకు ముందు ఒక ఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. ఈ సంగతి సావర్కర్, అయ్యర్ల దృష్టికి తీసుకువెళ్లాడాయన. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. హౌస్లో వారం వారం జరిగే రహస్య సమావేశాల గురించి పోలీసులకు నివేదికలు ఇస్తున్నాడు. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. కానీ ఇతడిని బయటకి పంపినా వేరొకరిని ఇలాగే హౌస్లో ప్రతిష్టించక మానరు పోలీసులు. అందుకే అతడు హౌస్లో ఉండటానికే కాదు, నివేదికలు పంపేందుకూ ఒప్పించారు. కానీ ఆ నివేదికలన్నీ ముందు అయ్యర్ చూడాలి. అలా కొద్దికాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు. ఆ తరువాతే ఇండియా హౌస్ను తాత్కాలికంగా మూసివేయవలసిన పరిస్థితి ఎదురయింది. భారత్ నుంచి వచ్చిన మదన్లాల్ థీంగ్రా అనే విప్లవకారుడు కర్జన్ వైలీ అనే ఆంగ్ల అధికారిని కాల్చి చంపాడు. హౌస్ మీద నిఘా పెరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. థీంగ్రాకు ఉరిశిక్ష విధించి లండన్ జైలులోనే ఉరి తీశారు. ఆయన భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని సగౌరవంగా అంత్యక్రియలు జరిపించినవారు అయ్యర్. ఒక ముఖ్య విషయం చర్చించేందుకు లండన్ రావలసిందని సావర్కర్కు అయ్యర్ సమాచారం ఇచ్చారు. ఆ పనిలో పారిస్ నుంచి లండన్ వస్తుండగానే సావర్కర్ అరెస్టయ్యారు. ఆ అరెస్టు ఆయన జీవితాన్ని, భారత విప్లవోద్యమాన్ని దారుణమైన మలుపులోకి మళ్లించింది. లింకన్ ఇన్ అధికారులు చెప్పినట్టు ప్రమాణం చేయడానికి అయ్యర్ అంగీకరించలేదు. దీనితో బారెట్లా పూర్తయినా డిగ్రీ ఇవ్వలేదు. పైగా ఈ చర్యతో అయ్యర్ ఎంత బ్రిటిష్ వ్యతిరేకో వెల్లడైంది. దీనితో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దాని నుంచి తప్పించుకోవడానికే ఆయన సిక్కు వేషంలో లండన్ వదిలి ఓడ ఎక్కారు. పారిస్లో మేడమ్ కామా, కృష్ణవర్మల దగ్గర చేరారు. అప్పుడే పోలీసులు సావర్కర్ను భారత్కు తరలిస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన కామా తదితరులకు సమాచారం అందించారు. తాను మార్సెయిల్స్ ఓడ రేవులో తప్పించుకుంటానని, అక్కడ నుంచి తనను తప్పించాలని ఆ సమాచారం సారాంశం. కామా, అయ్యర్ తదితరులు మార్సెయిల్స్ రేవుకు వెళ్లారు. చెప్పినట్టే సావర్కర్ తప్పించుకున్నారు. మరుగుదొడ్డి నుంచి సముద్రంలోకి ఉండే సన్నని గొట్టం ద్వారా సావర్కర్ సముద్రంలోకి జారారు. ఈ సాహస చరిత్ర సుప్రసిద్ధం కూడా. కానీ నిషేధం ఉన్నా మార్సెయిల్స్ రేవులోకి బ్రిటిష్ పోలీసులు చొరబడి సావర్కర్ను మళ్లీ ఓడలోకి తీసుకుపోయారు. ఇదంతా కామా, అయ్యర్ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. తరువాతే ఆయన ఇండియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ముస్లింలా ఉండటం ఎలాగో నేర్చుకున్నారు. పార్సీ జాతీయుడిలా కనిపించడానికి కామా దగ్గర వారి ప్రార్థనలు అభ్యసించారు. కొద్దికాలం శ్రద్ధగా గెడ్డం పెంచారు. మొత్తానికి భారత్ చేరుకున్నారు. ఆ ఓడ శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతూ తమిళనాడులోని కడలూరులో ఆగింది. అయ్యర్ అక్కడే దిగి, చిన్న పడవలో గట్టుకు వచ్చారు. అక్కడ నుంచి జట్కాలో పుదుచ్చేరి చేరుకున్నారు. ఫ్రెంచ్వారి అధీనంలోని పుదుచ్చేరిలో, అరవిందుని సమక్షంలో ఉండేవారు. అక్కడ కూడా ఆయన తను నమ్మిన విప్లవ పథం గురించి యువకులను ఉత్తేజపరిచేవారు. ఈ బోధనలతో వాంచా అయ్యర్ అనే ఆయన ఐష్ అనే ఒక ఆంగ్ల అధికారిని చంపాడు కూడా. ఒకసారి గాంధీజీ పుదుచ్చేరి వచ్చారు. అయ్యర్ మర్యాదపూర్వకంగా కలసి మాట్లాడారు. ఒక్కసారిగా గాంధేయవాదిగా మారిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్, ఫ్రెంచ్ సంబంధాలలో మార్పు వచ్చింది. అయ్యర్ అరెస్టయి, కొద్దికాలం బళ్లారి జైలులో గడిపారు. విడుదలైన తరువాత జాతీయ కాంగ్రెస్లో పనిచేశారు. కానీ 1922 నాటి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చి, తరువాత ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. అయ్యర్ దాదాపు రాజకీయాలు వదిలేసి విద్య వైపు, సాహిత్యం వైపు మరలారు. సర్మాదేవి అనే చోట ఒక విద్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి నలువైపుల నుంచి మద్దతు వచ్చింది. కాంగ్రెస్ కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ ఇందులో వచ్చిన ఒక గొడవ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వివాదంగా ముదిరి ఆయనను కలత పెట్టింది. కాంగ్రెస్లోని బ్రాహ్మణేతర నాయకులు సాయం ఆపేశారు. అయినా ఆయన విద్యాలయం నడిపారు. ఆ సమయంలోనే ఒకసారి పిల్లలను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న పాపనాశం అనే జలపాతం దగ్గరికి విహార యాత్రకు తీసుకువెళ్లారు. అక్కడికే ఆయన భార్య, కూతురు వచ్చారు. ప్రవాహం చిన్నగా ఉన్నచోట మగపిల్లలంతా దూకి అవతలికి వెళ్లిపోయారు. కూతురు సుభద్ర కూడా దూకుతానని అడిగింది. అయ్యర్ వారించాడు. దానికి ఆ బాలిక, ‘ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలని నిరంతరం చెప్పే మా నాన్న నోటి నుంచే ఈ మాట వచ్చింది?’ అంది. అంటూనే దూకింది. పరికిణీ అడ్డం పడి నీళ్లలో ప్రవాహంలో పడిపోయింది. కూతురుని రక్షించడానికి అయ్యర్ దూకారు. ఇద్దరూ చనిపోయారు. ప్రపంచమంతా సముద్రం మీద తిరిగి వచ్చిన ఆ మహా విప్లవకారుడు, సొంత రాష్ట్రంలో చిన్న నీటి పాయలో పడి చనిపోవడం చాలా విచిత్రం. అన్ని మతాల వారితో, ప్రాంతాల వారితో కలసి పనిచేసిన ఆ విప్లవకారుడు చిన్న కులం గొడవతో కుంగిపోవలసి రావడం ఇంకా చిత్రం. - డా. గోపరాజు నారాయణరావు -
శాస్త్రీయతకు చోటెక్కడ?
జగదీశ్ చంద్రబోస్, సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, హోమీ జే భాభా వంటి దిగ్దంతులను వైజ్ఞానిక ప్రపంచానికి అందించి మురిసిన మన దేశం కొన్నేళ్లుగా ఆ రంగంలో వెలవెలబోతోంది. పంజాబ్లోని జలంధర్లో ఇటీవల ముగిసిన 106వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఆ దుస్థితినుంచి దేశాన్ని రక్షించడానికి, శాస్త్ర సాంకేతిక రంగాలను పటిష్టపరచడానికి ఏమేరకు దోహదపడిందో అనుమానమే. వాస్తవానికి ఏటా జరిగే ఆ సదస్సులు ఆ రంగాల్లో సాధించిన విజయాల గురించి మదింపు వేసుకుని, పరిశోధనా రంగంలో మన స్థానం ఎక్కడుందో నిర్ధారిం చుకుని లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలేమిటి... కారకులెవరు అన్న అంశాలపై దృష్టి పెట్టాలి. స్వీయ లోపాలను సైతం నిష్కర్షగా, నిర్మొహ మాటంగా చర్చించుకుని చక్కదిద్దుకోవాలి. ప్రాథమిక విద్య మొదలుకొని కళాశాల స్థాయి వరకూ విజ్ఞాన శాస్త్రానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఏ పాటిదో ఆరా తీసి దాన్ని మెరుగుపరచమని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కూడా శాస్త్రవేత్తల బాధ్యత కావాలి. మన రాజ్యాంగం ఆశించినట్టు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇవన్నీ చాలా అవసరం. ఈ ప్రక్రియంతా విజ్ఞాన శాస్త్ర అధ్యయనంవైపు నవతరం దృష్టి సారించేలా చేయగలుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉండటం మాట అటుంచి కనీసం ఇప్పుడున్న స్థితిని దాటి ముందుకెళ్లాలంటే శాస్త్రవేత్తల్లో, పరిశోధకుల్లో ఆ విచికిత్స తప్పనిసరి. కానీ దురదృష్టమేమంటే మన సైన్స్ కాంగ్రెస్ సదస్సులు నానాటికీ తిరునాళ్లను తలపిస్తున్నాయి. ఉద్దండులనుకున్నవారు సైతం వేదికనెక్కి ఉబుసుపోని కబుర్లు చెబుతున్నారు. ఆ వేదికపై మాట్లాడే ప్రతి మాటకూ శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలన్న కనీస స్పృహ లేకుండా ప్రవ ర్తిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జి. నాగేశ్వరరావు అంతక్రితం ఎన్ని సదస్సుల్లో పాల్గొన్నారో... ఏం మాట్లాడారో, అక్కడ ప్రతిపాదించిన అంశాలేమిటో ఎవరికీ తెలియవు. కానీ ఈసారి ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. కౌరవులు టెస్ట్ట్యూబ్ బేబీలనీ, మన పూర్వీకుల వద్ద గైడెడ్ మిస్సైళ్లు ఉండేవని, రావణుడికి 24 రకాల విమానాలున్నా యని ఆయన వాక్రుచ్చారు. మరో శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్లు ప్రతి పాదించిన సిద్ధాంతాలన్నీ తప్పుల తడకని, గురుత్వాకర్షణ తరంగాలపై తాను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతానికి ‘నరేంద్రమోదీ తరంగాల’ని నామకరణం చేశానని చెప్పారు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మరో శాస్త్రవేత్త గత 25 ఏళ్లుగా తాను భారత్లో డైనోసార్ల పుట్టుక, వాటి ఉనికి గురించి పరిశోధి స్తున్నానని సదస్సులో తెలియజేశారు. సృష్టికర్త బ్రహ్మకు తెలియనిదంటూ ఉండదని, డైనోసార్ల గురించి వేదాల్లో ఆయన ప్రస్తావించారని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలకుండే వ్యక్తిగత విశ్వాసాలేమిటని ఎవరూ ప్రశ్నించరు. సైన్స్ కాంగ్రెస్ వంటి వేదిక లెక్కినప్పుడు ఆ విశ్వాసాల ఆధారంగా మాట్లాడితే నిలదీస్తారు. భిన్న అంశాలపై శాస్త్రవేత్తల అభిప్రాయాలేమిటో తెలుసుకుని తమ విజ్ఞానానికి పదును పెట్టుకోవాలని వచ్చేవారికి ఈ ధోరణి ఏమాత్రం దోహ దపడేలా లేదు. ఇప్పుడే కాదు... గత మూడు నాలుగేళ్లుగా ఇదే వరస కొనసాగుతోంది. సైన్స్ సద స్సులు కాల్పనిక గాథలకు వేదికలైతే, అవి వినోద ప్రధానంగా మారితే అంతర్జాతీయంగా మనం నవ్వులపాలవుతాం. ముంబైలో 2015లో జరిగిన సైన్స్ కాంగ్రెస్కు ముఖ్య అతిథిగా వచ్చి ఆ తంతును గమనించాక నోబెల్ గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ దాన్నంతటినీ ఒక సర్కస్గా అభివర్ణించారు. ఇకపై భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సుల్లో తాను పాల్గొనబోనని ప్రకటించారు. కనీసం అప్పుడైనా సదస్సు నిర్వాహకులు మేల్కొని, వక్తల ఎంపికకు నిర్దిష్టమైన విధానాలను రూపొందించుకోవాల్సింది. అలాగే పిలిచినవారి నుంచి ప్రసంగ పాఠాలను ముందే తెప్పించుకుని వాటి ప్రామాణికతను నిర్ధారించుకునే ప్రక్రియ అమల్లోకి తీసుకురావాల్సింది. కానీ నిర్వాహకులు ఆ పని చేయలేదు. కనీసం ఆ శాస్త్రవేత్తల ప్రసంగాల అనంతరం అయినా వాటిని ఖండించలేదు. కనుకనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు కె. విజయరాఘవన్ ఆ బాధ్యత తీసుకోవాల్సివచ్చింది. ఆ ప్రసంగాలు శాస్త్రవేత్తల వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని... సదస్సు ఎక్కడ నిర్వహించాలో, దాని ఎజెండా ఏమిటో, వక్తలుగా ఎవరిని పిలవాలో నిర్వాహకులే చూసుకుంటారని ఆయన చెప్పారు. సైన్స్ కాంగ్రెస్ సదస్సులకు దేశ దేశా లనుంచి ఏటా వందలాదిమంది శాస్త్రవేత్తలు హాజరవుతారు. ఇందులో భాగంగా బాలల సైన్స్ కాంగ్రెస్, మహిళా సైన్స్ కాంగ్రెస్ జరుగుతాయి. మొత్తంగా దాదాపు 20,000మంది ప్రతినిధులు పాల్గొంటారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో, ముఖ్యంగా పరిశోధనల్లో వాస్తవ స్థితిగతులేమిటన్న విషయాన్ని శాస్త్రవేత్తలతో పోలిస్తే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాగా చెప్పగలిగారు. మీ రంగంలో లింగ వివక్ష వేళ్లూనుకున్నదని, దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించమని ఆమె నిష్కర్షగా చెప్పారు. దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో 2,80,000 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పని చేస్తుంటే వారిలో కేవలం 14 శాతంమంది అంటే... 39,200 మంది మాత్రమే మహిళలని తెలి పారు. ఐఐటీల్లో సైతం మహిళల శాతం నానాటికీ తగ్గిపోతున్నదని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న మహిళల్లో 81 శాతంమంది తమ పనితీరు మదింపులో లింగ వివక్ష కొట్టొ చ్చినట్టు కనబడుతున్నదని చెప్పిన సంగతిని ఆమె ప్రస్తావించారు. ప్రపంచంలోని ఉత్తమోత్తమ సైన్స్ పత్రికల్లో వచ్చే వ్యాసాలను, పరిశోధనా విశేషాలను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో అను వదించి వారిలో ఆ రంగంపై మక్కువ పెంచాలని సూచించారు. స్మృతి ప్రసంగం విన్నాకైనా తమ కర్తవ్యమేమిటో శాస్త్రవేత్తలు, సదస్సు నిర్వాహకులు బోధపరుచుకుంటారని ఆశించాలి. -
అదే స్వర్గం అదే మోక్షం
ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కనుగొనలేని, వివరించలేని ఆ అనంతశక్తి లేదా ఆత్మ ఒక మహా ఆశ్చర్యకరమైన వస్తువనీ, ఇంద్రియానుభవ రహితమైనదని, మానసికానుభవమని నాటి ఋషులుగా చెప్పబడే ఆధ్యాత్మిక పరిశోధకులు వేల ఏళ్లక్రితం ఉపనిషత్తుల్లో ఘోషించడం ఎంతో ఆశ్చర్యకరం. ఉపనిషత్తులు ఆ ఆత్మ గురించి పరిపరి విధాల వర్ణిస్తూ, ప్రతి ఒక్కరినీ మానవత్వం నిండిన విశ్వనరునిగా జీవించమంటూ, బతికినంతకాలం జ్ఞానపీఠికపై కర్మయోగిగా, చిత్జడ గ్రంథిని చిదిమివేసి మోక్షాన్ని అనుభవించాలని ఉపదేశిస్తాయి. ప్రాణసహితంగా ఉన్నా, ప్రాణరహితంగా ఉన్నా ‘నీవే ఆ అనంతశక్తిగా అనుభూతి చెందాలి’ అని చెప్తాయి. అనుభూతి అనేది మనసు చేసే మథనం. ఇదే విషయాన్ని ‘ముండకోపనిషత్తు’ ‘ఆ ఆత్మ కళ్ళతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలననో, కర్మలచేతనో లభించదు. సాధకుని మనస్సు విశుద్ధమైనదై ఉండి, నిరంతరం ఆ ఆత్మతో తాదాత్మ్యత పొందడం వలననే దాని సాక్షాత్కారం పొందడం సాధ్యమౌతుంద‘ని తెలుపుతోంది. అంతేకాకుండా నయమాత్మా’ బలహీనేన లభ్యో...’ అంటూ ‘ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్త వలన, నిర్దిష్టమైన తపస్సు లేని యెడల ఆత్మసాక్షాత్కారం జరుగదు. శారీరక, మానసిక దృఢత్వం వలన వచ్చే మనోస్థైర్యం కలిగిన సాధకులు మాత్రమే బ్రహ్మస్థితిని అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలర‘ని నిర్ధారిస్తోంది. మనసుకున్న గొప్పలక్షణాల వల్ల ఆత్మ అటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. మనసు ఎంతో బలమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. దృఢమైనది ఎందుకంటే ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించినపుడు కలిగే ఆనందాన్ని భరించగలిగినదై ఉండాలి. నిశ్చలమైనదై ఎందుకుండాలంటే, మనసు నిశ్చలంగా ఉంటేనే పదార్థ లక్షణాలేవీ లేని శక్తిపట్ల తాదాత్మ్యత పొందగలుగుతుంది. నీటి ప్రవాహంలో గాలి బుడగలు ఉద్భవించి, కొంతదూరం ప్రయాణించి, పగిలిన తర్వాత తిరిగి నీటిలో కలిసి పోయినట్లే ఈ చరాచర ప్రపంచం ఆ అనంతశక్తిలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏకాగ్రచిత్తంతో గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ విధమైన ఏకాగ్రత మనలో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. ఏ పదార్థంపైనా, జీవిపైనా వ్యామోహంగానీ, విరక్తి గానీ కలుగదు. మంచి–చెడు,సుఖం–దుఃఖం లాంటి ద్వైదీభావనలు కలుగవు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలకు అసలు స్థానమే ఉండదు. నిర్వికార, నిశ్చలమనస్సు ఏర్పడి ప్రతిపనిలో, ప్రతివాక్కులో, ప్రతిరూపంలో, సర్వత్రా ఏకాత్మను గ్రహిస్తూ ఉంటుంది. అదో అద్భుత ఆనందానుభూతి. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని, దానికి హేతువైన ఆత్మను గెలిచి, ఒడిసిపట్టుకున్న ఆనందం. అంతకుమించిన విజయమేముంటుంది మనిషికి? జీవరాశుల్లో అన్నిట్లో మేధావి ఐన మనిషికి భౌతిక ప్రపంచంలో తాను ఆశించిందాన్ని గెలుపొందడమే గొప్ప విజయంగా భావిస్తాడు. అలాంటిది ఈ సృష్టి మొత్తానికి హేతువైన అనంతశక్తిని మన మనసులో ఒడిసి పట్టుకోవడం ఎంతటి విజయమో మనం ఊహించలేం. ఆ విజయానందం అనిర్వచనీయం. సాధకుడు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు సాధకుని మనస్సు అనిర్వచనీయమైన, అవధుల్లేని ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం, దాని పరిణామాలన్నీ ఆల్పమైపోతాయి. అసలు వీటిమీద ఏ చింతా కలగదు. భగవంతుని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ భగవంతుడు అని చెప్పబడే ఆ ఆత్మను సాకారం చేసుకోలేరు. మనసులో ఆత్మను నిరంతర సంయోగం చేయగలవారే ఆత్మ లేక భగవత్సాక్షాత్కారం పొందగలరు. అలా పొందిన వారు అద్వైతచిత్తులై, కుల, మత, లింగ, భాష, ప్రాంత, జైవికాది భేదాలకు అతీతులై, ఉన్నత మానసిక స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. అదే స్వర్గం. అదే మోక్షం. – గిరిధర్ రావుల -
నీలో ఉన్నదే విశ్వంలోనూ...
ఈశ్వరుడు మన రూపానికి, విశ్వంలోని రూపాలన్నింటికీ హేతువని ఆధ్యాత్మికంగా ఆలోచించాలన్నా, విజ్ఞాన శాస్త్రపరంగా విశ్లేషించాలన్నా అపారమైన శ్రద్ధ, లోతైన హేతువాదం ఉండాల్సిందే. విజ్ఞానశాస్త్ర పరిశోధన ఆగిపోయిన తర్వాత ఆధ్యాత్మికత మొదలవుతుందని అందరూ అనుకుంటారు. కానీ, విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మికత అంతిమంగా సత్యాన్వేషణ చేస్తూనే ఉంటాయి. తేడా ఏంటంటే విజ్ఞాన శాస్త్రానికి ఆధారం ఉండాల్సి ఉండగా, ఆధ్యాత్మికతకు అర్థం చేసుకోవడం, అనుభవించడమే ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం నిజంపైన ఆధారపడి ఉండగా, ఆధ్యాత్మికత సత్యంపైన ఆధారపడి ఉంటుంది. మనం నిలుచున్న భూమి తిరగడం లేదని, మన చుట్టూ సూర్యుడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిరూపించేది విజ్ఞాన శాస్త్రం కాగా, భూమి ఆదిత్యుని చుట్టూ తిరిగినా, ఆదిత్యుడు గ్రహాలకన్నింటికి ఆధారమైనా, వీటన్నింటినీ ఒకానొక శక్తి నడిపిస్తూ ఉందనీ, అదే ఈశ్వరుడని ఆధ్యాత్మికత అంటుంది. ఆధ్యాత్మికతను తొలుస్తూ సత్యం వైపు సాగిపోన్నదే విజ్ఞానశాస్త్రం. బొగ్గులో ఉండేది కర్బనం వజ్రంలో ఉండేది అదే కర్బనం. కానీ, బొగ్గు సులభంగా చూర్ణమయ్యేది, మండగలిగేది. వజ్రం కఠినాతి కఠినమైనది, ఉష్ణాన్ని నిరోధించేది. ఈ విధంగా పదార్థాల అంతర్గత అణునిర్మాణ భేదాల రీత్యా, ఆయా భౌతిక రూపాల ఏర్పాటు, వాటి ఆధారంగా వాటి లక్షణాలు బహిర్గతమౌతూ ఉంటాయి. జలంనుండి విద్యుత్తు, విద్యుత్తు నుండి వెలుగు, వెలుగు నుండి దృష్టి పొందడమెంత నిజమో, ఆ అనంతశక్తి నుండి నక్షత్రం, నక్షత్రం నుండి గ్రహం, గ్రహం నుండి జీవం పొందడమూ అంతే నిజం. మనం మన ప్రస్థానాన్ని తెలుసుకోవాలంటే మన గతంలోకి తొంగి చూడాల్సిందే. మన ప్రస్థానం మాతృగర్భంలో మనం బీజంగా మొదలైనా, ఆకృతిగా రూపొందడం మాత్రం సూర్యరశ్మిని స్పృశించి, నీటిని తాగి, భూమిలోని వనరులను స్వీకరించి, గాలిని పీల్చి, చుట్టూ ఉన్న ఉష్ణాన్ని వాడుకుని పదార్థంగా రూపుదిద్దుకున్న ఆకులు, అలములు, పండ్లు, పాల నుండి మాత్రమే జరుగుతుంది. వృక్షాలు, సరీసృపాలు, జంతువుల అంతర్గత నిర్మాణాలు వేర్వేరుగా ఉండటం వలన, వాటి రూపాలు వేరుగా ఉండి, వాటి మీద ఆధారపడి లక్షణాలు ఉంటాయి. అన్నీ పంచభూతాల ద్వారా రూపొందాయి కాబట్టే, తరచి చూస్తే అవి అన్నీ అంతర్లీనంగా అద్వైతాన్నే బోధిస్తాయి. మనలో ఉన్నాయి, కాబట్టే మనకు జీర్ణమవుతాయి. మన ఆకృతి ఎదగడానికి, చైతన్య స్థితిలో ఉండడానికి హేతువౌతాయి. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఆదిశంకరుల వారి జ్ఞానసుధలు తేటతెల్లం చేసాయి. ఈ సృష్టిధర్మం తెలుసుకుని ఈ ప్రపంచంలో ఏయే జీవాలు ఉన్నాయో, ఆయా జీవులన్నింటికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని గ్రహించి పరోపకారార్థం జీవించడమే మానవ ధర్మం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు– తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే! తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః! అంటూ ఆ అనంతశక్తి అన్నింటి లోపల, బయటా వ్యాప్తి చెంది ఉందని తెలియజేస్తుంది. అయితే, ఈ శక్తి ఇంద్రియాలకు అందేది కాదు. ఆయా జీవుల భౌతిక ఆకృతులు, భౌతిక లక్షణాల ద్వారా ద్యోతకమౌతుంది. ఆ భేదాలను వదలి అంతర్గతశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే అద్వైతాన్ని ఆకళింపు చేసుకోవడం. అలా ఆకళింపు చేసుకోవడమనేదే దైవదర్శన సోపానం. ఒక ఇనుపగుండును వేడి చేస్తే ఆ వేడి ఇనుపగుండులోని అణువణువునా ఏ విధంగా వ్యాప్తి చెంది ఉంటుందో, అయస్కాంతంలో అయస్కాంతశక్తి ఎలా ప్రతి అణువునూ పట్టుకుని ఉంటుందో, అదేవిధంగా విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంటుంది. ఏతావాతా తేలేదేంటంటే, ప్రతి దానిలో ఉన్నదే నీలో ఉన్నది, నీలో ఉన్నదే విశ్వంలో ఉన్నది. ఇట్టి విషయాన్ని దర్శించడమే దైవాన్ని దర్శించడం. ఈ విషయాన్ని గుర్తెరిగి ఆ భగవంతుడు లేదా అనంతమైనశక్తి అనేది సర్వాంతర్యామి అని, అతను అన్నింటిలో నిండి ఉన్నాడని గుర్తెరిగి మానవ ధర్మాన్ని ఆచరించాలి. ప్రతి మనిషి ఈ సదాచారాన్ని స్వీకరించి ఆచరించాలి. ఆ సదాచారం వలననే కులాల, మతాల, జాతుల పట్ల భేదభావం ఉత్పన్నం కాకుండా శాంతి, సౌభ్రాతృత్వం సమాజంలో వ్యాప్తి చెందుతాయి. – గిరిధర్ రావుల -
నల్లపూసలు ఎందుకు ధరిస్తారు?
ముల్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. స్త్రీ సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన వాటినే ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు పెద్దలు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూవరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. -
బుద్ధిజీవులు
‘‘విజ్ఞానం కంటే ముఖ్యమైనది ఊహాత్మకత. సమస్త శాస్త్ర ఆవిష్కరణలకూ అది మూలం –’’ అల్బర్ట్ ఐన్ స్టెయిన్.ఈ విశాల విశ్వంలో అనేక గ్రహాల మీద జీవులున్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒక్కొక్క గ్రహంలో పరిణామక్రమం, నాగరికత ఒక్కోలా వుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సాంకేతిక అభివృద్ధి విషయంలో మిగతా గ్రహాలన్నింటికంటే మనం ఉన్నత స్థాయిలో వున్నామన్న సంగతి మీకందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే మనం సాధించిన అభివృద్ధితో పోలిస్తే ఇంకా చాలా గ్రహాల్లో పరిస్థితి ప్రాథమిక దశలో వుందని చెప్పొచ్చు. వర్చువల్ ట్రావెలింగ్, భాషతో సంబంధం లేకుండా ఫ్రీక్వెన్సీ మేపింగ్ ద్వారా ఎదుటివారితో సంభాషించటం, దీర్ఘనిద్రలోకి వెళ్ళి చాలాకాలం తర్వాత తిరిగి అవసరమైనప్పుడు మేల్కొనే అవకాశం.. ఇంకా ఇలాంటి చాలా విషయాలు మిగతా గ్రహాల్లో ఊహా మాత్రంగానే వున్నాయి. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన మరో సవాల్ని సాధించబోతున్నాం..’’ అధ్యక్షుడు కొన్ని క్షణాలు విరామం ఇచ్చాడు.విశాలమైన ఆ హాల్లో పాతికమంది వరకూ వున్నారు అనడం కంటే, అక్కడ వారి వర్చువల్ ప్రతిబింబాలు మాత్రమే వున్నాయనడం సరైనది. అధ్యక్షుడు మాట్లాడ్డం ఆపాక అక్కడ చిక్కనైన నిశ్శబ్దం అలుముకుంది. ‘‘మనం చేయబోతున్న ఈ ప్రయోగం జీవ పరిణామాన్నే సవాల్ చేసే ప్రయోగం. జీవులన్నవే లేని ఒక గ్రహాన్ని ఎన్నుకుని, దానిమీద జీవులు అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయోగాలు నిర్వహించి, మనం కోరుకున్న రీతిలో ఆ జీవుల పరిణామక్రమాన్ని నియంత్రించడం.. వాటి మెదడును మనకు అనుకూలమైన రీతిలో పరిణామం చెందేలా చేయడం.. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న రోబోల స్థానంలో జీవ రోబోల్ని ప్రవేశపెట్టడం..! ఇది మన గ్రహం కోసం మాత్రమే కాదు; ఇది సాధ్యమైతే జీవ రోబోల్ని పంపించడం ద్వారా విశ్వంలో మన చుట్టుపక్కల గ్రహాలన్నింటిలోనూ మనం ఊహించలేని మార్పులు తేగలం. అయితే ఈ ప్రయోగం నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. మొదటిది దీనికి చాలాకాలం పడుతుంది. అయితే కాలం మనకు సమస్య కాదు. రెండోది.. ముఖ్యమైనది.. ఏమిటంటే ఈ ప్రయోగానికి అనుకూలమైన గ్రహాన్ని పట్టుకోవడం. ఇది చాలా కష్టమైన విషయంగా మారింది. కారణమేమిటంటే జీవులు అభివృద్ధి చెందటానికి అవకాశం వున్న గ్రహాలన్నింటిలోనూ ఇప్పటికే అంతో ఇంతో అభివృద్ధి చెందిన జీవులున్నాయి. అదీగాక ఆ గ్రహాల వాతావరణం కూడా మన ప్రయోగానికి అనుకూలం కాదు. అందువల్ల ఆ గ్రహాలేవీ మనకు పనికిరాకుండా పోతున్నాయి.అయితే మన ప్రయోగ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కలిగిన గ్రహం ఒకే ఒక్కటి మాత్రం కనుగొన్నాం. ఆ గ్రహంలో కూడా జీవులున్నాయి..’’ అధ్యక్షుడు మళ్ళీ ఆపాడు.ఈసారి కొంచెం కలకలం రేగింది. గందరగోళంగా కొన్ని స్వరాలు వినిపించాయి. కొన్ని క్షణాల తర్వాత ఎవరో అడిగారు.. ‘‘ఆ గ్రహం ఏది..? ఎక్కడుంది..?’’.‘‘వుంది. ఆ గ్రహం పేరు భూమి..! అవును.. చిట్టచివరికి మాకు దొరికిన గ్రహం పేరు భూమి. ఆ పేరు ఆ గ్రహం మీదున్న జీవులు పెట్టుకున్న పేరు. వారినక్కడ మానవులుగా పిలుస్తారు. వారి భాషలో చెప్పాలంటే మిల్కీవే గెలాక్సీలోని ఓరియన్ ఆర్మ్లో వున్న సౌర కుటుంబంలోని ఒక చిన్న గ్రహం అది. సూర్యుడనే ఒక సెకండరీ స్టార్ నుంచి వేడినీ, వెలుతురునూ పొందుతోంది. మనతో పోలిస్తే అక్కడి జీవులు.. అంటే మానవులు.. సాంకేతికంగా ప్రా«థమిక దశలో వున్నారు. దానిమీదున్న జీవుల్ని మొత్తం నాశనం చేసి మన ప్రయోగాలు ప్రారంభించాలని నిర్ణయించాం. ఆ గ్రహమే ఎందుకంటే మనం చెయ్యబోయే ప్రయోగాలకి సరిగ్గా సరిపోయే వాతావరణం కలిగివుండటం ఒక కారణమైతే ఇక రెండోది...’’ అధ్యక్షుడు కొనసాగించాడు.ఆండ్రొమెడా గెలాక్సీకి చెందిన జిటా గ్రహం మీద జరుగుతున్న ఆ సమావేశం చాలాసేపటివరకూ కొనసాగుతూనే వుంది. సెంట్రల్ స్పేస్ సెంటర్. భూమి.సురేంద్ర మొహంలో, మాటల్లో ఎగై్జట్మెంట్ కనబడుతోంది – ‘‘ఎంతోకాలం నుంచి మానవులను వేధిస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకబోతోంది. విశ్వంలోని వేరే గ్రహానికి చెందిన జీవుల్నుంచి శక్తివంతమైన రేడియో సంకేతం వచ్చింది. అంతేకాదు, ఆ సంకేతం డీకోడ్ చెయ్యడానికి అనువైన రీతిలో వున్నట్టుగా అనిపిస్తోంది. ఏలియన్స్ (ఇతర గ్రహ జీవులు) మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటో సరిగ్గా అర్థం కావడంలేదు. కానీ ఇంతకాలానికి ఒక విషయం స్పష్టమైంది. ఇతర గ్రహాల్లో జీవులు వున్నారు. అంతేకాదు, వాళ్ళు మనకంటే సాంకేతికంగా చాలా ముందున్నారు. కాబట్టే మనకు సంకేతం ఇవ్వగలిగారు. వారికి మన గురించి పూర్తిగా తెలిసివుండకపోతే ఇలాంటి స్పష్టమైన సంకేతం రావడం అసాధ్యం’’.చైర్మన్ పురుషోత్తమరావును కలుసుకున్నాడు సురేంద్ర. విషయం విన్నాక చైర్మన్ ఆనందం పట్టలేకపోయాడు. ‘‘నిజమా.. మనం లోకానికి ఈ విషయాన్ని వెల్లడి చేయవచ్చా..? దాన్ని నువ్వు డీకోడ్ చెయ్యగలవా...?’’ పొంగిపోతూ అడిగాడు. ‘‘ఏలియన్స్ నుండి సంకేతం రావడం నిజం. ఇందులో ఎలాంటి అనుమానానికీ తావు లేదు సర్. అయితే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మన టెక్నాలజీ గురించి వారికి పూర్తిగా అవగాహన వుందని నా నమ్మకం. అందుకే మనం అందుకోగలిగే విధంగానే ఆ సంకేతం పంపారు. అంతేకాదు మనం డీకోడ్ చేసే విధంగానే ఆ సంకేతం వుండి వుంటుందని నా నమ్మకం. కానీ ఆ విషయం నిర్ధారణగా చెప్పలేను. మరికాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఏమైనా తెలియొచ్చు..’’ చెప్పాడు సురేంద్ర.ఏలియన్స్ నుంచి సంకేతం వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలియపర్చబడింది. ఏలియన్స్ నుండి సంకేతం వచ్చిందనీ, వాళ్ళు నిజంగానే వున్నారనీ బైట ప్రపంచానికి తెలియజెప్పడం అభ్యంతరకరమైన విషయంగా ప్రభుత్వం భావించలేదు. గ్రహాంతరవాసుల నుంచి వచ్చిన సంకేతాన్ని అందుకొని గుర్తించడం ఒక ఘన విజయంగా భావించింది. మర్నాడు పేపర్లన్నింటిలోనూ ఇదే ప్రధాన వార్త. కంప్యూటర్ తెరమీద గందరగోళంగా కొన్ని గుర్తులు వచ్చాయి. సురేంద్ర నిస్పృహగా తల విదిలించాడు. అసలు ఈ సంకేతంలో ఏమైనా వుందా..? లేక తను అనవసరంగా ప్రయత్నిస్తున్నాడా..? ఏలియన్స్ తమతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా..? లేక తమ ఉనికిని మానవులకు చెప్పడానికి మాత్రమే ఆ సంకేతం పంపారా..?‘‘మీరు ఊహిస్తున్నది నిజమే! మీతో ఒక విషయం చెప్పడానికే ఆ సంకేతం పంపించాం..’’ ఎక్కణ్ణుంచో వినబడింది.సురేంద్ర ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది..? ఏవో మాటలు వినబడుతున్నాయేమిటి..? ఎక్కణ్ణుంచి..? తను భ్రమపడ్డాడా..? ‘‘భ్రమ కాదు భూగ్రహవాసీ! నిజమే. సరిగ్గా దృష్టిని కేంద్రీకరించి వినండి..’’ మళ్ళీ వినబడింది. సురేంద్రకి ఈసారి స్పష్టంగా అర్థమైంది. ఎక్కణ్ణుంచో కాదు.. తన బుర్రలోంచే వినబడుతున్నాయి ఆ మాటలు. అతడు ఆశ్చర్యంతో తలమునకలై వుండగా మళ్ళీ వినిపించసాగింది.‘‘ఆ సంకేతంలో ఏమీలేదు. కానీ దానిమీద ఎవరైనా దృష్టి కేంద్రీకరించడం జరిగితే వారి బ్రెయిన్ వేవ్ లెంగ్త్ తెలుసుకోవడం ద్వారా కాంటాక్ట్ చెయ్యాలని మేము భావించాము. మీరు దొరికారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదొక రకమైన టెలిపతీ అనాలి. కానీ దానికన్నా ఇది ఎన్నో రెట్లు ముందున్న సాంకేతికత. మీరు ఊహిస్తున్నది నిజం. మేము సాంకేతికంగా మీకంటే చాలా ముందున్నాం. మీ గ్రహం మీదున్న పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసు. నిజానికి ఈ విశ్వంలో ఏయే గ్రహాల మీద జీవులు ఏ దశల్లో వున్నాయో కూడా మా దగ్గర సమాచారం వుంది.’’‘‘మమ్మల్ని ఇప్పుడెందుకు కాంటాక్ట్ చెయ్యాలనుకున్నారు?’’ అప్రయత్నంగా సురేంద్ర మనసులో అనుకున్నాడు. ఆ విషయం వెంటనే అటువైపు గ్రహాంతరవాసికి తెలిసిపోయినట్టు సమాధానం వచ్చింది – ‘‘ఆ విషయమే చెప్పబోతున్నాను. మామూలుగా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడంలో మాకెటువంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు మీ గ్రహంతో మాకు పనిబడింది. అసలీ విషయం మీకు చెప్పాలని కూడా మేము భావించలేదు. అయితే ఎవరైనా కాంటాక్ట్లోకి వస్తే చెప్పాలని మాత్రం అనుకున్నాము. జీవపరిణామాన్ని నియంత్రిస్తూ జీవరోబోలను సృష్టించే ప్రయోగాల కోసం మాకొక గ్రహం అవసరమైంది. ఆ గ్రహంలో మా ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం వుండాలి. కానీ జీవులు వుండకూడదు. అలాంటి గ్రహం విశ్వంలో మాకెక్కడా లభించలేదు. సరిగ్గా మీ గ్రహం అప్పుడే మా దృష్టిలో పడింది. కానీ ముందే చెప్పినట్టు మా ప్రయోగాలకు జీవులు లేని గ్రహం కావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీ గ్రహం మీద సమస్త జీవరాశిని తొలగించబోతున్నాము. తర్వాత మా ప్రయోగాలు ప్రారంభిస్తాం..’’‘‘నాకర్థం కావడం లేదు. సమస్త జీవుల్నీ తొలగించడం అంటే ఏం చేస్తారు?’’ సురేంద్ర మనసులోనే అనుకున్నాడు. అతడిలో అప్పుడే ఆందోళన ప్రారంభమయింది.‘‘ఇందులో పెద్దగా అర్థం కావడానికేమీ లేదు. భూగ్రహం మీద సమస్త జీవరాశినీ ముందు నిర్జీవంగా చేసి తర్వాత అనుకూలమైన పద్ధతిలో తొలగిస్తాం.. అంతే..!’’‘‘అంటే మీ ప్రయోగాల కోసం మమ్మల్నందర్నీ చంపేస్తారా..?’’‘‘చావుకి మా దగ్గరున్న అర్థం వేరు. అయినా అదంతా మీకు చెప్పవలసిన అవసరం లేదు. అసలు మీ బ్రెయిన్ మాకు తగిలుండకపోతే ఇది కూడా చెప్పేవాళ్ళం కాదు..’’ ‘‘ఇది దారుణం. మేము మీలాగే బుద్ధిజీవులం. మీరూ మాలాంటివారే. కాకపోతే సాంకేతికంగా మాకంటే చాలా ముందుండి వుండవచ్చు. మమ్మల్ని నాశనం చెయ్యాలని ఎందుకనుకుంటున్నారు? మీకన్నా అభివృద్ధి చెందిన జీవులు మిమ్మల్ని నాశనం చెయ్యాలనుకుంటే మీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి?’’‘‘మీకు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి ఈ విశాల విశ్వంలో లెక్కకు మించిన గ్రహాల్లో జీవం వుంది. అందులో చాలా గ్రహాల్లోని జీవులు మీకంటే సాంకేతికంగా ఎంతో ముందున్నాయి. మాకున్న సమాచారం మేరకు మాకంటే సాంకేతికంగా ముందున్నవాళ్ళు ఎవరూ ఇంతవరకు మాకు తగల్లేదు. ఒకవేళ వున్నా అది మాకు ప్రధానం కాదు. ఇక రెండోది బుద్ధి జీవులంటే మీరేమనుకుంటున్నారో మాకు తెలీదు. మా నిర్వచనం ప్రకారం మీరు బుద్ధిజీవులు కాదు. మేము చేస్తున్నది మాకోసం మాత్రమే కాదు. ఈ ప్రయోగం సఫలమైతే విశ్వంలో జీవులున్న గ్రహాలన్నీ అని మేము చెప్పలేము గానీ మా పరిధిలోని గ్రహాల్లో పరిస్థితిని మేము సమూలంగా మార్చగలము.ఆ గ్రహాల్లో జీవులు ఆనందంగా జీవించేలా చెయ్యగలము. మీ గ్రహంలో ప్రయోగాల కోసం కోతుల్ని ఎలుకల్నీ ఎలా ఉపయోగించుకొంటారో ఇది కూడా అంతే..! భూగ్రహంలో మానవ సౌభాగ్యం కోసం కొన్ని మూగజీవులు నశించిపోయినా ఫర్వాలేదని మీరెలా అనుకుంటున్నారో, మేము తలపెట్టిన ఈ పని కోసం మీ గ్రహంలో జీవులు నశించిపోయినా ఫర్వాలేదని మేము కూడా భావించాం. ఇది మీకు జీర్ణించుకోవడానికి కష్టంగా వున్నా తప్పదు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మా ప్రయోగాలకు సరిగ్గా అతికినట్లు సరిపోయే గ్రహం మీదొక్కటే..!’’ ‘‘చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. భూమ్మీద సమస్త జీవరాశిని తొలగించటమంటే ఏమిటో తెలుసునా? కొన్ని కోట్ల అనుభూతుల్ని నాశనం చెయ్యడం.. కొన్ని కోట్ల ఆశల్ని సమూలంగా తుంచెయ్యడం.. మీరెందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు..? దయచేసి అలాంటి ప్రతిపాదన విరమించుకోండి..’’అట్నుంచి చిన్న నవ్వు వినిపించింది – ‘‘మొత్తం నిర్ణయం జరిగిపోయింది. ప్రణాళిక సిద్ధమైపోయింది. మీ భాషలో చెప్పాలంటే దాని పేరు ఆపరేషన్ టెర్మినేట్..’’ ‘‘కాదు.. కాదు.. నేను చెప్పేది వినండి.. అసలు..’’ చెప్తుండగానే అతడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడ్డాడు. బైటి శబ్దాలన్నీ ఎప్పటిలా మామూలుగా వినిపించసాగాయి. లింక్ తెగిపోయిందన్న విషయం సురేంద్రకి అర్థమయ్యింది. అతడు ఆందోళనగా అక్కణ్ణుంచి లేచాడు.తనకు వచ్చిన సమాచారాన్ని ముందుగా పురుషోత్తమరావుకి తెలియజేశాడు. ఆయనకి ఈ విషయం నమ్మశక్యంగా అనిపించలేదు. ‘‘నువ్వు భ్రమ పడుతున్నావేమో..’’ అన్నాడు సురేంద్రని. ‘‘లేదు సర్.. భ్రమ కాదు. ఇదంతా నిజమే! అయినా స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పారు.. ఏలియన్స్ మనకంటే కనీసం కొన్ని బిలియన్ల సంవత్సరాలు సాంకేతికంగా ముందుండి వుంటారనీ, ఇప్పుడు మనం బ్యాక్టీరియాకి ఇస్తున్న విలువ కంటే వాళ్ళు మనకి ఎక్కువ విలువ ఇవ్వరనీ. అదే నిజం అయింది. మనం డేంజర్లో వున్నాం సర్.. ఇప్పుడు మనమేం చెయ్యాలో ఆలోచించాలి. ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చెయ్యాలి. భూమ్మీద వున్న ప్రఖ్యాత సైంటిస్టులందర్నీ సమావేశపర్చాలి. పరిష్కారం కనుక్కోవాలి..’’ గబగబా చెప్పాడు.పురుషోత్తమరావు కొన్ని క్షణాల పాటు నిర్ఘాంతపోయి చూస్తూండిపోయాడు. ఏలియన్స్ని ఎలా ఎదుర్కోవాలన్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్త అన్ని దేశాల ప్రభుత్వాలలోని అత్యున్నత వర్గాలకీ, సైంటిస్టులకీ మాత్రమే పరిమితం చేశారు. ఆపరేషన్ టెర్మినేట్ అంటే భూగ్రహం మీద జీవరాశిని తొలగించడం అని అర్థమౌతున్నా, దానికోసం వాళ్ళ పథకం ఏమిటో ఊహించడం కష్టంగా మారింది.ఆపరేషన్ టెర్మినేట్ అంటే ఏం చేస్తారు..? భూకంపం సృష్టిస్తారా..? లేక సునామీ రప్పిస్తారా..? భూగ్రహాన్ని ఏదైనా ఆస్టరాయిడ్ ఢీ కొట్టేట్టు చేస్తారా..? లేక భూమ్మీద శక్తివంతమైన అణుబాంబు ప్రయోగిస్తారా..? ఏం చేస్తారు..? శాస్త్రజ్ఞుల ఊహలు రకరకాలుగా ఉన్నాయి. సురేంద్ర ఇప్పుడు కీలకంగా మారాడు. మళ్ళీ ఏలియన్స్ అతడి బ్రెయిన్ను కాంటాక్ట్ చెయ్యవచ్చనే ఉద్దేశ్యంతో అతనికి ఆ పని మీదే వుండమని చెప్పారు. వాళ్ళు ఊహించినట్టే సురేంద్రకి మళ్ళీ ఏలియన్తగిలాడు. సురేంద్ర అలర్ట్ అయ్యాడు. అతడి మైండ్లో శబ్దాలు ప్రారంభం అయ్యాయి.‘‘భూగ్రహవాసీ.. చెప్పండి.. మీరంతా నశించడానికి సిద్ధంగా వున్నారనుకుంటాను..’’ ‘‘కాదు.. మీ ఆలోచన మార్చుకోండి.. మా ప్రార్థన ఆలకించండి..’’‘‘కంగారు పడకండి.. మేము మా ఆలోచనను మార్చుకున్నాం..’’‘‘నిజమా.. అకస్మాత్తుగా ఏమిటీ మార్పు..?!’’ సురేంద్రలో ఆశ్చర్యంతో పాటు పెద్ద రిలీఫ్.‘‘అవును.. మీరు చెప్పిందాన్ని గూర్చి ఆలోచించాం. విశ్వంలో జీవరాశులు లేని మరొక గ్రహం కోసం వెతుకులాట ప్రారంభించాం. సరిగ్గా ఏడురోజుల తర్వాత ఇదే సమయానికి మా కాంటాక్ట్లోకి రావడానికి సిద్ధంగా వుండండి. ప్రస్తుతానికి శెలవు..’’ లింక్ కట్టయింది. ఈ వార్త ఆఘమేఘాల మీద ముఖ్యమైన వారందరికీ చేరిపోయింది. సైంటిస్టులంతా పెద్ద రిలీఫ్గా ఫీలయ్యారు. అయినా ఏడురోజుల తర్వాత మళ్ళీ ఏలియన్ కాంటాక్ట్లోకి వస్తే ఎలాగైనా వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వీలవుతుందేమో అన్న దిశలో ఆలోచనలు సాగించారు. ఈసారి సురేంద్ర ఏలియన్తో సంభాషిస్తున్నప్పుడు అతడి పక్కనే ప్రఖ్యాత సైంటిస్టులు కూడా కూర్చొని వుంటారు. సంభాషణ సమయంలో సురేంద్రని మనసులో అనుకోవడంతో పాటు బైటికి కూడా అదేమాటలు చెప్పమని ఆదేశాలిచ్చారు. ఏలియన్ మాటలు వినే అవకాశం మిగతావారికి లేదు కాబట్టి సురేంద్ర మాటల ద్వారా విషయం గ్రహిస్తారు. దాన్ని బట్టి సంభాషణ ఏం జరుగుతోందో అర్థం చేసుకుని అవసరమైతే అతడికి సూచనలు ఇస్తారు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. సురేంద్ర మైండ్లో శబ్దాలు వినిపించసాగాయి.‘‘చూడండి భూగ్రహవాసీ.. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి..’’‘‘మేము కూడా మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాము..’’ చెప్పాడు సురేంద్ర.‘‘మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు. మాతో స్నేహం చెయ్యాలనుకుంటున్నారు. అది జరగని పని. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా ప్రయోగాల కోసం అనుకూలమైన వాతావరణం మీ గ్రహంలోనే వుంది కాబట్టి మీ గ్రహాన్ని ఎన్నుకున్నాం అని చెప్పాను. అది మొదటికారణం.. మీ గ్రహాన్నే ఎన్నుకోవడానికి రెండో కారణం కూడా వుంది. అదేమిటంటే మీ గ్రహవాసుల మీద మాకేమాత్రం సదభిప్రాయం లేదు. బుద్ధిజీవులంటే ఆలోచనాజ్ఞానం వున్నవారని మీరనుకుంటున్నారేమో..? కాదు.. మీ ఆలోచన నాశనానికి మాత్రమే దారితీసేది. అందుకే మిమ్మల్ని బుద్ధిజీవులుగా మేం అంగీకరించలేం. అసలు భూమ్మీద వున్న పరిపాలనా నిర్మాణమే సరైంది కాదు. అనేక దేశాలుగా విడిపోయి వున్న మీరు పైకి శాంతి మంత్రాలు జపిస్తూ నిరంతరం ఒకరినొకరు అనుమానించుకుంటూ వుంటారు. ప్రతిదేశం అణుశక్తి కోసం, అణ్వాయుధాల కోసం తహతహలాడుతుంది. అణ్వాయుధాలు కలిగిన దేశంగా పిలిపించుకోవడం మీకు ఇష్టం. ‘మా దగ్గర కూడా అణ్వాయుధాలున్నాయి సుమా.. జాగ్రత్త’ అని మిగతా దేశాలకు హెచ్చరికనివ్వడం మీ అసలు ఉద్దేశ్యం. అన్నింటికన్నా ఎక్కువగా దేశ రక్షణకు ఖర్చుపెడతారు. నిరంతరం సరిహద్దుల్ని కాపలా కాయకపోతే మీకు రోజు గడవదు. ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. చాలా దేశాల్లో అణురియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి వాటి సరైన నిర్వహణ మీకు తెలీదు. చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి అణుప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మీకీ విషయం అర్థం కావడం లేదు. భూమిని నిప్పులకుంపటి చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మేం నాశనం చెయ్యకపోయినా, సమీప భవిష్యత్తులో మీరే ఆ పని చేసుకుంటారు. అందుకే.. సరిగ్గా అందుకే.. మేం మీ గ్రహాన్ని ఎన్నుకున్నాం. మా అభిప్రాయంలో ఏ మార్పూ లేదు. అయితే మేము ఆపరేషన్ టెర్మినేట్ చేపట్టడానికి మీ కాలమానం ప్రకారం ఏడురోజుల సమయం వుంది. ఈ లోపల మిమ్మల్ని భయభ్రాంతుల్ని చెయ్యడం అనవసరం అనిపించింది. మాలో మేం చర్చించుకున్న తర్వాత మీకు క్రితంసారి ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను.. ఆపరేషన్ టెర్మినేట్కి సమయం ఆసన్నమైంది. నా మాటలు ఆగిపోయిన మరుక్షణం అది మొదలవుతుంది. ఆపరేషన్ టెర్మినేట్ అంటే ఏమిటో తెలుసుకునేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. మీరేం చెయ్యలేరు. గుడ్ బై. వన్...టూ...’’ మాటలు ఆగిపోయాయి. సురేంద్ర ఆందోళనతో కంపించసాగాడు. అంతసేపు అవతలి నుంచి ఏలియన్ ఏం చెప్తున్నాడో అర్థంకాక మిగతావారు టెన్షన్గా చూస్తున్నారు. మాటలు కూడదీసుకుంటూ అతడు చెప్పాడు – ‘‘వాళ్ళు మనకి అబద్ధం చెప్పారు. భూగ్రహాన్ని నాశనం చెయ్యాలనుకున్న వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. బహుశా ఇప్పటికే ఆపరేషన్ టెర్మినేట్ మొదలైంది. వీలైతే అదేమిటో కనుక్కోవడానికి ప్రయత్నించండి. కనుక్కున్నా బహుశా మనమేం చెయ్యలేం. మరికొద్దిసేపట్లో భూమ్మీద జీవజాలం నాశనం కాబోతోంది..’’అక్కడ గందరగోళం మొదలైంది. వాళ్ళనలాగే వదిలేసి సురేంద్ర బైటికి వచ్చాడు. ఏం జరగబోతోంది? సునామీ రాబోతోందా.. లేక ఇప్పటికే వచ్చిందా..? లేక భూకంపమా..? ఆ సూచనలు కనిపించడం లేదే..? అసలు ఏది వచ్చినా భూమ్మీద జీవజాలాన్నంతా ఒకేసారి నాశనం చెయ్యడం సాధ్యమేనా..? ఎంతోకొంత జీవజాలం మిగిలిపోతుంది కదా..? అసలు గ్రహాంతరవాసులు ఏం చెయ్యదల్చుకున్నారు..? ఎదురుగా విశాలమైన స్థలం. ఒక పక్కన పెద్ద కొలను. అతడికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. కొన్ని క్షణాలు గడిచేసరికి అర్థమైంది... శ్వాస తీసుకోవడం కష్టమౌతోంది. అసలేం జరుగుతోంది..? ఎదురుగా కొలనులో నీళ్ళు అంతకంతకీ తరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నిజమా.. భ్రమపడుతున్నాడా..? చెట్టు మీదనుంచి ఏవో పక్షులు కింద పడి అచేతనంగా మారాయి. అతడికి ఎగశ్వాస వస్తోంది.. భూమ్మీదకి విషవాయువులేమైనా ప్రయోగించారా..? ఏమీ తెలీడం లేదు.. ఒక్కటి మాత్రం అతడికి అర్థమౌతోంది. తన చివరి క్షణాలివి..! తనకే కాదు.. బహుశా భూమ్మీద ప్రాణకోటి మొత్తానికి..! అకస్మాత్తుగా అతడి బుర్రలో మెరిసింది.. ఆక్సిజన్.. అవును.. వాతావరణం నుండి ఆక్సిజన్ తొలగించబడుతోంది. టెర్మినేషన్ ఆఫ్ ఆక్సిజన్..! దాదాపు ఇరవై ఒక్క శాతం వుండాల్సిన ఆక్సిజన్ అంతకంతకీ తగ్గిపోతోంది. నీటి నుంచి కూడా ఆక్సిజన్ తొలగించబడుతోంది. నీటిలోని ఆక్సిజన్ విడిపోయి బైటికి పోవడంతో మిగిలిన హైడ్రోజన్ గాల్లోకి చేరుతోంది. అందుకే కొలనులో నీళ్ళు తరిగిపోతున్నాయి. సమస్త జీవరాశినీ ఒకేసారి నాశనం చేసే విధానం. ఆపరేషన్ టెర్మినేట్..! ఏలియన్ చెప్పిన రెండో కారణం అతడికి గుర్తొచ్చింది. అవును మనిషి తన వినాశనానికి తానే గొయ్యి తవ్వుకున్నాడు. అతడి కళ్ళముందు చీకట్లు పరుచుకోసాగాయి. కొద్ది క్షణాల్లోనే అతడికి స్పృహ తప్పింది. ∙ -
నమస్కారం భారతీయ సంస్కారం
సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం. ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ? చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం. ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటమే! న+మమ, నాది అనేది ఏమీలేదు. అంతా నీదే! స్వీకరించు పరమాత్మా! అనే అర్పణ భావనను కలిగి ఉండటం. ఇంతేకాక నమస్కారం ‘ తత్వమసి ‘ అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. కుడి అరచేయి మనకు కనపడని ‘తత్ ’ ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు –– తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవది లేదనే భావనే! ఇది శాస్త్రీయమైన, సంప్రదాయమైన కారణమైతే, దీనివెనక ఎంతో సైన్స్ విజ్ఞానం దాగి ఉంది. అదేమిటో చూద్దాం...నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది. నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది. అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.సైంటిఫిక్ రీజన్ ఏమిటో మరోసారి చూద్దాం... నమస్కారం పెట్టే సమయంలో అరచేతులని దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది. అవతలి వారికి సదభిప్రాయం కలుగుతుంది. అలా అవతలి వ్యక్తిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటామన్నమాట. -
బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవడం
బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలకు, మంచి ఆలోచనలు చేయడానికీ విశిష్టమైన సమయంగా చెబుతారు పెద్దలు. ఇంతకూ దీని గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతోందో చూద్దామా... ∙రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆనారోగ్య సమస్యలు రావని ఆయుర్వేదం చెబుతోంది. ∙ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ∙బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది.... ∙ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింబగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. ∙బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు, సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు వెదజల్లుతాయి. ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ధి వికసించి ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. -
ఉల్లికి కన్నీరు!
ఉల్లి.. దాన్ని కోసేవారికి కన్నీరు రాక తప్పదు. ఎప్పుడూ కంటనీరు పెట్టని కఠిన హృదయులైనా ‘ఉల్లి’ ధాటికి కన్నీరు ఉబికి రావాల్సిందే. అయితే కంట నీరు రాకుండా ఉండే ఉల్లిని తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలే చేశారు. కొందరు సఫలమయ్యారు కూడా. 1980 నుంచి అమెరికాలోని వాషింగ్టన్, నెవడాలోని పంటపొలాల్లో పలు రకాల ఉల్లి జాతుల మధ్య సహజంగా సంకరం జరపడం వల్ల తాజాగా కొత్త రకం ఉల్లి ఆవిర్భవించింది. దీని పేరే ‘సునియాన్’. జన్యుమార్పుల వల్లే ఇది రూపొందిందని చెబుతున్నారు. ఈ ఉల్లి తియ్యటి రుచి కలిగి ఉంటుందని, కోసినప్పుడు కన్నీరు రాదని పేర్కొంటున్నారు. సునియాన్ భారత్కు ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అనుకుంటున్నారా.. దానికి ఇంకాస్త టైం ఉంది లెండి! -
అది రామసేతువే!
‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్ చానెల్ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం.. రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన ‘సైన్స్ చానల్’ రూపొందించిన ఓ కార్యక్రమం. రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్ చానల్ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్ చెప్పారు. ఐసీహెచ్ఆర్ ద్వారా పరిశోధన రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్ఆర్ చైర్మన్ వై. సుదర్శన్రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు సైన్స్ చానల్ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది. తాజాగా సైన్స్ చానల్ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్ ఛానల్ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ అన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET — Science Channel (@ScienceChannel) December 11, 2017 -
మహిళా విజయమే ఇతివృత్తం!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) ఎజెండా ఖరారైంది. మూడు రోజులపాటు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి తరలి వచ్చే పారిశ్రా మికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా కార్యక్రమాలను రూపొందించారు. 300– 350 మందితో నిర్వహించే బ్రేక్ ఔట్లో సదస్సు నిర్దేశించిన సందేశం, ఎంచుకున్న లక్ష్యాల తోపాటు వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తారు. ఎంపిక చేసిన ప్యానెల్ ఈ వేదికలను పంచుకుంటుంది. అలాగే సదస్సు నిర్దేశించిన కీలకమైన అంశాలను లోతుగా చర్చించేందుకు మాస్టర్ క్లాస్లను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 150 మంది పాల్గొంటారు. నిర్ణీత అంశాలపై ప్యానెల్ బృందంతో ముఖాముఖి చర్చలకు వీలుండేలా 40 మందితో వర్క్షాపులు నిర్వహిస్తారు. 28న సాయంత్రం ప్రారంభోత్సవ వేడుక అనంతరం 5.00 నుంచి 7.00 వరకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మార్పునకు స్వాగతం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. మహిళల నాయకత్వమే ఇతివృత్తంగా ప్లీనరీ కొనసాగుతుంది. తమ వ్యాపారాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ వేదికపై ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. రెండో రోజున 29న ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ‘మేం ఏదైనా సాధిస్తాం’ అనే ఇతివృత్తంతో పని, నైపుణ్యాల శిక్షణలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై గంటన్నర పాటు ప్లీనరీ సెషన్ ఉంటుంది. 10.30 నుంచి 11.15 వరకు స్టార్టప్లకు ఊతమిచ్చేలా శాస్త్ర విజ్ఞానంతో ప్రపంచ ఆవిష్కరణలు, అనుసంధానం అనే అంశంపై చర్చ సాగుతుంది. అనంతరం 23 అంశాలపై చర్చలు కొనసాగుతాయి. మనీ కౌంట్స్–ప్రైవేటు ఈక్విటీలను ఆకర్షించటం, షీ మీన్స్ బిజినెస్–మెంటరింగ్ అండ్ నెట్వర్కింగ్, ఈజీ ఎంటర్ప్రెన్యూర్షిప్–ప్రభుత్వ రంగం, ఆవిష్కరణల వారధి, హెల్త్కేర్ స్టార్టప్లలో పెట్టుబడులు, సోషల్ మీడియా సమర్థంగా వినియోగం, హార్వెస్టింగ్ టెక్నాలజీ–అగ్రిటెక్ అంశాలపై మాస్టర్ క్లాస్లు, బ్రేక్ఔట్లు నిర్వహిస్తారు. లంచ్ విరామం అనంతరం 1.30కు క్రౌడ్ ఫండింగ్, బూట్ స్ట్రాపింగ్ అనే అంశంపై వర్క్షాప్ ఉంటుంది. వ్యాపారంలో తప్పులు అనుభవాలు– గుణపాఠాలు, మీట్ జార్ట్ జెట్సన్–మౌలిక సదుపాయాలు అవరోధాలు, కొత్త పారిశ్రామికవేత్తలు–ç Üులభతర వ్యాపార విధానాలు, సహజ వనరుల కొరతను అధిగమించటం, డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం, టెక్నాలజీ కంప్యూటర్ల వినియోగం–అధునాతన శిక్షణ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల పాత్ర–సవాళ్లు.. అనే అంశాలపై మాస్టర్ క్లాస్లు నిర్వహిస్తారు. ఎం–పెసా నుంచి డిజిటల్ బ్యాంకింగ్ వరకు గ్లోబర్ ఎకానమీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాపార విధానాలు, కొత్త సాంకేతిక విజ్ఞానం, వినియోగదారుల కోణంలో వ్యాపారం, పెట్టుబడిదారుల కోణంలో సులభతర వ్యాపారం, సృజనాత్మక పారిశ్రామికవేత్తలు చవిచూసే ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులు, పెట్టుబడులు, మిస్సింగ్ మిడిల్ పేరుతో అభివృద్ధి చెందే తరుణంలో పరిశ్రమలు పెట్టుబడులకు ఎదుర్కొనే సవాళ్లు అనే అంశాన్ని చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు సదస్సు ముగుస్తుంది. మూడో రోజున మూడో రోజు 25 అంశాలపై చర్చ జరుగుతుంది. పెట్టుబడుల విజయం.. అనే ఇతివృత్తంతో ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. అభివృద్ధికి అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులు–లాభాలు, ప్రపంచ స్థాయిలో వ్యవసాయం–సవాళ్లు, భవిష్యత్తులో నగరాలు, మహిళలు సొంతంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు–ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం, సొంత ఆవిష్కరణల పరిరక్షణ, ఇన్నోవేషన్ హబ్స్, ల్యాబ్ నుంచి మార్కెట్ దాకా సైన్సును పారిశ్రామిక రంగానికి జోడించటం, కొత్త సాంకేతిక విజ్ఞానం, భారీ మార్కెట్లలోకి ప్రవేశించటం అనే అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నగదు రహిత సమాజం, కృత్రిమ మేథస్సు ప్రభావం, ఆరోగ్యం–భవిష్యత్తు పరిణామాలు, చెత్త రీ సైక్లింగ్, వ్యాపారం–ఒడిదుడుకులు, క్రీడారంగంలో పెట్టుబడులు, ఏఆర్, వీఆర్ టెక్నాలజీ, ఈ–వాణిజ్యం, ఎకో సిస్టమ్, మీడియా రంగంలో మహిళలు–అవకాశాలు, సమర్థమైన టీమ్ నిర్మాణం–నాయకత్వం, పరిశ్రమలు–భాష, అంతరిక్ష రంగంలో పెట్టుబడులు–అవకాశాలు, వ్యాపార అభివృద్ధిలో కీలక దశలు.. అనే అంశాలపై వేర్వేరుగా చర్చలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ‘వెన్ ఉమెన్ విన్.. వియ్ ఆల్ విన్’ అనే సందేశంతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు, విజయం సాధించిన పారిశ్రామికవేత్తలతో ఆఖరి ప్లీనరీ సెషన్ ఉంటుంది. అవార్డుల ప్రదానంతో చర్చల కార్యక్రమం ముగుస్తుంది. రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు వేడుకలు ఉంటాయి. -
పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి!
పుట్టినరోజు జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది. నూనె అంటుకొని తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదైవం, ఇష్టదైవం ఉంటారు. వారిరువురినీ పూజించాలి. దీపం వెలిగించి, దీపం దగ్గర గట్టుమీద అక్షతలో, ఒకపువ్వో వేసి నమస్కారం చేస్తే, అది ఇంట కాంతి నింపుతుంది. జీవితాన్ని నిలబెడుతుంది. గురువుకి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చేసి, ఆశీర్వాదాన్ని పొందాలి. దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకోవాలి. లేదా కనీసం ఇంటిలో అయినా ఈశ్వరుడి అర్చన చెయ్యాలి. అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్లనువ్వులు, బెల్లం, ఆవుపాలు కలిసిన పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకోవాలి.ఆ తర్వాత పుట్టుకతో చిరంజీవులైన అశ్వత్థామ బలిర్వా్యసో హనూమాంశ్చ విభీషణః! కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః!! ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి. పైకి కూడా చెప్పవచ్చు. ఆరోజు తల్లిదండ్రులకి, గురువుగారికి నమస్కిరించి ఆశీర్వచనం అందుకోవాలి. ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా మృష్టాన్న భోజనం చేయాలి. శక్తికొలదీ దానధర్మాలు నిర్వహించాలి. స్తోమత లేకపోతే చేతినిండా కాసిని పచ్చగడ్డిపరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన విషయాలు. -
జూన్ 2నుంచి ప్రాక్టీకల్ పరీక్షలు
కర్నూలు సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తృతీయ సంవత్సర డిగ్రీ సైన్స్ విద్యార్థులకు జూన్ 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రీజినల్ డైరెక్టర్ అజంతకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జువాలజీ 2నుంచి 4వ తేదీ వరకు, కెమిస్ట్రీ 4నుంచి 6 వరకు, ఫిజిక్స్ 7నుంచి 9వరకు, బోటని 10నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. -
నృత్య విన్యాసం
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బహుమతుల పంట
వేంపల్లె : వేంపల్లె మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైజ్ఞానిక, సృజనాత్మకత రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారని డైరక్టర్ భగవన్నారాయణ తెలిపారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు చేతులమీదుగా విద్యార్థులు పురష్కారాలను అందుకున్నారని తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ‘‘జెడ్ఎఫ్ ఇన్నేవేషన్ చాలెంజ్’’ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులను అనేక దశలుగా పరీక్షించి 42బృందాలను క్వార్టర్ ఫైనల్కు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ బృందాలకు ప్రజెంటేషన్ పెట్టి సెమీ ఫైనల్కు 5బృందాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 24న ఈ ఎంపిక జరిగింది. ఫైనల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రథమ, తృతీయ స్థానాలలో నిలబడి ట్రిపుల్ ఐటీ వైజ్ఞానిక విజయ దుందుభిని మ్రోగించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోనే ఈ విద్యార్థులు సృజనాత్మక ఆలోచన దోరణికి జెడ్ఎఫ్ టెక్నాలజీ యాజమాన్యం మెచ్చుకొని సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం శుభపరిణామమని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రరాజు తెలిపారు. విద్యార్థుల ప్రొత్సహకానికి ముందుండి నడిపిస్తున్న డైరెక్టర్ భగవన్నారాయణను అభినందించారు. విద్యార్థులను మెచ్చుకున్నారు. ప్రథమ బహుమతిని శివప్రసాద్, సురేంద్ర, దుర్గా ప్రసాద్, ప్రదీప్కుమార్ బృందం ‘‘అటానమస్ డ్రైవింగ్ వెహికల్’’ ప్రాజెక్టుకు వీరికి ఈ బహుమతి వచ్చింది. తృతీయ బహుమతిని శివప్రసాద్, శ్రీనాథ బృందం భీమవరం ఎస్ఆర్కే కళాశాల విద్యార్థి విద్యా సాగర్, కరబ్రహ్మచారి బృందం ‘‘స్మార్ట్ ఇరిగేషన్ మానటరింగ్ సిస్టం అండ్ డ్రైవర్ గ్రోసినెస్ డిబెక్షన్ బై పీపుల్ డిబెక్షన్ రెస్పిక్టివిల్లీ’’ సంయుక్త ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. వీరి ప్రతిభను మెచ్చి డైరెక్టర్లు విశ్వనాథరెడ్డి, భగవన్నారాయణలు అభినందించారు. రాబోవు రోజులలో తమ విద్యార్థుల వైజ్ఞానిక, సాంకేతిక ఖ్యాతిని దేశ విదేశాల్లో మరింతగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో అమరేంద్రకుమార్, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, అధ్యాపకులు రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతికి ఇంధనం..శాస్త్ర విజ్ఞానమే
-మానవాళి దశ, దిశలను మార్చిన ఆవిష్కరణలు -పాఠశాల నుంచే ప్రయోగాసక్తి వికసించాలి -నేడు జాతీయ సైన్స్ దినోత్సవం రాయవరం : మస్తిష్కాన్ని కదిలించాలి. మెదడులో రక్తం ఉరకలెత్తాలి. కళ్లు నిశితంగా పరిశీలించాలి. మనసులో జిజ్ఞాస మొదలవ్వాలి. నవతరాన్ని ఆసక్తి నుంచి ఒక ఆశయం దిశగా నడిపించాలి. ఇంతటి శక్తి కేవలం సైన్స్కు మాత్రమే ఉంది. విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ తన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ను ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఏటా ఆ రోజునే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనల పట్ల జిజ్ఞాస పెరిగేలా చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నలే పురోగతికి నాంది ‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ అనే ప్రశ్నలు ఎన్నో విప్లవాత్మక మార్పులకు, ప్రయోగాలకు, మానవ జీవనశైలిని మార్చడానికి దోహదపడ్డాయి. నేటి విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధనాసక్తి తగ్గిపోతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పడుతూ, మార్కుల వేటలో తీరిక లేని వారిగా మారిపోతున్నారు. విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించేందుకు ప్రతి పాఠశాల ప్రయోగశాలగా మారాలి. ప్రతి అంశాన్నీ అనుభవ పూర్వకంగా చిన్నారులకు వివరించాలి. విని తెలుసుకున్న వాటి కంటే ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం చిన్నారుల మెదడుల్లో చెరగని ముద్ర వేస్తుంది. శాస్త్ర అంశాలను సులభంగా వారి మనసుల్లో నాటుకోవడానికి సహకరిస్తుంది. అరకొర వసతులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనలో పరికరాల వినియోగం తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉన్నత తరగతులకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా సర్వశిక్షాభియాన్ ద్వారా పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరవుతున్నా.. అవి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విమర్శలు నిజమేనన్నట్లుగా చాలా పాఠశాలల్లోని ప్రయోగశాలల్లో అరకొర వసతులున్నాయి. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత, 548 వరకు ఉన్నత పాఠశాలలున్నాయి. చాలా పాఠశాలల్లో ప్రయోగాలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండక పోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులకు ప్రయోగశాలలో వినియోగించే పరికరాల పేర్లు కూడా తెలియక పోవడాన్ని బట్టి ప్రయోగాలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. పాఠశాలల్లో ప్రయోగాలు చేయడానికి రసాయన పదార్థాలు, పరికరాలు పూర్తి స్థాయిలో ఉండక పోవడం, ల్యాబ్కు ప్రత్యేకించి గదులు లేక పోవడం విచారించదగ్గ విషయంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ మూడు లక్షణాలూ ప్రధానం.. బోధన, అభ్యసనం, పరిశోధన ఉపాధ్యాయులకు, పరిశోధకులకు ఉండవలసిన మూడు ప్రధాన లక్షణాలు. బోధన ద్వారా తెలిసిన అంశాలను ఇతరులకు చెప్పడం, అభ్యసనం ద్వారా నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశోధన ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయడం జరుగుతుంది. వీటిలో ప్రధానమైనది పరిశోధన. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఎంతో అవసరం. సందేహాల నుంచి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. నూతన ఆవిష్కరణలకు బీజం వేయాలి. సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించినా..వైజ్ఞానికపరంగా అభివృద్ధి చెందడం లేదని పలువురు భావిస్తున్నారు. 1930లో సర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి పొందిన తర్వాత తిరిగి దేశంలో సైన్స్ రంగంలో భారతీయులకు నోబెల్ బహుమతి లభించక పోవడం బాధాకరమని పలువురు సైన్స్ అభిమానులు భావిస్తున్నారు. ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే.. నోబెల్ బహుమతి సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అయితే నోబెల్ బహుమతి సాధించిన తర్వాత ఇవ్వడం కాదని, ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే పాఠశాలల్లో ల్యాబ్స్ ఎంతో అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. అప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతారన్నది నిర్వివాదాంశమని పేర్కొంటున్నారు. శాస్త్రీయ దృక్పథం పెంచాలి.. సైన్స్ ప్రధాన ఉద్దేశం మూఢ నమ్మకాలను పారదోలి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడం. సమాజంలో నిత్యం ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపడం. – కె.శ్రీకృష్ణసాయి, జనవిజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ (26ఎండీపీ126ఎ) చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచాలి.. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయోగాలను విద్యార్థులతో చేయిస్తే వారిలో పరిశోధన పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది. – కేసరి శ్రీనివాసరావు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త పాఠశాల ప్రయోగశాల కావాలి.. ప్రతి వ్యక్తి జీవనానికీ అవసరమైన పునాది పాఠశాలలోనే ప్రారంభమవుతుంది. ఈ దశ నుంచే ప్రతి విద్యార్థినీ భవిష్యత్ ఆవిష్కరణలు చేసేలా ప్రయోగాల వైపు నడిపించడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలి. – జి.వసంత్కుమార్, జిల్లా సైన్స్ అధికారి -
విజ్ఞానం ద్వారానే మానవ వికాసం
కర్నూలు (న్యూసిటీ): విజ్ఞానం ద్వారానే మానవ వికాసం కలుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు యాగంటీశ్వరప్ప పేర్కొన్నారు. ఆదివారం కృష్ణానగర్లోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్సులో వచ్చిన మార్పులను వివరించాలన్నారు. సైన్సును సక్రమంగా వినియోగించుకొనకపోతే వినాశనం జరుగుతుందన్నారు. బాల్యం నుంచే సైన్సుపై అభిరుచి పెంచుకునేలా శాస్త్రీయ విద్య ఉండటం సమాజం గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్మియ్యా, రాష్ట్ర కోశాధికారి సురేష్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, కార్యదర్శులు శ్రీరాములు, వీరేష్, కోశాధికారి దామోదరం, జిల్లా నాయకులు ఎలమర్తి రమణయ్య, జిల్లా మండల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
– విద్యార్థి దశ నుంచి సైన్స్పై ఆసక్తి పెంచుకోవాలి – శాస్త్ర సాంకేతిక రంగాల్లో అపార అవకాశాలు – యోగివేమన వర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ ఎ.రామచంద్రారెడ్డి పిలుపు కర్నూలు (ఆర్యూ): విద్యార్థులు సైన్స్పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎ.రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఐదు రోజుల నుంచి రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సైన్స్ ఇంటర్న్షిప్ ఇన్స్పైర్–2017 మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవాడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఆర్యూ వీసీ నరసింహులు మాట్లాడుతూ సైన్స్ లేనిదే ప్రపంచం లేదన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు మెమెంటో అందజేశారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అమర్నాథ్, క్యాంపు కోఆర్డినేటర్ చక్రవర్తి, అడిషనల్ కోఆర్డినేటర్లు ఎస్.రమణయ్య, డాక్టర్ కమల, ప్రొఫెసర్లు సంజీవరావు, సునీత తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేం
– హెచ్సీయూ ప్రొఫెసర్ దయానంద్ కర్నూలు (ఆర్యూ): సైన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేమని హెచ్సీయూ లైఫ్సైన్స్ ప్రొఫెసర్ దయానంద్ అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో సైన్స్ ఇన్స్పైర్ క్యాంపు మూడో రోజు నిర్వహించారు. ఫ్లోరైడ్ ప్రభావంతో దంత సమస్యలు ఏర్పడుతున్నాయని.. వీటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతం, పులికాట్ సరస్సు నీటి నమూనాల గురించి చేసిన పరిశోధనలను ఫ్రొసెర్లు దయానంద్, జనార్దనరాజు వివరించారు. తుంగభద్ర, హంద్రీ, వక్కిలేరు, కుందూ, భవనాశి నదుల్లో మేలైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు. నీటి సంరక్షణ ద్వారా రాయలసీమలో కరువు పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. బ్లాక్ బోర్డ్ ఉత్తమం.. బోధన సామర్థ్యాలకు ఎలక్ట్రానిక్ పరికరాల కాకుండా బ్లాక్బోర్డు ఉత్తమంగా ఉంటుందని హెచ్సీయూ ప్రొఫెసర్ డా.వి.కన్నన్ తెలిపారు. వేదగణితం, సంఖ్యామానం, సంఖ్యామాన విశ్లేషణా పద్ధతులను నల్లబల్ల మీదుగానే విద్యార్థులకు ఉపదేశించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో జనటిక్ ఇంజినీరింగ్పై ప్రొఫెసర్ దయానంద్ ఉపన్యశించారు. నేటి కార్యక్రమాలు.. వాస్తవ సంఖ్యలు, వాటి అనువర్తితాలు..విశ్లేషణ అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గణితభాగం ప్రొఫెసర్ భాస్కరరెడ్డి ప్రసంగిస్తారు. వాతావరణ కాలుష్యం, పర్యావరణంలో రసాయనశాస్త్రం ప్రాముఖ్యత, కాలుష్య నివారణ పద్ధతులను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కర్నూలు అధ్యాపకులు బి.భాస్కరరెడ్డి వివరిస్తారు. -
సైన్స్తోనే దేశం అగ్రగామి
-విద్యార్థులు పరిశోధనలు వైపు అడుగులు వేయాలి - ప్రముఖ శాస్త్రవేత్త పిలుపు -ఆర్యూలో అట్టహాసంగా సైన్స్ ఇన్స్పైర్ ప్రారంభం కర్నూలు(ఆర్యూ): సైన్స్తోనే దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని బాబా అటామిక్ ఎనర్జీ ముంబాయి శాస్త్రవేత్త ఎ.వి.రెడ్డి, హెచ్సీయూ ప్రొఫెసర్ అభినయ్ సమంత అన్నారు. విద్యార్థులు పరిశోధన వైపు ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ సైన్స్ క్యాంప్ అట్టహాసంగా ప్రారంభమైంది. వర్సిటీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరై మాట్లాడారు. మన శాస్త్రవేత్తలు దేశం గర్వపడేలా 103 ఉపగ్రహాలను త్వరలో ప్రయోగించనున్నారని చెప్పారు. కెమిస్ట్రీలో ఎగ్జ్జైట్మెంట్ ఇన్ సైన్స్ అనే అంశంపై ప్రొఫెసర్ సమంత ఉపన్యాసించారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పరిశోధన రంగాల్లో విద్యార్థుల పాత్ర, ప్రభుత్వ ఆలోచన విధానం తదితర విషయాలను వివరించారు. న్యూక్లియర్ రంగంలో అధునాతన పరిశోధనల గురించి శాస్త్రవేత్త ఏవీరెడ్డి వెల్లడించారు. అకర్బన రసాయన శాస్త్రంలో కొన్ని ప్రయోగాలను విద్యార్థులతో చేయించి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్యూ వైస్ చాన్స్లర్ నరసింహులు, రిజిస్ట్రార్ బి.అమర్నాథ్, సమన్వయకర్త ఎస్.రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు రెండో రోజు శనివారం హైదరబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.రామాచారి పాల్గొని కర్బన రసాయన శాస్త్రంలో ఔషధాల తయారీ ప్రాముఖ్యత, వాటిని ప్రయోగించాల్సిన పద్ధతులను వివరించి ప్రయోగాలు చేసి చూపించనున్నారు. అంతేకాక ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖర్ హెచ్సీయూ కెమిస్ట్రీ విభాగం నుంచి నానో పదార్థాల మీద జరిగే పరిశోధనలు, ప్రపంచంలో నానో రంగంలో జరుగుతున్న అధునాతనమైన పద్ధతులను తెలియజేస్తారు. హెచ్సీయూ వీసీ పర్యటన రద్దు..ఊపిరి పిల్చుకున్న పోలీసులు సైన్్స ఇన్స్పైర్కు హెచ్సీయూ వైస్ చాన్స్లర్ అప్పారావు హాజరవుతున్నారని విద్యార్తి సంఘాలకు సమాచారం అందిందిం. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన ఆయనను ఎలాగైనా అడ్డుకోవాలని విద్యార్థులు వర్సిటీ గేట్ల ఎదుట బైఠాయించారు. ఈవిషయం తెలిసి ఆర్యు అధికారులు వర్సిటీ క్యాంపస్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయితే, ఉన్నట్టుండి అప్పారావు తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలియడంతో పోలీసులు, ఆర్యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థి మృతికి కారణమైన అప్పారావును ఆహ్వానించిన ఆర్యూ వీసీ నరసింహులు వైఖరికి ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, ఆర్పీఎస్ ఎస్ఎఫ్, ఏఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. -
భారతీయులకు ప్రెసిడెన్షియల్ అవార్డులు
వాషింగ్టన్: సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యున్నత పురస్కారమైన అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నలుగురు భారతీయ అమెరికన్లను సహా 102 శాస్త్రవేత్తలను. పరిశోధకులను ఎంపిక చేశారు. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్(పీఈసీఏఎస్ఈ)కు ఎంపికైన భారతీయ అమెరికన్లలో పంకజ్ లాల్(మోంట్క్లెయిర్ స్టేట్ వర్సిటీ), కౌశిక్ చౌదురి(నార్త్ ఈస్టర్స్ వర్సిటీ), మనీశ్ అరోరా(ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎట్ మౌంట్ సినాయ్), ఆరాధనా త్రిపాఠి(వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) ఉన్నారు. -
27 నుంచి ఆర్యూలో ఇన్స్పైర్ సైన్స్ క్యాంప్
కర్నూలు సిటీ: రాయలసీమ వర్సిటీలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఇన్స్రైర్ సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వీసీ వై.నరసింహూలు, రిజిస్ట్రార్ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు రోజుల సైన్స్ క్యాంప్నకు ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారని, ఇందులో కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్తోపాటు ప్రోగ్రామ్ కోర్టినేటర్ ప్రొఫెసర్ ఐఈ.చక్రవర్తి, సహాయ నమన్వయకర్తలు డా.రమణయ్య, కమల(ఫోన్: 9393801635, 8986026400)ను సంప్రదించాలన్నారు. -
ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది
జాతీయ సైన్స్ కాంగ్రెస్లో 16 ప్రాజెక్టుల ప్రదర్శన విద్యార్థులకు పలువురి అభినందన రాయవరం : విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, నమ్మకం, ప్రశ్నించే తత్వం, ప్రయోగాత్మక వైఖరిని పెంపొందించాలి. అప్పుడే నూతన ఆవిష్కరణకు ఆస్కారం కలుగుతుంది. కొత్త విషయాలను, పరిశోధనలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తల్లో అత్యధికులు సామాన్యులే. కేవలం ప్రశ్నించే తత్వం... నిశితంగా పరిశీలించే లక్షణమే వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దింది. యాపిల్ పండు కింద పడడాన్ని పరిశీలించి..పరిశోధించడం ద్వారా ఐజాక్ న్యూటన్ భూమికి గురత్వాకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచానికి అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. జిల్లాలో కూడా శాస్త్రవేత్తలను భావితరాలకు అందించేందుకు..విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించేందుకు జాతీయ సైన్స్ కాంగ్రెస్ను 1914లో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా జిల్లాలో కూడా సైన్స్ పట్ల విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధనా భావజాలాన్ని నింపేందుకు జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఉపయోగపడుతోంది. సమాజంలో మార్పు కోసం.. పాఠశాలలు కేవలం మార్కుల కోసమే కాదు...సమాజ మార్పు కోసం కృషి చేయాలని సైన్స్ కాంగ్రెస్ సూచిస్తోంది. 2008లో విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎంఎస్ఎన్ చార్టీస్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కేసరి శ్రీనివాసరావు మడ అడవుల్లో పీతల పెంపకంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఆయన ప్రస్తుతం జిల్లా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. 2013లో కాశ్మీర్లో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్లో రాజమండ్రికి చెందిన షిర్డీసాయి విద్యార్థులు పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. గత ఏడాది మైసూర్లో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్లో శ్రీప్రకాష్ విద్యానికేతన్ (రాజమండ్రి), శ్రీగౌతమి స్కూల్ (రాజమండ్రి) విద్యార్థులు పరిశోధనాత్మక ప్రాజెక్టులు సమర్పించారు. ప్రస్తుత సైన్స్ కాంగ్రెస్కు... తిరుపతిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్కు జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వివిధ పాఠశాలల నుంచి 16 మంది విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ పరిశోధనలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. టెర్రరిస్టు దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కాకినాడ ఏపీఎస్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సహజ పద్ధతుల్లో దోమలను ఎలా నివారించాలనే అంశాన్ని మలికిపురం మండలం పడమటిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గుర్రపుడెక్క నుంచి ఇంధనం తయారు చేసే విధానాన్ని కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన ఆదిత్య యూపీ స్కూల్ విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. ఇలా పలు పాఠశాలల నుంచి వివిధ ప్రాజెక్టులు జాతీయ సైన్స్ కాంగ్రెస్లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పరిశీలించిన పలువురు ప్రముఖులు విద్యార్థులను అభినందిస్తున్నారు. ప్రయోజనకరంగా ఉంటుంది.. జాతీయ సైన్స్ కాంగ్రెస్లో జిల్లా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శిస్తుండడం హర్షణీయం. ఇది విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించడానికి దోహదపడుతుంది. సైన్స్ పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. - కె.శ్రీకృష్ణసాయి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జీవిత కాలపు సభ్యుడు, జెడ్పీహెచ్ఎస్, మాచవరం, రాయవరం మండలం ఏటా జిల్లా నుంచి ప్రాతినిథ్యం జాతీయ సైన్స్ కాంగ్రెస్కు ఎంపికైన 16 ప్రాజెక్టుల్లో 15 ప్రాజెక్టులు ఇన్స్పైర్ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికై, ఢిల్లీలో ప్రదర్శించిన ప్రాజెక్టులను తీసుకుని రావడం జరిగింది. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్కు ఎంపికైన ఒక ప్రాజెక్టును కూడా తిరుపతిలో ప్రదర్శిస్తున్నారు. ఏటా జిల్లా నుంచి జాతీయ సైన్స్ కాంగ్రెస్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. - కేసరి శ్రీనివాసరావు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కో-ఆర్డినేటర్, కాకినాడ -
సైన్స్, సమాజం రెండూ ఒక్కటే
భానుగుడి (కాకినాడ): సైన్స్ , సమాజం వేరు కాదని అవి రెండూ విడివిడిగా అభివృద్ధి చెందవని, సైన్స్ ఫలితాలు సమాజ పరం చేయాలనే కృతనిశ్చయంతో జేవీవీ పనిచేస్తుందని చెకుముకి జిల్లాస్థాయి సై¯Œ్స సంబరాల్లో వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనగర్ ఆదిత్య పాఠశాలలో నిర్వహించిన చెకుముకి పరీక్షలో వివిధ మండలాల నుంచి తెలుగు మీడియంలో 50, ఇంగ్లిషు మీడియంలో 60 బృందాలు పాల్గొన్నాయి. తొలి ఐదు స్థానాలలో ఉన్న విద్యార్థులకు క్విజ్ నిర్వహించి మొదటి మూడు స్థానాలలో నిలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు మీడియంలో విజేతలు : జెడ్పీ హైస్కూల్ కామరాజుపేట మొదటి, రవీంద్ర భారతి హైస్కూల్ ముమ్మిడివరం, మురమళ్ల జెడ్పీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లిష్ మీడియం : ఆదిత్య హైస్కూల్ అమలాపురం విజేతగా నిలువగా, శ్రీప్రకాష్, శ్రీమతి జీఎండీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లిషు, తెలుగు విభాగాల్లో తొలిరెండు స్థానాల్లో నిలిచినవారు ఈ నెల 12, 13 తేదీలలో నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని కేఎంఎంఆర్ ప్రసాద్ తెలిపారు. సభకు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కేఎమ్ఎమ్ ఆర్.ప్రసాద్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీహెచ్ రవికుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ పి.చిరంజీవినికుమారి, సీనీయర్ నాయకులు బి.అనంతరావు, పి.నరసింహారావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎ¯ŒS.శృతిరెడ్డి, జేవీవీ సై¯Œ్స అండ్ టెక్నాలజీ కన్వీనర్ శ్రీకృష్ణసాయి, జి.వసంతకుమార్, కేసరి శ్రీనివాస్, రామారావు పాల్గొన్నారు. -
ఈ నెల 15, 16 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్
కర్నూలు సిటీ: జిల్లా స్థాయి సైన్స్ మ్యాథమాటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు ఈనెల15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రదర్శనలు దిన్నెదేవరపాడు వద్దనున్న కట్టమంచి జనార్ధన్రెడ్డి హైస్కూల్ నందు నిర్వహించనున్నామని, జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న స్కూళ్ల హెచ్ఎంలు వారి స్కూళ్లు కచ్చితంగా పాల్గొనేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. -
3 నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
భానుగుడి (కాకినాడ) : జిల్లాస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ఆర్.నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా శాలిపేట బాలికోన్నత పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డీవైఈఓ డి.వాడపల్లి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని, జిల్లా స్థాయిలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజమండ్రిలో రేపటి నుంచి కాకినాడలో 3 నుంచి నిర్వహించబోయే కార్యక్రమంలో 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు రానున్నాయని, రాజమండ్రిలో 500 ప్రాజెక్టులలో మొత్తం 1,060 ప్రాజెక్టులు ప్రదర్శితమవుతాయన్నారు. ప్రతి ప్రాజెక్టును మండల స్థాయిలో ప్రత్యేక స్క్రూట్నీ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీ, ఎస్సీఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు తయారీకి రూ.5 వేలు విద్యార్థులకు ఇస్తారన్నారు. విజేతలుగా ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయి విజేతలు జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాజెక్టుగా నిలిస్తే వారికి ఐదేళ్లపాటు ఉన్నతవిద్యతో పాటు, ప్రత్యేక ఉపకార వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చెవ్వూరి రవి, పుల్లయ్య, టి.రంగరావు, కేసరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. నేడు బీవీఎం స్కూల్లో ప్రారంభం కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని బీవీఎం స్కూల్లో ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక బీవీఎం స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల నుంచి సుమారు 524 పైగా ప్రదర్శనలు వస్తాయని, వీటిని మూడు రోజలు పాటు వీక్షించేలా రోజువారీ టైంటేబుల్ ఆయా స్కూళ్లకు ఇస్తామన్నారు. డీఐ అయ్యంకి తులసీదాస్, పరస జగన్నాథరావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
19 నుంచి బాలల సైన్స్ కాంగ్రెస్పై వర్కుషాపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై వర్కుషాపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు వర్కు షాపునకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రంగమ్మ లేదా జిల్లా విద్యా సమన్వయకర్త కె.వి.సుబ్బారెడ్డిని 8790111331, 9948605546 సెల్ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. డివిజన్ల వారీగా వర్కు షాపుల వివరాలు డివిజన్ తేదీ వర్కుషాపు నిర్వహించే స్థలం ఆదోని 19.10.16 ప్రభుత్వ బాలికల పాఠశాల కర్నూలు 20.10.16 బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల డోన్ 21.10.16 శేషారెడ్డి హైస్కూల్, బేతంచెర్ల నంద్యాల 22.10.16 ఎస్పీజీ హైస్కూల్ -
భావన ప్రతిభ జాతీయ స్థాయికి..
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయస్థాయి సైన్స్ సదస్సుకు ఎంపికైన పెదకాకాని మండల జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్. భావనను గుంటూరు డీవైఈవో పి.రమేష్ అభినందించారు. గుంటూరులోని డీవైఈవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సదస్సులో ప్రథమస్థానంలో నిలిచిన భావన నవంబర్ 4న ముంబైలో జరగనున్న జాతీయస్థాయికి అర్హత సాధించిందన్నారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. భావనకు ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, సైన్స్ ఉపాధ్యాయుడు సీహెచ్ వీరప్పయ్య కూడా అభినందనలు తెలిపారు. -
సైన్స్ ద్వారానే దేశాభివద్ధి సాధ్యం
నల్లగొండ టూటౌన్ : దేశం అభివృద్ధి సైన్స్ ద్వారానే సాధ్యమవుతుందని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. ఆదివారం జూనియర్ కళాశాల బాలికల వసతి గృహంలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ ప్రగతి సైన్స్ పాత్ర అంశంపై సెమినార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం సైన్స్, స్వావలంభన కోసం సైన్స్ అనే లక్ష్యంతో ప్రజలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించి మూఢనమ్మకాలను పారదోలాలన్నారు. అందరికి విద్య, అందరి బాధ్యత అనే నినాదంతో సాక్షరత ఉద్యమంలో జేవీవీ కీలకపాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించాలంటే సైన్స్ శాస్త్రీయంగా బోదించాలన్నారు. జేవీవీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు, విద్యార్థులు, మేధావులు ప్రొత్సహించి సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ కృష్ణమరాజునాయుడు మాట్లాడుతూ సైన్స్ను శాస్త్రీయంగా బోధించి విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రమేశ్, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.రత్నాకుమార్, నాగమణి, అజీజ్, రమ్యప్రభ, వెంకటనర్సమ్మ, సత్యనారాయణ,ప్రొఫెసర్ ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు సతీష్కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీణమ్మ, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సైన్స్పై ఆసక్తిని పెంపొందించాలి
డీఈఓ పి.రాజీవ్ అక్టోబర్లో జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ విద్యారణ్యపురి: విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెంచేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదిక అని డీఈఓ పి.రాజీవ్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని న్యూసైన్స్ పీజీ కళాశాలలో 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లోని ప్రధాన అంశమైన ‘సుస్థిర అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం’పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. అనంతరం నిజాం కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చాంద్పాషా, ఎన్సీఎస్సీ రాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ ఎం.సాంబశివారెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను ఈఏడాది నవంబర్ 10,11 తేదీల్లో మెదక్ జిల్లా నందిగ్రామ్లో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. అందువల్ల జిల్లా స్థాయిలో పోటీలను అక్టోబర్లో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సీహెచ్.కేశవరావు, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ కె.రాంగోపాల్రెడ్డి,అకాడమిక్ కోఆర్డినేటర్ వి.గురునాథరావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. -
సైన్స్ను ప్రజలకు దగ్గర చేయాలి: గాదరి కిషోర్
మోత్కూరు: గ్రామాల్లో పేరుకపోయిన మూడనమ్మకాలను దూరంచేసి శాస్త్రసాంకేతిక రంగాలు అందజేస్తున్న విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఆదివారం మోత్కూరులో జన విజ్ఞానవేదిక రెండో జిల్లా మహాసభలు ఎస్ఎం పంక్షన్హాల్లో జరిగాయి. డివిజన్ గౌరవ అధ్యక్షుడు జి.లక్ష్మీనర్సింహ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ ప్రజల్లో సృజనాత్మకతను పెంచాలని అన్నారు. వ్యవస్థలో మమేకమై ప్రజల్లో నెలకొన్న రుగ్మతులను పారతోలడానికి కృషిచేస్తున్న జనవిజ్ఞాన వేదికను అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మానవ ప్రగతి–సైన్స్ పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి రమేష్ మాట్లాడుతూ ప్రయోగశాలల్లో జరిగే ఫలితాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా పాలకులు విద్యావంతులు కృషిచేయాలని అన్నారు. ఆధునిక శాస్త్రసాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ వేదిక పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్రావు, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, ఎంపీపీ ఓర్సులక్ష్మీపురుషోత్తం, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీవిజయభాస్కర్రెడ్డి, సింగిల్విండోచైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మానవ మనుగడకు వేదాలే మూలం
సైన్సుకు సైతం అవే ఆధారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ముక్కామల (అంబాజీపేట) : మానవ మనుగడకు, నేటిæ సైన్సుకు సైతం మూలాధారం వేదాలు, వేదవాజ్ఞS్మయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. అటువంటి వేదాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముక్కామలలోని శ్రీ కోనసీమ యజుర్వేద పాఠశాల నాలుగో వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులందరికీ విద్యారణ్య బోధనలు, వేదాలే శరణ్యమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. ఆరు శాస్త్రాలు, అంగాలు తెలుసుకోవడం ఆచరించడం వల్ల దేశానికి క్షేమం కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థీ భాష్యం తప్పక చదవాలని సూచించారు. ధర్మాన్ని ఆచరించడంవల్ల దేశాభివృద్ధి జరిగి, అందరికీ మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో వేదవిద్య పట్ల పలువురు విద్యార్థులు మక్కువ చూపుతున్నారని, వీరిని మంచి ప్రతిభ కలిగిన వేద పండితులుగా తయారు చేయవచ్చని అన్నారు. వేద వాంజ్ఞS్మయంలో పలు విషయాలను ఆయన విద్యారులకు వివరించారు. హైదరాబాద్ కామకోటి పుణ్యభూమి ట్రస్ట్, పాఠశాల పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థికి నగదు పురస్కారం అందచేశారు. వేదపాఠశాల పాలకవర్గ అధ్యక్షుడు దువ్వూరి బాలకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పి.కె.రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాథ్బాబు, కంచి కామకోటి పీఠాధిపతి ప్రతినిధి స్వయంపాకుల జానకిరామమూర్తి, కార్యదర్శి దువ్వూరి లక్ష్మీనారాయణ సోమయాజులు, భమిడిపాటి శేఖర్, కొంపెల్ల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం
తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదం తైత్తరీయ ఆరణ్యకానికి చెందినదే ఈ ఉపనిషత్తు. ఆరణ్యకంలోని చివరి మూడు ఖండాలను (ఏడు, ఎనిమిది, తొమ్మిది) ైతె త్తరీయోపనిషత్తు అంటారు. ఇది శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనే మూడు అధ్యాయాలుగా ఉంది. మొదటి అధ్యాయం శిక్షావల్లిలో పన్నెండు అనువాకాలు ఉన్నాయి. ఇది గురుశిష్య సంబంధానికి, పఠనానికీ, బోధనకూ, వ్యక్తిత్వ వికాసానికీ, సాధనకూ, శోధనకూ పనికి వచ్చే ఎన్నో సూచనలు చేసే సుప్రసిద్ధమైన ఉపనిషత్తు. ఓం సహనావవతు! సహనౌ భునక్తు! సహవీర్యం కరవావహై తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహౌ ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః (గురుశిష్యులమైన మా ఇద్దరినీ పరమాత్మ రక్షించుగాక! కలిసి భుజింతుము గాక! కలిసి వీరోత్సాహంతో అధ్యయనం చేయుదుముగాక! ఇద్దరమూ తేజోవంతులు అగుదుముగాక! మా ఇద్దరికీ ద్వేషం లేకుండుగాక !) ఈ అనువాకం ప్రార్థనగా పిల్లలూ, పెద్దలూ అందరూ చేస్తూ ఉంటారు. దీనిలో శిక్షావల్లి ప్రారంభం అవుతోంది. శిక్షను వైదిక సంస్కృతంలో ‘శీక్షా’ అంటారు. శిక్ష అంటే విద్యాభ్యాసం. అక్షరం, స్వరం, హ్రస్వదీర్ఘఫ్లుతాలు, స్పష్టమైన ఉచ్చారణ ఎలా ఉండాలో దీనిలో వివరిస్తారు. ఇది ప్రాథమిక విద్య. శరీరంతో సాధించేది. మానవుడు తనకు ఉన్న అయిదు అనుబంధాలను గురించి తెలుసుకోవాలి. అవి అధిలోకం (ప్రపంచజ్ఞానం) అధి జ్యోతిష్యం (విశ్వతేజస్సు), అధివిద్యామ్ (విద్యాభ్యాసం) అధిప్రజమ్ (సంతానాన్ని కనటం) అధ్యాత్మమ్ (వేదోపనిషత్తులతో ఆత్మజ్ఞానాన్ని పొందటం) ఇది వ్యక్తిత్వ వికాసంతో కూడిన సంపూర్ణ విద్య. భూమి, ఆకాశాలను కలిపే అంతరిక్షాన్ని, వాయువును గూర్చి తెలుసుకుని ప్రపంచజ్ఞానాన్ని పొందాలి. అగ్ని, సూర్యుడు, వారిని కలిపే నీరు, మెరుపులను గమనించి విశ్వతేజస్సును తెలుసుకోవాలి. గురువు, శిష్యుడు విద్యలను కలిపే ప్రవచనం ద్వారా విద్యావంతులు కావాలి. తల్లి, తండ్రి, సంతానం ఏర్పడే సంయోగం ద్వారా పునరుత్పత్తి జరుగుతోందని తెలుసుకోవాలి. కింది దవడ, పై దవడ, నాలుక కదలికల వల్ల వాక్కు పుడుతోందని తెలుసుకుని ఈ శరీరం ద్వారా ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నవాడు మంచి సంతానాన్ని, పశుసంపదను, బ్రహ్మవర్ఛస్సును, అన్నోదకాలను, స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతాడు. ఆచార్యుని ఆకాంక్ష, మనోభావాలు ఇలా ఉన్నాయి. పరమాత్మ జీవుల హృదయాకాశంలో ఉంటాడు. ఆత్మనాశనం లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. నోటిలోని కొండనాలుక ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. దాని నుండి ఒకనాడి కపాలంలోకి పోతోంది. ఓం భూః, భువః, సువః, మహః అనే నాలుగు వ్యాహృతులనూ (పేర్లు) ఏకాగ్రతతో ధ్యానించడం వల్ల అగ్ని, వాయువు, సూర్యుడు, పరమాత్మలతో లీనమై పరబ్రహ్మమౌతాడు. ఆకాశం శరీరంగా, సత్యం ఆత్మగా, ఆనందం మనస్సుగా, శాంతితో అమృతమూర్తిగా పరిపూర్ణుడు అవుతాడు. ధ్యానమే సరైన మార్గం. సమస్త శబ్దజాలానికీ ప్రథమం ఓంకారం. అది మేధనూ, బ్రహ్మజ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ, ప్రసాదించుగాక! నాలుక మధురంగా మాట్లాడుగాక! చెవులు మంచిమాటలే వినుగాక! కూడు, గూడు, గుడ్డ, నీరు, పశుసంపద నాకు లభించుగాక! సత్ప్రవర్తన గల విద్యార్థులు అన్ని దిక్కుల నుండి నా దగ్గరకు వత్తురు గాక! శమదమాది క్రమశిక్షణగల శిష్యులు నాకు లభింతురుగాక! ప్రణవరూపుడైన పరమాత్మా! నేను నీలో లీనమై పాఠాలను బోధిస్తాను. నీరు పల్లానికి పారినట్లు ఉత్తములైన బ్రహ్మచారులు నన్ను చేరుదురుగాక! భూః భువఃసువః అనే మూడు భూమి, ఆకాశం, పరలోకం. వీటిని అందరూ తలచుకుంటారు. ‘మహా చమస్యుడు’ అనే రుషి ‘మహః’ అనే నాలుగోదాన్ని కనుక్కున్నాడు. మహః అంటే పరబ్రహ్మమైన వెలుగు. భూః అంటే అగ్ని. భువః అంటే వాయువు. సువః అంటే సూర్యుడు. మహః అంటే చంద్రుడు అని ఒక నిర్వచనం చెబుతారు. చంద్రకాంతిలోని ఓషధులవల్ల జీవులు బతుకుతున్నాయి. మరోనిర్వచనం భూః= ఋగ్వేదం, భువః=సామవేదం, సువః= యజుర్వేదం. మహః= ఓంకారం. ఓంకారమే వేదాలకు మూలం. ఇంకో నిర్వచనం భూః= ప్రాణం. భువః= అపానం. సువః= వ్యానం, మహః= అన్నం. అన్నంతోనే అన్ని ప్రాణులూ జీవిస్తున్నాయి. ఆ నాలుగు నిర్వచనాలను తెలుసుకున్నవాడు పదహారు విధాలుగా జ్ఞానాన్ని పొందుతాడు. దేవతలు అతనికి ఎన్నో కానుకలు ఇస్తారు. భూమి, ఆకాశం, ఖగోళం, దిక్కులు, విదిక్కులు, ఒక విభాగం, అగ్ని, వాయువు, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఒక విభాగం. నీరు, ఔషధులు, చెట్లు, ఆకాశం, ప్రపంచం ఒక విభాగంగా ఇవన్నీ బాహ్య వస్తువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, స్పర్శజ్ఞానం, లోపలి చర్మం, మాంసం, నరాలు, ఎముక, మజ్జ, లోపల ఉండేవి. అయిదుగా ఉండే అంతర్బాహ్యాలు కలిపి ఒకటి అవుతాయి. సమ్మతికీ, అసమ్మతికీ, ఆరంభానికీ, ముగింపుకీ, వేదాలకు, యజ్ఞమంత్రాలకూ అన్నింటికీ ఓంకారమే ముఖ్యం. ఓంకారజపంతో పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. మానవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటనే విషయంలో నాకమహర్షి ఏం చెప్పాడో వచ్చేవారం చూద్దాం.. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు. క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు. తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు. -
ఆ అద్భుతం జరిగేనా? శరీరాన్ని మారుస్తారా?
బీజింగ్: ఆరేళ్ల క్రితం... వాంగ్ వాన్మింగ్ తన స్నేహితుడితో మల్లయుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. పర్యవసానంగా పక్షవాతం వచ్చి మెడ నుంచి కాలి బొటన వేలి వరకు బాడీ అంతా చచ్చుపడిపోయింది. త్వరలో వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరగపోతుందని, చచ్చుపడిపోయిన తన బాడీకి బదులుగా మరో బాడీ వచ్చి చేరుతుందని, తాను తిరిగి ఎప్పటిలాగే లేచి నడవగలనని ఆశిస్తున్నాడు. తల మినహా మొత్తం బాడీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తులో 62 ఏళ్ల రిటైర్డ్ కంపెనీ కార్మికుడు వాంగ్ ఒకడు. చైనా ఉత్తరాది నగరమైన హార్బిన్ నగరంలోని ఆస్పత్రిలో ఈ అద్భుత ఆపరేషన్ కోసం వాంగ్ వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాడు. బాడీ ట్రాన్స్ప్లాంట్ (శరీర మార్పిడి) ఆపరేషన్ మాట వినగానే ఇదేమిటంటూ యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శాస్త్రవిజ్ఞాన ఆచరణీయ పరిధిని చైనా అతిక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, నైతిక విలువల సరిహద్దులను కూడా చెరిపేందుకు సాహసిస్తోందని ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం బాడీ మార్పిడి అసాధ్యమని, వెన్నుపూసలోని నరాలను కలపడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదని, అనవసరంగా రోగికి మరణం తప్పదని ప్రపంచంలోని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎరరెన్ని హెచ్చరికలు చేసినా, విమర్శలు చేసినా బాడీ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమైన చైనాలోని హార్బిన్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ రెని జియావోపింగ్ మాత్రం వెరవడం లేదు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతానని 1999లో అమెరికాలో జరిగిన ప్రపంచ తొలి చేతి మార్పిడి ఆపరేషన్లో అసిస్టెంట్గా పనిచేసిన డాక్టర్ రెన్ తెగేసి చెబుతున్నారు. తన పరిశోధనలు ముందుకు వెళుతున్నాయని, ఆపరేషన్కు అవసరమైన నిపుణుల బందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానని, అన్నీ సిద్ధమయ్యాక ఆపరేషన్ జరిగి తీరుతుందని ఆయన ఓ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు శరీరాల తలలను వేరుచేసి ఒకదానికొకటి మెడ వద్ద కలిపి ఆపరేషన్ చేస్తానని, మెడ వద్ద అమర్చిన తల నిలబడేందుకు ఓ ఐరన్ ప్లేట్ను అమరుస్తానని డాక్టర్ రెన్ వివరించారు. అందరు అనుమానిస్తున్నట్లుగా వెన్నుపూస అడుగుభాగంలో బయటకొచ్చే నరాల వద్ద జిగురులాంటి పదార్థం ఉంటుందని, దాన్ని అతికించడం కష్టమైన ప్రక్రియనే విషయం తనకు తెలుసునని, వాటిని అతికించే బదులు వాటంతట అవే తిరిగి పెరిగేలా చేస్తానని ఆయన చెప్పారు. వెన్ను పూస చివరలో నరాల న్యూరాన్స్ను కలపడం మానవ మాత్రుడితో సాధ్యమయ్యే పనికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బాడీ మార్పిడి ఆపరేషన్కు సిద్ధ పడడం ఎంత తొందరపాటో అంత నిర్లక్ష్య వైఖరని అమెరికాలోని ‘గీజల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ డార్ట్మౌత్ కాలేజ్’ న్యూరాలోజి ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ బెర్నాట్ వ్యాఖ్యానించారు. వైద్య విజ్ఞానపరంగా ఇది సాధ్యమయ్యే పనికాదని చైనా ఆరోగ్య శాఖ మాజీ డిప్యూటీ మంత్రి హాంగ్ ౖజñ ఫూ అభిప్రాయపడ్డారు. ఇది పూర్తి అనైతికమని, ఒకరి తలకాయను మరొకరికి ఎలా పెడతారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వైద్య ప్రయోగాలు నిర్వహించాలనడం చైనా ప్రభుత్వం తాపత్రయమని, అందుకనే వైద్య ప్రయోగాల కోసం చైనా ప్రభుత్వం 294 బిలియన్ డాలర్లను కేటాయించిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. చైనా నియంతత్వ పోకడలతో బయటి ప్రపంచం స్పందనలను పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. తలలు మార్చడం, బాడీలు మార్చడం లాంటి ఆపరేషన్లు నిర్వహించానుకోవడం ప్రపంచంలో డాక్టర్ రెన్ ఒక్కరికి మాత్రమేనున్న ఆలోచన కాదు. ఇటలీలోని టురిన్ అడ్వాన్స్డ్ న్యూరో మాడ్యులేషన్ గ్రూపునకు చెందిన డాక్టర్ సెర్జియో కానవెరో, రష్యా అకాడమిక్ సైన్సెస్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ థియోరిటికల్ అండ్ ఎక్స్పరమెంటల్ బయోఫిజిక్స్ నిపుణుల బందానికి కూడా ఉన్నాయి. అయితే వారంతా డాక్టర్ రెన్ అంత ముందుకు వెళ్లలేదు. డాక్టర్ రెన్ మాత్రం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ఆయన ఇప్పటికే ఎలుకలపై ఈ ప్రయోగం నిర్వహించారు. అవి ఒక్కరోజు మాత్రమే బతికాయి. ఇప్పుడు ఆయన శవాలపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించడం లేదు. ఏదైమైనా ఒళ్లంత చచ్చుబడిపోయిన వాంగ్ వాన్మింగ్ మాత్రం తక కొత్త జీవితం కోసం, వైద్యరంగంలో జరగబోయే అద్భుతం కోసం నిరీక్షిస్తున్నాడు. -
కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం!
మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయం. ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దూరంగా స్పీడ్గా వెళుతున్న వాహనాల్ని చిత్రీకరించడానికి వారిలో ఒకతను తన డాష్బోర్డు కెమెరా తీసి అటువైపు తిప్పాడు. ఇంతలో ఆకాశంలో అద్భుతం. నిప్పులు చిమ్ముతూ అగ్నిగోళాలు విశ్వం నుంచి భూమివైపుగా రాలిపడ్డాయి. దీంతో వెలువడిన ప్రకాశవంతమైన మెరుపు చాలా స్పష్టంగా కెమెరాలో చిక్కింది. అమెరికాలో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించింది. బహుశా ఒక ఉల్క రాలిపడిపోతూ భూ ఆవరణం సమీపంగా వచ్చి ఉంటుందని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. Police dashcam captures a meteor in the sky in the early hours of Tuesday in the US city of Portland, Mainehttps://t.co/NzV8krM1nj — ITV News (@itvnews) 17 May 2016 పోర్ట్లాండ్ సెంట్రల్ ఫైర్ స్టేషన్కు చెందిన పోలీసు అధికారి టిమ్ ఫరీస్ కెమెరాలో ఈ అద్భుతం చిక్కింది. అదే సమయంలో ఆయనతోపాటు ఉన్న మరో అధికారి గ్రహం హల్ట్స్ 'ఓ మై గాడ్' అని అనడం ఈ వీడియోలో వినిపిస్తోంది. నిజానికి ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఈ ఇద్దరు పోలీసు అధికారులే కాదు.. మైనీ, వెర్మోంట్, న్యూహాంప్షైర్, మసాచుసెట్స్, రోడె ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో వందలమంది చూశారు. చాలామంది ఈ అద్భుతాన్ని తమ కెమెరాలో బంధించి యుట్యూబ్లో పోస్టు చేశారు. ఒక ఫ్రిడ్జ్ పరిమాణంలో ఉన్న అంతరిక్ష రాయి (స్పేస్ రాక్) లాంటి వస్తువు ఏదో నిప్పులు చిమ్ముతూ కూలిపోయిందని, అది భూమికి చేరువగా రావడంతో ప్రకాశవంతమైన మెరుపుతో కాంతులు కనిపించాయని అమెరికా నావల్ అబ్జర్వేటరీ పేర్కొంది. -
మీ బాధ తగ్గడానికి..
ఏప్రిల్ 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యానిమల్స్ ఇన్ ల్యాబ్ హాయ్ ఫ్రెండ్స్.... సెలవులొచ్చాయి. హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారా? మేము మాత్రం చాలా శాడ్ ఎందుకంటారా? మిమ్మల్ని బోనులో బంధిస్తే ఎలా ఉంటుంది? కళ్లల్లో యాసిడ్ పోస్తే మీరు ఎలా ఫీలవుతారు? రోజుకో రకమైన విషమిస్తే ఎలా విలవిల్లాడిపోతారు? మరి మేం అలా అవ్వమా? మేం మనుషులం కానంత మాత్రాన మాకు బాధ ఉండదా? నొప్పి కలగదా? బ్యాడ్ థింగ్స్ చేస్తే... నరకంలో ఇలాంటి శిక్షలే వేస్తారట! కానీ మేమేం చేశాం...? మీకు నవ్వులు పంచే టామ్ అండ్ జెర్రీ, అల్లరితో నవ్వించే బగ్స బన్నీ అన్నీ మేమే. మీరెంతో మెచ్చిన స్టువర్ట లిటిల్ కూడా మేమే. అంతేనా... ఇంత ముద్ద పెడితే పగలూ రాత్రీ మీ ఇంటికి కావలి కాసేదీ, మీకు తోడుగా ఉండేది కూడా మేమేగా! అలాంటి మమ్మల్ని సైన్స్ పేరుతో, ప్రయో గాల పేరుతో నరక యాతనకు గురి చేయడానికి మీకు మనసెలా వస్తోంది? మీకు తెలుసా ఫ్రెండ్స! 11.5 కోట్లు... అక్షరాలా పదకొండున్నర కోట్లు... ఏటా సైన్స్ పేరిట, ప్రయోగాల పేరిట బలవుతున్న జంతువుల సంఖ్య ఇది. ఎలుకలు, చేపలు, కుందేళ్లు, చుంచెలుకలు, గినియా పిగ్స్, హ్యామ్స్టర్స్, రకరకాల పక్షులు, పిల్లులు, కుక్కలు, పందులు, కోతులు, చింపాంజీలు... మీ మనుషులు చేసే ప్రయోగాలకు బలైపోతూనే ఉన్నాయి. వాటికీ మనసుంటుందని, వాటికీ నొప్పి, బాధ ఉంటాయని మీకు అసలు తెలియదా? పోనీ ఇన్ని ప్రాణాలను బలి తీసుకున్న తరువాత మీరు సాధిస్తున్నది ఏమైనా ఉందా అంటే అది కూడా పిసరంతే. పైగా ఇది 21వ శతాబ్దం. ఆధునిక హైటెక్ యుగం. ప్రతిదానికీ మెరుగైన మేలైన పరిష్కారాన్ని ఇట్టే సూచించే కాలం. మరి మా వెంట ఎందుకు పడుతున్నారు బాస్? మాకు కావాల్సిందల్లా... కాస్తంత కరుణ... మరికొంత సహానుభూతి. అవి ఇసుమంతైనా లేవా మీ దగ్గర?! దాదాపు వందేళ్ల క్రితం మొదలైన మీ దారుణ లక్ష్యం... జీవశాస్త్రాన్ని, వ్యాధులను అర్థం చేసుకోవడం. మీకు వచ్చే జబ్బులను తగ్గించడానికి తయారుచేసే మందులను ‘పరీక్షించడం’. అది కూడా ఎవరి మీద? నోరు లేని మామీద. మాపై ప్రయోగాలు ఇంతటితో ఆగిపోయినా బాగుండేది. దురదృష్టవశాత్తూ మీరు తినే ఆహారం (ఫుడ్ అడటివ్స్) మొదలుకొని కట్టుకునే గుడ్డ, చివరికి మీ అందాన్ని ఇనుమ డింపజేసుకునేందుకు పూసుకునే కాస్మొటిక్స్ వరకూ అన్నిటికీ బలయ్యేది మా జంతువులే. మా ప్రాణాలు తీయడం లేదంటే బతికుండగానే మా చర్మాలను ఒలవడం ద్వారా తెచ్చుకుంటున్నవే. ప్రయోగమేదైనా బలయ్యేది మాత్రం మేమే. మా జంతువులు చాలావరకూ ఈ ప్రయోగాల కారణంగా తొలి ప్రయత్నంలోనే మరణిస్తున్నాయి. కానీ మిగిలిన కొన్ని ప్రాణులు మాత్రం మళ్లీ మళ్లీ ప్రయోగాల టార్చర్కు గురవుతూనే ఉంటున్నాయి. ప్రాణాలు తీస్తే ఫలితం దక్కుతుందా?! వందేళ్లకుపైగా రకరకాల రసాయనాలు, మందుల భద్రతను మాపై పరీక్షించి మరీ వాడుతున్నారు మీరు. ఇందుకోసం మమ్మల్ని భౌతికంగా ఎంతో టార్చర్కు గురిచేయడం నైతికంగా తప్పు. పోనీ ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. మీరు చేసే ఈ ప్రయోగాల వల్ల నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా లేదా అన్నది ముందు తెలుసుకుందాం. జంతువుల్లో ఎంతో సమర్థంగా పనిచేసిన మందులు మనుషుల్లోనూ అదే రకమైన ప్రభావాన్ని చూపుతాయన్న గ్యారెంటీ లేదు. ఆస్తమానే ఉదాహరణగా తీసుకోండి. దీని మందు కోసం కొన్ని దశాబ్దాలుగా మాపై ప్రయోగాలు జరుగుతున్నాయి. తీరా చూస్తే ఇన్ని ప్రయోగాలు చేసి, ఇన్ని జంతువుల ప్రాణాలు తీసిన తర్వాత కూడా ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చింది రెండే రెండు చికిత్సా విధానాలు. గుండెపోటు చికిత్స విషయమూ ఇంతే. వెయ్యి దాకా మందులను జంతువులపై ప్రయోగించి, వాటిని బలి తీసుకుంటే... మనిషికి పనికొచ్చింది ఒక్కటంటే ఒక్క మందు! ఈ రకమైన వ్యాధులు లేని, రాని జంతువులపై ప్రయోగాలు చేయడం వల్లే ఫలితాలు ఇలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మిగిలిన చాలా వ్యాధులకు సంబంధించిన మందులు కూడా మనుషుల్లో ప్రభావం చూపకపోవడానికి సగం నుంచి 99.7 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా! మెరుగైన వైద్యానికి అవసరం కాదా? మేమంటే జంతువులం. ఏదో అలా బతికేస్తాం. కానీ మీరు మనుషులు. తెలివితేటలు ఉన్నవాళ్లు. మీ తెలివిని ఉపయోగించి టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చేశారు. మరి దాన్ని వాడుకోవచ్చు కదా! ఒకప్పుడు మరో ప్రత్యామ్నాయం లేక, మెరుగైన వైద్యం కోసం మామీద ప్రయోగాలు నిర్వహించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వీటి ప్రయోజనం సున్నా అని జంతు పరిరక్షణ సంస్థల ప్రతినిధులు కుండ బద్దలుకొట్టి చెప్తున్నారు. అది మీకు వినపడదా? వినిపించుకోరా? మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కావడం, కంప్యూటర్ శక్తి మునుపెన్నడూ ఊహించని స్థాయికి చేరుకోవడం జరిగింది కాబట్టి... జంతువుల స్థానంలో మానవ కణాలపైనే ప్రయోగాలు చేయవచ్చునని వారు అంటున్నారు. కణస్థాయిలో అత్యధిక వేగంతో వేర్వేరు పనులు నిర్వహించగల రోబోలు, ఆటోమెటిక్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయట. కంప్యూటేషనల్ బయాలజీ వంటి ఆధునిక సైన్స్ అంశాలు మంచి పురోగతి సాధించాయట. వీటి వల్ల కణాలు, జన్యువులు, వాటి పనితీరుపై మనిషికి ఎంతో అవగాహన పెరిగిందని, ఫలితంగా ఏ రసాయనమైనా మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కంప్యూటర్ సిములేషన్ తదితర పద్ధతుల ద్వారా తెలుసుకోవడం కష్టమేమీ కాదని తాజా అంచనా. ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న జనాభా సమాచారంతో కలిపి విశ్లేషించడం ద్వారా జంతు ప్రయోగాల కంటే మెరుగైన విధంగా ఫలితాలు సాధించవచ్చట. వ్యాధులను అర్థం చేసుకునేందుకు కుక్కలు, కోతుల్లో ఆ వ్యాధిని సృష్టించడం కంటే... మనిషికి వ్యాధులు వచ్చేందుకు కారణమవుతున్న అంశాలను గుర్తించే దిశగా ప్రయోగాలు చేపట్టడమూ జంతు ప్రయోగాల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్తున్నారు. మాకంటే ఇవన్నీ అర్థం కావు. మీకు అర్థమవుతాయి కదా! మరి ఎందుకు ఇంకా మా ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు! దయచేసి ఇక ఈ ప్రయోగాలు ఆపండి ఫ్రెండ్స. మమ్మల్ని బతకనివ్వండి. మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మా ప్రాణాలు తీయకండి. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా ఇవన్నీ ప్రయోగాల్లో భాగమే! ♦ తిండి తిప్పల్లేకుండా.. నీళ్లు కూడా అందకుండా మాడ్చడం. ♦ కత్తులతో గాయాలు చేయడం. కాల్చడం. (గాయాలు తొందరగా మాన్పేదెలాగో తెలుసుకునేందుకు) ♦ బలవంతంగా ఈతకొట్టేలా చేయడం, కరెంటుతో షాకులివ్వడం (ఒత్తిడి, ప్రవర్తనల అధ్యయనం కోసం) ♦ శస్త్రచికిత్సలు చేయడం... కోలుకున్నాక ఇదే పని మళ్లీ మళ్లీ చేయడం. (మెరుగైన శస్త్రచికిత్స పద్ధతులు తెలుసుకునేందుకు) ♦ బలవంతంగా ఆహారాన్ని నోట్లో కుక్కడం, రకరకాల విషవాయువులను పీల్చేలా చేయడం, కడుపులోకి, చర్మంపై ఇంజెక్షన్లు గుచ్చడం ( రసాయనాల దుష్ఫలితాలను అంచనా వేయడం కోసం) ♦ వ్యాధులకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లకు గురిచేయడం. మందులు ఇవ్వడం ♦ రకరకాల వైకల్యాలు, రోగాలు తెచ్చిపెట్టేలా జన్యువులను చేర్చడం, తొలగించడం. ♦ మనుషుల్లో వచ్చే కేన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి రోగాలను జంతువుల్లో సృష్టించడం. ♦ కార్బన్ డైయాక్సైడ్ వంటి విష వాయువులిచ్చి చంపేయడం... మెడ విరిచేసి చంపేయడం... తల నరికేయడం వంటివి కూడా జంతు ప్రయోగాల్లో భాగమే. -
విద్యార్ధికి డబ్బులు కట్టిన యూనివర్సిటీ!
ఠాణే: మధురై కామరాజు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థికి కళాశాలకు చెందిన అన్ని రకాల సదుపాయాలను కల్పించడంలో విఫలం చెందినందుకు కన్జ్యూమర్ రీడ్రస్సల్ ఫోరమ్ ఫైన్ కింద రూ.20,000 చెల్లించాలంటూ ఆదేశించింది. స్నేహా మహత్రే సారధ్యం వహిస్తున్న ఫోరమ్ మెంబర్లు మాధురి విశ్వరూపే, ఎన్డీ కదమ్లు ముందు వచ్చే పరీక్షలకు విద్యార్థిని అనుమతించాలంటూ కేంద్రానికి సూచనలు చేసింది. మత్స్య శాస్త్రంపై 2013లో కులకర్ణి విశ్వవిద్యాలయంలో చేరి, ఫీజు కింద రూ.7,300లను చెల్లించాడు. కానీ, అకడమిక్స్కు సంబంధించిన ఎటువంటి పుస్తకాలు విద్యార్ధికి చేరకపోవడంతో 2014లో కోర్సు పూర్తికావాల్సి ఉండగా కాలేదని, కోర్సు పూర్తయి ఉంటే నెలకు రూ.4000 జీతంతో తనకు ఉద్యోగం లభించి ఉండేదని ఫోరమ్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు నష్టపరిహారం కింద రూ.40,000 ఇప్పించాలని ఫోరమ్ను కోరాడు. ఫిర్యాదుపై ఫోరమ్ ముందు హాజరుకావాలని స్టడీ సెంటర్, మధురైలో ఉన్న యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. గడువులోపు ఫోరమ్ ముందు హాజరుకాకపోవడంతో విద్యార్ధికి ఏప్రిల్లోగా ఇరవై వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే అప్పటి నుంచి ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని హెచ్చరించింది. -
ఇక నేరగాళ్ళను త్వరగా పట్టెయ్యచ్చు..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్...ఇస్రో సహాయంతో ఢిల్లీ పోలీసులు మరో అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని నగరంలో హింసను అరికట్టేందుకు స్పేస్ టెక్నాలజీని వాడకంలోకి తెస్తున్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సూచనా విధానాన్ని అనుసరించి నేరాలను ప్రత్యక్షంగా కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశ రాజధాని నగరంలో నేరాల రేటు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో నివారణ చర్యలకు పోలీసులు రాకెట్ సైన్స్ ను వినియోగించనున్నారు. స్పేస్ టెక్నాలజీ ద్వారా లైవ్ క్రైమ్ మ్యాపింగ్ ను అమల్లోకి తెచ్చి... క్రిమినల్స్ ఆట కట్టించనున్నారు. క్రైమ్ మ్యాపింగ్ ఎనలిటిక్స్ అండ్ ప్రెడిక్టివ్ సిస్టమ్ (CMAPS) ద్వారా స్పేస్ టెక్నాలజీ ఆధారిత టూల్స్ ను వినియోగించి హింసను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇస్రో భాగస్వామ్యంతో తాము అంతర్గత భద్రత, భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు చెప్తున్నారు. అందుకు పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ డివైజ్ (PDA) ను వాడకంలోకి తెస్తున్నారు. సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ తో అనుసంధానం చేసిన ఈ వ్యవస్థ.. శాంతి భద్రతల నిర్వహణకు, ఎనలిటిక్స్ ద్వారా నేరాల నియంత్రణకు సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రతి 15 రోజులకోసారి ఎలక్ట్రానిక్ డేటా సేకరించడం ద్వారా క్రైమ్ ను గుర్తిస్తున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఈ ప్రెడెక్టివ్ పోలీసింగ్ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశీలనలో ఉంది. కాగా భారతదేశంలో ఈ విధానాన్ని కీలక సమాచారాన్ని సరైన సమయంలో పోలీసులకు అందించేందుకు వినియోగించనున్నారు. దీని వాడకంతో సిబ్బంది నివేదికలు అందించేందుకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థలో జీపీఎస్ ద్వారా కాలర్ ఉన్న ప్రాంతాన్నిడిజిటల్ మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. దీంతో పోలీసులు సరైన సమయంలో ఆ వ్యక్తిని చేరుకోగల్గుతారు. అధిక నేర రేటు ఉన్న ప్రాంతాలను మానిటర్ చేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. దీంతో నేరాలను అరికట్టడం సులభమౌతుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. -
పాఠశాల విద్యలో ‘రా’
సైన్స్, మ్యాథ్స్లకు ప్రాధాన్యమిస్తూ కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 12వ తరగతి వరకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యం పెంచుతూ, వాటిపై ఆసక్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (రా) పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అవసరమైన చర్యలపై ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ పథకం కింద సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ సబ్జెక్టులపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచి, ఆయా రంగాల వైపు వారిని మళ్లించాలని స్పష్టం చేసింది. నూతన పథకంలో భాగంగా కేంద్రం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలివి... * 6 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. * ముఖ్యంగా పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులకు ఆయా రంగాలకు సంబంధించిన అంశాలపై బోధన, స్టడీ టూర్లు, విజిటింగ్ల వంటి కార్యక్రమాలను నిర్వహించాలి. * తరగతి బోధనే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు, ప్రయోగ పద్ధతులను అమలు చేయాలి. * పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లను అభివృద్ధి పరచాలి. నాణ్యతా ప్రమాణాలు పెంచాలి. * టీచింగ్ లెర్నింగ్ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చర్యలు చేపట్టాలి. * ఉన్నత విద్యా రంగానికి చెందిన వారితోనూ పాఠశాలల్లో పాఠాలు చెప్పించాలి. టీచర్ సర్కిళ్లు, సైన్స్, మ్యాథ్స్ క్లబ్బులు ఏర్పాటు చేయాలి * ఒలింపియాడ్ వంటి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి. స్కూళ్లలో సరిపడా సైన్స్, మ్యాథ్స్ టీచర్లను నియమించాలి. పాఠ్యాంశాల రూపకల్పనకు కసరత్తు ఈ కార్యక్రమాలన్నింటికీ అనుగుణంగా సిలబస్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా 11 విభాగాలకు చెందిన వివిధ అంశాల్లో మార్పులు అవసరమని జాతీయ విద్యా పరిశోధన, ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా రాష్ట్ర విద్యా పరిశోధన, ఎస్సీఈఆర్టీ కసరత్తు చేస్తోంది. -
‘క్లై ఫై’తో ప్రళయమా ?
న్యూఢిల్లీ: క్లైమేట్ ఛేంజ్...భూతాపోన్నతి పెరిగి ప్రపంచంలో సంభవించే పెను మార్పులు. నేటి ‘వైఫై’ యుగంలో క్లైమేట్ ఛేంజ్ను ‘క్లైఫై’ అని పిలుస్తున్నారు. తైవాన్లోని బ్లాగర్ డాన్ బ్లూమ్ 2007లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఇది 2013 నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. బ్లాగ్లు, వార్తా పత్రికలు, నవలల్లో ఎప్పటి నుంచో భూతాపోన్నతి పెరగడం పట్ల చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఫిక్షన్ కథలు వెలువడుతున్నాయి. ఇదే అంశంపై దేశ, దేశాధినేతలు కూడా సుదీర్ఘకాలంగా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో పేర్కొన్న వరదలు కూడా భూతాపోన్నతి కారణంగానే అన్న సూత్రీకరణల కాలం నుంచే చర్చలు కొనసాగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. రియోలో 1992లో ప్రపంచ దేశాల మధ్య భూతాపోన్నతి తగ్గించేందుకు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దానిలో ఏ అంశం కూడా నేడు అమలు కావడం లేదు. అందుకే సోమవారం పారిస్లో ప్రారంభమైన సదస్సు ప్రధానంగా నాటి ఒప్పందాన్నే సమీక్షిస్తోంది. ఇంతకు ‘క్లై ఫై’ అంటే ఏమిటి? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని అడ్డుకోవడం ఎట్లా? నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యుల వరకు ఎక్కువ మందికి అంతు చిక్కని ప్రశ్నే! పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోందని, ఫలితంగా రుతుక్రమాలు గతి తప్పుతాయని, ఒక ప్రాంతంలో వర్షాలు అధికంగా పడి వరదలు సంభవిస్తే, మరో ప్రాంతంలో వర్షపు చినుకు కూడా పడకుండా దుర్భర కరువు పరిస్థితులు దాపురిస్తాయని, భూతాపోన్నతి కారణంగా ధ్రువాల్లో మంచు కొండలు కరిగిపోయి జల ప్రళయం వస్తుందని, భూపొరల్లో మార్పులు వచ్చి అగ్ని పర్వతాలు బద్ధలై ప్రళయ భీకరాన్నిసృష్టిస్తాయని, సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఏదో ఒకరోజు భూగోళంపై సమస్త జీవరాశి నశిస్తుందని స్థూలంగా సామాన్యులకున్న అవగాహన. అందుకనే భూతాపోన్నతి పరిణామాలపై ఎన్నో హాలివుడ్ సినిమాలు, దాదాపు 150 నవలలు వచ్చాయి. 1976లో ‘హీట్’ అనే నవలను ఆర్థర్ హెర్జోగా రాశారు. ‘ది సన్ అండ్ ది సమ్మర్’ అనే నవలను జార్జ్ టర్నర్ 1987లో రాశారు. మ్యాగీ గీ, టీసీ బోయల్, అట్వూడ్, మైఖేల్ క్రిక్టాన్, బార్బర కింగ్సాల్వర్, ఐయాన్ మ్యాక్ఎవాన్, కిమ్ స్టాన్లే రాబిన్సన్, ఐజా త్రోజనోవ్, జీనెట్ వింటర్సన్ లాంటి రచియతలతోపాటు వర్ధమాన రచయితలు స్టీవెన్ ఆమ్స్టర్డామ్, ఎడన్ లెపుకీ, జాన్ రాసన్, నిథానియల్ రిచ్ లాంటి వారు పలు రచనలు చేశారు. వీరి రచనల కారణంగానైతేనేమీ, హాలివుడ్ సినిమాలు, పత్రికలు, ఇతర మీడియా మాధ్యమాల వల్లనైతేనేమీ భూతాపోన్నతిపై చర్చలు జరుగుతున్నా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్య సయోధ్య కుదరక భూతాపోన్నతి అరికట్టే చర్యలు ముందుకు సాగడం లేదు. అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలే కర్బన ఉద్గారాలకు ఎక్కువ కారణమవుతున్నాయని, వాటితో సమానంగా చర్యల ప్రమాణాలను తమకు సూచిస్తే ఎట్లా ? అని వర్ధమాన దేశాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్లనే భూతాపోన్నతి పెరగడం లేదు. అడవుల విస్తరణ తరిగి పోవడం, ఖనిజ సంపద కోసం గనుల తవ్వకాలు జరపడం, రాళ్లు, కంకర కోసం పర్వతాలను మట్టి కరిపించడం, నదీ జలాల ప్రవాహాన్ని భారీ డ్యామ్లతో అరికట్టడం, వాటిని ప్రకృతికి విరుద్ధంగా తరలించడం కూడా ప్రధాన కారణాలే. -
శాస్త్రమా.. చిత్రమా..?
విశ్వం అంచుల్ని చూసే టెలిస్కోపులున్నాయి... సుదూర గ్రహాలను చేరే రాకెట్లూ నడుపుతున్నాం...! గంటల్లో భూమి ఒక చివరి నుంచి మరో అంచుకు చేరుకోగలుగుతున్నాం...! సైన్స్ టెక్నాలజీ అంతగా అభివద్ధి చెందింది.. చెందుతోంది! అయితే.. మనిషి ఇప్పటికీ విప్పలేని మిస్టరీలు ఇంకా మిగిలే ఉన్నాయని... అవి కూడా గ్రహాలు, నక్షత్రాలవి కాకుండా...మన శరీరానికి సంబంధించినవని అంటే...మీరు ఆశ్చర్యపోరా...ముక్కున వేలేసుకోరా? జీవితంలో మూడొంతుల కాలం నిద్రలోనే గడిచిపోతుంది. కొందరు రోజుకు తొమ్మిది గంటలు నిక్షేపంగా నిద్దరోతే... ఇంకొందరు నాలుగు గంటలు కళ్లుమూసుకున్నా... రోజంతా హుషారుగా గడిపేస్తారు. ఐన్స్టీన్ లాంటి మేధావి... నిద్దర దండగమారి పని అని నిష్టూరమాడినా... మనకు మాత్రం కునుకుతీయనిదే తెల్లారదు. ఎందుకిలా? రోజూ ఎందుకు నిద్రపోవాలి? పోకపోతే ఏమవుతుంది? మనిషి సరే.. జంతువులన్నీ మనలాగే నిద్దరోతున్నాయా? ఈ ప్రశ్నల సమాధానాలు మనకే కాదు... శాస్త్రవేత్తలకూ తెలియవు. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునేందుకు నిద్ర పనికొస్తుందని కొందరు అంటూంటే... ఎప్పుడో జంతువుల్లా ఉన్నప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడిందని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఏరోజైనా మనం పడుకోవడం గంట ఆలస్యమైందనుకోండి. కళ్లు మూతలు పడటం మొదలవుతుంది. ఒకదాని వెంట ఒకటి ఆవలింతలూ పలకరించడం మొదలవుతుంది. నిద్ర తక్కువైతే ఆవలింతలు వస్తాయా? ఆవలింతలు వచ్చినప్పుడు నిద్ర వస్తుందా? ఇదీ ఓ మిస్టరీనే! 11 రోజుల 24 నిమిషాలు... కాలిఫోర్నియాకు చెందిన రాండీ గార్డనర్ నిద్రలేకుండా గడిపిన సమయమిది. 1965లో ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అంత సుదీర్ఘ కాలం మేలుకున్న తరువాత కూడా గార్డనర్ కేవలం 14 గంటల 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయి మామూలుగా నిద్రలేచాడు. మీకు తెలుసా...? కంటినిండా కునుకుతీస్తే ఒళ్లు నాజూకుగా ఉంటుంది. ఆకలి, బరువు పెరగడాన్ని నియంత్రించే హార్మోన్లు, రసాయనాలు నిద్రలోనే విడుదలవడం దీనికి కారణం! బుర్ర వేడెక్కితే... ఆవలింత! కడుపులో ఉన్న పసిగుడ్డు కూడా అప్పుడప్పుడూ నోరు బార్లా తెరిచి ఆవలిస్తుందట! నిద్రముంచుకు వస్తున్నా... బోర్ కొడుతున్నా ఒకట్రెండు ఆవలింతలు పలకరించడం కద్దు. ఇవి మనకే కాదు... కుక్కలు, పిల్లులతోపాటు, చేపలు, పాములకూ అలవాటైన విషయమే. చిత్రమైన విషయమేమిటంటే.. దీనికి కారణమేమిటన్నది తెలియకపోవడం. నిన్నమొన్నటివరకూ ఒక అపోహ ఉండేది.. ఆవలిస్తే మెదడుకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ లభిస్తుందని, తద్వారా మనం పూర్తి మెలకువ సాధిస్తామని అనుకునేవారు. తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమింటే.. ఇదంతా ఒట్టిదేనని. వేడెక్కిపోయిన మెదడును కొంతవరకూ చల్లబరచడం ఆవలింతల పరమార్థమని వీరు అంటున్నారు. ఆవలింతకు ముందు ఎలుకల మెదడు ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండటం.. ఆ తరువాత వెంటనే తగ్గిపోవడం తాము గమనించామని స్టీఫెన్ పాటెక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 2007లో గాలప్ అనే శాస్త్రవేత్త ఇంకో ప్రయోగం చేశారు. నుదుటిపై చల్లటి ప్యాకెట్ను ఉంచుకున్న వారికంటే.. వేడి ప్యాకెట్ ఉంచుకున్న వారు... ఎక్కువ సార్లు ఆవలించారన్నది దీని సారాంశం. మీకు తెలుసా...? 20 వారాల పిండం కూడా ఆవలించగలదు. ఆవలింతకు పట్టే సమయం 6 సెకన్లు మాత్రమే! వయసు పెరిగే కొద్దీ ఆవలింతల సంఖ్య తగ్గుతుంది! ఆవలించే వారిని చూస్తే మనకూ ఆవలింతలు వస్తాయి! వేలిముద్రల మతలబు ఏంటి? ఏక చక్రం మహాభోగే... ద్విచక్రే రాజపూజిత.. త్రి చక్రే లోక సంచారి.. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాటలివి. నిజం కాదనీ తెలుసు. వేలిముద్రల్లోని చక్రాలు మన లక్షణాలను నిర్ధారించగలిగితే కష్టపడకుండానే అన్నీ దక్కేస్తాయి కదా! మరి... చేతులు, కాళ్ల వేళ్లపై మాత్రమే కనిపించే ముద్రలు మనకెందుకున్నట్లు? ఏమో... మాకేం తెలుసు? అన్నది శాస్త్రవేత్తల సమాధానం. మాంఛెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐదేళ్ల క్రితం జరిపిన ఓ ప్రయోగం ప్రకారం.. వేలిముద్రలు పట్టు కోసం కాకుండా రాపిడిని తగ్గించేందుకు పనికొస్తాయిట! వేలిముద్రల మధ్య ఉండే తగ్గు ప్రాంతాలు.. మనం పట్టుకునే వస్తువుకు నేరుగా తగలకుండా ఉంటాయి కాబట్టి రాపిడి తగ్గుతుందని వీరు కత్రిమ వేలిముద్రలతో చేసిన ప్రయోగం ద్వారా తెలిసింది. కొందరేమో స్పర్శ అనుభూతికి ఈ ముద్రలే కీలకమని అంటారు. వేలిముద్రల ద్వారా అందే సమాచారాన్ని నాడీవ్యవస్థ సులువుగా ప్రాసెస్ చేయగలదని వీరు అంటున్నారు. ఊహూ... వస్తువులను గట్టిగా పట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయన్న పాతకాలం అంచనానే కరెక్ట్ అంటారా? ఏమో.. ఐతే కావచ్చు! మీకు తెలుసా...? రంగు, రూపులన్నీ ఒకేలా ఉన్న కవలల్లోనూ వేలిముద్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వేలిముద్రల్లేని వ్యక్తులు ఈ ప్రపంచం మొత్తమ్మీద కేవలం నాలుగు కుటుంబాల్లో మాత్రమే ఉన్నారు. మీ 'చేతివాటం' ఏది? సచిన్ టెండుల్కర్... బరాక్ ఒబామా... బిల్గేట్స్. ఈ ముగ్గురిలో కామన్ ఏమిటో తెలుసా? అందరూ ఎడమచేతి వాటమున్న వాళ్లే! ఆ మాటకొస్తే ఈ భూమ్మీద కనీసం 70 కోట్ల మంది అంటే.. పది శాతం మంది ఇలాంటివారే. జంతువుల లక్షణాల్లో కొన్ని మనకు వచ్చి ఉండవచ్చుగానీ... వాటిల్లా రెండు చేతులను సమంగా వాడటం మాత్రం మనకబ్బలేదు. దాదాపు అన్నిపనులకూ ఒక చేయిని వాడటం అలవాటైపోయింది. అయితే ఏంటి అంటున్నారా? ఎందుకిలా? అన్నదే ప్రశ్న. జన్యువుల్లోని తేడాల వల్ల ఇలా జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఇదే నిజమని కాసేపు అనుకుంటే.. వచ్చే లాభమేమిటి? అన్న ప్రశ్న వస్తుంది. అది కూడా కేవలం పదిశాతం మంది మనుషుల్లోనే ఎందుకుంది? అన్నది మరో ప్రశ్న. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే... కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. చేతివాటానికి కారణమైన జన్యుమార్పు.. ఒక అవశేషం మాత్రమే. కాలక్రమంలో నెమ్మదిగా ఇది మరింత తగ్గిపోతుంది. అంటే.. ఓ వందేళ్ల తరువాత ఎడమ చేతివాటమున్న వాళ్లు మరింత తక్కువవుతారన్నమాట. మీకు తెలుసా...? మేధావుల్లో 20 శాతం మంది ఎడమచేతి వాటం ఉన్నవారు. పసిపిల్లలు బోర్లా పడుకున్నప్పుడు తల ఎడమవైపు తిప్పితే వాళ్లు ఎడమచేతివాటమున్న వారిగా ఎదుగుతారు! ఆగస్టు 13.. ఎడమ చేతివాటం వారి ప్రత్యేకమైన రోజు! -
సకుటుంబ సమేతంగా సందర్శిద్దాం..చూసొద్ధాం
ఏడుకొండల మధ్య ఆనంద నిలయంలో నిత్యం భక్తుల్ని కటాక్షించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత చూడాల్సిన రమణీయ ప్రదేశాలెన్నో.. ఆ దేవదేవుని దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచే కాక దేశవిదేశాల నుంచి సగటున రోజుకి 50వేల మందికి పైగా భక్తులు తిరుపతికి వస్తారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతిలోనే యాత్రికులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే పర్యాటక స్థలాలు, వాటి ప్రత్యేకత మీకోసం... - తిరుపతి తుడా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహనను, ఆసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిందే తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్. ఫిజిక్స్కు, జియోగ్రఫీలకు సంబంధించి అరుదైన పరికరాలు, కళారూపాలు, పిల్లల ఆటస్థలం ఇక్కడ ఉన్నాయి. పార్కులు అలిపిరి టోల్గేట్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే సైన్స్ సెంటర్ ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటలకు వరకు ప్రవేశం ఉంటుంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.5 పెద్దలకు రూ.10. హస్తకళారామం ఆకర్షణీయమైన పార్కులు, ఔరా అనిపించే మైనపు బొమ్మలు, గ్రామీణ వాతావరణాన్ని తలపించే అందమైన పూరి గుడిసెలు, హస్తకళా ఖండాలు, ఫంక్షన్హాళ్లు ఇంకా బోటింగ్ లాంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. తిరుపతి-తిరుచానూరు మార్గంలో ఈ హస్తకళారామం ఉంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.10 పెద్దలకు రూ.20. రామచంద్ర పుష్కరిణి తిరుపతి టౌన్క్లబ్ సెంటర్ నుంచి అలిపిరి మార్గంలో ఉన్న రామచంద్ర పుష్కరిణి ప్రకృతి ప్రేమికులకు చక్కటి సందర్శక ప్రాంతం. రంగురంగుల పూల తోటలు, సాయంత్రం వేళ్లలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇక్కడి ప్రత్యేకత. మున్సిపల్ పార్క్ తిరుమల బైపాస్రోడ్డులో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ పార్క్లో ప్రకృతితో పాటు ఆటలకు కూడా నిలయంగా మారింది. వాటర్ ఫౌంటెయిన్, పిల్లల ఆడుకునేందకు ప్రత్యేక స్థలం, ద్యానంలో ఉండే శివుడి విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటాయి. అంతేకాక స్కేటింగ్ నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షకులు ఇక్కడ ఉన్నారు. ప్రవేశ రుసుం రూ.5. జంతు ప్రదర్శనశాల అలిపిరి నుంచి కేవలం 6కి.మీల దూరంలో ఉన్న శ్రీవేంక టేశ్వర జంతు ప్రదర్శనశాల పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణం, 1200 పైగా జంతుజాలం, అణువణువునా హరితవర్ణ శోభాయమానంగా కనిపించే ప్రకృతి, సేద తీర్చే పెద్ద చెట్లు ఈ జూ ప్రత్యేకత. కుటుంబ సమేతంగా వె ళ్లేందుకు ఇదొక చక్కటి పర్యాటక స్థలం. ప్రవేశ రుసం పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.10. అలివేలు మంగమ్మ ఆలయం శ్రీనివాసుని పట్టపురాణి తిరుచానూరులో కొలువై ఉన్నారు. శ్రీవారిని దర్శించుకునే ముందు అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. అమ్మవారి ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధికెక్కింది. సుందర కపిలతీర్థం శ్రీవారి పాదాల చెంత, సప్తగిరుల శిలాతోరణం వద్ద ఏకైక శైవాలయంగా కపిలతీర్థం విరాజిల్లుతోంది. కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తారు. తీర్థంలో నిత్యం భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. వర్షం కురిసినపుడు ఇక్కడి జలపాతం ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. పక్కనే ఉన్న జంగిల్ బుక్ కూడా అడవి అందాలతో ఆకట్టుకుంటోంది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం శ్రీనివాసుని అన్నగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నడుబొడ్డున విశాల ప్రదేశంలో నిర్మితమయింది. ఈ ఆలయం రైల్వేస్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. స్వామి గోపురం తిరుపతి నగరానికే తలమానికంగా ఉంటుంది. ఇక్కడ ఆలయం ముందున్న అంగళ్లు షాపింగ్కు బాగా ఫేమస్. చంద్రగిరి కోట దక్షిణ భారతదేశ రాజులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు. తిరుపతికి 12 కిమీల దూరంలో ఉన్న చంద్రగిరిలో ఆయన ఏలిన కోట ఉంది. రాజుల కాలం నాటి వస్తువులు, చారిత్రక కట్టడం, రాణి బంగ్లా, కొలను, చైనావాల్ను తలపించేలా కోట గోడ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అరుదైన దేవతా మూర్తుల విగ్రహాలు, వస్తువులు, నమూనాలు ఉన్నాయి. సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ లైటింగ్ షో కోటలో ప్రత్యేకం. ఇందుకు ప్రవేశ రుసుం పిల్లలకు 25, పెద్దలకు రూ.35. ఎస్వీ మ్యూజియం శ్రీగోవిందరాజ స్వామి ఉత్తర మాడ వీధిలో ఎస్వీ మ్యూజియం టీటీడీ పర్యవేక్షణలో నడుస్తోంది. చారిత్రక వస్తువులు, రాజులు వినియోగించిన ఖడ్గాలు, కళా ఖండాలు, పలు నమూనాలు, విగ్రహాలు చూడవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. శ్రీకోదండ రామాలయం శ్రీకోదండరామస్వామి సతీ సోదర సమేతంగా నిలువెత్తు దర్శమిస్తుంటారు. విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. తిరుమలకు నడక దారిన వెళ్లేవారు కోదండరాముణ్ణి దర్శంచుకోవడం పరిపాటి. శ్రీనివాస మంగాపురం ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి- పీలేరు మార్గంలో ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకల్యాణ వెంకన్నకు నిత్యం ఉత్సవాలు జరుగుతుంటాయి. పురాతనమైన ఆలయాల్లో ఇదీ ఒకటి. ఈ పుణ్యక్షేత్రం తిరుపతికి 14 కిమీల దూరంలో ఉంది. -
సైన్స్తోనే సమాజాభివృద్ధి
ముగిసిన సైన్స్ దినోత్సవ సెమినార్ ఎచ్చెర్ల: సైన్సతోనే సమాజాభివృద్ధి సాధ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అన్నారు. వర్సిటీ సెమినార్ హాల్లో డిపార్టమెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అటానమిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల సైన్స్ దినోత్సవ సెమినార్ శుక్రవారంతో ముగిసింది. ఈ సమావేశంలో వీసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సైన్స్పై అవగాహన అవసర మన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య మాట్లాడుతూ సీవీ రామన్లాంటి జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే నేడు దేశం ప్రగతి సాధించిందన్నారు. అటానమిక్ శాస్త్రవేత్తలు డాక్టర్ యు.గంగాధర్రావు, డాక్టర్ ప్రసాదరావులు శాస్త్రవిజ్ఞానం వల్ల కలిగే సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో బీచ్సాండ్ అండ్ ఆఫ్షోర్ ఇన్విస్టిగేషన్స్ ఇన్చార్జి అనిల్కుమార్, వర్సిటీ చీఫ్వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, జియోసైన్స్ విభాగం సమన్వయకర్త డాక్టర్ కోరాడ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు సెమినార్ సందర్భంగా ప్రస్తుతం ‘విద్యుత్ సరఫరా పరిస్థితి-భవిష్యత్ అవసరాలు’ అన్న అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో 68 మంది విద్యార్థులు మాట్లాడారు. సీనియర్స్ విభాగంలో మొదటి నాలుగు స్థానాల్లో సీహెచ్ చిన్నికృష్ణంనాయుడు(గీతాంజలి పాఠశాల, శ్రీకాకుళం), సీహెచ్ జ్యోత్స్న (సెయింట్ జోషప్ హైస్కూల్, శ్రీకాకుళం), పి.భావన (గీతాంజలి), మౌనిక(గాయత్రి శ్రీకాకుళం), జూనియర్స్ విభాగంలో బి.సాయియశ్వన్ (గాయత్రి), ఆర్.సిద్ధార్థ(సెయింట్ లారెంట్, నరసన్నపేట), ఎస్.శ్రీవర్షిని(గీతాంజలి), బి.పద్మప్రియ (సెయింట్ లారెంట్)లు విజేతలుగా నిలిచారు. వీరికి రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య చేతులమీదుగా బహుమతులు అందజేశారు. పోటీల న్యాయనిర్ణేతలుగా ఫ్యాకల్టీ సభ్యులు ప్రకాశం, రవికుమార్ ,శ్రీరాంమూర్తిలు వ్యవహరించారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు సెమినార్ హాల్ ఆవరణలో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నా యి. విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించాయి. భూమి లోపల పొరలు, ఇసుకలో ఖనిజాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, అణుపార్కుల పనితీరు, భవిష్యత్తులో అణువిద్యుత్ ప్రాధాన్యం, సైన్స్ విస్తరణ వంటి అంశాలను ప్రయోగాత్మకంగా విద్యార్థులు వివరించారు. -
నమస్కారం ఎందుకు చేయాలి?
మన సంస్కృతిలో ఎవరిని కలిసినా మొదట నమస్కారం చేస్తాం. అసలు నమస్కారం ఎందుకు చేయాలి? ఇది కేవలం సాంస్కృతిక అంశమేనా లేక మరేదైనా కారణం ఉందా? - ధూర్జటి భాగ్యలక్ష్మి, హైదరాబాద్ నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశం మాత్రమే కాదు. దాని వెనక ఓ విజ్ఞానం ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతిసారీ ఓ చిన్న శక్తి విస్ఫోటనం సంభవిస్తుంది. మీరొక వ్యక్తిని చూసినప్పుడు, అది మీరు పనిచేసే చోటైనా, వీధిలో అయినా, ఇంట్లో అయినా లేదా మరెక్కైడనా సరే, మానవ బుద్ధి నైజం ఎలాంటిదంటే, అది చూసిన క్షణమే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికొచ్చేస్తుంది. ఆ మనిషిలో ఇది బాగుంది, ఈ మనిషిలో ఇది బాగోలేదు; అతను మంచివాడు, ఇతను మంచివాడు కాదు, అతను అందంగా ఉన్నాడు, అతను వికారంగా ఉన్నాడు ఇలా ఎన్నో నిర్ణయాలకు వచ్చేస్తుంది. వీటన్నిటినీ మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలు, తీర్మానాలు జరిగిపోతాయి. మీ తీర్మానాలు పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ జీవితంలోని మీ గతానుభవాలనుండీ వస్తున్నాయి. దేన్నయినా, ఎవరినైనా వాళ్ళు ప్రస్తుతమున్నట్టుగా మీరు గ్రహించడానికి ఇవి అనుమతించవు. ప్రస్తుతమున్నట్టుగా విషయాలని, మనుషులని గ్రహించడం చాలా ముఖ్యం. మీరు ఏ రంగంలో అయినా సమర్థవంతంగా పని చేయాలంటే, మీ ముందుకు ఎవైరనా వచ్చినప్పుడు, వారిని ప్రస్తుతం వారు ఉన్నట్టుగా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. వారు నిన్న ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. వారు ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి, మొదట మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఒక్కసారి మీరలా చేస్తే, మీ ఇష్టాయిష్టాలు బలపడకుండా, మెత్తబడతాయి. ఎందుకంటే వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యమిదే. సృష్టికర్త హస్తం సృష్టికర్త హస్త ప్రమేయం లేనిదేదీ సృష్టిలో లేదు. సృష్టి మూలం, ప్రతి కణంలోనూ ప్రతి అణువులోనూ పనిచేస్తోంది. అందుకే భారత సంస్కృతిలో, మీరు పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, మీ సంస్కృతి ప్రకారం శిరస్సు వంచి అభివాదం చేయమని చెబుతారు. మీరొక స్త్రీని కాని, పురుషుడిని కాని, పిల్లాడిని కాని, ఆవుని కాని, చెట్ట్టుని కాని చూశారనుకోండి, మిమల్ని శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది ఈ సంస్కృతి. మీలో కూడా సృష్టి మూలం ఉందన్న విషయాన్ని ఇది నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తిస్తే, మీరు నమస్కారం చేసిన ప్రతిసారి మీరు మీ సహజ ప్రవృత్తి ైవైపు అడుగులు వేస్త్తున్నట్టే. దీనికి మరో కోణం కూడా ఉంది. మీ అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి. దీన్ని ఈనాటి వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది. వాస్తవానికి మీ నాలుక కన్నా, కంఠం కన్నా మీ చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగ ముద్రలకు సంబంధించి పూర్తి శాస్త్రమే ఉంది. మీ చేతిని కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మీరు మీ పూర్తివ్యవస్థనే భిన్నంగా పనిచేసేటట్లు చేయవచ్చు. మీరు మీ చేతులని జోడించిన క్షణమే, మీ ద్వంద్వభావనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ కోరికలు, మీరు ఈసడించుకునే విషయాలు, ఇవన్నీ సమమై, తొలగిపోతాయి. ఇలా మీరెవరో వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మీలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి. నమస్కారం... మిమ్మల్ని మీరే సమర్పించుకునే సంస్కారం! నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు... దాని వెనకాల ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరగతోంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు కేవలం ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. ఇది ప్రతిజీవికీ వర్తిస్తుంది. ఏ జీైవైనా దాని చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, ఎదగగలుగుతుంది. ప్రెజెంటేషన్: డి.వి.ఆర్. భాస్కర్ -
ఇస్తినమ్మ పుస్తకం తెచ్చుకుంటినమ్మ పుస్తకం
మంచి పుస్తకం దొరకగానే పీఠిక నుంచి సమాప్తం వరకూ చదివేస్తాం. ఆపై బుక్ షెల్ఫ్లో పదిలంగా దాచేస్తాం. అపురూప సాహిత్యాన్ని చెదలు చదివేస్తున్నా పట్టించుకోం. చదివిందే కదా అని లైట్గా తీసుకునే వారు కొందరు. ఇంట్లో చెత్త తయారవుతోందని అమ్మేసి వదిలించుకునే వారు ఇంకొందరు. అయితే.. తమకు అందిన జ్ఞానం పరులకూ అందాలని భావించేవారు ఎక్కడా తారసపడరు. ఫలానా పుస్తకం బాగుందని చెప్పేవారే తప్ప.. దాన్ని ఓసారి చదివిస్తానంటే మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. ఇలాంటి వారిలో చైతన్యం కల్పిస్తూ హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ‘స్వాప్ యువర్ బుక్’ పేరుతో వినూత్న ప్రయోగానికి తెరతీసింది. ..:: దార్ల వెంకటేశ్వర రావు టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నగరవాసులకు పుస్తకాలు చదివే ఓపిక ఎక్కడుంది? కాసింత టైమ్ దొరికితే సెల్ఫోన్లో కబుర్లు.. సోషల్ మీడియాలో చాటింగ్లతో సరిపెడుతున్నారు. వీటన్నింటికన్నా పుస్తకాలే ప్రియ నేస్తాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. వీరి సంగతి అటుంచితే.. ఇక పుస్తకాలు చదవడం హాబీగా ఉన్న వారికి మరో చిక్కుంది. అనుకున్న పుస్తకం దొరక్క నెలల తరబడి వెతుకుతుంటారు. అదే పుస్తకాన్ని పదిసార్లు చదివేసి అటకెక్కించే వారు కొందరుంటారు. వీరిద్దరినీ కలిపితే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుందని భావించారు హైదరాబాద్ లిటరరీ ట్రస్టు నిర్వాహకులు. స్వాప్ యువర్ బుక్ (పుస్తకాల మార్పిడి) పేరుతో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. విజ్ఞాన మార్పిడి.. ఈ తరం పిల్లలకు పుస్తకాలను చదివే అలవాటు చేయడానికి, రీడింగ్ హాబీ ఉన్నవారికి కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయడానికి ఈ స్వాప్ యువర్ బుక్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. చదివిన పుస్తకాన్ని ఇచ్చేసి.. వారికి నచ్చిన పుస్తకాన్ని తీసుకెళ్లొచ్చు. స్వాప్ యువర్ బుక్ కార్యక్రమానికి పుస్తక ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాము చదివిన పుస్తకాలు మరింత మంది చదవాలనే ఉద్దేశంతో ఎందరో పాత పుస్తకాలను ఇక్కడకు తీసుకొచ్చారు. తాము చదవాలనుకుంటున్న పుస్తకాలను వెతికి మరీ తీసుకెళ్లారు. కొత్తగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తర చూ నిర్వహిస్తాం అంటోంది హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్. పుస్తకాల మార్పిడితో విజ్ఞానం, సాహిత్యం పంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు అక్కడికి వచ్చిన పుస్తక ప్రియులు. మంచి ఆలోచన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వాలంటీర్గా పని చేసేందుకు వచ్చా. కొత్త ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం చాలా బాగుంది. కొత్త పుస్తకాలు కొనాలంటే చాలా ధరలున్నాయి. మన దగ్గరున్న పుస్తకం అమ్మేస్తే అందులో పావలా వంతు కూడా రాదు. అందుకే స్వాప్ యువర్ బుక్స్ ద్వారా ఒకరికొకరు పుస్తకాలు మార్పిడి చేసుకోవడం స్వాగతించదగ్గ విషయం. - కృష్ణ, వాలంటీర్ -
సైన్స్ ఎందుకు రాశాం?
ఇన్ బాక్స్: శాస్త్ర విజ్ఞానం అందరికీ చెందాలని ప్రయత్నించిన తెలుగు రచయి తలు ఎందరో ఉన్నారు. జనరంజక విజ్ఞాన వ్యాసాలు మాత్రమే కాక, సైన్స్ ఫిక్షన్ విభాగంలో విజ్ఞానానికి కల్పనా చాతురి జోడించి కథలు, నవలలు, నాటకాలు కూడా రాసిన సృజనాత్మక సాహితీ వేత్తలు కూడా ఉన్నారు. సైన్స్ రచయితలు ఏ నేపథ్యంలో, ఏ ఉద్దేశాలతో ఈ రం గంలో రచనను ప్రారంభించారో తెలుసుకోవడం ఆసక్తికరంగానే కాదు, ప్రేరణాత్మకంగా కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్య కథనాలను సంక లనం చేయాలని తలంచాం. ఇప్పటికే కొంతమంది తమ వ్యాసాలు పంపారు. మాకు తెలిసిన, మావద్ద సమాచారం లేని రచయితలు కూడా ఈ పత్రికా ప్రకటననే ఆహ్వానంగా పరిగణించి వ్యాసం పంపా లని మనవి. సైన్స్ రచనలనే పంపగలరు. రేపటి తెలుగు సైన్స్ రచనా దీపాన్ని జేగీయమానం చేయడానికి, రేపటి రచయితల కోసం రాస్తు న్నారని గమనించగలరు. జనవిజ్ఞాన వేదిక ప్రచురించే ఈ పుస్తకం ప్రతిని ప్రచురణ తర్వాత పంపగలం. మీ రచనలు పంపాల్సిన చిరునామా: జి.మాల్యాద్రి, ప్లాట్ నంబర్- 162, విజయలక్ష్మినగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ -524004.మొబైల్: 9440503061, ఈమెయిల్: malyadrig1955@gmail.com రచనలు చేరడానికి చివరి తేదీ: 2015, జనవరి 26 డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి ప్రయోక్త -
వేదాల్లో సైన్స్కు అందని రహస్యాలు
మానవాళికి వేదాలు ఎంతో అవసరం డాక్టర్ చిర్రావూరిశ్రీరామశర్మ ఘనంగా వేద పండిత సభ 80 మంది ఘనాపాఠీలకు సత్కారం గోపాలపట్నం: వేదాల్లో సైన్సుకు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ప్రముఖ వేద పండితులు డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ తెలిపారు. ప్రహ్లాదపురంలో శనివారం నిర్వహించిన వడలి ఆంజనేయశర్మ వేద థార్మిక ట్రస్ట్ సప్తమ వార్షిక వేద విద్వాంసుల సభలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 80 మంది ఘనాపాఠీలను ఘనంగా సత్కరించారు. సభలో శ్రీరామశర్మ మాట్లాడుతూ మానవాళికి, శాస్త్రసాంకేతికాభివృద్ధికి వేదాలు అవసరమన్న వాస్తవాన్ని శాస్త్రవేత్తలే చెబుతున్నారని, ఇది ఎవరూ కాదనలేని సత్యమన్నారు. ఆయురారోగ్యాలతో సమాజం బాగుండాలంటే వేదాన్ని కచ్చితంగా పోషించాల్సిందేనని స్పష్టం చేశారు. వివాహాలు, ఆలయాల్లో శంకుస్థాపనలకు మాత్రమే వేదాలు పరిమితం కాకూడదని, యావత్ జగత్తుకు ఉపయోగపడాలన్నారు. డాక్టర్ విశ్వనాథ గోపాలకృష్ణ ప్రసంగిస్తూ వేదాలు సమస్త లోకానికీ ప్రధానమని, దీన్ని తెలుసుకుంటే జీవితాన్ని అధిగమించవచ్చని చెప్పారు. ఆది శంకరాచార్య వేదాల వల్లే భగవంతుని శక్తి పొందారని తెలిపారు. తన తర్క వ్యాకరణాన్ని ఘనాపాఠీలకు వివరించారు. ఘనాపాఠీ దువ్వూరి సర్వేశ్వర సోమయాజులు వేదస్వస్తి, ఘనస్వస్తి, మహదాశీర్వచనం చేశారు. సభలో రిటైర్డు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిట్ల రామారావును సత్కరించారు. వేదశాస్త్ర థార్మిక ట్రస్ట్ వ్యస్థాపకులు వడలి ఆంజేయశర్మను పండితులు అభినందించా రు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి వి.సూర్యనారాయణ, కోశాధికారి ఎస్.శ్రీధర్, గాయత్రీ గ్రూప్ సంస్థల చైర్మన్ కె.వి.బాలసుబ్రహ్మణ్యం, సిహెచ్.లక్ష్మీనారాయ ణ, కె.వి.రమణశర్మ, ఎ.ఎ.ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్కు సోపానం!
సివిల్స్ మెయిన్స్లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు. జీఎస్ మూడో పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. వీటి నుంచి2013 జీఎస్-3 ప్రశ్నపత్రంలో 25 ప్రశ్నలకు 9 ప్రశ్నలు వచ్చాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు.. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ప్రిపరేషన్ను పూర్తిచేసి ఉంటారు. గత మెయిన్స్ జనరల్ స్టడీస్-3 పేపర్లో కొన్ని 200 పదాల సమాధాన ప్రశ్నలు, మరికొన్ని 100 పదాల సమాధాన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే విధానంలో ప్రశ్నలు ఉండొచ్చు లేదంటే స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20, 50, 75, 150, 250 పదాల్లో సమాధానం రాసేలా సన్నద్ధం కావాలి. ఒకే ప్రశ్నలో వివిధ విభాగాలుంటే వాటి సరళిని బట్టి పద పరిమితిని నిర్దేశించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్, టెక్నాలజీ విభాగంలో ముఖ్యంగా అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రయోగాలు నిర్వహించింది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మంగళ్యాన్ వంటి అద్భుత యాత్రలు చేపట్టింది. వీటిపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. వీటికి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశాలపైనా ప్రశ్నలు రావొచ్చు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నో విదేశీ ఉపగ్రహాలు, వైవిధ్యభరిత ప్రయోగాలు నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)పై అభ్యర్థులు దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్ఎల్వీ నిర్మాణం వెనుక ఉద్దేశం, అది చేపట్టిన వైవిధ్యభరిత ప్రయోగాలు, విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ద్వారా భారత అంతరిక్ష సేవల విస్తరణ, వరుస విజయవంత ప్రయోగాల జైత్రయాత్ర, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలు మంగళ్యాన్ ప్రయోగంలో ప్రత్యేకతలు- భారత్ సాధించిన ప్రగతి. టెర్రా ఫార్మింగ్ అంటే ఏమిటి? అంగారక గ్రహ యాత్రలు భవిష్యత్తులో టెర్రా ఫార్మింగ్కు ఎలా ఉపయోగపడతాయి? వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్- సాధించిన ప్రగతి ఏమిటి? ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్), జీఎస్ఎల్వీ- మార్క్ 3, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాధాన్యత, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భారత్ డీప్ స్పేస్ నెట్వర్క్, క్యూరియాసిటీ రోవర్, జీఎస్ఎల్వీ బలహీనతలు. టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, అంతరిక్ష టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలు. ఐటీ, కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగంలో డిజిటల్ ఇండియా, నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు, మెడికల్ ఇన్ఫర్మేటిక్స్, గ్రామీణాభివృద్ధిలో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నెట్ న్యూట్రాలటీ- ప్రయోజనాలు, బిగ్ డేటా, ఓపెన్ గవర్నమెంట్ డేటా తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నానో టెక్నాలజీ రంగంలో అనేక అనువర్తనాలున్నాయి. వీటిని తెలుసుకోవాలి. గతేడాది నిర్మాణరంగానికి సంబంధించి కాంపొజైట్స్పై ప్రశ్న అడిగారు. పర్యావరణ కాలుష్యం నిర్మూలనలో, వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రయోజనాలపై దృష్టిసారించాలి. అదే విధంగా నానో టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో అనువర్తనాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రోబోటిక్స్ రంగంలో కేవలం రోబోటిక్స్ సూత్రాలు, వాటి రకాలు, ఉపయోగాలు మాత్రమే కాకుండా రోబోటిక్ కాళ్లు, చేతులు తయారీ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి. రోబోటిక్స్ను బయోనిక్స్కు అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి. బయోనిక్స్ అంటే ఏమిటి? దాని అనువర్తనాలు ఎలా ఉంటాయి? వైద్య రంగంలో వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలను చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ రంగం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జన్యుమార్పిడి పంటల సాగు, క్షేత్ర పరీక్షలపై దేశంలో గందరగోళ పరిస్థితులపై ప్రశ్నలు అడగొచ్చు. జన్యు మార్పిడి పంటల సాగుపై వ్యతిరేకత ఎందుకు? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? మరీ ముఖ్యంగా బీటీ ట్రాన్స్జెనిక్స్పై అభ్యంతరాలు ఏమిటి? జీఎం లేబ్లింగ్ అంటే ఏమిటి? అది భారత్లో ఎలా అమలవుతోంది? తదితర అంశాలపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్పెర్ట్ కమిటీ బీటీ పంటల క్షేత్ర పరీక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. మూలకణాల చికిత్సను నియంత్రించే ఐసీఎంఆర్-డీబీటీ మార్గదర్శకాలు, రీప్రోగ్రామింగ్, కార్డ్ బ్యాంకింగ్, మూలకణాల అనువర్తనాలను అధ్యయనం చేయాలి. ఆర్ఎన్ఏ, ఇంటర్ఫెరాన్స్, జన్యు థెరఫీ, మానవ జీన్ పేటెంటింగ్, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, బయోరెమిడియేషన్, ఇతర ఇంధనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. పర్యావరణం మెయిన్స్లో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ నష్టం. తాజాగా దేశంలో స్వచ్ఛ భారత్పై బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రశ్న రావొచ్చు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో లోపాలు, మీ సూచనలు? అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో సమస్యలు, లాభాలను తెలుసుకోవాలి. పట్టణీకరణలో ఘన వ్యర్థ నిర్వహణ పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. బయో మెడికల్ వ్యర్థాలు, రీసైక్లింగ్ పద్ధతులు, భారత్లో ఘన వ్యర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వంటి వాటిని చదవాలి. వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా సముద్ర ఆమ్లీకరణ వల్ల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లే నష్టాలను గురించి తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ), అందులో భాగంగా అమలవుతున్న ఎనిమిది జాతీయ మిషన్లు, లక్ష్యాలు, ప్రగతి తదితరాల గురించి తెలుసుకోవాలి. కాంతి కాలుష్యం, భారలోహ కాలుష్యం, గంగానది ప్రక్షాళన, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా ఉద్గారాలను తగ్గించే కార్యక్రమం (ఆర్ఈడీడీ)పై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ అంశంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, సంరక్షణ చర్యలపై దృష్టిసారించాలి. పులి, ఖడ్గమృగం, ఏనుగు, గంగానది డాల్ఫిన్ వంటి వాటి పరిరక్షణ సమస్యల్ని తెలుసుకోవాలి. పశ్చిమ కనుమల పరిరక్షణకు గాడ్గిల్, కస్తూరిరంగన్ కమిటీల సిఫార్సులు, వాటి మధ్య భేదాలను తెలుసుకోవడం మంచిది. భారత్లో అభివృద్ధి చర్యల ద్వారా జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటోంది? సుస్థిరాభివృద్ధి విధానాలను ఎలా అమలు చేయాలి? అటవీ హక్కుల అమల్లో సమస్యలపై దృష్టి సారించాలి. అదనంగా నగొయ ప్రొటోకాల్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మేధో సంపత్తి మేధో సంపత్తి హక్కుల అంశంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) స్పెషల్ 301 కేటగిరీ, భారత్లో ఐపీఆర్ విధానం ఎలా ఉండాలి? అమెరికా వంటి దేశాలు భారత మేధోసంపత్తి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తదితర అంశాలపై దృష్టిసారించాలి. అమెరికా ఇటీవల భారత్ విషయంలో అమలు చేయాలని నిర్ణయించిన cycle review విధానం గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు మేధోసంపత్తి రకాలు, సంబంధిత చట్టాలు, జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ద్వారా ఏ విధంగా సంప్రదాయ ఉత్పత్తులకు సంరక్షణ కల్పించవచ్చు అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. -
విహారం.. ఓ విజ్ఞానం...
నాటి రోజుల్లో యువరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయాలంటే ... అక్కడున్న వనరులు, ప్రజల జీవనశైలి, చుట్టూ ఉన్న ప్రాంతాల వివరాలతో పాటు పొరుగు దేశాల గురించిన సమస్త సమాచారం తెలుసుకోవలసిందే! దీనిని ప్రధాన అర్హతగా భావించేవారు. అందుకే రాజుల కాలంలో వారి పుత్రులను చదువు పూర్తయ్యాక ప్రపంచ పర్యటన చేసి రావల్సిందేనని ఆదేశించేవారు. నాడే కాదు నేడూ ఆ అర్హత పిల్లలకు అందించాలంటే వారిలో పర్యటనల పట్ల ఆసక్తి పెంచాలి. ఎందుకంటే...ప్రకృతిని మించిన గురువు లేరు... బడిలో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా బుర్రకెక్కని పాఠాలను ప్రకృతి సులువుగా నేర్పుతుంది. కాలు కందని బాల్యానికి కరకురాళ్ల గట్టితనాన్ని పరిచయం చేస్తుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగమని వృక్షరాజాలు, ఎటునుంచి సమస్య వచ్చినా పోరాడే నేర్పును మృగరాజులు, గంభీరంగా సాగమని నదులు, తుళ్లిపడమనే సెలయేళ్లను.. ఇలా ఎన్నింటినో ప్రకృతి పరిచయం చేస్తుంది. అనుబంధానికి రహదారి... వృత్తి, ఉద్యోగాలలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రులకు, చదువుల చట్రంలో బిగుసుకుపోయిన పిల్లలకు కొత్త ఊపిరిని అందించేవి పర్యటనలే! జీవన నైపుణ్యాలు... కొత్త ప్రదేశాలలో కొత్తవారితో ఎలా మెలగాలో పిల్లలకు వాస్తవంగా తెలియజేయడంతో పాటు అమితమైన సహనాన్ని బోధిస్తుంది. తండ్రి చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూసే చిన్నారి కళ్లు పరిశోధనకు తొలిమెట్టు అవుతాయి. అమ్మ చీర కొంగు పట్టుకుని నడిచే చిన్నారి అడుగులు జ్ఞానానికి మార్గాలు చూపుతాయి. అవే మన ముందు తరాలకు మనమందించే అతి గొప్ప సంపద. - ఎన్.ఆర్ -
రంగుల రహస్యం వెల్లడించిన రామన్
ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించి, నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ (నవంబర్ 7, 1888 -1970 నవంబర్ 21). తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. అనంతరం మద్రాసులో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన 1907లో ఫైనాన్స్ డిపార్టు మెంట్ ఉద్యోగిగా కలకత్తా వెళ్లాడు. అక్కడ డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ రామన్ను ఆకర్షించింది. ఉద్యోగం చేస్తూనే ఆ పరిశోధనాశాలలో పరిశోధనలు ప్రారంభించారు. అనంతరం 1817లో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర పీఠాధిపతిగా నియ మితులయ్యారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు. సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954లో ‘భార తరత్న’ బిరుదు ఇచ్చింది. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో సత్కరించింది. విదేశాలలో ఎన్నో అవకా శాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి విజయాలు సాధించారు. (నవంబర్ 7 రామన్ జయంతి) ఎం.శోభన్ నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షులు -
అసాధ్యాలను సుసాధ్యం చేశారు!
వండర్స్ ఆఫ్ సైన్స్ కాంతిని ముడివేయడం వీలవుతుందా? కాంతి వేగాన్ని మించి ప్రయాణించడం కుదురుతుందా? మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారం జరిగే పనేనా? నిన్నటి వరకూ ఇవన్నీ అసాధ్యాలు. కానీ నేడు సాధ్యం అయ్యాయి! భవిష్యత్తులో ఇవి సుసాధ్యం అయితే గనక.. సైన్స్లో మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి! విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడు ఏ చిక్కుముడి వీడుతుందో ఎవరికీ తెలియదు. అసాధ్యం అనుకున్న పనులు అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఊహకైనా అందని అద్భుతాలు కళ్ల ముందు చటుక్కున సాక్షాత్కరిస్తాయి. సైన్స్ చేసే మ్యాజిక్తో సాంకేతిక ప్రపంచం ఒక్కసారిగా కొత్త మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే అసలు ఎప్పటికీ సాధ్యం కావని అనుకున్న అద్భుతాలు ఇటీవల జరిగిపోయాయి! వాటిలో కొన్ని అద్భుతాలు.. వాటివల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... కాంతి పుంజాలను ముడివేశారు! మనకు తెలిసినంత వరకూ కాంతి కిరణాలు ఎల్లప్పుడూ నేరుగా సరళరేఖల్లోనే ప్రయాణిస్తాయి. వాటిని ముడివేయడం కాదు కదా కనీసం వంకరటింకరగా ప్రయాణించేలా కూడా చేయలేం. కానీ, బ్రిటన్లోని గ్లాస్గో, బ్రిస్టల్, సౌతాంప్టన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కాంతిని ముడి వేయగలిగారు! ఇంతవరకూ అసాధ్యం అయిన ఒక గణితశాస్త్ర ప్రతిపాదనగానే ఉన్న ఈ భావనను వారు నిజం చేశారు. ప్రత్యేకమైన 3డీ హోలోగ్రామ్ చిత్రాలను ఉపయోగించి వారు ఈ అద్భుతాన్ని సాధించారు. (ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో వాడిన టెక్నాలజీ ఇదే) ఇదే 3డీ హోలోగ్రామ్ టెక్నాలజీని కొద్దిగా మార్చిన బ్రిటన్ పరిశోధకులు కాంతి ప్రవాహాన్ని సైతం ప్రభావితం చేయగలిగారు. కాంతి అనేది నదిలాంటిదని, అది సుడులు కూడా తిరగగలదని వీరు అంటున్నారు. కాంతి పుంజపు హోలోగ్రామ్ రూపం తెలిస్తే.. మీరూ దానిని వంచేయగలరని చెబుతున్నారు. దీనివల్ల ఉపయోగాలేంటంటే.. భవిష్యత్తులో కాంతితో ముడిపడిన అన్ని సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయట. కాంతికన్నా 300 రెట్ల వేగం! ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతీకరించిన ప్రకారం విశ్వంలో కాంతిని మించిన వేగంతో ఏదీ ప్రయాణించలేదు. కానీ, అమెరికా, ప్రిన్స్టన్లోని ఎన్ఈసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ నియమాన్ని ఉల్లంఘించి చూపారు. కాంతికిరణాలు సెకనుకు 1.86 లక్షల మైళ్లు ప్రయాణిస్తాయి. కానీ, ప్రత్యేక గ్యాస్ చాంబర్లో వీరు లేజర్ కిరణాలను ఏకంగా కాంతి కంటే 300 రెట్ల వేగంతో ప్రయాణించేలా చేయగలిగారు! అయితే, సైన్స్పరంగా కాంతివేగమే అత్యధికమని, కానీ కొన్ని పరిస్థితులు కల్పిస్తే ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చని వీరు వెల్లడించారు. ఉపయోగాలేంటంటే.. ఫైబర్ ఆప్టిక్ పద్ధతిలో కాంతిద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు ఇదివరకే వాడకంలోకి వచ్చేశాయి. అదే కాంతి కన్నా వేగం పెరగడం అంటే.. కాంతి ద్వారా సమాచార ప్రసారాన్ని కూడా వేగవంతం చేయొచ్చన్నమాట. దీనితో పాటు కాంతితో సంబంధం ఉన్న అనేక పనులను ఇంకా వేగంగా చేసేందుకు భవిష్యత్తులో వీలవుతుంది. మెదడు నుంచి మెదడుకు సందేశం! ఎదుటివారి మెదడులోని ఆలోచనలను చదవడం, ఒకరు ఆలోచిస్తే.. ఎక్కడో ఉన్న ఇంకొకరు ఆ ఆలోచనలను గ్రహించడం సాధ్యం అవుతుందా? కాదు. కానీ ప్రస్తుతానికి ఎలుకల్లో ఇది జరిగింది. బ్రెజిల్ శాస్త్రవేత్తల సాయంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్న రెండు ఎలుకల మధ్య టెలీపతీ(దూరసంవాదం) రూపంలో వీరు సమాచార ప్రసారం చేయగలిగారు. రెండు ఎలుకల మెదడుకు ఇంప్లాంట్లను అమర్చిన వీరు రెండింటి మధ్య ఇంటర్నెట్ ద్వారా మెదడు సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో ఒక బోనులో మీటను నొక్కేలా శిక్షణ పొందిన ఎలుక ఆ మీటను నొక్కగానే, అవతల బోనులో ఉన్న ఎలుక ఎలాంటి శిక్షణ లేకుండానే నేరుగా ఆ మీటను నొక్కేసింది. మనిషి మెదడు సంకేతాలను కూడా సమర్థంగా అనువదిస్తే మనుషుల్లో కూడా టెలిపతీ అసాధ్యమేమీ కాదని వీరు అంటున్నారు. ఒకే సమయంలో రెండు పనులు పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే కాకుండా 12 ఉప పరమాణు కణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఉప పరమాణు కణాలను అత్యంత సూక్ష్మంగా క్వాంటమ్ స్థాయిలో ప్రభావితం చెందిస్తే పదార్థాలు చిత్రవిచిత్రాలు చేస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బారా పరిశోధకులు ఇదే నిరూపించారు. ఓ చిన్న లోహపు ముక్కను ఒక డిగ్రీలో కోట్ల వంతు చల్లబర్చి, దానికి క్వాంటమ్ సర్క్యూట్ను తాకించి తిరిగి తీసివేయడం ద్వారా ఒకేసారి ఆ లోహపుముక్క సగం కదిలి, సగం కదలకుండా ఉండిపోయేలా చేశారు. వీరి ఆవిష్కరణ క్వాంటమ్ మెకానిక్స్లో విప్లవాత్మక మార్పులకు, మానవాళి వింత కోరికలను నెరవేర్చేందుకు ఉపయోగపడుతుందని ‘సైన్స్’ మేగజైన్ కితాబునిచ్చింది. వ్యతిరేక పదార్థం తయారీ! విశ్వంలో కంటికి కనిపించే పదార్థంతో పాటు కనిపించని వ్యతిరేక పదార్థం(యాంటీ మ్యాటర్) కూడా ఉందని అంచనా. అయితే విశ్వంలోని యాంటీ మ్యాటర్ సంగతి పెద్దగా తేలకపోయినా, ప్రయోగశాలలో మాత్రం శాస్త్రవే త్తలు వ్యతిరేక పదార్థాన్ని సృష్టించి, అది నిలకడగా ఉండేలా చేయగలిగారు. వ్యతిరేక పదార్థాన్ని దశాబ్దం క్రితమే తయారు చేసినా, దానిని బలమైన అయస్కాంత క్షేత్రం లోపల నిల్వ చేయడంలో సెర్న్ శాస్త్రవేత్తల బృందం విజయం సాధించింది. ప్రస్తుతం అయస్కాంత క్షేత్రం వల్ల ఇందులోని యాంటీ మ్యాటర్పై పరిశోధనలకు అడ్డంకి ఏర్పడుతోంది. ఈ అడ్డంకి తొలగితే గనక.. భవిష్యత్తులో మ్యాటర్/యాంటీ మ్యాటర్ రియాక్టర్లను తయారు చేయవచ్చని, సహజ ఇంధన వనరులు తరిగిపోయినా ఈ రియాక్టర్లతో ప్రపంచానికంతటికీ ఇంధన అవసరాలు తీర్చవచ్చని అంటున్నారు. హన్మిరెడ్డి యెద్దుల -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి. -
సైన్స్తోనే సామాజిక అభివృద్ధి
గెస్ట్ కాలమ్ దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలను బాగా విస్తృతం చేయాలి. వాస్తవానికి సైన్స్ ఎడ్యుకేషన్లో దేశానికి దశాబ్దాల ఘన చరిత్ర ఉన్నప్పటికీ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థిల్లో సైన్స్ పట్ల మక్కువ తగ్గుతోంది. అయితే సైన్స్తోనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందని గుర్తించాలి అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - మొహాలీ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణసామి సత్యమూర్తి. కెమిస్ట్రీ విభాగంలో అన్నామలై యూనివర్సిటీలో బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి తర్వాత ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, జె.సి.పొలానీస్ లేబొరేటరీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకున్న ప్రొఫెసర్ సత్యమూర్తి.. ప్రపంచంలో ప్రముఖ కెమిస్ట్రీ ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1978 నుంచి 2007 వరకు ఐఐటీ కాన్పూర్లో అధ్యాపక వృత్తిలో విధులు నిర్వర్తించి.. 2007 నుంచి ఐఐఎస్ఈఆర్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సత్యమూర్తితో ఇంటర్వ్యూ.. సైన్స్ దశాబ్దాల చరిత్ర మన దేశంలో ఎందరో శాస్త్రవేత్తలు దశాబ్దాల క్రితమే సైన్స్లో పలు ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగంలో సర్ సి.వి. రామన్, ఎస్.ఎన్.బోస్, ఎం.ఎన్.సాహా వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణల ఫలితాలను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న దేశం.. ఆధునిక యుగంలో మాత్రం సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్లో ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉంది. దీన్ని గుర్తించి పోటీ ప్రపంచంలో ఇతర దేశాలకు ధీటుగా ఆవిష్కరణలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకోసం విస్తృతంగా లభిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. సైన్స్తోనే సామాజిక అభివృద్ధి జాతి పురోగమన దిశలో పయనించాలంటే సైన్స్ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేయాలని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారు. ఫలితంగా ఏర్పాటైనవే సీఎస్ఐఆర్ లేబొరేటరీలు. అదేవిధంగా అటామిక్ ఎనర్జీ విభాగంలో హోమీ జే బాబా, స్పేస్ టెక్నాలజీలో విక్రమ్ సారాబాయ్ వంటి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఇటు అకడమిక్గా, అటు పరిశోధనల పరంగా సైన్స్ విభాగాన్ని ఎంతో వృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశంతోనే ఇంజనీరింగ్లో ఐఐటీల మాదిరిగా సైన్స్ విభాగంలో ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ (ఐఐఎస్ఈఆర్)లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైన్స్ పరిశోధనల దిశగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించేలా పలు కోర్సులను ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇండస్ట్రీ- ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ విధానంలో సాగే బోధన ద్వారా విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లే కాకుండా అన్ని యూనివర్సిటీల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంచే చర్యలు చేపట్టాలి. అప్పుడే విస్తృత స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. ఐఐఎస్ఈఆర్ మొహాలీలో మొత్తం ఐదు ఐఐఎస్ఈఆర్ క్యాంపస్లలో కరిక్యులం, బోధన విధి విధానాలు ఒకే విధంగా ఉంటాయి. మొహాలీలో ప్రతి విభాగానికీ ప్రత్యేక పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇటీవలే.. కొత్త క్యాంపస్లో న్యూక్లియర్ మాగ్నటిక్ రిసోనెన్స్ ఆర్ అండ్ డీ సెంటర్ను ప్రారంభించాం. ఈ సెంటర్ ఉద్దేశం.. స్ట్రక్చరల్ బయాలజీ మొదలు క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు అన్ని విభాగాల్లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించడం. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ముందు కెళుతున్నాం. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు విద్యార్థిల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, దానికి మార్గంగా ఐఐటీలను భావిస్తున్న రోజులివి. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ సైన్స్ అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తించడం లేదు. సైన్స్లోనూ అవకా శాలు పుష్కలం. రీసెర్చ్, పీజీ ఔత్సాహికులకు ఇప్పుడు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ వంటివి లభిస్తు న్నాయి. మంచి లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి సైన్స్పై విద్యార్థుల అనాసక్తికి ప్రస్తుత విద్యా విధానం కూడా కొంత కారణమని చెప్పొచ్చు. వాస్తవానికి ఎంతో మంది విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే సైన్స్ అంటే ఆసక్తి, ఉత్సుకత ఉంటున్నాయి. కానీ, పరీక్షలు-మార్కులు అనే మూల్యాంకన పద్ధతి, మల్టిపుల్ ఛాయిస్లో ఉండే పోటీ పరీక్షలు వంటివి విద్యార్థుల్లోని సృజనాత్మకతను దెబ్బతీస్తున్నాయి. ఈ విధానాల కారణంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్లాస్లో ముందుండాలనే భావిస్తున్నారు. తద్వారా వారి వాస్తవ అభిరుచులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. తమ పిల్లల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా లభించే అవకాశాలు-మార్గాలపై అన్వేషణ సాగించడంతోపాటు సదరు విభాగంలో మరింత అవగాహన పెరిగేలా చేయూతనివ్వాలి. నిరంతర అన్వేషణే.. ఉన్నతికి మార్గం విద్యార్థులు కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నైపుణ్యాలు పొందే విధంగా నిరంతరం అన్వేషణ సాగించాలి. ఐఐఎస్ఈ ఆర్ మొహాలీ లోగో క్యాప్షన్ కూడా ఇదే (ఇన్ పర్షుయిట్ ఆఫ్ నాలెడ్జ్). అన్వేషణే.. ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. అవగాహన, అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే విధంగా నేటి యువత అడుగులు వేస్తోంది. ఇతర దేశాల్లో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన భారతీయులు ఎందరో ఉన్నారు. ఆ యువశక్తి విదేశా లకు తరలకుండా ఇక్కడే ఉండేలా.. సమాజాభివృద్ధికి తోడ్పడేలా మోటివేట్ చేయాలి. -
దివ్య చైతన్య దీపిక
జగన్మాత జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో నవరాత్రులూ ఆరాధించి విజయదశమి పర్వదినాన విశ్వజనని దివ్యరూపాన్ని విశేషంగా కొలుస్తారు. వసంతరుతువు, శరదృతువు ప్రాణులకు క్లిష్టకాలాలు. జనులకు అనారోగ్యం కలిగించే ఈ మాసాలలో చెడును ఎదుర్కొని, శుభాలను ప్రసాదించమని కాంక్షిస్తూ జగద్రక్షకి అయిన దుర్గాదేవిని పూజించాలని శాస్త్రోక్తం. మానవుడికి కలిగే ప్రమాదాలను అంతర్ముఖ తత్త్వంతో దర్శించిన వ్యాసాది ఋషిపుంగవులు వాటి నిర్మూలన కోసం, నివారణ కోసం దివ్య చైతన్య దీపిక అయిన జగన్మాత ఆరాధనే అనివార్యం, ఆనంద ప్రదాయకం అని ప్రబోధించారు. జగములనేలే జగన్మాత సత్యానికీ, ధర్మానికీ, సామరస్యానికీ విజయానికీ అధినేత్రి. వివేకం, విజ్ఞానం, శాస్త్రం, శక్తి, సంగీతం, సాహిత్యం అమ్మ విభూతిలోని భాగాలే. జీవితంలో ఒడిదుడుకులు, స్తబ్ధత ఏర్పరిచే పరిస్థితులు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తే భగవంతునిపై భారం వేసి కాలానుగుణంగా జీవిత యజ్ఞం కొనసాగించాలనే ఆంతర్యం, విశ్వకళ్యాణం కోసం, ధర్మపరిరక్షణ కోసం అలౌకిక భావనాతుల్య అవతారాలలో జగన్మాత ఆవిర్భావం జరిగింది. దసరా అంటే పది రోజులని అర్థం. కనుక అమ్మవారిని నవరాత్రులూ విశేషంగా ఆరాధించి జీవన దృక్పథాన్ని విజయ పథంలో నడిపించమనీ వేడుకోవాలి. సంప్రదాయం, సంస్కృతి కలగలసిన విజయదశమి మానవ జీవితాల్లో ఆనంద అనుభవాలను అందిస్తూ పావనం చేస్తుంది. -ఇట్టేడు అర్కనందనాదేవి -
ప్రతి ఇంటికీ సైన్స్
అన్ని జిల్లాల్లో విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి మూఢ నమ్మకాలతో సమాజాభివృద్ధి కుంటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళూరులోని పిలికులలో బుధవారం ఆయన ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ విజ్ఞాన శాస్త్రం ప్రతి ఇంటి ముంగిట చేరాలని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ఉద్బోధించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని చెప్పారు. మూఢ నమ్మకాలను ఇంకా ఆచరిస్తూ ఉంటే సమాజం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. బసవన్న లాంటి వారు కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించారని గుర్తు చేస్తూ, అనేక మంది ఇంకా జన్మ, పునర్జన్మలను విశ్వసిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత జన్మ, వచ్చే జన్మ అంటూ ఉండదని, వాటి గురించి ఎవరికీ తెలియదని అన్నారు. బసవన్న వాస్తవాన్ని స్వర్గంగా, మూఢ నమ్మకాన్ని నరకంగా అభివర్ణించారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 51 ఏహెచ్ అధికరణకు సవరణను తీసుకొచ్చారని తెలిపారు. అయినప్పటికీ మనం అడుగు ముందుకు వేయలేక పోతున్నామని, తద్వారా సమాజం వృద్ధి చెందలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళయానం విజయవంతంగా పూర్తయిందని, తొలి ప్రయత్నంలోనే సఫలం కావడం ద్వారా ప్రపంచ పటంలో ఇండియా లీడర్గా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించదల్చితే, కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రమానాథ్ రై ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పాయి. -
అసా‘ధారణ’ ప్రతిభ
మనం ఫోన్లో మాట్లాడుతుంటే వెనక నుంచి ఎవరేం చెప్పినా గుర్తుండదు. మరి చుట్టూ ఎనిమిది మంది కూర్చుంటే... ప్రశ్నల వర్షం కురిపిస్తే సమాధానం చెప్పగలరా... అలా చెప్పగలగడాన్నే అష్టావధానం అంటారు. చినముషిడివాడకు చెందిన ఇరవై నాలుగేళ్ల రాంభట్ల పార్వతీశ్వర శర్మ మాత్రం పదహారేళ్ల వయసులోనే అష్టావధానిగా కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎందరో ప్రముఖుల శభాష్ అనిపించుకున్నారు. జ్ఞాపకశక్తితోనే ముడిపడిన అష్టావధాన ప్రక్రియలో అద్భుత ప్రావీణ్యం సంపాదించిన పార్వతీశ్వర శర్మ విజయ పరంపర ఆయన మాటల్లోనే చదవండి. - విశాఖపట్నం మా తాతగారి పేరు రాంభట్ల పార్వతీశ్వర శర్మ. ఆయన పేరే నాకు పెట్టారు. ఆయన స్వతహాగా కవి, రచయిత కూడా. నా చిన్నప్పుడు ఆయనతో కవి సమ్మేళనాలు, అష్టావధానాలకు వెళ్లేవాడిని. మా ముత్తాత రాంభట్ల వెంకటరావు (కుప్పిలి డాక్టరు) కూడా కవి. మా యింట్లో చాలా మంది కవులున్నారు. అది నాకు కూడా అబ్బింది. అష్టావధానంపై ఆసక్తి... ఆరో తరగతి చదువుతున్నప్పుడు యతిప్రాసలు నేర్చుకున్నాను. పద్యం, ఛందస్సు అంటే ఏమిటో మా తాతగారు నేర్పించారు. ఒక విధంగా అష్టావధానానికి గురువు ఆయనే. 2002లో కట్టమూరి చంద్రశేఖర సిద్ధాంతి గారు శృంగవరపుకోటలో అష్టావధానం చేస్తునప్పుడు తొలిసారిగా ‘దత్తపది’కి పృచ్ఛకుడిగా ఉన్నాను. నాలుగు పదాలు, ఒక అంశం ఇచ్చి పద్యం చెప్పమనడాన్నే దత్తపది అంటారు. 2005లో శృంగవరపుకోటలోనే తొలి అష్టావధానం చేశాను. ధారగంగమ్మ గుడిలో, ఆ తర్వాత మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావుగారు లాంటి ప్రముఖ అవధానుల ముందు కూడా చేశాను. ప్రపంచ తెలుగు మహాసభల్లో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. అష్టావధానంతో విజ్ఞానం, వినోదం చుట్టూ ఎనిమిది మంది పృచ్ఛకులు (ప్రశ్నించేవారు)టారు. ఈ సందర్భంగా సమస్య పూరణం, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, గంటాగణనం, అప్రస్తుత ప్రసంగం, దత్తపది అంశాల్లో ప్రశ్నలు వేస్తారు. సినిమా చూసినా, సీరియల్ చూసినా విజ్ఞానం, వినోదం కోసమే. అష్టావధానం కూడా వాటిని అందిస్తుంది. పద్యం అర్థమైనా, కాకపోయినా అందులోని పదాలు బాగుంటే అందరూ ఆనందిస్తారు. అవధానంలో ధారణ అని ఒక ప్రక్రియ ఉంది. మొత్తం చెప్పిన పద్యాలన్నీ గుర్తుంచుకొని ఒకేసారి చివర్లో చెప్పాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. అవార్డులు : చిన్నప్పుడే రాష్ట్రస్థాయి పద్యాల పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది. ఆ తర్వాత చాలా రకాల అవార్డులు వచ్చాయి. 2013లో ఉగాది సందర్భంగా విశాఖ సాహితీ వారు లలిత కళాపీఠంలో ‘అవధాన సుధాకర్’ బిరుదుతో సత్కరించారు. ఎస్వీబీసీ చానెల్లో శ్రీవారి సన్నిధిలో అష్టావధానం చేసే అవకాశం లభించింది. రచనలు : మా ముత్తాత గారి గురించి రాంభట్ల వెంకటీయం (కుప్పిలి డాక్టరు గారి జీవిత చరిత్ర) రాశాను. అనేక అష్టావధానాల్లో చెప్పిన పద్యాలను సంకలన పుస్తకంగా ‘మొదటి మొగ్గలు’ రాశాను. వచన కవిత్వాల సంకలనంగా ‘ప్రతిభా స్వరాలు’ రాశాను. రాంభట్ల వెంకటరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏటా కొందరు కవులను సత్కరిస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో పీహెచ్డీ చేస్తున్నాను. నిత్య సాధన అష్టావధానం కోసం నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. తెలుగు భాషకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను చదువుతుంటాను. ఇతర భాషల్లో పద్యాలున్నా వాటికి యతులు, ప్రాసలు లేవు. కేవలం తెలుగులో ఉన్నాయి. కాబట్టి వాటిపై మంచి పట్టు సాధించేందుకు నిత్యం సాధన చేస్తాను. శతావధానం, సహస్రావధానం చేయాలన్నది నా కోరిక. -
స్మార్ట కలేనా?
స్మార్ట్ సిటీలుగా రాష్ర్ట రాజధానులకు నో ఛాన్స జనాభా ప్రాతిపదికన ఆ సిటీల ఎంపిక 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకే అవకాశం రాష్ర్టంలో ఒక్క నగరానికీ దక్కని అవకాశం అవరోధంగా మారిన కేంద్రం విధి విధానాలు రాష్ట్రం నష్ట పోతుందని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఈ రోజు కర్ణాటక చెప్పింది...రేపు దేశమంతా ఆచరించాలి’...ఈ వ్యాఖ్యానమెవరిదో కాదు...తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. సైన్స్, టెక్నాలజీ...ఇలా ఏ రంగంలోనైనా కర్ణాటక ముందుంటుంది అని చెప్పడానికి ఆయనీరకంగా వ్యాఖ్యానించారు. అలాంటి కర్ణాటకకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన స్మార్ట్ సిటీ... ఎండమావిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే... స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన విధి విధానాలే దీనికి కారణం. పది లక్షల నుంచి 40 లక్షల జనాభా కలిగిన 44 నగరాలను, 40 లక్షలు, ఆపైబడిన జనాభా కలిగిన తొమ్మిది శాటిలైట్ నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం పంపిన సర్క్యులర్లో పేర్కొంది. ఇంత జనాభా కలిగిన నగరం ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదు. కేంద్రం ప్రతిపాదించిన వంద స్మార్ట్ సిటీలలో 53 నగరాలకు విధి విధానాలను రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 53 స్మార్ట్ సిటీలలో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదు. 84.25 లక్షల జనాభా కలిగిన బెంగళూరు కూడా దీని పరిధిలోకి రాదు. రాష్ట్రాల రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేరే ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తాయి. స్మార్ట్ సిటీ అర్హత కోసం రూపొందించిన ఈ నిబంధనల వల్ల రాష్ట్రం నష్ట పోతుందని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో బెంగళూరు తర్వాతి స్థానాల్లో హుబ్లీ-ధార్వాడ (9.43 లక్షల జనాభా), మైసూరు (8.87లక్షలు), గుల్బర్గ (5.3 లక్షలు), బెల్గాం (4.88 లక్షలు), మంగళూరు (4.84 లక్షలు), దావణగెరె (4.35 లక్షలు), బళ్లారి (4.09 లక్షలు), శివమొగ్గ (3.22) లక్షలు ఉన్నాయి. పక్కనున్న కేరళలో పది లక్షల జనాభా కలిగిన నగరాలు ఐదు ఉన్నాయి. మహారాష్ట్రలో ఆరు నగరాలున్నాయి. రాష్ర్టంలో దశాబ్దాల తరబడి బెంగళూరుపైనే దృష్టి కేంద్రీకృతమైనందున, ద్వితీయ శ్రేణి నగరాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏ రాష్ట్రంలోనైనా పట్టణ ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు అవకాశాలున్న నగరాలే ముందుకు దూసుకు పోతున్నాయి. ఇక రెండో కేటగిరీలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన పది నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేస్తారు. యాభై వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన 20 నగరాలను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులోనైనా రాష్ట్రానికి అవకాశం లభిస్తుందా అనేది కూడా సందేహమే. ఎందుకంటే... దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర నగరాలతో పోటీ పడాల్సి ఉంటుంది. మోడీ సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే స్మార్ట్ సిటీలను ప్రతిపాదించింది. 24 గంటలూ విద్యుత్, నీటి సరఫరా, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, అధునాతన సదుపాయాలు, ఈ-గవర్నెన్స్, పరిశుభ్రమైన పర్యావరణ లాంటి హంగులన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దీనికి రూ. ఏడు వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. -
సైన్స్... మనిషిని దేశదిమ్మరిని చేసింది!
గ్రంథపు చెక్క మానవుడు ఇంతకుముందు లాగా ఒకచోట జీవయాత్ర సాగించే అవకాశం లేకుండా చేసింది సైన్స్. మనిషిని దేశదిమ్మరిని చేసింది. ఈనాటి మనిషి ఉదయం ఒక ఊళ్లోనూ, రాత్రి ఇంకొక ఊళ్లోనూ ఉండవలసి వస్తుంది. కొంతమంది దేశాలనే మారుస్తున్నారు. చెట్టు ఒకచోటనే పాతుకొని ఉండి బ్రతుకుతుంది. అక్కడి నుంచి కదలిస్తే, మరోచోట పాతితే తప్ప బ్రతకదు. మరోచోట పాతివేసినా బ్రతకని చెట్లున్నాయి. జంతువు కదులుతూ బ్రతకగలుతుంది. ఒక పరిధిలో, ఒక పరిస్థితిలో మాత్రమే మనగలుగుతుంది. మానవుడూ అంతే. అయితే నూతన పరిస్థితులకు జంతువుల కంటే త్వరగా ఎడ్జెస్ట్ అవుతాడు. ఈనాటికీ పల్లెటూరి నుంచి వచ్చిన రైతు, పట్టణ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి కావడం మనకు నిత్యమూ కనిపించే దృశ్యమే. వచ్చిన దగ్గరి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే యావ తప్ప అతనికి ఇంకొకటి ఉండదు. అయినా జంతువు వలెకాక, ఎక్కడబడితే అక్కడ తనకు కావలసిన పరిస్థితులను తనకు తానై సృష్టించుకోగలుగుతున్నాడు. నూతన పరిస్థితులలో మనగలుగుతున్నాడు. అంటే క్రమక్రమేణా అతను పరిస్థితుల ప్రభావాన్ని అధిగమించి బ్రతకగలుగుతున్నాడన్నమాట. మానవుని మీద పరిస్థితుల ప్రభావం నశిస్తూ వున్నదన్నమాట. ఇక మానవునికి వేళ్ళు ఒకచోట ఉండవలసిన అవసరం లేదు. ఈ నూతన జీవితంలో అతనికి అనేక ప్రమాదాలు అపాయాలు ఎదురవుతుంటాయి. అందులో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడే కదా మానవుడు క్రొత్త క్రొత్త విషయాలను కనిపెట్టింది. మానవులో ఉన్న సృజనశక్తి విజృంభించేది. మానవుడు దేవుడయ్యేది. ఇందుకు మానసిక జీవితం ప్రగాఢం కావాలి. - ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’కు గోపిచంద్ రాసిన ముందుమాట నుంచి. -
స్వరతంత్రులకు కావాలి...సంగీత స్వరాలు!
శాస్త్రీయం ‘ఆయన గొంతు సింహంలా గంభీరంగా ఉంటుంది’ ‘చూస్తే పులిలా కనబడతాడు. గొంతేమో పిల్లిలా ఉంటుంది’...ఇలాంటి మాటలు మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. గొంతుకు సంబంధించిన ‘అసంతృప్తి’ ఒకప్పుడు మాటల వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడు మాత్రం అసంతృప్తి చెందడం కంటే తమ గొంతును మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకల్ థెరపిస్ట్లను సంప్రదిస్తున్నారు. ‘వాయిస్ లిఫ్ట్స్’ పేరుతో గొంతులోని వృద్ధాప్యాన్ని తుడిచి వేయడానికి కొందరు సర్జన్లు రకరకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ‘‘నేను సింగర్ని కాదండి. బాత్రూమ్ సింగర్ని మాత్రమే’’ అని వినమ్రంగా అంటుంటారు కొందరు. బాత్రూమే కాదు, కిచెన్రూమ్ సింగర్ అయినప్పటికీ... దానివల్ల ప్రయోజనమే అంటున్నారు బ్రిటన్లోని క్వీన్ ఎలిజేబెత్ హాస్పిటల్ చెవి, ముక్కు, గొంతు సర్జన్ డెక్లాన్ కోస్టెల్లో ‘‘కాలు, భుజ కండరాలు వయసు పైబడుతున్న కొద్ది బలహీనమైనట్లే స్వరతంత్రులు కూడా బలహీనమైపోతాయి’’ అంటున్న కోస్టెల్లో, గొంతులో యౌవ్వనాన్ని కాపాడుకోవడానికి పాటను మించిన సాధనం లేదు అని సలహా ఇస్తున్నారు. పాటకు స్వరతంత్రులకు చాలా దగ్గరి సంబంధం ఉంది. పాట అనేది స్వరతంత్రులకు వ్యాయామం లాంటిది. ‘‘ఉద్యోగ విరమణ పొందిన వారి గొంతులో కొద్ది కాలానికే మార్పు వస్తుంది. దీనికి కారణం వారు ఉద్యోగం చేస్తున్నప్పటితో పోల్చితే తక్కువ మాట్లాడమే’’ అంటారు కోస్టెల్లో. ఇలా తక్కువగా మాట్లాడడం వల్ల గొంతుకు వ్యాయామం తగ్గిపోతుంది. ఈ లోటు భర్తీ కావడానికి ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ రాగాలు తీయడమో, పాటలు పాడడమో చేయాలని ఆయన సూచిస్తున్నారు. మరిక ఆలస్యమెందుకు... పదండి, పదం అందుకోండి, పాడండి! -
పల్లె అల్లం... పట్నం బెల్లం!
* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత * నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి * ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్కే మొదటి ఓటు * తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే... రాజధాని రమ్మంటోంది... సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు. అనేక కారణాలు... రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు. అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్లోని కళాశాలల్లో చేరామన్నారు. -
‘విజ్ఞానశాస్త్రం’లో వెలుగులీనే కెరీర్..
ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, సంస్థలు సైన్స్ నేపథ్యమున్న వృత్తి నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి. సైన్స్కు సంబంధించి ప్రస్తుతం అనేక కెరీర్ ఎంపికలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందటి వరకు 10+2 తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; బీఎస్సీ- జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజక్స్; బీఎస్సీ- బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ గ్రూపులుండేవి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ను అనుసరించి గ్రూపు సబ్జెక్టుల్లో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్ డైటీటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటివి చోటు సంపాదించాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థులు స్వీయ అభిరుచులు, సామర్థ్యం, ఆర్థిక వనరులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతో డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు కల్పిస్తున్నాయి. సైన్స్లో ఉన్నత సంస్థ-ఐఐఎస్సీ 1909, మే 27న కేవలం రెండే విభాగాలు.. జనరల్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో టెక్నాలజీతో ప్రారంభమై నేడు బయో కెమిస్ట్రీ, మెటీరియల్స్, నానో సైన్స్, ఆస్ట్రానమీ-ఆస్ట్రో ఫిజిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉన్నత విద్య పరంగా, పరిశోధన పరంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ-బెంగళూరు) ప్రముఖ స్థానం సంపాదించింది. ఇందులో కోర్సు చేసే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఉన్నత కెరీర్ దిశగా పయనించొచ్చు. ఐఐఎస్సీ నాలుగేళ్ల కాల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తోంది. సైన్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, కెమిస్ట్రీల్లోని ఏదో ఒక స్పెషలైజేషన్తో బీఎస్ చేయొచ్చు. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, ఏఐపీఎంటీ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. 8 సెమిస్టర్లున్న ఈ కోర్సులో ఏడో సెమిస్టర్లో అడ్వాన్స్డ్ ఎలెక్టివ్ కోర్సుతో పాటు రీసెర్చ్ ప్రాజెక్టు ఉంటుంది. చివరి సెమిస్టర్ మొత్తం ప్రాజెక్ట్కే కేటాయించారు. నచ్చిన సబ్జెక్టులో రాణింపునకు పీజీ: ఇష్టమైన సబ్జెక్టుపై మాత్రమే దృష్టి సారించి, అందులోనే ఉన్నత కెరీర్కు బాటలు వేసుకునేందుకు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) ఉపకరిస్తుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, నానో సైన్స్ తదితర అధునాతన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని సంస్థలు సంబంధిత అంశాల్లో పీజీ ప్రోగ్రామ్లను ఆఫర్ చేస్తున్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదాహరణకు రసాయనాలు, ఎరువుల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. ఎంఎస్సీ బయోపాలిమర్ సైన్స్ కోర్సును అందిస్తోంది. కెమిస్ట్రీ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ను 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా ఎంఎస్సీ (పాలిమర్ సైన్స్)కు కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్/అప్లైడ్ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ పాలిమర్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఐఐటీల్లో పీజీ: దేశంలో అత్యున్నత విద్యా సంస్థలుగా భాసిల్లుతున్న ఐఐటీలు, ఐఐఎస్సీలోనూ సైన్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. దీనికోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)లో ప్రతిభకనబరచాలి. ఈ పరీక్షను ఐఐటీలు 2004-05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఉన్నత విద్యను అందించి, సైన్స్ కెరీర్ను ఎంపిక చేసుకునే దిశగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. జామ్ ద్వారా ఎంఎస్సీ (రెండేళ్లు); జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ; ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; ఎంఎస్సీ-ఎంటెక్; ఎంఎస్సీ-ఎంఎస్ (రీసెర్చ్)/పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సుల్లో ప్రవేశించొచ్చు.సంప్రదాయ సబ్జెక్టులతో పాటు ఎర్త్ సైన్స్; అప్లైడ్ జియో ఫిజిక్స్; ఎనర్జీ వంటి ప్రత్యేక అంశాల్లో పీజీ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఎంఎస్సీ+పీహెచ్డీ: ఎంఎస్సీతో పాటు పీహెచ్డీ పూర్తిచేసేలా కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పరిశోధనల దిశగా కెరీర్ను మలచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ-బెంగళూరు).. ఇగ్నో సహకారంతో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తోంది. దీనికోసమే బెంగళూరు ప్రధాన ప్రాంగణంలో ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్ లేబొరేటరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎంఎస్సీలో నిర్దేశ మార్కులు పొందిన వారు పీహెచ్డీలో కొనసాగవచ్చు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. సైన్స్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్తో ఫుల్స్టాప్ పెట్టేయకుండా పీహెచ్డీ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పీజీలో నేర్చుకున్న అంశాల ఆధారంగా పరిశోధనలు చేపట్టేందుకు, కొత్త ఆవిష్కరణలకు పీహెచ్డీ వీలు కల్పిస్తుంది. యూజీసీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డీబీటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) తదితర సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు వివిధ అంశాల్లో పీహెచ్డీ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల్లో పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చ్ దిశగా వెళ్లడం మంచిది. ఇప్పుడు ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఉన్నత చదువుకు ‘ఉపకారం’! ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇన్స్పైర్ స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్. యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్షిప్స్, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్షిప్స్ను అందజేస్తోంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్డీ వంటి కోర్సులు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. పరిశోధకులకు అండగా ఫెలోషిప్: దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా ఫెలోషిప్ పొందుతూ పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/ ఐఐటీలు, నిట్లలో లెక్చరర్షిప్నకు అర్హత సాధించాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. నెట్లో మంచి ర్యాంకు సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీహెచ్డీ చేయడానికి మార్గం ఏర్పడుతుంది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్జెన్సీ గ్రాంట్గా రూ.20 వేలు ఇస్తారు. ఆ తర్వాత పరిశోధనలో ప్రగతి, ఇంటర్వ్యూ ఆధారంగా మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ.18 వేలు ఇస్తారు. జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్లు కలిసి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ లభిస్తుంది. సీఎస్ఐఆర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్: సీఎస్ఐఆర్ నెట్లో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ (ఎస్పీఎం) ఫెలోషిప్ను అందిస్తున్నారు. పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లకు నెలకు రూ.20 వేలు ఇస్తారు. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ అందిస్తారు. జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (జెస్ట్): సైన్స్కు సంబంధించిన అంశాల్లో ఐఐఎస్ఈఆర్ వంటి ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ చేయాలనుకుంటే దానికున్న చక్కని మార్గం జెస్ట్. ఏడాదికి ఒకసారి ఒక్కో ఇన్స్టిట్యూట్ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఫెలోషిప్ అందుకోవడంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్డీ చేయొచ్చు. ప్రాక్టికల్ నైపుణ్యాలు ప్రధానం ప్రస్తుతం సైన్స్లో అనేక సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థి స్వీయ అభిరుచి, సామర్థ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన సబ్జెక్టులో పీజీ, ఆపై పీహెచ్డీ దిశగా వెళ్తే సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ఉదాహరణకు మ్యాక్రో మాలిక్యులర్ కెమిస్ట్రీ, పాలిమర్ ఫిజిక్స్, పాలిమర్ క్యారెక్టరైజేషన్ వంటి ఉప విభాగాల సమ్మిళితంగా ఉన్న పాలిమర్ సైన్స్లో మంచి అవకాశాలున్నాయి. అయితే సంబంధిత కోర్సులు చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొంటే సుస్థిర కెరీర్లో కుదురుకున్నట్లే! దేశంలో పాలిమర్, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. కీలకపాత్ర పోషిస్తోంది. పరిశ్రమకు నిపుణులైన మానవ వనరులను అందించేందుకు వివిధ కోర్సులు అందిస్తోంది. వీటిలో పీజీ డిప్లొమా, పోస్టు డిప్లొమా, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్ తదితర ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్స్ ఆధారంగా సబ్జెక్టును నేర్చుకోవడం, సంబంధిత సబ్జెక్టులతో ముడిపడిన వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ప్రధానం. - ప్రొఫెసర్ టి. పార్థసారథి, ఉస్మానియా యూనివర్సిటీ, పీహెచ్డీ (పాలిమరైజేషన్). -
‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఆఖరి సంవత్సరం విద్యార్థుల ఆందోళన ఫలితాల విడుదల్లో తీవ్ర జాప్యం 4న హైదరాబాద్లో స్నాతకోత్సవం! నూజివీడు : ట్రిపుల్ ఐటీలో చదవాలనే గ్రామీణ విద్యార్థుల ఆశ అఖరి సంవత్సరం వచ్చేనాటికి ఆవిరైపోతోంది. గ్రామీణ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలు నిర్వహించి దాదాపు 3నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు రాకపోవడంతో ఆఖరి సంవత్సరం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన విద్యార్థుల(తొలిబ్యాచ్) ఆఖరి సంవత్సరం ఫలితాల్లో జాప్యం నెలకొంది. హైదరాబాద్లోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో ఏం జరుగుతుందో స్థానిక ట్రిపుల్ఐటీ అధికారులకు సమాచారం లేదు. ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలను పీయూసీగా, తరువాత నాలుగు సంవత్సరాలను ఇంజినీరింగ్గా పరిగణిస్తారు. 2008లో ప్రారంభమైన ట్రిపుల్ఐటీలలో తొలిబ్యాచ్ ప్రస్తుతం బయటకు అడుగిడబోతోంది. అయితే వీరి చివరి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ మూడో వారంలో జరిగినప్పటికీ నేటికీ ఫలితాలు వెలువడకపోవడం గమనార్హం. ఆఖరి సంవత్సరం ఫలితాలు వెలువడక పోవడంతో మూడు ట్రిపుల్ఐటీల్లోని 6వేల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల గురించి విద్యార్థులు ఎన్నిమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంలో వారిలో అయోమయం నెలకొంది. ఫలితాలు రాకపోవడంతో క్యాంపస్ సెలక్షన్లో పలు కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు ఫలితాలు వస్తే ఉద్యోగాలకు వెళ్లాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి, ఇంటర్లో లక్షలాది మంది విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను 40రోజుల్లో విడుదల చేస్తుండగా, కేవలం 6వేల మంది విద్యార్థులకు చెందిన ఫలితాలు విడుదల చేయలేకపోవడంపై ట్రిపుల్ఐటీ సిబ్బందే ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు రాకుండానే స్నాతకోత్సవమా? వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఫలితాలు రాకుండానే ఆగస్టు 4న హైదరాబాద్లో స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆర్జీయూకేటీ సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్ఐటీల నుంచి తొలిబ్యాచ్ బయటకు వెళ్తున్న నేపథ్యంలో వారికి ఈ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారేమోననే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. -
తవ్వేస్తున్నారు..!
తీరంలో జోరుగా చేపల చెరువుల తవ్వకాలు అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ వ్యాపారం అసైన్డ్, దేవాలయ, మడ అడవుల భూముల్లోనూ తవ్వకాలు కాసుల వర్షం కురిపించే చేపల సాగు కోసం అక్రమారులు అడ్డగోలుగా చెరువులు తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ‘పచ్చ’నోట్లు పుచ్చుకుని నోరు మెదపడంలేదు. కార్యాలయాల నుంచి కాలు కదపడంలేదు. ఫలితంగా తీరం వెంబడి భారీగా చేపల చెరువులు వెలుస్తున్నాయి. మడ అడవులు, దేవాలయాల భూములు కూడా చెరువులుగా మారుతున్నాయి. మచిలీపట్నం : తీరంలో చేపల చెరువులను తవ్వే మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఎకరం, రెండు ఎకరాలకు అనుమతులు తీసుకుని వందలాది ఎకరాలను చెరువులుగా మార్చేస్తున్నారు. అధికారులను మంచి చేసుకుని అసైన్డ్, దేవాదాయ శాఖ భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. ఈ వ్యవహారం తమ కళ్ల ఎదుటే జరుగుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు తవ్వే సమయంలో డ్రెయినేజీ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవలే అధికారం చేజిక్కించుకున్న కొందరు నాయకులు చేపల చెరువుల తవ్వకాల్లో తలమునకలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) నిబంధనలను సైతం అతిక్రమించి మడ అడవులను చేపల చెరువులుగా మారుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రామస్థాయి వీఆర్వో నుంచి డివిజన్ స్థాయి వరకు ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వారికి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బందరు మండలంలో చిన్నాపురం, కోన, కానూరు, పెదపట్నం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని అక్రమార్కులు బాహాటంగానే చెబుతున్నారు. వనామీ రొయ్య అధిక ధర పలుకుతుండటం, సాగు బాగుండటంతో సముద్రపు కరకట్ట పక్కనే ఉన్న మడ అడవులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. కెపీటీపాలెం, కమ్మవారిచెరువులో రొయ్యల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కోన, చిన్నాపురం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి. పెడన మండలంలో బల్లిపర్రు, దేవరపల్లి, నందమూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా చెరువుల తవ్వకం వేగవంతంగా సాగుతోంది. లజ్జబండ డ్రెయిన్ను సైతం ఆక్రమించేస్తున్నారు. పెడన మండల శివారు ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో 90 ఎకరాలకు పైగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో పీతలావ, కృత్తివెన్ను, వాలంక, పల్లెపాలెం తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకం ఊపందుకుంది. వందలాది ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా మార్చేస్తున్నారు. బంటుమిల్లి మండలం పెందుర్రు, చోరంపూడి, నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షం కురిస్తే పనులు నిలిచిపోతాయని భారీ యంత్రాలను తీసుకువచ్చి శరవేగంగా చురువులు తవ్వేస్తున్నారు. నందివాడలో కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువుగా మారుస్తున్నారు. సర్వే నంబర్ 9, 10లో సుమారు 10.14ఎకరాల సాగు భూమిలో రెండు పొక్లేయిన్లతో గత రెండు రోజులుగా చెరువు తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. వరిసాగు చేస్తామని వేలంపాట ద్వారా భూములు దక్కించుకున్న రైతు చేపల చెరువులుగా ఈ భూమిని మార్చటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోడూరు మండలం ఉల్లిపాలెం, పాలకాయతిప్ప వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడకు రావటం.. వెళ్లిపోవటం మినహా పనులు నిలిపివేసింది లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో సొసైటీ పేరుతో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ఇటీవలే పూర్తిచేశారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోకపోవటం గమనించదగ్గ అంశం. అశ్వారావుపాలెంలో ఇటీవల చెరువుల తవ్వకాలు చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు హడావుడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
మీ మనసులో ఏముందో చెప్పొచ్చు!
సాంకేతికం ఎవరి మనసులో ఏముందో ఎవరికెరుకా?... అని ఇక ముందు మనం పాటలు పాడుకోనక్కర్లేదు. ఎందుకంటే మనసులో ఉన్న మాటను కనిపెట్టే సాధనం సమీప భవిష్యత్తులో రాబోతోంది. సైన్స్ఫిక్షన్లో మాత్రమే కనిపించే మనసులోని భావాలను కనిపెట్టే సాధనం నిజజీవితంలోకి రానుంది. ‘స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు ‘బ్రెయిన్ చిప్స్’ ద్వారా మెదడును మానిటర్ చేయడానికి అవసరమైన కొత్త విధానాలను కనుగొన్నారు. కొందరు వ్యక్తులను తమ ప్రయోగానికి ఎంచుకొని, గణితానికి, నిత్యజీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పే క్రమంలో తప్పు, ఒప్పులకు ‘బ్రెయిన్ సెల్స్’ ఎలా ఉత్తేజితం అవుతున్నాయనేది అధ్యయనం చేశారు. ‘‘వ్యక్తుల బ్రెయిన్ యాక్టివిటీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డ్ను అధ్యయం చేయడం ద్వారా వారి మనసులోని మాటను కనిపెట్టడం సులువే’’ అంటున్నాడు స్టాన్ఫోర్డ్ యూనివర్శిటికి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ జోసెఫ్ పర్విజి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న బ్రెయిన్ మానిటరింగ్ టెక్నిక్లు వ్యక్తుల ఆలోచనల తాలూకు సంపూర్ణ చిత్రాన్ని ఇవ్వలేకపోతున్నాయి, ఆ లోటును తమ అధ్యయన ఫలితాలు పూరిస్తాయని అంటున్నాడు జోసెఫ్. యూనివర్శిటీ ఆఫ్ ఒరెగాన్(అమెరికా)కు చెందిన పరిశోధకులు కూడా మైండ్ రీడింగ్పై రకరకాల పరిశోధనలు చేసి మంచి ఫలితాలు సాధించారు. తాము అభివృద్ధి చేయబోయే టెక్నిక్ వైద్యరంగానికి చాలా మేలు చేస్తుందని పరిశోధక బృందం చెబుతోంది. వీరు కనుగొన్న సాంకేతిక ప్రక్రియకు పేషంట్ల ప్రయివేట్ ఆలోచనలను కూడా పసిగట్టగల సామర్థ్యం ఉంటుందని నిపుణులు అంటున్నారు ‘‘మనిషి అనేవాడు ఒకే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. వాటిని కనిపెట్టడం పెద్ద విషయమే’’ అంటున్నాడు పరిశోధక బృందానికి నాయకుడైన ఎడ్వర్డ్ కె వోగెల్. -
సో... సొరచేపలకు థ్యాంక్స్!
సైన్స్ సొరచేపలు సముద్రంలో ఏంచేస్తాయి? అనే ప్రశ్నకు- ‘‘ఏం చేస్తాయండీ...తమ పనేదో తాము చేసుకుంటాయి’’ అనే సరదా సమాధానమైతే రావచ్చుగానీ, వాటి గురించి మాట్లాడుకోవడానికి సీరియస్ విషయాలే ఉన్నాయి. తమ పనేదో తాము చేసుకోవడమే కాదు మానవాళికి అవసరమైన మంచి పని కూడా చేసి పెడుతున్నాయి. వివిధ స్థాయులలో నీటి ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి గత దశాబ్దకాలంగా యూనివర్శిటీ ఆఫ్ మియామి(అమెరికా) పరిశోధకులు సొరచేపలను ఉపయోగించుకుంటున్నారు. వాటికి ఏర్పాటు చేసిన శాటిలైట్-లింక్డ్ ట్యాగ్ల ద్వారా సమాచార సేకరణ సాధ్యమవుతోంది. తాజా విశేషం ఏమిటంటే, కేవలం నీటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు... గాలివానలు, తుపానుల గురించి తెలుసుకునే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. సొరచేపలు అందించే సమాచారంలో ఎన్నో హెచ్చరికలు నిక్షిప్తమై ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు సొరచేపలకు అమర్చిన ట్యాగ్లు వాటి నుంచి విడిపోయినా... అప్పటివరకు అది సేకరించిన సమాచారం మాత్రం మాయం కాదు. దానికి సంబంధించిన డాటా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ‘‘కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడంలో వాటికి మించి సాధనాలు లేవు. ఆధునిక పరికరాలు చేయలేని పనిని కూడా అవి చేసి పెడుతున్నాయి. ఖచ్చితమైన సమాచారమే కాదు కీలక సమాచారాన్ని ఇస్తున్నాయి’’ అంటున్నాడు సముద్రజీవజాల శాస్త్రవేత్త జెరాల్డ్ ఆల్ట్. సొరచేపల నుంచి సేకరించిన సమాచారం తుపానుల బలాబలాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ‘‘ఇది ప్రారంభం మాత్రమే... సొరచేపలు మనకు అందించే సమాచారంతో విపత్తుల గురించి తెలుసుకోవడమే కాదు.. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు’’ అంటున్నారు పరిశోధకులు. -
విజ్ఞాన ప్రపంచం - మేధస్సుకు పదును
విశ్వ సమాచార సమ్మేళనం వినోదం, విజ్ఞానం పంచుతున్న రీజనల్ సైన్స్ సెంటర్ (న్యూస్లైన్ -తిరుపతి-మంగళం) ఇదో విజ్ఞాన ప్రపంచం. అంతరిక్షంలో జరుగుతున్న అద్భుతాలను మన ముందుంచుంతోంది. జీవ, రసాయక, భౌతిక, గణిత, ఖగోళశాస్త్ర విశేషాలతో విద్యార్థుల మేధస్సుకు పదునుపెడుతోంది. సైన్స్పై ఆసక్తి కలిగిస్తున్నాయి. పాపులర్ సైన్స్, ఫన్సైన్స్, హిస్టారిక్ పార్క్, లైఫ్ పార్క్, త్రీడీ సినిమా సైన్స్ గ్యాలరీలు ఆకట్టుకుంటున్నారుు. ఉపగ్రహాలు, శాటిలైట్స్, భూ స్థిరకక్ష్య, గ్రహాలు, పర్యావరణం, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వంటి ఎగ్జిబిట్స్ విద్యార్థుల్లో నూతన ఆలోచనలను రేకెత్తిస్తున్నారుు. ఎమర్జింగ్ టెక్నాలజీ, భ్రమ, జ్ఞానేంద్రియాలు, విశ్వం వంటి గ్యాలరీలతో పాటు సైన్స్ ఫర్ నక్షత్రశాల తదితరాలు హైలెట్గా నిలుస్తున్నాయి. పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ప్లానిటోరియం ఈ సైన్స్ సెంటర్లో ఉండడం విశేషం. ఓ లుక్కేదాం రండి.. - వేసవి సెలవుల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తోంది తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం. జీవ, రసాయనిక, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్ర విశేషాలతో విద్యార్థుల మేధస్సుకు పదునుపెడుతోంది . జిల్లాలోని విద్యార్థులే కాకుండా నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. విద్యార్థులకు విజ్ఞాన విశేషాలు అర్థమయ్యే రీతిలో సిబ్బంది వివరిస్తున్నారు. తిరుపతిలోని అలిపిరి మెట్ల దారికి 500 మీటర్ల దూరంలో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్లో విశేషాలు తెలుసుకుందాం.. పాపులర్ సైన్స్ గ్యాలరీ అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి, ధ్వని ప్రయోగాలు, కాంతికి సంబంధించిన వివిధ రకాల ప్రయోగాలు, గణితం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను ఈ గ్యాలరీలోని ఎగ్జిబిట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫన్ సైన్స్ గ్యాలరీ మనిషి ప్రతిబింబాన్ని అద్దంలో వివిధ ఆకారాలలో చూపించే దర్పణాలు, భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇతర శాటిలైట్స్, భూ స్థిరకక్ష, గ్రహాలు, పర్యావరణం, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వంటి విషయాలను ఈ గ్యాలరీలోని ఎగ్జిబిట్స్ వివరంగా తెలియజేస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ మానవజీవితాన్ని శాసించే ఏడు ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల సైన్స్ మోడల్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయి. అందులో అంతరిక్ష, విజ్ఞానం, న్యూక్లియర్ టెక్నాలజీ, ఓషన్ టెక్నాలజీ, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నానాటెక్నాలజీలలో వచ్చిన సాంకేతిక మార్పులను సైన్స్ మోడల్స్లో చూడవచ్చు. భ్రమింపజేసే గ్యాలరీ ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే మనిషి మొండెం, తల వేరుగా కనిపిస్తాయి. మనిషి లేని చోట మాట్లాడే బొమ్మ ఉండి అందరితో మాట్లాడినట్లుగా భ్రమింపజేస్తుంది. ఒక అద్దంలో చూస్తే అస్తిపంజరం, మరో అద్దంలో ముఖం చూస్తే వీపు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్యాలరీలో పిల్లలతోపాటు పెద్దలు కూడా భ్రమపడడం ఖాయం. మన జ్ఞానేంద్రియాలు మానవశరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విజ్ఞానాన్ని తెలియజేసే గ్యాలరీ ఇది. చిన్న పిల్లలకు శరీర భాగాల వివరాలను బొమ్మలు, ప్రయోగాల ద్వారా తెలియజేయడం కొత్త విశేషం. విశ్వ సమాచారం అంతరిక్షంలో నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఎలా ఏర్పడ్డాయో ఈ గ్యాలరీ వివరిస్తుంది. శాటిలైట్స్ పనితనాన్ని కూడ ఇక్కడ తెలుసుకోవచ్చు. పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ప్లానిటోరియం ఇక్కడ ఉండడం విశేషం. అబ్బురపరిచే త్రీడీ షో... పిల్లల నుంచి పెద్దల వరకు అబ్బురపరిచే విధంగా సైన్స్సెంటర్లో ప్రత్యేక థియేటర్లో త్రీడీ షోను నిర్వహిస్తున్నారు. ఈ షో తిలకించేందుకు ప్రతి ఒక్కరికీ త్రీడీ అద్దాలు ఇస్తారు. సినిమాలోని సంఘటనలు పక్కనే జరిగినట్టుగా ఉండడంతో పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. హిస్టారిక్ పార్క్ వేల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన అద్భుత జీవజాలాల ప్రతిమలను ఈ హిస్టారిక్ పార్క్లో చూడవచ్చు. డైనోసార్, పురాతన ఏనుగులు, ఆదిమానవుడి జీవన విధానం వంటి అద్భుత ఆకృతులు పిల్లలకు ఆనందానిస్తున్నాయి. ఊయలలు, జారుడు బల్లలు వంటి ఆటవస్తులు అలరిస్తున్నాయి. ప్రవేశ రుసుం రీజనల్ సైన్స్సెంటర్ను సందర్శించేందుకు ప్రతి ఒక్కరూ రూ.5లు చెల్లించాలి. ఏదైనా స్కూల్ విద్యార్థులంతా కలసి సైన్స్సెంటర్ను సందర్శించేందుకు ఒకొక్కరికీ కేవలం రూ.2లు మాత్రమే రుసుము వసూలు చేస్తున్నారు. రీజనల్ సైన్స్సెంటర్ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు. -
చిరాయువుకిటుకు తెలిసిందా?
పుట్టినవాడు గిట్టక తప్పదు.. మరణించినవాడు మళ్లీ పుట్టకా తప్పదని భగవద్గీత చెబుతుందిగానీ... మనిషి మాత్రం మరణాన్ని జయించాలని యుగాలుగా ఆరాట పడుతూనే ఉన్నాడు. అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న వైద్య, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు ఈ కాంక్షను ఎంతో కొంత తీరుస్తున్నాయి కూడా. ఇప్పటికే మనిషి సగటు ఆయుష్షు దశాబ్దానికి పైగా పెరిగిపోయింది. మరి భవిష్యత్తులో ఏమవుతుంది? మరిన్ని ఎక్కువ ఏళ్లు జీవించగలమా? ఒకవేళ ఇది సాధ్యమైనా వృద్ధాప్యంలోనూ రోగాలు, రొష్టులు లేకుండా చేయగలమా? సాధ్యమే అంటున్నారు... శాస్త్రవేత్తలు. 1980తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ జనాభాలో అరవై ఏళ్లు పైబడిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2050 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరుతుందని అంచనా. బాగానే ఉందిగానీ... ఈ వయోవృద్ధులతో ఓ కొత్త సమస్య ఏర్పడే అవకాశముంది. శరీరం సహకరించక రోగాల బారిన పడటం.. గుండెపోట్లు, వ్యాధులు, క్యాన్సర్లు పెరిగిపోతాయి. మరణాలు అనివార్యమవుతాయి. ఈ నేపథ్యంలో ఆయుష్షును పెంచుతూనే.. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చూసేందుకు రిచర్డ్ వాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనశాలలకే పరిమితమా? మనిషిని మరింత ఎక్కువ కాలం జీవించేలా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొన్ని పరిశోధనశాలల్లో అద్భుత ఫలితాలను ఇచ్చాయి... ఇస్తున్నాయి కూడా. శాస్త్రవేత్తలు కొన్ని నిర్దిష్ట జన్యువులను నియంత్రించడం, మార్పులు చేయడం ద్వారా చుంచు ఎలుకలు, ఈగలు, కొన్ని రకాల కీటకాల జీవితకాలాన్ని గణనీయమైన స్థాయిలో పెంచగలిగారు. కొందరు రాపమైసిన్, రివర్సెట్రాల్ (రెడ్వైన్లోని పదార్థం) వంటి మందులు వాడటం ద్వారా ఎక్కువ కాలం బతికేయవచ్చునని ప్రతిపాదించారు. అయితే విసృ్తతస్థాయి పరిశోధనల ద్వారా ఇవేమంత సమర్థమైనవి కావని తేలింది. అయితే ఇవే మార్పులు మనిషిలోనూ చేస్తే అవే రకమైన ఫలితాలు ఉంటాయా? అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. మనుషుల్లో వృద్ధాప్యానికి సంబంధించి ఇప్పటివరకూ కొన్ని జన్యువులను మాత్రమే గుర్తించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. అయితే రిచర్డ్ వాకర్ వంటి శాస్త్రవేత్తలు మాత్రం వృద్ధాప్యాన్ని అరికట్టే కిటుకు మనిషి జన్యువుల్లోనే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగానే తమ పరిశోధనలు చేస్తున్నారు. అరుదైన వ్యాధి కీలకం.. రిచర్డ్ వాకర్ పరిశోధనల్లో సిండ్రోమ్ -ఎక్స్ అనే అత్యంత అరుదైన వ్యాధి కీలకంగా మారుతోంది. ఎంత వయసు వచ్చినా... చిన్న పిల్లల మాదిరిగానే ఉండటం ఈ వ్యాధి లక్షణం. డీఎన్ఏలోని కొన్ని లోపాల కారణంగా ఇలా జరుగుతుందని... ఆ మార్పులేవో తెలుసుకోగలిగితే మనిషిని చిరాయువుగా మార్చేందుకు వాటిని ఉపయోగించుకోవచ్చునన్నది వాకర్ అంచనా. అయితే దీనిపై పరిశోధనల చేసేందుకు ఆయన కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2005లో బ్రూక్ గ్రీన్బర్గ్ అనే బాలికతో వాకర్ తన పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ తరువాత అమెరికాలోనే ఉన్న మరో ముగ్గురు వ్యాధిగ్రస్తులపై పరిశోధనలు చేశారు. బ్రూక్ గ్రీన్బర్గ్ వయసు 12 ఏళ్లు. అయినా ఏడాది పాప మాదిరిగానే ఉంటుంది. ఆమె శరీరంలోని వేర్వేరు అవయవాలు వేర్వేరు వేగాలతో ఎదుగుతున్నట్లు వాకర్ గుర్తించారు. పళ్లు ఎనిమిదేళ్ల వయసు, ఎముకలు పదేళ్లు.. మానసిక వయసు మాత్రం ఏడాదిలోపే ఉన్నట్లు వాకర్ పరిశోధనల్లో తేలింది. బ్రూక్తోపాటు మరో ముగ్గురి డీఎన్ఏలోని కొంతభాగాన్ని విశ్లేషించినప్పుడు వాకర్కు ప్రత్యేకమైన తేడాలేవీ కనిపించలేదు. కానీ... బ్రూక్ జన్యుక్రమాన్ని పూర్తిగా విశ్ల్లేషించిన మరో శాస్త్రవేత్త ఎరిక్ స్కామట్ మాత్రం మూడు ప్రత్యేకమైన మార్పులను గుర్తించారు. సాధారణ జన్యుక్రమాల్లో ఈ మార్పులు ఎన్నడూ కనిపించలేదన్నది ఎరిక్ వాదన. అయితే మరి కొంతమంది సిండ్రోమ్ -ఎక్స్ బాధితుల్లోనూ ఇదేరకమైన మార్పులు కనిపిస్తేగానీ ఒక నిర్ధారణకు రాలేమని ఎరిక్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఎరిక్ పరిశోధనలు ఇప్పటివరకూ ప్రచురితం కాలేదు కూడా. -
‘పట్టు’ సాధించేందుకు ప్రయోగం
సైన్స్పై విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు శ్రీకారం చుట్టిన జిల్లా విద్యాశాఖ బాల శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం 90 మందికి ఉచిత భోజనం, వసతి, శిక్షణ విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెంపొందించడానికి జిల్లా విద్యాధికారి పూనుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు.. కనీసం వారికి సైన్స్లో ఓనమాలు నేర్పించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని న్యూత్రివి హైస్కూల్లో బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 2 నుంచి ప్రారంభమైన శిబిరంలో పదో తరగతిలోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు 15 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముఖి టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపిన వారినే బాల శాస్త్రవేత్తల ఆవాస శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారు. వివిధ మండలాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులకు ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగాలో సునీత శిక్షణ ఇస్తున్నారు. అనంతరం విద్యాబోధన, రిసోర్స్ పర్సన్లు సైన్స్లోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రయోగాత్మకంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. సాయంత్రం ప్రముఖులతో విద్యార్థులకు ఉపయోగపడేలా, వారికి కెరీర్ గెడైన్స్ పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు. గెస్ట్ లెక్చర్లు రమాదేవి, సుహాసిని, శంకర్నారాయణ పలు అంశాలపై వివరించారు. రాత్రివేళ కొంతసేపు మానసికోల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలు, స్నాక్స్ కోసం ఓరుగల్లు సేవా సమితి నుంచి కలెక్టర్ రూ.36వేలు ఇచ్చారు. భోజన వసతి కోసం ప్రైవేటు కళాశాలల యాజమన్యాలు సహకరిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ శ్యాంసుందర్రెడ్డి ప్రోగ్రాం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రిసోర్స్ పర్సన్లుగా స్కూల్ అసిస్టెంట్లు విజయపాల్రెడ్డి, ఏ.జ్ఞానేశ్వర్, ఎస్.రామనాథం, వి.సురేశ్, రాము, శ్రీనివాస్స్వామి, శంకర్, శశికళాధర్, దయాకర్, సదానందం, అనితాలత విద్యాబోధన చేస్తున్నారు. ఎంతో ఉపయోగపడుతుంది.. లింగాలఘణపురం మండలం వనపర్తి జెడ్పీఎస్ఎస్లో 9వ తరగతి పూర్తిచేసి టెన్త్లోకి ప్రవేశించాను. ఇక్కడ మాకు ఉచిత వసతితోపాటు సైన్స్పై అనేక అంశాలను బేసిక్స్ నుంచి ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో టెన్త్ క్లాస్లోని అంశాలను ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణతో బట్టీపట్టాల్సిన అవసరం లేకుండా సైన్స్ సబ్జెక్టులోని అనేక అంశాలు ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు. వాగ్దేవి, జెడ్పీఎస్ఎస్ వనపర్తి ప్రయోగాత్మకంగా చెబుతున్నారు.. రాయపర్తి మండలం కొండూరు జెడ్పీఎస్ఎస్లో 9వ తరగతి పూర్తి చేశాను. సైన్స్లో ప్రోత్సహించే విధంగా ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులపై బేసిక్స్తో సహా టీచర్లు చెప్పడమే కాకుండా ప్రయోగాల ద్వారా చూపడంతో స్పష్టంగా అర్థమవుతోంది. శిక్షణా శిబిరంలో చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పుతున్నారు. యోగా చేయిస్తున్నారు. ఇది నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా దోహదం చేస్తుంది. - జి.శ్రీకాంత్, జెడ్పీఎస్ఎస్ కొండూరు ఆసక్తి కనబరిచేలా విద్యాబోధన నరేందర్ నగర్లోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాను. బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరంలో మాకు టెన్త్లోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పలు అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న సైన్స్ అంశాలు, గెస్ట్ లెక్చర్లు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేస్తున్నాయి. - ఈ.రాణి, నరేందర్ నగర్, వరంగల్ ఇదొక ప్రయోగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది. వారికి విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల ఆసక్తి కలిగిస్తే వారు భవిష్యత్లో బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. వేసవిలో విద్యార్థులు ఇంటివద్ద ఉంటే వేరే వ్యాపకాల్లో ఉంటారు. అందువల్ల వారికి రెసిడెన్షియల్గా ఉదయం టిఫిన్, భోజన వసతితోపాటు మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తున్నాం. మానసికోల్లాసానికి యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. వివిధ అంశాల్లో గెస్ట్ లెక్చరర్లతో గ్రూప్ డిస్కషన్ చేయిస్తున్నాం. ఫిజికల్ సైన్స్, బయాలజీలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిబిరం నిర్వహణకు కలెక్టర్ కిషన్, ప్రైవేటు యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. శిక్షణను ఈనెల 11వ తేదీ వరకు కొనసాగిస్తాం. - డాక్టర్ ఎస్.విజయ్కుమార్, డీఈఓ సంతృప్తిగా ఉంది వేసవి సెలవులు వస్తే కుటుంబాలతో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తుంటారు కొందరు ఉపాధ్యాయులు. అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు టెన్త్లోని సైన్స్పై నైపుణ్యాలను, మహనీయుల స్ఫూర్తి కలిగించే అంశాలను బోధించడం సంతృప్తిగా ఉంది. సెలవులు పోయినా విద్యార్థులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నామనే భావన ఉంది. - విజయపాల్రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ -
టెన్త్ సైన్స్, సోషల్ పరీక్ష 11 గంటలకు
హైదరాబాద్: పదో తరగతి సామాన్య శాస్త్రం(సైన్స్), సాంఘిక శాస్త్రం(సోషల్) పరీక్ష జరిగే వేళలను సవరించారు. సైన్స్, సోషల్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి కాకుండా 11 గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి బుధవారం తెలిపారు. గతంలో సైన్స్ పేపర్-1, సోషల్ పేపర్-1 పరీక్షలనే ఉదయం 11 గంటల నుంచి జరపాలని నిర్ణయించిన విషయం తెలిసింది. అయితే కొన్ని పరీక్షలను 9.30 నుంచి మరికొన్ని పరీక్షలను 11 గంటల నుంచి ప్రారంభిస్తే విద్యార్థులు ఆయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో 7నుంచి జరిగే అన్ని పరీక్షలు(సైన్స్ రెండు పేపర్లు, సోషల్ రెండు పేపర్లు) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. 3, 4 తేదీల్లో మేథమేటిక్స్ పేపర్-1, మేథమేటిక్స్ పేపర్-2 పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకే ప్రారంభం అవుతాయి -
సైన్స్ ఫిక్షన్కూ ఓ మ్యూజియమ్
సై-ఫై సైన్స్- ఫిక్షన్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ ఇష్టాన్ని మరింత పెంచడానికి వాషింగ్టన్, డి.సి(అమెరికా)లో ‘మ్యూజియం ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ ప్రారంభం కానుంది. ఈ మ్యూజియంలో సైన్స్ ఫిక్షన్కు సంబంధించిన రచనలు, వీడియోలు...ఉండబోతున్నాయి. ‘వాషింగ్టన్ పేరు వినబడగానే సై-ఫై మ్యూజియం గుర్తుకు వచ్చేలా ఉండాలనేదే మా ప్రయత్నం’ అంటున్నాడు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గ్రేగ్ విగియానో. ఈయన హాలీవుడ్ సినిమాలకు రచనలు చేస్తుంటాడు. గత సంవత్సరం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకు రచన చేయాల్సి వచ్చింది. తనకు కావల్సిన సమాచారం కోసం వెదికినప్పుడు నిరాశ ఎదురైంది. అరకొర సమాచారం మాత్రమే దొరికింది. ‘సైన్స్-ఫిక్షన్కు పూర్తిస్థాయిలో ఒక మ్యూజియం అందుబాటులో ఉంటే బాగుండేది’ అనుకున్నాడు. అనుకోవడమే కాదు తన ఆలోచనను ‘మ్యూజియం ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ రూపంలో ఆచరణలోకి తెస్తున్నాడు గ్రేగ్. మ్యూజియంలో మొత్తం ఏడు గ్యాలరీలు ఉంటాయి. వీటిలో రకరకాల వింత వాహనాలు, టైమ్ట్రావెల్ కాన్సెప్ట్లు, గ్రహాంతర వాసుల చిత్రాలు, రోబోలు... మొదలైనవి ప్రదర్శిస్తారు. ‘సైన్స్కు ప్రేరణలాంటిది సైన్స్ఫిక్షన్. నేటి సెల్ఫోన్లు, టాబ్లెట్లు... సైన్స్ఫిక్షన్ నుంచి పుట్టినవే కదా! ఈ మ్యూజియం ప్రారంభమైన తరువాత మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అంటున్నాడు గ్రేగ్. -
స్కిల్స్ పెంచుకుంటే కొలువు సులువే!
భారత్లో ప్రతిఏటా 30 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసుకొని, ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తున్నారు. వారిలో దాదాపు 25 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హతలను కలిగి ఉంటున్నారు. ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది ఐటీ, ఐటీఈఎస్ రంగాలను ఎంచుకున్నారు. మిగిలిన 75 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగ సాధనకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉంది. విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దడంలో పారిశ్రామిక రంగం పాత్ర కూడా ఎంతో కీలకం. కార్పొరేట్ కల్చర్ అవేర్నెస్, ఇంటర్న్షిప్ ప్రాజెక్టుల్లో వారిని భాగస్వాములను చేయాలి. తగిన శిక్షణ ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను తరగతి గదిలో నేర్చుకున్నదాన్ని పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టినప్పుడే సుశిక్షితుడైన మానవ వనరుగా ఎదుగుతాడు. తన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతాడు. ఆంగ్ల భాషపై పట్టు టెక్నికల్ విద్యార్థులు ఆంగ్ల భాషపై తగినంత పట్టు సాధించలేకపోతే.. వారికి ఎంత విజ్ఞానం ఉన్నా నిరర్థకమే. కాల్సెంటర్లు, బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్, ఐటీ తదితర రంగాల్లో రాణించాలంటే మంచి ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంగ్లాన్ని మొదటి సంవత్సరం నుంచే బోధించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఆంగ్ల భాష విషయంలో ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వారిలో ఆంగ్ల భాషా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భాష ఏదైనా చదవడం, రాయడం, మాట్లాడడం సంపూర్ణంగా వచ్చినప్పుడే దానిపై పూర్తి పట్టు సాధించినట్లు భావించాలి. ఇటీవల కొత్తగా ఏర్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్లంలో మెలకువలు నేర్పడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన ప్రయత్నం. అప్డేట్ నాలెడ్జ్ తప్పనిసరి ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన సిలబస్ను ఇంజనీరింగ్ కరిక్యులమ్లో తప్పనిసరిగా చేర్చాలి. లేకపోతే పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులు లభించవు. యూనివర్సిటీల్లోని అకడమిక్ కౌన్సిల్లో ఉండే సబ్జెక్టు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు కలిసి సిలబస్ను నిర్ణయిస్తుంటారు. ఈ విషయంలో పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆండ్రాయిడ్ టెక్నాలజీ, బిగ్డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డాట్నెట్ టెక్నాలజీస్, క్యాడ్ క్యామ్, ఆటోక్యాడ్, మెట్ల్యాబ్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కరిక్యులమ్లో ఆయా అంశాలు లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా బోధించాలి. ఆయా టెక్నాలజీలను ఉపయోగించే సంస్థల నుంచి నిపుణులను పిలిపించి, వారు తమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకొనే విధంగా ప్రత్యేక సదస్సులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులతో వివిధ రకాలైన సర్టిఫికేషన్స్ చేయించాలి. సిస్కో సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, ఎస్ఏపీ(శాప్) సర్టిఫికేషన్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు అప్డేట్ నాలెడ్జ్ సొంతమవుతుంది. ఈ సర్టిఫికేషన్స్ పూర్తిచేసిన విద్యార్థులను ఆయా రంగాలకు చెందిన సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా వారికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీ++, కోర్జావాలో నైపుణ్యం పెంచుకుంటే జావా డెవలపర్గా స్థిరపడేందుకు అవకాశాలుంటాయి. టి.వి. దేవీ ప్రసాద్ హెడ్- ప్లేస్మెంట్ ఐఐఐటీ- హైదరాబాద్ -
సంగీతానికి మంగళం
సంగీత కళాశాలలో చారిత్రక కోర్సులకు ముగింపు అధికారుల అనాలోచిత నిర్ణయాలు సంగీత ప్రియుడు శ్రీవేంకటేశ్వరునికి నిత్య స్వరార్చన చేయడంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులది కీలకపాత్ర. శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోస్తున్న కళాశాలను టీటీడీ నిర్వహిస్తోంది. అరుుతే అధికారులు, కొందరు అధ్యాపకుల అనాలోచిత నిర్ణయూలతో ఈ సంగీత కళాశాల మూతపడే పరిస్థితులు నెలకొంటున్నారుు. తిరుపతి రూరల్, న్యూస్లైన్: ఆధ్యాత్మిక భావాలు, కళలపై ఆసక్తి ఉండడంతో అప్పటి టీటీడీ ఈవో చెలికాని అన్నారావు 1959లో సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభంలో సంగీత విశారద, సంగీత ప్రవీణ కోర్సులను ప్రవేశపెట్టారు. అరుుతే 55 ఏళ్ల నుంచి ఉన్న ఈ చారిత్రక కోర్సులకు టీటీడీ అధికారులు మంగళం పాడేందుకు నిర్ణయించారు. శాస్త్రీయ కళలు, సంగీతంపై అవగాహన లేని, ఆధ్యాత్మిక చింతనలేని ఓ అధికారి ఈ చారిత్రక తప్పిదానికి కారణమయ్యాడు. కళాశాలలో ఈ కోర్సుల్లో మాత్రమే అత్యధికంగా విద్యార్థులు ఉంటారు. అలాంటి ఈ కోర్సులకు మంగళం పాడాలని నలుగురు అధ్యాపకులు కంకణం కట్టుకున్నారు. వీరి ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారులు కోర్సులకు మంగళం పలికేందుకు పచ్చజెండా ఊపేశారు. తొలగింపు కోర్సుల ఫైల్ చక చక నడిపేస్తున్నారు. దీనిపై వచ్చే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయి ఎస్వీ సంగీత నృత్య కళాశాల టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయిగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేనన్ని వసతులు, కోర్సులతో విరాజిల్లుతోంది. శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడులోనూ ఇన్ని సౌకర్యాలతో పగటి పూట సంగీత కళాశాల లేదు. అలాంటి కళాశాలలో ప్రక్షాళన పేరుతో సంగీతం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మరే కళాశాలకు దీనికి పోటీ ఉండదు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీవారికి నిత్య సంగీత కైంకర్యం జరుగుతోందంటే అది సంగీత కళాశాల ఘనతే. శ్రీవారి సేవలు, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున సంగీత కైంకర్యాలు కళాశాల నిర్వహణలోనే జరుగుతున్నాయి. అలాంటి కళాశాలలో కోర్సుల ఎత్తివేత నిర్ణయంతో మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఈవోలు సంగీత కళాశాల నిర్వహణకు వెనకడుగు వేయలేదు. మిగతా విద్యాసంస్థల నిర్వహణ వేరు... ఈ కళాశాల నిర్వహణ వేరు అని భావించి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కళాశాలకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసలు కళాశాల ఉండడమే దండగని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కళాశాలను మూసే కుట్ర దశలవారీగా కళాశాలను మూత వేసేందుకు కుట్ర జరగుతోంది. ఈ కుట్రలో నలుగురు అధ్యాపకులు ఓ అధికారితో భాగస్వామి అయ్యారు. తొలుత కోర్సుల తగ్గింపు, తరువాత దశల వారీగా కోర్సులను ఎత్తివేత ద్వారా విద్యార్థులను తగ్గించవచ్చు అని భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులు లేరని కళాశాలకు శాశ్వతంగా తాళం వేసే కుట్ర శరవేగంగా జరిగిపోతోంది. డే కళాశాలలో మెత్తం 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సంగీత విశారద, ప్రవీణ కోర్సుల్లో(3 సంవత్సరాలు కలిపి) 182 మంది ఉన్నారు. బీమ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ కోర్సుల్లో కేవలం 64 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారులు నిర్ణయించినట్టు విశారద, ప్రవీణ కోర్సులకు మంగళం పలికితే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల తొలగింపే లక్ష్యంగా... సంగీత కళాశాలలో 28 మంది పర్మినెంట్, 20 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. విశారద కోర్సులను తొలగిస్తే మిగిలే విద్యార్థుల సంఖ్య కేవలం 64 మంది మాత్రమే. వీరికి 48 మంది అధ్యాపకులు అవసరమా అని యాజమాన్యం ఆలోచించక తప్పదు. తద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించవచ్చనేది టీటీడీ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే కుట్రలో భాగంగా కోర్సులను ఎత్తివేయడానికి ప్రయత్నించడం బాధాకరం. -
సైన్స్తోనే సమాజాభివృద్ధి
సైంటిస్టులు మూఢనమ్మకాలు పాటించడం దురదృష్టకరం సీసీఎంబీ డెరైక్టర్ ఆవేదన తార్నాక,న్యూస్లైన్: మతాలు, ధర్మాలు మార్పును కోరవని..సైన్స్ మాత్రమే సమాజంలో నిరంతర మార్పులను స్వాగతిస్తుందని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం ఓయూలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్ఎస్ఎఫ్) దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బైరి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మోహన్రావుతో పాటు ఓయూ వీసీ ప్రొ.సత్యనారాయణ, శాంతిచక్ర ఇంటర్నేషనల్ వ్యస్థాపకులు నర్రా రవికుమార్, శాతవాహనయూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొ.సుజాత, సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్, జయరాజు తదితరులు హాజరై ప్రసంగించారు. సైంటిస్టులు కూడా మూఢనమ్మకాలను,ఆచారాలను నమ్మడం దురదృష్టకరమని వాపోయారు. సైన్స్ సమాజం అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎస్ఎస్ఎఫ్ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్త నమోదు, అవయవ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలతోపాటు ఆయా జిల్లాల నుంచి సుమారు 400 మంది హాజరయ్యారు. శాస్త్రీయ ద్పక్పథంతో ఓ ప్రేమజంటకు ఆదర్శవివాహం జరిపించారు. -
ప్రేమ దక్కని తాత్వికుడు
ఇతరత్రా ప్రేమలకిది సందర్భం కాదు. అబ్బాయి తన నుదుటిని అమ్మాయి పాదాలకాన్చి ‘నువ్వు నాక్కావాలి’ అని కన్నీళ్లతో వేడుకునే ప్రేమకు, అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని చెయ్యి కందిపోయేలా అబ్బాయి ఆ చెంపా ఈ చెంపా పగలగొడుతూ, ‘‘నువ్వు నా జీవితంలోకి రాకుండా నేన్నొక్కదాన్నీ ఎలా బతికేస్తాననుకున్నావురా బుద్ధిహీనుడా’’ అని రోదిస్తూ మూర్ఛిల్లి పడిపోయే ప్రేమకు ఇది పుట్టినరోజు. అలాగైతే జర్మన్ తాత్వికుడు నీషే ప్రస్తావనకు ఇది సందర్భం కాదేమో. ‘దేవుడు చనిపోయాడు’ అని ప్రకటించినవాడు నీషే! పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా ఉలిక్కిపడడానికి ఈ మాట చాలదా! ‘నీషేకు మతి చలించింది’ అన్నారు మతాధికారులు, రాజ్యాధినేతలు. ‘ఏమైనా అనండి, మీ విలువలకు విలువ లేదు, మీ విశ్వాసాలకు విశ్వసనీయత లేదు’ అన్నాడు నీషే. అతడేం చెప్పినా అందులో కవిత్వం ఉండేది. తత్వం ఉండేది. అవి రెండూ ఎవరికీ అర్థమయ్యేవి కావు! ‘‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’’ అనేవాడు నీషే. ‘ఏమిటంటాడూ’ అన్నట్లు చూశారే తప్ప ఎవరూ అతడిని అర్థం చేసుకోలేదు. నిజానికి అతడే అర్థమయ్యే రూపంతో, రంగుతో, రుచితో లేడు. తండ్రికి మతిపోయినట్టే కొడుక్కీ పోయినట్లుంది అన్నారు కొందరు. నీషే తండ్రి మతి స్థిమితం తప్పి ముప్పై ఐదేళ్ల వయసుకే చనిపోయాడు. నీషేకీ అదే గతి పడుతుందనుకున్నారు. పట్టింది కానీ మరీ ముప్పై ఐదేళ్లకు పట్టలేదు. చివరి పదేళ్లూ మానసిక వైద్యుల చుట్టూ తిరిగాక తన 55వ యేట అన్ని విధాలా శల్యమై, శిథిలమై చనిపోయాడు నీషే. నీషే పూర్తి పేరు ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ నీషే. ప్రష్యాలో పుట్టాడు. ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ అన్నది అప్పటి ప్రష్యా రాజు పేరు. ఆయన పుట్టిన రోజే (అక్టోబర్ 15) నీషే కూడా పుట్టడంతో తండ్రి అతడికి రాజుగారి పేరు జోడించాడు. తర్వాత రాజుగారు మతి చలించి మరణించడం, నీషే తండ్రి, నీషే కూడా మతిస్థిమితం కోల్పోయి చనిపోవడం ఒక చారిత్రక విచిత్రం. పెద్దయ్యాక చూడ్డానికి దున్నపోతు కొమ్ముల్లాంటి బలిష్ఠమైన మీసాలతో కరుకుగా కనిపించేవాడు కానీ... చిన్నప్పుడు నీషే కోమలంగా, కౌమారంలోని బాలికలా ఉండేవాడు. ఆడితే చెల్లితో, లేదంటే బయటి ఆడపిల్లలతో. వాళ్లూ ఖాళీగా లేకపోతే పుస్తకాలు. పోర్టా స్కూల్లో అతడు చదువుకున్నది గ్రీకు, లాటిన్, సైన్స్. బాన్, లీప్జిగ్ యూనివర్శిటీలలో భాషా శాస్త్రం. జీవితంలో పడ్డాక షోపెన్హోవర్ నిరాశావాదం. తర్వాత కొన్నాళ్లు బలవంతంగా సైన్యంలో. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాక బేసిల్ (స్విట్జర్లాండ్) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం. తర్వాత తన 39 వ ఏట ‘దజ్ స్పేక్ జరతూస్త్ర’ గ్రంథ రచన. దీనర్థం ‘జరతూస్త్ర ఇలా అన్నాడు’ అని. నీషే తను చెప్పదలచుకున్నవన్నీ జరతూస్త్ర చెప్పినట్లుగా చెప్పాడు. జరతూస్త్ర ప్రాచీన పర్షియన్ మత ప్రవక్త. ‘నేను చెబుతాను మీరు వినండి’ అంటే ఎవరూ వినరని అలా ఆ ప్రవక్తను అడ్డం పెట్టుకున్నాడు. ‘సాధనేచ్ఛే చోదకశక్తి’ అన్నది నీషే సిద్ధాంతం. కానీ అతడు మాత్రం తన ప్రేమను సాధించుకోలేకపోయాడు! (చూ: ఆండ్రూ షాఫర్ రాసిన ‘గ్రేట్ ఫిలాసఫర్స్ హూ ఫెయిల్డ్ ఎట్ లవ్’). జీవితమంతా ఒంటరిగానే గడిపాడు నీషే. స్నేహితులు లేరు. బంధువులు లేరు. ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు వాగ్నర్తో గొడవ పెట్టుకుని మాట్లాడ్డం మానేశాడు. వాగ్నర్ అకస్మాత్తుగా ఆస్తికుడిగా మారినందుకు నీషే పడిన గొడవ అది! శారీరకంగా కూడా నీషే బలహీనుడు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. ఒక దశలో అతడు స్త్రీ ప్రేమ కోసం పరితపించాడు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు అమ్మాయిలను ప్రేమించాడు. తన ప్రేమ విషయం తెలియజేశాడు. ఒక్కరు కూడా అతడి ప్రేమను అంగీకరించలేదు. అందరికన్నా ఎక్కువగా అతడు ప్రేమించినది లూవాన్ సెలోమీ ని. చాలా అందంగా ఉండేది. ఫిన్లాండ్ అమ్మాయి. నీషే రోమ్లో ఉండగా ఆమె పరిచయం అయింది. ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నాడు. కానీ ఆమె అతడి రచనలను మాత్రమే ప్రేమించానని చెప్పి, ఒక సాదాసీదా యువకుడిని పెళ్లి చేసుకుని, ఈ తత్వవేత్తను వదిలేసింది. ఆ తర్వాత నీషే ఎవ్వర్నీ ప్రేమించలేదు. పైగా మొత్తం స్త్రీ జాతినే ద్వేషించడం మొదలు పెట్టాడు. స్త్రీలు మనుషులు కాదు.. పిల్లులు, పక్షులు అన్నాడు. వారిని నమ్మకూడదని ప్రబోధించాడు. నీషే భావాలలో కొన్ని నాజీల విశ్వాసాలకు దగ్గరగా ఉండేవి. అందుకేనేమో నీషే మరణించినప్పుడు వీమర్ నగరంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ హిట్లర్ నివాళులు అర్పించాడు. కనీసం ఒక్క అమ్మాయైనా నీషే ప్రేమను అంగీకరించి, బాహువులలోకి తీసుకుని ఉంటే తన స్నేహితుడు వాగ్నర్లా నీషే కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మళ్లి ఉండేవాడేమో! -
నేను, మా బుడ్డోడూ... నా నైట్డ్యూటీల కథ!
‘‘అందరూ నిద్రపోయే వేళల్లో మీరు మేల్కొని పని చేస్తుంటారు. అందరూ మేల్కొనే టైమ్లో నిద్రపోతుంటారు. ఎందుకండీ పాపం అలా’’ అని నన్నడుగుతుంటారు చాలా మంది. పైగా నేను ఇంటికొచ్చే టైమ్కు మా బుడ్డోడు నిద్రపోతుంటాడనీ, వాడితో ఆడుకునేందుకు నాకు టైమే ఉండదనీ జాలి పడుతుంటారు. పైకి వాళ్ల మాటలతో ఏకీభవిస్తున్నట్లు నటిస్తుంటా. నేనెంతో అమితంగా బాధపడుతున్నట్లు ఫేసు పెడుతూ, పోజు కొడుతూ... లోలోన మాత్రం నా టైమింగ్స్ పట్ల అనంతంగా ఆనందపడుతుంటా. జర్నలిస్టునై రాత్రి డ్యూటీలు చేస్తూ బతికిపోతున్నాను గానీ... అలాక్కాకుండా అందరిలా మామూలు టెన్ టు ఫైవ్ డ్యూటీ చేస్తే అదెంత నరకమో కదా అనుకుంటూ ఉంటా. కారణం బయటకు వెల్లడించాలని లేకపోయినా, మనసాగదు కాబట్టి రహస్యంగా మీకు చెబుతున్నా. మీరెక్కడా దీన్ని బయటపెట్టొద్దు... నా గుట్టు విప్పొద్దు. మాటివ్వండి ప్లీజ్. ********* పిల్లలకు కథలు చెప్పే రోజులవీ పోతున్నాయని బాధపడుతుంటారు మేధావులు. ఆ రోజులన్నీ మళ్లీ రావాలన్నది బోల్డుమంది సాహిత్యవేత్తల కోరిక. పెద్దల మాట చద్ది మూట కదా. అందుకే పాటిద్దామని మా బుడ్డోడి దగ్గర ప్రయత్నం మొదలుపెట్టా. మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం... చాలా గొప్పపని చేస్తున్నాం అన్న ఫీలింగ్తో మా ఎనిమిదేళ్ల బుడ్డోడికి కథ చెప్పడం మొదలుపెట్టా. దాహంగా ఉన్న కాకి కుండలో రాళ్లు వేసి, నీళ్లు పైకొచ్చేలా చేసి ఎలా దాహం తీర్చుకుందో చెప్పా. కథతో పాటు యుక్తి కూడా నేర్చుకోవాలని చిన్న సైజు ఉపన్యాసం కూడా ఇచ్చా. రాయి ఆక్రమించిన చోటు మేరకు నీళ్లు పైకి లేస్తాయనీ, ఈ సత్యాన్ని అప్పట్లో ఆర్కిమెడిస్సూ, ఈ కథలో సైన్సు ఉందన్న సంగతిని నేను మాత్రమే కనిపెట్టాననీ, ఇలా పిల్లల కథల్లో సైన్సు సంగతులు కూడా ఉంటాయని బోధించా. ఒక్క కాకి కథలోనే కాస్త యుక్తి, కొంచెం సైన్సు, బోలెడంత సమయస్ఫూర్తి ఉన్నాయనీ... అందుకే ఈ కాకి కథ తరతరాలుగా అలా కొనసాగుతోందని చెప్పా. వాడు ఈ కథను తన పిల్లలకూ చెప్పాలన్న ఆశాభావం వ్యక్తం చేశా. మా బుడ్డోడికి కథ చెబుతూ ఏదో దేశ సేవ చేస్తున్నానన్న ఫీలింగ్ను ఓ ప్రశ్నతో ఒక్కసారిగా దెబ్బకొట్టాడు మావాడు. అదేంటంటే... ‘‘నాన్నా... కాకి ఇంటెలిజెంటా? లేక నీలాగే మొద్దా?’’ అని అడిగాడు వాడు. ‘‘ఎందుకురా... నీకలాంటి డౌటెందుకు వచ్చింది’’ నోరెండిపోతుండగా అడిగా. ‘‘మరి మా ఈవీఎస్ (ఎన్విరాన్మెంట్ స్టడీస్) బుక్లో ‘బిజీమంత్’ అనే ఒక లెసన్ ఉంది. అందులో ఏ పక్షి ఎలాంటి గూడు కడుతుందో ఉంది. కోయిల గూడు కట్టదట. కాకి గూట్లో అది తన గుడ్లు పెడుతుందట. కాకి వాటిని కూడా గుర్తుపట్టక పొదిగి, పిల్లలు పుట్టాక కూడా కొంతకాలం పెంచుతుందని ఉంది. మరి అప్పుడు కాకి ఇంటెలిజెంట్ అంటూ నువ్వు చెప్పిన కథ రాంగ్ కదా? అది నీలాగే మొద్దే కదా’’ అంటూ లాజిక్ పాయింట్ తీశాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మళ్లీ వాడే అందుకున్నాడు. ‘‘నీకు మ్యాథ్స్ రావని చెబుతుంటావు కదా. అలాగే తాను ఎన్ని గుడ్లు పెట్టిందో... ఎగస్ట్రా మరెన్ని గుడ్లు తోడయ్యాయనే అడిషన్స్ తెలియనప్పుడు, కాకి కూడా నీలాగే డల్ అన్నట్టే కదా’’ అన్నాడు వాడు. దాంతో నన్నూ, కాకినీ ఒకే చేత్తో విదిలించేసినట్లుగా ఫీలై ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయా. నా బిక్కమొహం చూసి వాడికే జాలేసినట్లుంది. అందుకే మళ్లీ నన్ను ఓదార్చుతున్నట్లు వాడే ఒక మాట అన్నాడు. ‘‘నువ్వు చెప్పిందాన్ని బట్టి నాకొకటి అనిపిస్తోంది నాన్నా...’’ సాలోచనగా అంటున్నట్లు ఒక పోజు పెట్టి... ‘‘కుండ అడుగుకు చేరిన రాయి పరిమాణమూ ఈజీక్వొల్ టూ పైకి లేచిన నీళ్ల పరిమాణమూ అని గుర్తుపట్టింది. గూట్లో టోటల్ గుడ్లు ఎన్నున్నాయనేది మాత్రం లెక్కపెట్టలేకపోయింది కాబట్టి... కాకి సైన్సులో సమ్వాట్ బెటర్. కానీ మ్యాథ్స్లో పూర్ నాన్నా’’ అంటూ తేల్చాడు. హమ్మయ్య! మరీ నన్ను కాకిలా తీసిపారేయలేదంటూ నిట్టూర్చేలోపు ఫినిషింగ్ టచ్ ఇలా ఇచ్చాడు... ‘‘కాబట్టి... లెక్కలూ, కూడికలూ చక్కగా రాకపోయినా కాకి ఎంతో కొంత ఇంటెలిజెంటే... నీలాగ మొద్దు కాదు’’ అంటూ తేల్చిపారేశాడు. దానికీ కారణం ఉంది. ********* ‘‘కాకుల రంగు మారి అవి తెల్లగా కావాలంటే ఏం చేయాలో తెలుసా నాన్నా?’’ అడిగాడు వాడు. కాకి అంటేనే నాలాగే కారునలుపుగా ఉంటుందని, నలుపు నాణ్యమైనది కాబట్టి ఒక పట్టాన వదిలిపోదని అని వాడికి అర్థమయ్యేలా శాస్త్రీయంగా చెప్పాలని అనుకున్నా. కానీ ఈలోపే వాడు బాంబు పేల్చాడు. ‘‘సింపుల్... కాకికి ఫెయిర్ అండ్ లౌలీ రాస్తే సరి’’ అన్నాడు. దాంతో నేను ఒకటి నిశ్చయించుకున్నా. ఇకపై మా బుడ్డోడికి కాకమ్మ కథలు చెప్పొద్దని. ********* ‘‘నీ తలలో అంతా చెత్తే ఉంది కదా నాన్నా’’ అన్నాడు మా బుడ్డోడు. ఆ దెబ్బకే నేను అద్దిరిపోతుంటే... ‘‘అన్నట్టు నాన్నా ఆ చెత్తనంతా అక్కడికి వెళ్లేలా ఎలా మేనేజ్ చేశావు?’’ అంటూ మళ్లీ ఇంకోప్రశ్న. ‘‘ఎందుకురా ఇలా అడిగావు’’ అంటే దానికి ఓ ఫ్లాష్బ్యాక్ చెప్పాడు వాడు. ఓరోజున... ‘అవ్మూ...! కడుపు నొప్పి’ ఏడుస్తూ వచ్చాడు మావాడు. ‘అన్నం తినవు. నేను చేత్తో కలిపి పెడతానన్నా వినవు. ఉంచితే కడుపును ఖాళీగా ఉంచుతావు. లేదంటే... అడ్డమైన చెత్తాచెదారం అందులో పడేస్తావు. ఆ చెత్త వల్లనే నీకు ఆ నొప్పి’ అంది మా ఆవిడ మా బుడ్డోడికి కడుపునొప్పి మందు తాగిస్తూ విసుగ్గా. ఇదంతా తెలియని నేను మామూలుగా వచ్చేసి ‘అబ్బా... తలనొప్పి, కాస్తంత కాఫీ ఇవ్వు’ అన్నా మా ఆవిడతో. అంతే... ‘తల్లోని ఆ ఖాళీ ప్లేస్కి చెత్తా చెదారాన్ని ఎలా పంపించగలిగావు నాన్నా.?’ అంటూ బోలెడంత క్యూరియస్గా అడిగాడు. అక్కడితో ఆగలేదు వాడు... ‘కాకి స్కావెంజర్ అన్నావు కదా... నీ తల మీద పొడిచి లోపలి చెత్తను క్లీన్ చేసే అవకాశం ఉంటుందంటావా?’’ అని అడిగాడు. దాంతో అసలు తలనొప్పికి తోడు.. మా బుడ్డోడి షాక్తో తగిలిన తలబొప్పితో కణతలూ, తలా ఇత్యాది అవయవాలన్నింటినీ ఏకకాలంలో తడుముకున్నా. ఇకపై ఒక విషయంలో భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నా. ఎక్కడ, ఎంతగా నొప్పి వచ్చినా మా బుడ్డోడి ముందు అస్సలు బయట పడొద్దని. ఇలాంటి ఎన్నో సంఘటనల తర్వాత నాకు అర్థమైన విషయం ఒక్కటే... అవును. నేను నేననుకున్నంత తెలివైన వాడిని కాదు. పైగా ఆ విషయాన్ని పసిగట్టగల పసివాడు కాని పసివాడు మా బుడ్డోడు. అందుకే వాడికి కథలూ, కబుర్లూ చెబితే అవి నా పట్ల కాకరకాయలవుతున్నాయి. అందుకే వాడికి కాకమ్మ కథలూ, కబుర్లూ, పాఠాలు, గీఠాలూ చెప్పకుండా ఉండేందుకు వీలుగా, నేను ఇంటికి వెళ్లేసరికి వాడు పడుకుని ఉండేలా... రాత్రి డ్యూటీలున్న జర్నలిస్టు ఉద్యోగం చేస్తున్నందుకు లోలోపల హ్యాపీగా ఫీలవుతుంటా. బయటకు మాత్రం ‘‘అదేం ఉద్యోగం లెండి. పెళ్లాం పిల్లలతో గడుపుదామంటే టైమే ఉండదు. మా బుడ్డోడికి లెసన్స్ చెబుదామంటే వీలే ఉండదు’’ అంటూ పత్తిత్తు కబుర్లు చెబుతూ ఉంటా. - యాసీన్ -
సైన్స్పై యువత ఆసక్తి చూపాలి
సాక్షి, బెంగళూరు: ఐటీ, బీటీ, వైద్య రంగాలపైనే మక్కువ చూపకుండా విజ్ఞానశాస్త్రంపై కూడా ఆసక్తి చూపాలని భారతరత్న పురస్కార విజేత, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్లో సైన్స్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 20 సంవత్సరాల రూట్మ్యాప్తో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో సోమవారం జరిగిన ఓ సెమినార్లో ఆయన ప్రసంగిస్తూ.. భారత్ నేడు అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆయా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత విజ్ఞాన శాస్త్ర రంగానికి ఇవ్వటం లేదని విచారం వ్యక్తంచేశారు. ‘రాజకీయ నేతలు మూర్ఖులు’ అని తాను ఎవరినో అవమానించే ఉద్దేశంతో వ్యాఖ్యానించ లేదని రావు పేర్కొన్నారు. దీనిని ఎవరూ తప్పుగా భావించ వద్దని కోరారు. ‘ముందు వాళ్లు సైన్స్ ప్రాధాన్యతను అర్థంచేసుకోవాలి. మన అవసరాలకు అనుగుణుంగా నిధులు కేటాయించాలి. తద్వారా భారత్ అభివృద్ధిసాధిస్తుంది. కానీ దీనిని అర్థం చేసుకోవటం లేదు. అది కొంత మూర్ఖపు పరిస్థితి’ అని మాత్రమే నేనన్నాను.. అదీ కోపంగా కాదు. నేను కోపిష్టిని కాదు’’ అని వివరణ ఇచ్చారు. -
ఉపగ్రహాలు... ఉపద్రవాలు!
విజ్ఞాన శాస్త్రం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాంతో ప్రమాదాలు, ప్రమోదాలూ సమంగా ఉంటాయి. దాన్ని విధ్వంసానికి ఉపయోగించాలో, వికాసానికి వినియోగించుకోవాలో తేల్చుకోవాల్సింది మనిషే. ఒక్కోసారి అసలు మన ఉద్దేశాలతో ప్రమేయం లేకుండా కూడా అది పెనుముప్పునకు కారణం కావొచ్చు. ఒకటి రెండు రోజుల్లో భూమ్మీద అమాంతం పడిపోనున్న ఉపగ్రహం చెబుతున్న పాఠమిదే. గురుత్వాకర్షణ క్షేత్రాలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసిన... సాగరాల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పసిగట్టి చెప్పిన ఉపగ్రహం ఇప్పుడు అన్ని నియంత్రణలనూ ధిక్కరించి కిందకు దూసుకొస్తున్నది. యూరోపియన్ అంతరిక్ష సంస్థ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన ఈ ఉపగ్రహం గత కొన్నాళ్ల నుంచి శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉపగ్రహం ఉన్నట్టుండి కనుమరుగెలా అయిందని వారంతా గందరగోళంలో పడిపోయారు. ఈ ధూర్త ఉపగ్రహం ఆచూకీ వారికి పెద్ద పజిల్గా మారిపోయింది. వారం క్రితం మాత్రమే అది భూమివైపుగా దూసుకొస్తున్నదని శాస్త్రవేత్తలు గ్రహించారు. అది ఎప్పుడు, ఎక్కడ పడుతుందన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. భూవాతావరణంలోకి ప్రవేశించాక మాత్రమే సమయాన్ని నిర్ధారించడం సాధ్యమవుతుంది. ఆదివారం లేదా సోమవారం అది కూలుతుందని తాత్కాలికంగా అంచనాకొచ్చారు. 1,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో కొంత భాగం భూవాతావరణంలోకొచ్చిన వెంటనే ఆ రాపిడికి భగ్గున మండుతుందని చెబుతున్నారు. మండేది మండగా అది దాదాపు 45 శకలాలుగా విడివడుతుందట. ఈ శకలాలు ఒక్కోటి 90 కిలోలకుపైగా బరువు ఉండొచ్చని అంచనా. అయిదున్నర దశాబ్దాల క్రితం అంతరిక్షంపై ఆధిపత్యం సాధించడానికి రెండు అగ్రరాజ్యాలు అమెరికా, సోవియెట్ యూనియన్లు చేసిన ప్రయత్నం అంతకంతకు విస్తరించి ఇప్పటి ఈ స్థితికి చేరింది. 1957లో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియెట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపింది. అటు తర్వాత ఏకంగా చంద్రుడిపైకి మరో ఉపగ్రహం లూనా-2ను పంపి పరుగు పందెంలో తానే ముందున్నానని నిరూపించుకుంది. మరో పదేళ్లకు...అంటే 1969 జూలై 30న చంద్రమండలంలో అమెరికా మనుషులనే దింపింది. మన దేశం 1962లో భారత అంతరిక్ష పరిశోధనా సంఘాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ పోటీ మరింతగా పెరిగిపోయింది. ఒకర్ని మించి ఒకరు అంతరిక్ష విజయాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉపగ్రహాల వల్ల ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. మనుషుల మధ్య దూరం తరిగిపోయింది. భూగోళంలో ఏమూలనున్నా ఒకరితో ఒకరు దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించుకునేంతగా సాంకేతిక విజ్ఞానం విస్తరించింది. టీవీ ప్రసారాల దగ్గర నుంచి సెల్ఫోన్ల వరకూ... వాతావరణ స్థితిగతులు తెలుసుకోవడం నుంచి ప్రమాద హెచ్చరికల వ్యవస్థ వరకూ అన్నిటికీ అంతరిక్షంలో నిరంతరం తిరుగాడే ఉపగ్రహాలే ఆధారమవుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకపక్క మాత్రమే. ఆసక్తి అనాలో, అత్యుత్సాహం అనాలో... మొత్తానికి మనిషిలో పెరుగుతున్న తృష్ణ ముప్పునూ కొనితెస్తోంది. అంతరిక్షం క్రమేపీ పెద్ద చెత్త కుప్పగా మారుతోంది. అప్పుడప్పుడు దారితప్పి వచ్చే గ్రహ శకలాలను మించి ఆ చెత్త కుప్ప భయపెడుతోంది. ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం నేల రాలిన స్కైలాబ్ అంతరిక్ష నౌక మానవాళిని అప్పట్లో తీవ్రంగా కలవరపరిచింది. ఇంకేముంది... యుగాంతమే అనుకున్నారందరూ. అది సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారుగానీ ఆ బాపతు ప్రమాదం అంతరించలేదు. సరిగదా ఇంతకింతా పెరిగింది. అప్పగించిన పనిని మానుకుని మొరాయించే ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు మృత ఉపగ్రహాలుగా వ్యవహరిస్తారు. రెండేళ్ల క్రితం అమెరికా ప్రయోగించిన ఆర్స్ ఉపగ్రహం నేలపైకి దూసుకొచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ హడలెత్తాయి. ఎక్కడ ఎలాంటి ముప్పు కలిగిస్తుందోనని వణికిపోయాయి. కానీ, అదృష్టవశాత్తూ అది పసిఫిక్ మహా సముద్రం సమీపంలో కూలింది. గత ఏడాది రష్యా అంగారకుడిపైకి పంపిన ఫోబోస్గ్రంట్ ఉపగ్రహం మధ్యలోనే మొరాయించి వెనక్కు దూసుకొచ్చింది. అది కూడా పసిఫిక్ మహా సముద్రాన్నే నమ్ముకోవడంతో పెనుముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగాడే ఒక ఉపగ్రహాన్ని చైనా 2007లో క్షిపణి ద్వారా ధ్వంసం చేసింది. అది అనుకోకుండా జరిగిందేనని ఆ దేశం సంజాయిషీ ఇచ్చుకున్నా ఫలితం మాత్రం తీవ్రంగానే ఉంది. ఆ ఉపగ్రహం తాలూకు శకలాలు ఇప్పుడు అంతరిక్షంలో గిరికీలు కొడుతున్నాయి. మన దేశంతో సహా ఎందరెందరి ఉపగ్రహాలకో ముప్పుగా పరిణమించాయి. 2009లో రష్యా ఉపగ్రహం దారితప్పి అమెరికా ఉపగ్రహాన్ని ఢీకొట్టి నుగ్గునుగ్గు చేసింది. అది కూడా భారీయెత్తున వ్యర్థాలను మిగిల్చింది. అసలు అంతరిక్షంలో చిన్నా పెద్దా శకలాల సంఖ్య దాదాపు 4 కోట్లుంటుందని అంచనా. ఇందులో నట్లు, బోల్టులు మొదలుకొని పెద్ద పెద్ద శకలాల వరకూ ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించే ఇకపై ప్రయోగించే ఉపగ్రహాల న్నిటికీ ‘సేఫ్ మోడ్’ విధానం ఉండాలని, పనికిరావనుకున్నప్పుడు వాటిని సురక్షితంగా దించేందుకు ఇది అవసరమని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కానీ, పట్టించుకునేదెవరు? ఇప్పుడు కూలిపోతున్న ఉపగ్రహంలో అలాంటి ఏర్పాటున్నా, అది కూడా పనిచేయడం మానేసింది. ఏడాదికి 40 టన్నుల అంతరిక్ష వ్యర్థాలు భూమ్మీద పడుతున్నాయని అంచనా. ఈ ఏడాదైతే ఆ బాపతు వ్యర్థాలు 100 టన్నుల వరకూ పడ్డాయని చెబుతున్నారు. ఉపగ్రహ నిర్మాణంలో ఉపయోగించే రసాయనాలు, లోహాలు, ఆ పరికరాల్లో ఉండే రేడియోధార్మిక పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర ప్రగతి ‘పులి మీద స్వారీ’లా మారినప్పుడు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి? -
వీళ్లని ఫాలో అయితే విజ్ఞానం, వినోదం!
కూడు, గూడు, గుడ్డ... ఒకప్పటి మనిషి ప్రాథమ్యాలు. ఇపుడు ఆ అత్యవసర జాబితా చాలా విస్తరించింది. ఏది మిస్సయినా వెనకబడిపోతాం. అప్డేటెడ్గా ఉండాలి. వృత్తిలోనే కాదు, సమాజం గురించి కూడా నిత్యం అవగాహన కలిగి ఉండాలి. నిరంతరం టీవీ చూసో, పేపర్ చదివో ప్రాధాన్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అంటే కాస్త కష్టమైన వ్యవహారమే. నలుగురిలో తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి... మరి అది కూడా సాధ్యం కాదే. అందుకే ఇదిగో ప్రపంచంలో అన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తుండే ఈ ఇండియన్ విమెన్ని ఫాలో అయిపోండి. ఎలాగూ చేతిలో స్మార్ట్ ఫోనో, ఇంట్లో కంప్యూటరో ఉంటుందిగా, రోజూ ఏదో ఒక సమయంలో వీళ్లిచ్చే అప్డేట్స్ తెలుసుకోండి. @writeonj: జుహి చతుర్వేది, విక్కీ డోనర్ రచయిత. @khushsundar: వివాదాలే కాదూ ఖుష్బూని ఫాలో అయితే నాలుగు విషయాలు కూడా తెలుస్తాయి. @kiranmanral: రిలక్టెంట్ డిటెక్టివ్ రచయిత. స్త్రీల హక్కుల గురించి బాగా ప్రచారం చేస్తుంటారు. @kiranshaw: కిరణ్ మజుందార్ షా. బయోకాన్ ఎండీ. అద్భుతంగా ట్వీట్స్ చేస్తారని ప్రతీతి. స్ఫూర్తిదాయకమైన వ్యాపారి. @MissMalini: సెలబ్రిటీ బ్లాగర్. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ట్వీట్స్ ఇస్తుంటారు. ఫాలో అయితే ఫన్. @namitabhandare: జర్నలిస్ట్. సోషల్ థింకర్. అనేక అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి. @saffrontrail: నందితా అయ్యర్ ఈమె. ఫుడ్ అండ్ హెల్త్ రైటర్. పోషకాషార నిపుణురాలు. ఆహారం, సంగీతంపై మంచి ట్వీట్స్ ఇస్త్తుంటారు. @nilanjanaroy: నీలాంజన రాయ్. అన్నీ ఫాలో అవుతూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంపై ట్వీట్స్ ఇస్తారు. @Padmasree: సిస్కో ఉన్నతాధికారి. టెక్నాలజీ రంగంలో ఉన్న మహిళల కోసం ఈమె బోలెడు ట్వీట్లు ఇస్తారు. @Rajyasree: రెస్టారెంట్ యజమాని, ఫుడీ, కాలమిస్ట్, జర్నలిస్టులు కావాలనుకునే వారికి మంచి స్ఫూర్తి. @RupaSubramanya: ఇండియానామిక్స్ సహ రచయిత. విసృ్తతమైన అంశాలపై స్పందిస్తుంటారు. @shailichopra: తెహల్కా కాలమిస్ట్. బిజినెస్ న్యూస్పై ట్వీట్స్తో అప్డేట్ చేస్తూ ఉంటారు. @suchetadalal: మనీలైఫ్ మేనేజింగ్ ఎడిటర్. వ్యక్తిగత, సామాజిక ఆర్థిక వ్యవహారాలపై సాధికారిక వ్యాఖ్యలు చేస్తారు. @calamur: హరిణి క్లామర్. బ్లాగర్, కాలమిస్ట్, టీచర్. రోజూ ప్రధాన వార్తల గురించి నర్మగర్భంగా కామెంట్స్ చేస్తుంటారు. @ShomaChaudhury: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్. ప్రతి ట్వీట్కు ఒక విలువ, తూకం ఉంటాయి. -
ఫెలోషిప్స్
డీఎస్టీ-సీఎస్ఐ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కాగ్నిటివ్ సైన్స్లో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాలపరిమితి: రెండేళ్లు ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ.35 వేలు చెల్లిస్తారు. దీంతోపాటు కంటింజెన్సీ ఫండ్ కింద ఏడాదికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. అర్హతలు: సైన్స్/ఇంజనీరింగ్/అలైడ్ సెన్సైస్లో పీహెచ్డీ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు/ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.dst.gov.in